Gautham Krishna
-
టాప్ 2కి మనీ ఆఫర్.. ఫైనల్గా నిఖిల్ విన్నర్!
బిగ్బాస్ ఫైనల్లో సూట్కేస్ ఆఫర్ చేయడమనేది గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ! అయితే మధ్యలోనే టెంప్ట్ అయి సూట్కేస్ తీసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. దీనివల్ల విన్నర్ ఫుల్ ప్రైజ్మనీ అందుకోలేకపోతున్నాడు. పైగా ఈసారి కంటెస్టెంట్లకు చాలా హింట్స్ వెళ్లాయి.సూట్కేస్ ఆఫర్అసలు సిసలైన పోటీ నిఖిల్, గౌతమ్ మధ్యే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అందుకే టాప్ 5 మెంబర్స్కు సూట్కేస్ ఆఫర్ చేయలేదు. కానీ ఎవరూ మొగ్గు చూపలేదట.. తర్వాత ముగ్గురు మిగిలినప్పుడు టెంప్ట్ చేసే ప్రయత్నం చేయగా ఎవరూ తలొంచలేదట!అడుగు దూరంలో ఆగిపోయిన గౌతమ్చివరి ప్రయత్నంగా టాప్ 2 అంటే నిఖిల్, గౌతమ్లకు సూట్కేస్ ఆఫర్ చేసినప్పటికీ తీసుకోవడానికి ఇద్దరూ వెనకడుగు వేశాడు. దీంతో విన్నర్కు రూ.55 లక్షల ప్రైజ్మనీ అందింది. మరి ఈ మొత్తం అందుకున్న కంటెస్టెంట్ ఎవరనేది ఆల్రెడీ లీకైపోయింది. గెస్టుగా వచ్చిన రామ్చరణ్.. నిఖిల్ మళయక్కల్ను విన్నర్గా ప్రకటించినట్లు సమాచారం. దీంతో గౌతమ్ కృష్ణ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నీచంగా మాట్లాడిన గౌతమ్.. కొంపముంచేంత పని చేసిన నబీల్!
నిన్నమొన్నటివరకు కిచెన్లో ఎంత సేపు వంట చేసుకోవాలన్నది బిగ్బాసే డిసైడ్ చేసేవాడు. గంట, రెండు గంటలు మాత్రమే టైమ్ ఇచ్చేవాడు. సీజన్ ముగింపుకు వచ్చేసిన సందర్భంగా కిచెన్ టైమర్ను అన్లిమిటెడ్ చేసేశాడు. నామినేషన్స్ లేకపోయినా అలాంటి ఓ ప్రక్రియ పెట్టడంతో గౌతమ్, నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుకున్నారు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..రోహిణిని ఆటపట్టించిన గౌతమ్చాలాకాలంగా మనసులో దాచుకున్న మాటను చెప్పేస్తున్నానంటూ రోహిణి దగ్గర తెగ సిగ్గుపడిపోయాడు గౌతమ్. కానీ నోరు తెరుస్తూనే.. ఈ హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు. ఓ సహోదరుడిగా నీకు ఎల్లప్పటికీ తోడుగా, నీడగా ఉంటాను అని చెప్పాడు. ఆ మాటతో అవాక్కయిన రోహిణి.. ఎవడ్రా నీకు అక్క అంటూ గౌతమ్ను సరదాగా తిట్టిపోసింది.సెకండ్ ఫైనలిస్ట్ ఎంపికతర్వాత బిగ్బాస్.. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ మినహా మిగతా అందరూ నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించాడు. రెండో ఫైనలిస్ట్ ఎంపిక కోసం ఓ టాస్క్ పెట్టాడు. ఎవరైతే ఫినాలేలో ఉండకూడదనుకుంటున్నారో వారి ఫోటోను కాల్చేయాలన్నాడు. చివరకు ఎవరి ఫోటో అయితే కాలకుండా ఉంటుందో వాళ్లు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. మొదటగా అవినాష్.. విష్ణుప్రియ ఫోటో కాల్చేశాడు. విష్ణుప్రియ వంతురాగా.. ఎవరితోనూ ఎక్కువగా కలవట్లేదు, నీ గేమ్ అర్థం కావట్లేదంటూ గౌతమ్ ఫోటో కాల్చేసింది. అమ్మాయిలను వాడుకున్నావ్గౌతమ్.. పదేపదే పోట్రే చేస్తున్నానని నాపై లేనిపోని నింద వేశావంటూ నిఖిల్ను రేసులో నుంచి తీసేయాలనుకున్నాడు. నిఖిల్ స్పందిస్తూ.. వచ్చినప్పటినుంచి నువ్వు అదే చేస్తున్నావని వాదనకు దిగాడు. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు, అమ్మాయిలను వాడుకున్నావ్ అంటూ నీచంగా మాట్లాడాడు. ఇలానే మరోసారి కాస్త వల్గర్గా మాట్లాడటంతో నిఖిల్ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఇంకోసారి నోరు జారి మాట్లాడితే బాగోదని హెచ్చరించాడు.రోహిణిని తప్పించిన నిఖిల్ఈ గొడవను ఆపేయమని చెప్తున్నా కూడా.. గౌతమ్ వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. యష్మికి గాజులు సెట్ చేస్తూ ఆమెకు హోప్స్ పెట్టడం తప్పంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి మరింత ఇరిటేషన్ తెప్పించాడు. అనంతరం నిఖిల్.. నామినేషన్స్లోకి రాలేదంటూ రోహిణిని రేసు నుంచి తప్పించాడు. నామినేషన్స్లోకి రాకపోయినా నేను అన్ని గేమ్స్ గట్టిగానే ఆడాను అని రోహిణి సమాధానమిచ్చింది. చివర్లో ప్రేరణ, నబీల్.. ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరికి బిగ్బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఇమ్యూనిటీ కొనుక్కోవాలన్న బిగ్బాస్మీ ముందున్న చెక్పై రూ.15 లక్షల వరకు ఎంతైనా రాసి ఇమ్యూనిటీ కొనుక్కోవచ్చన్నాడు. ఆ డబ్బు విన్నర్ ప్రైజ్మనీలో నుంచి కట్ అవుతాయన్నాడు. కాసేపు ఆలోచించుకున్నాక ఇద్దరూ తమకు తోచినంత అమౌంట్ రాశారు. ఇంతలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్బాస్. ఇమ్యూనిటీ కొనుక్కోకుండా వారిని నామినేషన్స్లో ఉంచేందుకు హౌస్మేట్స్ ఒప్పించవచ్చన్నాడు.చెక్కులు చింపేయమన్న హౌస్మేట్స్ప్రైజ్మనీని ఒక్కో రూపాయి సంపాదిస్తూ ఇక్కడివరకు తేవడానికి అందరం ఎంతో కష్టపడ్డాం. మీకు జనాలు ఓటు వేశారు కాబట్టే పద్నాలుగోవారం దాకా వచ్చారు అని నిఖిల్ చెక్ చించేయమన్నాడు. మిగతావాళ్లు కూడా అదే సలహా ఇచ్చి ఎలాగోలా ఒప్పించడంతో ప్రేరణ, నబీల్.. ఫైనలిస్ట్ స్థానాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదని చెప్పారు. రాసిన చెక్కులు చింపేయడానికంటే ముందు ఇద్దరు ఎంత రాశారో చెప్పాలన్నాడు. నబీల్ స్వార్థంప్రేరణ.. రూ.4,30,000 రాయగా నబీల్ ఏకంగా రూ.15 లక్షలు రాసేశాడు. అది విని హౌస్మేట్స్ నోరెళ్లబెట్టారు. కంటెస్టెంట్లే కాదు చూసే జనాలు కూడా వీళ్లు ఇంత స్వార్థంగా ఉన్నారేంటని ఈసడించుకోవడం ఖాయం. ఏదేమైనా వీరిద్దరూ మనసులు మార్చుకుని చెక్కులు చించేయడంతో నేరుగా ఫైనల్కు వెళ్లే అవకాశం కోల్పోయారు. ఈ వారం గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్లో ఉన్నారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇన్నాళ్లకు విష్ణు కళ్లు తెరిపించిన శ్రీముఖి.. పృథ్వీతో కటీఫ్!
వైల్డ్కార్డ్స్కు టికెట్ టు ఫినాలే గెలిచే అర్హతే లేదన్నాడు పృథ్వీ.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవినాష్ టికెట్ టు ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్లు తెరిపించింది శ్రీముఖి. మరి శ్రీముఖి ఏం చెప్పిందో నేటి (నవంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి..నాలుగో కంటెండర్గా తేజరోహిణి, అవినాష్, నిఖిల్ 'టికెట్ టు ఫినాలే' కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్గా ఎన్నుకునే సూపర్ పవర్ ఇచ్చాడు. ముగ్గురూ కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్, రోహిణి.. ఈ ముగ్గురికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ, గౌతమ్తో గొడవపడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం.. దానికి నువ్వు గౌరవమివ్వకపోతే నేనేం చేయలేను అని గౌతమ్ హర్టయ్యాడు.కరెక్ట్ గెస్ చేస్తే రూ.5 లక్షలుఅనంతరం యాంకర్ శ్రీముఖి హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్ టు ఫినాలే కొడతారో గెస్ చేయమని హౌస్మేట్స్తో చిన్న గేమ్ ఆడించింది. కరెక్ట్గా గెస్ చేస్తే రూ.5 లక్షలు ప్రైజ్మనీలో యాడ్ అవుతాయంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటిసభ్యులు చర్చించుకుని నిఖిల్కు రూ.5 లక్షల బ్యాడ్జ్, అవినాష్కు రూ.4 లక్షలు, రోహిణికి రూ.3 లక్షలు, తేజకు రూ.2 లక్షలు అని రాసి ఉన్న బ్యాడ్జ్ ఇచ్చారు.నాకోసం అతడిని వదిలెయ్శ్రీముఖి.. విష్ణుప్రియ కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి మూడు వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒకర్ని ఇష్టపడటం తప్పు కాదు. కానీ ఈ రెండు వారాలు నాకోసం ఆ అబ్బాయి(పృథ్వీ)తో స్నేహం వదిలెయ్. అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయు అని మంచి మాటలు చెప్పింది. ఆశలు పెట్టుకోవద్దని చెప్పా: పృథ్వీఅటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా.. అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకతడు.. నీపై ఆశలు పెట్టుకోవచ్చా? అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయిపోయాక చూసుకుందామని మీ ఇద్దరూ మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు.. పృథ్వీతో తన స్నేహాన్ని పక్కనపెట్టి గేమ్పై ఫోకస్ చేస్తానని చెప్పింది.టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్కు 3, నిఖిల్కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరికోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్, నిఖిల్కు.. కేవలం ఒక్క అడుగుదూరం అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ విజయం సాధించి టికెట్ టు ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్ సంతోషంలో మునిగి తేలాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టికెట్ టు ఫినాలే: మూడో కంటెండర్గా నిఖిల్, షాక్లో తేజ
బిగ్బాస్ హౌస్లోకి మాజీ కంటెస్టెంట్ల రాక కొనసాగుతోంది. ఇప్పటివరకు అఖిల్, దేత్తడి హారిక, మానస్, ప్రియాంక జైన్ వచ్చి వెళ్లగా నేడు పునర్నవి, వితికా షెరు ఇంట్లో అడుగుపెట్టారు. వీరు గేమ్స్ ఆడేందుకు నిఖిల్, గౌతమ్ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ మరో ఇద్దర్ని సెలక్ట్ చేయాల్సి రాగా నిఖిల్.. పృథ్వీ పేరు సూచించాడు. గౌతమ్ క్షణం ఆలోచించకుండా ప్రేరణ పేరు ఎంపిక చేశాడు.షాక్లో తేజతన పేరు చెప్తాడని ఊహించిన తేజకు ఇది పెద్ద షాకే! నన్నెందుకు సెలక్ట్ చేయలేదని తేజ హర్టయ్యాడు. గెలిచినా, గెలవకపోయినా అవకాశం వస్తుందేమో ఆడదామనుకున్నాను, ఇలా సెలక్ట్ చేయనప్పుడు బాధనిపిస్తుంది.. దీన్ని సింపతీ అనుకుంటే నేనేం చేయలేను అని తేజ ఫ్రస్టేట్ అయ్యాడు. ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఫైనల్గా నిఖిల్ గెలిచి కంటెండర్ అవగా ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చినట్లు భోగట్టా! తనను టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తీసేయడంతో ప్రేరణ అస్సలు తట్టుకోలేకపోతుందట! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్పై వచ్చిన కంప్లైంట్స్..అన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్పై బిగ్బాంబ్ వేసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైల్డ్కార్డ్ విన్నరేంటి? ఇది అధర్మం కాదా?: అభయ్ నవీన్
తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ ఎలా ఉంది? మొదట్లో చప్పగా.. వైల్డ్ కార్డ్స్ వచ్చాక కాస్త జోష్గా సాగుతోంది. ఎప్పుడో అస్సాం ట్రైన్ ఎక్కాల్సిన సీజన్ను తిరిగి గాడిలో పడేలా చేసింది వైల్డ్ కార్డ్సే! అయితే వీరితో పోలిస్తే పాత కంటెస్టెంట్లు నెలరోజులపాటు తమ మనుగడను కాపాడుకునేందుకు ఎక్కువ కష్టపడ్డారు. ఆ సమయంలో తమకంటూ ఫ్యాన్బేస్ ఏర్పరుచుకున్నారు. దీంతో మధ్యలో వచ్చినవారికంటే పాతవారికే ఓట్లు పడే ఛాన్సులు ఎక్కువుంటాయి.వైల్డ్ కార్డ్ విన్నర్ కాకూడదట!వైల్డ్ కార్డ్స్ రెట్టింపు కష్టపడితేనే ఓట్లు తమవైపు మళ్లుతాయి. ఇక విషయమేంటంటే.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ విన్నర్ అవకూడదంటున్నాడు అభయ్ నవీన్. నిఖిల్కు ఫ్రెండ్ అయిన ఇతడు.. పరోక్షంగా గౌతమ్ గెలవకూడదని చెప్తున్నాడు. పెద్దగా గేమ్స్ ఆడకపోయినా ఈజీగా చీఫ్ అయిపోయి నోటి దురుసుతో షో నుంచి ఎలిమినేట్ అయిన అభయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ఇది అధర్మం కాదా?నిఖిల్, నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు వాడి చేతిలో స్టిక్ ఇరిగిపోయినా నేను ఫైట్ చేశాను. అది ధర్మం కాదు, ఒకరి చేతిలో స్టిక్ లేనప్పుడు గేమ్ ఆడకూడదు అన్నారు కదా! అదే ధర్మం కానప్పుడు మధ్యలో వచ్చిన వ్యక్తి ఎలా గెలుస్తాడన్నా? బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, తనపై జనాల్లో పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? తెలుసుకోకుండా మొదటి నుంచి నచ్చిన గేమ్ ఆడుతున్నవాడు గెలిస్తే కరెక్టా? అప్పుడు ఈ కాన్సెప్ట్ దేనికి?లేదా వారి బలం, బలహీనతలు తెలుసుకుని గేమ్ మధ్యలో జాయిన్ అయి ఆడేవారు గెలిస్తే కరెక్టా? ఏదైనా సరే.. ఫస్ట్ నుంచి ఆడుతున్నవాడు గెలిస్తేనే కిక్ ఉంటదన్నా.. అది నా ఫీలింగ్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిన ఓ వ్యక్తి అలాంటప్పుడు వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ తీసేయమని చెప్పండి.. ఫస్ట్, లాస్ట్ ఇదంతా కాదు.. ఎవరు బాగా ఆడితే వాళ్లు గెలవాలి అని కామెంట్ చేశాడు. దీనికి అభయ్.. వైల్డ్కార్డ్ అనేది కేవలం జనాల్ని ఎంగేజ్ చేయడానికి మాత్రమేనని రిప్లై ఇచ్చాడు. View this post on Instagram A post shared by B Naveen Kumar (@abhainaveen) మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్లు కాదు, పాములు.. గ్రూప్ గేమ్ తప్పు కాదన్న నాగ్..
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..క్యారెక్టర్లెస్ అనలేదుగా: విష్ణునువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.నిఖిల్కు ట్రై చేశా అనలేదునిఖిల్కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్కార్డ్స్ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.నోర్మూయ్.. నాగ్ సీరియస్ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్మేట్స్తో ఓ గేమ్ ఆడించాడు.నిచ్చెన- పాముఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.రెండు పాములునిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్కార్డ్స్ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణు గెలవాలన్న శివాజీ.. గౌతమ్పై పంచులు
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.మరోసారి ఫ్యామిలీస్..ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది. గౌతమ్పై శివాజీ పంచులుగౌతమ్ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్లో ఉన్నవారికి కూడా గేమ్పై ఓ క్లారిటీ రానుంది. చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు -
ప్రేరణకు భంగపాటు.. మోసం చేయడం మానుకోమన్న పృథ్వీ తల్లి
ఫ్యామిలీ వీక్తో కంటెస్టెంట్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. తేజ మాత్రం తిరునాళ్లలో తప్పిపోయిన చిన్నపిల్లాడిలా తల్లికోసం ఏడుస్తూనే ఉన్నాడు. ఈ రోజు (నవంబర్ 14) ఎవరెవరు హౌస్లోకి వచ్చారో చూసేద్దాం..స్ట్రాటజీ ప్రకారం లవ్ ట్రాక్?మొదటగా విష్ణుప్రియ తండ్రి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమెతో.. గ్రూప్ గేమ్ వద్దు, నీ ఆట నువ్వు ఆడు. నువ్వు కష్టపడితే కప్పు గెలుస్తావు. నువ్వు కొద్దిగా అటువైపు (పృథ్వీతో) ఉంటున్నావని నీ అభిమానులే బాధపడుతున్నారు. నువ్వు స్ట్రాటజీ ప్రకారం అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ గేమ్ ఆడుతున్నావు. అదంతా జనాలు నిజమనుకుంటారు అని చెప్పుకుంటూ పోయాడు.అతడి వల్లే ఉండగలుగుతున్నాఇంతలో విష్ణు మధ్యలో కలగజేసుకుంటూ అది స్ట్రాటజీ కాదని, తన ఫీలింగ్స్ నిజమేనని తెలిపింది. ఇది ప్రేమ కాదు, ఒకలాంటి ఇష్టం తనపై ఉంది.. అతడి వల్లే ఎన్నిరోజులైనా హౌస్లో ఉండగలుగుతానన్న ధైర్యం వచ్చింది. నాకు తనపై ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కప్పేయాలి? అని ప్రశ్నించింది. అందుకాయన నవ్వుతూ నీ గేమ్ నువ్వు ఆడు అని సలహా ఇచ్చాడు.అన్యాయం చేశావిష్ణుకు తండ్రి ప్రేమ అందించలేకపోయానని ఎమోషనల్ అయ్యాడు. విష్ణు పుట్టాక చాలారోజులు తన దగ్గరకు వెళ్లలేదు. తన చిన్నతనంలో సంతోషాన్ని పంచలేకపోయాను. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాను. వాళ్లకు అన్యాయం చేశాను. పైసా కూడా వాళ్లకు పెట్టలేకపోయాను. అందుకు ఇప్పటికీ నేను సారీ చెప్తున్నాను అన్నాడు.పృథ్వీతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పెళ్లి ప్రస్తావన రాగా విష్ణుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేస్తానన్నాడు. పృథ్వీతో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. అదంతా కేవలం ఈ హౌస్లోనే.. గేమ్ అయిపోయాక ఏముండదు అన్నాడు. దాంతో విష్ణు.. ఏమో, అదిప్పుడే చెప్పలేమని సిగ్గుపడగా తనకు ఎవరైనా ఓకే అంటూ తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత ఆయన ఓ గేమ్ ఆడి కూతురి కోసం బర్గర్ సంపాదించాడు.విష్ణు నచ్చేసిందన్న పృథ్వీ తల్లిఅనంతరం అమ్మ పాట రాగానే తేజ కన్నీటితో ఆశగా గేటువైపు చూశాడు. కానీ అక్కడ పృథ్వీ తల్లి సత్యభామ లోనికి వచ్చింది. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ణును మాత్రం ప్రేమగా హత్తుకుంది. పృథ్వీని కన్నందుకు థాంక్యూ అంటూ విష్ణు ఆమె పాదాలపై పడింది. కోడలిగా విష్ణుప్రియ ఓకేనా అని నిఖిల్ అడగ్గా.. అన్నీ వాడిష్టం.. వాడికి నచ్చితే ఓకే అని సిగ్నల్ ఇచ్చేసింది.ఇన్ని రోజులు ఉంటావనుకోలేదుఅందరితో కలిసుండు, ఎవరితోనూ గొడవపడకు. నామినేషన్ చేసేటప్పుడు వాళ్లతో వీళ్లతో చెప్పకు. ఎవరి గురించో నామినేట్ చేయకు. నీ గురించి చేయు. నీ టాలెంట్ చూపించుకోవడానికి బిగ్బాస్ మంచి ఛాన్స్. ఇన్ని రోజులు ఉంటావనుకోలేదు. గేమ్లో మోసం చేయకుండా నిజాయితీగా ఆడు అని సలహాలు, సూచనలు ఇచ్చింది.ప్రేరణకు భంగపాటుఎవరు ఎక్కువ ఇష్టమని పృథ్వీ అడగ్గా విష్ణు పేరు చెప్పింది. డ్యాన్స్ బాగా చేస్తుంది, దేవుడి భక్తురాలు, జెన్యూన్ అంది. సత్యభామ తన కొడుకుతో పాటు విష్ణుకు సైతం గోరుముద్దలు తినిపించింది. భర్త రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేరణకు భంగపాటు ఎదురైంది. హౌస్లోకి రాలేకపోతున్నానంటూ తన కటౌట్ను పంపించాడు. నువ్వు ట్రోఫీ ఎత్తినప్పుడు వస్తానంటూ వీడియో సందేశం పంపాడు.నిన్ను టార్గెట్ చేయరుఅనంతరం గౌతమ్ అన్నయ్య డాక్టర్ జగదీష్ వచ్చాడు. అందరికీ ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి నిన్ను టార్గెట్ చేయరు. సోలోగానే ఆడు. ట్రయాంగిల్ లవ్స్టోరీలు వద్దు.. మరీ ఎక్కువ కోప్పడకు. అనుకున్న లక్ష్యానికి దగ్గరలో ఉన్నావు అని చెప్పాడు. చివరగా తమ్ముడితో కలిసి ఓ గేమ్ ఆడి రూ.51 వేలు గెలిచారు. అది ప్రైజ్మనీలో యాడ్ చేయగా మొత్తం రూ.50,30,000కు చేరింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్కు హింట్లిస్తూనే హెచ్చరించిన తల్లి.. గౌతమ్ జోలికి మాత్రం..!
ఫ్యామిలీ వీక్ అంటేనే సంతోషం, దుఃఖం రెండూ కలగలసి ఉంటాయి. అయితే అవినాష్ మాత్రం దుఃఖాన్ని దాచేస్తూ సంతోషాన్ని పంచేందుకే ప్రయత్నించాడు. అటు నిఖిల్ తల్లి.. ఏమాత్రం సంకోచించకుండా చెప్పాల్సిన హింట్లన్నీ చెప్పేసింది. అవేంటో నేటి (నవంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..యష్మికి హింట్ ఇచ్చిన తండ్రితండ్రిని చూడగానే యష్మి.. పప్పా అంటూ సంతోషంతో ఏడ్చింది. కూతుర్ని ఓదార్చిన ఆయన అందరితోనూ కలివిడిగా మాట్లాడారు. తర్వాత కూతురికి అవసరమైనన్ని హింట్లు ఇచ్చాడు. 'నువ్వు నీకోసమే ఆడాలి.. ఇండివిడ్యువల్ గేమ్ ఆడు.. టాస్కులు ఆడకుండా ఊరికే కూర్చుంటే నీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. నువ్వు మనసులో అనుకుంది అందరికీ చెప్పేయకు.. నువ్వు చేయాలనుకుంది నేరుగా చేసేయు. కూతురి తరపున సారీఇన్నివారాలున్నావ్.. నిన్ను స్టేజీపై చూడాలనుంది. నీకోసమే ఆడితే కప్పు గెలుస్తావు.. నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు అని చెప్పాడు. గారాలపట్టికి గోరుముద్దలు కూడా తినిపించాడు. నాన్నతో యష్మి డ్యాన్స్ చేస్తుంటే.. నబీల్కు తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యష్మి తండ్రి ఆడిన గేమ్లో వచ్చిన రూ.21 వేలు ప్రైజ్మనీలో యాడ్ చేశారు. వెళ్లిపోయేముందు.. నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే.. దయచేసి ఎవరూ ఏమనుకోవద్దు అంటూ కూతురి తరపున క్షమాపణలు చెప్పి ఓ మెట్టు పైకి ఎక్కేశాడు. .కుమిలిపోతున్న తేజఆయన వెళ్లిపోతుంటే యష్మితో పాటు తేజ కూడా ఏడ్చేశాడు. అందరి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడుస్తున్న తేజను ఎలా ఓదార్చాలో హౌస్మేట్స్కు అర్థం కాలేదు. అతడి బాధను చూడలేకపోయిన గౌతమ్.. తన ఫ్యామిలీకి బదులుగా తేజ పేరెంట్స్ను పంపించమని బిగ్బాస్ను అభ్యర్థించాడు. అనంతరం నిఖిల్ తల్లి హౌస్లో అడుగుపెట్టింది. ఏయే కారణాల వల్ల నిఖిల్ గ్రాఫ్ పడిపోతుందో.. అవన్నీ పూసగుచ్చినట్లు చెప్పి మార్చుకోమని సూచించింది. నిఖిల్ను జాగ్రత్తపడమన్న తల్లిగ్రూప్ గేమ్ ఆడకు, ఇకపై ఇండివిడ్యువల్గానే ఆడు. నెల రోజులు మాత్రమే ఉంది. G (గౌతమ్)తో ఎక్కువగా ఫైట్, డిఫెన్స్కు వెళ్లొద్దు, నామినేషన్ దాకా అసలే వెళ్లొద్దు అని హింట్లు ఇచ్చింది. తప్పు చేస్తేనే నామినేట్ చేస్తున్నా అని నిఖిల్ సంజాయిషీ ఇవ్వగా.. నీతో జరిగిన దానికే మాత్రమే నామినేట్ చేయు, వేరే వాళ్ల గురించి చేయకు. Y(యష్మి)ని కొంచెం కంట్రోల్ చేయు. ఆమెకు దూరంగా ఉండుP (ప్రేరణ) అనే అమ్మాయి నుంచి కొంచెం దూరంగా ఉండు.. గ్రూపిజం ఆడకు.. నీకోసమే ఆడు అంటూ ఎవరూ ఇవ్వనన్ని హింట్లు ఇచ్చేసింది. తర్వాత ఆమె గేమ్ ఆడి మటన్ సంపాదించింది. తమకు నాన్వెజ్ రావడంతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆమె వెళ్లిపోయాక బిగ్బాస్ హౌస్మేట్స్ అందరికీ ఓ గంటసేపు నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో అనూజ వచ్చి నిద్రలో ఉన్న అవినాష్ను హత్తుకుంది.భార్య కోసం డ్రెస్ మార్చుకున్న అవినాష్భార్యను చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది. అనూజ బ్లాక్ డ్రెస్లో వచ్చిందని వెంటనే అతడు కూడా వెళ్లి డ్రెస్ మార్చుకున్నాడు. బిగ్బాస్ వీళ్లిద్దరికీ కంపారిబులిటీ టెస్ట్ పెట్టాడు. ఈ గేమ్ ద్వారా రూ.51,000 ప్రైజ్మనీ కావాలా? లేదా మూడుగంటలు కిచెన్ టైమింగ్ కావాలా? అని అడిగాడు. అందుకు వీళ్లు ప్రైజ్మనీని ఎంచుకున్నారు. ఇక ఈ దంపతుల కోసం బిగ్బాస్ పెద్ద జే ప్లాన్ చేశాడు. బిగ్బాస్ సర్ప్రైజ్యాక్షన్ రూమ్ను హార్ట్ షేప్ బెలూన్లతో నింపేసి డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. అది చూసి మురిసిపడ్డ అవినాష్.. ఇది తన జీవితంలోనే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇంతలో బిగ్బాస్ అవినాష్ ముచ్చటపడినట్లుగా లైట్లు ఆఫ్ చేశాడు. దాంతో అతడు తన భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. చివరగా అనూజ నవ్వుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి, నిఖిల్ను బుక్ చేసిన తేజ.. దమ్ము లేదంటూ రెచ్చగొట్టిన పృథ్వీ
కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోందిముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు. దమ్ము లేదుఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.తల్లికి తేజ క్షమాపణలుదీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్మేట్స్కు థాంక్యూ చెప్పాడు. వరస్ట్ ప్లేయర్ అంటూతర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్ను నామినేట్ చేశాడు.మాట తప్పావ్రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ర్యాంప్ ఆడించిన గౌతమ్, తేజ.. భయపడే రకం కాదు!
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ పది మంది మాత్రమే మిగిలారు. మీలో మీరు కొట్టుకు చావండి అంటూ బిగ్బాస్ నామినేషన్స్ ప్రక్రియ ఇచ్చాడు. నామినేట్ చేయాలనుకునే వ్యక్తి ఫోటోకు పెయింట్ వేసి పాడు చేయాలన్నాడు. అలా గౌతమ్.. పృథ్వీని, తేజ.. యష్మిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో పెద్ద గొడవలే జరిగాయి.భయపడేదేలె..తనను నామినేట్ చేసిన పాయింట్ల గురించి పృథ్వీ చర్చ మొదలుపెట్టగా నీ మాటలకు వేరేవాళ్లు భయపడతారేమో.. నేను భయపడను అన్నాడు గౌతమ్. ఇక ఎవిక్షన్ షీల్డ్ టాస్క్లో జంటగా వెళ్లిన తేజ, యష్మి.. ఏకాభిప్రాయానికి రాకుండా ఎవరికి నచ్చిన వ్యక్తుల్ని వారు సైడ్ చేసేశారు. నాది తప్పే.. నీది కూడా తప్పేఅయితే మొదట తేజ ఆ పని చేయడంతో అందుకు తగ్గ పరిణామాల్ని ఎదుర్కొన్నాడు. కంటెండర్ రేసులో లేకుండా పోవడమే కాకుండా ఫ్యామిలీ వీక్ కూడా తనకు ఉండబోదని చెప్పాడు. ఏకాభిప్రాయానికి రాకముందే పాము నోట్లో తాను గుడ్డు వేయడం ఎంత తప్పో.. తను వేశాక కూడా యష్మి వచ్చి మరో గుడ్డు వేయడం అంతే తప్పు అని తేజ కుండబద్ధలు కొట్టి చెప్పాడు.ర్యాంప్ ఆడించారుఅది తప్పనుకుంటావో, ఒప్పనుకుంటావో నీ ఇష్టం అని యష్మి చెప్తుంటే అనుకోవడమేముంది.. అది తప్పే.. అని తేజ కౌంటరిచ్చాడు. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను.. నా తర్వాత నీది కూడా తప్పే అని సమాధానమిచ్చాడు. దీంతో యష్మి నువ్వు చేసింది తప్పే.. అని అరిచింది. ప్రోమోలో అయితే గౌతమ్, తేజ ర్యాంప్ ఆడించినట్లు కనిపిస్తోంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాపై ఎవరూ ఇంత సీరియస్ అవలేదు.. నాకు పృథ్వీ వద్దు: విష్ణు
బిగ్బాస్ హౌస్లో కంటెండర్షిప్ బ్యాడ్జ్ కోసం పోటీలు జరిగాయి. అందులో భాగంగా ఓ గేమ్లో విష్ణును బురిడీ కొట్టించి పృథ్వీ గెలిచాడు. ఆ తర్వాత పృథ్వీ, విష్ణు మధ్య ఏదో వాదులాట జరిగినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ వెనకపడుతూ ఉంటే అలుసైపోతున్నానని భావించిన విష్ణు.. అతడితో మాట్లాడటమూ మానేసింది.సారీ చెప్పువేరేవాళ్లను హర్ట్ చేసేసి అతడు మాత్రం చాలా కూల్గా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి నాకు వద్దు అని తన బాధను యష్మితో పంచుకుంది. దీంతో యష్మి.. పృథ్వీని పిలిచి సారీ చెప్పమని అడిగింది. అంతలోనే విష్ణు కలగజేసుకుంటూ నేనేమీ సారీ అడగలేదు అనగా పృథ్వీ కోపంగా నేను నీతో మాట్లాడట్లేదు అన్నాడు.ఇకపై పృథ్వీకి దూరంగా?ఎందుకంత కోపం? కూర్చుని మాట్లాడుకుందాం అని యష్మి చెప్తుంటే కూడా మళ్లీ వస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనపై అంత కోపం చూపించడంతో హర్టయిన విష్ణు.. ఎవరూ నాపై ఇంత సీరియస్ అవలేదు.. ఇకపై ఈ వ్యక్తే లేడనుకుంటాను అని పృథ్వీని దూరం పెడుతున్నట్లు చెప్పింది.అక్కా అని పిలవకుఇక బిగ్బాస్ ఇచ్చిన ఫన్ టాస్క్లో అవినాష్, రోహిణి ఆయా పాత్రల్లో దూరేశారు. డైరెక్టర్ రోల్ చేసిన అవినాష్ ఏబీసీ అనే ట్రయాంగిల్ లవ్స్టోరీతో సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. ఆడిషన్స్లో యష్మి, నిఖిల్, గౌతమ్ ఓ సీన్ చేసి చూపించారు. అక్కా అని పిలవకు అని యష్మి అరుస్తుంటే నేను అక్కా అనే అంటాను అని గౌతమ్ వాదించాడు. ఇంతలో నిఖిల్ అక్కా అని పిలవద్దు అంటోందిగా అని మధ్యలో దూరాడు. దీంతో గౌతమ్.. సరే నేను పిలవడం మానేస్తా.. మరి నువ్వు అక్కా అని పిలుస్తావా? అని అడిగాడు. ఈ డైలాగ్తో అందరూ నవ్వేశారు. బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అక్క అనడం తప్పన్న నిఖిల్, ఫ్రెండ్ను కాపాడిన అవినాష్
నామినేషన్స్ అంటే మాటల యుద్ధమే.. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..హరితే, ప్రేరణ.. ఇద్దరూ ఇద్దరే!మొదటగా పృథ్వీ.. నాకు నెక్ ఫాంటసీ ఉందనడం నచ్చలేదంటూ రోహిణిని నామినేట్ చేశాడు. నెక్ ఫాంటసీ అన్నది బూతు పదమా? అని రోహిణి ఆశ్చర్యపోయింది. హరితేజ.. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది.. నోటికొచ్చిన మాటలు అనేయొద్దని ప్రేరణను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. హరితేజ చెప్పే పాయింట్లు కరెక్టే ఉన్నా కాస్త యాక్టింగ్ చేస్తూ చెప్పడం అతిగా అనిపించింది. తెలుగులో కొత్త బూతు 'అక్క'అటు ప్రేరణ కూడా ఈమెపై రివేంజ్ నామినేషన్ చేసింది. అంత అరుచుకున్నాక చివర్లో ఇద్దరూ కలిసిపోయి హగ్గులిచ్చుకోవడం గమనార్హం. నిఖిల్ వంతురాగా.. ఒకమ్మాయి తనను అక్కా అని అనొద్దని చెప్తున్నా పదేపదే అనడం బుల్లీయింగ్ అంటూ గౌతమ్ను నామినేట్ చేశాడు. అక్కా అనడంలో తప్పేముంది? అని గౌతమ్ అంటే అశ్వత్థామ అని పిలిస్తే నువ్వు హర్టయినప్పుడు.. ఆమె వద్దంటున్నా అక్కా అని పిలవడం కూడా తప్పేనని లాజిక్ లేని సమాధానమిచ్చాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.దీంతో చిర్రెత్తిన గౌతమ్.. ఇప్పుడు చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. నన్ను ట్రోల్ చేసుకోండి.. ఏమైనా చేసుకోర్రి అన్నాడు. ఇద్దరూ అరుచుకుని కాసేపటికి నిఖిల్.. అమ్మతోడు, గేటు తీయమను.. బయటకెళ్లి చూసుకుందాం అని రెచ్చగొట్టాడు. నా ప్రవర్తన తప్పు అంటున్నావ్.. మరి నా మీద కోపాన్ని టాస్కులో అమ్మాయిలపై చూపించడం తప్పు కాదా? ఎవరేంటో నాకర్థమైంది.. ఇప్పుడు నాకు భయం లేదు, ఎవరికీ వినేది లేదు, తగ్గేది లేదు అని గౌతమ్ ఆవేశంతో మాట్లాడుతుంటే రోహిణి, హరితేజ చప్పట్లు కొట్టారు.నువ్వే ఆ ఛాన్సిచ్చావువిష్ణుప్రియ వంతు రాగా.. నేను నిన్ను నామినేట్ చేయకూడదనుకున్నాను.. కానీ నువ్వే ఆ ఛాన్సిచ్చావు! ఈ వారం చాలా తప్పులు చేశావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. నబీల్.. పోయినవారం నామినేషన్స్లో ఫేవరెటిజం చూపించావు, మెగా చీఫ్గా ఫెయిలయ్యావంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.చప్పట్లు కొట్టిన గంగవ్వగంగవ్వ.. యష్మిని అశ్విని అనడంతో అందరూ పడీపడీ నవ్వాడు. గౌతమ్ బాగా ఆడతాడు. చిన్నదానికీ పెద్దదానికీ నువ్వు, ప్రేరణ ఇద్దరూ అతడిపై అరుస్తారు. ఆటలో గెలవకపోతే మాత్రం చీదరించుకుంటావు అని చెప్పింది. నామినేట్ అయినందుకుగానూ యష్మిపై ఆయిల్ పెయింట్ పడటంతో గంగవ్వ చప్పట్లు కొట్టింది. రోహిణి.. మెగా చీఫ్ కంటెండర్షిప్ గేమ్లో నీకంటే ఒక అడుగు ముందున్న గౌతమ్ను సైడ్ చేయడం బాగోలేదని యష్మిని నామినేట్ చేసింది. బిగ్బాస్కు గౌరవం ఇవ్వలేదుగౌతమ్ వంతు రాగా.. టీమ్లీడర్గా ఉన్నప్పుడు పదేపదే ఇరిటేట్ అయ్యావ్.. రెండోది నన్ను గేమ్లో సైడ్ చేసినప్పుడు నాకో కారణం చెప్పావ్.. కానీ వెనకాల మరో కారణం చెప్పావ్.. అంటూ యష్మిని నామినేట్ చేశాడు. తేజ.. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో నువ్వు స్మోకింగ్ జోన్లో సిగరెట్ తాగుతూ కూర్చున్నావు.. ఇది బిగ్బాస్ను అగౌరవపర్చాడంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.ఆమెను సేవ్ చేసిన అవినాష్యష్మి.. నువ్వు నన్ను అక్కా అని పిలవడం నచ్చలేదు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. ఫ్లిప్ అవుతున్నావు అంటూ గౌతమ్ను నామినేట్ చేసింది. చివర్లో ఒకరిని స్వాప్ చేసే అధికారం మెగా చీఫ్ అవినాష్కు ఇవ్వడంతో అతడు రోహిణిని సేవ్ చేసి ఆమె స్థానంలో నిఖిల్ను నామినేట్ చేశాడు. అలా ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నవ్వుతూ వెళ్లిన నయని.. ఆ ఐదుగురు డమ్మీ ప్లేయర్స్ అంటూ..
సండే అంటే ఫన్డే.. ఆటలు, పాటలు, డ్యాన్సులు.. మొత్తం ఇవే ఉంటాయి. ఇలాంటి ఫన్ గేమ్తోనే ఎపిసోడ్ మొదలైంది. అంతకంటే ముందు గౌతమ్ను సేవ్ చేశాడు. తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..విష్ణుప్రియ టీమ్ గెలుపునిఖిల్, రోహిణి, ప్రేరణ, నయని పావని, విష్ణుప్రియ, తేజను టీమ్ 'A'గా మిగతావాళ్లందరినీ టీమ్ 'B'గా విభజించారు. ఈ గేమ్లో భాగంగా ఒక చీటీ తీసి అందులో ఇంగ్లీష్లో రాసి ఉన్న వాక్యాలు చదివి తెలుగులో పాటను గెస్ చేయాలి. చిన్నపిల్లలు కూడా ఆడగలిగేలా సింపుల్గా ఉన్న ఈ గేమ్లో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. తర్వాత యష్మి సేవ్ అయినట్లు ప్రకటించాడు.నిఖిల్ వెంటే గెలుపుఅనంతరం అందరూ పక్షుల్లా మారిపోయారు. ఆకాశం, సముద్రం, పర్వతాలు.. వీటిలో నాగ్ ఏ పేరు చెప్తే ఆ పేరు రాసున్న బోర్డ్పై కంటెస్టెంట్లు నిలబడాల్సి ఉంటుంది. ఈ గేమ్లో కూడా నిఖిలే ఆఖరివరకు చేరుకుని గెలిచాడు. అలాగే లక్ష రూపాయలు ప్రైజ్మనీలో యాడ్ చేయడంతో విన్నింగ్ ప్రైజ్మనీ రూ.42,16,000కు చేరింది.జ్యూస్లకు మారు పేర్లుతర్వాత కొన్ని జ్యూస్లకు స్వార్థం, కోపిష్టి, ఫేక్.. ఇలా పలురకాల పేర్లు ఇచ్చారు. అవి ఎవరికి సూట్ అవుతాయో వారితో ఆ జ్యూస్ తాగించాలన్నాడు. మొదటగా గౌతమ్.. ఆనియన్ (నకిలీ), టమాటో (స్వార్థం) జ్యూస్ను యష్మీకి ఇచ్చాడు. రోహిణి.. కీరా దోస(బాధ్యతారాహిత్యం), చిల్లీ (కోపిష్టి) జ్యూస్ను గౌతమ్కు ఇచ్చింది. విష్ణుప్రియ.. చిల్లీ, లెమన్ (నోటిదురుసు) జ్యూస్ను ప్రేరణకు ఇచ్చింది. ఆమెకు నోటిదురుసు ఎక్కువహరితేజ.. చిల్లీ, ఆమ్ల జ్యూస్ను నిఖిల్తో తాగిపించింది. పృథ్వీ.. ప్రేరణకు జ్యూస్ ఇస్తూ తనకు నోటిదురుసు ఉందని, కోపిష్టి అన్నాడు. అవినాష్.. గౌతమ్కు నోటిదురుసు, బాధ్యతారాహిత్యం ఉందంటూ అతడితో లెమన్, కీరా జ్యూస్ తాగిపించాడు. తేజ.. ప్రేరణకు నోటిదురుసు, మందబుద్ధి ఉందన్నాడు. నబీల్.. అవినాష్ డంబ్ అండ్ టాక్సిక్ అన్నాడు. ప్రేరణ వంతు రాగా.. హరితేజ ఫేక్ అంటూ ఆనియన్, ఆమ్లా జ్యూస్ తాగిపించింది. ఎక్కువ జ్యూస్లు ఎవరికంటే?యష్మి.. గౌతమ్ ఫేక్ అంటూ ఆనియన్ జ్యూస్ ఇచ్చింది. గంగవ్వ.. రోహిణికి మందబుధ్ది, నోటిదురుసు ఉందని తెలిపింది. నయని కూడా ప్రేరణకు కోపమెక్కువ అంటూ నిమ్మ, మిర్చి జ్యూస్ కలిపిచ్చింది. నిఖిల్.. గౌతమ్ బాధ్యతారాహిత్యంగా ఉంటాడంటూ అతడికి లెమన్, కీర జ్యూస్ కలిపిచ్చాడు. అలా ప్రేరణ, గౌతమ్ అందరికంటే ఎక్కువ జ్యూస్లు తాగారు.నయని ఎలిమినేట్తర్వాత నాగ్ హరితేజను సేవ్ చేసి నయని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ప్రతిదానికి కన్నీళ్లు పెట్టుకునే నయని ఈసారి తన దుఃఖాన్ని దిగమింగుకుని నవ్వుతూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకోవడం విశేషం. స్టేజీపైకి వచ్చాక .. గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్, విష్ణును డమ్మీ ప్లేయర్స్ అంది. హరితేజ, నిఖిల్, పృథ్వీ బెస్ట్ ప్లేయర్స్ అని కితాబిచ్చింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాగ్ చేసిన పనికి షాక్లో తేజ.. త్వరలో వెళ్లిపోతానంటున్న గంగవ్వ
హౌస్మేట్స్కు నాగార్జున గట్టిగా క్లాస్ పీకి చాలాకాలమైంది. అందుకే ఈ రోజు అందరికీ కోటింగ్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. గౌతమ్, నిఖిల్, యష్మి, ప్రేరణలపై సీరియస్ అయ్యాడు. ప్రత్యేకంగా ఈ నలుగురిపైనే ఫైర్ అవడానికి కారణమేంటో తెలియాలంటే నేటి (నవంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నువ్వేమైనా పుడింగా?నాగార్జున వచ్చీరాగానే ప్రేరణపై విరుచుకుపడ్డాడు. నువ్వేమైనా పుడింగా? అందరిపై నోరు ఎందుకు జారుతున్నావ్? అని నిలదీశాడు. అందుకామె పుడుంగి అనేది తప్పు పదమని తెలీదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నయని లేచి.. తను ఎప్పుడూ అమర్యాదగానే మాట్లాడుతుందని అగ్నికి ఆగ్జం పోసింది. అటు నాగ్ వీడియో ప్లే చేయడంతో అడ్డంగా దొరికిపోయిన ప్రేరణ నయనికి సారీ చెప్పింది. నిఖిల్ను తిట్టడాన్ని సైతం తప్పుపడుతూ నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు.ఎందుకంత కోపం?పానీపట్టు యుద్ధం టాస్క్లో అగ్రెసివ్గా ఆడావు. అప్పుడు ప్రేరణ, యష్మిపై ఎందుకంత కోపం చూపించావని నాగ్ నిఖిల్ను అడిగాడు. అందుకతడు ప్రేరణ, గౌతమ్ బూతు వాడటంతో మరింత ట్రిగ్గర్ అయ్యానన్నాడు. దీనిపై గౌతమ్ స్పందిస్తూ.. తాను బూతు మాట అనలేదన్నాడు. దీంతో నాగ్ వీడియో వేసి చూపించాడు. అందులో అతడు పెదాలాడించినట్లు ఉందే తప్ప బూతు మాట్లాడినట్లు లేదు.నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతా..వీడియో చూసిన తర్వాత కూడా గౌతమ్.. తల్లిపై ప్రమాణం చేస్తున్నాను. నేను బూతు మాట్లాడలేదు. చేయని తప్పును ఒప్పుకోను. నేను బూతు మాట్లాడినట్లు నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతానని శపథం చేశాడు. దీంతో నాగ్.. గౌతమ్ మాటల్ని ఎవరు నమ్ముతున్నారని అటు హౌస్మేట్స్ను, ఇటు స్టూడియోలో ఉన్నవారిని అడిగాడు. కానీ ఏ ఒక్కరూ గౌతమ్కు సపోర్ట్ చేయకపోవడంతో అతడి ముఖంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది.మధ్యలో దూరకుతర్వాత యష్మి వంతురాగా.. నీ ప్రాబ్లమేంటక్కా? అని నాగ్ ప్రశ్నించాడు. గౌతమ్ తనను సడన్గా క్రష్, సడన్గా అక్క అని పిలిస్తే తీసుకోలేకపోయానని బదులిచ్చింది యష్మి. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. అందులో గౌతమ్.. విష్ణుతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో దూరింది. ఈ గొడవ పెద్దదై ఒకరినొకరు అక్కాతమ్ముడు అనుకున్నారు. నువ్వు కూడా తమ్ముడు అన్నావుగా.. ఏదైనా జరుగుతున్నప్పుడు మధ్యలోకి దూరకూడదు అని సూచించాడు. ఫ్లిప్ అవుతున్నావ్అలాగే బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్లో తన రెడ్ టీమ్లో గౌతమ్ను ఎలిమినేట్ చేయడం గురించి అడగ్గా.. అతడు పెద్దగా ఆడలేదని తెలిపింది. దీంతో గౌతమ్ లేచి.. నేను ఆల్రెడీ ఒకసారి మెగా చీఫ్ అయ్యానని, అందుకే సైడ్ చేస్తున్నామని చెప్పిందే తప్ప ఆడలేదని చెప్పలేదన్నాడు. ఇది విన్న నాగ్.. ఇలా మాటలు మారుస్తూ ఉంటే నువ్వు ఫ్లిప్ అవుతున్నావని జనాలు భావిస్తారని హెచ్చరించాడు.సిగ్నల్స్ ఇచ్చిన గంగవ్వఅనంతరం బాగా ఆడావంటూ నాగ్ తేజను మెచ్చుకోగా ఇది కలా? నిజమా? అర్థం కాక అతడు నోరెళ్లబెట్టాడు. సెకనులో ఇదంతా నిజమేనని తెలుసుకుని తెగ సంతోషించాడు. ఇక మెగా చీఫ్ పోస్ట్ను త్యాగం చేయడం బాగోలేదని నబీల్కు చురకలంటించాడు. గండం గట్టెక్కింది!గంగవ్వను ఆటలో ఇంకాస్త యాక్టివ్గా ఆడాలని నాగ్ సలహా ఇవ్వగా.. తనకు ఒళ్లునొప్పులు వస్తున్నాయంది. తనవల్ల కానిరోజు హౌస్ నుంచి తనే స్వయంగా వెళ్లిపోతానంది. చివర్లో తేజ సేవ్ అయినట్లు ప్రకటించాడు. గతంలో తొమ్మిదో వారమే షో నుంచి ఎలిమినేట్ అయ్యానని ఈసారి ఆ వారం నుంచి తప్పించుకున్నానంటూ ఫుల్ ఖుషీ అయ్యాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్టామినా లేదంటూ తేజ కన్నీళ్లు.. గౌతమ్ను మెంటల్ అన్న గంగవ్వ
బీబీ ఇంటికి దారేది గేమ్లో ఎల్లో టీమ్ ఎటూ కాకుండా పోయింది. కనీసం కంటెండర్లు కూడా అవలేకపోయారు. రెడ్ టీమ్లో నుంచి ఒకరు, గ్రీన్, బ్లూ టీమ్ నుంచి ఇద్దరు చొప్పున కంటెండర్లు అయ్యారు. ఇదిలా ఉంటే అవినాష్, రోహిణి వల్లే ఇంటిసభ్యులు పస్తులుండకుండా తినగలిగారు. ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 31)ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఏడుపు అనేది నా ఎమోషన్గేమ్లో కావాలనే ఏడ్చావ్ అంటూ యష్మిపై సెటైర్లు వేశాడు నిఖిల్. ఆ జోకుల్ని సరదాగా తీసుకోలేకపోయిన యష్మి నేను కష్టపడి ఆడాను.. ఏడుపు అనేది నా ఎమోషన్ అని సీరియస్గా బదులిచ్చింది. దీంతో నిఖిల్ చివరకు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే కిచెన్లో వంట చేసుకునేందుకు బిగ్బాస్ టైం కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే కదా! ఈరోజు వంట చేస్తుండగానే ఆ సమయం ముగియడంతో బిగ్బాస్ ఉన్నఫళంగా గ్యాస్ ఆఫ్ చేశాడు.ఆ ఇద్దరిల్లే అందరికీ భోజనం..దీంతో వంట చేసేదెలాగా? అని హౌస్మేట్స్ కంగారుపడ్డారు. అంతలోనే బిగ్బాస్.. ఆ టైం యాడ్ చేయాలంటే అవినాష్, రోహిణి చిన్న పిల్లలుగా మారి నవ్వించాలన్నాడు. ఎంటర్టైన్మెంట్ అనేది వీళ్లిద్దరికీ కొట్టిన పిండి కావడంతో పిల్లల్లా కాదు ఏకంగా చిచ్చర పిడుగుల్లా మారిపోయారు. వీరి వినోదాన్ని చూసి ముచ్చటపడిపోయిన బిగ్బాస్ కిచెన్ టైమర్కు రెండు గంటలపాటు టైం యాడ్ చేశాడు. దీంతో కంటెస్టెంట్లు వంట చేసుకుని తినగలిగారు.గౌతమ్ అవుట్ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్లో తాడోపేడో అని చివరి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో నిఖిల్ తన బ్లూ టీమ్ను గెలిపించాడు. బ్లూ టీమ్ లీడర్ హరితేజ రెండు సార్లు డైస్ రోల్ చేసే ఛాన్స్ పొందింది. అలా డైస్ ద్వారా వచ్చిన మూడు పాయింట్లను నిఖిల్కు ఇవ్వగా ఐదు పాయింట్లు తనకు ఇచ్చుకుంది. వీరికి రెండు ఎల్లో కార్డ్స్ రాగా.. అందులో ఒకటి రెడ్ టీమ్కు, మరొకటి గ్రీన్ టీమ్కు ఇచ్చారు. అలా రెడ్ టీమ్ నుంచి గౌతమ్, గ్రీన్ టీమ్ నుంచి విష్ణుప్రియ ఆటలో నుంచి వైదొలిగారు.కరివేపాకులా తీసిపారేసిన గంగవ్వగేమ్ నుంచి అవుట్ అవడంతో గౌతమ్ డీలా పడిపోయాడు. అదే విషయం విష్ణుప్రియ.. గంగవ్వతో చెప్తే.. అతడికేమైనా మెంటలా? ఎక్కువ ఆవేశపడతాడు. బిత్తిరి అంటూ.. కూరలో కరివేపాకులా తీసిపారేసింది. ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్లో బీబీ ఇంటికి చేరువైన హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజను కంటెండర్లుగా ప్రకటించారు. వీరికి తిరుగుతూనే ఉండు- గెలిచేవరకు అనే గేమ్ పెట్టాడు. ఇందులో పోటీదారులు బ్యాగులు ధరించి సర్కిల్లో తిరుగుతూ ఉండాలి.ఏడ్చేసిన తేజఫస్ట్ రౌండ్లో హరితేజ బాగానే ఆడింది కానీ తన బ్యాగు ఎక్కువ ఖాళీ అవడంతో ఆమె ఆటలో నుంచి అవుట్ అయింది. ఆటలో ఎన్నోసార్లు కింద పడుతూ లేస్తూ ఫైట్ చేసిన తేజ నెక్స్ట్ అవుట్ అయ్యాడు. దీంతో హర్టయిన తేజ.. తనకు స్టామినా ఉంటే బాగుండేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇకపోతే ఈ గేమ్లో ఫైనల్ వరకు అవినాష్ నిలిచి మెగా చీఫ్ పదవి గెలిచాడని తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్: ఇచ్చిపడేసిన నబీల్.. విలన్గా విష్ఱుప్రియ.. దెబ్బకు!
అవినాష్ను స్కానింగ్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగోలేక ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నాడేమోనని హౌస్ మొత్తం ఏడ్చేసింది. కట్ చేస్తే కొన్ని గంటలకే లోనికి వచ్చాడు. నామినేషన్స్ ఈసారి డిఫరెంట్గా జరిగాయి. ముఖ్యంగా మెగా చీఫ్కు ఇది కత్తి మీద సామే అయింది. అదెలాగో తెలియాలంటే నేటి (అక్టోబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హౌస్ మొత్తం ఏడుపుకడుపు నొప్పితో అవినాష్ మెడికల్ రూమ్కు వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యుడు స్కానింగ్ కోసం హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నారు. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను, అందుకే హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అంటూ అవినాష్ హౌస్లో ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే అవి ఎలిమినేట్ అవుతున్నాడనుకుని దాదాపు హౌస్మేట్స్ అందరూ భారంగా ఏడుస్తూ వీడ్కోలు చెప్పారు. అవినాష్ను హాస్పిటల్కు తీసుకెళ్లి స్కాన్ చేయించిన బిగ్బాస్ టీమ్.. అతడిని తిరిగి హౌస్లోకి పంపారు.నామినేషన్స్.. మెగా చీఫ్పై భారంమెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఐదుగురు సభ్యులను నామినేట్ చేసి జైల్లో పెట్టి తాళం వేయాలన్నాడు. చీఫ్ను చేయడంతో పాటు విలన్ను కూడా చేసేస్తున్నారని మనసులో అనుకుంటూనే ముందుగా గౌతమ్ను నామినేట్ చేసింది. లేడీస్ వీక్ అంటూ ఆడాళ్లకు గౌరవమిస్తానంటావ్.. కానీ ఒకరిపై నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అరవడం బాగోలేదని తెలిపింది. అందుకు గౌతమ్.. ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పాయింట్లు వెతకడానికే నీతో ఉన్నాతన పేరు రావడంతో యష్మి గొడవకు దిగింది. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అనేశాడు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. నన్ను అక్కా అని పిలవకు అని యష్మి హెచ్చరించగా అది చూసి విష్ణు పకాపకా నవ్వింది. నాకంటే ఎక్కువపాయింట్లు ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా నామినేట్ చేయవని గౌతమ్.. విష్ణుపై అసహనం వ్యక్తం చేశాడు. నిన్ను నామినేట్ చేయడానికి దగ్గరుండి పాయింట్లు వెతికానంది విష్ణు. ఈమె మాటలు విన్న పృథ్వీ వెటకారంగా నవ్వాడు. మనసు చివుక్కుమంది, అందుకే..నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావ్, అందర్నీ గాలికొదిలేసి నీ కోసమే బజ్జీలు వేసుకున్నావంటూ ప్రేరణను జైల్లో పడేసింది. సంచాలకుడిపై అరవడం వల్ల నా మనసు చివుక్కుమందంటూ తేజను నామినేట్ చేసింది. పృథ్వీ ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో నయనిని సైతం జైల్లో వేసింది. వైల్డ్కార్డ్స్ వచ్చాక నీలో పన్ యాంగిల్ కనిపించడం లేదంటూ నబీల్ను నామినేట్ చేసింది. వెంటనే నబీల్.. నువ్వు పృథ్వీతో ఉంటే నేనెక్కడ కనిపిస్తానంటూ భలే కౌంటరిచ్చాడు. నీలో ఫైర్ ఏముందని నాకు చెప్తున్నావ్ అని తిరిగి ప్రశ్నించాడు. నామినేషన్స్లో రెండో లెవల్అలా విష్ణుప్రియ వల్ల గౌతమ్, ప్రేరణ, నయని పావని, తేజ, నబీల్ నామినేట్ అయ్యారు. మన టీమ్వాళ్లు మెగా చీఫ్ అవ్వాలని ఆడితే ఇప్పుడు నన్నే నామినేట్ చేసిందని నబీల్ ఏడ్చాడు. చేసిందంతా చేసిన విష్ణు.. నబీల్కు సారీ చెప్పింది. తర్వాత నామినేషన్స్లో రెండో లెవల్ మొదలైంది. జైల్లో ఉన్నవారిని విడిపించే అవకాశాన్ని హౌస్మేట్స్కు ఇచ్చాడు. బజర్ మోగిన ప్రతిసారి జైలు తాళం చెవిని పట్టుకున్నవారికి ఒకరిని నామినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి బదులుగా మరొకరిని నామినేట్ చేసి జైల్లో వేయాల్సి ఉంటుంది.ఫైనల్ లిస్ట్ ఇదేమొదటగా పృథ్వీ తాళం అందుకుని.. నబీల్ను జైలు నుంచి విడిపించాడు. అతడి స్థానంలోకి అవినాష్ను పంపించాడు. తర్వాత బజర్కు యష్మి.. ప్రేరణను విడిపించి హరితేజను జైల్లోకి పంపింది. రోహిణి.. అవినాష్ను బయటకు తీసి పృథ్వీని లోనికి పంపించింది. అవినాష్.. తేజను విడిపించి యష్మిని జైల్లో వేశాడు. ప్రేరణ.. పృథ్వీని విడిపించి తేజను లోనికి పంపించింది. ఫైనల్గా ఈ వారం గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేట్ అయినట్లు ప్రకటించారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిపై ప్రేమను దాచేస్తున్న నిఖిల్.. కోపంతో తేజను కొట్టిన గంగవ్వ
రెండు రోజులుగా కొనసాగుతున్న బీబీ రాజ్యం ఛాలెంజ్ ఈరోజుతో పూర్తయింది. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ను వెనక్కు నెట్టి ఓజీ టీమ్(పాత కంటెస్టెంట్లు) రాజ్యాన్ని కైవసం చేసుకుంది. అదొక హఠాత్పరిణామం.. అన్నట్లుగా విష్ణుప్రియ మెగా చీఫ్గా నిలిచింది. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పొడుపు కథబీబీ రాజ్యం చాలెంజ్లో భాగంగా మీలో ఎవరు తెలివైనవారు? అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్కు నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. '13 హార్ట్స్ ఉంటాయి.. కానీ మిగతా ఆర్గాన్స్ ఉండవు.. ఏంటి?' అన్న ప్రశ్నకు తేజ ప్లేయింగ్ కార్డ్స్ అని బదులిచ్చాడు. కొన్ని నెలలకు 31 రోజులుంటాయి కొన్ని నెలలకు 30రోజులుంటాయి. ఎన్ని నెలలకు 28 రోజులుంటాయన్న ప్రశ్నకు గౌతమ్ 12 నెలలు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు.బతికుండగానే పాతిపెడతారా?ఏపీ, తెలంగాణ సరిహద్దులో విమానం పడిపోతే అందులో ఉన్న సర్వైవర్లను ఎక్కడ పాతిపెడతారు? అని అడిగాడు. అందుకు నిఖిల్, నయని.. ఆంధ్ర, తెలంగాణ అంటూ శుద్ధ తప్పు సమాధానం చెప్పారు. బతికున్నవాళ్లను పాతిపెడతారా? అని బిగ్బాస్ కౌంటర్ వేయడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఇలాంటి ప్రశ్నలే మరికొన్ని వేయగా రెండు టీమ్స్కు టై అయింది. దీంతో చివరి ప్రశ్నగా.. కోతి, ఉడుత, పక్షిలో ఏది ముందుగా కొబ్బరిచెట్టు ఎక్కి అరటిపండు తెంపుతుందన్నాడు. తేజను వాయించిన గంగవ్వముందుగా బజర్ నొక్కిన ప్రేరణకు ప్రశ్న సరిగా అర్థం కాలేదు. ఆ క్వశ్చన్ రిపీట్ చేయడానికి వీల్లేదని తేజ వాదించాడు. కావాలంటే జంతువుల పేర్లను ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చన్నాడు. దీంతో గంగవ్వ వచ్చి.. ప్రేరణకు ఎందుకు చెప్తున్నావు, నీకు ఆన్సర్ చెప్పొస్తలేదా? అని తేజను కొట్టింది. ఇంతలో ప్రేరణ కొబ్బరిచెట్టుపై నుంచి పండును ఏ జంతువూ తెంపలేదని పేర్కొంది.ప్రేరతో గౌతమ్ ఫైట్అలా ఈ గేమ్లో ఓజీ గెలిచి బీబీ రాజ్యంలో స్కూల్, న్యాయస్థానం గెలుచుకుంది. అలాగే తన టీమ్లో ప్రేరణను కంటెండర్గా ప్రకటించారు. రాయల్స్ టీమ్లో మెహబూబ్ను చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు. ఇంతలో గౌతమ్.. ప్రేరణతో ఏదో వాదులాటకు దిగగా మధ్యలో యష్మి వచ్చి సముదాయించబోయింది. మా ఇద్దరి మధ్యలోకి రాకు, వెళ్లిపో అని యష్మిపై అరిచాడు. కాసేపటికి వాళ్లిద్దరికీ సారీ కూడా చెప్పాడు. ప్రేమ ఉంది కాబట్టే అలా..మరోవైపు నిఖిల్, యష్మి మధ్య దోబూచులాట అవుతూనే ఉంది. నీకు, నాకు సెట్టవదు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అంటూ ఏవేవో మాట్లాడుకున్నారు. నిఖిల్ ప్రవర్తన అంతుపట్టని యష్మి.. సడన్గా వచ్చి నాపై ఇంట్రస్ట్ ఉందన్నట్లు మాట్లాడతాడు. అలాగే నేను, గౌతమ్ డ్యాన్స్ చేస్తే జెలసీ ఫీల్ అయ్యాడు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. కెమెరా ముందు మంచోడిలా ఉండాలనుకుంటే ఉండు.. నేను మాత్రం ఫేక్గా ఉండలేను అంది. అలా ఈర్ష్యపడటం లవ్ లాంగ్వేజ్ అని ప్రేరణ నిర్ధారించింది.ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్స్ఇక బీబీ రాజ్యం టాస్కు పూర్తయిందన్న బిగ్బాస్.. ఓజీ, రాయల్స్ నుంచి చెరొక కంటెండర్ను సెలక్ట్ చేయవచ్చన్నాడు. దీంతో విష్ణుప్రియ, తేజను ఎంపిక చేశారు. ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి, తేజలలో ఒకర్ని మెగా చీఫ్గా ఎన్నుకునే బాధ్యతను హౌస్మేట్స్పై వేశాడు. మెగా చీఫ్కు అనర్హులనుకునేవారికి మిరప దండ వేసి రేసు నుంచి తప్పించాలన్నాడు.కొత్త చీఫ్గా విష్ణుప్రియఅలా మొదటగా మెహబూబ్.. ప్రేరణను తప్పించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నబీల్.. రోహిణిని, అవినాష్.. పృథ్వీని అవుట్ చేశారు. చివరగా గౌతమ్.. నిఖిల్ను అవుట్ చేస్తూ విష్ణుప్రియను చీఫ్గా గెలిపించాడు. అయితే ఒక్కరికే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా చూడాలని మాట తీసుకున్నాడు. ఇక విష్ణుప్రియకు ఇచ్చిన ఎన్విలాప్లో రూ.2 లక్షలు ఉండగా అది ప్రైజ్మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్మనీ రూ.40,16,000కు చేరింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హడలెత్తించిన నిఖిల్, పృథ్వీ.. కూతురి కోసం హరి కన్నీళ్లు!
ఫిజికల్ టాస్క్ వస్తే పృథ్వీకి తెలియకుండానే పూనకం వస్తుంది. మనుషుల్ని పిట్టల్లా విసిరేస్తూ, పురుగుల్లా నలిపేస్తుంటాడు. ఈ రోజూ ఇదే జరిగింది. ఈసారి నిఖిల్ తోడయ్యాడు. టాస్కులో ఈ దోస్తులిద్దరూ అరాచకం సృష్టించారు. మరి వీరితో పోటీపడిందెవరు? హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నిఖిల్, పృథ్వీ అరాచకంబీబీ రాజ్యం ఛాలెంజ్ కొనసాగింపుగా నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎనిమిది ధాన్యపు బస్తాలను తోపుడు బండిపై ఎవరు ముందుగా పెడతారో ఆ టీమ్కు రాజ్యంలో వ్యవసాయం దక్కుతుందన్నాడు. ఓజీ టీమ్ నుంచి నిఖిల్, పృథ్వీ విజృంభించి ఆడారు. వారిని అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ చాలావరకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొట్టుకున్నారు, తోసేసుకున్నారు. నానా అరాచకం సృష్టించడంతో బిగ్బాస్ కొన్ని సెకన్లపాటు గేమ్ను పాజ్ చేశాడు. అదుర్స్ అనిపించిన తేజ, అవినాష్అలాగే ఈ ఆటలో పోటీదారులను మార్చుకోవచ్చని వెసులుబాటు కల్పించాడు. అలా గౌతమ్, మెహబూబ్ స్థానంలోకి అవినాష్, తేజ వచ్చారు. వీళ్లు కూడా తమ శక్తికి మించి ప్రయత్నించి ఆడారు. వాళ్లు ఎంతో కష్టపడి ఓ సంచిని బండిపై పెట్టారు. కానీ అది ముందు ఓజీ తోపుడు బండికి టచ్ అయిందంటూ వారికే పాయింట్ ఇస్తానని సంచాలకురాలు యష్మి వితండ వాదం చేసింది. ఒక్క బస్తా కూడా రాయల్ టీమ్ను పెట్టనివ్వకపోవడం నిఖిల్, పృథ్వీల శక్తికి నిదర్శనం.మనలో ఒకరే విన్నర్ఫైనల్గా ఈ గేమ్లో ఓజీ టీమ్ గెలవడంతో వ్యవసాయ భూమి గెలిచారు. అలాగే తన టీమ్లో నుంచి పృథ్వీని మెగా చీఫ్ కంటెండర్గా ప్రకటించారు. ఈ క్రమంలో కంటెండర్ అవ్వాలనుకున్న ప్రేరణకు, యష్మికి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరికీ సర్ది చెప్పిన నిఖిల్.. ఇది మన సీజన్.. మన టీమ్లోని ఒకరే ట్రోఫీ ఎత్తాలి. మనలో మనకు గొడవలొద్దు అని టీమ్ సభ్యులకు హితోపదేశం చేశాడు. ఓడిన రాయల్స్ టీమ్ నుంచి గంగవ్వను మెగా చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు.కూతుర్ని తల్చుకుని హరితేజ ఎమోషనల్వచ్చినప్పటినుంచి మేమే గెలిచాం అని రాయల్స్ ఫీల్ అవుతున్నారు. మనం మిగతా టాస్కులు గెలిచి ఆ పొగరును తగ్గించేయాలని ప్రేరణ.. నబీల్తో అంది. అన్నట్లుగానే తర్వాత టాస్కుల్లోనూ దూకుడు ప్రదర్శించారు. మరోవైపు హరితేజ.. తన కూతురు భూమిని తల్చుకుని ఎమోషనలైంది. అమ్మ గురించి బెంగపెట్టుకోకు, స్కూలుకు వెళ్లు, పిన్నితో ఆడుకో.. వీకెండ్లో నాన్న వస్తాడు. అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు, నీకోసం ఏడవట్లేదు. నువ్వు కూడా ఏడవొద్దంటూనే కన్నీళ్లు పెట్టుకుంది.మళ్లీ ఓజీ టీమ్దే గెలుపుబీబీ రాజ్యంలో సైన్యం, హాస్పిటల్ను పొందడానికి బిగ్బాస్ వైరల్ అటాక్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓజీ టీమ్ నుంచి నిఖిల్, నబీల్ ఆడగా రాయల్ టీమ్ నుంచి గౌతమ్, తేజ ఆడారు. మరోసారి ఓజీ టీమ్ గెలిచి హాస్పిటల్, సైన్యం పొందింది. అలాగే తన టీమ్లో నుంచి నిఖిల్ను మెగా చీఫ్ కంటెండర్గా ప్రకటించారు. రాయల్స్ నుంచి గౌతమ్ను మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ
హౌస్మేట్స్ ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో తెలియజేసేందుకు నాగార్జున ఓ టాస్క్ పెట్టాడు. మరోవైపు హౌస్లో గౌతమ్ కృష్ణ.. యష్మి అంటే తనకు క్రష్ అంటున్నాడు. అటు బిగ్బాస్ కప్పు గెలుస్తానన్న మణి.. ఇంటికి వెళ్లిపోతానని ఏడ్చాడు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (అక్టోబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..వెళ్లిపోతా..ఈ గొడవలు, కొట్లాటలు నావల్ల కావడం లేదు, వెళ్లిపోతానంటూ కెమెరాల ముందు మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. దయచేసి ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉందామనుకున్నా.. కానీ నా వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై గౌతమ్ క్రష్అటు గౌతమ్.. 'నేను సింగిల్, నీపై నాకు క్రష్ ఉంది.. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్లా ఉందాం. మన మధ్య బాండింగ్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం.. అందరిలో నువ్వు నాకు స్పెషల్' అని యష్మితో మాటలు కదిపాడు. తర్వాత నాగార్జున బీబీటైమ్స్ హెడ్లైన్స్ అని ఓ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లకు సరిపోయే హెడ్లైన్స్ను బోర్డ్పై పెడతాడు. అది నిజంగా ఎంతమేరకు సూట్ అవుతుందన్నది హౌస్మేట్స్ చెప్పాలి. నిన్న హీరో- ఈరోజు జీరోఅలా మొదటగా కండబలం ఎక్కువ- బుద్ధిబలం తక్కువ అన్న హెడ్డింగ్ గౌతమ్కు సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ క్రమంలో నిఖిల్, గౌతమ్ కొట్లాడుకున్న వీడియో చూపించిన నాగ్.. కసిగా ఆడండి కానీ ఉన్మాదంగా ఆడొద్దని హెచ్చరించాడు. నిఖిల్కు నిన్న హీరో- ఈరోజు జీరో అన్న ట్యాగ్ కరెక్ట్గా సరిపోతుందన్నాడు. హరితేజ.. ఒకప్పుడు ఫైర్- ఇప్పుడు ఫ్లవర్లా మారిపోయిందన్నారు.ఆట కంటే నాకు నేనే ముఖ్యంపృథ్వీకి.. 'కింగ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్- వాంట్స్ రెస్పెక్ట్ (అగౌరవపరుస్తాడు కానీ తనను గౌరవించాలనుకుంటాడు)', 'ఆట కంటే నాకు నేనే ముఖ్యం' అన్న రెండు ట్యాగులు సరిగ్గా సూటవుతాయన్నారు. గడ్డం, మీసం తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేశావని నాగ్ ఆరా తీశాడు. పోనీ రూ.5 లక్షలు ప్రైజ్మనీలో యాడ్ చేస్తా, గడ్డం తీసుకుంటావా? అన్నాడు. పృథ్వీ ఒప్పుకోకపోవడంతో దాన్ని రూ.8 లక్షలకు పెంచాడు. అయినా అడ్డంగా తలూపడంతో నామినేషన్స్తో పని లేకుండా నేరుగా పదో వారంలోకి అడుగుపెట్టేందుకు ఛాన్స్ ఇస్తానన్నాడు. అయినా పృథ్వీ అంగీకరించలేదు.అశ్వత్థామ 3.0ఇక నామినేషన్స్లో పృథ్వీ- ప్రేరణపై రివేంజ్ నామినేషన్ చేయడాన్ని నాగ్ సమర్థించడం విశేషం. అనంతరం అవినాష్కు పైకి నవ్విస్తా- వెనక ప్లాన్ వేస్తా అన్న హెడ్డింగ్ సరిగ్గా సరిపోతుందన్నారు. ఆ వెంటనే భార్య అనూజ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పిన ఆడియో ప్లే చేయగా అవినాష్ ఎమోషనలయ్యాడు. ఇక గౌతమ్ అశ్వత్థామ 3.0 అని చెప్తూ నాగ్ అతడిని మెచ్చుకున్నాడు. ముందు ఒక ఆట-వెనక ఒక ఆట హెడ్డింగ్ యష్మికి కాస్త సూట్ అవుతుందన్నారు. ఆటలో వీక్- డ్రామాలో పీక్తర్వాత నాగ్.. ప్రేరణ, తేజను నాగ్ సేవ్ చేశాడు. 'ఆటలో వీక్- డ్రామాలో పీక్' హెడ్డింగ్ మణికంఠకు సెట్ అవుతుందని హౌస్మేట్స్ అన్నారు. ఈ సందర్భంగా మణి.. కూర్చుంటే లేవలేకపోతున్నా.. నా శరీరం నా కంట్రోల్లో లేదు, ఇంకా ఆడాలని ఉంది.. కానీ ఇలాగే ఉంటే నా శరీరం, మెదడు సహకరించదు. నేను వెళ్లిపోతాను సర్. నాకు నేనే వీక్ అయిపోయాను అని తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ ఎలా ఉందో చూద్దామని నాగ్ అతడిని కూర్చోబెట్టాడు.మత్తు వదలరా..తేజకు హౌస్ అంతా కలిసి మత్తు వదలరా ట్యాగ్ ఇచ్చేసింది. ప్రేరణకు.. గుంపులో గుర్తింపు కోరుకోవద్దని చెప్పారు. నయని పావనికి క్రై బేబీ అన్న ట్యాగ్ ఇచ్చారు. మెహబూబ్.. ఈ సీజన్కు ఫ్లాప్ చీఫ్ అని నిర్ణయించారు. కత్తిలాంటి నా నాలుక.. కాదు మీకు తేలిక శీర్షిక గంగవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. తనను ఎవరూ నామినేట్ చేయొద్దని మీరైనా చెప్పండని నాగార్జునను వేడుకుంది.మాటలో పులి- ఆటలో పిల్లిఇక రోహిణికి.. మనసులే కాదు ఆట కూడా గెలవాలన్నారు. విష్ణుప్రియకు 'రివేంజ్ నా సరికొత్త ఆట', 'వీకెండ్లో ఆట, మిగతా రోజులు టాటా' అన్న రెండు హెడ్లైన్స్ కరెక్ట్గా సరిపోయాయన్నారు. నబీల్.. 'మాటలో పులి- ఆటలో పిల్లి' అన్నారు. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ నుంచి బయటకెళ్లిపోతా.. నిఖిల్ vs గౌతమ్
బిగ్బాస్ హౌస్లో బూతులు తిట్టడం, ఫిజికల్గా కొట్టడం లాంటివి చేయకూడదు. కానీ ప్రస్తుతం నడుస్తున్న 'ఓవర్ స్మార్ట్' గేమ్ చూస్తుంటే కొట్టుకోవడానికి, గొడవలు పడటానికే ఇది పెట్టారా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు టీమ్స్ ఆపసోపాలు పడ్డాయి. ఈ క్రమంలో గౌతమ్-నిఖిల్ మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఇంతకీ గురువారం (అక్టోబర్ 17) ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.తెలివి చూపించిన యష్మిఎంతకీ ఛార్జింగ్ ఇవ్వకపోయేసరికి రాయల్స్ టీమ్.. కిడ్నాప్ ప్లాన్ వేశాడు. తేలిగ్గా ఉంటాడని చెప్పి మణికంఠని లాగేశారు. కానీ ఓజీ క్లాన్ టీమ్ ఇంతా దీనికి అడ్డుపడింది. అందరూ మణికంఠని డిఫెండ్ చేస్తుంటే చాకచక్యంగా యష్మిని అవినాష్ లోపలికి లాగేశాడు. వెంటనే తేజ డోర్ మూసేశాడు. ఇక యష్మిని బయటకు తీసుకొచ్చేందుకు ఓజీ క్లాన్ తెగ ప్రయత్నించింది. లోపలున్న యష్మి కేబుల్ కలిపేసి అవినాష్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు. ఎంత గింజుకున్నా కుదరకపోయేసరికి కేబుల్ తెగ్గొట్టి, ఊడిపోయిందని తెలివి చూపించింది. దీంతో ఈమెని వదిలేయాల్సి వచ్చింది.(ఇదీ చదవండి: ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత)మణికంఠ వల్ల గొడవఉదయం లేవడమే బిగ్బాస్ ఓ ప్రకటన చేశాడు. సైరన్-సైరన్ రావడానికి మధ్యలో ఛార్జింగ్ పాట్ని పగలగొట్టారని, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ నుంచి ఓ సభ్యుడిని టాస్క్ నుంచి తప్పించాలని ఆదేశించాడు. ఇక ఎవరినీ పక్కనబెట్టేద్దామా అని ఓజీ క్లాన్ ఆలోచిస్తుండగా మణికంఠ వల్ల మరో గొడవ జరిగింది. బాత్రూమ్లోకి వెళ్లిన మణికంఠ, విష్ణుప్రియని రాయల్ క్లాన్ లాక్ చేశారు. అనుమతి లేకుండా లోపలికి వచ్చాం కాబట్టి రెండు పాయింట్ల ఛార్జింగ్ ఇస్తామని నిఖిల్ అన్నాడు. ఇంతలో రాయల్ క్లాన్.. మణికంఠ నుంచి బలవంతంగా ఛార్చింగ్ చేసేందుకు ప్రయత్నించారు.నిఖిల్ వర్సెస్ గౌతమ్బాత్రూం బయటున్న తేజని నిఖిల్ పక్కకి లాగేశాడు. దీంతో నిఖిల్ని గౌతమ్ వెనక నుంచి గట్టిగా పట్టేసుకున్నాడు. అలా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరూ కిందపడిపోయారు. అయితే గౌతమ్ చేతులతో గుద్దుతున్నాడని నబీల్ ఆరోపించాడు. దీంతో ఆవేశపడిపోయిన గౌతమ్.. తోయలేదు అంటూ మీదకొచ్చేశాడు. నిఖిల్ని పక్కకు లాగేశాడు. దీంతో కోపంలో గౌతమ్ మెడ పట్టుకుని సోఫాపైకి విసిరేశాడు. కొడితే నేను కొడతా అని నిఖిల్ అనేసరికి.. కావాలని కొట్టలే అని గౌతమ్ రెచ్చిపోయాడు. అక్కడి నుంచి గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. కొట్టినట్లు ఉంటే బిగ్బాస్ నుంచి బయటకెళ్లిపోతా అని గౌతమ్ సవాలు చేశాడు.మణికంఠ భయంభయంబాత్రూం దగ్గర ఇచ్చిన మాట ప్రకారం మెహబూబ్కి నిఖిల్ ఓ పాయింట్ ఇచ్చాడు. మరోవైపు రాయల్ క్లాన్ చెప్రిన ప్రకారం పృథ్వీని టాస్క్ నుంచి తప్పుకోవాలని బిగ్బాస్ ప్రకటించాడు. ఇదంతా చూసి బెదిరిపోయిన మణికంఠ.. హరితేజ దగ్గరకెళ్లి నన్ను గేమ్ నుంచి తీసేయండి. ఆడేవాళ్లతో ఆడండి. వాళ్లకి చీఫ్ అవ్వాలని ఉంది. నాకు దెబ్బలు తగిలితే ఏంటి పరిస్థితి అని తన బాధలు చెప్పుకొన్నాడు. కాసేపటి తర్వాత కూడా నా శరీరం సహకరించట్లేదు. గేమ్ ఇంత కష్టంగా ఉంటుందని అనుకోలేదు అని చెప్పడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. శుక్రవారం ఎపిసోడ్లో ఈ టాస్క్కి ముగింపు ఉండొచ్చు.(ఇదీ చదవండి: తొలి రోజే తనతో ప్రేమలో పడిపోయా: హీరో కిరణ్ అబ్బవరం) -
గతాన్ని తల్చుకుని కుంగిపోయిన గౌతమ్.. ఈసారి కప్పు కొడతా!
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడుతోంది. బిగ్బాస్ 8లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. వీరితో కలిసి ఫన్ గేమ్ ఆడించాడు. అదే బిగ్బాస్ హోటల్. ఈ టాస్క్లో పాతవాళ్లంతా హోటల్ సిబ్బందిగా, కొత్తవాళ్లంతా గెస్టులుగా ఉన్నారు. మరి ఈ టాస్క్ ఏమేరకు వర్కవుట్ అయిందో నేటి (అక్టోబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..ఫన్ టాస్క్బిగ్బాస్ అమ్మాయిలను ఒక టీమ్గా, అబ్బాయిలను ఒక టీమ్గా విభజించి ఫన్నీ టాస్కు ఇచ్చాడు. ఆడాళ్ల టీమ్కు ముక్కు అవినాష్, అబ్బాయిల టీమ్కు రోహిణిని లీడర్గా పెట్టారు. గేమ్ ఏంటంటే.. టీమ్సభ్యులంతా వారి నోటిని నీటితో నింపుకోవాలి. వీళ్లను ఇతర టీమ్లోని వారు నవ్వించి ఆ నీళ్లు బయటకు వచ్చేలా చేయాలి. ఈ గేమ్లో అబ్బాయిలను నవ్వించే క్రమంలో అవినాష్.. మణికంఠ దగ్గరకు వెళ్లి పాట పాడాడు. కప్పు కొడతా: గౌతమ్తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్లి అశ్వత్థామ 2.0 అని ఇమిటేట్ చేశాడు. అది విని హర్టయిపోయిన గౌతమ్.. అయిపోయినదాన్ని మళ్లీ మళ్లీ తీసి ఇరిటేషన్ తెప్పించొద్దు. వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. అని మైక్ విసిరేసి ఇంట్లోకి వెళ్లి ఏడ్చాడు. నాన్న ఐయామ్ సారీ, నీతో గొడవపడి మాట్లాడకుండా వచ్చేశా.. కానీ ఈసారి నన్ను నేను నిరూపించుకుంటాను. కప్పు కొడతాను అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.ఉప్పు గెల్చుకున్న అవినాష్, రోహిణిమరోవైపు తనను నవ్వించమని అవినాష్, రోహిణికి బిగ్బాస్ టాస్క్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ వీరికి కొట్టిన పిండి కావడంతో ఇరగదీశారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్బాస్.. ఇంటిసభ్యులు రేషన్లో మర్చిపోయిన ఉప్పును కానుకగా ఇచ్చాడు. ఇక తర్వాతి రోజు ఉదయం విష్ణు ధ్యానం చేస్తుంటే గంగవ్వ చెడగొట్టేందుకు ప్రయత్నించడం భలే సరదాగా అనిపించింది. అనంతరం బిగ్బాస్ హోటల్ టాస్క్ పెట్టాడు. ఇందులో ఓల్డ్ కంటెస్టెంట్లు హోటల్ సిబ్బంది కాగా రాయల్ టీమ్ అతిథులుగా ఉంటారు. ఎవరెవరు ఏ పాత్రలో..పాత్రల విషయానికి వస్తే.. నబీల్.. అప్పుల్లో కూరుకుపోయిన హోటల్ యజమాని, ప్రేరణ.. మతిమరుపు మేనేజర్, నిఖిల్.. హెడ్ చెఫ్, సీత.. అసిస్టెంట్ చీఫ్, పృథ్వీ.. అందరినీ ఫ్లర్ట్ చేసే గార్డ్, విష్ణు.. పృథ్వీతో లవ్లో ఉండే పర్సనల్ బట్లర్, యష్మి.. హౌస్ కీపింగ్, మణికంఠ.. హౌస్ కీపింగ్(దొంగిలించడం, దాన్ని తిరిగిచ్చేయడం)గా వ్యవహరిస్తారు.తికమక మనిషిగా హరితేజగంగవ్వ.. రాజవంశానికి చెందిన మహారాణి, నయని పావని.. మహారాణి అసిస్టెంట్, అవినాష్.. సూపర్స్టార్, రోహిణి- పొగరుబోతు రిచ్ కిడ్ (అవినాష్ గర్ల్ఫ్రెండ్), మెహబూబ్.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ (రోహిణి తండ్రి అపాయింట్ చేస్తాడు) హరితేజ.. మెహబూబ్ అసిస్టెంట్(తికమక మనిషి), తేజ.. పాపులర్ ఫుడ్ బ్లాగర్, గౌతమ్.. పోలీసుల నుంచి దాక్కుని తిరుగుతున్న క్రిమినల్గా పాత్రలు పోషించారు.మణిని ఆడుకున్న రోహిణిటాస్కు ప్రారంభానికి ముందే సీత.. ఒక పర్సు కొట్టేయడం గమనార్హం. ఈ టాస్కులో హౌస్మేట్స్ తమ పర్ఫామెన్స్ చూపించారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదని రోహిణి అనగా.. మణి.. నువ్వో మాడియపోయిన కందిపప్పు, మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్ వేశాడు. దీంతో రోహిణి సీరియస్ అయింది.. ఒకసారి, రెండుసార్లు ఓకే.. కానీ మూడోసారి ఒప్పుకోను. నీ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి నీకు నచ్చినట్లు మాట్లాడటం ఫన్ కాదు.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతలోనే జోక్ చేశానంటూ నవ్వేసింది. నీ కళ్లలో భయమే నాకు కావాలంటూ నవ్వుతూ చెప్పడంతో మణి ఊపిరి పీల్చుకున్నాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: రన్నరప్గా గౌతమ్ కృష్ణ
గౌతమ్ కృష్ణ.. బిగ్బాస్కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్బాస్ ఏడో సీజన్తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్లోనూ సిద్దూ: ది రాక్స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్కు వెళ్లి మరీ హౌస్లో రీఎంట్రీ ఇచ్చాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేక మధ్యలోనే మళ్లీ ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ వైల్డ్ఫైర్లా మారిపోయి ఏకంగా ఫినాలేలో చోటు దక్కించుకున్నాడు. గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్గా నిలిచాడు. -
Bigg Boss 7: రైతుబిడ్డ సేఫ్ గేమ్? చివరకొచ్చినా 'బిగ్బాస్' తీరు మారట్లేదు!
బిగ్బాస్ 7 గురించి హోస్ట్ నాగార్జున ఏమో గొప్పలు చెబుతున్నాడు. రియాలిటీలో మాత్రం అస్సలు అలా లేదు. తాజా ఎపిసోడే దీనికి సరైన ఉదాహరణ. అలానే రైతుబిడ్డ ఈ సీజన్లో చాలా తెలివిగా ఆడాడని అందరూ అనుకుంటున్నారు. కానీ మనోడి సేఫ్ గేమ్ ఇప్పుడు బయటపడింది. అయితే ఓ విషయంలో మాత్రం బిగ్బాస్ అస్సలు తీరు మార్చుకోవడం లేదు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 91 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ విన్నర్ ప్రైజ్మనీ ఫినాలే టికెట్ గెలుచుకున్న అర్జున్.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్లు చెప్పడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ సీజన్లో విజేతగా నిలిస్తే ఏమేం దక్కుతాయో నాగార్జున ప్రకటించడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సీజన్ విన్నర్గా నిలిస్తే రూ.50 లక్షల నగదుతో పాటు మారుతి కార్, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతమవుతుందని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే రూ. 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారని అందరినీ నాగ్ అడిగితే.. అమ్మని ఈ డబ్బుతో హాయిగా చూసుకుంటా, తల్లిదండ్రులకు ఇల్లు కట్టిస్తా లాంటివి చెప్పారు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో పెద్దగా డ్రామా పండలేదు. మొత్తం తేలిపోయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆ కారణంతో అర్జున్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?) ప్రమోషన్స్ మధ్య ఎపిసోడ్ అయితే వీకెండ్ ఎపిసోడ్ అంటే.. హౌసులో ఉన్నవాళ్లతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. కానీ బిగ్బాస్ టీమ్ దీనికంటే ప్రమోషన్స్పై ప్రేమ ఎక్కువైపోయింది. ప్రమోషన్స్ చేయొద్దని అనట్లేదు గానీ ఎపిసోడ్లో ఎక్కడో ఐదు నిమిషాల పాటు ప్రమోషన్ ఉంటే బాగుండేది.. ఈ ఆదివారం మాత్రం కాస్త ఎక్కువ లెంగ్త్ ఉండేసరికి చాలా బోర్ కొట్టేసింది. 'నా సామి రంగ', 'హాయ్ నాన్న' సినిమాల్ని ప్రమోట్ చేయడానికి వచ్చిన ఆషికా రంగనాథ్, నాని పర్వాలేదనిపించారు తప్పితే ఏమంత అలరించలేకపోయారు. ప్రశాంత్ సేఫ్ గేమ్? సేవింగ్లో భాగంగా ప్రియాంక, శివాజీ, యావర్ వరసగా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. చివరగా ప్రశాంత్, శోభా, గౌతమ్ మిగిలారు. ఇలాంటి టైంలో ఎవిక్షన్ పాస్ ఉపయోగించాల్సిందేనని నాగార్జున అల్టిమేటం జారీ చేశాడు. లేకపోతే తిరిగిచ్చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించిన ప్రశాంత్.. శోభా-గౌతమ్ ఇద్దరిలో ఎవరికిచ్చినా ఇలాంటి టైంలో తను బ్యాడ్ అయిపోతానని తెలుసు. అందుకే ఎవరికి ఇచ్చేదే లేదని పదే పదే చెప్పాడు. తిరిగిచ్చేసి హీరో అయిపోదామనుకున్నాడు. కానీ ఇదంతా కూడా సేఫ్ గేమ్లా అనిపించింది తప్పితే ఇంట్రెస్టింగ్గా అయితే లేదు. ఆ తర్వాత ప్రశాంత్ సేవ్ అయ్యాడు. చివరగా శోభా బతికిపోయింది. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. 13వ వారం కావడం వల్లో ఏమో గానీ మనోడి.. ఎలిమినేట్ అయిపోయినా సరే పెద్దగా బాధపడలేదు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) -
Bigg Boss 7: ఆ కారణంతో గౌతమ్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్బాస్ 7 నుంచి డాక్టర్బాబు ఎలిమినేట్ అయిపోయాడు. అశ్వద్ధామ 2.0 అని హడావుడి చేసిన ఇతడు.. సింగిల్గా ఆడుతూనే 13వ వారం వరకు నెట్టుకొచ్చేశాడు. అయితే ఇతడు చేసిన కొన్ని పనులు, అలానే హౌసులోని పలువురి వల్ల గౌతమ్.. బయటకొచ్చేసినట్లు అనిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇన్నివారాలకు కలిపి రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ముట్టినట్లు టాక్. ఇంతకీ ఏంటి విషయం? డాక్టర్బాబు ఫెర్ఫార్మెన్స్ ఓకే డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ.. బిగ్బాస్ హౌస్లో 13వ వారాలైతే ఉన్నాడు గానీ గుర్తింపు అయితే పెద్దగా తెచ్చుకోలేకపోయాడు. మొదటి వారం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఈ విషయంలో మాత్రం అతడిని మెచ్చుకోవచ్చు. ఇన్ని వారాలు జరిగిన గేమ్స్లోనూ గౌతమ్ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఓ రోజు సీక్రెట్ రూంలో ఉండొచ్చి, 'అశ్వద్ధామ 2.0' అని హడావుడి చేశాడు గానీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) ఎలిమినేషన్కి అదే కారణమా? ప్రారంభంలో నామమాత్రంగా ఆడిన గౌతమ్.. ఆ తర్వాత నుంచి శివాజీతో గొడవ పెట్టుకుని హైలైట్ అయ్యాడు. అప్పటి నుంచి తాజా వీకెండ్ ఎపిసోడ్ వరకు ఈ తంతే నడిచింది. అయితే శివాజీ వరస్ట్ కామందు తరహా ప్రవర్తన గురించి కాస్తో కూస్తో నిజాలు మాట్లాడిన వాళ్లలో గౌతమ్ ఒకడు. ఇదే ఇప్పుడు బిగ్బాస్ ఆర్గనైజర్స్కి నచ్చలేదు. గౌతమ్ని ఎలిమినేట్ చేసి పడేశారు. గత రెండు మూడు వారాల గేమ్ తీసుకుంటే శివాజీ, యావర్ కంటే గౌతమ్ చాలా బెటర్. కానీ శివాజీ మీద బిగ్బాసోళ్లకు ప్రేమ ఎక్కువైంది. అదే గౌతమ్కి శాపమైందని టాక్. రెమ్యునరేషన్ ఎంత? ఇకపోతే వారానికి రూ 1.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అని గౌతమ్ డీల్ మాట్లాడుకున్నాడట. అంటే 13 వారాలకు గానూ దాదాపు రూ 19.5 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై గౌతమ్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు లెక్కలు తెలియవు. ఏదేమైనా శివాజీతో పెట్టుకోవడం తనకు ప్లస్ అవుతుందని గౌతమ్ అనుకున్నాడు కానీ అదే మైనస్ అయి, ఇంటి నుంచి బయటకొచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రానా తమ్ముడి డెస్టినేషన్ వెడ్డింగ్? ఆ దేశంలో మూడు రోజుల పాటు!) -
బిగ్బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ డాక్టర్ బాబు అవుట్!
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా... ఈ పాట పాడుకునే సమయం వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ వల్ల అర్జున్ మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. ఈసారి ఈయన జెండా ఎత్తేయడం పక్కా అనుకున్నారంతా! కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన సత్తా ఏంటో చూపించాడు అర్జున్. టికెట్ టు ఫినాలే రేసులో అందరినీ వెనక్కు నెడుతూ, ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్గా ఆడి ఫినాలే అస్త్ర గెలిచాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితేనే కదా టాప్ 5లో చోటు దక్కించుకునేది అని అందరూ డౌట్ పడ్డారు. కానీ ఈ వారం మొదట సేవ్ అయింది అర్జునే! నాగార్జున ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా అర్జున్ను ప్రకటిస్తూ అతడిని సేవ్ చేశాడు. దీంతో ఎలిమినేషన్ గండం గౌతమ్, శోభల మెడకు చుట్టుకుంది. కానీ శోభ కోసం ఎవరినైనా బలి చేసేందుకు బిగ్బాస్ రెడీ.. కాబట్టి ఆమెకు బదులుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ను పంపించే ప్లాన్ చేశారట! టాప్5లో ఉండేందుకు అర్హత ఉన్న గౌతమ్ కృష్ణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది చూసిన డాక్టర్ బాబు అభిమానులు.. అన్ఫెయిర్ బిగ్బాస్ అంటూ సోషల్ మీడియాలో ఆర్తనాదాలు చేస్తున్నారు. చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. బిగ్బాస్ హౌస్లో నో ట్రీట్మెంట్ -
అమర్ను ఛాలెంజ్ చేసిన గౌతమ్.. అర్జున్కు అన్యాయం!
బిగ్బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే కోసం పోటీ జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆటలో వెనకబడి రేసులో నుంచి పక్కకు తప్పుకోగా ఐదుగురు ఫినాలే అస్త్ర కోసం పోటీపడుతున్నారు. మరి వీరిలో ఎవరు ఆ అస్త్రాన్ని గెలుచుకోవడానికి దగ్గర్లో ఉన్నారు? ఎవరు రేసులో వెనకబడ్డారు? అనేది తాజా ఎపిసోడ్ (నవంబర్ 30) హైలైట్స్లో చదివేద్దాం... క్రికెట్ టాస్క్.. సిక్సులు బాదిన అమర్ తక్కువ పాయింట్లు ఉన్న ప్రియాంక, శివాజీ, శోభ ఫినాలే అస్త్ర రేసు నుంచి తప్పుకున్నారు. అయితే ప్రియాంక తన పాయింట్లను గౌతమ్కు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు అమర్దీప్. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడలేదు, ఎందుకు తప్పు నిర్ణయం తీసుకున్నావంటూ బాధపడ్డాడు. ఇంతలో మిగతా ఐదుగురు ఇంటిసభ్యులకు వెరైటీ క్రికెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో అమర్ గెలిచాడు. తప్పించుకో రాజా టాస్క్లో రైతుబిడ్డ గెలిచాడు. తప్పు చేసిన యావర్.. నోరు విప్పని శివాజీ అయితే ఈ టాస్కులో ఎవరి కాలికి ఉన్న తాళాలకు వారు కీ వెతికి విడిపించుకోవాలి. యావర్ ఒక కీ తీసుకుని అది రాకపోవడంతో కింద పడేశాడు. దీంతో అర్జున్కు బాక్స్లో ఎంత వెతికినా సరైన కీ దొరకలేదు. కీ కింద పడేయకూడదు కదా.. సంచాలకులు చెప్పాలి కదా అని గరమయ్యాడు. యావరే కీ కింద పడేశాడని తెలిసినా శివాజీ పెదవి విప్పలేదు. ఇక పాయింట్ల పట్టికలో యావర్ దిగువన ఉండటంతో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన పాయింట్లను పల్లవి ప్రశాంత్కు ఇచ్చాడు. అమర్ విజయంపై డౌట్ తర్వాత పట్టుకో తెలుసుకో టాస్క్ జరగ్గా ఇందులో అమర్దీప్ గెలిచాడు. కానీ కళ్లు కనిపించకుండా ఇచ్చిన మాస్క్లు సరిగా పనిచేస్తున్నాయో, లేదోనని యావర్ చెక్ చేయడంతో అమర్ అసహనానికి లోనయ్యాడు. నేను గెలిచినప్పుడే అందరికీ అనుమానాలు వస్తాయని ఆవేశపడ్డాడు. తర్వాత బ్యాలెన్స్ ది బాల్ టాస్కు జరిగింది. బ్యాలెన్స్ టాస్కులకు పెట్టింది పేరైన ప్రశాంత్ ఈ గేమ్లో గెలిచాడు. ఇక ఈ టాస్కు ప్రారంభంలో నిన్ను ఓడిస్తా చూడు అని అమర్కు ఛాలెంజ్ చేశాడు గౌతమ్. అన్నట్లుగానే అమర్ ఓడిపోయిన తర్వాత గౌతమ్ ఆటలో నుంచి పక్కకు వెళ్లిపోయాడు. గౌతమ్ తనతో ఛాలెంజ్ చేసిన విషయాన్ని శోభాతో చెప్పాడు అమర్. దీంతో శోభ.. అతడు ఈ టికెట్ టు ఫినాలే రేసులో ఒక్క టాస్క్ కూడా గెలవలేదంటూ డాక్టర్ బాబును హేళన చేసి మాట్లాడింది. ఒక్క టాస్క్ కూడా గెలవని గౌతమ్ మొత్తానికి పాయింట్ల పట్టికను చూస్తుంటే అమర్- పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోటీ ఉండేట్లు కనిపిస్తోంది. పాపం.. అర్జున్ గట్టిగా ప్రయత్నిస్తున్నా తనకెవరూ పాయింట్లు దానం చేయకపోవడంతో స్కోర్ బోర్డులో వెనుకబడ్డాడు. ఇక ప్రియాంక.. గౌతమ్ను తన పాయింట్లు అమర్కే ఇవ్వాలని మాట తీసుకుంది. దీంతో అతడు అమర్కు దానం చేయడం గ్యారెంటీ! సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రైతుబిడ్డ రేసు నుంచి తప్పుకోగా అమర్ వర్సెస్ అర్జున్ మాత్రమే టికెట్ టు ఫినాలే కోసం పోటీపడనున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి! చదవండి: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. 'రౌడీ బాయ్స్' హీరో ఎంగేజ్మెంట్ -
డాక్టర్ బాబా మజాకా.. గౌతమ్ తెలివికి శివాజీ, రైతుబిడ్డ షాక్!
సీక్రెట్ టాస్క్ అంటే అర్థమేంటి? ఎవరికీ తెలియకుండా టాస్క్ పూర్తి చేయాలి. కానీ అపర చాణక్యుడిలా బిల్డప్ ఇచ్చే శివాజీకి ఈ ముక్క తెలియకపోవడమేంటో! ప్రశాంత్ మిర్చి మొక్కను పోస్ట్ డబ్బాలో దాచేయమని శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. అయితే మొక్కను ఎలా దాచేయాలో పక్కనపెట్టి ముందుగా ప్రశాంత్ను ఓ గదిలో పెట్టి బంధించాడు. గేమ్లో అతడిని చంపేస్తున్నట్లు చెప్పి ఆ తర్వాత తీరికగా మొక్కను దాచాడు. ఖంగు తిన్న రైతుబిడ్డ ఎవరికీ ఏ అనుమానం రాలేదేమో కానీ గౌతమ్ మాత్రం ఈజీగా పసిగట్టేశాడు. ప్రశాంత్ను డెడ్ అయినట్లు ప్రకటించిన బిగ్బాస్ అతడిని దెయ్యంలా తెల్లబట్టలు వేసుకుని తిరగమన్నాడు. ఈ క్రమంలో దెయ్యంలా ఇల్లంతా తిరుగుతున్న ప్రశాంత్ను శివాజీ అన్ననే చంపాడు కదరా నిన్ను అని అడిగేశాడు. అతడి మాటతో ఖంగు తిన్న రైతుబిడ్డ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ తెలివితేటలను మాత్రం సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. పోలీసుల కన్నా ముందే పసిగట్టేశాడని మెచ్చుకుంటున్నారు. హంతకుడిని పసిగట్టిన గౌతమ్ అటు పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనూ హోటల్ మేనేజర్ పాత్రలో ఉన్న శివాజీయే బిగ్బాస్ భార్యను హత్య చేసి ఉంటాడని క్లూ ఇచ్చాడు. నిజానికి ప్రశాంత్ను డెడ్ చేయాలన్న సీక్రెట్ టాస్క్తో పాటు బిగ్బాస్ భార్యను చంపింది నువ్వేనంటూ శివాజీకి ఓ నెక్లెస్ ఇచ్చాడు బిగ్బాస్. అటు గౌతమ్ ఆ రెండు పాయింట్లను కరెక్ట్గా గెస్ చేసి తనది మాస్టర్మైండ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. కాగా మొదటి నుంచీ ఏ గ్రూపులోనూ చేరకుండా సింగిల్గా ఆడుతున్నాడు గౌతమ్. శివాజీ తప్పు చేశాడనిపించినప్పుడల్లా ధైర్యంగా ఎదురెళ్తున్నాడు. ఈ లక్షణాలే గౌతమ్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇదే ఆట కొనసాగిస్తే అతడు టాప్ 5లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. శివాజీ ఇతడిని పిచ్చివాడు అని తీసిపారేశాడు కానీ అతడిని ఎదురించే దమ్మున్నోడు, ఆటలో సత్తా చూపే సరైనోడు అని అభిమానులు గౌతమ్ను కొనియాడుతున్నారు. చదవండి: బిగ్బాస్ ఆఫర్, ఖరీదైన కారు గిఫ్ట్.. క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క -
అప్పుడు అమర్ చేసిందే ఇప్పుడు గౌతమ్ చేశాడు.. తప్పేముంది?
బిగ్బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్లో జరిగిన రభస మామూలుగా లేదు. ఒక్కొక్కరు వీర లెవల్లో పోరాడారు. చివర్లో అమర్, ప్రియాంక ఇద్దరూ మిగలగా అంతిమంగా ప్రియాంక కెప్టెన్సీ సాధించింది. అందుకు గౌతమ్ కృష్ణ ఎంతగానో సాయపడ్డాడు. గేమ్లో కూడా అందరిముందే ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరీ ఆడాడు. కానీ అమర్.. తనను అందరూ టార్గెట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రవర్తన కొంతమందికి చికాకు తెప్పించగా ఎక్కువమందికి బాధ కలిగించింది. చేసిన సాయం అప్పుడే మర్చిపోయిన రతిక అయితే అమర్ బాధకు ప్రధాన కారణం గౌతమ్ కాదు రతిక. గతవారం జరిగిన బేబీ టాస్క్లో అమర్ను తనకోసం ఆగిపోమని వేడుకుంది. ఈ వారం తనకు చాలా అవసరమంటూ, తనను నిరూపించుకునే అవకాశం ఇవ్వమని బతిమాలుకుంది. దీంతో ఆమె కోసం వెనకడుగు వేశాడు. ఆమెను గెలిపించి తాను ఓడిపోయాడు. అందుకు కనీసం కృతజ్ఞత చూపించకుండా రతిక నిన్నటి బ్రిస్క్ టాస్కులో అమర్ను టార్గెట్ చేసింది. అతడిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ప్రియాంక కోసం ఆడటం తప్పా? అటు గౌతమ్ కూడా అమర్ అమర్చిన బ్రిస్క్ మీదకు బాల్స్ విసిరాడు. అందుకు కారణం.. అతడి మీద ఏదో పగ, ప్రతీకారాలు ఉన్నాయని కాదు. తన చెల్లిగా భావించిన ప్రియాంక గెలవాలని తాపత్రయపడ్డాడు. ఆమె కెప్టెన్ అవడం కోసం అమర్ను ఆటలో నుంచి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అందరి ముందే ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరీ గేమ్ ఆడాడు! కానీ చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. అమర్ అంత ఏడుస్తుంటే జాలి చూపించట్లేదు అని ఫీలవుతున్నారు. అతడు బాధపడుతున్నాడని అప్పటికప్పుడు ప్రియాంకను ఓడించాలని ఎందుకనుకుంటాడు? తన చెల్లిని గెలిపించాలనుకున్నాడు, అదే చేశాడు. శోభ కోసం అమర్.. ప్రియాంక కోసం గౌతమ్ నిజానికి గతంలో కెప్టెన్సీ టాస్క్లో శోభా కోసం అమర్ వీరోచిత పోరాటం చేసి ఆమెను గెలిపించాడు. అప్పుడు అమర్ను ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు ప్రియాంక కోసం పోరాడిన గౌతమ్ను మాత్రం నిందిస్తున్నారు. ఒకానొక సమయంలో డాక్టర్ బాబు ఎలిమినేట్ అవ్వాలని అతడికి వ్యతిరేకంగా ఓట్ వేశాడు అమర్. అలాంటప్పుడు గౌతమ్.. అమర్కు సపోర్ట్ చేయకపోవడంలో తప్పేముంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చదవండి: అల్లాడిపోతున్నాడంటూ అతడికి స్టేజీపై ముద్దు పెట్టిన స్టార్ హీరో, వీడియో వైరల్ -
బిగ్ బాస్ సెంటిమెంట్ ప్లాన్.. ఆ కంటెస్టెంట్కు శాపమైందా?
బిగ్ బాస్ సీజన్-7 తొమ్మిది వారాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటి వరకు హాట్ హాట్గా సాగిన హౌస్.. ఈ వారం ఫుల్ ఎమోషనల్గా మార్చేశాడు బిగ్ బాస్. పదో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. రెండో రోజు నుంచే కంటెస్టెంట్లకు సర్ప్రైజ్లు ఇచ్చారు. తొలిరోజే శివాజీ కుమారుడు, అర్జున్ భార్య, అశ్విని మదర్ను పంపి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఆ తర్వాత రెండో రోజు గౌతమ్ తల్లి, ప్రియాంక ప్రియుడు శివ కుమార్, భోలే భార్యను హౌస్లో పంపి కంటెస్టెంట్స్ను ఏడిపించేశారు. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అయితే మూడో రోజు కూడా హౌస్లో ఎమోషనల్ సీన్స్ మరింత పీక్స్కు చేరాయి. మూడో రోజు అమర్ భార్య, శోభాశెట్టి తల్లి, యావర్ బ్రదర్ వచ్చి కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్ను సైతం కంటతడి పెట్టించారు. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, తన బ్రదర్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. మొత్తానికి ఈ వారంలో టాస్కులు, గేమ్స్ లేకుండా పూర్తిగా ఫ్యామిలీ వీక్గా మార్చేశారు బిగ్ బాస్. ఇప్పటివరకు మిగిలింది ఇద్దరు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. హౌస్లో ఉన్న రైతుబిడ్డ, రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. వీరిద్దరికి సంబంధించి శుక్రవారం సర్ప్రైజ్ ఇచ్చే అవకాశముంది. అయితే ఫ్యామిలీ ఎమోషన్ పక్కన పెడితే.. అందరి దృష్టి ఈ వారం ఎలిమినేట్ ఎవ్వరనే దానిపైనే ఉంది. గతవారంలో చివరికీ దాకా వచ్చి రతికా రోజ్ సేఫ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం నామినేషన్స్లో శివాజీ, యావర్, గౌతమ్, రతికా, భోలె మాత్రమే ఉన్నారు. ఇక ఓటింగ్కు ఒక్క రోజు మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో శివాజీ, యావర్, గౌతమ్, భోలెకు గ్రాఫ్ పెరగడంతో పాటు ఓటింగ్ శాతం మెరుగయ్యే అవకాశముంది. కానీ గతవారమే తృటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న రతికా కుటుంబ సభ్యులు ఇంకా హౌస్లోకి రాలేదు. దీని ప్రభావం రతికా ఎలిమినేషన్పై పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శుక్రవారం రతికా కుటుంబ సభ్యులు హౌస్లోకి వచ్చినా అంతగా వర్కవుట్ కాదు. ఎందుకంటే ఓటింగ్ సమయం రేపటితోనే ముగియనుంది. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్లో లేడు కాబట్టి.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడొచ్చినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దీంతో ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ వీక్ రతికాపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమె పేరే ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్తో కంటెస్టెంట్స్ను ఏడిపించిన బిగ్ బాస్.. ఎవరినీ బయటికి పంపిస్తాడో వేచి చూద్దాం. (ఇది చదవండి: తల్లి కాళ్ల మీద పడ్డ శోభ.. ఏడిపించేసిన ప్రిన్స్ యావర్ బ్రదర్స్..) -
హౌస్మేట్స్కు గౌతమ్ తల్లి గోరుముద్దలు.. ఏడ్చేసిన ప్రిన్స్ యావర్
కంటెస్టెంట్ల మధ్య ఎంత రాగద్వేషాలు ఉన్నా ఫ్యామిలీ వీక్లో మాత్రం అవన్నీ పటాపంచలైపోతాయి. తమ కన్నవారిని, కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను.. ఇలా కుటుంబసభ్యులను చూసేసరికి హౌస్మేట్స్లో ఎమోషన్స్ కట్టలు తెంచుకుంటూ వస్తాయి. రోజూ కొట్టుకుంటూ కనిపించే కంటెస్టెంట్లు ఇలా ఒక్కసారిగా ఏడ్చేసరికి వారి అభిమానులు కూడా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సీజన్లోనూ జరిగేదే! బిగ్బాస్ ఏడో సీజన్లో తాజాగా ఫ్యామిలీ వీక్ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్లో శివాజీ తనయుడు, అర్జున్ భార్య, అశ్విని తల్లి బిగ్బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. నేడు గౌతమ్ తల్లి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ప్రోమో వదిలారు. తల్లిని చూడగానే గౌతమ్ ఏడ్చేశాడు. అందరినీ దగ్గరకు తీసుకున్న ఆమె ఇంట్లో అందరికీ గోరుముద్దలు తినిపించింది. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన ప్రిన్స్ యావర్ తల్లి ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో గౌతమ్ తల్లి.. నువ్వు కూడా నా కొడుకువే అంటూ అతడిని హత్తుకుంది. మరి హౌస్లోకి ఇంకా ఎవరెవరు వస్తారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్? ఈ నటి మాటల్లోనే ఆన్సర్ దొరికేసింది! -
సోఫాజీ.. శివాజీ పరువు తీసిన నాగ్.. వీళ్లు బంగారం, వాళ్లు బొగ్గు
నాగార్జునతో తేల్చుకునే సమయం కోసం తెగ ఎదురుచూశారు తేజ, గౌతమ్. ఇద్దరి ఫిర్యాదు శివాజీ గురించే! అయితే ఎప్పటిలాగే శివాజీని వెనకేసుకువచ్చే ప్రయత్నం చేశాడు నాగ్. గేమ్లో దొంగతనం చేయబోతే శివాజీ నానామాటలు తిట్టి, బెదిరించిన సంగతి తెలిసిందే కదా! అదంతా అతడి స్ట్రాటజీ అని శివాజీకి పాజిటివ్గా మాట్లాడారు. దీంతో తేజ, గౌతమ్ బిక్కమొహం వేసుకున్నారు. అటు అశ్విని కూడా గట్టిగానే కల్ఆస్ పీకాడు నాగ్. మరి నేటి(నవంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్లో ఏమేం జరిగాయో చదివేయండి.. శివాజీ ఫౌల్ గేమ్స్.. ఒప్పుకున్న యావర్ ఎప్పుడూ ప్రశాంత్, యావర్ జపం చేసే శివాజీ కెప్టెన్సీ టాస్కులో యావర్కు సపోర్ట్ చేయలేదు. అలా అని తన చేయి బాలేదని ఆడకుండా కూర్చోలేదు. ఆడి దెబ్బ తగిలితే అది సింపతీ కింద వర్కవుట్ అవుతుందని ఆలోచించాడు. ఎలాగో ఓడిపోయే గేమ్కు యావర్ తరపున ఎందుకని అర్జున్కు సపోర్ట్ చేస్తూ అతడి తరపున గేమ్ ఆడాడు. ఇది యావర్కు అస్సలు నచ్చలేదు. నాకోసం ఎందుకాడలేదు? అని నిలదీశాడు. అంతేకాదు అశ్విని దగ్గర కూడా శివాజీ అన్న ఫౌల్ గేమ్ ఆడాడని అసహనానికి లోనయ్యాడు. తేజను ఏడిపించిన శోభ మరోవైపు శోభా శెట్టి-తేజ వాష్రూమ్ ఏరియాలో గొడవపడ్డారు. అమర్ నా స్నేహితుడు కాబట్టి కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేశాడు.. నువ్వెవరివి అసలు? మా ఇద్దరి మధ్య పుల్లలు పెడుతున్నావు.. నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు తెలుస్తుంది.. అని ఆవేశంతో బుసలు కక్కింది. తన మాటలతో కలత చెందిన తేజ ఒంటరిగా ఏడ్చాడు. అనంతరం జపాన్ ప్రమోషన్స్ కోసం కార్తీ బిగ్బాస్ స్టేజీ మీదకు వచ్చాడు. ఎప్పుడూ పొగుడుతూ ఉంటే నాగ్ ఈసారి కంటెస్టెంట్లపై సెటైర్లు వేస్తూ కార్తీకి పరిచయం చేశాడు. అశ్విని పుల్లలు పెడుతుందని, ప్రశాంత్ అపరిచితుడు అని, శోభ అపార్థం చేసుకుంటుందని, తేజ పక్కవారి బాధను రెట్టింపు చేస్తాడని, శివాజీ సోఫాజీ(సోఫాకే అతుక్కుపోయాడని) అని మాట్లాడాడు. కాసేపు కబుర్లాడాక కార్తీని పంపించేశాడు నాగ్. శివాజీని వెనకేసుకొచ్చిన నాగ్ ఇక బాల్స్ టాస్కులో శివాజీ దొంగతనం చేయకూడదని వాదించాడు. దాదాపు హౌస్ అంతా అతడి పెద్దరికానికి గౌరవమిచ్చి దొంగతనం ప్రయత్నం విరమించుకుంది. అలా దొంగతనాన్ని ఆపడమనేది శివాజీ స్ట్రాటజీ అని నాగ్ కవర్ చేశాడు. దొరికిందే ఛాన్సని శివాజీ కూడా అవును, అది నా స్ట్రాటజీ అంటూ ఎగిరెగిరి పడ్డాడు. కెప్టెన్సీ టాస్క్లో శివాజీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నన్ను గేమ్ నుంచి తప్పించాలని చూశాడంటూ నాగ్కు ఫిర్యాదు చేశాడు గౌతమ్. అశ్విని కూడా అదే చెప్పిందన్నాడు. నిజంగానే శివాజీ.. అందరినీ ఇన్ఫ్లూయెన్స్ చేసి కెప్టెన్సీ టాస్క్ నుంచి గౌతమ్ను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించాడా? అని ఇంటిసభ్యులను నాగ్ అడిగాడు. అయితే అలాంటిదేమీ జరగలేదని హౌస్ ముక్తకంఠంతో చెప్పింది. దీంతో గౌతమ్ తనకు క్లారిటీ వచ్చిందన్నాడు. వీళ్లు బంగారం.. వాళ్లు బొగ్గు తర్వాత హౌస్లో ఎవరెలా గేమ్ ఆడారనేదాన్ని బట్టి వారి ఫోటోలను బంగారం/మట్టి /బొగ్గు టేబుల్లో అతికించాడు. గౌతమ్ను బెస్ట్ కెప్టెన్గా అభివర్ణించిన నాగ్ అతడిని బంగారంగా పేర్కొన్నాడు. శోభ, తేజ, అమర్, అర్జున్ను, శివాజీలను సైతం బంగారం లైన్లో పెట్టాడు. భోలెను గేమ్లో స్వాప్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడని అతడిని బొగ్గు బోర్డులో పెట్టాడు. రతిక, అశ్విని గేమ్ ఆడలేదని వారిని కూడా బొగ్గు కేటగిరీలో వేశాడు. ఆటపై ఫోకస్ చేయలేదంటూ యావర్ను మట్టి కేటగిరీలో పెట్టాడు. తేజ కోసం బాగా ఆడావు, కానీ నీకోసం ఆడంటూ ప్రియాంక ఫోటోను మట్టిలో పెట్టాడు. మధ్యలో దూరిన శివాజీ ప్రశాంత్ను బంగారంలో పెట్టడంతో రైతుబిడ్డ ఏడ్చేశాడు. మాటిమాటికీ ఏడుస్తావ్.. సింపతీనా? అని అడగ్గా వెంటనే శివాజీ మధ్యలో దూరుతూ.. అతడి స్వభావమే అంత.. అని సపోర్ట్ చేశాడు. ఈరోజు క్లాసులు తీసుకోవడం మీదే ఫోకస్ పెట్టిన నాగ్ ఎవరినీ సేవ్ చేయకుండానే వెళ్లిపోయాడు. అయితే ఈ వారం తేజ ఎలిమినేట్ కానున్నాడని టాక్ నడుస్తోంది. మరి అదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: శోభ సేఫ్, తేజ ఎలిమినేట్.. చేసిన పాపం ఊరికే పోతుందా? -
ఎలిమినేట్ చేయండన్న గౌతమ్, చెప్పుతో కొట్టుకుంటానన్న అమర్దీప్
బిగ్బాస్ కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. అయితే గౌతమ్ టీమ్ను గెలిపించాలని బిగ్బాస్ బలంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. ఎరుపు, నలుపు రంగులో ఉన్న బాల్స్ గౌతమ్ సంపాదించగా వాటితో విజయం సాధించేలా బిగ్బాస్ పావులు కదిపాడు. అసలు హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తాజా(నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి.. ఆ టీమ్లోని అందరూ కంటెండర్లే బిగ్బాస్ బ్లాక్ బాల్ ఎవరి దగ్గరుందని అడిగాడు. వీరసింహాలు టీమ్ తమ దగ్గరే ఉందని బదులిచ్చారు. ఈ నల్ల బంతి సాయంతో అవతలి టీమ్ దగ్గరున్న అన్ని బంతులను తీసుకోవచ్చని భలే సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్బాస్. దీంతో వీరసింహాలు టీమ్ సభ్యులు ఎగిరి గంతేశారు. కానీ గర్జించే పులుల టీమ్లోని శివాజీ, ప్రియాంక మాత్రం ఓ రెండు బంతులకు కక్కుర్తి పడ్డారు. అన్నీ ఇచ్చేయమన్నాక ఇంకెందుకు ఆలోచిస్తున్నారని గౌతమ్ ప్రశ్నించగా మా ఇష్టమొచ్చినట్లు చేస్తామన్నాడు శివాజీ. దీంతో గౌతమ్ ఆవేశంతో ఊగిపోయాడు. ఇక అన్ని బంతులు వీరసింహాలకే దక్కి పైచేయి సాధించడంతో ఆ టీమ్లో ఉన్న అందరినీ కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్బాస్. రతికతో దూరంగా ఉండమన్న శివాజీ మరోవైపు రతికతో కాస్త దూరంగా ఉండమని యావర్ను హెచ్చరించాడు శివాజీ. మీ అతి చనువు జనాలకు నచ్చకపోవచ్చని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బంతుల టాస్కు మధ్యలో వీరసింహాలు టీమ్ తమ సభ్యులైన భోలె షావళిని అవతలి టీమ్లోని అర్జున్తో స్వాప్ చేసిన సంగతి తెలిసిందే కదా! అయితే తాను మొదట తేజ పేరు సూచించానని గౌతమ్ అన్నాడు. అదేంటి? నువ్వు భోలె పేరు చెప్పావటగా అని అశ్విని గబుక్కున అడిగేసింది. అది విని షాకైన గౌతమ్.. భోలె దగ్గరకు వెళ్లి నేను డైరెక్ట్గా మీ పేరు చెప్పలేదు.. అది టీమ్ నిర్ణయం అని క్లారిటీ ఇచ్చాడు. స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకున్న ప్రిన్స్ అనంతరం బిగ్బాస్ బీన్ బ్యాగ్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. కానీ ఇక్కడో మెలిక పెట్టాడు. వీరసింహాలు టీమ్లోని కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అవతలి టీమ్లోని కంటెస్టెంట్లు ఆడాల్సి ఉంటుందన్నాడు. అలాగే ఓ కంటెండర్ స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు. దీంతో ప్రిన్స్ యావర్ ఆట నుంచి వైదొలిగాడు. గౌతమ్ తరపున అశ్విని, అర్జున్ తరపున శివాజీ, తేజ తరపున ప్రియాంక, రతిక తరపున భోలె షావళి ఆటలో దూకారు. ఇదసలే ఫిజికల్ టాస్క్.. చేయి నొప్పి ఉన్న శివాజీ ముందే ఆటలో నుంచి వైదొలగాల్సింది. అయినా సరే తన ప్రతాపం చూపిస్తానంటూ ఆడేందుకు వెళ్లాడు. దెబ్బ తగలడంతో శివాజీ అవుట్ తీరా అక్కడ అందరూ లాక్కుని పీక్కునే క్రమంలో అతడి చేతికి దెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆటలో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఆటలో అమర్దీప్- అశ్విని కొట్టుకున్నారు. బిగ్బాస్ గీసిన వృత్తంలో నుంచి అందరూ బయటకు వచ్చారని సంచాలకుడైన ప్రశాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ గీత దాటి బయటకు వచ్చింది శివాజీ అన్న అని, కావాలంటే వీడియో చూడమన్నాడు అమర్దీప్. ఒకవేళ తాను చెప్పింది తప్పయితే చెప్పుతో కొట్టుకుంటానని సవాలు విసిరాడు. అమర్ సాయం.. కెప్టెన్గా శోభ ఇక బీన్ బ్యాగ్ టాస్కులో శోభా శెట్టి తరపున ఆడి, పోరాడి అమర్ గెలిచాడు. మొత్తానికి అమర్ సాయంతో ఈ సీజన్లో శోభా శెట్టి తొలి లేడీ కెప్టెన్గా అవతరించింది.ఇక శోభా కెప్టెన్ అయిందో, లేదో అర్జున్, తేజ ఆమెను ఏడిపించేందుకు ప్రయత్నించారు. ఎలిమినేట్ అయి వెళ్లేటప్పుడు నీ దగ్గరున్న కాయిన్స్ ఎవరికి ఇస్తావు? అని అర్జున్ అడగడంతో చిర్రుబుర్రులాడింది శోభ. కామెడీ చేయడానికి కూడా ఓ సమయం ఉంటుందని విసుక్కుంది. శివాజీపై ఫిర్యాదు తర్వాత గౌతమ్.. శివాజీ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశాడు. 'శివాజీ అన్న గేమ్ను ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు. నీతి, నిజాయితీ, ధర్మం అని మాటలు చెప్తుంటాడు.. కానీ ఆయన చాలా తప్పులు చేస్తున్నాడు. అవన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆయన చేసేదంతా చేసి మళ్లీ ఏమీ ఎరుగనట్లు తప్పించుకుంటున్నాడు. ఇలా ఆడి, గెలిచి ఆయన కప్పు కొట్టుకుంటాడేమో.. కానీ ఇది నేను భరించలేకపోతున్నాను. నేను తప్పయితే నన్ను ఎలిమినేట్ చేసేయండి' అని కెమెరాల ముందు బిగ్బాస్కు ఫిర్యాదు చేశాడు. చదవండి: రాహుల్-రతిక పెళ్లి.. అతడు పెట్టిన కండీషన్స్ వల్లే బ్రేకప్! -
హౌస్లో ఒక్కడైనా పదో తరగతి పాస్ అయిండా?.. నాగ్తోనే తేల్చుకుంటానన్న తేజ
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ నడుస్తోంది. ఇందుకోసం ఇంటిని రెండు ముక్కలు చేశాడు బిగ్బాస్. ఆటలో కొట్లాటలు సహజమే.. బిగ్బాస్ హౌస్లో కొట్లాటల మధ్యలో ఆటలు వస్తూపోతూ ఉంటాయి. అలా ఈ రోజు రతిక-అమర్ గొడవపడ్డారు. మరి నేటి(నవంబర్ 2) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. ఏడ్చి సాధించింది.. కానీ ఏం లాభం? కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం బిగ్బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. మధ్యమధ్యలో ఛాలెంజ్లు కూడా విసురుతున్నాడు. ఇక బాల్స్ టాస్క్లో రతిక- అమర్దీప్ గొడవపడ్డారు. ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇంతలో బిగ్బాస్ బ్రేక్ ఫాస్ట్.. ఎయిమ్ లో అనే చాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో అమర్దీప్- అర్జున్ గెలిచారు. ఇక ఆడతా.. ఆడతానంటూ అలిగి సాధించి మరీ గేమ్లో పాల్గొన్న శోభ ఓడిపోయింది. తన టీమ్లో ఎవరైనా ఓడిపోతే నానామాటలు అనే శోభ తానే ఓడిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది. చాలెంజ్ గెలిచిన టీమ్కు బిగ్బాస్ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. వేలిముద్రగాళ్లం అనుకుంటున్నారా? అవతలి టీమ్లో ఒకరిని ఆటలో నుంచి తప్పిస్తారా? లేదంటే వారి దగ్గరి నుంచి 500 బాల్స్ తీసుకుంటారా? అని అడిగాడు. బాగా ఆలోచించిన శివాజీ టీమ్ అవతలి టీమ్లో నుంచి 500 బాల్స్ తీసుకుంది. మరోవైపు అశ్విని హౌస్మేట్స్పై ఉన్న కోపాన్నంతా భోలె దగ్గర కక్కేసింది. ఇక్కడ అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు.. మనమేమో ఎల్కేజీ కూడా చదువుకోని వేలిముద్రగాళ్లం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఏం అనుకుంటున్నారో? ఏమో? ఒక్కొక్కడు పదో తరగతి కూడా పాస్ అయిండో? లేదో? ఒకరిని జడ్జ్ చేసే అధికారం వారికి ఎవరిచ్చారు? ఒక ముగ్గురు అయితే ఎంత నవ్వుకుంటున్నారో.. అని చికాకు పడింది. గేమ్కు అడ్డుపడుతున్న శివాజీ ఇంతలో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్బాస్. గోల్డెన్ బాల్ దొరికిన టీమ్.. అవతలి టీమ్లో ఒకరితో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో గౌతమ్ టీమ్ ఏకాభిప్రాయంతో తమ టీమ్లోని భోలె షావలిని అవతలి టీమ్లోకి పంపించి.. అందులో ఉన్న అర్జున్ను తమ టీమ్లోకి లాక్కుంది. రాత్రి శివాజీ టీమ్లోని బాల్స్ లాక్కుందామని ప్లాన్ వేసింది గౌతమ్ టీమ్. అయితే దొంగతనం చేయడానికి ససేమీరా కుదరదని వాదించాడు శివాజీ. డాక్టర్ అయ్యుండి ఇలా ఎథిక్స్ లేకుండా మాట్లాడతావా? అంటూ తన వృత్తిని మధ్యలోకి లాక్కొచ్చాడు. గౌతమ్ మీద ఫైర్ అయ్యాడు. దీంతో తేజ.. బాల్స్ దొంగతనం చేయొచ్చా? లేదా? అనేది నాగార్జున సర్నే అడిగి తేల్చుకుంటానన్నాడు. గౌతమ్- అశ్విని పెళ్లి చేసుకోవచ్చుగా ఇక మరుసటి రోజు అర్జున్.. అమర్ గురించి సెటైర్లు వేశాడు. వాడికి దూరంగా ఉందామంటే పదేపదే అన్నయ్యా అంటూ వస్తున్నాడంటూ తల పట్టుకున్నాడు. ఇంతలోనే బజర్ మోగడంతో మళ్లీ బాల్స్ గేమ్ మొదలైంది. అర్జున్ మీద ఎక్కి మరీ బాల్స్ పట్టుకునే ప్రయత్నం చేశాడు అమర్. అటు ప్రిన్స్ యావర్ తన టీషర్ట్లో బాల్స్ దాచుకున్నాడు. తర్వాత ప్రిన్స్.. అశ్విని-గౌతమ్లకు లింకు పెడుతూ మాట్లాడాడు. గౌతమ్.. అశ్వినిని పెళ్లి చేసుకోవచ్చుగా అని చెప్పాడు. అయితే మూడేళ్ల దాకా పెళ్లి చేసుకునే ఆలోచనే లేదన్నాడు గౌతమ్. తర్వాత ప్రశాంత్.. శోభకు గోరుముద్దలు తినిపించాడు. చదవండి: ఆహ్వానం అందినా వరుణ్- లావణ్యల పెళ్లికి హాజరు కాని జూనియర్ ఎన్టీఆర్! -
వాడో వేస్ట్గాడు, ఐటం రాజా.. అమర్పై మళ్లీ విషం కక్కిన శివాజీ
కెప్టెన్ గౌతమ్ హౌస్లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఈ వారం ఆడపిల్లలు పనే చేయక్కర్లేదని బంపరాఫర్ ఇచ్చాడు. ఇంకేముంది.. లేడీ కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. అటు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలుపెట్టాడు బిగ్బాస్. మరి నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి.. మళ్లీ విషం కక్కిన శివాజీ బద్దకస్తుడైన తేజ శవాసనం వేస్తూ నేలకు అతుక్కుపోయాడు. ఇది గమనించిన బిగ్బాస్ తేజకు ఏదైనా శిక్ష వేయమని కెప్టెన్ను ఆదేశించాడు. కెప్టెన్ గౌతమ్.. తేజ అమ్మాయిలా చీర కట్టుకోవాలని చెప్పాడు. ఇంకేముంది, శోభ.. అతడికి చీర కట్టి రెడీ చేసింది. ఇదే అదను అనుకున్న తేజ.. అందరు అమ్మాయిలకు హగ్గులిచ్చుకుంటూ పోయాడు. ఇక పెద్దమనిషిని అని చెప్పుకునే శివాజీ ఎప్పటిలాగే అమర్పై విషం చిమ్మాడు. వాడో వేస్ట్గాడు, ఐటం రాజా.. అని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ప్రతి సీజన్లో అందరూ కలిసి ఒకర్ని హీరోను చేస్తే ఈ సీజన్లో నన్ను విలన్ను చేశారు అని తనకు తానే అనుకున్నాడు అమర్. చాలెంజ్ విసిరిన బిగ్బాస్ తర్వాత బిగ్బాస్.. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. ఇందుకోసం ఇంటిసభ్యులను రెండు టీమ్లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్లో ఉన్నారు. మొదట బాల్స్ టాస్కు పెట్టాడు కానీ ఫలితాలను ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. చాలెంజ్ గెలిచిన టీమ్కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదటి చాలెంజ్కే రైతుబిడ్డ అవుట్ మొదట జంపింగ్ జపాంగ్ అనే చాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో వీరికి అవతలి టీమ్లో ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. అందరూ చర్చించుకుని ప్రశాంత్ను గేమ్ నుంచి సైడ్ చేశారు. తనను ఆటలో నుంచి పక్కకు తోసేయడంతో రైతుబిడ్డ కంటతడి పెట్టుకున్నాడు. శివాజీ తన చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్రశాంత్ మెడలో వేశాడు. అయితే ప్రశాంత్ కంటే భోలె ఎక్కువ ఫీలైపోయాడు. ప్రియుడి కోసం ఏడ్చేసిన శోభ మరోవైపు శోభ తన ప్రవర్తన మీద తనే డౌట్ పడింది. బయట ఉన్న ప్రియుడిని ఉద్దేశిస్తూ.. వాడు నన్ను అర్థం చేసుకుంటాడంటావా? అని తేజతో కబుర్లాడింది. 'వాడు చాలా మెచ్యూర్డ్.. అర్థం చేసుకుంటాడు.. కానీ నమ్మకంతో పాటు భయం కూడా ఉంది. ఒకవేళ వాడికి నచ్చనట్లు ఏమైనా ప్రవర్తించానా? నీ విషయంలో వేరేలా ఉన్నాను. అది తనకు నచ్చకపోవచ్చేమో.. ఎవరికి తెలుసు? అయినా ఏమీ అవదనే అనుకుంటున్నాను. పొరపాటున ఏదైనా జరిగితే నేనసలు తట్టుకోలేను. వాడు బాగా గుర్తొస్తున్నాడు' అంటూ శోభ ఏడ్చేసింది. ఇక రేపటి ఎపిసోడ్లో మిగతా చాలెంజ్లు ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనేది చూడాలి! చదవండి: లావణ్య మెడలో మూడు ముళ్లు వేసిన వరుణ్ తేజ్ -
నామినేషన్స్లో రైతుబిడ్డ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన గౌతమ్!
నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్లు హడలెత్తిపోతుంటారు. కొందరేమో దొరికిందే ఛాన్సని అవతలి వారి మీదున్న కోపాన్ని నామినేషన్స్ ద్వారా తీర్చుకుంటారు. మరికొందరేమో మండే రోజే తమలోని కళల్ని బయటకు తీస్తారు. రైతుబిడ్డగా జనాల్లో బీభత్సమైన సింపతీ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ రెండో కేటగిరీకి చెందుతాడు. సాధారణ రోజుల్లో తన ధ్యాసంతా గేమ్ మీదే పెడతాడు.. బాగా ఆడతాడు కూడా! కానీ, పొరపాటున తనను ఆటలో నుంచి తీసేసినా.. ఎవరైనా నామినేట్ చేసినా అస్సలు భరించలేడు. విశ్వరూపం చూపిస్తాడు. ఊరోడు అన్నావ్.. మళ్లీ అనలేదని మాట మార్చావ్ నిన్నటి నామినేషన్స్లోనూ అదే జరిగింది. గౌతమ్ తనను నామినేట్ చేసేసరికి తట్టుకోలేకపోయాడు. ఎప్పటిలాగే ఊసరవెల్లిలా రంగులు మార్చాడు. సందీప్ మాస్టర్ను ఊరోడు అన్నావు.. తర్వాతేమో అనలేదని మాట మార్చావు.. అలా రెండు మాటలు మాట్లాడటం నచ్చలేదంటూ ప్రశాంత్ ఫోటోను మంటల్లో వేయబోయాడు గౌతమ్. అయితే ప్రశాంత్ మాత్రం.. నేను మాట్లాడాక నా ఫోటోను మంటల్లో వేయు. కాసేపైనా నా ఫోటో చూసుకుంటూ మాట్లాడతా.. గట్లే ఉంటదా అన్న.. ఫోటో చూపెట్టు.. ఎంత బాగుంది.. అంటూ రాగాలు తీశాడు. గౌతమ్ చెప్పిన పాయింట్ ఎలాగూ కరెక్టే కాబట్టి సరిగా ఆన్సర్ ఇవ్వలేక.. అది అయిపోయిన విషయం.. సందీప్కు సారీ చెప్పేశానంటూ అపరిచితుడిలా ప్రవర్తించాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.. అంతేకాదు, తన మేనరిజాన్ని చూపిస్తూ అవతలివారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మంటల్లో ఫోటో కాలిపోయినా నా గుండెలో మాత్రం నిప్పు వెలుగుతూనే ఉంటుంది.. అని భారీ డైలాగులు కొట్టాడు. ఈ యాక్టింగ్ చూసి నవ్వుకున్న గౌతమ్.. నువ్వెప్పుడూ నన్ను నామినేట్ చేయలేదా? అప్పుడు నేను ఇలాగే ప్రవర్తించానా? అని ప్రశ్నించగా ప్రశాంత్ దగ్గరి నుంచి సమాధానమే కరువైంది. పైగా అలాగే ఓవరాక్షన్ చేస్తుండటంతో ఎందుకురా? మంట ఆరదు, నీతి చావదు అన్న మాటలెందుకు? నీ నీతి, నిజాయితీ గురించి నేనేమీ మాట్లాడట్లేదు.. నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మరి నాగార్జున సార్ అడిగినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఎందుకేడ్చావు? అదంతా యాక్టింగా? అని వరుస ప్రశ్నలతో ప్రశాంత్కు ఇచ్చిపడేశాడు. వెనక్కు తగ్గని డాక్టర్ బాబు అయినా ప్రశాంత్ ఓవరాక్టింగ్ చేస్తూనే ఉండటంతో నేనేమీ ఆడిషన్ చేయట్లేదు అని కౌంటరిచ్చాడు డాక్టర్ బాబు. తర్వాత హౌస్లో అందికంటే మీరు వీక్గా ఉన్నారనిపిస్తోందంటూ భోలె షావళిని నామినేట్ చేశాడు గౌతమ్. దీనికతడు నువ్వు డాక్టర్ అయితే చేయి పట్టుకుని బీపీలు చూడు.. నేను వీక్ అని చెప్పకు అంటూ వెక్కిరిస్తూ పాటలు పాడాడు. అయినా సరే డాక్టర్ బాబు మాత్రం ఎంతో సహనంగా ఉంటూ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఇక రైతుబిడ్డ ఇలాగే అతి చేస్తే రానున్న రోజుల్లో ఎలిమినేట్ అవడం ఖాయమే! చదవండి: భగవంత్ కేసరికి సీక్వెల్.. డైరెక్ట్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ -
'రాననుకున్నారా.. రాలేననుకున్నారా?.. కోపంతో ఊగిపోయిన గౌతమ్ కృష్ణ!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 2.0. ఇప్పటిదాకా జరిగిన షో ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న షో ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు ఉల్టా పుల్టా అంటూ సాగిన షో.. ఇప్పుడు ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్తో మరింత రసవత్తరంగా మారింది. బిగ్బాస్ రోజుకు ఒక షాక్ ఇస్తూ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. ఈ షో మొదలైన ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఐదో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందని.. ఇద్దరూ ఎలిమినేట్ కావొచ్చని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. శుభశ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. గౌతమ్ను సీక్రెట్ రూమ్లోకి పంపి బిగ్ షాకిచ్చారు బిగ్ బాస్. తాజా ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను రిలీజైంది. ఈ ప్రోమోలో గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ నుంచి బయటికొచ్చేశాడు. (ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి యత్నించారు: శుభ శ్రీ) బయటకు వస్తూనే గౌతమ్ మాట్లాడుతూ..'రాననుకున్నారా.. రాలేననుకున్నారా? అంటూ సీక్రెట్ రూమ్లో ఉన్న గౌతమ్ ఎంతో ఆవేశంతో బయటకొచ్చాడు. అశ్వత్థామ ఇజ్ బ్యాక్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. 'తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు కదా.. అయినా ఈ అశ్వత్థామ చావడు. ఎలా వెళ్లానో అలానే వచ్చా. దిస్ ఇజ్ 2.0 బేబీ' అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ మాటలు చూసి కంటెస్టెంట్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత శివాజీనీ ఉద్దేశించి మాట్లాడారు. అన్న మీరు నన్ను ఎంటర్టైన్ చేయలేడేమో అన్నారు కదా? అని గౌతమ్ చెప్పడంతో.. తమ్ముడు ముందు నీ రీజన్ చెప్పు అంటూ శివాజీ అన్నారు. 'ఎంటర్టైన్ చేయడమంటే ప్యాంట్ తీసేసి తిరగడం కాదు కదన్నా.. కవర్ను చూసి బుక్ను జడ్జ్ చేయొద్దన్నారు అన్నా' గౌతమ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. 'బట్టలిప్పడం ఎంటర్టైన్మెంటా? అని ఇంతమంది ముందు అన్నావ్. 100 సినిమాల్లో చేశా బట్టలు లేకుండా.. నేను ఒక నటుడిని.. ఏమైనా చేస్తా' అన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ వెంటనే గౌతమ్.. నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను.. దీన్ని ఊపయోగించి నువ్వు ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు' అని ఆప్షన్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయాలనుకున్నాడో చెప్పేలోగా ప్రోమో ముగిసింది. గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయనున్నాడో ఇవాళ ప్రసారమయ్యే ఎపిసోడ్లో క్లారిటీ రానుంది. సీక్రెట్లో రూమ్లో ఉన్న గౌతమ్కు బయటకు రావడం, స్పెషల్ పవర్ ఇవ్వడం ఈ ఎపిసోడ్లో హాట్టాపిక్గా మారింది. కాగా.. ఈ వారం అశ్విని, నయని పావని, పూజా మూర్తి, తేజ, శోభా శెట్టి, అమర్దీప్, సందీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: నామినేషన్స్లో ట్విస్ట్.. కొత్తవాళ్లకే ఛాన్స్! ఒక్కొక్కరికీ ఉంటదీ..) -
'బిగ్బాస్' 2.0.. హౌసులోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్
బిగ్ బాస్ 7 ఐదు వారాలు పూర్తిచేసుకుంది. ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేయగా, మరో కంటెస్టెంట్ని సీక్రెట్ రూంలోకి పంపించేశారు. ఇకపోతే ఎన్నడూ లేని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అసలు ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 35 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఆదివారం ఒక్కొక్కరిని సేఫ్ చేయడంతో మొదలయ్యేది. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్గా ఎలిమినేషన్తో మొదలుపెట్టారు. అలా ఐదోవారం శుభశ్రీ హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. ఆ వెంటనే గౌతమ్ని కూడా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. కానీ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. అతడిని సీక్రెట్ రూంలోకి పంపించారు. అక్కడ ఏం చేయాలి? ఎలా ఉండాలనేది బిగ్బాస్ చెబుతాడని నాగార్జున అన్నాడు. తొలి కంటెస్టెంట్గా అర్జున్ పలు సీరియల్స్లో నటించి గుర్తింపు తెచ్చకున్న అంబటి అర్జున్.. బిగ్ బాస్ లాంచ్ 2.0లో ఫస్ట్ కంటెస్టెంట్గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే దమ్ము ఎవరు? దుమ్ము ఎవరు? అనేది చెప్పమన్నారు. దీంతో అర్జున్.. యవర్, ప్రశాంత్ ని దమ్ము కేటగిరీలో పెట్టాడు. సందీప్, అమరదీప్ దుమ్ము కేటగిరీలో పెట్టాడు. ఎవరీ అర్జున్? చూడటానికి సాఫ్ట్గా కనిపించే అర్జున్ నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్గా పని చేశాడు. మోడల్గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. కానీ తనకు జనాల్లో పేరు తీసుకువచ్చింది మాత్రం సీరియల్సే! ప్రస్తుతం అతడి చేతిలో ఎటువంటి ప్రాజెక్టులు లేనట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్బాస్ షోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వచ్చీరావడంతోనే యావర్, ప్రశాంత్ దమ్మున్న గేమ్ ఆడుతున్నారని, అమర్దీప్, సందీప్ దుమ్ము దుమ్ముగా ఆడుతున్నారని చెప్పాడు. మరి ఇతడు దుమ్ము రేపేలా ఆడతాడా? ఎలా ఆడతాడనేది చూడాలి! రెండో కంటెస్టెంట్గా అశ్విని రెండో కంటెస్టెంట్గా అశ్విని శ్రీ అనే అమ్మాయి బిగ్బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. దమ్ము కేటగిరిలో ప్రశాంత్, శివాజీ.. దుమ్ము కేటగిరీలో ప్రియాంక, శోభాశెట్టి అని చెప్పింది. తానొక కిక్ బాక్సర్ అని చెప్పుకొచ్చింది. ఎవరీ అశ్విని? సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసేవారిలో ముందు వరుసలో ఉంటుంది అశ్విని శ్రీ. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి ఆర్టిస్ట్గా ఎదగాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు బిగ్బాస్ షోను వేదికగా ఏర్పాటు చేసుకుంది. మూడో కంటెస్టెంట్గా భోలె షావళి బిగ్బాస్ హౌసులోకి మూడో కంటెస్టెంట్గా సింగర్ కమ్ సంగీత దర్శకుడు భోలె షావళి ఎంట్రీ ఇచ్చాడు. అలానే పాటబిడ్డ అనే తనని తాను చెప్పుకొంటూ.. హౌస్ట్ నాగార్జునపై ఓ పాట క్రియేట్ చేసి పాడాడు. దమ్ము కేటగిరీలో శివాజీ, ప్రశాంత్.. దుమ్ము కేటగిరీలో అమరదీప్ అని చెప్పాడు. ఎవరీ భోలె షావళి? 'కష్టపడ్డ.. ఇష్టపడ్డ.. లవ్లో పడ్డ.. అది కాదంటే కాళ్ల మీద పడ్డ..' పాటతో భోలె షావళి పేరు మార్మోగిపోయింది. ఈ పాటతో సెన్సేషన్ సృష్టించిన భోలె షావళి సింగర్ మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా! వెండితెరకు సైతం ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు. మహబూబాబాద్ జిల్లాలో పుట్టిపెరిగిన ఇతడు ప్రారంభంలో చక్రి దగ్గర అసిస్టెంట్గా పని చేశాడు. ఆయన దగ్గర మెళకువలు నేర్చుకున్న తర్వాత సింగర్గా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు. బతుకమ్మ, బోనాల పండగల సమయంలోనూ ప్రత్యేక గీతాలు కంపోజ్ చేస్తూ ఉంటాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన టాలెంట్తో మాయ చేసేందుకు బిగ్బాస్ షోకి వచ్చాడు. మరి తన మ్యాజిక్ పని చేస్తుందా? ఎన్ని వారాలు కొనసాగుతాడు? అనేది చూడాలి. నాలుగో కంటెస్టెంట్గా పూజామూర్తి బిగ్బాస్ హౌసులోకి నాలుగో కంటెస్టెంట్గా సీరియల్ నటి పూజామూర్తి ఎంట్రీ ఇచ్చింది. అలానే సరిగ్గా ఈ షోకి రావడానికి ముందు చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయింది. ఇందులో పాల్గొని ఆయన చివరి కలని నిజం చేస్తానని చెప్పింది. దమ్మున్న వారిలో శివాజీ, సందీప్ ఉంటారని.. దుమ్ము కేటగిరీలో తేజ ఉంటారని చెప్పింది. ఎవరీ పూజామూర్తి? గుండమ్మ కథ సీరియల్తో జనాలకు దగ్గరైంది పూజా మూర్తి. ఈమె కన్నడ అమ్మాయి. కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ బ్యూటీ బిగ్బాస్ 7 ప్రారంభమైన రోజే హౌస్లో అడుగుపెట్టాల్సింది. కానీ సరిగ్గా షో ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందు ఆమె ఇంట విషాదం నెలకొంది. తండ్రి కన్నుమూయడంతో ఆమె రియాలిటీ షోలో ఎంట్రీ ఇవ్వలేకపోయింది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టింది. ఎంట్రీ బాగుంది, మరి ఆట ఎలా ఉంటుందో చూడాలి! ఐదో కంటెస్టెంట్గా నయని పావని బిగ్బాస్ హౌసులోకి ఐదో కంటెస్టెంట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని (సాయి పావని) ఎంట్రీ ఇచ్చింది. దమ్మున్న వాళ్లలో యవర్, ప్రశాంత్ అని దుమ్ముదుమ్ముగా ఆడుతుందని అమరదీప్, తేజ అని చెప్పింది. ఎవరీ నయని పావని? టిక్టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది నయని పావని. ఈమె అసలు పేరు సాయి పవని రాజ్. పక్కా తెలంగాణ అమ్మాయి. టిక్టాక్లో వీడియోలు చేస్తూ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ బుట్టలో వేసుకుంది. సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లూ వర్సెస్ సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి పలు షార్ట్ ఫిలింస్లోనూ నటించింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్కు ఇన్స్టాగ్రామ్లో 6 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు. ఆ మధ్య డ్యాన్స్ షో ఢీలోకి వెళ్లి మంచి గుర్తింపు పొందింది. షార్ట్ ఫిలింస్, రియాలిటీ షోలే కాదు సినిమాలు కూడా చేసింది. చిత్తం మహారాణి, సూర్యకాంతం అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందానికి అందం, దానికి మించి టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ తాజాగా బిగ్బాస్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మరి తన జర్నీ ఎలా ఉంటుంది? అందరినీ ఆటాడిస్తుందా? తన ఆట తనే ఆడుతుందా? చూడాలి! ఇక వీళ్ల ఐదుగురి ఎంట్రీతో పాటు ఈ ఎపిసోడ్లో తన 'చిన్నా' సినిమా ప్రమోషన్స్లో భాగంగా సిద్ధార్థ్.. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్లో భాగంగా రవితేజ, నుపురు సనన్, గాయత్రి భరద్వాజ్ కాసేపు అలా వచ్చి సందడి చేసి వెళ్లిపోయారు. అలానే ఇప్పటివరకు అందరూ పవరస్త్ర కోసం పోటీపడ్డారు. కానీ కొత్తగా వచ్చిన ఐదుగురితో పాటు ఆల్రెడీ బిగ్బాస్లో ఉన్న ఎనిమిది మంది హౌస్మేట్స్ అయిపోయారని నాగార్జున చెప్పాడు. అలా వాళ్లలో అర్జున్, అశ్వినికి హౌస్ ఆఫ్ లగేజీ టాస్క్ ఇచ్చారు. మిగతావాళ్లలో ఎవరెవరి దగ్గర ఏ లగేజీ ఉండాలనేది వీళ్లు డిసైడ్ చేస్తారు. అలానే భోలె షావళి, పూజామూర్తి, నయనపావనికి నాగార్జున హౌస్ ఆఫ్ బెడ్స్ టాస్క్ ఇచ్చారు. దీన్నిబట్టి ఎవరు ఏ బెడ్పై పడుకోవాలనేది వీళ్లు నిర్ణయిస్తారు. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ఉంటాయి. -
డబుల్ ఎలిమినేషన్.. ప్రోమోలో ఆ జంటనే లేపేశారుగా!
బిగ్బాస్ షోకి ఉన్న ప్రధాన సమస్య లీక్స్.. ఎపిసోడ్ ప్రారంభం అయ్యే సమయానికే ఆరోజు ఏం జరగబోతుంది? ఎవరు గొడవపడతారు? ఎవరు ఆడుతారు? ఎవరు గెలుస్తారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇలా అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. ఫలితంగా బిగ్బాస్ ఎపిసోడ్లో పస లేకుండా పోతోంది. ఈసారి కూడా అదే జరిగింది. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని ప్రచారం జరిగింది, జరుగుతూనే ఉంది. అయినా మీరు చెప్పేదేంటి? నేనే చెప్తేస్తే ఓ పనైపోతుంది అనుకున్నారో ఏమో కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇద్దరు కంటెస్టెంట్లనే లేపేశారు. డాక్టర్బాబు గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురు ఇద్దరూ ప్రోమోలో ఒక్కచోట కూడా లేకపోవడంతో వీరి ఎలిమనేషన్ దాదాపు ఖరారైపోయింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయింది ఇద్దరే కానీ, ఒకరిని నిజంగానే అవతలకు పంపించేయలేదని లేటెస్ట్ టాక్! గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్లి ఎపిసోడ్ అంతా అయ్యాక తిరిగి హౌస్ లోపలకు పంపిస్తారట! మరి ఈ సీక్రెట్ రూమ్ వ్యవహారం నిజమే అయితే అది ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! ఇకపోతే సిద్దార్థ్ హౌస్లో చేసిన హంగామా మామూలుగా లేదు. అటు మాస్ మహారాజ రవితేజ సైతం రంగంలోకి దిగాడు. వీరి రచ్చ రంబోలా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామెడీ ఫిలిం.. రెట్టింపైన కలెక్షన్స్.. ఓటీటీ పార్ట్నర్ ఏదంటే? -
త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!
బిగ్బాస్ అంటేనే ఫిట్టింగ్ బాస్.. అన్నీ తేరగా ఇచ్చేయడు. కంటెస్టెంట్లను ముప్పలు తిప్పలు పెట్టి, ఏడిపించి చివరకు వారిక్కావాల్సింది ఇస్తాడు. బిగ్బాస్ ఇచ్చే అరకొరవాటి కోసం హౌస్లో నానా గొడవలే జరుగుతాయి. ఈసారి బిగ్బాస్.. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని చెప్తూనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తాజా(సెప్టెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి.. యావర్కు తెలుగు క్లాసులు బిగ్బాస్ ఇంట్లో కెప్లెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందుకోసం ఇంట్లోవారంతా జంటలు జంటలుగా విడిపోయారు. వీరిలో ఆటలో వెనుకబడి అందరికన్నా తక్కువ స్టార్లు సొంతం చేసుకున్న శోభా శెట్టి- ప్రియాంకలను బిగ్బాస్ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు. మిగిలిన నాలుగు జంటలు అమర్ దీప్- సందీప్, శివాజీ- ప్రశాంత్, తేజ- యావర్, గౌతమ్- శుభశ్రీలు నెక్స్ట్ లెవల్కు వెళ్లారు. ఇకపోతే తెలుగు కష్టంగా మాట్లాడుతున్న యావర్కు నాలుగు తెలుగు ముక్కలు నేర్పించాలన్నాడు బిగ్బాస్. ఈ క్రమంలో తేజ, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ.. అతడికి తెలుగు క్లాసులు తీసుకున్నారు. రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఆర్డర్లు, వార్నింగ్లు.. అల్లరి విద్యార్థిగా యావర్ అదరగొట్టాడు. తెలుగు పండింతులైన తేజను ఓ ఆటాడుకున్నాడు. మరోవైపు శివాజీ ఎప్పటిలాగే అతి చేశాడు. కాఫీ కోసం బిగ్బాస్ మీదకే నిప్పులు చెరుగుతున్నాడు. కాఫీ ఇవ్వని బతుకు.. నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్ నుంచి వెళ్లిపోతా.. అని మరోసారి బెదిరింపులకు దిగాడు. కాఫీ లేకపోతే ఏం ఆలోచించలేకపోతున్నా.. కామెడీ చేయమంటే ఎలా చేస్తాం.. వీడెవడ్రా బిగ్బాస్? కాఫీ ఇవ్వనంటాడు.. అని చిందులు తొక్కాడు. ఈయన ఓవరాక్షన్ చూసిన బిగ్బాస్ అతడికి కాఫీనే పంపించలేదు. ఎమోషనల్ టాస్క్.. ఇకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా చిట్టి ఆయిరే అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లందరికీ ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని, కానీ ప్రతి జంటలో ఒకరు లెటర్ చదివితే మరొకరు త్యాగం చేయాలి.. త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఎవరైతే లెటర్ చదువుతారో వారే కెప్టెన్సీ పోటీదారుడు అవుతారన్నమాట! త్యాగం చేసిన శుభ శ్రీ ఈ టాస్క్ గురించి ప్రకటించగానే శివాజీ.. నేను ఈ టాస్క్ ఆడటం లేదు అంటూ శివాజీ మైక్ కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రశాంత్తో.. నువ్వే ఆడు, లెటర్ తీసుకో అని చెప్పాడు. మరోవైపు గౌతమ్- శుభశ్రీ.. ఎవరు లెటర్ అందుకోవాలనే దాని గురించి కాసేపు వాదులాడి చివరకు త్యాగానికి పూనుకుంది శుభ. అటు గౌతమ్ తన తండ్రి రాసిన లేఖ చదివి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తన లేఖను చించేసిన యావర్ యావర్- తేజా.. ఇద్దరూ త్యాగానికి సిద్ధపడ్డారు. ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్లలేనంటూ యావర్ తన లేఖను చింపేశాడు. దీంతో తేజా తన తండ్రి రాసిన లెటర్ చదివి చాలా ఎమోషనలయ్యాడు. ఏడవనంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి తర్వాతి ఎపిసోడ్లో ఎవరు త్యాగం చేస్తారు? ఇంకా ఎవరు కెప్టెన్సీ పోటీదారులవుతారో చూడాలి! -
బిగ్బాస్ 7: ఆ ముగ్గురు తప్ప అందరూ నామినేషన్స్లో!
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో చిత్రవిచిత్రమైనవి జరుగుతున్నాయి. ఈసారి కెప్టెన్సీ, లగ్జరీ బడ్జెట్ టాస్క్లాంటివి ఏమీ పెట్టడం లేదు. కెప్టెన్సీకి బదులుగా పవరాస్త్రను ప్రవేశపెట్టారు. వీకెండ్లో కింగ్ ఆడించే గేమ్స్ గెలిచిన వారికి లగ్జరీ బడ్జెట్ ఇస్తున్నారు. టాస్కులు అరకొరగానే సాగుతున్నాయి. ఏదో ఆనవాయితీ ఉన్నట్లుగా ప్రతివారం అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు కిరణ్ రాథోడ్, షకీల, దామిని, రతికా రోజ్.. ఇలా వరుసగా నలుగురు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇక శివాజీ చేస్తున్న అతికిగానూ తనకిచ్చిన పవరాస్త్రను తిరిగి వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే! దీంతో నేటి నామినేషన్స్లో హౌస్మేట్స్ అతడిపై విరుచుకుపడ్డారు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గౌతమ్ కృష్ణ.. ఓ టాస్క్లో తేజ తనను బెల్ట్తో కొట్టిన సంగతిని గుర్తు చేశాడు. ఆ టాస్క్లో తేజ అలా చేస్తుంటే ఆపలేకపోయారంటూ శివాజీని నామినేట్ చేశాడు. సందీప్ కంటెస్టెంట్గా ఉండుంటే తనకే నామినేట్ చేసేవాడినని, కానీ తను హౌస్మేట్ అయినందున తనను నామినేట్ చేసే ఛాన్స్ లేదన్నాడు. ప్రియాంక.. శివాజీ, యావర్ను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారం సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
ఆయన మనిషేనా? ఛీ, అతడికా సపోర్ట్ చేసింది.. శివాజీపై రతిక ఫైర్
కంటెస్టెంట్లు పెద్దగా గొడవపడేది నామినేషన్స్లోనే! ఇతరత్రా సందర్భాల్లో గొడవపడ్డా దాన్ని గుర్తు చేసుకుని మరీ గొడవకు దిగేది, రచ్చ చేసేది కూడా నామినేషన్స్లోనే! బిగ్బాస్ 7లో నాలుగోవారం నామినేషన్స్ రసాభాసగా జరిగాయి. ఇంతకీ ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్(సెప్టెంబర్ 25) హైలైట్స్ చదివేయాల్సిందే! అతి చేస్తున్న శివాజీ హౌస్లో తనే పెద్ద తోపు, తురుమ్ఖాన్ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు శివాజీ. ఎదుటివారిని మాట్లాడనివ్వడు, వారు ఏం చెప్పినా వినిపించుకోడు, పట్టించుకోడు. తను చెప్పిందే వేదం, తను చేసేది శాసనం అన్నట్లుగా ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు. అందరితో బాగుంటూనే అవసరం వచ్చినప్పుడు అసలు స్వరూపం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టిన రతిక రోజ్ అతడికి దూరంగా ఉండటమే బెటర్ అని ఫీలైంది. నాగార్జునగారి దగ్గర.. ప్రశాంత్ వెనుక నేను తిరుగుతున్నా అన్నట్లుగా శివాజీ అనడం నచ్చలేదని అమర్తో చెప్పింది రతిక. ఛీ.. ఈయన్నా నేను సపోర్ట్ చేసింది: రతిక 'అసలు ఆయన్ను మనిషి అనాలా? ఇంకేమైనా అనాలా? ఆయన సేఫ్ గేమ్ ఆడుతూ అందరినీ సేఫ్ గేమ్, గ్రూప్స్ ఆడుతున్నారని చెప్తున్నాడు. ఛీ ఈయనకా నేను సపోర్ట్ చేసింది.. పైకి మంచిగా ఉంటూ మార్కులు కొట్టేస్తూ మనల్ని పిచ్చోడిని చేస్తున్నాడు' అని తన ఆవేశాన్నంతా కక్కేసింది. ఆ తర్వాత శివాజీ దగ్గరకు వెళ్లి మరీ గొడవపెట్టుకుంది. ప్రశాంత్ టాపిక్ ఎత్తుతూ.. నాగ్ సర్ ముందు అమ్మాయిగా నా క్యారెక్టర్ గురించి ఇలా అనేశాడేంటి? అనిపించింది అని తన ఆవేదన చెప్పింది. దీంతో అతడు నేనలా అనలేదు. నువ్వే మరోలా ఊహించుకుంటున్నావు.. అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ రతిక వినకపోవడంతో సారీ చెప్పాడు. అయినా రతిక వాదిస్తుండటంతో.. ఎందుకు సాగదీస్తున్నావ్.. కాళ్లు పట్టుకోవాలా? అని సీరియస్ అవుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. జ్యూరీ సభ్యులను కారణాలతో మెప్పిస్తేనే.. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ వినూత్నంగా సాగింది. పవరాస్త్ర పొందిన ముగ్గురు హౌస్మేట్స్ శోభా శెట్టి, సందీప్, శివాజీలను బిగ్బాస్ జ్యూరీ మెంబర్స్గా కూర్చోబెట్టారు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని బోనులో నిలబెట్టి నామినేట్ చేసి అందుకు తగిన కారణాలు చెప్పాలి. జ్యూరీ ఎవరి నామినేషన్కు మద్దతు తెలుపుతుందో వారి ఫోటోలను గిల్టీ బోర్డుపై పెట్టాలి. ఒకసారి గిల్టీ బోర్డుకు ఎక్కిన వ్యక్తిని వేరొకరు నామినేట్ చేయడానికి వీల్లేదు. ముందుగా ప్రిన్స్ యావర్.. తనను కంటెండర్గా తప్పించిందని ప్రియాంకను, టాస్కులే ఆడట్లేదంటూ తేజలను నామినేట్ చేశాడు. ప్రియాంక గురించి చెప్పింది సబబు అనిపించడంతో జ్యూరీ మెంబర్స్ ఆమె ఫోటోను గిల్టీ బోర్డుపై పెట్టారు. మళ్లీ కయ్యానికి కాలు దువ్విన యావర్ శుభశ్రీ మాట్లాడుతూ.. బిగ్బాస్ రూల్స్ ప్రకారం బయట ఉన్న సెలబ్రిటీల గురించి చెడుగా మాట్లాడకూడదు. కానీ రతిక తన ఎక్స్ గురించి చెడుగా మాట్లాడుతోందని నామినేట్ చేసింది. అలాగే గతవారం నామినేషన్స్ సొంతంగా ఆలోచించకుండా వేరొకరిని గుడ్డిగా ఫాలో అవడం కరెక్ట్ కాదని పేర్కొంది. దీంతో రతికకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. నీలా గుసగుసలు ఆడటం రాదు. నా ఎక్స్ గుర్తొచ్చి ప్రియాంకతో చెప్పుకున్నాను. ఆ మాటలు విని నువ్విక్కడ చెప్తున్నావంటే నీ క్యారెక్టర్ ఏంటి? అని ప్రశ్నించింది. దీంతో శుభశ్రీ నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ యావర్- గౌతమ్ ఫైట్ కంటెండర్గా గుండు గీయించుకోమంటే వెనుకాడాడంటూ అమర్ను నామినేట్ చేసింది. అది నా ఇష్టం, నీకేంటి బాధ? అని తనతో గొడవకు దిగాడు అమర్. జ్యూరీ.. అమర్-రతిక ఇద్దరిలో రతికను నామినేట్ చేశారు. అనంతరం గౌతమ్.. గతంలో ప్రిన్స్ తనతో అమర్యాదగా ప్రవర్తించాడని, అతడి కోపం వల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నాడు. ఇది వినగానే ప్రిన్స్ మళ్లీ గొడవ షురూ చేశాడు. యావర్- గౌతమ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. బోనులో నిలబడకుండా గౌతమ్పైకి వెళ్లడంతో అతడిని బోనులో నిలబడమని సందీప్ మాస్టర్, శివాజీ కోప్పడ్డారు. వారిపైనా ప్రిన్స్ నిప్పులు చెరిగాడు. పిచ్చి కారణాలంటూ శివాజీ ఓవరాక్షన్ ఈ ప్రవర్తనే నచ్చలేదని గౌతమ్ అనగా నీవన్నీ పిచ్చి కారణాలు.. మేము పిలుస్తున్నా యావర్ మా మాట లెక్కచేయలేదు కాబట్టి ఆ ప్రవర్తనకు మాత్రమే నామినేట్ చేస్తున్నాం అంటూ శివాజీ అతి చేశాడు. ఇది నచ్చని గౌతమ్ మీరు పక్షపాతంగా ఉంటున్నారంటూ శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో బిగ్బాస్.. నామినేషన్లో ప్రవర్తనను బట్టి కంటెస్టెంట్లను నామినేట్ చేయకూడదు. కారణాల ఆధారంగానే వారిని ఎంపిక చేయాలి. మీ నిర్ణయాన్ని ఆలోచించి చెప్పండి అని పేర్కొన్నాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది. మరి నామినేషన్లో ఇంకా ఎన్ని గొడవలున్నాయో చూడాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి -
పాపం గౌతమ్.. కష్టమంతా వృథా! బిగ్బాస్ ప్లాన్ అదేనా?
బిగ్బాస్ ఇంట్లో మూడో హౌస్మేట్గా ప్రమోషన్ పొందేందుకు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో చిత్రవిచిత్ర టాస్క్లుపెడుతున్నాడు బిగ్బాస్. ఇప్పటికే పవరస్త్ర కోసం సెలక్ట్ చేసిన ముగ్గురికే కాకుండా వారిని ఛాలెంజ్ చేసిన వారికి సైతం టాస్కులు ఇచ్చాడు. ఇంతకీ హౌస్లో తాజా ఎపిసోడ్లో (సెప్టెంబర్ 21) ఏమేం జరిగిందో చూసేద్దాం.. చికెన్ ముక్కల్ని లాగించిన శోభా మూడో పవరాస్త్ర కోసం బిగ్బాస్.. ప్రిన్స్ యావర్, అమర్దీప్, శోభా శెట్టిని సెలక్ట్ చేశారు. ఇప్పటికే బిగ్బాస్ ఇచ్చిన టాస్కులో గెలిచి తాను కంటెండర్గా పోటీ చేసేందుకు అర్హుడినేనని నిరూపించుకున్నాడు ప్రిన్స్. ఈరోజు మిగతా ఇద్దరి వంతు వచ్చింది. మొదటగా శోభా శెట్టిని పిలిచాడు బిగ్బాస్. అసలు కారమే అలవాటు లేని తన ముందు అత్యంత కారమైన చికెన్ ముక్కలు పెట్టి వీలైనన్ని ఎక్కువ తినాలని టాస్క్ ఇచ్చాడు. ఎంతో కారంగా ఉన్నా సరే 27 ముక్కల్ని లాగించేసింది శోభా. గౌతమ్ కదా విన్నర్? ఇక ఆమె కంటెండర్గా పోటీ చేయడాన్ని ఛాలెంజ్ చేసిన పల్లవి ప్రశాంత్, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణలకు సేమ్ టాస్క్ ఇచ్చాడు. తక్కువ సమయంలో 28 చికెన్ పీసులు తినాలని చెప్తూ సందీప్ను సంచాలకుడిగా నియమించాడు. గౌతమ్ 28 తినేసి బెల్ కొట్టాడు. అయితే అప్పటివరకు సైలెంట్గా ఉన్న సంచాలక్.. తర్వాత మాత్రం ఒక పీస్ కొద్దిగా వదిలేశావంటూ ఒక నెంబర్ తగ్గించి 27 పీసులే తిన్నట్లు పేర్కొన్నాడు. శోభా శెట్టి కంటే ఎక్కువ తినలేకపోవడంతో బిగ్బాస్ ఆమెనే కంటెండర్గా ఎంపిక చేశాడు. గుండు గీయించుకునేందుకు భయపడ్డ అమర్ ఇక శివాజీ పవరాస్త్రను కొట్టేసిన అమర్దీప్.. చివరకు దాన్ని వెనక్కు ఇచ్చేశాడు. అనంతరం అసలు సిసలైన ఫిట్టింగ్ పెట్టాడు బిగ్బాస్. అమర్దీప్ను గుండు గీయించుకోవాలన్నాడు. లేదంటే అతడిని ఛాలెంజ్ చేసిన ప్రియాంక బేబీకట్ చేయించుకోవాలన్నాడు. తను గుండు గీయించుకోవడమా? నెవర్.. ఆ ఊహే భయంకరంగా ఉందన్నట్లుగా వణికిపోయాడు అమర్. ఓపక్క ఏడుస్తూనే అమ్మాయిలకు ఇలాంటి హెయిర్కట్ అంటే మామూలు విషయం కాదంటూ హెయిర్కట్కు రెడీ అయిపోయింది ప్రియాంక. అప్పటిదాకా కన్నీళ్లు.. అద్దంలో చూసుకున్నాక.. అప్పటివరకు కన్నీళ్లు పెట్టుకున్న ఆమె తర్వాత మాత్రం.. గతంలో ఇలా చిన్నగా హెయిర్కట్ చేయించుకోవాలనుకున్నాను. క్యూట్గా ఉన్నాను అంటూ మురిసిపోయింది. ఇదంతా చూస్తుంటే ఈసారి పవరాస్త్రను బిగ్బాస్ ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మాయిలకే ఇవ్వాలని ఫిక్సయిపోయినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ప్రిన్స్ను ఓడించి శోభా, ప్రియాంకలలో ఎవరైనా ఒకరు పవరాస్త్ర గెలుచుకుని మూడో హౌస్మేట్గా ప్రమోషన్ పొందుతారా? లేదా? అనేది చూడాలి. చదవండి: ఆ వ్యాధి వల్ల సినిమాలు, ఊరు వదిలేసి వెళ్లిపోయా: మమతా -
బిగ్బాస్: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్
బిగ్బాస్ 7 ఉల్టాపుల్టాగా సాగుతోంది. ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. ఆటలో చూపించాల్సిన ప్రతాపాన్ని ఖాళీ సమయాల్లోనే ఎక్కువగా చూపిస్తున్నారు. కొందరైతే ఫుటేజీ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో మాయాస్త్ర టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా! మహాబలి టీమ్లో గొడవల కారణంగా టాస్క్ కొనసా...గుతోంది. ఈ టాస్క్ గురించి అప్డేట్ ఇస్తూ తాజాగా ప్రోమో విడుదలైంది. కొట్టుకున్నంత పని చేసిన గౌతమ్, ప్రిన్స్ మాయాస్త్ర పొందేందుకు ఎవరు అనర్హులో చెప్పి, వారి దగ్గరున్న భాగాన్ని తీసుకుని అదే టీమ్లోని మరొకరికి ఇవ్వాలి. దీంతో గౌతమ్.. ప్రిన్స్ దగ్గరి నుంచి తీసుకుని శివాజీకి ఇస్తానన్నాడు. ఆ మాటతో శివాలెత్తాడు ప్రిన్స్. నువ్వు చెప్పే కారణం ఇదా.. అని అరిచాడు. గౌతమ్, ప్రిన్స్ యావర్.. ఇద్దరూ కొట్టుకున్నంత పని చేశారు. నాకు న్యాయం కావాలని ఏడ్చేశాడు ప్రిన్స్. దీంతో అమర్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇంతమందిని ఏడిపించి ఏం బాగుపడుతారో నాకర్థం కాదు అని మహాబలి టీమ్పై సెటైర్లు వేశాడు. రైతుబిడ్డ అని చెప్పుకోవద్దు, కానీ నువ్వు డాక్టర్ అని చెప్పుకోవచ్చు 'ఇది బ్యాడ్ గేమ్.. నేను ఇంటికి వెళ్లాలి.. గేటు ఓపెన్ చేయండి' అని అభ్యర్థించాడు ప్రిన్స్. ఈ ప్రోమో చూసిన అభిమానులు.. ప్రిన్స్ యావర్ కష్టపడే తత్వమున్నవాడని, అతడు నిజాయితీగా ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ అని చెప్పుకుంటే తిట్టారు, మరి గౌతమ్ ఎందుకు? పదేపదే డాక్టర్నని విర్రవీగుతున్నాడు. ఆయన అన్నిసార్లు డాక్టర్ అని చెప్పుకుంటుంటే ఎవరూ నోరు మెదపడం లేదేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ చేస్తే తప్పు, గౌతమ్ చేస్తే ఒప్పా? అని నిలదీస్తున్నారు. చదవండి: రతిక శాడిజం వల్ల సీరియల్ బ్యాచ్ అవుట్.. పచ్చిబూతులు మాట్లాడిన అమర్ -
బిగ్బాస్ స్టూడియో ముందు కుక్కలా తిరిగానంటూ ఏడ్చేసిన రైతుబిడ్డ
బిగ్బాస్ హౌస్మేట్స్కు ఓ విషయం అర్థమైంది. ఇక మెతకగా ఉంటే పని అవ్వదని, అందరి కంట్లో పడాలంటే ఏదో ఒకటి చేసేయాలని తెలిసొచ్చింది. అసలే వీకెండ్లో నాగ్ కొందరు కంటెస్టెంట్లు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నారని గాలి తీసేశాడు. ఇంకేముంది, నామినేషన్స్లో ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. బిగ్బాస్కే బాస్ అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్న శివాజీని, పదేపదే రైతుబిడ్డ అని చెప్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ సింపథీ కోరుకుంటున్న పల్లవి ప్రశాంత్ను ఉతికారేశారు. ముందు ఎదుటివారిని మాట్లాడనివ్వమని ప్రియాంక శివాజీకి గట్టిగానే కౌంటరిచ్చింది. అది తప్పా? అనంతరం హౌస్లో చాలామంది ప్రశాంత్ను వరుసపెట్టి నామినేట్ చేశారు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నాయనా, నాకు నువ్వు నాకు కనిపించడం లేదని షకీలా మొదట ప్రశాంత్ను నామినేట్ చేసినట్లు చూపించారు. ఇక గౌతమ్ కృష్ణ.. తనను నామినేట్ చేస్తూ కారణం చెప్తుండగా అతడిని మధ్యలోనే అడ్డుకున్నాడు ప్రశాంత్. నేను చేసే పని గర్వంగా చెప్పుకున్నా, అది తప్పా? అని నిలదీశాడు. గౌతమ్ను మాట్లాడనివ్వకపోవడంతో.. ఫస్ట్ మొత్తం విన్నాక మాట్లాడు అని ప్రశాంత్పై ఫైర్ అయింది ప్రియాంక. అదిరే ఆన్సర్ ఇచ్చిన ఆట సందీప్ ఇక అమర్దీప్ అయితే రైతుబిడ్డ అనే క్యాసెట్ వినలేక తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. ప్రతిసారి రైతుబిడ్డ అనే సెంటిమెంటల్ డైలాగ్ వాడకురా అని హెచ్చరించాడు. సీరియల్లో చేసిన యాక్టింగ్ ఇక్కడ చెప్పకు అని ఎదురుతిరిగాడు ప్రశాంత్. ఇంతలో ఆట సందీప్ కలగజేసుకుంటూ భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరూ రైతుబిడ్డే.. మా తాతలు కూడా రైతుబిడ్డేరా అని చెప్పాడు. కుక్కలా తిరిగినా అందరూ ఒకేసారి తనను వరుసపెట్టి వాయించడంతో ఏడ్చేశాడు ప్రశాంత్. ఆరో సీజన్ సమయంలో ఇదే స్టూడియో ముందు కుక్కలాగా తిరిగానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే రతిక రంగంలోకి దిగుతూ.. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నవ్? అని పాయింట్ లాగింది. ఆమె దగ్గరి నుంచి అటువంటి ప్రశ్న ఊహించని ప్రశాంత్ దెబ్బకు సైలైంట్ అయిపోయాడు. ఈ ప్రోమో మాత్రం ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. చదవండి: Kiran Rathod: కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్కు ప్రధాన కారణాలివే! వారం రోజుల్లోనే అంత సంపాదించిందా? -
మధ్య తరగతి కుర్రాడి కథ
గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా పి. నవీన్కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్పై సెవెన్ హిల్స్ సతీష్కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పి. నవీన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఒక స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన మధ్య తరగతి కుర్రాడి కథతో ఈ సినిమా రూపొందుతోంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ని మా సినిమా అలరిస్తుంది’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అన్నారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్. పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, ఆనంద్ చక్రపాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్ధు, సంగీతం: జుడా శాండీ. ∙పోసాని కృష్ణ మురళి, గౌతం కృష్ణ, శ్వేత -
డాక్టర్ నుంచి యాక్టర్ అయిన హీరో
డాక్టర్ గౌతమ్ కృష్ణ బిగ్బాస్ షోలో 11వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్కు చిన్నప్పటి నుంచే రైటర్, డైరెక్టర్ కావాలని ఉండేదట. అయితే తన పేరెంట్స్కు మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒకరకమైన భయం. దీంతో వారికోసం చదువుపై దృష్టిపెట్టాడు. అలా డాక్టరయ్యాడు. సూర్యాపేట జిల్లాలోని బీబీగూడేం అతడి స్వస్థలం. తల్లిదండ్రులు ధరావత్ మనోజ్జాదవ్, మంగమ్మ. తండ్రి రిటైర్డ్ ఇంజినీర్, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. 1996 ఏప్రిల్ 13న జన్మించిన గౌతమ్ తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. చిన్నతనం నుంచే సినిమాలంటే ఆసక్తి. దీంతో డాక్టర్ చదువుతో పాటు ఎంబీఏ పూర్తి చేయగానే 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. 2019లో ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని డైరెక్షన్ చేస్తూనే హీరోగా నటించాడు. హిందీలో సిద్దూ ది రాక్స్టార్ సినిమా చేసి అక్కడా తనదైన ముద్ర వేసుకున్నాడు. తాజాగా బిగ్బాస్ హౌస్లోకి వెళ్లిన అతడు డాక్టర్ను కాబట్టి అందరికీ పనికొస్తాను, తనను నామినేట్ చేయొద్దు అంటున్నాడు. అయితే నాగార్జున మాత్రం అతడి చేతికి బేడీలు వేసి మరీ హౌస్లోకి పంపించాడు. ఇంట్లో అందంగా కనిపించే ఒక అమ్మాయికి ఈ బేడీలు వేయమన్నాడు. మరి ఈ డాక్టర్ బాబు హౌస్లో ఎన్నాళ్లు ఉంటాడో చూడాలి!