గొల్లపల్లిశివారులో అగ్నిప్రమాదం
నెన్నెల: మండలంలోని గొల్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి పెను ప్రమాదం తప్పింది. గ్రామశివారు ఒర్రేలోని పొదలకు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం మధ్యాహ్నం నిప్పు పెట్టారు. దాదాపు అర కిలోమీటర్ మేర మంటలు వ్యాపించాయి. ఎస్సీ కాలనీ అతి సమీపానికి మంటలు రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పోలీసులు, ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. కొంత ఆలస్యమైన కాలనీలోని ఇళ్లన్నీ బుగ్గిపాలయ్యేవని ప్రజలు పేర్కొన్నారు. సకాలంలో ఫైరింజన్ చేరుకోవడంతో ముప్పు తప్పిందన్నారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment