
రామాయణం ఆధారంగా రూ΄÷ందిన తాజా చిత్రం ‘ఆది పురుష్’. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు.
భూషణ్ కుమార్, క్రిషణ్కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్లు నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 9న విడుదల కానుంది. 70 దేశాల్లో ‘ఆది పురుష్’ ట్రైలర్ను లాంచ్ చేసేలా చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్–అతుల్, కెమెరా: కార్తీక్ పల్నాని.