రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్‌సేన్‌ దగ్గర అవినాష్‌ కక్కుర్తి! | Bigg Boss 8 Telugu November 21st Full Episode Review And Highlights: Vishwak Sen Visits The BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Nov 21st Highlights: రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. హౌస్‌మేట్స్‌కు విశ్వక్‌ సర్‌ప్రైజ్‌

Nov 21 2024 11:32 PM | Updated on Nov 22 2024 11:56 AM

Bigg Boss Telugu 8, Nov 21st Full Episode Review: Vishwak Sen Visits the House

 

ఈసారి మెగా చీఫ్‌ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్‌బాస్‌ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్‌లో చివరిసారి చీఫ్‌ అవుతారు. ఇకపోతే మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హౌస్‌లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్‌ 21) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

చివరి కంటెండర్‌
పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్‌ కంటెండర్లవగా చివరగా నిఖిల్‌, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్‌ చేస్తారో హౌస్‌మేట్స్‌ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్‌.. చాలామంది వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్‌ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్‌ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్‌ ఇచ్చారు.

గ్రూప్‌ గేమ్‌ను ప్రశ్నించిన గౌతమ్‌
విష్ణుప్రియ నిఖిల్‌కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్‌ కార్డ్స్‌ను పంపించేయాలని ప్లాన్‌ చేశామన్నారు. ఓజీ, రాయల్‌ టీమ్స్‌గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్‌ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్‌ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్‌కు సపోర్ట్‌ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్‌.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్‌ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. 

నా వెంట్రుక కూడా పీకలేవు
పృథ్వీ.. గౌతమ్‌ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్‌ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్‌ అయింది. 

విశ్వక్‌సేన్‌ ఎంట్రీ
మెగా చీఫ్‌ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్‌బాస్‌. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్‌సేన్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 

అవినాష్‌ కక్కుర్తి
వస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్‌ కోరిక మేరకు తేజ, అవినాష్‌ పోల్‌ డ్యాన్స్‌ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్‌తో కలిసి విశ్వక్‌ స్కిట్‌ కూడా చేశాడు. తర్వాత అవినాష్‌.. విశ్వక్‌ దగ్గర టీషర్ట్‌ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement