rohini
-
సత్యమేవ జయతే
‘సార్... నా పేరు షణ్ముఖ్ రెడ్డి. మేం వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. మా కేసు గురించి మోహన్రావుగారితో మాట్లాడాలి, మీరు శుక్రవారం సాయంత్రం వచ్చేయండి... ఎలాగూ శాటర్డే, సండే కోర్టు హాలిడేస్ కాబట్టి సార్ మీతో డీటైల్డ్గా మాట్లాడతారు. అయితే మేం శుక్రవారం వచ్చి ఫోన్ చేస్తాం సార్’ అనే సంభాషణలు ‘కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమా ట్రైలర్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ వీడియోలో ఉన్నాయి. ఈ విజువల్స్తో పాటు ‘సత్యమేవ జయతే’ అని కూడా కనపడుతుంది. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. నాని సమర్పణలో రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 7న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, ట్రైలర్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. -
ఇలాంటి సినిమా ఇక్కడ మాత్రం వద్దన్నారు: దర్శకుడు
చిత్ర పరిశ్రమ ఏదైనా సరే.. బోల్డ్ కంటెంట్తో వచ్చిన చిత్రాలు కచ్చితంగా చర్చనీయాంశంగా మారతాయి. అయితే సమాజంలో జరుగుతున్న ఘటనలనే తాము చిత్రాల్లో చూపిస్తున్నామన్నది దర్శక నిర్మాతల వాదనగా ఉంటుంది. కాగా లెస్బియన్ల ఇతి వృత్తంతో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. వాటి తరహాలో తాజాగా కోలీవుడ్లో రూపొందిన చిత్రం కాదల్ ఎన్నబదు పొదువుడమై. గతంలో లెన్స్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రానికి జయప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రమే కాదల్ ఎన్నబదు పొదువుడమై..గ్లోవింగ్ టంగ్ట్న్, మ్యాన్కైండ్ సినిమాస్, నిత్స్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో జై భీమ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్ లెస్బియన్గా నటిస్తున్నారు. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నటుడు వినీత్ రోహిణి కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రేమికుల రోజు సందర్బంగా ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జయప్రకాశ్ మాట్లాడుతూ.. 'లెన్స్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత మస్కిటో ఫిలాస్పి అనే చిత్రాన్ని చిన్న బడ్జెట్లో తెరకెక్కించాను. దాని ఎడిటింగ్ కోసం బెంగుళూర్ వెళ్లినప్పుడు అక్కడ ఓ మిత్రుడితో చర్చించినప్పుడు ఈ కథకు లైన్ దొరికింది. దీంతో కథను తయారు చేసి నిర్మాతల కోసం ప్రయత్నించినప్పుడు పలువురు ఈ కథతో చిత్రాన్ని చేయడానికి వెనుకడుగు వేశారు. కారణం ఇది లెస్బియన్ ఇతి వృత్తంతో కూడిన కథ కావడమే. అదే విధంగా మరి కొందరైతే దీన్ని మలయాళం, హిందీ భాషల్లో చేయమని, తమిళంలో వద్దని చెప్పారు. అలాంటి సమయంలో నిర్మాత జియోబేబీ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈయన ఇంతకు ముందు ది గ్రేట్ ఇండియన్ కిచ్చన్ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించారు.' అని తెలిపారు.ఇద్దరు యువతుల మధ్య ప్రేమను ఆవిష్కరించిన కథా చిత్రం కాదల్ ఎన్నబదు పొదువుడమై అని దర్శకుడు జయప్రకాశ్ చెప్పారు. చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విడుదల కోసం చాలా ప్రయత్నాలు చేసినట్లు, అలాంటి పరిస్థితిలో ధనుంజయన్ తమకు దేవుడిగా ముందుకొచ్చారని చెప్పారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న ధనుంజయన్ మాట్లాడుతూ తానీ చిత్రాన్ని ఇంతకు ముందే చూసి విడుదల చేయడానికి సంప్రదించానని, అయితే అప్పుడు నిర్మాతల ఓటీటీ సంస్థతో మాట్లాడుతున్నట్లు చెప్పారన్నారు. అలాంటిది మళ్లీ ఈ చిత్రం తన వద్దకే రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటీటీ సమయంలో తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన అన్నారు. -
బిగ్బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?
బిగ్బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో షో ముగిసిపోనున్న దృష్ట్యా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇందులో భాగంగా రోహిణిని శనివారం బయటకు పంపేశారు. ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ మంచి గుర్తింపుతో పాటు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇంతకీ రోహిణి ఎన్ని వారాలు ఉంది? ఎన్ని లక్షలు సంపాదించింది?వచ్చేవారమంతా ఫినాలే వీక్ కాబట్టి.. టాప్-5ని మాత్రమే పంపించాలి కాబట్టి ఇప్పుడు రోహిణిని పంపించారు. ఆదివారం ఎపిసోడ్లో విష్ణుప్రియని ఎలిమినేట్ చేయబోతున్నారు. కాసేపు విష్ణుప్రియ గురించి పక్కనబెడితే రోహిణి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. అప్పటివరకు నీరసంగా ఉన్న షోని కాస్త అవినాష్తో కలిసి ఎంటర్టైన్ చేస్తూ కాస్త రేటింగ్స్ వచ్చేలా చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ')రోహిణిని అయితే పృథ్వీ, విష్ణుప్రియ లాంటి వాళ్లు అసలు నువ్వు కామెడీ చేయడానికి తప్పితే ఎందుకు పనికిరావ్ అని నానా మాటలు అన్నారు. దీంతో తను కేవలం కామెడీకి మాత్రమే కాదని, గేమ్స్ కూడా ఆడగలనని నిరూపించింది. తనని మాటలన్నా పృథ్వీపైనే గెలిచి అదరగొట్టేసింది. అయితే టాప్-5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్లో దాదాపు 9 వారాల పాటు ఉంది. హౌసులోకి వచ్చేముందు వారానికి రూ.2లక్షల చొప్పున ఈమె అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.18 లక్షల వరకు పారితోషికం సొంతం చేసుకున్నట్లే. గతంలో ఈమె బిగ్బాస్లో పాల్గొన్న ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈసారి మాత్రం అటు డబ్బు, ఇటు మరింత గుర్తింపు రోహిణికి దక్కడం విశేషం.(ఇదీ చదవండి: రోహిణితో పాటు విష్ణుప్రియ అవుట్.. ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్!) -
గౌతమ్కు హ్యాట్సాఫ్ చెప్తూ.. నిఖిల్ను విలన్ చేసిన రోహిణి
ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగార్జున బాంబు పేల్చాడు. వచ్చేవారం ఫినాలే జరగబోతుందని తెలిపాడు. ఇక ఇన్నివారాల ప్రయాణంలో ఏ విషయంలో రిగ్రెట్ ఫీలయ్యారు? అది ఏ వారమో చెప్పాలన్నాడు నాగ్. మరి ఎవరెవరు ఏమేం చెప్పారో నేటి (డిసెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..మెగా చీఫ్ నా కొంప ముంచిందిమొదటగా అవినాష్.. 12వ వారంలో నేను మెగా చీఫ్గా ఉన్నప్పుడు విష్ణు, రోహిణి మధ్య గొడవను పరిష్కరించలేకపోయానన్నాడు. ప్రేరణ.. పదకొండోవారంలో నేను మెగా చీఫ్గా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయాను. దానివల్ల నాకు, హౌస్మేట్స్కు ఎఫెక్ట్ అయిందని చెప్పుకొచ్చింది. నబీల్.. తొమ్మిదో వారంలో మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ, ఏదో బాధలో ఉండటంతో ఆ అవకాశాన్ని ఈజీగా వదిలేసుకుని తప్పు చేశానన్నాడు. ఎందుకంత తుత్తర? ఈ సందర్భంగా నాగ్.. టాస్కులు సరిగా పూర్తిచేయకముందే ఎందుకు గంట కొడతావ్? ఎందుకంత తుత్తర? అని ప్రశ్నించాడు. అలాగే ఫైనలిస్ట్ అవడానికి చెక్పై రూ.15 లక్షలు రాసి, దాన్నెందుకు చించేశావని సూటిగా అడిగాడు. మొదట నా స్వార్థం కొద్దీ రాశాను కానీ తర్వాత మనసొప్పకపోవడంతో దాన్ని చింపేశానని తెలిపాడు. రోహిణి వంతురాగా పదోవారం ఎవిక్షన్ షీల్డ్ గేమ్లో అవినాష్ గుడ్డు పాము నోట్లో వేసినందుకు ఎన్నోసార్లు బాధపడ్డానంది. పృథ్వీతో ఫ్లర్ట్ చేశావిష్ణుప్రియ వంతురాగా.. పృథ్వీతో ఫ్లర్ట్ చేయడం వల్ల అతడి గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమోనని బాధపడుతున్నాను. అలాగే తొమ్మిదో వారంలో నేను చీఫ్ అయినప్పుడు ఐదుగుర్ని నామినేట్ చేయమన్నారు. అప్పుడు నబీల్ను నామినేట్ చేసినందుకు రిగ్రెట్ అయ్యానంది. గౌతమ్.. ఆరో వారంలో కామెడీ టాస్క్లో నన్ను అశ్వత్థామ అన్నందుకు ఫీలయ్యాను. అది నామినేషన్స్ దాకా వెళ్లింది. అక్కడ ఫీలయ్యాను అని చెప్పాడు. సారీ చెప్పాలి కదా!ఈ సందర్భంగా నిఖిల్తో గొడవ గురించి అడిగాడు నాగ్. నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనడంతో నేనూ నోరు జారానన్నాడు. వాడుకున్నావ్ అనేది ఎంత పెద్ద మాటో తెలుసా? అని నాగ్ చెప్తుంటే గౌతమ్.. తాను చేసింది తప్పని, కానీ వేరే ఉద్దేశంలో అనలేదన్నాడు. తప్పు ఎలా చేసినా తప్పే.. మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి కదా అని క్లాస్ పీకడంతో గౌతమ్ మరోసారి నిఖిల్ను అందరి ముందు క్షమాపణలు కోరాడు.వీడియోతో క్లారిటీనిఖిల్ వంతు రాగా.. ఎన్నడూ నోరు జారని నేను పద్నాలుగోవారంలో గౌతమ్పై నోరు పారేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నానన్నాడు. రంగుపడుద్ది టాస్క్లో గౌతమ్ నిఖిల్ను కావాలని కొట్టాడా? లేదా? అనేది వీడియో ప్లే చేసి చూపించాడు. అది అనుకోకుండా తగిలిందని క్లారిటీ రావడంతో నిఖిల్ సైతం అతడికి సారీ చెప్పాడు. తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో అవిష్ను గెస్ చేయమన్నాడు నాగ్. అవినాష్ ఊహించిందే నిజమైందిఫస్ట్ టైమ్ నామినేషన్స్కు రావడం పెద్ద మైనస్.. కాబట్టి రోహిణి ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశాడు. అతడు చెప్పిందే నిజమైంది. రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే హౌస్లో ఆమె మాటతీరు, ఆటతీరును ప్రశంసిసిస్తూ చప్పట్లు కొట్టి, సెల్యూట్ చేసి మరీ సెండాఫ్ ఇచ్చారు. స్టేజీపైకి వచ్చిన రోహిణి.. అవినాష్, గౌతమ్, ప్రేరణను హీరోలుగా పేర్కొంది. ఆ ముగ్గురు హీరోలు: రోహిణిగౌతమ్తో.. వైల్డ్ కార్డ్గా వచ్చిన మొదటివారమే ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్లొచ్చావ్.. అలా ఎందుకు జరిగిందన్న ఆలోచనతో ఆ తర్వాతి వారం నుంచి నువ్వు ఆడిన విధానానికి హ్యాట్సాఫ్. సోలో.. సోలో అంటూ ఫైనల్కు వచ్చేశావ్.. ఫ్రెండ్స్తో ఉండటం తప్పేం కాదు, అందరికీ కాసేపు సమయం కేటాయించు సలహా ఇచ్చింది. విష్ణు, నబీల్, నిఖిల్ను విలన్లుగా పేర్కొంది. ట్రోఫీ గెలవకపోయినా రోహిణి సగర్వంగా విన్నర్లా బయటకు వెళ్లిపోయింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణి ఎలిమినేట్.. తప్పు ఒప్పుకొన్న ప్రేరణ
బిగ్బాస్ 8 ముగింపుకు ముహూర్తం పెట్టేసినట్లు నాగార్జునే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం హౌస్లో ఏడుగురు ఉండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్తో ఇద్దర్ని పంపించేస్తున్నట్లు తెలిపాడు. ఈ పద్నాలుగు వారాల జర్నీలో మీరు రిగ్రెట్ ఫీలైన వారమేంటో చెప్పాలన్నాడు. అందుకు ప్రేరణ పదకొండో వారం అని చెప్పింది. మెగా చీఫ్ అయినప్పుడు సాఫ్ట్గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయానని తప్పు ఒప్పేసుకుంది. సంచాలక్గా బాగా చేశావా?నిజమే, అప్పటిదాకా ప్రేరణ గ్రాఫ్ రయ్యిమని పైకెళ్లింది. కానీ మెగా చీఫ్ అయిన వెంటనే తన డౌన్ఫాల్ మొదలైంది. ఇక నిన్నటి రంగుపడుద్ది టాస్క్లో సంచాలక్గా బాగా చేశావని అనుకుంటున్నావా? అని నాగ్ ప్రశ్నించగా లేదంటూ నిజం ఒప్పేసుకుంది. మరోవైపు పోల్కు సరిగా తాడు చుట్టాల్సిన గేమ్లో నబీల్ ఇష్టమొచ్చినట్లు తాడును కట్టి తానే గెలిచానని వాదించాడు. అప్పుడు స్వయంగా బిగ్బాసే కలగజేసుకుని అది చుట్టడమా? అని కౌంటర్ ఇచ్చాడు. స్వార్థంగా ఆలోచించా..ఇప్పుడు నాగ్ కూడా సరిగ్గా చుట్టడమేంటో ఏంటో తెలుసా? అంటూ అతడికి క్లాస్ పీకాడు. నీ తిత్తర ఎప్పుడు తగ్గుతుంది? అని ప్రశ్నించాడు.ఫైనలిస్ట్ అవడం కోసం చెక్పై రూ.15 లక్షలు రాశావు, అలాంటప్పుడు దాన్ని ఎందుకు చించేశావని అడిగాడు. కొంచెం సెల్ఫిష్గా ఉందామనే రాశా.. కానీ తర్వాత మరీ ఎక్కువ డబ్బు రాసేశాననిపించింది అని తెలిపాడు. డబుల్ ఎలిమినేషన్సెల్ఫిష్గా ఉండి గేమ్ సరిగా ఆడకపోతే ఎవరూ గెలవలేరన్నాడు నాగ్. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నాడు. ఇప్పటికే శనివారం షూటింగ్ పూర్తవగా అందులో రోహిణిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంకో ఎలిమినేషన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!
బిగ్బాస్ 8 తెలుగు సీజన్ చివరికొచ్చేసింది. తర్వాత వారంలో ఫినాలే జరగబోతుంది. దీంతో ఈ వీకెండ్ జరగబోయే ఎలిమినేషన్ చివరిది. దీంతో ఎవరు బయటకెళ్లిపోతారా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం హౌసులోని పరిస్థితుల ప్రకారం ఇద్దరమ్మాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లలో ఒకరైనా స్టార్ కంటెస్టెంట్ ఈసారి ఎగ్జిట్ పక్కా అని అంటున్నారు.ఈ వారమంతా హౌసులో విభిన్న రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు వచ్చి, హౌసులోని సభ్యులతో కాసేపు ముచ్చట్లు పెట్టి వెళ్లిపోయారు. ఈ వారం అవినాష్ తప్పితే మిగిలిన ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలో నిఖిల్, గౌతమ్ ఏకంగా టైటిల్ రేసులో ఉన్నారు కాబట్టి వీళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ప్రేరణ కూడా టాప్-5 రేసులో ఉంది. దీంతో ఈమె కూడా బయటకెళ్లకపోవచ్చు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?)వీళ్లు కాకుండా అంటే నబీల్, విష్ణుప్రియ, రోహిణి ఉంటారు. కొన్నాళ్ల ముందు వరకు చాలా బ్యాలెన్స్గా గేమ్ ఆడుతూ వచ్చిన నబీల్.. ఈ మధ్య కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అయితేనేం టాప్-5కి నబీల్ అర్హుడే అనిపిస్తుంది. ఓటింగ్ పరంగానూ ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే చివరి రెండు స్థానాల్లో రోహిణి, విష్ణుప్రియ ఉన్నారు.పృథ్వీతో లవ్వాట తప్పితే విష్ణుప్రియ.. ఈ సీజన్ అంతా అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మెన్స్ చేస్తూ వస్తోంది. ఈమెతో పోలిస్తే ఎంటర్టైన్, గేమ్స్ పరంగా రోహిణి చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఓటింగ్ పరంగా చూసుకుంటే రోహిణి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ. అదే గేమ్ లెక్కల బయటకు తీస్తే మాత్రం విష్ణుప్రియ.. ఈ వారం ఎగ్జిట్ అయిపోవడం గ్యారంటీ. లేదంటే బిగ్బాస్.. గతవారం తేజ, పృథ్వీని పంపినట్లు డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ప్లాన్ చేసాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?) -
అవినాష్ త్యాగం వృథా.. విన్నర్ను చేయమంటూ విష్ణు రిక్వెస్ట్
బిగ్బాస్ సీజన్ ఎండింగ్కు వచ్చేసింది. విన్నర్గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలంటే తాను పెట్టే టాస్కులు గెలవాలన్నాడు బిగ్బాస్. అలా మొన్న ప్రేరణ, నిన్న నబీల్, నేడు విష్ణుప్రియ ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందరు. ఆమె ఎలా గెలిచింది? ఏం మాట్లాడిందన్నది నేటి (డిసెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..అదరగొట్టిన గౌతమ్బిగ్బాస్ ఈ రోజు మొదటగా పవర్ ఫ్లాగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్నవారు ఆ రౌండ్లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచి నబీల్ను రేసు నుంచి తప్పించాడు. తర్వాతి రౌండ్లలో కూడా గౌతమ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఆట కొనసాగింది. గౌతమ్ దగ్గరి నుంచి జెండా లాక్కునేందుకు అందరూ కలిసి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా మిగతా రెండు రౌండ్లలో గౌతమ్.. ప్రేరణ, నిఖిల్ను తీసేశాడు.గౌతమ్ దూకుడుకు బ్రేక్ వేసిన రోహిణితర్వాతి రౌండ్లో మిగిలినవాళ్లు గౌతమ్ను లాక్ చేశారు. అలా అతడి దగ్గరి నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్ను రేసులో నుంచి తొలగించింది. అనంతరం అవినాష్.. విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివర్లో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్గా నిలిచింది. తనకోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది.ఆగమైన సంచాలక్బిగ్బాస్ నిలబెట్టు-పడగొట్టు అనే రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోను వేస్ట్ బాక్స్లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయాడు. దీంతో సంచాలక్ రోహిణి.. నబీల్ను విజేతగా ప్రకటించింది. ఇక్కడే బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ సరిగానే ఆడారా? అని ప్రశ్నించాడు. విష్ణు గెలుపుదీంతో ఆలోచనలో పడ్డ రోహిణి.. టాస్క్ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరూ సరిగా ఆడనట్లు గుర్తించింది. చర్చోపచర్చల అనంతరం విష్ణు గెలిచినట్లు తెలిపింది. రోహిణి, విష్ణుప్రియలో ఎవరు ఓట్ అప్పీల్ చేయాలో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అవినాష్ మినహా మిగతా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం పొందింది.మహిళా విజేతగా నిలవాలనుందివిష్ణుప్రియ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా వివిధ షోలలో నన్ను చూసి, ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నన్నుగా ప్రేమించి పద్నాలుగువారాల వరకు తీసుకొచ్చినవారికి థ్యాంక్స్. నా ప్రవర్తన నచ్చనివారికి సారీ.. ఇంకా ఒక్కవారమే ఉంది. మీ ప్రేమాభినాలు ఇలాగే కొనసాగించి నన్ను విజేతను చేస్తారని కోరుకుంటున్నాను. వీలైనంతవరకు నిజాయితీగా ఉన్నాను. బిగ్బాస్ చరిత్రలో మహిళా విజేత అవ్వాలన్నది నా కోరిక.. అందుకు మీ సాయం కావాలి. మీ ఓటే నా గెలుపు అని ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించింది.సంగీత కచేరీఇక టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. జామర్స్ బ్యాండ్ను పిలిచి లైవ్ కన్సర్ట్ ద్వారా వినోదాన్ని పంచాడు. సంగీతంతో హౌస్మేట్స్ తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యారు. పాదమెటు పోతున్నా.. అనే ఫ్రెండ్షిప్ పాటకైతే అందరూ కలిసిపోయి డ్యాన్స్ చేయడం కన్నులపండగ్గా ఉంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్ ఈజ్ బ్యాక్ అనేలా విజృంభించిన అశ్వత్థామ
గౌతమ్ కృష్ణ.. తిట్టిన నోళ్లతోనే శెభాష్ అనిపించుకున్నాడు. ఇది అందరికీ సాధ్యమవదు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన గౌతమ్ తొలినాళ్లలో గేమ్తో హడలెత్తించాడు. కానీ రానురానూ డల్ అయ్యాడు. గెలుపును అందుకోవడంలో తడబడ్డాడు. ఇంకేముంది, సరిగ్గా టాస్కులు ఆడట్లేదు, గెలవట్లేదంటూ విమర్శలు మొదలయ్యాయి.ఫ్లాగ్ టాస్క్లో విజృంభించిన గౌతమ్అయితే ఈ రోజు గౌతమ్.. తనను విమర్శిస్తున్నవారి నోళ్లు మూయించనున్నాడు. పవర్ ఫ్లాగ్ అనే గేమ్లో విజృంభించి ఆడాడు. వరుసగా మూడుసార్లు తనే జెండా అందుకుని ప్రేరణ, నబీల్, నిఖిల్ను గేమ్ నుంచి తొలగించాడు. కానీ తర్వాత రోహిణి చేతికి జెండా రావడంతో ఆమె గౌతమ్ను సైడ్ చేసింది. చివర్లో అవినాష్, రోహిణి ఇద్దరు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది.బంపర్ ఆఫర్లు ఇకపోతే బిగ్బాస్ ఈ సీజన్లో హౌస్మేట్స్కు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు. నిన్న చెఫ్ సంజయ్తో కడుపునిండా భోజనం పెట్టించగా నేడు సంగీత కచేరి ఏర్పాటు చేశాడు. టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బ్యాండ్ జామర్స్ను ఇంట్లోకి పంపాడు. వీరు తమ పాటలతో అందరినీ మరో లోకానికి తీసుకెళ్లారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేమపై విష్ణుప్రియ క్లారిటీ.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి!
బిగ్బాస్ 8 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే ఉండనుంది. దీంతో సోమవారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. మెగాచీఫ్ రోహిణి తప్పితే విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పుడు టికెట్ టూ ఫినాలే కూడా షురూ చేశారు. ఇంతకీ మంగళవారం (నవంబర్ 26) ఎపిసోడ్లో ఏం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ అయ్యింది. గతవారం ఈ సీజన్లోని పాల్గొని ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు. ఇప్పుడు గత సీజన్లలో పాల్గొన్న పలువురు హౌస్మేట్స్ వచ్చారు. టికెట్ టూ ఫినాలే పోటీలు పెట్టారు. నాలుగో సీజన్ ఫేమ్ అఖిల్ సార్ధక్, అలేఖ్య హారిక తొలుత వచ్చారు. వీరిని చూసి హౌస్మేట్స్ షాకయ్యారు. ఏందిరా బాబు మరో సెట్.. వైల్డ్ కార్డులను దింపుతున్నారా ఏంటా అని భయపడ్డారు. కానీ విషయం తెలిసి రిలాక్స్ అయ్యారు.వచ్చాక సరదాగా ముచ్చట్లు పెట్టిన అఖిల్.. విష్ణుప్రియను ఇన్ డైరెక్ట్గా కౌంటర్స్ వేశాడు. లైఫ్ అంటే అంతే కదా, కొందరిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే ప్రయాణం ఇంకా చాలా బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓటమినైనా లేకపోతే ప్రేమలో ఓడిపోయినా దాన్ని తీసుకుని ముందుకెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెబుతున్నానో వాళ్లకి అర్థమవుతుందని అఖిల్ అన్నాడు. ఎక్కడో ఈ రిలేషన్షిప్లో నాకు ఇది రైట్ అనిపించలేదు. అది మార్చుకుంటే బావుంటుందేమోనని అనిపించింది.. విష్ణు నీ గురించే నేను చెబుతున్నానని అఖిల్ అన్నాడు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)దీంతో విష్ణుప్రియ రియాక్ట్ అయింది. 'ఓ వ్యక్తిపై ఇష్టం మాత్రమే.. అది ప్రేమనా లేదంటే ఇంకేమైనా అని నేను ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మనం ఎలా ఉండాలో అలా ఉండటానికే వచ్చాం. నేను 100 శాతం నాకు నేనులానే ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఓవైపు ఇది జరుగుతుండగా హారిక.. పృథ్వీ దీనిపై నీ అభిప్రాయం ఏంటని అడిగింది. దీంతో క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ విష్ణు వచ్చినప్పుడు మేము గుడ్ ఫ్రెండ్స్, ఆమె తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చేశా. ఈ రిలేషన్షిప్ ఇవన్నీ నాకు సెట్ కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్ రాదు.. కానీ తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అని పృథ్వీ ఖరాఖండీగా చెప్పేశాడు.ఇలా పృథ్వీతో రిలేషన్ గురించి విష్ణు-అఖిల్ మధ్య చాలానే డిస్కషన్ సాగింది. కానీ చివరకు అసలు ఈమెని ఎందుకు ఇదంతా అడిగానా అని అఖిల్ అనుకుని నోరు మూసుకోవడంతో ఎండ్ అయింది. ఇన్నాళ్లు లవ్ బర్డ్స్ అన్నట్లు తెగ పోజులు కొట్టారు కానీ వీళ్లిద్దరూ షో కోసమే ఈ డ్రామా అంతా నడిపించారని అఖిల్-హారిక అడగడం.. విష్ణుప్రియ క్లారిటీ ఇవ్వడంతో అర్థమైంది. టికెట్ టూ ఫినాలే కోసం పోటీదారుల్ని సెలెక్ట్ చేయాలని అఖిల్-హారికకు బిగ్బాస్ చెప్పగా.. వీళ్లిద్దరూ గౌతమ్, రోహిణిని తొలుత ఎంపిక చేశారు. మరో ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయాలని చెప్పగా.. తేజ, విష్ణుప్రియని పోటీలోకి దించారు.(ఇదీ చదవండి: హీరో అఖిల్తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?)ఈ నలుగురికి కలిపి 'ది లిమిట్లెస్ బ్రిడ్జి' టాస్క్ పెట్టారు హౌసులోకి వచ్చిన అఖిల్-హారిక. ఇందులో చకచకా బ్రిడ్జి కంప్లీట్ చేసిన రోహిణి విజేతగా నిలిచింది. ఆ తర్వాత గౌతమ్, విష్ణుప్రియ పూర్తి చేశారు. టేస్టీ తేజ మాత్రం బజర్ మోగే వరకూ చేయలేకపోయాడు. ఈ పోటీలో గెలిచిన రోహిణికి తదుపరి ఛాలెంజ్లో పెద్ద ప్రయోజనం లభిస్తుందని బిగ్బాస్ ప్రకటించాడు. తులాభారం' అని మరో టాస్క్ కూడా పెట్టారు. ఇందులోనూ రోహిణి విజేతగా నిలిచింది. ఈ రెండు టాస్క్ల బట్టి మిగిలిన ముగ్గురిలో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలని బిగ్బాస్ ఆదేశించాడు. ఈ బ్యాడ్జి దక్కిన వారికి ఇక టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడేందుకు వీల్లేదు. రేసు నుంచి తప్పుకున్నట్లే అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు.అఖిల్-హారిక డిసైడ్ చేసుకుని విష్ణుప్రియకు బ్లాక్ బ్యాడ్జిని ఇచ్చారు. దీంతో విష్ణు ఏడుపు మొదలుపెట్టింది. తేజ కంటే బాగానే ఆడాను కదా అని పృథ్వీ దగ్గరకొచ్చి తెగ బాధపడిపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. విష్ణు.. టికెట్ టూ ఫినాలే పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది కాబట్టి ఈవారం ఆమె ఏమైనా ఎలిమినేట్ అవుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప 2' నిడివి లాక్.. ఏకంగా అన్ని గంటలా?!) -
శివంగి మళ్లీ గెలుపు.. బిగ్బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?
బిగ్బాస్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే జరగబోతుంది. దీంతో ఎవరెవరు ఫైనల్లో ఉండాలనేది ఇప్పటి నుంచే పోటీలు పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలా గేమ్స్ పెడితే కిక్ ఏముంటుందా అని గతంలోని కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి మరీ కొత్త వాళ్లతో పోటీలు పెడుతున్నారు. అలా ఈ రోజు అఖిల్, హారిక వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.'టికెట్ టూ ఫినాలే'లో మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు పోటీదారుల్ని ఎంపిక చేయాలని హౌస్లోకి వచ్చిన అఖిల్, హారికకు బిగ్బాస్ చెప్పగా.. తేజ, గౌతమ్, రోహిణి, విష్ణుప్రియని ఎంపిక చేశారు. దీంతో వీళ్లకు టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్లోని కలర్ బాక్సులని తీసుకొచ్చి, రెయిన్ బో ఆకారం వచ్చేలా చేయాలి. తొలుత రోహిణి సరిగా పేర్చింది కానీ అవి పడిపోయాయి. ఆ తర్వాత తేజ కూడా పెట్టాడు కానీ అవి నిలబడలేదు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్పై పోలీసు కేసు)రోహిణి అన్ని సరిగా పేర్చి త్వరగా వెళ్లి గంట కొట్టింది. దీంతో తెగ సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలోనే రోహిణి.. టికెట్ టు ఫినాలే తొలి ఫైనలిస్ట్ అని అంటున్నారు. కానీ బిగ్ బాస్.. మళ్లీ పోటీలు పెడతాడా? లేదంటే రోహిణిని ఫైనలిస్ట్గా ఫిక్స్ చేస్తాడా అనేది చూడాలి?కొన్నిరోజుల ముందు వరకు ఎంటర్టైనర్గా అదరగొట్టిన రోహిణి.. గతవారం కుండని బ్యాలెన్స్ చేసే టాస్కులో మాత్రం చివరివరకు నిలబడి గెలిచింది. కాలునొప్పి బాధిస్తున్నా సరే విజేతగా నిలిచి మెగాచీఫ్ అయింది. ఒక్కసారి తన గ్రాఫ్ పెంచుకుంది. ఒకవేళ ఈమె గనక తొలి ఫైనలిస్టు అయితే మాత్రం మంచిదే!(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ గీత రచయిత కన్నుమూత) -
ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్
నామినేషన్స్లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఫైర్ లేదుబిగ్బాస్ హౌస్లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్లో తప్ప గేమ్లో ఫైర్ లేదంటూ గౌతమ్ను నామినేట్ చేశాడు. నబీల్తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.ఆ ఫోకస్ గేమ్పై చూపించునీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్ను నామినేట్ చేశాడు.తొడగొట్టిన అవినాష్ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.మాట తప్పావ్: గౌతమ్గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్లో ఫిజికల్ అయ్యావని నిఖిల్ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణతర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్లోనిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: బిగ్ బాస్ ఈ వారం విశ్లేషణ... 'బోల్డ్ వీక్'
తెగించిన వాడికి తెడ్డే అన్నట్టు బిగ్బాస్ ఆఖరి దశకు చేరుకునే సమయంలో బాగా బోల్డ్ కంటెంట్తో ముందుకు వెళుతోంది. ఈ వారమంతా నామినేషన్స్ దగ్గర నుంచి ఎలిమినేషన్ వరకు ఈ బోల్డ్ కంటెంట్తోనే ఈ వారమంతా నడిచిందని చెప్పొచ్చు. ముందుగా ఈ వారం చివరి చీఫ్ కంటెండర్ జరిగిన పోటీలో పార్టిసిపెంట్స్ పదజాలం బాగా బోల్డ్. మెగా చీఫ్గా గెలిచిన రోహిణి, దానికోసం పోటీ పడ్డ విష్ణుప్రియ మధ్య సంభాషణంతా సాలిడ్ బోల్డ్.విష్ణు ఓపెన్గా రోహిణి క్యారెక్టర్పై నిందవేస్తే.. రోహిణి ఏకంగా నువ్వు ఒకరిని ఇష్టపడి వారు దొరకక ఇంకొకరి కోసం ప్రయత్నించావని విష్టుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ రకంగా ఇటువంటివి బుల్లితెరలో అదీ తెలుగు ఎంటర్టైన్మెంట్ మీడియాలో చాలా కొత్త అని చెప్పొచ్చు. ప్రేక్షకుల పరంగా పరమ చెత్త అనొచ్చు. నాలుగు గోడల మధ్య ఆవేశపడితే ఇంటి గుట్టవుతుంది, అదే లక్షలాది ప్రేక్షకుల మధ్య అసభ్యంగా మాట్లాడితే అదే గుట్టు రట్టవుతుంది. ఈ విషయం కంటెస్టెంట్స్కు తెలిసినా తెలియకపోయినా బిగ్బాస్కు మాత్రం తెలుసు. ఎందుకంటే అదే బిగ్బాస్కు లాభదాయకం కాబట్టి.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా?)వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లు ఇతర కంటెస్టెంట్లపై కంప్లైంట్లను ఓ చక్కటి ఆట రూపేణా చూపడం కొంతవరకు బావుంది. ఈ వారం యశ్మి ఎలిమినేట్ అవడం అటు కంటెస్టెంట్లకు ఇటు యష్మికి ఏ మాత్రం బాధ కలిగించలేదన్నది వాస్తవం. యష్మి వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ రూపేణా గౌతమ్ను నేరుగా నామినేట్ చేసింది. ఈ వారం ఓ విషయమైతే చెప్పుకోవాలి, హౌసులో గ్రూపిజం సరిగ్గా ఉందో లేదో కాని బయట సోషల్ మీడియాలో మాత్రం బిగ్బాస్పై కుల, ప్రాంత, మతతత్వాలతో కొట్టుకు చస్తున్నారు కొందరు అమాయక నెటిజన్లు.ఏ సంబంధం లేని వారి కోసం తమ విలువైన టైమ్ వెచ్చించి అర్ధం లేని కార్యక్రమం కోసం తమ జీవితాలను వ్యర్ధం చేసుకుంటున్న సోషలోళ్లు మీకు హాట్సాఫ్. దీనికంతటికీ కారణజన్ముడు ఆ బిగ్బాస్ మహానుభావుడని వేరే చెప్పాలా!-ఇంటూరు హరికృష్ణ(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్పై వచ్చిన కంప్లైంట్స్..అన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్పై బిగ్బాంబ్ వేసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అతడి నిజస్వరూపం బయటపడాలన్న యష్మి
ఒకరి పొరపాట్లను మరొకరు పేపర్పై రాయాలన్నాడు బిగ్బాస్. తన మీద వచ్చిన ఫిర్యాదు చదివిన కంటెస్టెంట్.. అది ఎవరు రాయాలో గెస్ చేయాల్సి ఉంటుంది. అలా తేజ. తనపై వచ్చిన కంప్లైంట్ చదివాడు. తను మాట్లాడదల్చుకుంది మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను చెప్పేది మాత్రమే నిజమని భావిస్తాడు అని రాసుంది. ఇది కచ్చితంగా విష్ణుప్రియ, యష్మి రాసుంటారని తేజ అభిప్రాయపడ్డాడు.ఫిర్యాదుల గోలఅన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను. చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతుంది. అది నాకు నచ్చదు.. ఈ ఫిర్యాదు తనపై గౌతమ్ చేసి ఉంటాడని యష్మి గెస్ చేసింది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు.. ఫుడ్ విషయంలో అందరికోసం ఆలోచించు అని గౌతమ్కు ఫిర్యాదు వచ్చింది. ఇది విష్ణు, అవినాష్ కంప్లైంట్ చేసుంటారన్నాడు.నిజస్వరూపం చూపించాలిఆటపట్ల ఆసక్తి ఉన్నట్లు అనిపించలేదు, అందర్నీ నిరుత్సాహపరుస్తుంది అని అవినాష్.. విష్ణుప్రియపై కంప్లైంట్ చేశాడు. కామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం అందరికీ చూపించాలి అని యష్మి.. అవినాష్ గురించి రాసింది. ప్రోమోలో చివర్లో పృథ్వీ, యష్మి డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. అయితే యష్మి ఎలిమినేట్ అన్న విషయం ఇదివరకే తెలిసిందే! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్లు కాదు, పాములు.. గ్రూప్ గేమ్ తప్పు కాదన్న నాగ్..
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..క్యారెక్టర్లెస్ అనలేదుగా: విష్ణునువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.నిఖిల్కు ట్రై చేశా అనలేదునిఖిల్కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్కార్డ్స్ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.నోర్మూయ్.. నాగ్ సీరియస్ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్మేట్స్తో ఓ గేమ్ ఆడించాడు.నిచ్చెన- పాముఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.రెండు పాములునిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నీ క్యారెక్టర్ కనిపిస్తోంది.. విష్ణుపై నాగార్జున సీరియస్
నాగార్జున వచ్చీరావడంతోనే విష్ణుప్రియ- రోహిణిల గొడవపై స్పందించాడు. ఇద్దర్నీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి గొడవకు సంబంధించిన వీడియో ప్లే చేశాడు. నీ ప్లాన్ వర్కవుట్ అయింది.. అందుకు ఉన్నావ్ అని రోహిణి అనగా నీ క్యారెక్టర్ తెలుస్తోందని విష్ణు రిప్లై ఇచ్చింది. క్యారెక్టర్ అనే మాట చాలా పెద్దది అని నాగార్జున చెప్తుంటే.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు.. అది తప్పే కాదని వాదించింది విష్ణు.నీ క్యారెక్టర్ కనిపిస్తోందిదీంతో నాగ్.. ఆ పదం వాడకుండా ఉండాల్సింది.. అక్కడ నీ క్యారెక్టర్ కనిపిస్తోంది అని విమర్శించాడు. నిఖిల్కు ట్రై చేసి, కుదరకపోవడంతో విష్ణు.. పృథ్వీకి ట్రై చేసిందని.. అదంతా ప్లాన్ అని రోహిణి అనడాన్ని కూడా నాగ్ తప్పుపట్టాడు. ఈ విషయంలో ఎవరిది తప్పు? అని హౌస్మేట్స్ అభిప్రాయాన్ని తీసుకున్నాడు.తప్పు ఒప్పుకోని విష్ణుప్లాన్ అనడం రోహిణిదే తప్పని అవినాష్ అనగా.. ప్లాన్ కంటే క్యారెక్టర్ అనేది పెద్ద పదం కాబట్టి విష్ణుదే తప్పని ప్రేరణ అభిప్రాయపడింది. అక్కడ కూడా విష్ణు మళ్లీ సంజాయిషీ ఇచ్చుకోవడంతో నాగ్ తనను సైలెంట్ అయిపోమన్నాడు. ఇక్కడ తప్పు ఇద్దరిదీ ఉంది.. కానీ విష్ణు వాడిన పదాల వల్ల తన గోయి తనే తవ్వుకున్నట్లయింది. -
మనసులు గెలిచిన సివంగి.. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్!
'అందరికంటే వీక్, ఒక్క టాస్క్ అయినా గెలిచావా? జీరో.. అసలు పరిగెత్తగలవా?' కొన్ని వారాల క్రితం రోహిణిని నామినేట్ చేసేటప్పుడు పృథ్వీ అన్న మాటలివి! నిన్న విష్ణు కూడా రోహిణిపై నోరేసుకుని పడిపోయింది.. నీలో ఫైర్ లేదు, నువ్వు జీరో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది.. ఓటమిని తీసుకోలేవ్.. ఇలా తన నోటికి అడ్డూఅదుపే లేకుండా పోయింది. నిజానికి రోహిణి వచ్చినప్పటినుంచి తనవంతు ఆడటానికే ప్రయత్నించింది. ఎంటర్టైన్ చేయడం మరింత అదనం!అందరి కడుపు నింపిందితన ఎంటర్టైన్మెంట్ వల్ల బిగ్బాస్ పలుమార్లు కిచెన్లో రెండు గంటలపాటు వంట చేసుకునే అవకాశం కల్పించాడు. అలా ఎక్కువగా అవినాష్, రోహిణి వల్లే హౌస్మేట్స్ అందరూ కడుపునిండా తినగలిగారు. ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే.. విష్ణు, రోహిణి ఇదివరకే మంచి ఫ్రెండ్స్. కానీ బిగ్బాస్ షోలో మాత్రం బద్ధ శత్రువులయ్యారు. పాత స్నేహితుల కంటే కొత్తగా పరిచయమైన పృథ్వీయే ఎక్కువయ్యాడు. రోడ్డు యాక్సిడెంట్లో గాయాలుఅతడు ఒక్కడుంటే చాలు.. మరెవరూ అవసరమే లేదన్నంతగా దిగజారింది. అందుకే ముందూవెనకా ఆలోచించకుండా ఏది పడితే అది అనేయడం తర్వాత తీరికగా సారీ చెప్పడం అలవాటైపోయింది. కానీ తన ఫ్రెండ్నే కించపరచడంతో విష్ణు స్వభావం ఎలాంటిదో బయటపడింది. రోహిణి విషయానికి వస్తే 2016లో ఆమెకు యాక్సిడెంట్ అయింది. అప్పట్లో తన కుడి కాలికి రాడ్ వేశారు. ఆ తర్వాత నటిగా బిజీ ఉండటంతో రాడ్ను తీయించుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ పోయింది. రెండుసార్లు ఆపరేషన్గతేడాది కాలినొప్పి మొదలవడంతో వైద్యుల్ని సంప్రదించింది. వారు ఆపరేషన్ చేశారు కానీ రాడ్ బయటకు తీయలేకపోయారు. బలవంతంగా తీస్తే ఎముక విరిగిపోతుందని ఆపేశారట! దీంతో తనకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్లగా 10 గంటలపాటు ఆపరేషన్ చేసి రాడ్డును బయటకు తీశారు. ఇదంతా జరిగింది తన కుడికాలికే! నిన్న అదే కుడికాలితో గంటలకొద్దీ కుండను బ్యాలెన్స్ చేసింది. 'హీరో'హిణిఆ కుండ గేమ్లో తనను చులకనగా చూసిన పృథ్వీని ఓడించింది. అంతకంటే ముందు విష్ణును చిత్తు చేసింది. హౌస్కు మెగా చీఫ్ అయింది. కప్పు కన్నా ముఖ్యమైన ప్రేక్షకుల మనసుల్ని గెలిచింది. ఆమె విజయం చూసిన ఎంతోమందికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కమెడియన్లను హీరోలుగా చూడరు అన్న భ్రమల్ని పటాపంచలు చేస్తూ HEROHINI అనిపించుకుంది. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫ్రాక్చర్ అయిన కాలుతో గేమ్ ఆడి గెల్చిన రోహిణి.. ప్లేటు మార్చిన విష్ణు!
తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లోనే ఇదొక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. రోహిణిని గడ్డిపరకలా తీసిపారేసింది విష్ణు.. అసలు పరిగెత్తడం వచ్చా.. అని వంకరగా చూస్తూ బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీ. ఫ్రాక్చర్ అయిన కాలుతోనే గేమ్ ఆడి ఈ ఇద్దరినీ ఓడించి లేడీ టైగర్ అనిపించుకుంది రోహిణి. మరిన్ని విశేషాలు నేటి (నవంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..యష్మి బకరామెగా చీఫ్ కంటెండర్లకు బిగ్బాస్ ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. చివరి వరకు ఆటోలో ఉన్నవారు ఎక్కువ పాయింట్లు గెలుస్తారన్నాడు. యష్మి, పృథ్వీ, విష్ణు కలిసి. తేజ, రోహిణిని తోసేశారు. పృథ్వీ, విష్ణు కలిసి యష్మిని తోయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో తోశావ్.. అలాంటప్పుడు నాకు సాయం చేస్తానని ఎందుకన్నావ్? మీరిద్దరూ ఎలా ఆడతారో చూస్తా.. అని నిలదీసింది.నీ ఒంట్లో ఫైర్ లేదు: విష్ణుఅందుకు రోహిణి.. వాళ్లు ఆడరు, ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారంది. ఇంకేం చూస్తావులే, దిగు అని విష్ణుప్రియకు చెప్పింది. దీంతో విష్ణుకు బీపీ వచ్చింది. నీది నువ్వు చూసుకో, నీ ఒంట్లో ఫైర్ లేదు, పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడకు. నువ్వు జీరో అని చీప్గా మాట్లాడింది. రోహిణి కూడా నువ్వే జీరో అనడంతో.. నీకన్నా ఎక్కువ వారాలున్నానంది. ఎందుకున్నావో నీకూ తెలుసు, నీ ప్లాన్ వర్కవుట్ అయింది, అందుకే ఉన్నావని రోహిణి ఉన్నమాట అనేసింది. విష్ణు బండారం బట్టబయలుదీంతో విష్ణు.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని నోరు జారింది. ఆ మాటతో రోహిణి.. ఫస్ట్ నిఖిల్కు ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే కదా చెప్పావు అని తన బండారం బయటపెట్టేసింది. ఈ గొడవ చల్లారాక విష్ణుప్రియను తోసేసి పృథ్వీ గెలిచాడు. టాస్క్ అయ్యాక విష్ణు.. రోహిణితో మళ్లీ వాదనకు దిగింది. తనే ఒప్పని నిరూపించుకోవాలని చూసింది. కానీ తన దగ్గర పప్పులు ఉడకనివ్వలేదు రోహిణి. నోరు అదుపులో పెట్టుకోఫైర్ లేదు, జీరో, క్యారెక్టర్ అంటూ నోరు జారుతున్నావ్.. నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించింది. అనంతరం తెడ్డు మీద గ్లాస్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్లో రోహిణి గెలవగా పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా చివరి స్థానాల్లో ఉన్న యష్మి, విష్ణుప్రియను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్బాస్... పృథ్వీ, తేజ, రోహిణికి ఫైనల్ గేమ్ పెట్టాడు. సంచాలక్ కూడా గేమ్ ఆడింది!ఈ ఛాలెంజ్లో కంటెండర్లు.. కుండను కిందపడకుండా చూసుకోవాలి. బజర్ మోగినప్పుడల్లా హౌస్మేట్స్లో ఒకరు.. మెగా చీఫ్ అవకూడదనుకుంటున్న కంటెస్టెంట్ కుండలో రెండుసార్లు ఇసుక పోయాల్సి ఉంటుంది. ఈ గేమ్లో యష్మి సంచాలక్గా వ్యవహరించింది. సంచాలక్ అయినప్పటికీ మధ్యమధ్యలో తను వెళ్లి అందరి కుండలు బ్యాలెన్స్ చేస్తానంటూ కేవలం రోహిణి కుండలోనే పదేపదే ఇసుక పోయడం గమనార్హం.రోహిణి ఎమోషనల్ఈ గేమ్లో అద్భుతంగా ఆడిన రోహిణి.. తేజ, పృథ్వీలను మట్టికరిపించింది. ఫ్రాక్చర్ అయిన కాలుతో రెండున్నర గంటలపాటు కుండను బ్యాలెన్స్ చేసింది. నేను మెగా చీఫ్ అయ్యాను.. ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడ్చేసింది. ఇక టాస్క్ మధ్యలో రోహిణిని నిఖిల్ పొగుడుతుంటే అవసరమా? అంటూ కన్నెర్రజేసిన విష్ణు.. చివర్లో మాత్రం నువ్వు హీరో అని అరవడం డ్రామాలాగే కనిపించింది.బాధలో పృథ్వీఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయినందుకు పృథ్వీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇక చివరి మెగా చీఫ్ అయిన రోహిణి కోసం బిగ్బాస్ శివంగివే.. పాట ప్లే చేశాడు. బాడీ షేమింగ్ చేసిన పృథ్వీపై, జీరో అని హేళన చేసిన విష్ణుప్రియపై రోహిణి పైచేయి సాధించి తన సత్తా చూపించింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి
హౌస్లో చివరిసారి చీఫ్ అయ్యేందుకు యష్మి, తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి బాగానే కష్టపడుతున్నారు. వీరికి బిగ్బాస్ నేడు ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటోలో చివరి వరకు ఉన్నవారికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. టాస్క్ మొదలైందో, లేదో.. రోహిణిని తోసేయ్ అని విష్ణు పృథ్వీకి ఆర్డర్ వేసింది. అయితే అందరికంటే ముందు తేజ అవుట్ అయ్యాడు. తర్వాత రోహిణిని తోసేశారు. అందర్నీ తోసేసిన ప్రేమపక్షులుమీ ముగ్గురిలో ఎవరు ఎవర్ని తోసుకుంటారో చూస్తానని రోహిణి సవాల్ చేసింది. ఏముంది? ప్రేమపక్షులిద్దరూ కలిసి యష్మి అడ్డు తొలగించారు. నిన్ను తోయకుండా సపోర్ట్ చేశానంటూ ఏడ్చేసింది. ఇది గేమ్, ఎమోషనల్ అవకు అని పృథ్వీ అనడంతో యష్మి.. గ్రాటిట్యూడ్ ఉంది, సపోర్ట్ చేస్తానని ఎందుకన్నావ్? అంటూ నిలదీసింది. నన్నెలా పుష్ చేశావో ఇప్పుడు తనను (విష్ణును) తోసేసి పాయింట్లు తీసుకో అని ఛాలెంజ్ చేసింది. అందుకు రోహిణి.. వాళ్లెందుకు ఆడతార్రా గేమ్ అంది.నోరు జారిన విష్ణుదాంతో విష్ణు.. ఇందాక నుంచి మాట్లాడుతున్నావు.. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని నోరు జారింది. ఆ మాటతో రోహిణిలో కోపం కట్టలు తెంచుకుంది. ఫస్ట్ నిఖిల్కు ట్రై చేశా.. అవలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అన్నావు.. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? అంటూ విష్ణు బండారం బయటపెట్టింది.నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతన గుట్టు రట్టవడంతో బిత్తరపోయిన విష్ణు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. అంతా అయ్యాక కూడా మళ్లీ రోహిణితో మాట్లాడటానికి వెళ్లింది. అక్కడ కూడా లేని పాయింట్లు చెప్పడంతో రోహిణి.. క్యారెక్టర్ గురించి ప్రస్తావించావు.. ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చింది. నేనేదీ క్రియేట్ చేయలేదు, నువ్వు చెప్పిందే అక్కడ మళ్లీ చెప్పాను అంటూ ఇచ్చిపడేసింది. చదవండి: Bigg Boss 8.. ఇన్నాళ్లు ఎలాగోలా మిస్... ఈసారి మాత్రం తప్పదేమో! -
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్కార్డ్స్ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే?
బిగ్బాస్ ప్రతి సీజన్లో కెప్టెన్ అనే పదవి ఉండేది. ఈ పదవి పొందినవారు ఆ వారం నామినేషన్స్లోకి అడుగుపెట్టరు. అయితే ఈ సీజన్లో కెప్టెన్ పోస్టు ఉండదన్నాడు బిగ్బాస్.. కానీ అంతలో చీఫ్ అనే కొత్త పదవిని తీసుకొచ్చాడు. అయితే దీని ఉద్దేశం కూడా అదే! చీఫ్ అయినవారు ఆ వారం నామినేషన్స్లో ఉండరు. చివరి ఇమ్యూనిటీ ప్రస్తుతం హౌస్లో ఉన్నవారిలో నిఖిల్, యష్మి, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, గౌతమ్, నబీల్ అంతా కూడా ఒకసారి చీఫ్ అయినవాళ్లే! తేజ, రోహిణి, పృథ్వీలకే ఇంతవరకు ఆ అవకాశం దక్కలేదు. ఇకపోతే బిగ్బాస్ తాజాగా హౌస్లో చీఫ్ పదవి కోసం పోటీపెట్టాడు. అయితే ఇది ఈ సీజన్లోనే చివరి చీఫ్ పోస్ట్ అని ప్రకటించాడు. దాంతో ఎలాగైనా దాన్ని గెలిచి ఒక్క వారమైనా ఇమ్యూనిటీ అందుకోవాలని కంటెస్టెంట్లు తెగ తహతహలాడారు.చీఫ్గా రోహిణి!బిగ్బాస్ సమయానుసారం టీషర్టు విసిరేస్తుంటాడు. తమ టీషర్ట్ను ఎవరైతే కాపాడుకుని బొమ్మకు తగిలిస్తారో వారే విజేతలుగా నిలుస్తారన్నాడు. ఈ గేమ్లో యష్మి, విష్ణుకు గొడవైనట్లు తెలుస్తోంది. యష్మి, రోహిణి, పృథ్వీ, విష్ణు, తేజ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. హౌస్మేట్స్ మద్దతుతో రోహిణి చీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలాగో నామినేషన్స్లో లేదు, వచ్చేవారం చీఫ్ పోస్టుతో మరోసారి సేవ్ అయిపోయింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు నువ్వు కావాలి, అవసరమైతే లేపుకెళ్లిపోతా: నిఖిల్
హౌస్మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్బాస్. ఈ క్రమంలో ఫస్ట్ లవ్స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరికొందరు ఎమోషనలయ్యారు. ముందుగా యష్మి మాట్లాడుతూ.. నేను టీవీ యాంకర్గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండయ్యాడు.. తర్వాత ప్రేమించుకున్నాం. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఒప్పుకోలేకపోతున్నా..ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఈరోజుకూ ఆయన నాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను. కానీ ఈరోజుకూ నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్గా ఉన్నాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అని యష్మి భావోద్వేగానికి లోనైంది.బాగోలేనని బ్రేకప్: తేజతేజ మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాం. ఓసారి ఇంటికెళ్లి రాగానే బ్రేకప్ చెప్పింది. తన పక్కన నేను బాగోలేనని వాళ్ల పేరెంట్స్ వద్దన్నారట! ఆమె పెళ్లికి కూడా వెళ్లాను. ఓసారి ఆమె సడన్గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా.. మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా అని బిగ్బాస్ షో సాక్షిగా మాటిచ్చాడు.పృథ్వీ లవ్ స్టోరీపృథ్వీ.. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరం ట్రై చేసుకుందాం, ఎవరికి పడితే వాళ్లకే ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం. ఓసారి ఆమె దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్తే నీ పేరేంటి? అని అడిగింది. కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు.. అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది. తర్వాత ఆమె నా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు మెసేజ్లు చేసింది.మోసం చేశాడు: రోహిణిఓరోజు ప్రపోజ్ కూడా చేసింది. అంతా బాగానే సాగింది. త్వరగా పెళ్లి చేసుకుందామంది. నా కెరీర్ నాకు ముఖ్యం, పెళ్లికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు. రోహిణి.. డైమండ్ రింగ్తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి క్లియర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నాడు. సరేనన్నాను. కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనలైంది.నా భార్య అని ఫిక్సయ్యా: నిఖిల్నిఖిల్ వంతు రాగా.. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే ఈ అమ్మాయి నా సొంతం అనిపించింది. అన్ని ప్రేమకథల్ని మరిపించేలా చేసింది. మాది ఆరేళ్ల రిలేషన్.. తను నా భార్య అని ఫిక్సయిపోయాను. కానీ ఫ్యామిలీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. ఈ జన్మకు సరిపోయేటన్ని జ్ఞాపకాలనిచ్చింది. తిట్టు, కొట్టు..కోపంలో విడిపోయాం.. కానీ నా వల్ల కావట్లేదు. కచ్చితంగా తన దగ్గరకు వెళ్తా.. తిట్టు, కొట్టు, నువ్వు మళ్లీ ఒప్పుకునేవరకు నీ వెంటపడ్తాను. నాకు పిచ్చి లేసిందంటే మాత్రం లేపుకెళ్తాను. బిగ్బాస్ షో అయిపోగానే నీ కళ్ల ముందుంటాను. బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వూ అలాగే దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణు గెలవాలన్న శివాజీ.. గౌతమ్పై పంచులు
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.మరోసారి ఫ్యామిలీస్..ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది. గౌతమ్పై శివాజీ పంచులుగౌతమ్ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్లో ఉన్నవారికి కూడా గేమ్పై ఓ క్లారిటీ రానుంది. చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు -
రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ!
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. మరో నెల రోజుల్లోపే బిగ్ గేమ్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. గత రెండు నెలలుగా బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్ 11వ వారానికి చేరుకుంది. గతవారంలో వెల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హరితేజ ఎలిమినేట్ అయింది. ఇక మరోవారం మొదలైందంటే చాలు నామినేషన్ల గొడవే. ఆ రోజంతా ఒకరిపై ఒకరు చిన్నపాటి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అలా ఈ వారంలో గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేషన్స్లో నిలిచారు.ఇవాల్టి ఎపిసోడ్లో హౌస్ను కాస్తా ఎమోషనల్గా మార్చేశాడు బిగ్బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రారంభంలోనే టేస్టీ తేజ ఫుల్ ఎమోషనల్గా కనిపించాడు. నేను ఏడిస్తే మా అమ్మకు నచ్చదు అంటూ ఆమెను తలచుకుని ఏడుస్తూ.. కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత కంటస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ను హౌస్లోకి పంపించారు. రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్బాస్. ఆమె కుమారుడితో పాటు రోహిణి వాళ్ల అమ్మను హౌస్లోకి పంపించారు. అక్కడికెళ్లిన రోహిణి కుమారుడితో బిగ్బాస్ కంటెస్టెంట్స్ అందరూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమోను రిలీజ్ చేశారు. 💖 An Adorable Surprise for Rohini! 💖Bigg Boss house fills with warmth as Rohini receives an unforgettable, adorable surprise! Watch her heart-melting reaction to this sweet moment! ❤️#BiggBossTelugu8 #StarMaa #Nagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/ay1nLZdkdA— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 12, 2024 -
యష్మి, నిఖిల్ను బుక్ చేసిన తేజ.. దమ్ము లేదంటూ రెచ్చగొట్టిన పృథ్వీ
కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోందిముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు. దమ్ము లేదుఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.తల్లికి తేజ క్షమాపణలుదీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్మేట్స్కు థాంక్యూ చెప్పాడు. వరస్ట్ ప్లేయర్ అంటూతర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్ను నామినేట్ చేశాడు.మాట తప్పావ్రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హరితేజ ఎలిమినేట్.. నిఖిల్ సహా ఆ నలుగురు మాస్క్ తీయాల్సిందే!
ఈరోజు హౌస్ జంబలకిడిపంబగా మారిపోయింది. వాళ్లు వీళ్లయ్యారు, వీళ్లు వాళ్లయ్యారు. అదేనండి.. ఆడాళ్లు మగాళ్ల గెటప్లోకి. మగాళ్లు ఆడాళ్ల గెటప్లోకి మారిపోయారు. వీరినలా చూస్తుంటేనే ప్రేక్షకులు పడీపడీ నవ్వడం ఖాయం. అలా ఉన్నాయి ఒక్కొక్కరి అవతారాలు.. పైగా ఒకరి పాత్రల్లో మరొకరు లీనమై నటించారు. ముఖ్యంగా ప్రేరణ.. నిఖిల్గా నటించి అదరగొట్టేసింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..ఐటం సాంగ్నాగ్.. ప్రేరణ, గౌతమ్ను సేవ్ చేశాడు. తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజీపైకి వచ్చాడు. వచ్చీరావడంతోనే ఆడవేషంలో ఉన్న మగవారికి ఐటం సాంగ్ చేసే టాస్క్ ఇచ్చాడు. అలాగే మగవేషంలో ఉన్న ఆడపిల్లలు మాస్ పాటలకు చిందేయాలన్నాడు. పర్ఫామెన్స్ బట్టి మార్కులిస్తానన్నాడు. ఈ గేమ్లో నబీల్కు 6, రోహిణి, తేజ, విష్ణుప్రియకు 10, అవినాష్, ప్రేరణ, నిఖిల్, హరితేజలకు 9, యష్మికి 8, గౌతమ్కు 7 మార్కులిచ్చాడు. తేజ డ్యాన్స్కు ముచ్చెమటలుముఖ్యంగా తేజ పర్ఫామెన్స్కైతే వరుణ్తేజ్కు చెమటలు పట్టాయి. ఒక్కరు నవ్వకుండా ఉంటే ఒట్టు! ఆ రేంజ్లో ఉంది మనోడి పర్ఫామెన్స్. ఫైనల్గా ఈ గేమ్లో బాయ్స్ వేషంలో ఉన్న ఆడవారు గెలిచారు. అనంతరం వరుణ్ తన మనసుకు దగ్గరైనవారి గురించి మాట్లాడాడు. రామ్ చరణ్ తనకు సోదరుడని, ఏ సమస్య వచ్చినా అతడి దగ్గరకు వెళ్తానన్నాడు. నిహారిక కొడుతుందా?చిరంజీవి తన ఇన్స్పిరేషన్ అని, అల్లు అర్జున్ హార్డ్వర్కర్ అని, పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవన్నాడు. నిహారిక బెస్ట్ఫ్రెండ్ అని.. ఎప్పుడూ తనను కొడుతుందన్నాడు. తర్వాత సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం నాగ్ నిఖిల్ను సేవ్ చేశాడు. ఇకపోతే కొన్ని హ్యాష్ట్యాగులు ఇచ్చిన బిగ్బాస్ అవి ఎవరికి సెట్టవుతాయో చెప్పాలన్నాడు. ముందుగా తేజ.. ఎవరికోసం ఆలోచించకుండా పండ్లు తినేసిన గౌతమ్కు సెల్ఫిష్ ట్యాగ్ ఇచ్చాడు. బిల్లు మాఫీ చేయించిన నాగ్ఈ క్రమంలో హౌస్లో జరుగుతున్న దొంగతనం గురించి నాగ్ ఆరా తీశాడు. సూపర్ మార్కెట్లో హౌస్మేట్స్ కొన్ని వస్తువులు దొంగతనం చేశారు. అందుకుగానూ బిగ్బాస్ రూ.1,85,000 బిల్లు వేశాడు. అసలు ఏమేం దొంగిలించారనేది నాగ్ వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అయితే చిన్నచిన్న దొంగతనాలను చూసీ చూడనట్లు వదిలేయమని, ఆ బిల్లును ప్రైజ్మనీలో నుంచి కట్ చేయొద్దని నాగ్ బిగ్బాస్ను అభ్యర్థించడం విశేషం.అవినాష్ కట్టప్పహ్యాష్ట్యాగుల గేమ్ విషయానికి వస్తే.. విష్ణుప్రియ.. ప్రేరణ టేప్రికార్డర్ అని, హరితేజ.. తేజ లేజీబాయ్ అని, నబీల్.. ప్రేరణకు ఇగో ఎక్కువ, యష్మి.. అవినాష్ కట్టప్ప (వెన్నుపోటు), అవినాష్.. విష్ణుప్రియ ఓవర్ డ్రమటిక్, గౌతమ్.. ప్రేరణ కంట్రోల్ ఫ్రీక్, రోహిణి.. అవినాష్ అటెన్షన్ సీకర్, ప్రేరణ.. గౌతమ్ ఇరిటేటింగ్, పృథ్వీ.. నిఖిల్ ఇమ్మెచ్యూర్, నిఖిల్.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని పేర్కొన్నారు. తర్వాత విష్ణు, పృథ్వీ సేవ్ అయ్యారు.హరితేజ ఎలిమినేట్చివరగా హరితేజ, యష్మి మాత్రమే మిగిలారు. నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడగ్గా అతడు ఇప్పుడు వాడనని తేల్చిచెప్పాడు. దీంతో నాగ్ యష్మిని సేవ్ చేసి హరితేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. హరితేజ వెళ్లిపోతుంటే విష్ణుప్రియ వెక్కివెక్కి ఏడ్చింది. చివర్లో హరితేజ.. హౌస్లో ఎవరు మాస్కులు తీసేస్తే బెటరో చెప్పాలన్నాడు. ఐదుగురు మాస్క్ తీయాల్సిందే!అవినాష్, రోహిణి మాస్కు తీసేయాలని అభిప్రాయపడింది. తేజ.. రూల్స్ చెప్పడమే కాకుండా పాటించాలని సూచించింది. ప్రేరణ మంచి అమ్మాయే కానీ కొన్ని చెడు లక్షణాల వల్ల తన మంచి కనడకుండా పోతుందని తెలిపింది. నిఖిల్.. తన ఎమోషన్స్ బయటకు చూపించాలన్నాడు. అలా ఈ ఐదుగురు మాస్క్ తీసేస్తే బెటర్ అని చెప్పింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తేజకు దారుణమైన పనిష్మెంట్.. త్యాగానికి రోహిణి రెడీ!
టేస్టీ తేజకు దెబ్బమీద దెబ్బ పడింది. ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో అతడు చేసిన తప్పిదం వల్ల వచ్చేవారం కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. అటు హౌస్మేట్స్ వల్ల తన ఫ్యామిలీ హౌస్లోకి వచ్చే ఆస్కారమే లేదట.. అదెలాగో నేటి ఎపిసోడ్ (నవంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..సిగ్గు లేకుండా..మెగా చీఫ్ ప్రేరణ మాట ఎవరూ వినడం లేదు. పెండింగ్లో ఉన్న పని చేయమంటే విష్ణు కస్సుబుస్సులాడుతుంది. సీతాఫలం తినొద్దు అని చెప్పినా ఉన్న ఒక్కదాన్ని లటుక్కుమని గౌతమ్ ఆరగించేశాడు. వద్దని చెప్పినా ఎలా తిన్నావు? సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావని గౌతమ్పై ఫైర్ అయింది. అటు స్వీట్లు తినను అని బిగ్బాస్కు మాటిచ్చిన నబీల్.. హల్వా తిని ఆ నియమాన్ని ఉల్లంఘించాడు.తేజకు శిక్షఇక నాగార్జున వచ్చీరావడంతోనే ఎవిక్షన్ షీల్డ్ గేమ్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమైన తేజను వాయించాడు. నీకంటే ముందు వచ్చిన జంటలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. నువ్వు మాత్రం యష్మితో కలిసి ఒక అభిప్రాయానికి రాకుండా నీకు నచ్చింది చేశావని సీరియస్ అయ్యాడు. అతడు చేసిన తప్పుకుగానూ వచ్చేవారం చీఫ్ కంటెండర్వి కాలేవని శిక్ష విధించాడు.ఎవిక్షన్ షీల్డ్ ఎవరికివ్వాలో డిసైడ్ చేసిన ప్రేరణఇక ఎవిక్షన్ షీల్డ్ రేసులో మిగిలిన రోహిణి, నబీల్, నిఖిల్లలో ఎవరికి ఆ షీల్డ్ ఇవ్వాలో హౌస్మేట్స్ డిసైడ్ చేయాలన్నాడు. ఈ క్రమంలో రోహిణికి ప్రేరణ, గంగవ్వ, తేజ సపోర్ట్ చేయగా నిఖిల్కు హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ సపోర్ట్ చేశారు. నబీల్కు గౌతమ్, యష్మి, అవినాష్ మద్దతిచ్చారు. ముగ్గురికీ సమాన ఓట్లు పడటంతో చీఫ్ ప్రేరణపై భారం వేశారు. ఆమె నబీల్కు సపోర్ట్ ఇవ్వడంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ అందుకున్నాడు.అంతరాత్మపై ఒట్టేసి..అనంతరం నాగార్జున.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తూ.. నీపై నువ్వు ప్రమాణం చేసుకుని ఈ సీజన్లో వరస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పాలన్నాడు. మొదటగా నబీల్.. తన ఫోటోపై ఒట్టేసి విష్ణుప్రియను వరస్ట్ ప్లేయర్గా పేర్కొన్నాడు. నిఖిల్.. తప్పు చేసినా రుబాబు చూపిస్తాడు, వెటకారం ఎక్కువ అంటూ తేజ వరస్ట్ ప్లేయర్ అన్నాడు. హరితేజ, యష్మి.. రోహిణిని, గౌతమ్, తేజ.. పృథ్వీని, అవినాష్.. హరితేజను, రోహిణి, గంగవ్వ.. యష్మిని, విష్ణుప్రియ, పృథ్వీ.. తేజను చెత్త ప్లేయర్ అని పేర్కొన్నారు. తేజకు కోలుకోలేని దెబ్బప్రేరణ.. గెలవాలన్న ఆసక్తి లేదంటూ విష్ణుప్రియ వరస్ట్ ప్లేయర్ అని తెలిపింది. వరస్ట్ హౌస్మేట్స్ అని ఎక్కువ ఓట్లు పడ్డ వ్యక్తికి ఫ్యామిలీ వీక్లో వారి కుటుంబసభ్యులు రాబోరని నాగ్ బాంబు పేల్చాడు. ఈ సీజన్లో తేజను వరస్ట్ ప్లేయర్గా డిసైడ్ చేశారు. కేవలం తల్లిని తీసుకురావడానికే ఈ సీజన్కు వచ్చాను సర్ అంటూ తేజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశాడు.గంగవ్వ ఎలిమినేట్దీంతో రోహిణి.. నా ఫ్యామిలీకి బదులుగా నీ కుటుంబసభ్యులు రావాలని బిగ్బాస్ను అభ్యర్థిస్తానంది. అటు గంగవ్వ ఆరోగ్యం గురించి నాగ్ ఆరా తీశాడు. ఆమె తన ఒళ్లంతా మంట లేస్తోందంటూ.. సంతోషంగానే ఉన్నాను కానీ చేతనవడం లేదని తెలిపింది. దీంతో ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. గంగవ్వ వెళ్లిపోతుంటే రోహిణి, తేజ గుక్కపెట్టి ఏడ్చారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియకు చుక్కలు చూపిస్తున్న ప్రేరణ.. బలైపోయిన తేజ!
ఎన్నాళ్లనుంచో చీఫ్ పోస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రేరణ కల ఎట్టకేలకు సాకారమైంది. మెగా చీఫ్ పదవిని అధిరోహించింది. అలా డ్యూటీ ఎక్కిందో లేదో తన పనితనం మొదలుపెట్టేసింది. అప్పుడే విష్ణుప్రియకు చుక్కలు చూపించేస్తోంది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేయండి..మాట తప్పాడన్న కోపంతో..మెగా చీఫ్ గేమ్లో పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ముందుగానే డీల్ చేసుకున్నారు. కట్ చేస్తే నబీల్ను ఓడించమని నిఖిల్కు సూచించాడు పృథ్వీ. చేసిందంతా చేశాక తాను అలా అనలేదని మాట మార్చాడు. తను ఓడిపోవడంతో నబీల్ కూడా పృథ్వీని ఓడించాలని డిసైడయ్యాడు. ఈ క్రమంలో అతడు కూర్చున్న బాక్స్లో మూటలు వేశాడు. అయితే అవి తన మీద పడటం, అలాగే ఇచ్చిన మాట తప్పాడన్న కోపంతో పృథ్వీ.. నబీల్పై సీరియస్ అయ్యాడు. ఈ రౌండ్లో పృథ్వీ ఓడిపోయాడు.ప్రేరణ మెగా చీఫ్చివర్లో ప్రేరణ, రోహిణి ఇద్దరే మిగిలారు. విష్ణు, గంగవ్వ, అవినాష్, తేజ.. రోహిణికి సపోర్ట్ చేయగా మిగతా అందరూ ప్రేరణకు మద్దతిచ్చి ఆమెను చీఫ్ చేశారు. ఇకపోతే హరితేజ హౌస్లో ఉన్నవారందరిపైనా హరికథ చెప్పి అలరించింది. అనంతరం మెగా చీఫ్ అయిన ప్రేరణ మొదట విష్ణునే టార్గెట్ చేసినట్లు ఉంది. విష్ణును కప్బోర్డ్ ఖాళీ చేయమందట.. అలాగే విష్ణు బెడ్ దగ్గరున్న సామాను నీట్గా పెట్టుకోమని చెప్పింది. ఆమె వినకపోవడంతో ప్రేరణ వెళ్లి సర్దింది. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా సరిగా చేయడం లేదని విష్ణును తప్పు పట్టింది.పాము- ఎగ్స్బిగ్బాస్ ఎవిక్షన్ షీల్డ్ను ప్రవేశపెట్టాడు. సమయానుసారం ఆకలిగా ఉన్న పాముకు గోల్డెన్ ఎగ్స్ ఇవ్వాలన్నాడు. ఎవరికి చెందిన గోల్డెన్ ఎగ్ పాముకు ఆహారమవుతుందో వారు ఎవిక్షన్ షీల్డ్కు దూరమవుతారు. మెగా చీఫ్ ప్రేరణ.. ఎవిక్షన్ షీల్డ్ రాకూడదనుకున్న ఐదుగురి ఎగ్స్ పాముకు ఆహారంగా పెట్టాలన్నాడు. అలా విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజ ఫోటోలున్న ఎగ్స్ను పాము నోట్లో వేసింది.అవినాష్పై ఎగిరెగిరి పడ్డ యష్మిఅనంతరం.. అవినాష్, నబీల్ను పిలిచి ఒక ఎగ్ను పాము నోట్లో పెట్టమన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయంతో యష్మి ఎగ్ తొలగించారు. అందుకు కారణం చెప్పమని యష్మి అడగ్గా.. నువ్వు వీక్ కాబట్టే నబీల్ నీకు సూట్కేస్ ఇచ్చాడు. అయినా ఈ వారం నీకు వచ్చిన అవకాశం సరిగా వాడుకోలేదని అవినాష్ అన్నాడు. ఆ మాటతో యష్మికి కోపం కట్టలు తెంచుకుంది. అందరూ అన్ని గేమ్స్ గెలవరు, స్ట్రాంగ్ ఉన్నవాళ్లు కూడా చాలా గేమ్స్లో ఓడిపోయారు.. నన్ను వీక్ అంటూ డీమోటివేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.నిఖిల్ గేమ్ను అడ్డుకున్న గౌతమ్నిఖిల్, గౌతమ్ వంతు రాగా నిఖిల్ త్యాగం చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు గౌతమ్ ఒప్పుకోలేదు. ప్రేరణ ఎగ్ తీసేద్దామంటే నిఖిల్ ఒప్పుకోడు. చివరకు ఇద్దరూ కలిసి తేజను బలి చేశారు. విష్ణుప్రియ, పృథ్వీ వంతురాగా.. ప్రేరణ ఎగ్ తీసేశారు. తర్వాత రోహిణి, హరితేజ వంతు వచ్చింది. నిఖిల్ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నాడని రోహిణి అంటుంటే హరితేజ మాత్రం నామినేషన్స్లోకి రావట్లేదంటూ అవినాష్ను తీసేద్దామంది. అందుకు రోహిణి ఒప్పుకోలేదు. అటు హరితేజ కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితిలో రోహిణి.. అవినాష్ ఎగ్ను పాము నోట్లో వేసింది.తేజ చేసిన పనికితేజ, యష్మి వంతు వచ్చింది. యష్మి.. ఎఫర్ట్స్ కనిపించడం లేదంటూ రోహిణి పేరు చెప్పగా తేజ.. నబీల్, నిఖిల్లో ఎవరైనా ఓకే అన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తేజ.. నబీల్, రోహిణి, నిఖిల్ అభిప్రాయాలు అడిగాడు. తనకు అక్కర్లేదని నిఖిల్ క్లియర్గా చెప్పడంతో మరో సెకన్ ఆలోచించకుండా అతడి ఎగ్ను పాము నోట్లో వేశాడు.నబీల్కు ఎవిక్షన్ షీల్డ్అది చూసిన యష్మి.. కావాలని రోహిణి ఎగ్ కూడా వేసేసింది. దీంతో నిఖిల్, పృథ్వీ, హరితేజ, విష్ణు.. అందరూ తేజపై పడి అరిచారు. ఏకాభిప్రాయానికి రాకుండా ఎగ్ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. కానీ ఏ ఒక్కరూ యష్మి ఎగ్ వేయడాన్ని తప్పుపట్టలేదు. చివర్లో నబీల్ ఎగ్ మాత్రమే మిగిలి ఉండటంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ గెలుపొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్ స్ట్రాటజీ అదే..! గెలవాలంటే వదులుకోవాల్సిందే!
ఎవిక్షన్ షీల్డ్ గేమ్ను బిగ్బాస్ మెగా ఛీఫ్ ప్రేరణతో మొదలుపెట్టాడు. షీల్డ్ అందుకోవడానికి అనర్హులైన ఐదుగురిని గేమ్లో నుంచి తీయాలన్నాడు. గేమ్లో ఎవరు ఉండకూడదనుకుంటున్నారో వారి ఎగ్స్ను పాము నోట్లో పెట్టాల్సి ఉంటుంది. దీంతో ప్రేరణ... విష్ణుప్రియ, పృథ్వీ, గంగవ్వ, హరితేజ, గౌతమ్లను సైడ్ చేసింది.ప్రేరణ జోలికొస్తే విష్ణును తీసేస్తానన్న పృథ్వీఅనంతరం హౌస్మేట్స్ను జంటలుగా పిలిచి.. వాళ్లు ఎవర్ని తీసేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ కంటెస్టెంట్ ఎగ్ను పాము నోట్లో వేయమన్నాడు. అలా విష్ణుప్రియ, పృథ్వీని పిలిచాడు. విష్ణు.. ప్రేరణను తీసేద్దామనడంతో పృథ్వీ సరేనని తలాడించాడు. ఇక హరితేజ- రోహిణి వంతు వచ్చింది. హరితేజ.. అవినాష్ను తీసేయాలనుకుంటున్నట్లు చెప్పింది. నిఖిల్ను తీసేద్దామన్న రోహిణిఅయితే రోహిణి.. నిఖిల్ తనంతట తానుగా అవుట్ అయ్యేందుకు రెడీ ఉన్నప్పుడు ఆ పని మనమే చేసేస్తే అయిపోతుందిగా అని తన అభిప్రాయం చెప్పింది. అది హరితేజకు మింగుడుపడలేదు. అటు యష్మి-తేజ సైతం ఎవర్ని తీసేయాలన్నదాని గురించి ఏకాభిప్రాయానికి రాలేదు. ఇక నిఖిల్ తనను తీసేయమని చెప్పడానికి ప్రత్యేక కారణం ఉంది. ఎవిక్షన్ పాస్ వల్ల సేవ్ అవడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదు. నిఖిల్ ప్లాన్ అదేనామినేషన్స్లో ఉంటేనే తనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుందని.. అది తన విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నాడు. అందుకే ఎవిక్షన్ షీల్డ్తో తనను తాను కాపాడుకోవడానికి సుముఖత చూపించడం లేదు. ఒకవేళ నిజంగా ఆ షీల్డ్ గెలుచుకున్నా తనకోసమైతే వాడుకోనని.. వేరేవారికోసమే ఉపయోగిస్తానని స్పష్టంగా చెప్పేశాడు. చదవండి: బిగ్బాస్ 8.. డేంజర్ జోన్లో ఆమె.. వేటు పడటం గ్యారంటీ! -
వాళ్లతో ఒకలా.. రోహిణితో మరోలా.. హర్టయిన లేడీ కమెడియన్
శనివారం నాడు హౌస్మేట్స్కు క్లాసులు పీకే నాగార్జున ఆదివారం రాగానే వారితో గేమ్స్ ఆడిస్తాడు. ఫన్నీ టాస్కులు, డ్యాన్సు స్టెప్పులతోనే ఎపిసోడ్ అంతా భలే గమ్మత్తుగా సాగుతూ ఉంటుంది. ఎలిమినేషన్ అంటారా? షూటింగ్ ఒకరోజు ముందే అయిపోవడంతో ఎలిమినేట్ అయ్యిందెవరనేది ఆల్రెడీ లీకైపోయి ఉంటుంది. హౌస్లోకి కన్నీళ్ల కడవ ఎత్తుకొచ్చిన నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయింది.హుషారైన డ్యాన్స్ఇకపోతే ఫండే ఎపిసోడ్కు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు రిలీజవగా అందులో గౌతమ్ హుషారుగా అందరితో కలిసి డ్యాన్స్ వేశాడు. యష్మి, హరితేజతో యమ హుషారుగా స్టెప్పేసిన గౌతమ్ తనతో మాత్రం అంత జోష్గా డ్యాన్స్ చేయలేదని హర్టయింది రోహిణి. దీంతో నాగ్.. అక్కతో ఫీలింగ్ వేరే ఉంటుందిలే అని సెటైర్ వేశాడు. మొత్తానికి నిన్న కంటెస్టెంట్ల ఫేసులు మాడిపోగా ఈ రోజు టాస్కుల వల్ల ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎంటర్టైనర్లు ఉట్టి జోకర్లేనా? విన్నర్గా పనికి రారా?
రియాలిటీ షో అంటేనే రియల్/నిజ స్వరూపం చూపించడం. ఎలా ఉంటున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం? భావోద్వేగాలను ఎలా నియంత్రించుకుంటున్నాం? ఇలా అన్నీ తెల్లకాగితంలా జనాలకు చూపించాలి. నచ్చినవాళ్లు ఓటేస్తారు, నచ్చనివాళ్లు లెక్క చేయరు .రియల్ ఎంటర్టైనర్స్ఎలాంటి ముసుగు లేకుండా స్వచ్ఛంగా ఉంటూ నలుగుర్ని నవ్వించేవారే రియల్ ఎంటర్టైనర్స్! కానీ ఇప్పటివరకు తెలుగు బిగ్బాస్ చరిత్రలో ప్రేక్షకుల్ని నవ్వించి కప్పు ఎగరేసుకుపోయినవాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. టాస్కులు ఆడినవారు లేదా సింపతీ సాధించినవారు, ఆల్రెడీ ఫ్యాన్బేస్ ఉన్నవాళ్లే విజేతలుగా నిలుస్తూ వస్తున్నారు తప్ప కమెడియన్లు కప్పు అందుకున్న దాఖలాలే లేవు. ఆ ఒక్కటి లేకపోతే అసంపూర్ణమే!అసలు వీళ్లు లేకపోతే బిగ్బాస్ షోనూ ఎవరూ పట్టించుకోరు. అన్నీ ఉన్నా వినోదం లేకపోతే అది సంపూర్ణంగా ఉండదు. అందుకే ఈ సీజన్లో రీలోడ్ పేరిట వైల్డ్కార్డ్స్ను దింపారు. ఇందులో ఎంటర్టైనర్స్ రోహిణి, అవినాష్, తేజ ఉన్నారు. ఫిజికల్ టాస్కులే కాకుండా బుర్రకు పదునుపెట్టే టాస్కుల్లోనూ ఒక అడుగు ముందే ఉన్నారు. వెనకాల గోతులు తవ్వడం, చాడీలు చెప్పడం, కావాలని గొడవపెట్టుకోవడం వంటి ఎన్నో అవలక్షణాలకు వీరు దూరంగా ఉన్నారు. ఈ లెక్కన విజేతగా నిలవడానికి ఆస్కారం ఉన్నవారు!టాప్ 5 మాత్రమేనా?కానీ రియాలిటీలో అది జరగడం లేదు. నిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వీడియో మెసేజ్లో నువ్వు టాప్ 5లో ఉండాలి అని తేజకు అతడి పేరెంట్స్ చెప్పారు. విన్నర్ అనకుండా టాప్ 5 అని ఎందుకన్నారు? అని తేజ అమాయకంగా రోహిణిని అడిగాడు. అప్పుడు రోహిణి కప్పు ఎలాగో రాదని తెలుసుగా.. అందుకే టాప్ 5 అన్నారు. మన పర్సనాలిటీలకు కప్పు రావురా.. ఏదో ఆడుకుంటూ వెళ్లిపోవడమే! నామినేషన్స్లో మేనరిజం చూపిస్తూ అరవడంలాంటివేమీ మనం చేయలేము అని చేదు సత్యాలను వివరించింది. కమెడియన్ విన్నర్ కాకూడదా?అందుకు తేజ.. ఎంటర్టైనర్లను ప్రేక్షకులు విన్నర్లుగా చూడరు అని అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కమెడియన్ విన్నర్ కాకూడదా? అన్న చర్చ మొదలైంది. జనాల్లోనూ ఈ ఆలోచన వస్తే ఎంటర్టైనర్లకు మంచి రోజులు వచ్చినట్లే! View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8: హౌస్మేట్స్కు దీపావళి సర్ప్రైజ్
గత వారం దీపావళి ప్రత్యేక ఎపిసోడ్లో హౌస్మేట్స్కు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు నాగ్. పేరెంట్స్ మాట్లాడిన వీడియోలను కంటెస్టెంట్లకు చూపించాడు. అయితే కొందరికే ఆ అవకాశాన్ని ఇచ్చాడు. మరికొందరిని నిరాశపర్చాడు. వారి బాధను అర్థం చేసుకున్న బిగ్బాస్ వాళ్లందరికీ ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు.ముందు ఆటపట్టించి..ఇంటి నుంచి వీడియో మెసేజ్లను ప్లే చేసి చూపించాడు. కానీ అంత ఈజీగా ఇవ్వలేదు. ముందుగా గార్డెన్ ఏరియాలో ఓ టెలిఫోన్ పెట్టి తనే కాల్ చేసి ఆటపట్టించి ఆ తర్వాత సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఏదైతేనేం.. ఇంటి నుంచి వచ్చిన వీడియోలు చూసి హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అడగకుండానే..తేజ, నబీల్, నయని కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి నేటి ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్గా సాగనుందని అర్థమవుతోంది. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు.. కానీ మీరు అడగకుండానే అన్నీ పెడతారంటూ చివర్లో హరితేజ బిగ్బాస్కు థాంక్యూ చెప్పింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మత్తువదలరా 2 : ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న.. రియా ఎక్కడ? (ఫొటోలు)
-
ప్రేరణపై పగ తీర్చుకున్నారు.. ప్రైజ్మనీని ఖాతరు చేయని నబీల్
నామినేషన్స్.. ఈసారి అన్నీ రివేంజ్ నామినేషన్సే పడ్డాయి. ప్రైజ్మనీ తగ్గినా తనకేం పర్వాలేదన్నట్లు ప్రవర్తించాడు నబీల్. ఇంతకీ నామినేషన్స్కు, ప్రైజ్మనీకి ఏం సంబంధం? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నామినేషన్స్ షురూఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఇద్దరు ఇంటిసభ్యుల దిష్టిబొమ్మలపై కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్బాస్ చెప్పాడు. నామినేషన్ షీల్డ్ ఎవరిదగ్గరైతే ఉంటుందో వారిని నామినేట్ చేసినప్పుడల్లా ప్రైజ్మనీలో నుంచి రూ.50 వేలు పోతాయని హెచ్చరించాడు. మెగా చీఫ్ గౌతమ్.. ఈ నామినేషన్ షీల్డ్ను హరితేజకు ఇచ్చాడు.పృథ్వీ మీద ప్రేమతో.. పోయినవారం తేజకు బదులుగా పృథ్వీని నామినేట్ చేయడం నచ్చలేదని పరోక్షంగా చెప్తూ ప్రేరణను నామినేట్ చేసింది విష్ణు. గేమ్ స్లో అయిపోతుందంటూ, లైటర్ కోసం పాయింట్ ఇవ్వడం నచ్చలేదని నిఖిల్ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టింది. అలాగైతే నువ్వు అందరికంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి పాయింట్ ఇచ్చేశావ్గా అని నిఖిల్ అనడంతో విష్ణు నీళ్లు నమిలింది. తర్వాత రోహిణి.. ఆటలో ఫిజికల్ అవడం నచ్చలేదని నిఖిల్ను నామినేట్ చేసింది. సెల్ఫిష్గా ఆలోచిస్తావ్, గేమ్లో అగ్రెసివ్ అవుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. బాడీ షేమింగ్పృథ్వీ.. పోయినవారం కిల్లర్ గర్ల్గా తనను నామినేట్ చేసినందుకు ప్రేరణ కుండ పగలగొట్టి తనపై ప్రతీకారం తీర్చుకున్నాడు. టాస్క్లో వీక్, ఆటలో జీరో.. నీకు రన్నింగ్ కూడా రావాలి, అది అంత ఈజీ కాదు అని రోహిణిని పై నుంచి కింది వరకు చూశాడు. తనను బాడీ షేమింగ్ చేయడంతో రోహిణికి చిర్రెత్తుకొచ్చింది. ఆ చూపేంటి? బాడీ షేమింగా? ఓవరాక్షన్ చేయకు.. తొక్కలో నామినేషన్స్ చేయకు అని ఇచ్చిపడేసింది.సెల్ఫిష్ గేమ్నయని పావని.. బ్యాటరీ టాస్కులో సెల్ఫిష్గా ఆడారంటూ మెహబూబ్, నిఖిల్ను నామినేట్ చేసింది. హరితేజ వంతురాగా.. ప్రేరణను నామినేట్ చేస్తూ కొంపలు మునిగాక రావడం మానేయమని సలహా ఇచ్చింది. సెల్ఫిష్గా ఆడావంటూ మెహబూబ్ను నామినేట్ చేసింది. ప్రైజ్మనీ తగ్గినా పర్లేదంటూ..నబీల్.. నన్ను ఇమ్మెచ్యూర్ అనడం నచ్చలేదు, అలాగే వేరేవాళ్ల పనుల్లో దూరకు అంటూ ప్రేరణ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టాడు. ప్రైజ్మనీలో నుంచి రూ.50 వేలు పోయినా పర్లేదంటూ హరితేజను నామినేట్ చేశాడు. మీకు డెసిషన్ తీసుకోవడం రావట్లేదు. అలాగే నాకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని నా సూట్కేస్ బయటపెట్టడం నచ్చలేదని కుండ పగలగొట్టాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ వంకర చూపులు.. బిగ్బాస్లో గలీజు ప్రవర్తన!
నలుగురు చూసే షోలో ఉన్నప్పుడు కాస్త ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిగ్బాస్ 8లో ఆడుతున్న పృథ్వీకి అలాంటి లక్షణాలు అసలు లేవనిపిస్తుంది. ఎందుకంటే గతవారం అవినాష్ భార్య గురించి చీప్ కామెంట్స్ చేశాడు. నామినేషన్స్లో ప్రేరణని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రోహిణితో గలీజుగా ప్రవర్తించాడు.(ఇదీ చదవండి: ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా)ఏడో వారం మణికంఠ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఎప్పటిలానే ఎనిమిదో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. దిష్టిబొమ్మకు కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్బాస్ చెప్పాడు. మణికంఠ విషయంలో మెహబూబ్కి పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సిందనే కారణంతో విష్ణుప్రియ.. నిఖిల్ని నామినేట్ చేసింది. ఫుడ్ విషయంలో ప్రేరణని కూడా నామినేట్ చేసింది. అనంతరం పృథ్వీని నామినేట్ చేసిన రోహిణి.. రూల్స్ అసలు వినట్లేదని, చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావని కారణాలు చెప్పింది. గతవారం జరిగిన ఓవర్ స్మార్ట్ గేమ్ గురించి ప్రస్తావించి కేబుల్ మొదట్లోనే మడతపెట్టి జేబులో పెట్టేస్తా ఎలా? అని ప్రశ్నించింది. అది నా స్ట్రాటజీ అని పృథ్వీ చెప్పడంతో.. అలాంటప్పుడు గేమ్ ఎక్కడ మొదలవుతుంది, గేమ్ ఆడకుండా స్ట్రాటజీ అంటే ఎలా? అని వరసగా సరైన కౌంటర్లు వేసేసరికి పృథ్వీ సైలెంట్ అయిపోయాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)తనవంతు వచ్చేసరికి రోహిణిని పృథ్వీ నామినేట్ చేశాడు. ఆటలో మీరు జీరో అనిపిస్తున్నారని కారణం చెప్పాడు. ఆటలో ఎఫర్ట్స్ పెట్టట్లేదా? అని రోహిణి అడిగితే.. అలా కాదని అన్నాడు. ఇదంతా చూస్తుంటే పృథ్వీ పగతో చేసిన నామినేషన్లా అనిపించింది తప్పితే సరైన కారణమే కనిపించలేదు. చివర్లో మాటామాటా పెరిగిన టైంలో రోహిణిని పై నుంచి కిందవరకు పృథ్వీ ఆదో రకంగా చూశాడు. అలా చూడటం నాకు నచ్చలేదని చెప్పి రోహిణి పెద్ద గొడవే పెట్టుకుంది.బిగ్బాస్ షోలో పృథ్వీ ప్రవర్తన రోజురోజుకీ దిగజారుతోంది. గతవారం అవినాష్తో మాట్లాడుతూ మీ భార్యనే షోకి పంపాల్సింది అనడం గానీ.. తను నామినేట్ అయ్యేలా చేసిందని చెప్పి ప్రేరణని మానసికంగా వేధించడం గానీ చూస్తుంటే పృథ్వీకి ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా అనిపిస్తుంది. అసలు ఇతడిని బిగ్బాస్ నిర్వహకులు ఇన్నాళ్లు ఎందుకు భరిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?) -
ముగ్గుర్ని బ్యాగులు సర్దమన్న నాగ్.. వాళ్లు పతనం, వీళ్ల ఎదుగుదల
నాలుగువారాలు చీఫ్గా కొనసాగిన నిఖిల్ ఈ వారం గేమ్లో కనిపించకుండా పోయాడు. అటు యష్మి హోటల్ టాస్క్ను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరిదే కాదు.. అందరి ఆట గురించి నాగ్ విశ్లేషించాడు. మరి ఆయన ఏమేం చెప్పాడో నేటి (అక్టోబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..రైజింగ్ స్టార్స్బిగ్బాస్ హోటల్ టాస్క్లో అవినాష్, తేజ దొంగతనంగా గులాబ్ జామ్ తిన్నారు. అందుకని నాగార్జున ఓ గిన్నె నిండా గులాబ్ జామ్స్ పంపించి అవి ఆ ఇద్దరితో మాత్రమే తినిపించాడు. ఇక హౌస్మేట్స్ ఆటను బట్టి వారిని రైజింగ్ స్టార్స్, ఫాలింగ్ స్టార్స్గా నాగ్ విభజించాడు. గంగవ్వ, మెహబూబ్, అవినాష్, రోహిణి, నాగమణికంఠ, నయని, యష్మి.. రైజింగ్ స్టార్స్ అని పేర్కొన్నాడు.నాతో గేమ్స్ద్దునువ్వు బచ్చా అన్నందుకు మణికంఠ ఫీలయ్యాడని నాగ్ రోహిణితో అన్నాడు. అయితే మణి మాత్రం.. నేను మరీ అంత ఫీల్ అవలేదన్నాడు. దీంతో నాగ్.. ఇప్పుడు కవరింగ్ చేయకు, నా దగ్గర ఆటలాడొద్దంటూ అతడి నోరు మూయించాడు. నువ్వు గేమ్ సీరియస్గా తీసుకోకపోతే నిన్ను ఆడియన్స్ కూడా సీరియస్గా తీసుకోరని విష్ణుప్రియకు మరోసారి గుర్తు చేశాడు. మణికంఠలో ఎనర్జీ, ఫన్ మరో లెవల్లో ఉందంటూ ఓ వీడియో చూపించాడు.తేజకు పనిష్మెంట్నబీల్, గౌతమ్, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, నిఖిల్, సీతలను ఫాలింగ్ స్టార్స్గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. నబీల్కు ఏదైనా సమస్య ఉంటే నేరుగా అందుకు కారణమైన వ్యక్తితోనే మాట్లాడాలన్నాడు. గతం గురించి ఆలోచించుకుంటే వర్తమానం మిస్ అయిపోతావ్ అని గౌతమ్కు సలహా ఇచ్చాడు. తేజ.. నయనిపావనిపై నోరు పారేసుకున్న వీడియోను ప్లే చేసి మరీ క్లాస్ పీకాడు. 10 పుషప్స్ తీయమని పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రేరణ వంతు రాగా ఆమె సగం రైజింగ్, సగం ఫాలింగ్ అని తెలిపాడు.అవినాష్ దృష్టిలో అతడు స్ట్రాంగ్ కాదట!ఇంట్లో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్ల బ్యాగుని ఎగ్జిట్ గేట్ దగ్గర పెట్టాలన్నాడు నాగ్. అయితే ఎవరి టీమ్లో నుంచి వాళ్లు కాకుండా.. అవతలి టీమ్లోని వారి పేర్లను మాత్రమే చెప్పాలన్నాడు. మొదటగా తేజ.. ఇంటి పనులు చేయట్లేదంటూ పృథ్వీ బ్యాగును పెట్టాడు. హరితేజ.. నబీల్కు క్లారిటీ తక్కువగా ఉందంది. అవినాష్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదంటూ నిఖిల్ బ్యాగు గేటు దగ్గర పెట్టాడు. గంగవ్వ.. మణి పేరును, రోహిణి.. ప్రేరణ, గౌతమ్.. సీత, మెహబూబ్.. పృథ్వీ పేర్లను సూచించారు. నయని.. విష్ణుప్రియలో ఇంప్రూవ్మెంట్ కనిపించలేదని పేర్కొంది.చివర్లో ముగ్గురి బ్యాగులుతర్వాత ఓజీ టీమ్సభ్యుల వంతు వచ్చింది. నాగమణికంఠ.. నా అంచనాలు అందుకోలేకపోయాడంటూ తేజ బ్యాగు ఎగ్జిట్ దగ్గర పెట్టాడు. సీత.. హోటల్ టాస్క్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ గౌతమ్ పేరు చెప్పింది. పృథ్వీ, యష్మి.. బాగా ఆడలేదని తేజను, నిఖిల్, నబీల్.. గౌతమ్ను, విష్ణుప్రియ, ప్రేరణ.. నయని పేర్లను సూచించారు. చివర్లో ఎక్కువ ఓట్లు పడ్డ పృథ్వీ, తేజ, గౌతమ్ బ్యాగుల్ని సర్దేసి స్టోర్ రూమ్లో పెట్టాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇక రేపటి ఎపిసోడ్లో సీత ఎలిమినేట్ కానుంది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణి హగ్గుల పిచ్చి.. ఈ చెండాలం చూడలేకున్నాం సామీ!
ప్రేక్షకులు సున్నిత మనస్కులు.. నిజ జీవితంలో ఎవరు ఎటు పోయినా పట్టించుకోరు కానీ స్క్రీన్పై ఎవరైనా కన్నీళ్లు పెట్టుకున్నా, గోడు వెల్లబోసుకున్నా ఇట్టే కరిగిపోతారు. పోనీ, అవి నిజమైన కన్నీళ్లేనా? మొసలి కన్నీళ్లా? అని కూడా ఆలోచించరు.సింపతీ గేమ్బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో కన్నీళ్లు పెట్టుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ మణికంఠ. ఒకసారి ఏడిస్తే ఓకే, రెండోసారికీ ఓకే.. కానీ మూడోసారి, నాలుగోసారి.. హుష్.. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుని పదేపదే ఏడుస్తుంటే హౌస్మేట్స్కు విసుగొచ్చింది. ఇతడేదో సింపతీ ట్రై చేస్తున్నాడని నామినేట్ చేశారు. కానీ ఆడియన్స్.. అతడి బాధకు చలించిపోయి సేవ్ చేసుకుంటూ వస్తున్నారు.హగ్గు కోసం నిస్సిగ్గుగా..భార్యాబిడ్డ కావాలంటూ కెమెరాల ముందు బోరున ఏడ్చేసిన ఇతడు హౌస్లో అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అసభ్యంగా ఉంటోంది. ఆ మధ్య యష్మి ఇబ్బందిగా ఫీలవుతున్నా సరే వినిపించుకోకుండా హగ్ చేసుకున్నాడు. సోనియాను సైతం చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసుకుని హగ్ కావాలంటూ అడుక్కుని మరీ తనను హత్తుకున్నాడు. క్లాస్ పీకిన నాగ్దీనికి బ్రేక్ వేయాల్సిందేనని భావించిన నాగార్జున.. మణిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మరీ క్లాస్ పీకాడు. నీ లక్ష్యం ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? అంటూ హగ్గుల వీడియో చూపించి మరీ కడిగిపారేశాడు. దీంతో తప్పయిపోయిందని, ఇంకోసారి అలా చేయనని మాటిచ్చాడు. అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు.. ఎప్పటిదాకా అంటే.. వైల్డ్ కార్డుల ఎంట్రీదాకా!గాల్లో తేలిన మణికొత్తగా వచ్చిన వైల్డ్కార్డులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనపై జాలి చూపిస్తున్నట్లుగా, తనకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడటంతో అతడిలో కొత్త శక్తి ప్రవేశించింది. పైగా ప్రతివారం నామినేషన్స్లో ఉండే అతడు ఈవారం వైల్డ్ కార్డుల పుణ్యమా అని నామినేషన్స్లో కూడా లేకుండా పోయాడు. ఇంకేముంది, గాల్లో తేలినట్లుందే అని పాటలు పాడుకున్నాడు. అదీ బాగానే ఉంది.. తర్వాతే మళ్లీ రెచ్చిపోయాడు.మళ్లీ మొదటికి..రోహిణిని వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. నయని పావనిని కూడా వదల్లేదు. ఆమెను కూడా వెనకనుంచి వచ్చి హత్తుకున్నాడు. తనకెలా ఉందో కానీ చూసే ఆడియన్స్కు మాత్రం మహా చెండాలంగా ఉంది. అవతలి వ్యక్తికి తెలియకుండా వెనక నుంచి హత్తుకోవడమనేది చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఈ సెకలే తగ్గించుకోమని నాగ్ చెప్పినా మణి మళ్లీ అదే దారిలో వెళ్తున్నాడు. మరి ఇతడికి నాగ్ ఈసారి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి!బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎప్పుడో, ఎవరో ట్రోల్ చేసినదాని గురించి ఇప్పుడెందుకు?: నాగార్జున
బిగ్బాస్ హౌస్లో ఉండేందుకు అర్హత లేని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ (పాత కంటెస్టెంట్లు) ఎవరో చెప్పండని నాగార్జున హౌస్మేట్స్ను ఆదేశించాడు. దీంతో తేజ.. పృథ్వీ పేరు, హరితేజ.. నబీల్, గంగవ్వ.. మణికంఠ, రోహిణి.. ప్రేరణ, నయని.. విష్ణుకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదన్నారు.రైజింగ్ స్టార్స్ ఎవరంటే?అలాగే రాయల్ టీమ్లో కూడా హౌస్లో ఉండేందుకు అర్హత లేనివాళ్ల పేర్లను సూచించమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నబీల్.. గౌతమ్ పేరు చెప్పాడు. ఇకపోతే మరో ప్రోమోలో నాగ్.. రైజింగ్ స్టార్, ఫాలింగ్ స్టార్ అంటూ ఓ బోర్డు ముందు పెట్టాడు. మెహబూబ్, హరితేజ, మణికంఠ, అవినాష్, గంగవ్వను రైజింగ్ స్టార్లుగా పేర్కొంటూ నబీల్, తేజ, విష్ణుప్రియ, గౌతమ్ను ఫాలింగ్ స్టార్స్గా అభివర్ణించాడు. ఇప్పుడెందుకు?ఈ సందర్భంగా ఎప్పుడో, ఎవడో ట్రోల్ చేసినదాని గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావ్.. అశ్వత్థామ 2.0 అనేది నువ్వు పెట్టుకున్నావా? లేదా మేము పెట్టామా? అని గౌతమ్ను సూటిగా ప్రశ్నించాడు. అటు తేజ.. నయనిపావనితో ర్యాష్గా మాట్లాడిన వీడియో చూపించి మరీ తేజకు క్లాస్ పీకాడు. రోహిణి తనను బచ్చా అనడంతో మణికంఠ ఫీలైన విషయాన్ని కూడా నాగ్ ప్రస్తావించాడు. అమాయకంగా ఫేస్ పెట్టిన మణిరోహిణి.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా? అని సెటైరికల్గా అడిగాడు. తన శక్తిసామర్థ్యాలను నువ్వు అవమానించావని అనుకున్నాడు అని పేర్కొన్నాడు. అందుకు మణి నోరు తెరుస్తూ.. అమ్మో, అంత పెద్ద మాట అన్లేదు సర్ అని అమాయకంగా అన్నాడు.నాతో గేమ్స్ వద్దుదీంతో నాగ్.. ఫీలయ్యావన్నదే చెప్పాను.. ఇప్పుడు కవరింగ్ వద్దు, నాతో గేమ్స్ ఆడొద్దు అని సీరియస్ అయ్యాడు. ఇక విష్ణును నువ్వు గేమ్ సీరియస్గా తీసుకోకపోతే ఆడియన్స్ కూడా నిన్ను సీరియస్గా తీసుకోరని తెలిపాడు. నబీల్.. మనుషుల ఎదుట కాకుండా వారి వెనకాల మాట్లాడటం ఏమాత్రం బాగోలేదన్నాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెగా చీఫ్గా మెహబూబ్.. బైక్ గెల్చుకున్న నయని
మెగా చీఫ్గా నబీల్ పదవీకాలం ముగిసింది. దీంతో మెగా చీఫ్ పోస్ట్ కోసం మళ్లీ పోటీపెట్టారు. ఈసారి పాత కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి సుడిగాలిలా హౌస్లో అడుగుపెట్టిన వైల్డ్కార్డుల్లో ఒకరే ఆ పోస్టును ఎగరేసుకుపోయారు. మరి ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి(అక్టోబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఎలిమినేషన్ గురించి ఛాలెంజ్వచ్చేవారం నువ్వే ఎలిమినేట్ అవుతానవి గంగవ్వ అనడంతో విష్ణుప్రియ తాను వెళ్లనంది. అవ్వ పోయేదాకా తాను పోనంది. దీంతో ఎవరు ఎక్కువ రోజులు ఉంటారో చూద్దామని గంగవ్వ, విష్ణుప్రియ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. అటు ప్రేరణ.. నా మాట వినట్లేదు, నన్ను నమ్మట్లేదు, ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నావంటూ నబీల్తో వాగ్వాదానికి దిగింది. దీంతో హర్టయిన నబీల్.. నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు. ప్రాంక్ చేసిన గంగవ్వతర్వాత అతడు ప్రేరణను ఇమిటేట్ చేస్తూ మాట్లాడటం కాస్త వెగటుగా అనిపిస్తుంది. ఇక బిగ్బాస్ రాయల్ క్లాన్ (వైల్డ్ కార్డ్స్)లో నుంచి ఆరుగురు బెస్ట్ పర్ఫామర్లను మెగా చీఫ్ కంటెండర్స్ కోసం ఎంపిక చేయమన్నాడు. దీంతో అవినాష్.. తన పేరుతో పాటు నయని, మెహబూబ్, హరితేజ, రోహిణి, గౌతమ్ పేర్లను సూచించాడు. నా పేరు ఎవరూ చెప్పలేదని గంగవ్వ ఏడుస్తున్నట్లు నటించి అందర్నీ ఆటపట్టించింది.కంటెండర్గా మణిఅటు ఓజీ టీమ్లో రెండు స్టార్లున్న మణికంఠ, నబీల్ లలో ఒకరిని బెస్ట్ పర్ఫామర్గా సెలక్ట్ చేయాలన్నాడు. దీంతో టీమ్ అంతా కలిసి మణిని బెస్ట్ పర్ఫామర్ అని ప్రకటించడంతో అతడు చీఫ్ కంటెండర్ అయ్యారు. చీఫ్ కంటెండర్లకు మొదటగా ఓ గేమ్ పెట్టారు. అందులో కంటెండర్లు అందరూ జాకెట్ వేసుకుని నిలబడితే వారిపైకి హౌస్మేట్స్ బంతులు విసరాలి. ఎవరి జాకెట్కు ఎక్కువ బంతులు అతుక్కుంటే వారు అవుట్ అవుతారు. అందరికంటే గంగవ్వ ఎక్కువ హుషారుగా బాల్స్ విసరడం విశేషం. మొదటి రౌండ్లో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఏడ్చేసిన రోహిణిఈ గేమ్లో విష్ణుప్రియ, పృథ్వీ.. తనను కావాలని గట్టిగా కొట్టారని రోహిణి ఫీలైంది. ఈమె దగ్గరకు విష్ణు వెళ్లి.. నాకు అతడి (పృథ్వీ) దగ్గరి నుంచి ఎనర్జీ వస్తుంది. డౌన్గా ఉన్నప్పుడే తన దగ్గరకు వెళ్తాను.. అందరితోనూ నేను బాగుంటాను అంటూ తన రిలేషన్ గురించి చెప్పింది. దీంతో రోహిణి.. నేనేమీ మీ గురించి లేనిది చెప్పలేదు.. మీరు అందరిముందు ఎలా ఉంటున్నారన్నదాని గురించే మాట్లాడాను.. అయినా తప్పుగా అనిపిస్తే సారీ అని చెప్పేసి వెళ్లిపోయింది. బైక్ గెల్చుకున్న నయనిఇక బాల్స్ గేమ్ రెండో రౌండ్లో నయని అవుట్ అవడంతో ఏడ్చేసింది. మూడో రౌండ్లో రోహిణి అవుట్ అయింది. సారీ చెప్పిన తర్వాత కూడా విష్ణుప్రియ గేమ్లో తనను టార్గెట్ చేయడంతో రోహిణి ఏడ్చేసింది. ఇక హరితేజ, మెహబూబ్, అవినాష్, మణి రెండో గేమ్లో పోటీపడగా చివరకు మెహబూబ్ గెలిచి మెగా చీఫ్గా నిలిచాడు. అనంతరం దమ్ముంటే స్కాన్ చెయ్ గేమ్లో విష్ణుప్రియ, నయని పావని ఆడారు. అయితే నయని పావని గెలిచి థండర్ వీల్స్ బైక్ పొందింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణిని టార్గెట్ చేసిన లవ్ బర్డ్స్.. కొత్త మెగా చీఫ్ ఎవరంటే?
బిగ్బాస్ హౌస్లో మెగా చీఫ్ కోసం మొదటి పోటీ జరిగింది. ఇందులో అవినాష్, రోహిణి, మెహబూబ్, మణికంఠ, గౌతమ్, హరితేజ, నయని పావని పాల్గొన్నారు. అయితే ప్రేమపక్షులు విష్ణుప్రియ- పృథ్వీ.. రోహిణిని టార్గెట్ చేసినట్లున్నారు. ఇక పృథ్వీ అయితే ఏకంగా తలకు గురి పెట్టి విసిరాడు. అవి తన కళ్లకు తగులుతుండటంతో రోహిణి ఫైర్ అయింది. దాడి చేశాక సారీ దేనికి?బాడీపై విసురు, కానీ కళ్లపై కొట్టవద్దని అరిచింది. ఒక్కరిపైనే దాడి చేసి తర్వాత సారీ చెప్పేస్తే నాకెలా అనిపిస్తుంది? అని రోహిణి బాధపడింది. అటు విష్ణుప్రియ.. మరి తను వచ్చీరాగానే నన్ను నామినేట్ చేసింది.. నాకెలా అనిపిస్తుంది? అయినా ఐ లవ్యూ చెప్తున్నాగా.. అని అభిప్రాయపడింది. ఏడుపందుకున్న నయనిఇక నయని పావని మరోసారి కన్నీటి కుళాయి ఓపెన్ చేసింది. నన్ను టాప్2లో తీసుకోలేదు, ముందే అవుట్ చేద్దామని మా టీమ్ డిసైడయ్యారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సీత ఊరికనే ఏడవడం నచ్చలేదని నామినేట్ చేసిన నయని.. ఇప్పుడు చేస్తుందేంటో? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇకపోతే ఈవారం నామినేషన్స్లో ఉన్న మెహబూబ్ మెగా చీఫ్గా గెలిచాడని సమాచారం.చదవండి: తనలో సడన్ మార్పు, చాలా సెల్ఫిష్.. ఇప్పటికీ చెప్తున్నా విష్ణు ఫేక్ ఫ్రెండ్! -
గతాన్ని తల్చుకుని కుంగిపోయిన గౌతమ్.. ఈసారి కప్పు కొడతా!
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడుతోంది. బిగ్బాస్ 8లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. వీరితో కలిసి ఫన్ గేమ్ ఆడించాడు. అదే బిగ్బాస్ హోటల్. ఈ టాస్క్లో పాతవాళ్లంతా హోటల్ సిబ్బందిగా, కొత్తవాళ్లంతా గెస్టులుగా ఉన్నారు. మరి ఈ టాస్క్ ఏమేరకు వర్కవుట్ అయిందో నేటి (అక్టోబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..ఫన్ టాస్క్బిగ్బాస్ అమ్మాయిలను ఒక టీమ్గా, అబ్బాయిలను ఒక టీమ్గా విభజించి ఫన్నీ టాస్కు ఇచ్చాడు. ఆడాళ్ల టీమ్కు ముక్కు అవినాష్, అబ్బాయిల టీమ్కు రోహిణిని లీడర్గా పెట్టారు. గేమ్ ఏంటంటే.. టీమ్సభ్యులంతా వారి నోటిని నీటితో నింపుకోవాలి. వీళ్లను ఇతర టీమ్లోని వారు నవ్వించి ఆ నీళ్లు బయటకు వచ్చేలా చేయాలి. ఈ గేమ్లో అబ్బాయిలను నవ్వించే క్రమంలో అవినాష్.. మణికంఠ దగ్గరకు వెళ్లి పాట పాడాడు. కప్పు కొడతా: గౌతమ్తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్లి అశ్వత్థామ 2.0 అని ఇమిటేట్ చేశాడు. అది విని హర్టయిపోయిన గౌతమ్.. అయిపోయినదాన్ని మళ్లీ మళ్లీ తీసి ఇరిటేషన్ తెప్పించొద్దు. వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. అని మైక్ విసిరేసి ఇంట్లోకి వెళ్లి ఏడ్చాడు. నాన్న ఐయామ్ సారీ, నీతో గొడవపడి మాట్లాడకుండా వచ్చేశా.. కానీ ఈసారి నన్ను నేను నిరూపించుకుంటాను. కప్పు కొడతాను అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.ఉప్పు గెల్చుకున్న అవినాష్, రోహిణిమరోవైపు తనను నవ్వించమని అవినాష్, రోహిణికి బిగ్బాస్ టాస్క్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ వీరికి కొట్టిన పిండి కావడంతో ఇరగదీశారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్బాస్.. ఇంటిసభ్యులు రేషన్లో మర్చిపోయిన ఉప్పును కానుకగా ఇచ్చాడు. ఇక తర్వాతి రోజు ఉదయం విష్ణు ధ్యానం చేస్తుంటే గంగవ్వ చెడగొట్టేందుకు ప్రయత్నించడం భలే సరదాగా అనిపించింది. అనంతరం బిగ్బాస్ హోటల్ టాస్క్ పెట్టాడు. ఇందులో ఓల్డ్ కంటెస్టెంట్లు హోటల్ సిబ్బంది కాగా రాయల్ టీమ్ అతిథులుగా ఉంటారు. ఎవరెవరు ఏ పాత్రలో..పాత్రల విషయానికి వస్తే.. నబీల్.. అప్పుల్లో కూరుకుపోయిన హోటల్ యజమాని, ప్రేరణ.. మతిమరుపు మేనేజర్, నిఖిల్.. హెడ్ చెఫ్, సీత.. అసిస్టెంట్ చీఫ్, పృథ్వీ.. అందరినీ ఫ్లర్ట్ చేసే గార్డ్, విష్ణు.. పృథ్వీతో లవ్లో ఉండే పర్సనల్ బట్లర్, యష్మి.. హౌస్ కీపింగ్, మణికంఠ.. హౌస్ కీపింగ్(దొంగిలించడం, దాన్ని తిరిగిచ్చేయడం)గా వ్యవహరిస్తారు.తికమక మనిషిగా హరితేజగంగవ్వ.. రాజవంశానికి చెందిన మహారాణి, నయని పావని.. మహారాణి అసిస్టెంట్, అవినాష్.. సూపర్స్టార్, రోహిణి- పొగరుబోతు రిచ్ కిడ్ (అవినాష్ గర్ల్ఫ్రెండ్), మెహబూబ్.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ (రోహిణి తండ్రి అపాయింట్ చేస్తాడు) హరితేజ.. మెహబూబ్ అసిస్టెంట్(తికమక మనిషి), తేజ.. పాపులర్ ఫుడ్ బ్లాగర్, గౌతమ్.. పోలీసుల నుంచి దాక్కుని తిరుగుతున్న క్రిమినల్గా పాత్రలు పోషించారు.మణిని ఆడుకున్న రోహిణిటాస్కు ప్రారంభానికి ముందే సీత.. ఒక పర్సు కొట్టేయడం గమనార్హం. ఈ టాస్కులో హౌస్మేట్స్ తమ పర్ఫామెన్స్ చూపించారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదని రోహిణి అనగా.. మణి.. నువ్వో మాడియపోయిన కందిపప్పు, మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్ వేశాడు. దీంతో రోహిణి సీరియస్ అయింది.. ఒకసారి, రెండుసార్లు ఓకే.. కానీ మూడోసారి ఒప్పుకోను. నీ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి నీకు నచ్చినట్లు మాట్లాడటం ఫన్ కాదు.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతలోనే జోక్ చేశానంటూ నవ్వేసింది. నీ కళ్లలో భయమే నాకు కావాలంటూ నవ్వుతూ చెప్పడంతో మణి ఊపిరి పీల్చుకున్నాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికంఠ కుళ్లు జోకులు.. రోహిణి వార్నింగ్..
బిగ్బాస్ షోలో 'హోటల్ టాస్క్' ఎవర్గ్రీన్. ఇప్పుడా టాస్కునే తిరిగి తీసుకొచ్చారు. అయితే ఈసారి ఓజీ(ఓల్డ్ కంటెస్టెంట్స్) టీమ్ను హోటల్ స్టాఫ్గా, రాయల్ టీమ్ (వైల్డ్ కార్డ్స్)ను ఆ హోటల్కు వచ్చే అతిథులుగా నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికీ ఒక్కో పాత్ర ఇచ్చారు. గంగవ్వ రాజవంశానికి చెందిన మహారాణి కాగా అవినాష్-రోహిణి లవ్ బర్డ్స్.ఫన్ టాస్క్తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే అవినాష్, రోహిణి, యష్మి పర్ఫామెన్స్లో రెచ్చిపోయారు. డబ్బు కోసం స్టాఫ్ పడే తంటా అంతా ఇంతా కాదు. రాయల్ టీమ్ సభ్యులు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు కానీ ఒక్క రూపాయి కూడా విదల్చడం లేదు. అయినా సరే హోటల్ సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు.(చదవండి: దమ్ము కొట్టిన విష్ణు ప్రియ.. సోనియా చెప్పింది తన గురించేనా?)నువ్వో మాడిపోయిన కందిపప్పుచివర్లో రోహిణి.. తన అభిప్రాయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అరిచేసింది. దీంతో మణికంఠ.. నువ్వో మాడిపోయిన కందిపప్పు.. మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్ వేశాడు. ఈ కామెంట్పై చిర్రెత్తిన రోహిణి.. నీ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి నచ్చినట్లు మాట్లాడేందుకు ఇది ఫన్ కాదు అని సీరియస్ అయింది. మరి ఇది నిజమైన గొడవేనా? ప్రాంకా? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: పద్నాలుగోవారం రోహిణి ఎలిమినేట్
ఒకప్పుడు సీరియల్స్లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్సిరీస్లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్లో పనిమనిషిగా నటించి తెగ నవ్వించింది. తన కామెడీ టైమింగ్స్తో అందరికీ వినోదాన్ని పంచింది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపించింది.వైజాగ్లో పుట్టిన రోహిణి ప్రస్తుతం హైదరాబాద్లో సెటిలైంది. బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొన్న ఈ లేడీ కమెడియన్.. మరోసారీ ఈ రియాలిటీ షోలో అడుగుపెట్టింది. కాకపోతే ఈసారి షో ప్రారంభమైన నెల రోజులకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. రోహిణి ఈసారైనా ఫినాలేలో అడుగుపెట్టాలని గట్టిగా ప్రయత్నించింది. ప్రతి గేమ్లోనూ అల్లాడించింది. కానీ నామినేషన్స్లోకి రాకుండా పోయింది. ఒకే ఒక్కసారి పద్నాలుగోవారంలో నామినేషన్స్లోకి రావడం.. అదే వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో రోహిణి ఎలిమినేట్ అయింది. -
రోహిణి ఫిర్యాదుతో డా. కాంతరాజ్పై కేసు
కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిషన్ చిత్ర పరిశ్రమల్లో సంచలనం అయిన నేపథ్యంలో నటి రోహిణి అధ్యక్షతన ఇటీవల కోలీవుడ్లో ఈ తరహా కమిటీని ఏర్పాటు చేశారు. ఇక తాజాగా డా. కాంతరాజ్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన భేటీలో సినీ పరిశ్రమలో అవకాశాల కోసం నటీమణులు అడ్జెస్ట్ అవుతారనే విధంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు స్పందించి... ‘‘సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఆయన ఈ విధంగా మాట్లాడారు.ఎలాంటి ఆధారాలు లేకుండా నటీమణుల గురించి వైరల్ కంటెంట్ని విడుదల చేశారు’’ అంటూ చెన్నైపోలీస్ కార్యాలయంలో కాంతరాజ్పై రోహిణి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. కాంతరాజ్పై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. – సాక్షి సినిమా ప్రతినిధి, చెన్నై -
డాక్టర్పై నటి రోహిణి ఫిర్యాదు
కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమ కమిషన్ మాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న ఛేదు అనుభవాలను బహిరంగంగా వెలిబుచ్చుతున్నారు. దీంతో హేమ కమిషన్ తరహాలోనే కోలీవుడ్లోనూ నడిగర్ సంఘం విశాక కమిటీ సిఫార్సుతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో ఆమెకు పలు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇదీ చదవండి: 'తప్పు చేశా.. క్షమించు కన్నా'.., సీత త్యాగం.. ఏడ్చేసిన కంటెస్టెంట్లుకాగా ఆమె శుక్రవారం డాక్టర్ కాంతరాజ్పై చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో డాక్టర్ కాంతరాజ్ ఒక యూట్యూబ్ ఛానల్లో సినీ నటీమణులందరూ వ్యభిచారులే అన్నట్లు మాట్లాడారు. నటీమణులు కెమెరామెన్, లైట్మెన్, మేకప్మెన్, దర్శకుడు అంటూ కోరుకునే వారందరికి ఎడ్జెస్ట్మెంట్ చేసుకుని నటించే అవకాశాలను పొందుతున్నట్లు పేర్కొని అందరు నటీమణులను అవమానించే విధంగా ఆయన మాట్లాడారన్నారు. అలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసిన డాక్టర్ కాంతరాజ్పై తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆ యూట్యూబ్ ఛానల్లోని ఆయన ఇంటర్వ్యూను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. -
ఫిర్యాదు చేయకపోతే ప్రయోజనం ఉండదు!
మలయాళ సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న ఘటనలను మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) సమావేశంలో నటి రోహిణి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం మంచిది. తమను వేధించినవారిపై ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు’’ అని పేర్కొన్నారు. -
లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా.. జర్నలిస్ట్పై నటి రోహిణి ఫైర్
బుల్లితెరతో పాటు వెండితెరపై తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్న నటి రోహణి తాజాగా ఓ జర్నలిస్ట్పై ఫైర్ అయింది. నిజానిజాలు తెలుసుకోకుండా పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగోదని హెచ్చరించింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని పోస్ట్ చేసింది.అసలేం జరిగింది?రోహిణి తాజాగా ‘బర్త్డే బాయ్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం రేవ్ పార్టీ థీమ్తో ఓ ప్రాంక్ వీడియో చేసింది. అది కాస్త నెట్టింట బాగా వైరల్ అయింది. అయితే ఇది కేవలం ప్రమోషన్స్ కోసమే చేసినట్లు వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. కానీ కొంతమంది రోహిణి నిజంగానే రేవ్ పార్టీలో దొరికిపోయిందని ట్రోల్ చేశారు. ఇక ఇదే వీడియోపై ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ చానల్లో మాట్లాడుతూ..రోహిణి లాంటి వాళ్లు రేవ్ పార్టీలో పాల్గొన్నారంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్పై కూడా కామెంట్ చేయడం పట్ల రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేను బర్త్ డే బాయ్ అనే సినిమాకి ప్రమోషన్స్ చేశాను. అది వీడియో ప్రమోషనల్ కోసం చేశానని తెలుసుకొని మీడియా కూడా దానిని ఫన్నీ వీడియోగా తీసుకున్నారు. కానీ, సీనియర్ జర్నలిస్ట్ నా గురించి తప్పుగా మాట్లాడారు. ఏదైనా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా? కాదా? అనేది తెలుసుకొని మాట్లాడాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయకూడదు. నేను మందు కూడా తాగను. సినిమాల్లో భాగంగా కొన్ని సీన్స్లో అలా కనిపించినంత మాత్రాన బయట అలా చేస్తామా?. ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు. నేను సర్జరీ చేయించుకోవడం వల్లే లావు అయ్యాను అని అందుకే పెళ్లి కాలేదు అందుకే అలా ఉండిపోయింది అని అన్నాడు. లావు గా ఉంటే పెళ్లి కాదా.? సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టే దాన్ని’అని రోహిణి సీరియస్ అయింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
రఘువరన్కు భిన్నంగా వారసుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
నటుడు రఘువరన్ పేరు వినగానే విలక్షణమైన పాత్రలే గుర్తుకొస్తాయి. టాలీవుడ్తో పాటు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాల్లో నటించే సమయంలో నటి రోహిణిని పెళ్లాడారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిషివరన్ అనే పేరు పెట్టారు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చివరి రోజుల్లో ఆల్కహాల్కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు.అయితే ప్రస్తుతం అతని కుమారుడు రిషి వరన్ తండ్రి బాటలోనే దూసుకెళ్తున్నాడు. 26 ఏళ్ల రిషివరన్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు. సినిమాల్లో నటనకు బదులు రిషివరన్ సంగీత రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే అతను కొన్ని ఇంగ్లిష్ ఆల్బమ్లు రిలీజ్ చేశాడు. రఘువరన్కి సైతం సంగీతంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. సినిమా అవకాశాలు పెరగడంతో నటనలో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రిషివరన్ తండ్రిలాగే కొడుకు కూడా సంగీతంలో కొనసాగుతున్నాడు.కాగా.. గతంలో రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్ను ఆయన భార్య రోహిణి, రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. టాలీవుడ్లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో కొనసాగుతున్నారు. -
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీహార్లో పోరు ఆసక్తికరంగా మారింది. బీహార్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించిన చర్చలు సోషల్ మీడియాలో విరివిగా సాగుతున్నాయి. వీరికి ఈ పేర్లను లాలూ యాదవ్ ఎందుకు పెట్టారని పలువురు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు.అది.. 1976.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నాటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైలులో పెట్టే చట్టాన్ని అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మీసా) అని పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ లాలూ తన తొలి కుమార్తెకు ‘మీసా భారతి’ అని పేరు పెట్టారు.ఇక రోహణి ఆచార్యకు ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయానికొస్తే.. లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి 1979లో మరోసారి తల్లి అయ్యారు. ఆమెకు డెలివరీకి ముందు తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ గురించి తెలియగానే అప్పట్లో లాలూ యాదవ్ భయపడ్డారట. పట్నాకు చెందిన నాటి ప్రముఖ మహిళా వైద్యురాలు కమలా ఆచార్య.. లాలూ భార్య రబ్రీ దేవికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు.అయితే ఆమె ఆపరేషన్కు అయిన ఖర్చును లాలూ నుంచి తీసుకునేందుకు నిరాకరించాట. లాలూ యాదవ్కు రెండో కుమార్తె పుట్టిన సమయంలో రోహిణి నక్షత్రం ఉందట. దీంతో లాలూ తన కుమార్తెకు రోహిణి ఆచార్య అని పేరు పెట్టారు. అంటే కుమార్తె పేరుకు వైద్యురాలి పేరును జత చేశారన్నమాట. ప్రస్తుతం మిసా భారతి పాటలీపుత్ర నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. రోహిణి ఆచార్య బీహార్లోని సారణ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్పై పోటీ చేస్తున్నారు. -
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
పాట్నా: ఆర్జేడీ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగుతుండటం తెలిసిందే. బిహార్లోని సరన్ నియోజకవర్గం ఆమె పోటీ చేస్తున్నారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అక్కడి నుంచే ఆమెపై పోటీ పడుతున్నారు! తండ్రీ కూతుళ్లు ఒకరిపై ఒకరు పోటీ పడటం ఏమిటా అని అవాక్కవుతున్నారా? వాళ్లిద్దరూ సరన్ నుంచి పోటీ చేస్తున్నది నిజమే గానీ సదరు లాలు ప్రసాద్ యాదవ్ ఆమె తండ్రి కాదు. ఆ పేరుతోనే ఉన్న ఓ రైతు! రాష్రీ్టయ జన సంభావనా పార్టీ (ఆర్జేపీ) అభ్యరి్థగా నామినేషన్ వేశారాయన. ఈ లాలు ప్రసాద్ యాదవ్కు గతంలో పంచాయతీ మొదలుకుని ప్రెసిడెంట్ ఎన్నికల దాకా పోటీ చేసిన అనుభవముంది. అంతే కాదు, 2017, 2022ల్లో రెండుసార్లు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ పడ్డారు. రెండుసార్లూ ఆయన నామినేషన్ తిరస్కరణకు గురవడం వేరే సంగతి! సరన్ లోక్సభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేయడం ఇది తొలిసారేమీ కాదు. చాలాకాలంగా బరిలో నిలుస్తూనే వస్తున్నారు. లాలు భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవిపై కూడా పోటీ చేశారు. ఇప్పుడు వారి కుమార్తెపై బరిలో దిగారు. గత ఎన్నికల విషయం ఎలా ఉన్నా ఈసారి మాత్రం భారీ మెజారిటీతో గెలుస్తానని ఈ లాలు అంటుండటం విశేషం! ‘‘జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకుంటున్నా, నిత్యం సామాజిక సేవలో నిమగ్నమయ్యే ఉన్నా. కనుక ఈసారి సరన్ ప్రజలు నా వెంట ఉన్నారు’’ అంటున్నారు. రోహిణి ఓట్లను చీల్చేందుకే ఆయన బరిలో ఉన్నారని ఆరోపణలున్నాయి. పట్టించుకోనంటున్నాడు. అఫిడవిట్ ప్రకారం ఈ లాలు దగ్గర రూ.5 లక్షల నగదు, భార్య వద్ద 2 లక్షల నగదు, ఆయన పేరిటరూ.17.6 లక్షలు, భార్య పేరిట రూ.5.20 లక్షల చరాస్తులున్నాయి. -
లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (బీహార్) గురించి తెలియనివారెవరూ ఉండరు. ఆయన కుమార్తె, సారణ్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన రోహిణి ఆచార్య ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నారు. మహాకూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆమె తన అఫిడవిట్లో తనకు రూ.15.82 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తన భర్తకు రూ.19.86 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయని తెలియజేశారు.వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె వివాహం తర్వాత సింగపూర్ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడామె భారత్కు తిరిగివచ్చారు. ఆమె తన వద్ద రూ.2.99 కోట్ల చరాస్తులు, రూ.12.82 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భర్త దగ్గర రూ.6.92 కోట్ల చరాస్తులు, రూ.12.94 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. అలాగే తన వద్ద రూ.20 లక్షల నగదు, భర్త వద్ద రూ.10 లక్షల నగదు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.అఫిడవిట్లోని వివరాల ప్రకారం ఆమె దగ్గరున్న స్థిరాస్తులలో పట్నాలో రూ.68.62 లక్షల విలువైన వాణిజ్య పరమైన ఆస్తి కూడా ఉంది. రోహిణి ఆచార్య గతంలో తన తండ్రి లాలూ ప్రసాద్కు కిడ్నీ దానం చేసి, వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్గా ఉంటారు. మే 20న ఐదవ దశ లోక్సభ ఎన్నికల్లో సారణ్లో ఓటింగ్ జరగనుంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీపై ఆమె పోటీ చేస్తున్నారు. రోహణి ఆచార్య .. లాలూ ప్రసాద్, రబ్రీ దేవిలకు నాల్గవ సంతానం. గతంలో లాలూ ప్రసాద్ సారణ్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. -
లోక్సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు?
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఏడుగురు కుమార్తెల్లో ఇద్దరిని రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధమయింది. ఆర్జేడీ టిక్కెట్పై మిసా భారతిని పాటలీపుత్ర నుంచి, రోహిణీ ఆచార్యను సరన్ నుంచి బరిలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. పాటలీపుత్ర నియోజకవర్గంలో ఆర్జేడీ టిక్కెట్పై పోటీ చేసేందుకు ఇప్పటికే రిత్లాల్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పట్నాలోని మాజీ సీఎం రబ్డీదేవి నివాసానికి పలు పర్యాయాలు వచ్చినట్లు కూడా మీడియా అంటోంది. దీంతో, పాటలీపుత్ర నుంచి ఇద్దరిలో ఎవరిని పోటీకి నిలపాలనే విషయంలో కొంత సందిగ్ధం కొనసాగుతున్నట్లు సమాచారం. -
విలక్షణ నటుడు, తన మాజీ భర్తను తలచుకున్న రోహిణి.. పోస్ట్ వైరల్!
నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో గుర్తొస్తాయి. ఏ పాత్రల్లోలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. జనాన్ని మెప్పించడంలో మేటి అనిపించుకున్నారు. దక్షిణాదిలో అన్ని భాషల్లో రఘువరన్ నటించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. చివరి రోజుల్లో ఆల్కహాల్కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇవాళ రఘువరన్ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య, నటి రోహిణి మొల్లేటి తన భర్తను తలుచుకున్నారు. ఆయనకు నివాళులర్పిస్తూ ట్విటర్ ద్వారా ఫోటోను పంచుకున్నారు. రోహిణితో పెళ్లి కాగా.. నటి రోహిణితో రఘువరన్ వివాహం 1996లో జరిగింది. వారిద్దరికీ రిషి వరుణ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. విడిపోవడానికి గల కారణాలను రోహిణి అప్పట్లో బయటపెట్టింది. రఘువరన్ తాగుడు ముందు తాను.. తన కొడుకు ఓడిపోయామని రోహిణి అప్పట్లో వెల్లడించింది. రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్ను ఆయన భార్య రోహిణి, తనయుడు రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. మంచి పేరు సంపాదియడమే కాకుండా ఎక్కువగా సక్సెస్ మెజారిటీని అందుకున్నారు. తెలుగులో పాటు ఇతర భాషలలో కూడా రఘువరన్ మంచి పేరు సంపాదించారు. టాలీవుడ్లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. కాగా.. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ విభిన్నమైన పాత్రల్లో రోహిణి మెప్పిస్తున్నారు. pic.twitter.com/HBy7RE5eCr — Rohini Molleti (@Rohinimolleti) March 19, 2024 -
కొత్త కారు కొన్న రౌడీ రోహిణి..
-
ముచ్చటగా మూడో కారు కొన్న లేడీ కమెడియన్
సీరియల్ నటి, కమెడియన్ రోహిణి బుల్లితెర ప్రేక్షకులకు రౌడీ రోహిణిగానే బాగా సుపరిచితం. మొదట్లో సీరియల్స్లో కనిపించిన ఈమె ఆ తర్వాత జబర్దస్త్, అదిరింది వంటి కామెడీ షోలు సైతం చేసింది. 'మత్తు వదలరా', 'బలగం' వంటి సినిమాల్లో వినోదాన్ని పంచింది. 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్లో ఆమె చేసే కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే! ఆ టాలెంటెడ్ నటి తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లోనూ పాల్గొంది. కొత్త కారు ధరెంతంటే? తాజాగా రోహిణి కొత్త కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె యూట్యూబ్ ఛానల్ వేదికగా వెల్లడించింది. మొదటి కారు యాక్సిడెంట్లో దెబ్బతిందని, రెండో కారును ఈ మధ్యే అమ్మేయగా ఇప్పుడు ముచ్చటగా మూడో కారు కొన్నట్లు చెప్పింది. ఇది కియా సెల్టోస్ జీటీఎక్స్ ప్లస్ బ్రాండ్కు చెందినదంటూ తన కొత్త కారును చూపించింది. దానికి పూజ కూడా చేయించి. రోహిణి మాట్లాడుతూ.. 'మొదటి కారును రూ.9 లక్షలు పెట్టి తీసుకున్నాను. రెండో కారు కోసం రూ.14 లక్షలు పెట్టాను. ఇప్పుడీ కొత్త కారును రూ.25 లక్షలు పెట్టి తీసుకున్నాను. అదొక్కటే మిగిలుంది నిజానికి ఆడి కారు కొందామనుకున్నాను. కానీ దాని ప్రారంభ ధర రూ.57 లక్షల దాకా ఉంది. లోన్ పెట్టుకోవచ్చనుకున్నాను. కానీ ఎప్పుడెలా ఉంటుందోనని ఆ ఆలోచన విరమించుకున్నాను. చాలామంది నాకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియవు కాబట్టి భూమి కొనుక్కోమని చెప్పారు. నిజమే కదా అనిపించింది. ఇప్పటికైతే ఇల్లు, కారు కొనేశాను.. ఎక్కడైనా ప్లాట్ తీసుకుని అది అమ్మానాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వారికి బహుమతిగా ఇవ్వాలి. అదొక్కటే మిగిలి ఉంది' అని చెప్పుకొచ్చింది రోహిణి. చదవండి: ఒక్క పూట భోజనం.. ఇంట్లో వాళ్ల కోసం ఆలోచించకుండా తినేవాడిని.. ప్రముఖ నటుడి కష్టాలు -
నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!
లెన్స్, మస్కిటో ఫిలాసఫీ, తలైకూత్తల్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ తెరకెక్కించిన చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై. ఈ చిత్రాన్ని ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్ర దర్శకుడు జియో బేబీ సమర్పణలో మెన్ కైండ్ సినిమాస్, నితీష్ ప్రొడక్షన్స్, సిమెట్రీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి రోహిణి కీలకపాత్రలో నటించారు. ఆమెతో పాటు లిజోమోల్, వినీత్, కలేశ్ రామనాథ్, అనుష్క, దీప ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా కాదల్ ఎంబదు పొదువుడమై మూవీ 54వ ఇండియన్ పనోరమ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైనట్లు మేకర్స్ తెలిపారు. తమిళ చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై ఎంపిక కావడం విశేషం. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరగనున్నాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఈ ఆధునికకాలంలో మనుషుల భావాలు, దురాలోచనలు, సామాజిక పరిస్థితి, విజ్ఞానం వంటి అంశాలతో కూడిన ఆధునిక ప్రేమను ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కాగా 2023 ఏడాదిగానూ ఇండియన్ పనోరమ చిత్రోత్సవాలకు 408 చిత్రాలు నామినేట్ కాగా.. అందులో 25 చిత్రాలు మాత్రమే ఎంపికై నట్లు చెప్పారు. ఆ 25 చిత్రాల్లో తమ కాదల్ ఎంబదు పొదువుడమై చిత్రం చోటుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ఈ సినిమాకు కన్నన్ నారాయణన్ సంగీతమందించగా.. శరవణన్ సినిమాటోగ్రఫీ అందించారు. -
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న ప్రముఖ నటి!!
నటిగా రోహిణి 1974లోనే బాలనటిగా తెరంగేట్రం చేశారు. తర్వాత కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అంతే కాదు ఈమెలో మంచి డబ్బింగ్ కళాకారిణి, దర్శకురాలు కూడా ఉన్నారు. 2005లోనే చిన్న చిన్న ఆశై అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.ఆ తరువాత ఒక డాక్యుమెంటరీ చిత్రం కూడా చేశారు. (ఇది చదవండి: కన్నీరు పెట్టుకున్న శోభ, యావర్.. నేడు షో టైమింగ్స్లో మార్పు) తాజాగా మరోసారి మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. యదార్థ ఘటనలతో ఇప్పటికే చాలా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో పలు చిత్రాలు విజయాన్ని సాధించాయి. జైభీమ్, సూరారై పోట్రు వంటి చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. కాగా ఆ మధ్య తమిళనాడునే ఉలిక్కిపడేలా చేసిన వాచ్ఛాత్తి హింసా సంఘటన ఇప్పుడు వెండితెరకెక్కనుంది. దీనికి నటి రోహిణి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కాగా దీనికి రచయిత ఆదవన్ దీక్షగా మాటలు,కథనం రాస్తున్నారు. ఇందులో జై భీమ్ చిత్రం ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
అక్టోబర్ 6న ‘రాక్షస కావ్యం’
అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 6న “రాక్షస కావ్యం” సినిమాను గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే “రాక్షస కావ్యం” సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గత వారం విడుదల చేసిన విలన్స్ ఆంథెమ్ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయ్యింది. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్స్ లో ఈ సినిమాను చూడాలనే క్రేజ్ సినీప్రియుల్లో ఏర్పడుతోంది. -
బాయ్ ఫ్రెండ్ వల్ల నరకం అనుభవించాను: రోహిణి
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన రోహిణి తర్వాత బిగ్బాస్ షోలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. జబర్దస్త్లోనూ తన కామెడీ టైమింగ్, పంచులతో కమెడియన్గా రాణిస్తోంది. బుల్లితెరకే పరిమితం కాకుండా అటు వెండితెరపైనా సత్తా చాటుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇటీవల రోహిణి తన కాలు సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని నెలలుగా ఆమె తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె కొంతమేరకు కోలుకుంది. దీంతో మళ్లీ స్క్రీన్పై కనిపేందకు రెడీ అయింది. (ఇదీ చదవండి: ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా..?) తాజాగ రోహిణి ఓ షోలో మొట్టమొదటిసారి తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రోహిణికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? లేడా..? అనే విషయం చాలామందికి తెలియదు.ఇదే విషయంపై ఆమె రివీల్ చేసింది. తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చింది. అతనితో వచ్చిన కొన్ని విబేదాల వల్ల బ్రేకప్ అయ్యానని, దాంతో చాలా నరకాన్ని అనుభవించానని ఆమె పేర్కొంది. అప్పుడు తానెంతో డిప్రెషన్లోకి వెళ్లానని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తన ఫ్రెండ్స్ ఎంతగానో సపోర్ట్గా నిలిచారని చెప్పింది. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ అన్న మాటలను మరోసారి గుర్తుచేసుకుంది. 'నా ఫ్రెండ్స్ అందరూ అసలు వాడెవడు.. నీ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు. అప్పుడు, వీడు ఒక ఆఫ్ట్రాల్ గాడు.. వీడి గురించి ఇంతలా ఆలోచించడం ఏంటని నన్ను నేను ప్రశ్నించుకున్నా.. అలా వారి సపోర్ట్తోనే ఆ కష్ట సమయం నుంచి బయటపడ్డాను.' అని రోహిణి తెలిపింది. దీంతో రోహిణిని ప్రేమించి వదిలేసిన అబ్బాయి ఎవరని నెట్టింట తన అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. రోహిణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. -
Versatile Actor Raghuvaran: విలక్షణ నటుడు రఘువరన్ అరుదైన చిత్రాలు
-
వీల్ ఛైర్లో యాంకరింగ్.. అదీ తెలుగు షోలోనే!
కామెడీ చూడటానికి హాయిగా ఉంటుంది. కానీ చేసేవాళ్లని అడిగితే అదెంత కష్టమో చెబుతారు. ఇండస్ట్రీలో మేల్ కమెడియన్స్ ఉన్నంతమంది లేడీస్ లేరు. టీవీ షోల వల్ల ఇప్పుడిప్పుడే పలువురు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా ఫేమ్ తెచ్చుకుంది రోహిణి. ఉత్తరాంధ్రకు చెందిన ఈమె... తొలుత సీరియల్స్ లో కామెడీ పాత్రలు చేసింది. 'జబర్దస్త్'లో చేసి ఓ రేంజు క్రేజ్ సంపాదించింది. (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) షోలు, సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న రోహిణి.. సరిగ్గొ కొన్నాళ్ల ముందు ఆస్పత్రిలో చేరింది. కాలికి పెద్దకట్టుతో కనిపించింది. దీంతో ఆమెకు ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు. 2016లో విజయవాడ నుంచి కారులో వస్తుండగా రోహిణికి యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆమె కాలిలో రాడ్ పెట్టారు. ఇప్పుడు అది తీయించుకుందామని వెళ్లింది. ఆ ఫొటోలు, వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ నొప్పి నుంచి కాస్త కోలుకుంది. షోలు చేయడం మొదలుపెట్టేసింది. రోహిణి కాలి నుంచి రాడ్ నుంచి కొన్ని నెలలు అయినా కాలేదు. అప్పుడే తెలుగులోని ఓ ఛానెల్లో ప్రసారమైన షోలో కనించింది. వీల్ ఛైర్లోనే స్టేజీపైకి వచ్చి రవితో కలిసి యాంకరింగ్ కూడా చేసింది. తాజాగా ఆదివారం ఈ షో టెలికాస్ట్ అయింది. అయితే ఈ షోని చాలా నెలల క్రితమే ఒప్పుకొందని, వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆరోగ్యం కుదటపడనప్పటికీ షో చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవికి వింత అలవాటు!) -
కుమారుడి కోసం ఏడ్చేవాడు.. రఘువరన్ మృతిపై తొలిసారి మాట్లాడిన సోదరుడు
నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో మెదలుతాయి. తాను ధరించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, జనాన్ని ఇట్టే కట్టిపడేయడంలో మేటి అనిపించుకున్నారు రఘువరన్. దక్షిణాది భాషలన్నిటా రఘువరన్ నటించి మెప్పించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ అభినయం ఆకట్టుకుంది. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు రఘువరన్. చివరి రోజుల్లో ఆల్కహాల్కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇదే విషయంపై తాజాగా ఆయన తమ్ముడు పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు. కుమారుడిపై అమితమైన ప్రేమ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే రఘువరన్ సోదరుడు తొలిసారిగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. లైమ్ లైట్కు ఎప్పుడూ దూరంగా ఉండే రఘువరన్ గురించి చాలా మందికి తెలియదు. అయితే తాను ఎప్పుడూ రఘువరన్తోనే ఉండేవాడినని ఆయన తెలిపారు. 'అన్నయ్య చనిపోయిన రోజు నేను బెంగళూరులో ఉన్నాను. ఆరోజు రాత్రి తనకు ఛాతీ నొప్పి వస్తున్నట్లు తెలపడంతో ఇంట్లోని పనివారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అన్నయ్య చనిపోయాడని వైద్యులు తెలిపారు. అన్నయ్య మరణానికి ముందే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి. దాని గురించి అందరికీ తెలుసు. అది అతనికి బాధ కలిగించింది. మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయాడు. అతను తన కొడుకును చాలా ప్రేమించాడు. అన్నయ్య,రోహిణి వేరువేరుగా ఉండటంతో వారంలో శనివారం మాత్రమే తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చుకునే అవకాశం ఉండేది. ఆదివారం తిరిగి వాళ్లు తీసుకుపోతారు. అది కోర్టు నిబంధన. కొడుకు పరుగున రాగానే నాన్న.. అని అంటాడు. (ఇదీ చదవండి: విశాల్పై పగ ఎప్పటికీ తగ్గదు.. సూర్య వెనకున్న శక్తి ఎవరంటే: అబ్బాస్) అప్పుడు ఆయన కన్నీరుపెట్టేవాడు. తన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వెళ్లిపోతాడో అప్పుడు విపరీతంగా బాధపడేవాడు. అలా తన చివరి రోజుల్లో ఎంతగానో క్షోభను అనుభవించాడు. దాంతో మద్యానికి మరింత బానిస అయ్యాడు.' అని ఆయన గుర్తుచేసుకున్నాడు. అయితే అతను మద్యానికి బానిస కావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయి. అంటూనే పరోక్షంగా రోహిణినే అని తెలుపుతూ దీనిపై మాట్లాడే ఆసక్తి లేదని రఘువరన్ సోదరుడు తెలిపారు. రోహిణితో పెళ్లి నటి రోహిణితో రఘువరన్ వివాహం 1996లో జరిగింది. వారిద్దరికీ రిషి వరణ్ అనే కొడుకు ఉన్నాడు. అయితే 2004లో రఘువరన్, రోహిణి విడిపోయారు. విడిపోవడానికి గల కారణాలను రోహిణి అప్పట్లో బయటపెట్టింది. రఘువరన్ తాగుడు ముందు తాను, తన కొడుకు ఓడిపోయామని రోహిణి అప్పట్లో చెప్పింది. రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్గా తీసుకువచ్చారు. రజనీకాంత్ చేతులమీదుగా విడుదలైన ఈ ఆల్బమ్ను ఆయన భార్య రోహిణి, తనయుడు రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన అభినయం జనం మదిలో ఓ స్థానం సంపాదించింది. (ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. దిగ్భ్రాంతి చెందిన సీఎం) -
ఓ రైతు కథ
సన్నీ నవీన్ , రోహిణీ రేచల్ జంటగా తోట మల్లికార్జున దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైత్ర’. అల్లం సుభాష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్రయూనిట్. అనంతరం తోట మల్లికార్జున మాట్లాడుతూ– ‘‘మట్టితో చుట్టరికం చేసే ఓ రైతు కథే ఈ చిత్రం. రాయలసీమ యాస, నేపథ్యంతో తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘సాధారణంగా రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే ఫ్యాక్షన్ అనుకుంటారు. కానీ, ఇందుకు విభిన్నంగా రాయలసీమలో నివసించే ఒక రైతు కుటుంబానికి చెందిన కథ, కథనాలతో ‘జైత్ర’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది’’ అన్నారు సన్నీ నవీన్. ‘‘ఓ రైతు కథతో చాలా సహజంగా మంచి రాయలసీమ స్లాంగ్తో ఈ సినిమా రాబోతోంది’’ అన్నారు అల్లం సుభాష్. -
మరోసారి సర్జరీ.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు: ఏడ్చేసిన రోహిణి
ఎంతటి కష్టాన్ని అయినా, బాధను అయినా పైకి కనిపించనీయకుండా చేసే అస్త్రం చిరునవ్వు. ఆ నవ్వును అందరికీ పంచగల సత్తా ఒక్క కమెడియన్కే సొంతం. తను నవ్వుతూ అందరినీ నవ్విస్తున్న కమెడియన్ రోహిణి చాలాకాలంగా భరించలేని బాధను అనుభవిస్తోంది. కానీ పైకి మాత్రం ఆ బాధను, నొప్పిని కనిపించనివ్వకుండా జాగ్రత్తపడుతోంది. 2016లో ఆమె యాక్సిడెంట్కు గురవగా కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో ఆమె కాలిలో రాడ్డు వేశారు. కాలిలో రాడ్డు ఉన్నప్పటికీ టీవీ షోలలో గెంతుతూ, కుప్పిగంతులు వేస్తూ, డ్యాన్సులు చేస్తూ అందరికీ వినోదాన్ని పంచింది రోహిణి. షూటింగ్లతో బిజీగా ఉన్న ఆమె గతంలో కాలిలో వేసిన రాడ్డును తీయించుకోవాలనుకుంది. ఇందుకోసం ఇటీవలే ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిన వైద్యులు తీరా ఆ రాడ్డును తీయలేమంటూ చేతులెత్తేశారు. రాడ్డు లోపల కూరుకుపోయిందని, బలవంతంగా లాగితే దానికి అతుక్కున్న ఎముక విరిగే ప్రమాదం ఉందంటూ ఆ రాడ్డును అలాగే వదిలేశారు. దీంతో నిరాశకు లోనైన రోహిణి తన ప్రయత్నం విరమించలేదు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్లి మళ్లీ సర్జరీకి సిద్దపడింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో రోహిణి మాట్లాడుతూ.. 'గంటలో సర్జరీ చేస్తామన్నారు. కానీ ఆ రాడ్డు రావడానికి 10 గంటలు పట్టింది. రాడ్డు సగందాకా వచ్చి ఆగిపోయిందట. చాలా కష్టపడి ఎలాగోలా దాన్ని బయటకు తీశారు. ఆరు వారాల దాకా కాలు కిందపెట్టకూడదన్నారు. చాలా కుట్లు వేశారు. ఎంతో నొప్పిగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రోహిణి. ఆమె పరిస్థితి తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: కంగనా చేతబడి చేసిందన్నాడు, ఇప్పుడేమో అడ్డు రాలేదంటూ.. -
ఆస్పత్రిలో కమెడియన్ రోహిణి.. సర్జరీ కోసం వెళ్తే..
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన రోహిణి తర్వాత బిగ్బాస్ షోలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. జబర్దస్త్లోనూ తన కామెడీ టైమింగ్, పంచులతో కమెడియన్గా రాణిస్తోంది. బుల్లితెరకే పరిమితం కాకుండా అటు వెండితెరపైనా సత్తా చాటుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇటీవల రోహిణి ఆస్పత్రిలో చేరింది. తన కాలు సర్జరీ కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు పేర్కొంది. ఈ మేరకు రౌడీ రోహిణి అనే తన యూట్యూబ్ ఛానల్లో వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించింది. '2016లో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను బెడ్ పై నుంచి లేవలేని పరిస్థితి. అమ్మే నన్ను దగ్గరుండి చూసుకుంది. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ కన్నీళ్లొస్తాయి. యాక్సిడెంట్లో నా కాలు ఫ్రాక్చర్ అయితే రాడ్డు వేశారు. షూటింగ్లతో బిజీబిజీగా ఉండటంతో ఇంతవరకు ఈ రాడ్ తీయించలేదు. డ్యాన్స్ చేసేటప్పుడు రాడ్ వల్ల కొన్ని మూమెంట్స్ చేయలేకపోయేదాన్ని. చాలా సంవత్సరాలవుతోందని రాడ్డు తీయించడానికి ఆస్పత్రికి వెళ్లాను' అని చెప్పుకొచ్చింది. ఆస్పత్రికి వెళ్లి అన్నిరకాల పరీక్షలు చేయించుకుంది రోహిణి. రాడ్ తీయడం కోసం ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. తీరా రాడ్డు లోపల కూరుకుపోయిందని, ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదని వైద్యులు తెలిపారు. బలవంతంగా రాడ్డును బయటకు లాగితే ఎముక విరిగే ప్రమాదం ఉండటంతో దాన్ని అలాగే ఉంచేశామని పేర్కొన్నారు. దీంతో రాడ్డు తీసేస్తున్నారన్న ఆనందం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు. చదవండి: ది కేరళ స్టోరీ డైరెక్టర్, హీరోయిన్కు యాక్సిడెంట్ -
వాస్తవ ఘటనలతో...
పూజ, స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి ముఖ్య తారలుగా బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎదుబాటి కొండయ్య నిర్మించిన చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ – ‘‘సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా మా చిత్రకథని తయారు చేశాం’’ అన్నారు. ‘‘అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు పూజ. -
ఈరోజు రఘువరన్ బతికుంటే.. భర్తను గుర్తుచేసుకొని రోహిణి ఎమోషనల్
పోయినోళ్లు అందరూ మంచోళ్లే.. ఉన్నోళ్లు పోయిన వారి తీపి గురుతులు అంటారు. నటి రోహిణి అలాంటి ఘటనే గుర్తు చేసుకున్నారు. బాలనాటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న నటి రోహిణి. నటుడు రఘువరన్ గురించి చెప్పాలంటే విలక్షణ నటుడు అన్నదానికి బ్రాండ్ అని పేర్కొనవచ్చును. కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వైవిధ్యమైన కథాపాత్రల్లో నటించి మెప్పించిన నటుడు ఈయన. తమిళంలో పూవిళి వాసలిలే, మనిదన్, ఎన్ బొమ్మ కుట్టి అమ్మావుక్కు, అంజలి, బాషా వంటి పలు చిత్రాల్లో తనదైనశైలిలో నటించి ఆ చిత్రాల విజయంలో భాగమయ్యారు. అలాంటి గొప్ప నటుడి ఆయుషు త్వరగా ముగియడం బాధాకరం. కాగా నటుడు రఘువరన్ నటి రోహిణి 1996లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2004లో మనస్పర్థలు కారణంగా విడిపోయారు. కాగా రఘువరన్ 2008 మార్చి 19వ తేదీన కన్నుమూశారు. ఆయన వర్ధంతి సందర్భంగా నటి రోహిణి స్మరించుకుంటూ ఆమె, రఘువరన్ తమ బిడ్డతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. అందులో రఘువరన్ జీవించి ఉంటే నేటి సినిమాలు ఆయన కచ్చితంగా ఇష్టపడే వారని, ఒక నటుడుగా చాలా సంతోషించేవారని ఉద్వేగంతో పేర్కొన్నారు. ఆమె ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
మా నాన్నకు ఏమన్నా అయితే.. ఎవ్వరినీ వదలను: లాలూ కూతురు
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను సీబీఐ ప్రశ్నిస్తున్నసమయంలో ఆయన కుతూరు రోహిణి ఆచార్య కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తన తండ్రికి ఏమైనా అయితే ఎవ్వరినీ వదలనని హెచ్చరించారు. తన తండ్రిని తరచూ వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరికాదని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్నంతా గుర్తుపెట్టుకుంటామని, టైం వచ్చినప్పుడు వాళ్ల పనిచెబుతామని వ్యాఖ్యానించారు. ఒకవేళ లాలూకు ఏదైనా జరిగితే ఢిల్లీ పీఠాన్ని కదిలించే శక్తి తమకు ఉందని రోహిణి ట్వీట్ చేశారు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని, దాన్ని పరీక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. पापा को लगातार परेशान किया जा रहा है। अगर उन्हें कुछ हुआ तो मैं किसी को नहीं छोड़ूंगी। पापा को तंग कर रहे हैं यह ठीक बात नहीं है। यह सब याद रखा जाएगा। समय बलवान होता है, उसमें बड़ी ताकत होती है। यह याद रखना होगा। — Rohini Acharya (@RohiniAcharya2) March 7, 2023 రోహిణి ఆచార్య.. లాలూ యాజవ్ రెండో కుమార్తె. తన తండ్రి కిడ్నీలు చెడిపోతే ఈమె ఒక కిడ్నీని దానం చేసి ఆయనపై ప్రేమను చాటుకున్నారు. సింగపూర్లో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఫిబ్రవరి 11న భారత్కు తిరిగివచ్చిన లాలూ తన పెద్ద కుమార్తె, ఎంపీ మిసా భారతి ఢిల్లీ నివాసంలో ఉంటున్నారు. అయితే ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కుంభకోణానికి సంబంధించి లాలూను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం మిసా భారతీ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వేధిస్తున్నారని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ -
ఐపీఎస్ రూపా Vs ఐఏఎస్ రోహిణి: కాల్ లీక్ ప్రకంపనలు.. ఆ ఆడియోలో ఏముంది?
బనశంకరి(కర్ణాటక): ఐపీఎస్ రూపా మౌద్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య గత ఆదివారం నుంచి తలెత్తిన సంగ్రామం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. వివాదం నేపథ్యంలో వారిద్దరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా సర్కారు బదిలీ చేయడం తెలిసిందే. కాల్ లీక్ ప్రకంపనలు తాజాగా రూపా మౌద్గిల్– సామాజిక కార్యకర్త గంగరాజు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. ఇందులో రూపా తీవ్ర ఆరోపణలు చేయడం ఉంది. కబిని వద్ద ఒక స్థలం డీల్ చేయడానికి భూ రికార్డుల కోసం రోహిణి సింధూరి నా భర్త, ఐఏఎస్ మౌనీశ్ వద్ద సమాచారం తీసుకుందని రూపా ఆ ఆడియోలో చెప్పారు. రూపా గతంలో చేసిన ఆరోపణలను మళ్లీ ఈ కాల్లో ప్రస్తావించారు. ఆడియో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే సారా మహేశ్ కేసును వెనక్కి తీసుకోవడానికి రాజీకోసం హెచ్డీ.కుమారస్వామి, హెచ్డీ.దేవేగౌడ, ఇద్దరు ఐఏఎస్ల ద్వారా రోహిణి ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెప్పారు. అంతేగాక ఆడియోలో గంగరాజుపైన రూపా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఆమెను సపోర్టు చేస్తున్నారా, నువ్వు ఫైల్ పట్టుకుని పదేపదే ఆమె వద్దకు వెళ్లడం తప్పా ఏముంది, కాల్ రికార్డు చేసుకుంటావా, చేసుకో, నాకు వచ్చే కోపానికి.. అంటూ అసభ్య పదజాలంతో దూషించడం రికార్డయింది. మైసూరులో ఆడియో విడుదల ఐపీఎస్ రూపాతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను బుధవారం మైసూరులో సామాజిక కార్యకర్త గంగరాజు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గొడవ మరింత జఠిలమయ్యే సూచనలే ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఆడియో హాట్ టాపిక్గా మారింది. రోహిణి సింధూరి ఆమె పరిచయాలను ఉపయోగించుకుని భర్త అన్నను బీజేపీలోకి చేర్చాలని చూస్తోంది అని ఆడియోలో రూపా పేర్కొన్నారు. తన భర్త మౌనీశ్ తీరుపైనా, కుటుంబ వ్యవహారాలపైనా రూపా ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రూపా నన్ను పావుగా వాడాలని చూశారు. ఈ సందర్భంగా మీడియాతో గంగరాజు మాట్లాడుతూ ఐపీఎస్ రూపా నాపై కోపంతో మాట్లాడారు. నాతో 25 నిమిషాలు మాట్లాడారు. రోహిణి సింధూరికి వ్యతిరేకంగా పోరాటం కోసం నన్ను ఉపయోగించుకునేందుకు ఆమె యత్నించారు. నాకు ఫోన్ చేసి భూ వ్యవహారాల గురించి సీబీఐ అధికారిలా ప్రశ్నించారు, రూపా నా మొబైల్ నుంచి ఫోటో తీసుకుని, వాట్సాప్ చాట్ను ఎమ్మెల్యే సా.రా మహేశ్కు పంపించారు. చదవండి: ఐపీఎస్ రూపా మౌద్గిల్ను కట్టడి చేయండి నన్ను అసభ్య పదజాలంతో మాట్లాడారు. రోహిణి అక్రమాల గురించి నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, మీడియా వద్ద వాటి గురించి మాట్లాడు అని చెప్పగా అందుకు నేను నిరాకరించానని ఆయన చెప్పారు. నా కుటుంబానికి ఏమైనా అయితే రూపానే కారణం. అధికారం మాటున ఆమె ఏమైనా చేయొచ్చని ఆయన ఆరోపించారు. ఆమె నా రాకపోకలను, కార్యకలాపాలపై నిఘా వేశారు, రూపాపై క్రిమినల్ కేసు వేస్తా అన్నారు. -
గొడవకు మూల్యం.. ఆ ఇద్దరికీ ప్రభుత్వం షాక్!
బనశంకరి: నువ్వెంత అంటే, నువ్వెంత అని ఆరోపణలు చేసుకుని అమీతుమీకి సిద్ధమైన ఐపీఎస్ అధికారిణి డి.రూపా మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి డి.రోహిణి సింధూరి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఐపీఎస్ రూపాను బదిలీచేసి, ఆ పోస్టులో ఐఏఎస్ భారతిని సర్కారు నియమించింది. దేవాదాయశాఖ కమిషనర్ పోస్టు నుంచి రోహిణిని బదిలీ చేసి ఆ స్థానంలో హెచ్.బసవరాజేంద్రను నియమించింది. రూప, రోహిణికి ఎలాంటి పోస్టులు లేకుండా వెయిటింగ్లో ఉంచడం గమనార్హం. ఐపీఎస్ రూప భర్త బదిలీ ఇక ఐపీఎస్ రూప భర్త మౌనీశ్ మౌద్గిల్ ఐఏఎస్ అధికారి కాగా, ఆయన ప్రస్తుతం సర్వే, భూరికార్డుల శాఖ కమిషనర్గా ఉండేవారు. తాజా గొడవల నేపథ్యంలో ఆయనకు కూడా బదిలీ తప్పలేదు. సిబ్బంది పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు స్థానభ్రంశమైంది. ఆయన పోస్టులో సర్వేశాఖ అదనపు డైరెక్టర్ గా ఉన్న సీఎన్.శ్రీధర్కు అవకాశం దక్కింది. ఈ బదిలీల్లో భాగంగా పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న ఐఏఎస్ హెచ్వీ.దర్శన్ ను తుమకూరు మహానగర పాలికె కమిషనర్గా నియమించింది. ఘాటుగా నోటీసులు ఇద్దరు మహిళా అధికారుల విభేదాల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఉభయులకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ సూచనమేరకు నోటీసులు అయ్యాయి. హద్దుమీరి ప్రవర్తించరాదని అందులో హెచ్చరించారు. ఆరోపణలు చేసుకోవడం స రీ్వస్ బంధనల ఉల్లంఘన కు పాల్పడినట్లు అవుతుంది, బహిరంగంగా మాట్లాడరాదు, ఒకవేళ మళ్లీ మాటల యుద్ధానికి దిగితే కఠినచర్యలు తీసుకుంటామని నోటీస్లో పేర్కొన్నారు. మీ ఆరోపణలను ప్రభుత్వం ముందు పెట్టవచ్చు, ఇకపై మీడియా ముందుకు వెళ్లరాదని నోటీసుల్లో సిబ్బంది, పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి జేమ్స్ తారకన్ పేర్కొన్నారు. రూపపై కేసు నమోదుపై మీమాంస రోహిణి సింధూరి భర్త సుదీర్రెడ్డి ఐపీఎస్ రూపాపై బాగలగుంటె పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తన భార్య ఫోన్ను హ్యాక్ చేసి ఫోటోలు దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుపై పోలీసులు న్యాయ నిపుణులతో సంప్రదించారు. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లి ఎఫ్ఐఆర్ని నమోదు చేయించాలని రోహిణి కుటుంబసభ్యులు సిద్దమయ్యారు. కేబినెట్ భేటీలో చర్చ సోమవారం సాయంత్రం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రూపా– రోహిణి రగడ గురించి కొందరు మంత్రులు లేవనెత్తారు. ముఖ్యమంత్రి బొమ్మై సైతం తీవ్రంగా పరిగణించి వారిని బదిలీ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఆదివారం రూపా ఫేస్బుక్ ద్వారా ఆరోపణలు చేయడం, అందుకు రోహిణి ఘాటుగా బదులివ్వడం, సోమవారం వివాదం విధానసౌధకు చేరి ఇద్దరూ మీడియా ముందు అక్కసు వెళ్లగక్కడంతో వేడెక్కింది. మంగళవారం ఇరువర్గాలూ మౌనం దాల్చడంతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. -
రూపా Vs రోహిణి.. ఇక ఊరుకోం, కళ్లు మూసుకుని కూర్చోలేదు, చర్యలు తప్పవు!
సాక్షి, బెంగళూరు: ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్– ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మధ్య మాటల పోట్లాట సోమవారం సర్కారు వద్దకు చేరింది. రోహిణిపై రూపా ఫేస్బుక్ ద్వారా రెండురోజులుగా తీవ్రమైన ఆరోపణల పరంపరను సాగించారు. రోహిణి కూడా ప్రత్యారోపణలు చేశారు. రూపా మానసిక వైద్యం చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ యంత్రాంగానికి రెండు కళ్ల వంటి ఐపీఎస్– ఐఏఎస్ అధికారులు, అందులోనూ ఇద్దరూ మహిళలు దూషణలకు దిగడంతో ప్రభుత్వం ఆలస్యంగానైనా మేలుకుంది. వారిద్దరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మ సోమవారం విధానసౌధకు వేర్వేరుగా పిలిపించి వివరణలు తీసుకున్నారు. ఇకపై నోరు మెదపరాదని ఆదేశించినట్లు తెలుస్తోంది. రూపావన్నీ తప్పుడు ఆరోపణలు: రోహిణి సీఎస్ను కలిసిన తరువాత ఐఏఎస్ రోహిణి విధానసౌధ బయట మీడియాతో మాట్లాడారు. రూపా గురించి సీఎస్కు 4 పేజీల ఫిర్యాదు లేఖను అందజేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా, మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసి సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారి రూపామౌద్గిల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె నా వ్యక్తిగత జీవితంపై మాట్లాడింది, నేను సోషల్ మీడియాలో చురుకుగా లేను. వ్యక్తిగత ఆరోపణలు పట్ల నా భర్త మాట్లాడారని రోహిణి చెప్పారు. జాలహళ్లిలో ఉన్న ఆస్తి గురించి రూపా ప్రస్తావించారు, ఆ ఆస్తి నా భర్త తల్లికి చెందినదని, తమది కాదని పేర్కొన్నారు. సీఎస్ను కలిపిన రూపా ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్ కూడా సీఎస్ వందితా శర్మను కలిసి వివరణ ఇచ్చారు. ఐఏఎస్ రోహిణి సింధూరి అవినీతి అక్రమాలకు పాల్పడిందని రూపా ఫిర్యాదు చేశారు. రోహిణిపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఫేస్బుక్లో తెలిపారు. ఐపీఎస్కు ఎంపీ మద్దతు ఐపీఎస్ అధికారిణి డి.రూపా అడిగిన ప్రశ్నలు నైతికంగా సరైనవేనని, వాటికి రోహిణి, ఆమె బంధువులు సమాధానం ఇవ్వాలని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు. మైసూరులో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రతాప్ సింహా మాట్లాడుతూ చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది కోవిడ్ బాధితులు మరణించారని, ఆ ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా చేసే బాధ్యత మైసూరు జిల్లాధికారిదని అన్నారు. ఆ సమయంలో జిల్లాధికారిగా ఉన్న రోహిణి సింధూరి దీనికి పూర్తి బాధ్యత వహించాలని, ఆమె బదులివ్వాలని అన్నారు. ఇక ఊరుకోం: న్యాయమంత్రి ఇద్దరు అధికారులూ ఇలాగే పరస్పర దూషణలకు దిగితే చర్యలు తప్పవని న్యాయ మంత్రి మాదుస్వామి విధానసౌధలో తెలిపారు. ఇప్పటివరకు వ్యక్తిగత విషయం అని ఊరుకున్నామని, విధానసౌధ వరకు వచ్చింది కాబట్టి ఇక మేము ఊరుకునేదిలేదని, ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధానసౌధ వద్ద మీడియా ముందుకు వస్తున్న ఐఏఎస్ రోహిణి సింధూరి వదిలిపెట్టేది లేదు: రోహిణి ఈ విషయాన్ని వదిలిపెట్టేదిలేదని రోహిణి హెచ్చరించారు. వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేయడం తగదు, ఏదైనా ఉంటే ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదు, అన్ని చర్యలకూ సిద్దంగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రొఫెషనల్గా మాట్లాడాలి కానీ పర్సనల్గా కాదన్నారు. రూప నాపై దుష్పచారం చేయడం తప్పు, చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటానని తెలిపారు. గెట్ వెల్ సూన్ అని కౌంటర్ ఇచ్చారు. ఇద్దరిపైనా చర్యలు తప్పవు: హోంమంత్రి జ్ఞానేంద్ర ఐపీఎస్– ఐఏఎస్ల గొడవను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరు అధికారురూ హద్దుమీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి వ్యక్తిగత విషయం ఏమైనా చేసుకోని, కానీ మీడియా ముందు బహిరంగంగా మాట్లాడటం సరికాదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజాసేవకులని, కానీ వారు ఆ హోదాలకు అవమానం చేశారని ఆయన అన్నారు. సీఎస్, డీజీపీ తో మాట్లాడానని, సీఎం బొమ్మై సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చట్టపరంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. -
బుల్లితెర నటి పెళ్లి, మూడు ముళ్ల వీడియో వైరల్
నెగెటివ్ రోల్స్తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి సునందమాల పెళ్లి పీటలెక్కింది. శంకర్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. ఈ పెళ్లికి బిగ్బాస్ కంటెస్టెంట్, నటి, కమెడియన్ రోహిణి, సీరియల్ నటి తనూజ సహా తదితరులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నూతన వధూవరులతో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం సునంద పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వధువు మెడలో వరుడు తాళి కడుతున్న వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా సునంద- శంకర్ల నిశ్చితార్థం ఇటీవలే వైజాగ్లో ఘనంగా జరిగింది. తన నిశ్చితార్థం నుంచి ప్రీవెడ్డింగ్ వరకు అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడిస్తూ వచ్చింది సునంద. పెళ్లి పనుల వీడియోను సైతం యూట్యూబ్లో అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) చదవండి: హీరోయిన్ కంటే ఎక్కువే సంపాదించిన ఆదిరెడ్డి -
గర్వంగా ఉంది.. లాలూ కూతురిపై బీజేపీ ప్రశంసలు
ఢిల్లీ: మానవ సంబంధాల కంటే డబ్బుకి, సంఘంలో పేరుప్రతిష్టలు, పరపతికే ప్రాధాన్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. అయినవాళ్లను కూడా దూరంగా పెడుతున్నారు కొంతమంది. అయితే.. కన్నవాళ్ల కోసం, వాళ్ల ఆరోగ్యం కోసం తాపత్రయ పడే పిల్లలకు సమాజంలోని తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అలా.. రాజకీయ దిగ్గజం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యపై ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బీజేపీ ఫైర్బ్రాండ్, బీహార్ నేత గిరిరాజ్ సింగ్.. లాలూ యాదవ్పై మామూలుగా విరుచుకుపడరు. అలాంటి వ్యక్తి.. లాలూ కూతురిపై ఆశ్చర్యకరంగా ప్రశంసలు గుప్పించారు. ‘‘రోహిణి ఆచార్య.. కూతురు అంటే నీలా ఉండాలి. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. తర్వాతి తరాలకు నువ్వు(రోహిణిని ఉద్దేశిస్తూ..) ఒక ఆదర్శప్రాయంగా నిలిచావు అంటూ పోస్ట్ చేశారు. మరో బీజేపీ నేత నిషికాంత్ దుబే సైతం రోహిణిపై పొగడ్తలు గుప్పించారు. నాకు కూతురు లేదు. కానీ, ఇవాళ రోహిణిని చూశాక.. దేవుడితో పోరాడైన సరే నాకు ఓ కూతురిని ఇవ్వమని కోరాలని ఉంది అంటూ ట్వీట్ చేశారాయన. “बेटी हो तो रोहणी आचार्य जैसी” गर्व है आप पर… आप उदाहरण होंगी आने वाले पीढ़ियों के लिए । pic.twitter.com/jzg3CTSmht — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) December 5, 2022 मुझे भगवान ने बेटी नहीं दी,आज रोहिणी आचार्य को देखकर सचमुच भगवान से लड़ने का दिल कर रहा है है,मेरी नानी हमेशा कहती थी,बेटा से बेटी भली जो कुलवंती हो pic.twitter.com/j0WSMfckjL — Dr Nishikant Dubey (@nishikant_dubey) December 5, 2022 ఇదిలా ఉంటే.. లాలూ పెద్ద కూతురు మీసా భారతి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం గత సాయంత్రం లాలూ సర్జరీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వయసున్న లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో 40లో ఉన్న రోహిణి ఆచార్య.. తన కిడ్నీని తండ్రికి దానం ఇచ్చింది. సింగపూర్లో సోమవారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. Ready to rock and roll ✌️ Wish me a good luck 🤞 pic.twitter.com/R5AOmFMW0E — Rohini Acharya (@RohiniAcharya2) December 5, 2022 -
లాలు యాదవ్ కుమార్తె ట్వీట్... బలపడనున్న 'గత బంధం'
పాట్నా: బిహార్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిష్క్రమణతో బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మేరకు జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం తోపాటు మళ్లీ నితీష్ కుమార్ లాలు యాదవ్ భాగస్వామ్యం రానునుంది. అంతేకాదు నితీష్ కుమార్ మంగళవారం సాయంత్ర 4 గం.లకు గవర్నర్ ఫాగు చౌహాన్తో సమావేశం అవ్వాలని కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు నితీష్కి మద్దతుగా దాదాపు 160 మంది ఎమ్మెల్యేలు అధికార సంకీర్ణానికి విధేయత చూపుతామని ప్రమాణం చేశారు. పైగా మంగళవారం ఉదయమే నితీష్ తన అధికారికి నివాసంలో జేడీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు కూడా. దీంతో నితీష్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లాలు యాదవ్ కుమార్తె రోహిణి యాదవ్ ఆ మాటలకు బలం చేకూరుస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ మేరుకు ఆమె ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ... వెలుగులోకి రావలనుకున్నావారు త్వరపడండి, ఏకగ్రీవంగా సీఎంని ఎన్నుకునేందుకు సిద్దంగా ఉండండి అని ట్వీట్ చేశారు. పైగా నితీష్ లాలుల గత బంధ బలపడునుందని, ఈ మహా గతబంధన్ ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వాస్తవానికి నితీష్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు మహాకూటమి నుంచి వైదొలిగారు. బిహార్లో దాదాపు 243 మంది సభ్యుల అసెంబ్లీ ఉంది. ఐతే మొత్తం ఎమ్మెల్యేల్లో బిజేపీకి 77, జేడీయేకి 45 మంది సభ్యులు ఉండగా, ఆర్జేడీ సుమారు 127 మంది సభ్యులతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అదీగాక జేడీయూలో సీనియర్ నాయకుడు ఆర్సీపీ సింగ్ వైదొలగడం, అతనికి మాత్రమే మంత్రి పదవి ఇవ్వడం తదితర కారణాలే బిహార్లో రాజకీయ అస్థిరత ఏర్పడటానికి కారణం. తాను సీఎం అయినప్పటికీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తకి లోనైన సీఎం నితీష్ కుమార్ తప్పుకునేందుకు రెడీ అయ్యారు. "राजतिलक की करो तैयारी आ रहे हैं , लालटेन धारी "✌️ pic.twitter.com/R0pYeaU2mN — Rohini Acharya (@RohiniAcharya2) August 9, 2022 (చదవండి: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా? -
నూలుతో అల్లిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్లను రూపొందించి..
ముప్పై ఆరేళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ నుంచి కోలుకున్న డాక్టర్ రోహిణి పాటిల్ తను అనుభవించిన బాధ ఇతర బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు రాకూడదనుకుంది. సిలికాన్ ప్రొస్తెటిక్ బ్రెస్ట్కు అయ్యే ఖర్చు అందరూ భరించలేరని, నూలుతో అల్లిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్లను రూపొందించి, ఉచితంగా అందజేస్తోంది. 2018లో ప్రారంభించిన ‘నిటెడ్ నాకర్స్ ఇండియా’ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు చేరవవుతున్నారు డాక్టర్ రోహిణి. నూలు రొమ్ముల తయారీ వెనకాల కృషి గురించి, మహిళలకు ఉచితంగా అందజేస్తున్న విధానాల గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఒక రోజు ఓ పెద్దావిడ నా శిబిరానికి వచ్చింది. ‘పది నెలల క్రితం రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు అదే ప్లేస్లో గాయం కావడంతో ఆసుపత్రికి వచ్చాను’ అని చెప్పింది. నేనావిడచేత ఇంకాస్త మాట్లాడించాను. అప్పుడు ఆమె చెప్పింది విని చాలా బాధపడ్డాను. వెదురు బుట్టకు ఒక క్లాత్ను కలిపి కుట్టి, రొమ్ము స్థానంలో పెట్టుకుంటున్నట్టు, ఆ వెదురు కొన ఒరిపిడి వల్ల గాయమయ్యిందని చెప్పింది. రొమ్ము క్యాన్సర్ కారణంగా చికిత్సలో భాగంగా రొమ్మును తీసేస్తే అది ఆ మహిళల మానసిక స్థితిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. సిలికాన్ ప్రొస్తెటిక్ బ్రెస్ట్ల ఖరీదు ఎక్కువ కావడంతో వాటిని మహిళలకు ఉచితంగా అందించలేకపోయాను. ఒంటరి తల్లిని..? 2002లో నాకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు ఆలోచనలో పడ్డాను. మా కుటుంబంలో చిన్న వయస్సులో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు లేవు. దీంతో నేను ఈ వ్యాధిని అంత తొందరగా అంగీకరించలేక పోయాను. పైగా ఎనిమిదేళ్ల బిడ్డకు ఒంటరి తల్లిని. నా బిడ్డ పోషణకు, చదువుకు ఖర్చులను నేనే చూసుకోవాలి. దీంతో నా చికిత్స కాస్త ఆలస్యం అయ్యింది. రొమ్ము భాగాన్ని తీసేయాల్సి వచ్చింది. చీర కట్టేటపుడు రెండు భుజాల మీదా పల్లూ పట్టుకుని ఛాతీ కనిపించకుండా ఉండేదాన్ని. నేను డాక్టర్ అయినప్పటికీ, రొమ్ము తొలగిం^è డాన్ని ఆపలేకపోయాను. చికిత్స గాయాలు మానాయి. దీంతో క్లాత్ను ఒక బంతిలా చేసి బ్లౌజ్ లోపల ఉంచడం ప్రారంభించాను. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ... మా కుటుంబసభ్యుల సలహా మేరకు మరో డాక్టర్ని కలిసినప్పుడు ‘మీరు ప్రొస్తెటిక్ బ్రెస్ట్ ఎందుకు ఉపయోగించకూడదు’ అని నన్ను అడిగాడు. డాక్టర్ అయిన తర్వాత కూడా ఈ ప్రశ్న నా మదిలో ఎందుకు రాలేదనే ప్రశ్న నన్ను ఆశ్చర్యపరిచింది. వెంటనే ప్రొస్తెటిక్ బ్రెస్ట్ కొనడానికి వెళ్లాను, దాని ఖరీదు రూ. 6,000 అని చెప్పారు. ఈ మొత్తం నాకు చాలా ఎక్కువ. దీంతో సిలికాన్తో చేసిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్ వద్దనుకున్నాను. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, నేను జీవించాలనే నా ఆశ వదులుకోలేదు. ప్రయత్నాల ఫలితం తక్కువ ఖర్చుతో కృత్రిమ స్తనాలను తయారు చేయాలనే విషయంపైన నా ప్రయత్నాలు సంవత్సరం పాటు కొనసాగాయి. వీటన్నింటి మధ్యలోనే నా కొడుకు పై చదువులకోసం అమెరికా వెళ్లాడు. ఒకసారి నేను మా అబ్బాయిని కలవడానికి అమెరికా వెళ్లాను. అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రూప్ని కలిసాను. సిలికాన్ బ్రెస్ట్లకు బదులుగా నూలుతో అల్లిన ప్రొస్తెటిక్ బ్రెస్ట్లను వారు ఉపయోగిస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ వాటిని ప్రారంభించాలనుకుని, చాలా మందిని కలిశాను. నూలు కు సరిపడా డబ్బులు ఒకరు, అల్లిన బ్రెస్ట్ పోస్టింగ్కు అయ్యే ఖర్చును ఒకరు.. ఇలా నా స్నేహబృందంలో కొందరు తీసుకున్నారు. అలా ‘నిటెడ్ నాకర్స్ ఇండియా’ మొదలైంది. నాకేదో ప్రయోజనం అనుకున్నవారంతా! నాతో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు ప్రజలకు చేరుతూనే ఉంది. మహిళలు కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చి చేరడం మొదలుపెట్టారు. కొందరు ఖర్చుకు డబ్బులు ఇవ్వడం, మరికొందరు నూలు బ్రెస్ట్ల అల్లిక పనిని చేపట్టారు. ముందుగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి అవసరమైన మహిళలు నిట్ నాకర్లను తీసుకోమని చెబుతుండేదాన్ని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. ఒకరోజు ఆసుపత్రికి చేరుకోవడం ఆలస్యమైతే చాలు మహిళల క్యూ చాంతాడంత అయి ఉంటుంది. అక్కడి వైద్యులు నన్ను చూస్తూనే ‘కృత్రిమ స్తనాలు ఇచ్చే చెల్లెలు ఎప్పుడు వస్తారు’ అని అడుగుతున్నారు. అని చెప్పేవారు. రొమ్ము క్యాన్సర్ నుండి బయటపడిన వ్యక్తిగా, ముఖ్యంగా డాక్టర్ అయినందున మహిళలకు అవగాహన కల్పించడం నా బాధ్యతగా భావించాను. మొదట్లో నాగపూర్లోని కాలేజీలు, ఇన్స్టిట్యూట్లు, ఇరుగు పొరుగు గ్రామాలకు వెళ్లి కనుక్కోమని మహిళలనే కోరాను. ‘మా కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేద’ని చాలా చోట్ల విన్నాను. సాధారణంగా ప్రజలు క్యాన్సర్ను జన్యుపరమైన వ్యాధిగా భావిస్తారు. అదే సమయంలో గ్రామాల్లోని మహిళల పని వ్యవసాయంతో ముడిపడి ఉండటంతో ఒకరోజు జీతం వదులుకొని, చెకప్కు డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకో వారికి అర్థం కాలేదు. దీంతో స్వయంగా శిబిరాలు నిర్వహించి, చెకప్ల కోసం మహిళలకు 50 శాతం రాయితీతో కూపన్లు పంపిణీ చేసేదానిని. ఇప్పుడు మహిళలు అర్ధం చేసుకుంటున్నారు. తమ సమ్మతిని తెలియజేస్తున్నారు’’ తన పని గురించి వివరిçస్తారు రోహిణీ పాటిల్. డాక్టర్ రోహిణీ పాటిల్ పాతికేళ్లుగా వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు డాక్టర్ రోహిణి పాటిల్. మెడికల్ ఆఫీసర్గా, లెక్చరర్గా, క్యాన్సర్ అవేర్నెస్ స్పీకర్గా ఉన్నారు. ‘నిట్టెడ్ నాకర్స్ నాగపూర్ అనే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ బారిన పడి, తగ్గిన వారికి నూలుతో అల్లిన కృత్రిమ రొమ్మును అందిస్తున్నారు. -
హగ్గుల వివాదం.. షణ్నును వెనకేసుకొచ్చిన సన్నీ
Bigg Boss Telugu 5, Sunny Supports Shannu: షణ్నుకు దగ్గరవుతున్నావు, కానీ అతడిని హగ్ చేసుకోవడమే నచ్చలేదు అని సిరి తల్లి బిగ్బాస్ హౌస్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో హౌస్మేట్స్ అందరూ షాకవగా షణ్ను అయితే తలెత్తుకోలేకపోయాడు. ఆమె అలా అంటుంటే సిరి దాన్ని ఆపకుండా సైలెంట్గా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. ఇంత చేసి ఇలాంటి మాటలు పడాల్సి వచ్చిందేనని కుంగిపోయి ఏడ్చేశాడు. అయితే ఇలాంటి సమయంలో సన్నీ అతడికి అండగా నిలిచాడు. వాళ్లది ఫ్రెండ్షిప్ అని నొక్కి చెప్పాడు. '82 రోజులుగా వాళ్లను చూస్తూనే ఉన్నాం. వాళ్లిద్దరిదీ చాలా మంచి ఫ్రెండ్షిప్. బెస్ట్ఫ్రెండ్స్గా కనెక్ట్ అయ్యారు. నేను, మానస్ ఎంత బెస్ట్ఫ్రెండ్సో వాళ్లిద్దరూ అంత బెస్ట్ఫ్రెండ్స్' అంటూ ఆమెకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. సన్నీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. షణ్ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కూడా థ్యాంక్స్ మచ్చా అంటూ కృతజ్ఞతలు తెలిపారు. బిగ్బాస్ కంటెస్టెంట్ రోహిణి అయితే వీడు బంగారం అంటూ సన్నీని మెచ్చుకుంది. చదవండి: హగ్గుల గురించి తీయకు.. తల్లిగా చెప్పడం నా బాధ్యత.. ఏడ్చేసిన షణ్ను View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
బిగ్బాస్ కంటెస్టెంట్కు డైమండ్ రింగ్ గిఫ్ట్! ఎవరిచ్చారంటే?
బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ రౌడీ రోహిణి గత నెలలో 28వ బర్త్డే జరుపుకుంది. తాజాగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోను యూట్యూబ్లోని తన ఛానల్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. ఈ వీడియోలో రోహిణి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఓ ఫాంహౌస్లో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలకు మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్లు శివజ్యోతి, లాస్య కూడా హాజరయ్యారు. ఇక రోహిణి పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్నో బహుమతులు పట్టుకొచ్చారు ఆమె సన్నిహితులు. అందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఒకతైతే ఆమె ఫ్యామిలీ ఇచ్చిన బహుమతి మరో ఎత్తు. రోహిణి తల్లి కూతురి కోసం డైమండ్ రింగ్ను బహుమానంగా ఇచ్చింది. అది చూసి రోహిణి ఎంతగానో మురిసిపోయింది. వెంటనే దాన్ని తన సోదరితో వేలికి తొడిగించుకుంది. తనకు వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చిన తల్లిని, సోదర్ని కౌగిలించుకుని వారిపై ప్రేమను కురిపించింది. ఇక ఈ సెలబ్రేషన్స్కు హాజరైన ఇమ్మాన్యుయేల్కూడా ఖరీదైన ఉంగరాన్ని గిఫ్టిచ్చినట్లు తెలుస్తోంది. రోహిణికి చెవిరింగులు, ఆభరణాలు, చీర వంటి మరెన్నో బహుమతులు సైతం కానుకగా అందాయి. గిఫ్టులంటే ఇష్టం అని చెప్పే రోహిణికి వీటన్నింటినీ చూసి తెగ మురిసిపోయింది. -
సొంతింటి కల నిజం చేసుకున్న బిగ్బాస్ కంటెస్టెంట్, ఇల్లు చూశారా?
బుల్లితెర సీరియల్ నటి, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ రౌడీ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యాక్టింగ్ టాలెంట్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న రోహిణి ఎట్టకేలకు తన సొంతింటి కలను నిజం చేసుకుంది. హైదరాబాద్లోని మణికొండలో డూప్లెక్స్ హౌస్ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ తెగ ఎగ్జైట్ అయింది. స్వంత ఇల్లు కొనుక్కోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని చెప్తూ ఆ ఇంట్లోకి తన తల్లిని తీసుకెళ్లింది. ఈ సందర్భంగా తన ఇంటిని అంతా చూపిస్తూ హోమ్ టూర్ వీడియోను యూట్యూబ్లో షేర్ చేసింది. హాల్, కిచెన్, బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, సిట్టింగ్ ఏరియా, టెర్రస్ను అంతా చూపిస్తూ సందడి చేసింది. అయితే ఈ ఇంటిని ఫర్నీచర్తో సహా కొన్నానని, త్వరలోనే దీన్ని తనకు నచ్చినట్లు మరింత అందంగా మార్చేస్తానంది. ముఖ్యంగా టెర్రస్పై తనకు నచ్చిన మొక్కలను పెంచుతానని చెప్పింది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. డూప్లెక్స్ అనగానే వెంటనే ఇల్లు కొనేశానన్న రోహిణి.. తన ఇంటికి ఎంత ఖర్చైందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
ప్రేమ,పెళ్లి.. నా కౌశిక్ చచ్చిపోయాడు.. అయినా
సాక్షి, వెబ్డెస్క్: స్నేహితుల ద్వారా పరిచయం.. అభిరుచులు కలిశాయి.. స్నేహం ప్రణయంగా మారింది... బంధంలోని స్వచ్ఛత మనసులను మరింతగా పెనవేసింది.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు.. పెద్దల ఆమోదంతో పెళ్లితో ఒక్కటై బంధాన్ని ‘శాశ్వతం’ చేసుకున్నారు.. సరదాలు, సంతోషాల సవ్వడిలో నాలుగేళ్ల కాలం నాలుగు రోజుల్లా గడిచిపోయింది. ప్రపంచంలోని ఆనందమంతా తమ చెంతే ఉన్నట్లు భావించారు ఆ దంపతులు.. వీరి అన్యోన్యతను చూసి విధి కూడా కన్ను కుట్టిందేమో... జంటను వేరు చేసింది.. ఆమె నుంచి అతడిని శాశ్వతంగా దూరం చేసింది... అయినా ఆమె ఓటమిని అంగీకరించలేదు.. గుండెల నిండా అతడు పంచిన ప్రేమ, నేనున్నా లేకున్నా నీ చిరనవ్వు చెరగనీయొద్దు అనే మాటలు ఆమెను మళ్లీ మామూలు మనిషిని చేశాయి.. జీవన గమనాన్ని కొనసాగించేందుకు బాటలు వేశాయి. సరికొత్త ఆరంభానికి పునాదులు పరిచాయి. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే ‘‘ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్లు ఈ లోకాన్ని వీడితే వాళ్లతో పాటు మనమూ వెళ్లిపోలేము కదా... ఒకవేళ అదే జరిగితే ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా మిగలడు.. దుఃఖాన్ని దిగమింగి, వారు మిగిల్చిన జ్ఞాపకాలతో శేష జీవితాన్ని గడపాలి. అప్పుడే సాంత్వన చేకూరుతుంది’’ ముంబైకి చెందిన రేడియో జాకీ రోహిణి రామనాథన్ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇవి. భర్త హఠాన్మరణంతో కుంగిపోయిన ఆమె.. అతి తక్కువ కాలంలోనే ఆ బాధ నుంచి తేరుకుంది. తన ‘‘మాటలతో’’ ఎంతో మందికి ఆహ్లాదం పంచుతూ ముందుకు సాగుతోంది. కొంగొత్త ఆశలతో ప్రతి ఉదయాన్ని స్వాగతిస్తూ... భర్తను చేరేదాకా ఇలాగే మరింత ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతానని చెబుతోంది. నేను ఆర్జే, తను రైటర్ ‘‘కామన్ ఫ్రెండ్స్ ద్వారా కౌశిక్ను కలిశాను. ఒక రేడియో జాకీగా కథలు చెప్పడం అంటే నాకు ఇష్టం. తను రచయిత.. అందుకేనేమో మా మనసులు తొందరగా కలిసిపోయాయి. తనతో ఉంటే సమయం తెలిసేదే కాదు. ఒక్క నిమిషం కూడా తనతో మాట్లాడకపోతే ఏమీ తోచేది కాదు. ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం. గంటల తరబడి కాల్స్. వీలుచిక్కినప్పుడల్లా షికార్లు. ప్రేమికుడిగా మారడం కంటే ముందు తను నా బెస్ట్ఫ్రెండ్. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాం. మూడేళ్ల డేటింగ్ తర్వాత.. ఒకరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుందామా అని తను అడగగానే వెంటనే ఓకే చెప్పేశాను. తనే నా సంతోషం. ఈఫిల్ టవర్ కింద ఆత్మీయంగా ముద్దులు పెట్టుకున్నాం. నచ్చిన ప్రదేశాలు చుట్టేశాం. మొత్తానికి ప్రేమలో మునిగితేలాం. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే సలహా ఇచ్చేందుకు తను లేడు తనకు న్యూయార్క్ సిటీ అంటే చాలా ఇష్టం. అందుకే అక్కడికి షిఫ్ట్ అయ్యాం. పెళ్లైన తర్వాత నాలుగేళ్లు ఎప్పుడు గడిచాయో తెలియనే లేదు. అస్సలు కలలో కూడా ఊహించని పరిణామం. నా కౌశిక్ చచ్చిపోయాడు.. నేను శోకసంద్రంలో మునిగిపోయాను. మాకే ఎందుకు ఇలా జరగాలి? నేను కోరుకున్న వ్యక్తితో జీవితం పంచుకున్నాను.. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా కౌశిక్ సలహా తీసుకునేదాన్ని... జీవితకాల విషాదం.. అలాంటి సమయంలో నాకు తోడుగా ఉండేందుకు కౌశిక్ ఈ లోకంలోనే లేడు కదా.. ‘‘మానసిక ఒత్తిడి, బాధ, కోపం’’ ఇలా ఎన్నో భావోద్వేగాలు ఏకకాలంలో నన్ను చుట్టుముట్టాయి. అప్పుడే భర్తను మర్చిపోయిందా? ప్రపంచమంతా చీకటైపోయినట్లు అనిపించింది. ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాను. నిజం చెప్పాలంటే మా అత్తామామలు ఆ సమయంలో నాకు అండగా నిలబడ్డారు. తనివితీరా ఏడ్చాను. 14 రోజుల తర్వాత కాస్త తేరుకున్నాను. పనిలో నన్ను నేను బిజీ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇంటర్వ్యూలు చేశాను. మామూలు స్థితికి వచ్చేశాను. కొంతమంది నన్ను చూసి... ‘‘తనేంటి ఇలా ఎలా నవ్వగలుగుతోంది? అసలు తనకు కొంచమైనా బాధ ఉందా?’’ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ వాళ్లకు తెలియదు.. ప్రతిరోజూ రాత్రి బోసిపోయిన ఇంట్లోకి రాగానే దుఃఖం నన్ను ఆవహిస్తుంది. మౌనంగానే రోదించడం నాకు అలవాటుగా మారిపోయింది. సూటిపోటి మాటలు, చేదు అనుభవాలు.. పది నెలలు గడిచిన తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే మానసిక చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాను. చాలా మార్పు వచ్చింది. కౌశిక్కు నేను ఏడిస్తే అస్సలు నచ్చేది కాదు. తనకు నా నవ్వంటే ఇష్టం. మరి దానిని దూరం చేసుకోవడం ఎందుకు అనిపించింది. నాలుగేళ్ల కాలంలో తను నాకు ప్రపంచంలోని అన్ని సంతోషాలు అందించాడు. జీవితకాలానికి సరిపడా తను పంచిన ఆ జ్ఞాపకాలే నాకు ఊపిరి. తనను మళ్లీ కలుసుకునే దాకా నేనిలాగే సంతోషంగా ఉంటాను’’ అని రోహిణీ రామనాథన్ తన మనో అంతరంగాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు. ఇష్టమైన వారిని కోల్పోయినా.. జీవించే హక్కు, అర్హత అందరికీ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఢిల్లీలో దారుణం భార్యా పిల్లలను చంపేసి తను కూడా..
సాక్షి ,న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఒక ఇంటిలో నాలుగు మృతదేహాలు కలకలం రేపాయి. ఎంత కష్టం వచ్చిందో గానీ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి తరువాత భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ సమీపాన రోహిణిలోని నాహరాపూర్లో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ధీరజ్ యాదవ్ బస్ డ్రైవర్గా ఢిల్లీ రవాణా సంస్థలో పని చేస్తున్నట్లు గుర్తించారు. ముందు తన భార్యా పిల్లలను హత్య చేసి తరువాత ధీరజ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియలేదు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా లేదా అప్పల బాధ భరించలేక ఈ దారణానికి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: ఆగ్రాలో దారుణం: భర్త కళ్ల ముందే భార్యను.. )