Mukku Avinash
-
నాగార్జునకు, రామ్చరణ్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ముక్కు అవినాష్ (ఫోటోలు)
-
బిగ్బాస్ 8 హైలైట్స్: ఈ విషయాలు గమనించారా?
ఎన్నో ట్విస్టులు, టర్నులతో బిగ్బాస్ 8 మొదలైంది. అన్లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ షో మొదలుపెట్టాడు హోస్ట్ నాగార్జున. రానురానూ ఫన్ తగ్గిపోవడంతో వైల్డ్కార్డ్స్ను రంగంలోకి దింపాడు. అప్పటినుంచి షోపై హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్లు కూడా హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ విజేతగా నిలిచాడు. మరి 105 రోజుల జర్నీలో ఏమేం జరిగాయో హైటైల్స్లో చూసేద్దాం..⇒ సెప్టెంబర్ 1న బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం⇒ లాంచింగ్ రోజు హౌస్లోకి 14 మంది కంటెస్టెంట్లు.. వీరిని జంటలుగా పంపించిన బిగ్బాస్⇒ ప్రైజ్మనీని జీరోగా ప్రకటించిన నాగార్జున.. హౌస్మేట్సే దాన్ని సంపాదించాలని వెల్లడి⇒ రెండో వారం శేఖర్ బాషాను పంపించేసిన హౌస్మేట్స్⇒ అక్టోబర్6న రీలోడ్ ఈవెంట్ ద్వారా 8 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ⇒ ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ గత సీజన్స్లో వచ్చినవాళ్లే కావడం గమనార్హం⇒ పాతవారిని ఓజీగా, వైల్డ్కార్డ్స్ను రాయల్స్ క్లాన్గా విభజించిన బిగ్బాస్⇒ తొమ్మిదోవారంలో క్లాన్స్ తీసేసి అందర్నీ కలిపేసిన బిగ్బాస్⇒ ఈ సీజన్లో కెప్టెన్ పదవికి బదులుగా మెగా చీఫ్ పదవిని పెట్టారు⇒ రేషన్ కూడా కంటెస్టెంట్లే సంపాదించుకోవాలన్నారు, కిచెన్లో టైమర్ ఏర్పాటు చేశారు⇒ ఈ సీజన్లో జైలుకు వెళ్లిన ఏకైక కంటెస్టెంట్ మణికంఠ⇒ ఏడోవారంలో నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల బతికిపోయిన గౌతమ్⇒ పదోవారంలో గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్⇒ 12 వారం.. ఎలిమినేట్ అయినవారితో నామినేషన్స్⇒ ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన నబీల్⇒ పదమూడోవారంలో ఎవిక్షన్ షీల్డ్ను అవినాష్కు వాడిన నబీల్.. ఫలితంగా తేజ ఎలిమినేట్⇒ ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్⇒ బీబీ పరివారం వర్సెస్ మా పరివారం ఛాలెంజ్లో అన్ని గేముల్లోనూ బిగ్బాస్ కంటెస్టెంట్లదే గెలుపు⇒ ఈ సీజన్ చిట్టచివరి టాస్క్ గెలిచి ప్రైజ్మనీకి రూ.1 యాడ్ చేసిన గౌతమ్⇒ దీంతో టోటల్ ప్రైజ్మనీ రూ.55 లక్షలకు చేరింది.⇒ తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే ఇదే అత్యధిక ప్రైజ్మనీ⇒ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా రామ్చరణ్⇒ బిగ్బాస్ 8 విన్నర్గా నిఖిల్, రన్నరప్గా గౌతమ్⇒ తర్వాతి మూడు స్థానాల్లో నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు.నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవకపోయినా, నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడకపోయినా గౌతమ్, అవినాష్ ఫైనల్స్లో ఉండేవారే కాదు. అప్పుడు వీళ్లకు బదులుగా వేరే ఇద్దరికి ఫైనల్స్లో చోటు లభించేది!చదవండి: ఫినాలేలో గౌతమ్పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..! -
ఆ బాధతో 18వ అంతస్తు నుంచి దూకేద్దామనుకున్న గౌతమ్..
గత కొన్నిరోజులుగా నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్న ఫైనలిస్టులను చివరిసారి ఏడిపించే ప్రయత్నం చేశాడు బిగ్బాస్. మీ జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనను పంచుకోమని చెప్పడంతో అందరూ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లిపోయారు. మరి ఎవరెవరు ఏమేం చెప్పారు? హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సోనియాను బ్లాక్ చేస్తానన్న ప్రేరణషో అయిపోయాక ఎవరితో కలిసుండాలనుకుంటున్నారు? ఎవరిని కలవకూడదనుకుంటున్నారో చెప్పమంటూ ఫాలో- బ్లాక్ గేమ్ ఆడించాడు బిగ్బాస్. దాదపు అందరితోనూ కలవాలనుకుంటున్న చెప్పారు టాప్ 5 కంటెస్టెంట్లు. ఎవరిని కలవకూడదన్న విషయానికి వస్తే.. సోనియా పర్సనాలిటీ నచ్చలేదంటూ తనను బ్లాక్ చేస్తానంది ప్రేరణ. తక్కువ పరిచయం వల్ల పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేశాడు గౌతమ్. నబీల్.. హరితేజ, సోనియాను బ్లాక్ చేస్తానన్నాడు. నిఖిల్.. బేబక్క, సీతను బ్లాక్ చేశాడు. అవినాష్.. పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేస్తానన్నాడు.మూడేళ్లు ఇంట్లో ఖాళీగా..తర్వాత చలిమంట వేసిన బిగ్బాస్.. జీవితంలోని బెస్ట్, వరస్ట్ సంఘటనలను పంచుకోమన్నాడు. నబీల్ మాట్లాడుతూ.. బైక్ యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్పాలయ్యాను. అదే నా చేదు జ్ఞాపకం అన్నాడు. నిఖిల్ మాట్లాడుతూ.. నేను ఆర్కిటెక్ట్ కోర్స్ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది. చదువు మధ్యలోనే వదిలేశాను. మూడేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. రోజూ అమ్మ దగ్గర రూ.30 అడుక్కునేవాడిని. నువ్వు ఇంటికి భారమయ్యావు, నీకు తిండి పెట్టడమే కాకుండా ఖర్చులకు కూడా డబ్బివ్వాలా? అని తిట్టింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చాకే..తర్వాత కన్నడ సీరియల్లో ఆఫర్ వచ్చింది. రోజుకు రూ.2500 ఇస్తామన్నారు. అంటే నెలకు రూ.75వేలు వస్తాయనుకున్నాను. కానీ పదిరోజులే షూటింగ్ జరిగింది. ఆ తర్వాత తెలుగు సీరియల్ చేశాను. అప్పటినుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు అని చెప్పాడు. ప్రేరణ నానమ్మ చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేసింది.ఏ పాపం చేశానో..గౌతమ్ మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒకమ్మాయితో బ్రేకప్ అయింది. ఆ బాధ తట్టుకోలేక నేను ఉంటున్న 18వ అంతస్థులోని బాల్కనీలో నుంచి దూకి చనిపోదామనుకున్నాను. కానీ నాతోపాటు నన్ను ప్రేమించేవాళ్లు గర్వపడేలా చేస్తే ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆలోచించి ఆగిపోయాను అన్నాడు. అవినాష్ మాట్లాడుతూ.. నేను, నా భార్య అను ఎన్నో కలలు కన్నాం. ఏ జన్మలో ఏ తప్పు చేశానో మాకు బాబు పురిటిలోనే చనిపోయాడు. నా చేతిలో కొడుకున్నాడు, కానీ వాడికి ప్రాణం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై ఫీలింగ్స్?తర్వాత యాంకర్ సుమ వచ్చి సరదా టాస్కులు ఆడించింది. అలాగే ప్రేక్షకుల మనసులోని ప్రశ్నలను ఫైనలిస్టులను అడిగేసింది. కావాలని స్ట్రాటజీతో రెచ్చగొట్టి గొడవలు పెట్టుకుంటారా? అని గౌతమ్ను అడగ్గా అలా ఏం లేదని, దేనికైనా హర్ట్ అయితేనే గొడవపడతానన్నాడు. యష్మిపై నీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా లవ్ యాంగిల్ కోసం వేసిన స్ట్రాటజీయా? అని అడగ్గా మొదట్లో కొంచెం ఫీల్ ఉండేది కానీ ఒకసారి అక్క అన్నాక అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు.ఫైర్ తగ్గలేదన్న నబీల్రాయల్స్(వైల్డ్ కార్డ్స్) వచ్చాక నీలో ఎందుకు ఫైర్ తగ్గింది? అని నబీల్ను అడగ్గా.. తనలో ఫైర్ ఎక్కడా తగ్గలేదని, కాకపోతే కొన్నిసార్లు కనిపించకపోయుండొచ్చన్నాడు. పృథ్వీ కాకుండా ఈ ఇంట్లో ఎవరిని ఎక్కువ నమ్ముతారు? అని నిఖిల్ను అడగ్గా ఆ రేంజ్లో ఎవరినీ నమ్మలేనన్నాడు. సీజన్ 4 లేదా సీజన్ 8లో ఏది బెస్ట్ అని ప్రశ్నించగా అవినాష్ క్షణం ఆలోచించుకోకుండా నాలుగో సీజన్ అని చెప్పాడు.అక్కడే అసలు గొడవనిఖిల్, గౌతమ్.. మీరిద్దరూ ఎందుకు ఎప్పుడూ గొడవపడతారు? అన్న ప్రశ్నకు అభిప్రాయబేధాలు అని ఇద్దరూ బదులిచ్చారు. తర్వాత ఓ టాస్క్లో నిఖిల్ గెలవడంతో అతడి తమ్ముడి వీడియో సందేశాన్ని చూపించాడు. అనంతరం ప్రేరణ గెలవడంతో తనకు ఓ ఫోటోఫ్రేమ్ ఇచ్చారు. అలా ఎమోషన్స్, ఆటపాటలతో ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8: ప్రేరణ, అవినాష్ ఎలిమినేట్!
బిగ్బాస్ రియాలిటీ షో మొదలై ఎనిమిదేళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా టైటిల్ గెలవలేదు. ఎలాగైనా సరే ఈసారి ట్రోఫీ అందుకుని చరిత్ర తిరగరాయాలని ప్రేరణ బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లుగానే ఎంతో కష్టపడింది. అబ్బాయిలతోనూ ధీటుగా పోరాడింది. తను పాల్గొన్న ప్రతి టాస్కులోనూ విజృంభించి ఆడింది. లేడీ ఫైటర్ అని పేరు తెచ్చుకుంది. టాప్ 3లో కూడా చోటు దక్కించుకోని ప్రేరణకానీ మైక్రో మేనేజ్మెంట్ వల్ల విమర్శలపాలైంది. అందరికీ ఓపికగా వంటచేసినప్పటికీ కిచెన్లో గొడవలు పడి నెగెటివిటీ మూటగట్టుకుంది. ప్రేరణ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే స్థాయి నుంచి ఈమె ఫైనల్కు అయినా వస్తుందా? అనే స్థాయికి పడిపోయింది. అందుకే టాప్3లో కూడా స్థానం దక్కించుకోలేదు.విజేత ఎవరు?ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో బిగ్బాస్ 8 గ్రాండ్ ఫినాలే షూటింగ్ సగం పూర్తయింది. మొదటగా ముక్కు అవినాష్ను ఎలిమినేట్ చేయగా నాలుగో స్థానంలో ప్రేరణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. టాప్ 3లో నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ మిగిలారు. మూడో స్థానం నబీల్దే అన్న విషయం అందరికీ తెలుసు.. ఇక విన్నర్, రన్నర్ ఎవరనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8కు అందుకే వచ్చానన్న గౌతమ్.. ఏడ్చేసిన అవినాష్!
ఆటలు, పాటలు.. అడ్డంకులు, ఆటుపోట్లు.. ఇలా ఎన్నింటినో దాటుకుని బిగ్బాస్ ఫైనల్ వీక్కు ఐదుగురు మాత్రమే చేరుకున్నారు. ఇంటిని, బయటి ప్రపంచాన్ని వదిలేసి బిగ్బాస్ హౌస్లో వంద రోజులుగా ఉంటున్నారు. వీరి జర్నీ తుది అంకానికి చేరుకున్న సందర్భంగా ఫైనలిస్టుల కష్టాలను, ఆనందాలను గుర్తు చేస్తూ బిగ్బాస్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశాడు. ఆ విశేషాలు నేటి (డిసెంబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..తన్మయత్వంలో గౌతమ్బిగ్బాస్ హౌస్లో గడిచిన ప్రయాణాన్ని గుర్తు చేసేలా గార్డెన్ ఏరియాలో అదిరిపోయే సెటప్ ఏర్పాటు చేశాడు బిగ్బాస్. కంటెస్టెంట్ల ఫోటోలు, టాస్క్ ప్రాపర్టీస్.. ఇలా అన్నింటినీ అందంగా అమర్చాడు. మొదటగా గౌతమ్ గార్డెన్ ఏరియాలోకి వచ్చి తన ఫోటోలు చూసుకుని, ఆడిన టాస్కుల్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.అదే మీ స్ట్రాటజీతర్వాత బిగ్బాస్ మాట్లాడుతూ.. బలవంతుడితో ఎలాగోలా గెలవొచ్చు. కానీ మొండివాడితో గెలవలేము. మీ మొండితనంలో నిజాయితీ ఉంది. మునుపటిసారి ఇంట్లో వచ్చినప్పుడు జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పర్ఫెక్ట్ ప్లేయర్గా మిమ్మల్ని మీరు మల్చుకోవడానికి చేసిన కృషి ప్రశంసనీయం. లక్ష్యాన్ని చేధించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. మీ స్ట్రాటజీ ఏంటో మిగతావారికి అర్థం కాకపోవడమే మీ స్ట్రాటజీగా మార్చుకున్నారు. ఊహించని విధంగా వారిపై దాడి చేశారు. ఒక యోధుడిలా..స్త్రీల పట్ల మీకున్న గౌరవం మీ మాటలో, ఆటలో స్పష్టంగా ప్రతిబింబించింది. ఎలిమినేషన్ అంచులవరకు వెళ్లినప్పుడు మీ మనసు చెలించింది. మీ ప్రణాళికను మార్చేసుకుని బుద్ధిబలం, భుజబలంతో ఒక యోధుడిగా పాదరసంలా కదులుతూ ఏ ఆటంకం లేకుండా మీ ఆట ముందుకు సాగింది. మీరు కోరుకున్న (యష్మి దగ్గర) ప్రేమ మీకు లభించకపోయినా అది మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. అమ్మ మాట వినే...గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అది నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. ఈ రెండూ కనబర్చిన మీ ప్రయాణాన్ని ఓసారి చూసేద్దాం అంటూ పొగడ్తల అనంతరం జర్నీ వీడియో ప్లే చేశాడు. అది చూసిన గౌతమ్.. బిగ్బాస్ 8 నా జీవితంలోనే ఒక మైల్ స్టోన్. 'నీ లైఫ్లో ఎవరూ నీ కోసం ఏదీ చేయరు, ఒక్కడివే నిలబడు, ఒక్కడివే పోరాడు' అని అమ్మ చెప్పింది. ఆ గౌరవం కోసమే వచ్చాతను చెప్పింది వినే ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకెప్పుడూ గౌరవం లభించలేదు. దానికోసమే ఈ సీజన్కు వచ్చాను. గౌరవం సంపాదించుకున్నాను. జీవితంలో ముగ్గురే ముఖ్యమైన వారు తల్లి, తండ్రి, గురువు. మీరు నా గురువు బిగ్బాస్ అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత అవినాష్ను ప్రశంసల్లో ముంచెత్తాడు బిగ్బాస్. మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకు తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది. జస్ట్ కమెడియన్ కాదుఎన్ని డిగ్రీలు పొందినవారికైనా అది సాధ్యమవుతుందా? నవ్వుకున్న బలం అలాంటిది! ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులైనా అందరూ మీ ఆప్తులే.. వారందరూ నవ్వు మీకిచ్చిన బంధువులే! రింగుల జుట్టు మీ భార్యకు ఇష్టమైనప్పటికీ ఆటకోసం త్యాగం చేశారు. కొందరు మిమ్మల్ని జస్ట్ కమెడియన్ అన్నా, మీ కామెడీ వారికి రుచించలేదని నిందించినా మీరు కుంగిపోలేదు. కమెడియన్ అనే బిరుదును గర్వంగా ధరించి ధీటుగా జవాబిచ్చారు. ఎవరికీ తక్కువ కాదుఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కమెడియన్ మాత్రమే కాదు, అన్నీ చేయగలిగే కంప్లీట్ ఎంటర్టైనర్గా ఆవిష్కరించుకున్నారు. మిమ్మల్ని వేలెత్తి చూపినవారు కూడా ఈ విషయం ఒప్పుకోక తప్పదు. రెండుసార్లు మెగా చీఫ్గా, అందరికంటే ముందు ఫైనలిస్టుగా నిలిచి.. ఆటలో, మాటలో, పోటీలో ఎవరికీ తక్కువ కాదని తెలిసేలా చేశారు అంటూ జర్నీ వీడియో చూపించాడు.మనిషిగా నేను గెలిచాఅది చూసి భావోద్వేగానికి లోనైన అవినాష్.. నాకు గొడవపెట్టుకోవడం రాదు. మనసున్న మనిషిగా నేను గెలిచాను బిగ్బాస్. బాగా ఆడే నా ఫ్రెండ్ రోహిణి ఓడిపోతుంటే నాతోపాటు ముందుకెళ్లాలని ఆలోచించాను. కమెడియన్స్ ఎందుకు గెలవకూడదు? అని బిగ్బాస్ నాలుగో సీజన్ నుంచి నాలో మెదులుతున్న ప్రశ్న. కానీ జనాలు అనుకుంటే ఏదైనా అవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిగతావారి జర్నీలు రేపటి ఎపిసోడ్లో ఉండనున్నాయి.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ జస్ట్ కమెడియన్ కాదు! బిగ్బాస్ ఎలివేషన్స్ వేరే లెవల్
కామెడీ తప్ప ఏం చేయగలవ్? ఫినాలేలో అడుగుపెట్టే అర్హత నీకు లేదు.. ఇలాంటి కామెంట్లను తట్టుకుని ఈ సీజన్లోనే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు ముక్కు అవినాష్. నామినేషన్స్లోకి ఒకే ఒకవారం రాగా.. నబీల్ ఇచ్చిన ఎవిక్షన్ షీల్డ్ సాయంతో ఆ వారం గండం గట్టెక్కాడు. తర్వాత మెగా చీఫ్ అయ్యాడు, టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనలిస్ట్ అయ్యాడు. కొందరే స్నేహితులు..ఈ సీజన్కు ఎంటర్టైన్మెంట్ను జోడించిన అవినాష్ తన ప్రయాణాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తెలియని సముద్రం భయాన్ని పెంచితే.. తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది. ఈరోజు మీరీ స్థానంలో నిలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఇంట్లో కొందరే మీకు స్నేహితులైనా అందరూ మీకు ఆప్తులే..జస్ట్ కమెడియన్ కాదుమీ భార్యకెంతో ఇష్టమైన రింగుల జుట్టును ఆటపై ప్రేమతో త్యాగం చేశారు. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కమెడియన్ కాదు.. అన్నీ చేయగలిగే ఎంటర్టైనర్లా మిమ్మల్ని మీరు ఆవిష్కరించారు. అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనం ఇచ్చే దివ్యౌషధం నవ్వు ఒక్కటే! ఆ నవ్వును పంచే మీరు అందరికన్నా ఐశ్వర్యవంతులు అంటూ బిగ్బాస్ అవినాష్పై ప్రశంసలు కురిపించాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణకు కలిసొచ్చిన లక్.. టాప్ 5పై గెలవని సీరియల్ బ్యాచ్
మరో ఐదు రోజుల్లో కంటెస్టెంట్లు ఉండరు, బిగ్బాస్ హౌసూ ఉండదు. ఉన్న నాలుగురోజులైనా టాప్ 5 కంటెస్టెంట్లను, వారి జర్నీని, బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ను ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందామంటే బిగ్బాస్ ఆ ఛాన్సే ఇవ్వట్లేదు. వరుసపెట్టి సీరియల్ ఆర్టిస్టులను పంపిస్తూనే ఉన్నాడు. సీరియల్స్ ప్రమోషన్ జరిపిస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజెవరొచ్చారో నేటి (డిసెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..సీరియల్ బ్యాచ్పై గెలుపువంటలక్క సీరియల్ టీమ్ హౌస్లోకి వచ్చింది. వీరితో ప్రేరణ, అవినాష్ గేమ్ ఆడి గెలిచారు. దీంతో బిగ్బాస్ రూ.10,928 ప్రైజ్మనీలో యాడ్ చేశాడు. తర్వాత మగువ.. ఓ మగువ సీరియల్ టీమ్ హౌస్మేట్స్తో చిట్చాట్ చేసింది. అప్పుడు కూడా అవినాష్ తన కామెడీ యాంగిల్తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అనంతరం అందరూ కలిసి ఓ ఫన్ గేమ్ ఆడారు. ప్రేరణ నోటికి తాళంమ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు ఒకరి చేతిలోని బాక్స్ను మరొకిరి ఇస్తూ పోవాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఎవరి చేతిలో అయితే ఆ బాక్స్ ఉంటుందో దాన్ని తెరిచి అందులో ఏది రాసుంటే అది ఫాలో అయిపోవాలి. అలా మొదటగా ప్రేరణ చేతిలో బాక్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోయింది. అందులో గేమ్ అయిపోయేవరకు ప్రేరణ నోరు తెరవకూడదని ఉంది. ఆమె తరపున అవినాష్ మాట్లాడాలని ఉంది. దెబ్బలు తిన్నాడ్రోయ్రెండో రౌండ్లో అవినాష్ వంతురాగా.. తనకు ఇచ్చిన టాస్క్ ప్రకారం అందరిపై ఫేక్ పొగడ్తలు కురిపించాడు. తర్వాత నిఖిల్ మార్నింగ్ పనులను డ్యాన్స్ రూపంలో చేయగా.. నబీల్ రెండు పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తిన్నాడు. చివర్లో అవినాష్ అందరితో దెబ్బలు తిన్నాడు. అనంతరం మగువ ఓ మగువ టీమ్తో ప్రేరణ, గౌతమ్ టాస్క్ ఆడి రూ.10,0010 గెలిచారు.ప్రేరణకు కలిసొచ్చిన అదృష్టంబీబీ పరివారంపై మా పరివారం ఇప్పటివరకు ఒక్క టాస్క్ గెలిచిందే లేదు! మరి రేపటి ఎపిసోడ్లో అయినా ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి! అలాగే వచ్చిన అందరూ.. హౌస్లో ఒక్క అమ్మాయే ఉందంటూ ప్రతి గేమ్లోనూ తననే సెలక్ట్ చేసుకుంటున్నారు. అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వందశాతం ఉపయోగించుకుంటోంది ప్రేరణ. ఈ టాస్కుల్లో తన కష్టాన్ని చూసి ప్రేరణకు మరిన్ని ఓట్లు పడే అవకాశం లేకపోలేదు. -
ప్రేమ పెళ్లి ముద్దు అన్న నిఖిల్.. అవినాష్ను ఆడుకున్న బిగ్బాస్
నామినేషన్స్ అయిపోయాయి. బిగ్బాస్ హౌస్లో టాప్ 5 ఫైనలిస్టులు మాత్రమే మిగిలారు. ఈ చివరివారంలో కూడా ప్రైజ్మనీ పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ గేమ్స్లో గెలవకపోతే ప్రైజ్మనీ కట్ అవుతుందన్నాడు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సీరియల్ పరివారం వర్సెస్ బీబీ పరివారంసీరియల్ సెలబ్రిటీలు బిగ్బాస్ హౌస్కు వస్తారని చెప్పాడు బిగ్బాస్. మా సీరియల్ పరివారంతో బీబీ పరివారం పోటీపడి ఆటలు ఆడి గెలిచి ప్రైజ్మనీని పెంచుకోవచ్చన్నాడు. ఓడిపోతే ప్రైజ్మనీ కూడా తగ్గుందన్నాడు. మొదటగా నువ్వుంటే నా జతగా సీరియల్ టీమ్ అర్జున్ కళ్యాణ్, అను హౌస్లోకి వచ్చారు. వీరితో ఆడాల్సిన గేమ్కు రూ.12,489 ప్రైజ్మనీ నిర్ణయించారు. ఒగ్గుకథ చెప్పిన అవినాష్ఈ ఆటలో సీరియల్ పరివారంతో నబీల్-ప్రేరణ ఆడి గెలిచారు. అలా పన్నెండువేల రూపాయల్ని ప్రైజ్మనీలో యాడ్ చేశారు. తర్వాత అవినాష్ టాప్ 5 ఫైనలిస్టులపై ఒగ్గుకథ చెప్పి అలరించాడు. ఇప్పుడెలాగూ చేసేదేం లేదని కాసేపు దాగుడుమూతలు ఆడారు. ఈ క్రమంలో అవినాష్ యాక్షన్ రూమ్లో దాక్కున్నాడు. ఇంతలో బిగ్బాస్ ఆ గదికి తాళం వేసి లైట్లు ఆఫ్ చేశాడు. కాసేపటికి ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల శబ్దం ప్లే చేశాడు.అవినాష్ను ఆటాడుకున్న బిగ్బాస్దీంతో అవినాష్ దడుసుకుని చచ్చాడు. తలుపు తీయండి బిగ్బాస్ అని వేడుకున్నా కనికరించలేదు. దెయ్యం కేకలు, కాంచన అరుపుల సౌండ్స్ వినిపించడంతో అవినాష్ ఏడ్చినంత పని చేశాడు. చివరకు గది తాళం తీయడంతో బయటకు పరిగెత్తాడు. అతడిని చూసి హౌస్మేట్స్ అందరూ ఘొల్లుమని నవ్వారు.ప్రేమ వివాహం చేసుకుంటా: నిఖిల్అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ నుంచి ప్రభాకర్, ఆమని వచ్చారు. తమ సీరియల్ స్టోరీలైన్ గురించి చెప్తూ హౌస్మేట్స్ను మీలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అడిగారు. అందుకు నిఖిల్.. ప్రేమవివాహం చేసుకుంటానన్నాడు. పెద్దలను ఒప్పించాకే తన పెళ్లి జరుగుతుందన్నాడు. ఇక ప్రభాకర్- ఆమనితో ప్రేరణ - అవినాష్ బాల్స్ గేమ్ ఆడారు. ఇందులో సీరియల్ పరివారంపై బీబీ పరివారం గెలిచి రూ.15,113 పొందారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్కు హ్యాట్సాఫ్ చెప్తూ.. నిఖిల్ను విలన్ చేసిన రోహిణి
ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగార్జున బాంబు పేల్చాడు. వచ్చేవారం ఫినాలే జరగబోతుందని తెలిపాడు. ఇక ఇన్నివారాల ప్రయాణంలో ఏ విషయంలో రిగ్రెట్ ఫీలయ్యారు? అది ఏ వారమో చెప్పాలన్నాడు నాగ్. మరి ఎవరెవరు ఏమేం చెప్పారో నేటి (డిసెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..మెగా చీఫ్ నా కొంప ముంచిందిమొదటగా అవినాష్.. 12వ వారంలో నేను మెగా చీఫ్గా ఉన్నప్పుడు విష్ణు, రోహిణి మధ్య గొడవను పరిష్కరించలేకపోయానన్నాడు. ప్రేరణ.. పదకొండోవారంలో నేను మెగా చీఫ్గా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయాను. దానివల్ల నాకు, హౌస్మేట్స్కు ఎఫెక్ట్ అయిందని చెప్పుకొచ్చింది. నబీల్.. తొమ్మిదో వారంలో మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ, ఏదో బాధలో ఉండటంతో ఆ అవకాశాన్ని ఈజీగా వదిలేసుకుని తప్పు చేశానన్నాడు. ఎందుకంత తుత్తర? ఈ సందర్భంగా నాగ్.. టాస్కులు సరిగా పూర్తిచేయకముందే ఎందుకు గంట కొడతావ్? ఎందుకంత తుత్తర? అని ప్రశ్నించాడు. అలాగే ఫైనలిస్ట్ అవడానికి చెక్పై రూ.15 లక్షలు రాసి, దాన్నెందుకు చించేశావని సూటిగా అడిగాడు. మొదట నా స్వార్థం కొద్దీ రాశాను కానీ తర్వాత మనసొప్పకపోవడంతో దాన్ని చింపేశానని తెలిపాడు. రోహిణి వంతురాగా పదోవారం ఎవిక్షన్ షీల్డ్ గేమ్లో అవినాష్ గుడ్డు పాము నోట్లో వేసినందుకు ఎన్నోసార్లు బాధపడ్డానంది. పృథ్వీతో ఫ్లర్ట్ చేశావిష్ణుప్రియ వంతురాగా.. పృథ్వీతో ఫ్లర్ట్ చేయడం వల్ల అతడి గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమోనని బాధపడుతున్నాను. అలాగే తొమ్మిదో వారంలో నేను చీఫ్ అయినప్పుడు ఐదుగుర్ని నామినేట్ చేయమన్నారు. అప్పుడు నబీల్ను నామినేట్ చేసినందుకు రిగ్రెట్ అయ్యానంది. గౌతమ్.. ఆరో వారంలో కామెడీ టాస్క్లో నన్ను అశ్వత్థామ అన్నందుకు ఫీలయ్యాను. అది నామినేషన్స్ దాకా వెళ్లింది. అక్కడ ఫీలయ్యాను అని చెప్పాడు. సారీ చెప్పాలి కదా!ఈ సందర్భంగా నిఖిల్తో గొడవ గురించి అడిగాడు నాగ్. నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనడంతో నేనూ నోరు జారానన్నాడు. వాడుకున్నావ్ అనేది ఎంత పెద్ద మాటో తెలుసా? అని నాగ్ చెప్తుంటే గౌతమ్.. తాను చేసింది తప్పని, కానీ వేరే ఉద్దేశంలో అనలేదన్నాడు. తప్పు ఎలా చేసినా తప్పే.. మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి కదా అని క్లాస్ పీకడంతో గౌతమ్ మరోసారి నిఖిల్ను అందరి ముందు క్షమాపణలు కోరాడు.వీడియోతో క్లారిటీనిఖిల్ వంతు రాగా.. ఎన్నడూ నోరు జారని నేను పద్నాలుగోవారంలో గౌతమ్పై నోరు పారేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నానన్నాడు. రంగుపడుద్ది టాస్క్లో గౌతమ్ నిఖిల్ను కావాలని కొట్టాడా? లేదా? అనేది వీడియో ప్లే చేసి చూపించాడు. అది అనుకోకుండా తగిలిందని క్లారిటీ రావడంతో నిఖిల్ సైతం అతడికి సారీ చెప్పాడు. తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో అవిష్ను గెస్ చేయమన్నాడు నాగ్. అవినాష్ ఊహించిందే నిజమైందిఫస్ట్ టైమ్ నామినేషన్స్కు రావడం పెద్ద మైనస్.. కాబట్టి రోహిణి ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశాడు. అతడు చెప్పిందే నిజమైంది. రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే హౌస్లో ఆమె మాటతీరు, ఆటతీరును ప్రశంసిసిస్తూ చప్పట్లు కొట్టి, సెల్యూట్ చేసి మరీ సెండాఫ్ ఇచ్చారు. స్టేజీపైకి వచ్చిన రోహిణి.. అవినాష్, గౌతమ్, ప్రేరణను హీరోలుగా పేర్కొంది. ఆ ముగ్గురు హీరోలు: రోహిణిగౌతమ్తో.. వైల్డ్ కార్డ్గా వచ్చిన మొదటివారమే ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్లొచ్చావ్.. అలా ఎందుకు జరిగిందన్న ఆలోచనతో ఆ తర్వాతి వారం నుంచి నువ్వు ఆడిన విధానానికి హ్యాట్సాఫ్. సోలో.. సోలో అంటూ ఫైనల్కు వచ్చేశావ్.. ఫ్రెండ్స్తో ఉండటం తప్పేం కాదు, అందరికీ కాసేపు సమయం కేటాయించు సలహా ఇచ్చింది. విష్ణు, నబీల్, నిఖిల్ను విలన్లుగా పేర్కొంది. ట్రోఫీ గెలవకపోయినా రోహిణి సగర్వంగా విన్నర్లా బయటకు వెళ్లిపోయింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ త్యాగం వృథా.. విన్నర్ను చేయమంటూ విష్ణు రిక్వెస్ట్
బిగ్బాస్ సీజన్ ఎండింగ్కు వచ్చేసింది. విన్నర్గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలంటే తాను పెట్టే టాస్కులు గెలవాలన్నాడు బిగ్బాస్. అలా మొన్న ప్రేరణ, నిన్న నబీల్, నేడు విష్ణుప్రియ ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందరు. ఆమె ఎలా గెలిచింది? ఏం మాట్లాడిందన్నది నేటి (డిసెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..అదరగొట్టిన గౌతమ్బిగ్బాస్ ఈ రోజు మొదటగా పవర్ ఫ్లాగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్నవారు ఆ రౌండ్లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచి నబీల్ను రేసు నుంచి తప్పించాడు. తర్వాతి రౌండ్లలో కూడా గౌతమ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఆట కొనసాగింది. గౌతమ్ దగ్గరి నుంచి జెండా లాక్కునేందుకు అందరూ కలిసి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా మిగతా రెండు రౌండ్లలో గౌతమ్.. ప్రేరణ, నిఖిల్ను తీసేశాడు.గౌతమ్ దూకుడుకు బ్రేక్ వేసిన రోహిణితర్వాతి రౌండ్లో మిగిలినవాళ్లు గౌతమ్ను లాక్ చేశారు. అలా అతడి దగ్గరి నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్ను రేసులో నుంచి తొలగించింది. అనంతరం అవినాష్.. విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివర్లో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్గా నిలిచింది. తనకోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది.ఆగమైన సంచాలక్బిగ్బాస్ నిలబెట్టు-పడగొట్టు అనే రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోను వేస్ట్ బాక్స్లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయాడు. దీంతో సంచాలక్ రోహిణి.. నబీల్ను విజేతగా ప్రకటించింది. ఇక్కడే బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ సరిగానే ఆడారా? అని ప్రశ్నించాడు. విష్ణు గెలుపుదీంతో ఆలోచనలో పడ్డ రోహిణి.. టాస్క్ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరూ సరిగా ఆడనట్లు గుర్తించింది. చర్చోపచర్చల అనంతరం విష్ణు గెలిచినట్లు తెలిపింది. రోహిణి, విష్ణుప్రియలో ఎవరు ఓట్ అప్పీల్ చేయాలో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అవినాష్ మినహా మిగతా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం పొందింది.మహిళా విజేతగా నిలవాలనుందివిష్ణుప్రియ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా వివిధ షోలలో నన్ను చూసి, ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నన్నుగా ప్రేమించి పద్నాలుగువారాల వరకు తీసుకొచ్చినవారికి థ్యాంక్స్. నా ప్రవర్తన నచ్చనివారికి సారీ.. ఇంకా ఒక్కవారమే ఉంది. మీ ప్రేమాభినాలు ఇలాగే కొనసాగించి నన్ను విజేతను చేస్తారని కోరుకుంటున్నాను. వీలైనంతవరకు నిజాయితీగా ఉన్నాను. బిగ్బాస్ చరిత్రలో మహిళా విజేత అవ్వాలన్నది నా కోరిక.. అందుకు మీ సాయం కావాలి. మీ ఓటే నా గెలుపు అని ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించింది.సంగీత కచేరీఇక టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. జామర్స్ బ్యాండ్ను పిలిచి లైవ్ కన్సర్ట్ ద్వారా వినోదాన్ని పంచాడు. సంగీతంతో హౌస్మేట్స్ తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యారు. పాదమెటు పోతున్నా.. అనే ఫ్రెండ్షిప్ పాటకైతే అందరూ కలిసిపోయి డ్యాన్స్ చేయడం కన్నులపండగ్గా ఉంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ను తప్పుపట్టిన బిగ్బాస్.. అయినా అతడిదే గెలుపు!
ప్రేరణ ఆటలో గెలిచింది. కానీ సంచాలకురాలిగా మాత్రం తడబడింది. నిన్న ప్రేరణ ఓట్లు అడిగే ఛాన్స్ పొందగా నేడు ఆ అదృష్టం నబీల్ను వరించింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..అడ్డదిడ్డంగా చుట్టేసిన నబీల్ఓట్ అప్పీల్ గెలిచేందుకు బిగ్బాస్ క్రాసింగ్ పాత్ అనే మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో నబీల్ అడ్డదిడ్డంగా తన తాడును పోల్కు చుట్టేసి అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత రోహిణి గంట కొట్టింది. అనంతరం ప్రేరణ, గౌతమ్, నిఖిల్ వరుసగా గంట కొట్టారు. అయితే నిఖిల్ తన పోల్కు బదులు వేరేవారి పోల్కు తాడు చుట్టాడు. దీంతో నాలుక్కరుచుకుని మళ్లీ తన పోల్కు తిరిగి చుట్టాడు. విష్ణుప్రియ, అవినాష్ చివరి స్థానాల్లో ఉన్నారు.నేనే గెలిచా: ప్రేరణహౌస్మేట్స్ అందరూ కలిసి ఎవరు గెలిచారో చెప్పాలన్నాడు. నబీల్ తాడు సరిగా చుట్టలేదని, తానే గెలిచానని ప్రేరణ వాదించింది. లేదు, నేనే ఫస్ట్ అని నబీల్ అరుస్తూ ఉండటంతో ఆమె అతడిని ఇమిటేట్ చేసింది. ఇన్నాళ్లూ అవతలివారిని వెక్కిరించిన నబీల్.. తనను ఒకరు ఇమిటేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు. నన్ను వెక్కిరిస్తే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చాడు.నబీల్కు బిగ్బాస్ కౌంటర్చివరకు అందరూ కలిసి నబీల్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పుడు బిగ్బాస్.. మీరు తాడును సరిగా చుట్టారని అనుకుంటున్నారా? అని అడగడంతో అందరూ మనసు మార్చుకుని ప్రేరణ పేరు చెప్పారు. అయినా నబీల్ తనది కరెక్టే అనడంతో మీకు చుట్టడమంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించాడు. దీంతో అతడు కిక్కురుమనకుండా ఉండిపోయాడు.అయోమయం.. గందరగోళంఈ ఆటలో ఎవరు ఓడిపోయారని ప్రేరణను అడగ్గా ఆమె మొదట అవినాష్ పేరు చెప్పింది. గంట కొట్టేశాక మళ్లీ ఆడటం తప్పు కాదా? అని అవినాష్ అడగడంతో ఆమె మనసు మార్చుకుని నిఖిల్ పేరు చెప్పింది. అందుకతడు అభ్యంతరం చెప్పడంతో ఆమె మళ్లీ యూటర్న్ తీసుకుని అవినాష్ పేరు చెప్పి ఇదే ఫైనల్ నిర్ణయమంది. దాంతో అవినాష్ రేసు నుంచి తప్పుకున్నాడు.నబీల్కు ఓట్లు అడిగే ఛాన్స్టర్ఫ్ వార్ అని బిగ్బాస్ మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో చివరివరకు సర్కిల్లో ఉన్నవారు విజేతగా నిలుస్తారు. మొదటగా ప్రేరణను తోసేశారు. తర్వాత వరుసగా గౌతమ్, నిఖిల్, రోహిణిని తోసేశారు. చివర్లో నబీల్, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ పొందాలో ఇంటిసభ్యులు నిర్ణయించాలన్నాడు. అందరూ కలిసి నబీల్ను సెలక్ట్ చేశారు.ప్రాణం పోయినా సరేనని..నబీల్ మాట్లాడుతూ.. నేనొక సామాన్యుడిని. సినిమాల్లో నటుడవ్వాలని కలలు కన్నాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఎవరో అవకాశాలివ్వడమేంటని సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. తొమ్మిది సంవత్సరాల్లో నాకు వచ్చిన పెద్ద అవకాశం బిగ్బాస్. ప్రాణం పోయినా సరే అని టాస్కులు గెలవాలని ఆడాను. నన్ను విజేతగా చూడాలన్నది మా అమ్మ కల. దాన్ని మీరే నిజం చేయాలి అంటూ ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించాడు.ఎన్నాళ్లకెన్నాళ్లకు..అనంతరం ప్రముఖ చెఫ్ సంజయ్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్మేట్స్తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. అలాగే వారికోసం రుచికరమైన భోజనం వండి మరీ తీసుకొచ్చాడు. నిఖిల్, గౌతమ్ మధ్య దూరాన్ని చెరిపేస్తూ ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోమన్నాడు. స్టార్టర్, బిర్యానీ, ఐస్క్రీమ్స్ అన్నీ కడుపారా తిన్న కంటెస్టెంట్లు ఇది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమంటూ ఫుల్ ఖుషీ అయ్యారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని వాడుకున్నావ్.. నోరు జారొద్దంటూ నిఖిల్ వార్నింగ్
బిగ్బాస్ హౌస్లో ఏడుగురు మిగిలారు. టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో అతడు మినహా మిగతా ఆరుగురు నామినేషన్స్లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్బాస్. తర్వాత హౌస్మేట్స్తో ఓ గేమ్ ఆడించాడు. ఈ రేసు నుంచి తొలగించాలనుకుంటున్న కంటెస్టెంట్ల ఫోటోలను కాల్చాల్సి ఉంటుంది. విష్ణు ఫోటో కాల్చిన అవినాష్ముందుగా అవినాష్.. విష్ణుప్రియ ఉండకూడదనుకుంటున్నట్లు చెప్పాడు. గేమ్ అంటే టాస్కులు మాత్రమే కాదు పర్సనాలిటీ కూడా అని చెప్పావు. గేమ్స్ ఆడుతున్నాం.. కానీ అది ఎలా ఆడుతున్నామనది ముఖ్యం అని నొక్కి చెప్పాడు. తర్వాత నిఖిల్, గౌతమ్ మధ్య వార్ మొదలైంది. పృథ్వీ, నేను.. ఇలా ఎవరో ఒకరు అవతల వ్యక్తిని అగౌరవపరిస్తే తప్పు.. కానీ నువ్వు చేస్తే మాత్రం ఒప్పా? అని నిఖిల్ ప్రశ్నించాడు. ఒప్పని నేనెప్పుడు చెప్పానని నిలదీశాడు. నీ ప్రవర్తనతోనే తెలిసిపోతుందని నిఖిల్ కోపంతో ఊగిపోయాడు.కోపంతో ఊగిపోయిన నిఖిల్ఇన్ని రోజులు ఈ స్వరంతో ఎందుకు మాట్లాడలేదు? అని గౌతమ్ అడగ్గా.. ఎందుకంటే ఇదే చివరి ఛాన్స్.. నువ్వు చేసిందంతా బయటకు రావాలి కదా అని బదులిచ్చాడు. ఇలా మాటామాటా అనుకునే క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు అని పెద్ద నింద వేశాడు. నువ్వు ఏదిపడితే అది అంటుంటే వినడానికి రాలేదు, ఇంకోసారి నోరుజారితే వేరేలా ఉంటుంది అని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ ఎలిమినేట్.. నిజాయితీగా ఎలా ఉండాలో నేర్చుకోమన్న విష్ణు
ఈరోజు మొదటగా గౌతమ్ను సేవ్ చేశాడు నాగార్జున. తర్వాత ఓ ఫన్ గేమ్ కోసం హౌస్మేట్స్ను రెండు టీమ్స్గా విడగొట్టాడు. అవినాష్, రోహిణి, నబీల్, గౌతమ్ ఒక టీమ్ కాగా మిగతావారంతా విష్ణుప్రియ టీమ్గా విభజించాడు. హుక్ స్టెప్ వేస్తే ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలన్నదే గేమ్. ఇందులో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. మరి తర్వాత ఏం జరిగిందో నేటి (డిసెంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..షాక్లో ప్రేరణఈ వారం ప్రేరణ సేవ్ అవుతుందని కలలో కూడా అనుకోలేదేమో! ఆమె సేవ్ అయినట్లు చెప్పగానే నమ్మలేనట్లు నోరెళ్లబెట్టింది. వెంటనే తేరుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆ వెంటనే నిఖిల్ను సైతం సేవ్ చేశాడు. తర్వాత కళ్లకు గంతలు కట్టి మ్యూజికల్ చెయిర్ గేమ్ ఆడించాడు. ఇందులో నిఖిల్, అవినాష్ను సంచాలకులుగా పెట్టారు. ఇందులో పృథ్వీ గెలిచాడు.టాప్ 8 కోసం స్పెషల్ పోస్టర్స్హౌస్లో ఉన్న ఎనిమిది కోసం బిగ్బాస్ స్పెషల్ పోస్టర్స్ క్రియేట్ చేశాడు. అలా నబీల్ కోసం డబుల్ ఇస్మార్ట్, విష్ణుప్రియ కోసం నిన్ను కోరి, పృథ్వీ కోసం యానిమల్, గౌతమ్ కోసం ఏక్ నిరంజన్, రోహిణి కోసం అరుంధతి, ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్కు ద ఫ్యామిలీ స్టార్, అవినాష్ కోసం సుడిగాడు పోస్టర్స్ వేశాడు.ఎక్స్ట్రాలు చేయకుండా ఉండటం ఎలా?అనంతరం నబీల్ను సేవ్ చేసినట్లు ప్రకటించాడు. నెక్స్ట్ ఓ చిన్న టాస్క్ పెట్టాడు. కొన్ని టైటిల్స్ రాసున్న బుక్స్ను హౌస్మేట్స్కు అంకితమివ్వాలన్నాడు. ఎక్స్ట్రాలు చేయకుండా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని ప్రేరణ.. అవినాష్కు డెడికేట్ చేసింది. సరైన కారణాలు లేకుండా నామినేట్ చేయడం ఎలా? పుస్తకాన్ని గౌతమ్ నిఖిల్కు ఇచ్చాడు.బ్రెయిన్ వాడమన్న అవినాష్బ్రెయిన్ వాడి ఆడటం ఎలా? పుస్తకాన్ని అవినాష్.. విష్ణుప్రియకు ఇచ్చాడు. సపోర్ట్ కోరుకోకుండా ఉండటం నేర్చుకో అన్న పుస్తకాన్ని నబీల్.. రోహిణికి డెడికేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా? అనేది అవినాష్కు ఇచ్చాడు పృథ్వీ. నిజాయితీగా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని విష్ణు.. అవినాష్కు ఇచ్చింది.పృథ్వీ ఎలిమినేట్ఒక్కరిని టార్గెట్ చేయకుండా ఉండటం ఎలా? అన్న బుక్ను నిఖిల్.. అవినాష్కు ఇచ్చాడు. తర్వాత నాగార్జున విష్ణును సేవ్ చేసి పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దాంతో విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు గొప్ప మనిషివి పృథ్వీ, ఐ మిస్ యూ అంటూ ఏడ్చేసింది.కన్నీళ్లు పెట్టుకున్న పృథ్వీఅటు స్టేజీపైకి వచ్చిన పృథ్వీ తన జర్నీ చూసుకుని ఎమోషనలయ్యాడు. కాసేపటికి తేరుకున్నాక హౌస్మేట్స్తో మాట్లాడాడు. నిఖిల్, నబీల్, విష్ణు సూపర్ హిట్ అని.. రోహిణి, అవినాష్ సూపర్ ఫ్లాప్ అని చెప్పాడు. నిఖిల్, నబీల్, విష్ణు, ప్రేరణకు తప్పకుండా ఓటేస్తానన్నాడు. చివర్లో నాగార్జున ఓ సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఈ సీజన్ విజేతకు ట్రోఫీ, ప్రైజ్మనీతో పాటు బ్రాండెడ్ కారు కూడా లభిస్తుందని చెప్పాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ
నాగార్జున వచ్చీరావడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. అయితే టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకుని నేరుగా ఫైనల్కు వెళ్లిపోయాడని గుడ్న్యూస్ చెప్పాడు. అంతేకాదు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ అతడికి ఓ ట్రోఫీ కూడా ఇచ్చారు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నోరు తీపి చేసిన బిగ్బాస్ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ను మనసులో కోరిక చెప్పమనగా.. మందు బాటిల్స్, స్వీట్స్ కావాలంటూ చిట్టా బయటపెట్టాడు. మందు కుదరదు కానీ స్వీట్స్తో సరిపెట్టుకోమంటూ బిగ్బాస్ గులాబ్జామూన్ పంపించి హౌస్మేట్స్ నోరు తీపి చేశాడు. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్లో అతడికి హౌస్మేట్స్ పెట్టిన బ్యాడ్జ్ ప్రకారం రూ.4 లక్షలు ప్రైజ్మనీలో యాడ్ చేశారు. అలా ప్రైజ్మనీ రూ.54,30,000కి చేరింది.బ్లాక్ టికెట్.. గోల్డెన్ టికెట్తర్వాత నాగ్.. హౌస్లో కొందరికి బ్లాక్ టికెట్, మరికొందరికి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలని నిఖిల్ను అడగ్గా తేజ పేరు చెప్పాడు. గౌతమ్ వంతు రాగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగా ప్రవర్తించలేదని ప్రేరణ పేరు సూచించాడు. దీంతో ఆమె ఫౌల్ గేమ్ ఆడిన వీడియో నాగ్ ప్లే చేశాడు. ఇలా ఆడితే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నట్లు క్లాస్ పీకాడు. రోహిణి.. ఫౌల్ గేమ్ ఆడాడంటూ పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గేమ్స్ గెలిస్తే టైటిల్ రాదు!అవినాష్.. నబీల్కు, తేజ.. విష్ణుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎవరు ఈ సీజన్ విన్నర్ అనుకుంటున్నావని విష్ణును అడగ్గా తనే గెలుస్తానంది. గెలవాలంటే ఈ ఆట సరిపోదుకదా అని నాగ్ అంటుంటే.. ఆటలన్నీ గెలిచినవారు టైటిల్ సాధించినట్లు బిగ్బాస్ చరిత్రలోనే చూడలేదని వేదాంతం చెప్పింది. అది తప్పని, జనాలు.. ఆట, మాట.. ఇలా ప్రతి ఒక్కటి చూస్తారని స్పష్టం చేశాడు.గౌతమ్కు గోల్డెన్ టికెట్ప్రేరణ.. గౌతమ్కు బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గౌతమ్ అందుకు అర్హుడంటూ నబీల్, విష్ణు, పృథ్వీ, నిఖిల్ కూడా చేయెత్తారు. అప్పటివరకు హౌస్మేట్స్ చెప్పిన అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటూ పోయిన నాగార్జున.. గౌతమ్కు మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అలాగే రోహిణి, నిఖిల్, అవినాష్కు సైతం గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అనంతరం దమ్ము-దుమ్ము అని ఓ గేమ్ ఆడించాడు. ట్రోఫీని పైకి ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్మయిపోయే వ్యక్తి ఎవరు? అనేది చెప్పాలన్నాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ.. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము అని తెలిపారు. రోహిణి.. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ ఫినాలే వరకు రాకపోవచ్చంది. తేజ.. ఎంటర్టైనర్లు కూడా గెలవగలరని నిరూపిస్తారంటూ అవినాష్ దమ్మున్న ప్లేయర్ అన్నాడు. విష్ణు ఉట్టి దుమ్మున్న ప్లేయర్ అన్నాడు. గౌతమ్.. రోహిణి దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ దుమ్ము అని తెలిపాడు. అవినాష్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ పృథ్వీని దుమ్ము కంటెస్టెంట్గా పేర్కొన్నాడు.గౌతమ్పై కోపాన్నంతా కక్కేసిన తేజతర్వాత తేజ.. గౌతమ్పై తన కోపాన్నంతా కక్కేశాడు. టికెట్ టు ఫినాలే ఆడే క్రమంలో ఓ గేమ్లో గౌతమ్ నా పేరు సెలక్ట్ చేయకపోవడంతో బాధేసిందని, అదే విషయం అతడిని నిలదీశానన్నాడు. నామినేషన్స్లో ప్రేరణతో అంత గొడవైనా కూడా ఆమెనే ఎందుకు సెలక్ట్ చేశాడు? అక్కడ నేను ఫ్రెండ్ కాబట్టి నన్ను సెలక్ట్ చేస్తే అతడికి సోలో బాయ్ అనే ట్యాగ్ పోతుందని వెనకడుగు వేశాడు. ప్రేరణను సెలక్ట్ చేస్తే తనకు మంచి పేరొస్తుందని లెక్కలు వేసుకున్నాడని తెలిపాడు.తేజ ఎలిమినేట్నా మనసుకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోయా.. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా అది నీ ఇష్టం అని గౌతమ్ ఒక్కముక్కలో తేల్చేశాడు. ఇక ప్రేరణ, నిఖిల్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము కంటెస్టెంట్ అని అభిప్రాయపడ్డారు. తేజ ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. అనంతరం నాగార్జున తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. తల్లిని హౌస్లోకి తీసుకురావాలన్న కల నెరవేర్చుకున్నాకే వెళ్లిపోతున్నానంటూ తేజ సంతోషపడితే అవినాష్ మాత్రం కంటనీరు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన తేజతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్మేట్స్ను కూరగాయలతో పోల్చాలన్నాడు. టాప్ 2లో గౌతమ్..అలా అవినాష్ ఉల్లిపాయ అని, ఈ సీజన్లో పెద్ద గెలుపు రోహిణిదేనంటూ బంగాళాదుంపతో పోల్చాడు. విష్ణుప్రియ కాకరకాయ అన్నాడు. ప్రేరణ.. మాట సరిగా లేకపోతే నెక్స్ట్ నువ్వే బయటకు వచ్చేస్తావని హెచ్చరిస్తూ బెండకాయ ఇచ్చాడు. పృథ్వీ.. విష్ణుప్రియను వదిలినట్లు కొన్ని గేమ్స్ కూడా వదిలేస్తున్నావంటూ పచ్చిమిర్చి ట్యాగ్ ఇచ్చాడు. గౌతమ్లో ఎన్ని పొరలుంటాయో వాడికే తెలీదంటూ క్యాబేజీతో పోల్చాడు. అతడు టాప్ 2లో పక్కాగా ఉంటాడనన్నాడు. నబీల్.. గేమ్లో కన్ఫ్యూజ్ అవుతున్నాడని, టాప్ 2లో ఉంటాడనుకుంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చేశాడంటూ టమాటతో పోల్చాడు. నిఖిల్.. ఎమోషనల్గా వీక్ అంటూ అతడికి సోరకాయ ఇచ్చాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇన్నాళ్లకు విష్ణు కళ్లు తెరిపించిన శ్రీముఖి.. పృథ్వీతో కటీఫ్!
వైల్డ్కార్డ్స్కు టికెట్ టు ఫినాలే గెలిచే అర్హతే లేదన్నాడు పృథ్వీ.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవినాష్ టికెట్ టు ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్లు తెరిపించింది శ్రీముఖి. మరి శ్రీముఖి ఏం చెప్పిందో నేటి (నవంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి..నాలుగో కంటెండర్గా తేజరోహిణి, అవినాష్, నిఖిల్ 'టికెట్ టు ఫినాలే' కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్గా ఎన్నుకునే సూపర్ పవర్ ఇచ్చాడు. ముగ్గురూ కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్, రోహిణి.. ఈ ముగ్గురికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ, గౌతమ్తో గొడవపడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం.. దానికి నువ్వు గౌరవమివ్వకపోతే నేనేం చేయలేను అని గౌతమ్ హర్టయ్యాడు.కరెక్ట్ గెస్ చేస్తే రూ.5 లక్షలుఅనంతరం యాంకర్ శ్రీముఖి హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్ టు ఫినాలే కొడతారో గెస్ చేయమని హౌస్మేట్స్తో చిన్న గేమ్ ఆడించింది. కరెక్ట్గా గెస్ చేస్తే రూ.5 లక్షలు ప్రైజ్మనీలో యాడ్ అవుతాయంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటిసభ్యులు చర్చించుకుని నిఖిల్కు రూ.5 లక్షల బ్యాడ్జ్, అవినాష్కు రూ.4 లక్షలు, రోహిణికి రూ.3 లక్షలు, తేజకు రూ.2 లక్షలు అని రాసి ఉన్న బ్యాడ్జ్ ఇచ్చారు.నాకోసం అతడిని వదిలెయ్శ్రీముఖి.. విష్ణుప్రియ కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి మూడు వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒకర్ని ఇష్టపడటం తప్పు కాదు. కానీ ఈ రెండు వారాలు నాకోసం ఆ అబ్బాయి(పృథ్వీ)తో స్నేహం వదిలెయ్. అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయు అని మంచి మాటలు చెప్పింది. ఆశలు పెట్టుకోవద్దని చెప్పా: పృథ్వీఅటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా.. అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకతడు.. నీపై ఆశలు పెట్టుకోవచ్చా? అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయిపోయాక చూసుకుందామని మీ ఇద్దరూ మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు.. పృథ్వీతో తన స్నేహాన్ని పక్కనపెట్టి గేమ్పై ఫోకస్ చేస్తానని చెప్పింది.టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్కు 3, నిఖిల్కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరికోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్, నిఖిల్కు.. కేవలం ఒక్క అడుగుదూరం అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ విజయం సాధించి టికెట్ టు ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్ సంతోషంలో మునిగి తేలాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8: ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే?
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేసింది. డైరెక్ట్గా ఫినాలేలో అడుగుపెట్టేందుకు ఎప్పటిలాగే బిగ్బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇప్పటికే ఈ టాస్క్లో అవినాష్, రోహిణి, నిఖిల్ కంటెండర్లుగా నిలిచారు. నేడు హౌస్లోకి వచ్చిన యాంకర్ శ్రీముఖి వారిలో ఒకర్ని ఫైనలిస్టుగా ప్రకటించనుంది.కిచెన్లో మళ్లీ కయ్యంఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. అయితే ఎప్పటిలాగే మరోసారి కిచెన్లో కయ్యం మొదలైంది. ఒక్కొక్కరికి రెండు దోశలు వేస్తోంది ప్రేరణ. తనకు ఒక చీజ్ దోశ కావాలని రోహిణి అడిగితే అందుకు ప్రేరణ ఒప్పుకోలేదు. చీజ్ దోశ తిన్నవాళ్లు ప్లేన్ దోశ తినలేరంటూ అడ్డు చెప్పింది. దానికి తేజ అభ్యంతరం చెప్పాడు. ఇలా మధ్యలో దూరడం తప్పని ప్రేరణ అనగా.. అందరికీ సమానంగా పెట్టమని చెప్పానంతేనని తేజ బదులిచ్చాడు.టికెట్ టు ఫినాలే ఎవరి సొంతం?తర్వాత శ్రీముఖి హౌస్లో అడుగుపెట్టింది. ఇకపోతే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినట్లు ఓ వార్త వైరలవుతోంది. అదే నిజమైతే ఈ సీజన్లో ఫినాలేలో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ అవినాష్ అవుతాడు. అయితే ఈ వారం గండం గట్టెక్కితేనే అది సాధ్యమవుతుంది. అసలే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. పైగా అవినాష్ నామినేషన్స్లో ఉన్నాడు. ఈ ఒక్కవారం సేవ్ అయ్యాడంటే టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ అయినట్లే! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మలా ప్రేమను పంచాడు, నెత్తిన పెట్టుకున్నాడు: విష్ణుప్రియ లవ్స్టోరీ
అవినాష్ను తక్కువ అంచనా వేసిన నబీల్, ప్రేరణకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఇచ్చిన రెండు గేమ్స్లోనూ అతడే గెలిచి విన్నరయ్యాడు. కంటెండరవ్వాలనుకున్న నబీల్ రేసులోనే లేకుండా పోయాడు. అటు విష్ణుప్రియ... తన మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంది. తన ప్రేమ కహానీని పృథ్వీతో పంచుకుంది. అదేంటో నేటి (నవంబర్ 27) ఎపిసోడ హైలైట్స్లో చదివేయండి..తక్కువ అంచనా వేశారుటికెట్ టు ఫినాలే కోసం హౌస్మేట్స్తో గేమ్స్ ఆడించేందుకు మానస్, ప్రియాంక జైన్ బిగ్బాస్ ఇంట్లోకి వచ్చారు. వీళ్లు ప్రేరణ, నబీల్ను గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేశారు. అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్లో నలుగురు ఆడే ఛాన్స్ ఉందంటూ మరో ఇద్దర్ని ఎంపిక చేయమన్నాడు బిగ్బాస్. దీంతో ప్రేరణ, నబీల్.. ఐక్యూ అంతగా లేదు, బ్రెయిన్ గేమ్ ఆడలేరంటూ అవినాష్, పృథ్వీని సెలక్ట్ చేశారు.సుడోకు గేమ్అలా ఈ నలుగురికి సుడోకు గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్లో ముందుగా నబీల్ గంట కొట్టి గెలిచేసినంత బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే అన్నీ తప్పులతడకగానే ఉంది. ఏ ఒక్కరూ సుడోకు పూర్తి చేయకపోవడంతో బిగ్బాస్ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ అందుకుని అవినాష్ చకచకా సుడోకు పూర్తి చేసి గంట కొట్టాడు. తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ గేమ్ కంప్లీట్ చేశారు. వీళ్లందరికీ బిగ్బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు. అందులో అవినాష్కు 8 బాల్స్, ప్రేరణకు 6, పృథ్వీకి 5, నబీల్కు 4 బంతులు ఉన్నాయి.అవినాష్ గెలుపుపై నబీల్ డౌట్అవినాష్ గెలుపుపై నబీల్ అనుమానపడ్డాడు. తేజ, నువ్వేమైనా సాయం చేశావా? అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదని హౌస్మేట్స్ అందరూ క్లారిటీ ఇచ్చారు. అంతా అయిపోయాక నబీల్.. నువ్వు ఆడలేవని అనలేదు, ఎవరైనా సాయం చేశారనిపించి అడిగానంతే.. నీకు కోపం వస్తే అప్పుడే తిట్టాల్సిందంటూ అవినాష్కు సారీ చెప్పాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ కలిసి కామెడీ స్కిట్తో కడుపుబ్బా నవ్వించారు.మళ్లీ గెలిచేసిన అవినాష్అనంతరం పృథ్వీ, ప్రేరణ, అవినాష్, నబీల్.. వారు పొందిన బంతులతో నేర్పుగా సాగు- స్కోర్ పొందు అని మరో గేమ్ ఆడారు. ఈ టాస్క్లో అవినాష్ అందరికంటే ఎక్కువగా 43 పరుగులు చేసి గెలిచాడు. పృథ్వీ, ప్రేరణ.. 30 పరుగులు చేయగా, నబీల్ 24 పరుగులు చేశాడు. చివర్లో రెండు బంతుల్ని ఎవరికైనా ఇవ్వొచ్చు అని మానస్, ప్రియాంకకు బిగ్బాస్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాళ్లు అందుకు అంగీకరించలేదు.విష్ణుప్రియ బ్రేకప్ స్టోరీరెండు టాస్కులు గెలిచిన అవినాష్కు కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. నబీల్కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తొలగించారు. చివర్లో విష్ణు, మానస్ కలిసి జరీజరీ పంచె కట్టి.. పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. మాజీ బాయ్ఫ్రెండ్ గుర్తురావడంతో అర్ధరాత్రి పృథ్వీపక్కన చేరి ముచ్చట్లు పెట్టింది విష్ణు. కలలో తనకు మాజీ బాయ్ఫ్రెండ్ వచ్చాడంది. బ్రేకప్ నువ్వు చెప్పావా? అని పృథ్వీ అడగ్గా.. అవును, నేనే బ్రేకప్ చెప్పానంది. తల్లి స్థానమిచ్చా..తెలీకుండా రెండు తప్పులు చేశాడు. నా మంచి కోసమే చేశాడు. నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు. తీరా తెలిశాక నేను నిజంగా భరించలేకపోయాను. నాకోసమే కొన్ని పనులు చేసినా అవి నాకస్సలు నచ్చలేదు. అవి నా ముఖంపై చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో ఉండకూడదనుకున్నాను, బ్రేకప్ చెప్పాను. కానీ అతడికి నా తల్లి స్థానమిచ్చాను.నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడుకాబట్టి తనను చూడకుండా ఉండలేకపోతున్నాను. అతడు నా బలం. తనను హత్తుకుంటే మా అమ్మను హత్తుకున్నట్లే ఉంటుంది. నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు. అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతడి జ్ఞాపకాలను పృథ్వీతో పంచుకుంది. అయితే అతడెవరనేది మాత్రం బయటపెట్టలేదు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బొక్కబోర్లా పడ్డ నబీల్.. తన సత్తా చూపించిన అవినాష్
టికెట్ టు ఫినాలే కోసం మాజీ కంటెస్టెంట్లు హౌస్లోకి వస్తున్నారు. ఇప్పటికే అఖిల్, హారిక వచ్చి గేమ్స్ ఆడించగా అందులో కమెడియన్ రోహిణి గెలిచి ఫస్ట్ కంటెండర్గా నిలిచింది. తాజాగా హౌస్లో మానస్, ప్రియాంక జైన్ అడుగుపెట్టారు. వీళ్లు పృథ్వీ, నబీల్, ప్రేరణ, అవినాష్తో సుడోకు గేమ్ ఆడించారు. నబీల్ అత్యుత్సాహంఇందులో నబీల్ తాను అందరికంటే ముందు విజయవంతంగా పూర్తి చేసేశాననుకుని సంతోషంతో గెంతులేశాడు. తీరా మానస్ వెళ్లి చూస్తే అక్కడ అన్నీ తప్పులే ఉన్నాయి. ఏ ఒక్కరూ ఈ గేమ్ పూర్తి చేయకపోవడంతో బిగ్బాస్ చిన్న క్లూ వదిలాడు. ఆ క్లూ సాయంతో అవినాష్ అందరికంటే ముందు సుడోకు పూర్తి చేశాడు. అతడి విజయాన్ని జీర్ణించుకోలేకపోయిన నబీల్.. అవినాష్కు ఏమైనా సాయం చేశావా? అంటూ తేజను ప్రశ్నించాడు. కంటెండర్గా మరో కమెడియన్అది విని అవినాష్ షాకవగా.. ఏమో, అక్కడ జనాలు దగ్గరున్నారని అడిగానంటూ తన కుళ్లు, అనుమానాన్ని బయటపెట్టాడు. మొత్తానికి కమెడియన్ అవినాష్ తనకు ఇచ్చిన టాస్కులు గెలిచి కంటెండర్గా నిలిచాడు. ఎంటర్టైనర్లకు టాస్కులు ఆడి గెలిచే సత్తా కూడా ఉందని రోహిణి, అవినాష్ నిరూపించారు. ఇకపోతే ఈరోజు నబీల్కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి అతడిని రేసులో నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్
నామినేషన్స్లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఫైర్ లేదుబిగ్బాస్ హౌస్లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్లో తప్ప గేమ్లో ఫైర్ లేదంటూ గౌతమ్ను నామినేట్ చేశాడు. నబీల్తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.ఆ ఫోకస్ గేమ్పై చూపించునీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్ను నామినేట్ చేశాడు.తొడగొట్టిన అవినాష్ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.మాట తప్పావ్: గౌతమ్గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్లో ఫిజికల్ అయ్యావని నిఖిల్ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణతర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్లోనిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్పై వచ్చిన కంప్లైంట్స్..అన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్పై బిగ్బాంబ్ వేసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అతడి నిజస్వరూపం బయటపడాలన్న యష్మి
ఒకరి పొరపాట్లను మరొకరు పేపర్పై రాయాలన్నాడు బిగ్బాస్. తన మీద వచ్చిన ఫిర్యాదు చదివిన కంటెస్టెంట్.. అది ఎవరు రాయాలో గెస్ చేయాల్సి ఉంటుంది. అలా తేజ. తనపై వచ్చిన కంప్లైంట్ చదివాడు. తను మాట్లాడదల్చుకుంది మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను చెప్పేది మాత్రమే నిజమని భావిస్తాడు అని రాసుంది. ఇది కచ్చితంగా విష్ణుప్రియ, యష్మి రాసుంటారని తేజ అభిప్రాయపడ్డాడు.ఫిర్యాదుల గోలఅన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను. చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతుంది. అది నాకు నచ్చదు.. ఈ ఫిర్యాదు తనపై గౌతమ్ చేసి ఉంటాడని యష్మి గెస్ చేసింది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు.. ఫుడ్ విషయంలో అందరికోసం ఆలోచించు అని గౌతమ్కు ఫిర్యాదు వచ్చింది. ఇది విష్ణు, అవినాష్ కంప్లైంట్ చేసుంటారన్నాడు.నిజస్వరూపం చూపించాలిఆటపట్ల ఆసక్తి ఉన్నట్లు అనిపించలేదు, అందర్నీ నిరుత్సాహపరుస్తుంది అని అవినాష్.. విష్ణుప్రియపై కంప్లైంట్ చేశాడు. కామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం అందరికీ చూపించాలి అని యష్మి.. అవినాష్ గురించి రాసింది. ప్రోమోలో చివర్లో పృథ్వీ, యష్మి డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. అయితే యష్మి ఎలిమినేట్ అన్న విషయం ఇదివరకే తెలిసిందే! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్కార్డ్స్ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్ గొప్పతనాన్ని చెప్పిన అమర్, బిగ్బాస్ మాస్టర్ ప్లాన్
కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..మందు తాగుతానన్న యష్మియష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు. టాప్ 5లో ఎవరంటే?తమ కంటెస్టెంట్ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.అవినాష్తో సినిమాసన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్ను డెడికేట్ చేశాడు. అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడుఅలా నిఖిల్కు బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్కు శివమణి, అవినాష్కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్ను 1, నిఖిల్ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్దీప్ వచ్చేశారు. రెండు రోజులు నాతోనేఅమర్దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్రూమ్కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.మగాళ్లపై ఆడాళ్ల విజయంర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్మేట్స్తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.అవినాష్ను సేవ్ చేసిన నబీల్చివరగా అవినాష్, తేజ నామినేషన్లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు. టెన్షన్తో చచ్చిపోయిన తేజబిగ్బాస్ నాలుగో సీజన్లో ఎవిక్షన్ షీల్డ్తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండిమరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్? అంతలోనే ట్విస్ట్
బిగ్బాస్ ఫ్యామిలీ వీక్ సంపూర్ణమైందన్నాడు కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌస్లో వచ్చేవాళ్లు అయిపోయారు కానీ స్టేజీపైకి వచ్చి మాట్లాడేవాళ్లు ఇంకా మిగిలే ఉన్నారు. ఈ రోజు కంటెస్టెంట్ల ఇంటిసభ్యులతో పాటు స్నేహితులు కూడా వచ్చి విజయం నీదేనంటూ ధైర్యం చెప్పనున్నారు.పృథ్వీ సేఫ్కానీ ఈపాటికే ఆ పదిమందిలో ఒకరి ఎలిమినేషన్ కన్ఫామ్ అయిపోయింది. ఈ వారం అవినాష్, తేజ, గౌతమ్, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి నామినేషన్లో ఉన్నారు. పృథ్వీ వెళ్లిపోయే సూచనలున్నాయి, జంట పక్షులు విడిపోవడానికి సమయం ఆసన్నమైందని ఊరించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతెందుకు సండేవరకు ఆగకుండా నేటి ఎపిసోడ్లోనే పృథ్వీ సేవ్ అయ్యాడట!ఎంటర్టైనర్ గుడ్బైఅంటే తన ఓటు బ్యాంక్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలినవారిలో అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు. వైల్డ్కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన ఇతడు నామినేషన్స్ అంటేనే జంకాడు. చివరకు అతడి భయమే నిజమైంది. గేమ్ ఆడి మెగా చీఫ్ అయినప్పటికీ ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేందుకే మొగ్గుచూపారు. ఈ వారం ఎంటర్టైనర్ను ఎలిమినేట్ చేశారు.నబీల్ వల్ల బతికిపోయిన అవినాష్కానీ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు. చివర్లో తేజ, అవినాష్ ఇద్దరూ మిగిలారు. నబీల్తో ఎవిక్షన్ షీల్డ్ బలవంతంగా వాడేలా చేశారు. దీంతో అతడు అవినాష్ కోసం ఎవిక్షన్ షీల్డ్ వాడటంతో అతడు సేవ్ అయిపోయాడట. అలా ఈ వారం నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గాల్లో తేలుతున్న తేజ.. హింట్లు వదిలేసి ప్రేమ పంచిన శ్రీపాద
అమ్మను మించిన సెంటిమెంట్ మరొకటి ఏముంటుంది? మీ అమ్మ రాదు, రానివ్వను అని తేజను భయపెట్టి ఏడిపించిన బిగ్బాస్ చివరకు పట్టువదిలాడు. తల్లిని లోనికి పంపించాడు. దానికంటే ముందు, తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..కటౌట్ తీసేయమన్న బిగ్బాస్ఫ్యామిలీ వీక్ అయిపోంది.. కాబట్టి ప్రేరణ.. తన భర్త శ్రీపాద కటౌట్ను స్టోర్ రూమ్లో పెట్టేయాలన్నాడు బిగ్బాస్. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటికే ఆమె పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్బాస్.. శ్రీపాదను హౌస్లోకి పంపించాడు. అతడు రావడంతోనే భార్య నుదుటన తిలకం దిద్దాడు. వీరికి బ్యూటిఫుల్ డిన్నర్ డేట్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.ప్రేమ కావాలి..అది చూసిన విష్ణు, రోహిణి తెగ ఫీలైపోయారు. విష్ణు అయితే.. పృథ్వీ తనను ప్రేమించట్లేదంటూ బాధపడింది. అతడికి నువ్వంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ కాదు అని యష్మి క్లారిటీ ఇచ్చింది. అయినా సరే నాకు ప్రేమ కావాలని విష్ణు పిచ్చిపట్టినట్లే ప్రవర్తించింది. మరోవైపు శ్రీపాద.. గొడవలన్నింటికీ మూలకారణమైన కిచెన్ నుంచి బయటకు వచ్చేయమని ప్రేరణకు సూచించాడు. తెగేదాక గొడవలు లాక్కురావద్దన్నాడు. లవ్ సాంగ్తర్వాత భార్యతో కలిసి గేమ్ ఆడాడు. ఈ గేమ్ వల్ల కిచెన్ టైమర్కు రెండు గంటలు యాడ్ అయింది. అందరి ఫ్యామిలీస్ వచ్చాయి కానీ తన తల్లి మాత్రం రాలేదని తేజ బెంగపెట్టుకున్నాడు. అనంతరం బిగ్బాస్ సరదాగా లవ్ సాంగ్ ప్లే చేస్తే నిఖిల్-యష్మి, పృథ్వీ-విష్ణు అందులో లీనమై స్టెప్పులేశారు. తర్వాత మెగా చీఫ్ కోసం గేమ్ పెట్టారు. ఇందులో తేజ తప్ప మిగతా అందరూ పాల్గొనాల్సి ఉంటుందన్నాడు. ఏడుస్తుంటే చూడలేకపోతున్నా..ఈ గేమ్లో అవినాష్ గెలిచి మెగా చీఫ్గా నిలిచాడు. తల్లి కోసం తేజ ఏడుస్తూనే ఉన్నాడు. అతడి బాధను అర్థం చేసుకున్న బిగ్బాస్ ఆమెతో ఫోన్ కాల్ మాట్లాడిపించాడు. నేను రావట్లేదని బాధపడకు, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా అని ఫోన్లో ఓదార్చింది. కాసేపటికే నేరుగా ప్రత్యక్షమైంది. అమ్మను చూడగానే తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. గోరుముద్దలుతల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు బాగా ఆడుతున్నావు. ఫినాలేలో చూడాలనుందని తన కోరిక బయటపెట్టింది. అలాగే తను ప్రేమగా వండుకొచ్చిన చికెన్, ఆలుగడ్డ కూరను అన్నంలో కలిపి అందరికీ గోరుముద్దలు తినిపించింది. అమ్మను బిగ్బాస్ షోలో చూపించాలన్న కల నెరవేరిందంటూ తేజ తెగ సంబరపడిపోయాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణ నుంచి హౌస్మేట్స్కు విముక్తి.. కొత్త చీఫ్ ఎవరంటే?
ఏంటో.. బిగ్బాస్ హౌస్లో ఎవరి గ్రాఫ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ ఊహించలేరు. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ అదే వారం బ్యాగు సర్దుకుని వెళ్లాల్సింది. కానీ ఇప్పుడేకంగా విన్నర్ రేసులో నిలబడ్డాడు. వార్ వన్ సైడ్ అయింది, నిఖిల్ ట్రోఫీ ఎత్తడం ఖాయమనుకుంటే అతడికే పోటీ ఇస్తున్నాడు.అంతా తలకిందులువిష్ణుప్రియ.. పృథ్వీపైనే కోపం తెచ్చుకుని రెబల్గా మారిందనుకునేలోపే అతడిని కన్నందుకు థాంక్యూ అంటూ ఏకంగా పృథ్వీ తల్లి కాళ్లపై పడింది. ఎంతో కూల్గా ఉండే తేజ ఈమధ్య ఆవేశం స్టార్గా మారిపోయాడు. చాలామందికంటే ప్రేరణ నయం అనుకునేలోపే ఆమె తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. చీఫ్ అయ్యాక చీప్గా..అందరి మీదా నోరు పారేసుకుని విపరీతమైన నెగెటివిటీ సంపాదించుకుంది. మెగా చీఫ్ అవ్వాలని ఫస్ట్ వీక్ నుంచి ఆశపడింది. ఎట్టకేలకు పదోవారంలో చీఫ్ అయింది.. కానీ చీప్ బిహేవియర్తో తన గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ఆమె.. విష్ణుప్రియ, గౌతమ్లను టార్గెట్ చేయడం జనాలకు అస్సలు మింగుడుపడలేదు. చీఫ్ అయ్యాక తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త చీఫ్గా అవినాష్మొత్తానికి హౌస్లో ఆమె చీఫ్ పదవి ముగిసినట్లు తెలుస్తోంది. ఈసారి అందరూ చీఫ్ పదవి కోసం పోటీపడగా ముక్కు అవినాష్కే ఆ పోస్టు దక్కినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. హౌస్మేట్స్కు ప్రేరణ నుంచి విముక్తి లభించినట్లేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్కు హింట్లిస్తూనే హెచ్చరించిన తల్లి.. గౌతమ్ జోలికి మాత్రం..!
ఫ్యామిలీ వీక్ అంటేనే సంతోషం, దుఃఖం రెండూ కలగలసి ఉంటాయి. అయితే అవినాష్ మాత్రం దుఃఖాన్ని దాచేస్తూ సంతోషాన్ని పంచేందుకే ప్రయత్నించాడు. అటు నిఖిల్ తల్లి.. ఏమాత్రం సంకోచించకుండా చెప్పాల్సిన హింట్లన్నీ చెప్పేసింది. అవేంటో నేటి (నవంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..యష్మికి హింట్ ఇచ్చిన తండ్రితండ్రిని చూడగానే యష్మి.. పప్పా అంటూ సంతోషంతో ఏడ్చింది. కూతుర్ని ఓదార్చిన ఆయన అందరితోనూ కలివిడిగా మాట్లాడారు. తర్వాత కూతురికి అవసరమైనన్ని హింట్లు ఇచ్చాడు. 'నువ్వు నీకోసమే ఆడాలి.. ఇండివిడ్యువల్ గేమ్ ఆడు.. టాస్కులు ఆడకుండా ఊరికే కూర్చుంటే నీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. నువ్వు మనసులో అనుకుంది అందరికీ చెప్పేయకు.. నువ్వు చేయాలనుకుంది నేరుగా చేసేయు. కూతురి తరపున సారీఇన్నివారాలున్నావ్.. నిన్ను స్టేజీపై చూడాలనుంది. నీకోసమే ఆడితే కప్పు గెలుస్తావు.. నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు అని చెప్పాడు. గారాలపట్టికి గోరుముద్దలు కూడా తినిపించాడు. నాన్నతో యష్మి డ్యాన్స్ చేస్తుంటే.. నబీల్కు తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యష్మి తండ్రి ఆడిన గేమ్లో వచ్చిన రూ.21 వేలు ప్రైజ్మనీలో యాడ్ చేశారు. వెళ్లిపోయేముందు.. నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే.. దయచేసి ఎవరూ ఏమనుకోవద్దు అంటూ కూతురి తరపున క్షమాపణలు చెప్పి ఓ మెట్టు పైకి ఎక్కేశాడు. .కుమిలిపోతున్న తేజఆయన వెళ్లిపోతుంటే యష్మితో పాటు తేజ కూడా ఏడ్చేశాడు. అందరి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడుస్తున్న తేజను ఎలా ఓదార్చాలో హౌస్మేట్స్కు అర్థం కాలేదు. అతడి బాధను చూడలేకపోయిన గౌతమ్.. తన ఫ్యామిలీకి బదులుగా తేజ పేరెంట్స్ను పంపించమని బిగ్బాస్ను అభ్యర్థించాడు. అనంతరం నిఖిల్ తల్లి హౌస్లో అడుగుపెట్టింది. ఏయే కారణాల వల్ల నిఖిల్ గ్రాఫ్ పడిపోతుందో.. అవన్నీ పూసగుచ్చినట్లు చెప్పి మార్చుకోమని సూచించింది. నిఖిల్ను జాగ్రత్తపడమన్న తల్లిగ్రూప్ గేమ్ ఆడకు, ఇకపై ఇండివిడ్యువల్గానే ఆడు. నెల రోజులు మాత్రమే ఉంది. G (గౌతమ్)తో ఎక్కువగా ఫైట్, డిఫెన్స్కు వెళ్లొద్దు, నామినేషన్ దాకా అసలే వెళ్లొద్దు అని హింట్లు ఇచ్చింది. తప్పు చేస్తేనే నామినేట్ చేస్తున్నా అని నిఖిల్ సంజాయిషీ ఇవ్వగా.. నీతో జరిగిన దానికే మాత్రమే నామినేట్ చేయు, వేరే వాళ్ల గురించి చేయకు. Y(యష్మి)ని కొంచెం కంట్రోల్ చేయు. ఆమెకు దూరంగా ఉండుP (ప్రేరణ) అనే అమ్మాయి నుంచి కొంచెం దూరంగా ఉండు.. గ్రూపిజం ఆడకు.. నీకోసమే ఆడు అంటూ ఎవరూ ఇవ్వనన్ని హింట్లు ఇచ్చేసింది. తర్వాత ఆమె గేమ్ ఆడి మటన్ సంపాదించింది. తమకు నాన్వెజ్ రావడంతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆమె వెళ్లిపోయాక బిగ్బాస్ హౌస్మేట్స్ అందరికీ ఓ గంటసేపు నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో అనూజ వచ్చి నిద్రలో ఉన్న అవినాష్ను హత్తుకుంది.భార్య కోసం డ్రెస్ మార్చుకున్న అవినాష్భార్యను చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది. అనూజ బ్లాక్ డ్రెస్లో వచ్చిందని వెంటనే అతడు కూడా వెళ్లి డ్రెస్ మార్చుకున్నాడు. బిగ్బాస్ వీళ్లిద్దరికీ కంపారిబులిటీ టెస్ట్ పెట్టాడు. ఈ గేమ్ ద్వారా రూ.51,000 ప్రైజ్మనీ కావాలా? లేదా మూడుగంటలు కిచెన్ టైమింగ్ కావాలా? అని అడిగాడు. అందుకు వీళ్లు ప్రైజ్మనీని ఎంచుకున్నారు. ఇక ఈ దంపతుల కోసం బిగ్బాస్ పెద్ద జే ప్లాన్ చేశాడు. బిగ్బాస్ సర్ప్రైజ్యాక్షన్ రూమ్ను హార్ట్ షేప్ బెలూన్లతో నింపేసి డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. అది చూసి మురిసిపడ్డ అవినాష్.. ఇది తన జీవితంలోనే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇంతలో బిగ్బాస్ అవినాష్ ముచ్చటపడినట్లుగా లైట్లు ఆఫ్ చేశాడు. దాంతో అతడు తన భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. చివరగా అనూజ నవ్వుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ దంపతులకు బిగ్బాస్ సర్ప్రైజ్
ఫ్యామిలీ వీక్లో ఏ కంటెస్టెంట్ అయినా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే! కానీ అవినాష్ మాత్రం అక్కడ కూడా నవ్వించాడు. తన భార్య అనూజ సడన్ ఎంట్రీతో షాకైన అవినాష్కు బిగ్బాస్ మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇద్దరికీ సెపరేట్గా డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న గదిని బెలూన్లతో నింపేశాడు.బిగ్బాస్ సర్ప్రైజ్ఆ సెటప్ చూసి అవినాష్కు దిమ్మతిరిగిపోయింది. ఇది జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ బిగ్బాస్కు థ్యాంక్స్ చెప్పాడు. అయితే అనూజ వచ్చినప్పుడు లైట్లు ఆఫ్ చేయమని అవినాష్ ఇటీవలే సరదాగా బిగ్బాస్తో అన్నాడు. కానీ ఆ పెద్దాయన ఇది సీరియస్గా తీసుకుని నిజంగానే వీళ్లున్న గదిలో లైట్లు ఆఫ్ చేశాడు. దీంతో అవినాష్ తెగ సిగ్గుపడిపోయాడు. మరిన్ని బిగ్బాస్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎంటర్టైనర్లు ఉట్టి జోకర్లేనా? విన్నర్గా పనికి రారా?
రియాలిటీ షో అంటేనే రియల్/నిజ స్వరూపం చూపించడం. ఎలా ఉంటున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం? భావోద్వేగాలను ఎలా నియంత్రించుకుంటున్నాం? ఇలా అన్నీ తెల్లకాగితంలా జనాలకు చూపించాలి. నచ్చినవాళ్లు ఓటేస్తారు, నచ్చనివాళ్లు లెక్క చేయరు .రియల్ ఎంటర్టైనర్స్ఎలాంటి ముసుగు లేకుండా స్వచ్ఛంగా ఉంటూ నలుగుర్ని నవ్వించేవారే రియల్ ఎంటర్టైనర్స్! కానీ ఇప్పటివరకు తెలుగు బిగ్బాస్ చరిత్రలో ప్రేక్షకుల్ని నవ్వించి కప్పు ఎగరేసుకుపోయినవాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. టాస్కులు ఆడినవారు లేదా సింపతీ సాధించినవారు, ఆల్రెడీ ఫ్యాన్బేస్ ఉన్నవాళ్లే విజేతలుగా నిలుస్తూ వస్తున్నారు తప్ప కమెడియన్లు కప్పు అందుకున్న దాఖలాలే లేవు. ఆ ఒక్కటి లేకపోతే అసంపూర్ణమే!అసలు వీళ్లు లేకపోతే బిగ్బాస్ షోనూ ఎవరూ పట్టించుకోరు. అన్నీ ఉన్నా వినోదం లేకపోతే అది సంపూర్ణంగా ఉండదు. అందుకే ఈ సీజన్లో రీలోడ్ పేరిట వైల్డ్కార్డ్స్ను దింపారు. ఇందులో ఎంటర్టైనర్స్ రోహిణి, అవినాష్, తేజ ఉన్నారు. ఫిజికల్ టాస్కులే కాకుండా బుర్రకు పదునుపెట్టే టాస్కుల్లోనూ ఒక అడుగు ముందే ఉన్నారు. వెనకాల గోతులు తవ్వడం, చాడీలు చెప్పడం, కావాలని గొడవపెట్టుకోవడం వంటి ఎన్నో అవలక్షణాలకు వీరు దూరంగా ఉన్నారు. ఈ లెక్కన విజేతగా నిలవడానికి ఆస్కారం ఉన్నవారు!టాప్ 5 మాత్రమేనా?కానీ రియాలిటీలో అది జరగడం లేదు. నిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వీడియో మెసేజ్లో నువ్వు టాప్ 5లో ఉండాలి అని తేజకు అతడి పేరెంట్స్ చెప్పారు. విన్నర్ అనకుండా టాప్ 5 అని ఎందుకన్నారు? అని తేజ అమాయకంగా రోహిణిని అడిగాడు. అప్పుడు రోహిణి కప్పు ఎలాగో రాదని తెలుసుగా.. అందుకే టాప్ 5 అన్నారు. మన పర్సనాలిటీలకు కప్పు రావురా.. ఏదో ఆడుకుంటూ వెళ్లిపోవడమే! నామినేషన్స్లో మేనరిజం చూపిస్తూ అరవడంలాంటివేమీ మనం చేయలేము అని చేదు సత్యాలను వివరించింది. కమెడియన్ విన్నర్ కాకూడదా?అందుకు తేజ.. ఎంటర్టైనర్లను ప్రేక్షకులు విన్నర్లుగా చూడరు అని అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కమెడియన్ విన్నర్ కాకూడదా? అన్న చర్చ మొదలైంది. జనాల్లోనూ ఈ ఆలోచన వస్తే ఎంటర్టైనర్లకు మంచి రోజులు వచ్చినట్లే! View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ మ్యాచ్ఫిక్సింగ్.. బిగ్బాస్ సర్ప్రైజ్లు.. కంటెస్టెంట్ల ఏడుపులు
బిగ్బాస్ హౌస్లో అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. దీపావళికి హౌస్మేట్స్కు వీడియో మెసేజ్ల రూపంలో కానుకలు అందాయి. తర్వాత అందరూ కలిసి సంతోషంగా డ్యాన్సులు వేశారు. దీంతో బిగ్బాస్ హౌస్ ఆనందాల హరివిల్లుగా మారింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అవినాష్తో డీల్నిన్న బిగ్బాస్ ఇచ్చిన బీన్ బ్యాగ్ గేమ్లో మొదట హరితేజ, తేజ ఎలిమినేట్ అయ్యారు. ఆ గేమ్ కొనసాగింపుతో నేటి ఎపిసోడ్ మొదలైంది. ఈ ఆటలో నిఖిల్.. నబీల్ను టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో నబీల్.. నిఖిల్ను మోచేయితో కొట్టాడు. నిఖిల్-ప్రేరణ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని అర్థమైపోవడంతో నబీల్.. అవినాష్తో డీల్ కుదుర్చుకున్నాడు. నిఖిల్ను అవుట్ చేద్దామని.. తర్వాత తాను ఓడిపోయి అవినాష్ను చీఫ్ చేస్తానని మాటిచ్చాడు. అలా చివరకు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు.నబీల్కు స్వీట్లు తినే ఛాన్స్తర్వాత హౌస్లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా అబ్బాయిలు, అమ్మాయిలు అందంగా ముగ్గులు వేశారు. తర్వాత బిగ్బాస్ స్వీట్లు పంపించాడు. ఇక ఈ సీజన్ మొత్తం స్వీట్లు తిననని శపథం చేసిన నబీల్కు ఈ ఒక్కరోజు మాత్రం స్వీట్లు తినవచ్చని బిగ్బాస్ మినహాయింపు ఇచ్చాడు. అనంతరం బిగ్బాస్.. కంటెస్టెంట్ల ఇంటిసభ్యుల వీడియో సందేశాలను చూడవచ్చన్నాడు. ఎమోషనలైన తేజఅయితే ఇక్కడ కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా ప్రతి ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంటుందన్నాడు. అలా మొదటగా నబీల్, పృథ్వీలలో.. నబీల్కు అమ్మ, అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ వచ్చింది. తల్లిని టీవీలో చూడగానే నబీల్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. రోహిణి, తేజలలో ఒకరికే వీడియో ఛాన్స్ అని బిగ్బాస్ చెప్పగా రోహిణి త్యాగంతో తేజకు ఫ్యామిలీ వీడియో ప్లే చేశాడు. తల్లిని స్క్రీన్పై చూడగానే తేజ ఎమోషనలయ్యాడు. యష్మి త్యాగంఅనంతరం నయని, యష్మిలలో ఒకరికే వీడియో ఛాన్స్ ఇవ్వగా నయనికి తల్లి మెసేజ్ ప్లే చేశారు. లైఫ్లో ఎన్నో ఎదుర్కొంటూ ఈ స్టేజ్కు వచ్చావు.. స్ట్రాంగ్గా ఆడు అని తల్లి ధైర్యం చెప్పడంతో నయని కళ్లలో నీళ్లు తిరిగాయి. అవినాష్ త్యాగంతో రోహిణి ఫ్యామిలీ వీడియో చూడగలిగింది. తర్వాత యష్మి త్యాగంతో విష్ణుప్రియ ఆంటీ వీడియో చూసి సంతోషపడిపోయింది. చివరగా యష్మి, అవినాష్, పృథ్వీలో ఒక్కరికే ఛాన్స్ అని చెప్పగా వీరు పృథ్వీ పేరు సూచించారు. అంతా ఏకమై సంతోషంగా..అలా పృథ్వీ తన తమ్ముడి వీడియో చూసి ఖుషీ అయ్యాడు. తర్వాత అందరూ పటాసులు కాల్చి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పండగ పూట హౌస్మేట్స్ను బాధపట్టడం ఇష్టం లేని బిగ్బాస్ సడన్గా అవినాష్, యష్మి, హరితేజ ఫ్యామిలీ వీడియోస్ ప్లే చేశాడు. కూతురిపై బెంగ పెట్టుకున్న హరితేజ.. చిన్నారి భూమిని చూడగానే గుక్కపెట్టి ఏడ్చింది. భావోద్వేగాలతో గుండె భారమైన కంటెస్టెంట్ల కోసం బిగ్బాస్ ప్రత్యేక భోజనం పంపించడం విశేషం.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్టామినా లేదంటూ తేజ కన్నీళ్లు.. గౌతమ్ను మెంటల్ అన్న గంగవ్వ
బీబీ ఇంటికి దారేది గేమ్లో ఎల్లో టీమ్ ఎటూ కాకుండా పోయింది. కనీసం కంటెండర్లు కూడా అవలేకపోయారు. రెడ్ టీమ్లో నుంచి ఒకరు, గ్రీన్, బ్లూ టీమ్ నుంచి ఇద్దరు చొప్పున కంటెండర్లు అయ్యారు. ఇదిలా ఉంటే అవినాష్, రోహిణి వల్లే ఇంటిసభ్యులు పస్తులుండకుండా తినగలిగారు. ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 31)ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఏడుపు అనేది నా ఎమోషన్గేమ్లో కావాలనే ఏడ్చావ్ అంటూ యష్మిపై సెటైర్లు వేశాడు నిఖిల్. ఆ జోకుల్ని సరదాగా తీసుకోలేకపోయిన యష్మి నేను కష్టపడి ఆడాను.. ఏడుపు అనేది నా ఎమోషన్ అని సీరియస్గా బదులిచ్చింది. దీంతో నిఖిల్ చివరకు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే కిచెన్లో వంట చేసుకునేందుకు బిగ్బాస్ టైం కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే కదా! ఈరోజు వంట చేస్తుండగానే ఆ సమయం ముగియడంతో బిగ్బాస్ ఉన్నఫళంగా గ్యాస్ ఆఫ్ చేశాడు.ఆ ఇద్దరిల్లే అందరికీ భోజనం..దీంతో వంట చేసేదెలాగా? అని హౌస్మేట్స్ కంగారుపడ్డారు. అంతలోనే బిగ్బాస్.. ఆ టైం యాడ్ చేయాలంటే అవినాష్, రోహిణి చిన్న పిల్లలుగా మారి నవ్వించాలన్నాడు. ఎంటర్టైన్మెంట్ అనేది వీళ్లిద్దరికీ కొట్టిన పిండి కావడంతో పిల్లల్లా కాదు ఏకంగా చిచ్చర పిడుగుల్లా మారిపోయారు. వీరి వినోదాన్ని చూసి ముచ్చటపడిపోయిన బిగ్బాస్ కిచెన్ టైమర్కు రెండు గంటలపాటు టైం యాడ్ చేశాడు. దీంతో కంటెస్టెంట్లు వంట చేసుకుని తినగలిగారు.గౌతమ్ అవుట్ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్లో తాడోపేడో అని చివరి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో నిఖిల్ తన బ్లూ టీమ్ను గెలిపించాడు. బ్లూ టీమ్ లీడర్ హరితేజ రెండు సార్లు డైస్ రోల్ చేసే ఛాన్స్ పొందింది. అలా డైస్ ద్వారా వచ్చిన మూడు పాయింట్లను నిఖిల్కు ఇవ్వగా ఐదు పాయింట్లు తనకు ఇచ్చుకుంది. వీరికి రెండు ఎల్లో కార్డ్స్ రాగా.. అందులో ఒకటి రెడ్ టీమ్కు, మరొకటి గ్రీన్ టీమ్కు ఇచ్చారు. అలా రెడ్ టీమ్ నుంచి గౌతమ్, గ్రీన్ టీమ్ నుంచి విష్ణుప్రియ ఆటలో నుంచి వైదొలిగారు.కరివేపాకులా తీసిపారేసిన గంగవ్వగేమ్ నుంచి అవుట్ అవడంతో గౌతమ్ డీలా పడిపోయాడు. అదే విషయం విష్ణుప్రియ.. గంగవ్వతో చెప్తే.. అతడికేమైనా మెంటలా? ఎక్కువ ఆవేశపడతాడు. బిత్తిరి అంటూ.. కూరలో కరివేపాకులా తీసిపారేసింది. ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్లో బీబీ ఇంటికి చేరువైన హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజను కంటెండర్లుగా ప్రకటించారు. వీరికి తిరుగుతూనే ఉండు- గెలిచేవరకు అనే గేమ్ పెట్టాడు. ఇందులో పోటీదారులు బ్యాగులు ధరించి సర్కిల్లో తిరుగుతూ ఉండాలి.ఏడ్చేసిన తేజఫస్ట్ రౌండ్లో హరితేజ బాగానే ఆడింది కానీ తన బ్యాగు ఎక్కువ ఖాళీ అవడంతో ఆమె ఆటలో నుంచి అవుట్ అయింది. ఆటలో ఎన్నోసార్లు కింద పడుతూ లేస్తూ ఫైట్ చేసిన తేజ నెక్స్ట్ అవుట్ అయ్యాడు. దీంతో హర్టయిన తేజ.. తనకు స్టామినా ఉంటే బాగుండేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇకపోతే ఈ గేమ్లో ఫైనల్ వరకు అవినాష్ నిలిచి మెగా చీఫ్ పదవి గెలిచాడని తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్పై పగ తీర్చుకున్నారుగా.. కొత్త చీఫ్ ఎవరంటే?
క్లాన్ (టీమ్) గొడవలకు చెక్ పెడుతూ బిగ్బాస్.. ఓజీ, రాయల్ క్లాన్స్ను ఏకం చేసేశాడు. ఇకపై హౌస్ అంతా ఒకే ఒక్క మెగా టీమ్గా ఉంటుందని పేర్కొన్నాడు. వీరికి బీబీ ఇంటికి దారేది అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో భాగంగా హౌస్మేట్స్ను నాలుగు టీమ్స్గా విభజించాడు.పగ తీర్చుకున్న నిఖిల్ టీమ్ఈ క్రమంలో నిన్న రెడ్ టీమ్.. బ్లూ టీమ్కు మొత్తం మూడు ఎల్లో కార్డ్స్ ఇచ్చింది. దీంతో బ్లూ టీమ్లో గంగవ్వను గేమ్ నుంచి సైడ్ చేశారు. తాజా ప్రోమోలో బ్లూ టీమ్ రెడ్ టీమ్పై పగ తీర్చుకుంది. ఇదివరకే ఓ ఎల్లోకార్డ్ ఇవ్వగా ప్రోమోలో మరో ఎల్లో కార్డ్ ఇచ్చారు. దీంతో ప్రేరణ, యష్మి, గౌతమ్.. తమలో ఎవరు సైడ్ అవ్వాలనేదానిపై చర్చించుకున్నారు. చివరకు గౌతమ్ను సైడ్ చేసేశారు.కొత్త చీఫ్ ఎవరంటే?ఇక తాడో పేడో టాస్కులో విజృంభించి ఆడిన నిఖిల్.. టాస్కుల్లో తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈ వారం నిఖిల్ బ్లూ టీమ్లోని సభ్యులే చీఫ్ అయ్యారట. ముక్కు అవినాష్ మెగా చీఫ్ అయినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్: ఇచ్చిపడేసిన నబీల్.. విలన్గా విష్ఱుప్రియ.. దెబ్బకు!
అవినాష్ను స్కానింగ్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగోలేక ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నాడేమోనని హౌస్ మొత్తం ఏడ్చేసింది. కట్ చేస్తే కొన్ని గంటలకే లోనికి వచ్చాడు. నామినేషన్స్ ఈసారి డిఫరెంట్గా జరిగాయి. ముఖ్యంగా మెగా చీఫ్కు ఇది కత్తి మీద సామే అయింది. అదెలాగో తెలియాలంటే నేటి (అక్టోబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హౌస్ మొత్తం ఏడుపుకడుపు నొప్పితో అవినాష్ మెడికల్ రూమ్కు వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యుడు స్కానింగ్ కోసం హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నారు. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను, అందుకే హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అంటూ అవినాష్ హౌస్లో ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే అవి ఎలిమినేట్ అవుతున్నాడనుకుని దాదాపు హౌస్మేట్స్ అందరూ భారంగా ఏడుస్తూ వీడ్కోలు చెప్పారు. అవినాష్ను హాస్పిటల్కు తీసుకెళ్లి స్కాన్ చేయించిన బిగ్బాస్ టీమ్.. అతడిని తిరిగి హౌస్లోకి పంపారు.నామినేషన్స్.. మెగా చీఫ్పై భారంమెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఐదుగురు సభ్యులను నామినేట్ చేసి జైల్లో పెట్టి తాళం వేయాలన్నాడు. చీఫ్ను చేయడంతో పాటు విలన్ను కూడా చేసేస్తున్నారని మనసులో అనుకుంటూనే ముందుగా గౌతమ్ను నామినేట్ చేసింది. లేడీస్ వీక్ అంటూ ఆడాళ్లకు గౌరవమిస్తానంటావ్.. కానీ ఒకరిపై నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అరవడం బాగోలేదని తెలిపింది. అందుకు గౌతమ్.. ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పాయింట్లు వెతకడానికే నీతో ఉన్నాతన పేరు రావడంతో యష్మి గొడవకు దిగింది. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అనేశాడు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. నన్ను అక్కా అని పిలవకు అని యష్మి హెచ్చరించగా అది చూసి విష్ణు పకాపకా నవ్వింది. నాకంటే ఎక్కువపాయింట్లు ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా నామినేట్ చేయవని గౌతమ్.. విష్ణుపై అసహనం వ్యక్తం చేశాడు. నిన్ను నామినేట్ చేయడానికి దగ్గరుండి పాయింట్లు వెతికానంది విష్ణు. ఈమె మాటలు విన్న పృథ్వీ వెటకారంగా నవ్వాడు. మనసు చివుక్కుమంది, అందుకే..నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావ్, అందర్నీ గాలికొదిలేసి నీ కోసమే బజ్జీలు వేసుకున్నావంటూ ప్రేరణను జైల్లో పడేసింది. సంచాలకుడిపై అరవడం వల్ల నా మనసు చివుక్కుమందంటూ తేజను నామినేట్ చేసింది. పృథ్వీ ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో నయనిని సైతం జైల్లో వేసింది. వైల్డ్కార్డ్స్ వచ్చాక నీలో పన్ యాంగిల్ కనిపించడం లేదంటూ నబీల్ను నామినేట్ చేసింది. వెంటనే నబీల్.. నువ్వు పృథ్వీతో ఉంటే నేనెక్కడ కనిపిస్తానంటూ భలే కౌంటరిచ్చాడు. నీలో ఫైర్ ఏముందని నాకు చెప్తున్నావ్ అని తిరిగి ప్రశ్నించాడు. నామినేషన్స్లో రెండో లెవల్అలా విష్ణుప్రియ వల్ల గౌతమ్, ప్రేరణ, నయని పావని, తేజ, నబీల్ నామినేట్ అయ్యారు. మన టీమ్వాళ్లు మెగా చీఫ్ అవ్వాలని ఆడితే ఇప్పుడు నన్నే నామినేట్ చేసిందని నబీల్ ఏడ్చాడు. చేసిందంతా చేసిన విష్ణు.. నబీల్కు సారీ చెప్పింది. తర్వాత నామినేషన్స్లో రెండో లెవల్ మొదలైంది. జైల్లో ఉన్నవారిని విడిపించే అవకాశాన్ని హౌస్మేట్స్కు ఇచ్చాడు. బజర్ మోగిన ప్రతిసారి జైలు తాళం చెవిని పట్టుకున్నవారికి ఒకరిని నామినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి బదులుగా మరొకరిని నామినేట్ చేసి జైల్లో వేయాల్సి ఉంటుంది.ఫైనల్ లిస్ట్ ఇదేమొదటగా పృథ్వీ తాళం అందుకుని.. నబీల్ను జైలు నుంచి విడిపించాడు. అతడి స్థానంలోకి అవినాష్ను పంపించాడు. తర్వాత బజర్కు యష్మి.. ప్రేరణను విడిపించి హరితేజను జైల్లోకి పంపింది. రోహిణి.. అవినాష్ను బయటకు తీసి పృథ్వీని లోనికి పంపించింది. అవినాష్.. తేజను విడిపించి యష్మిని జైల్లో వేశాడు. ప్రేరణ.. పృథ్వీని విడిపించి తేజను లోనికి పంపించింది. ఫైనల్గా ఈ వారం గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేట్ అయినట్లు ప్రకటించారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు
బిగ్బాస్ 8లో ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఇతడు.. ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు ప్రవర్తించాడు. పెద్దగా ఇంప్రెసివ్ అనిపించలేదు. దీంతో ఓట్లు తక్కువ పడి ఎలిమినేట్ అయిపోయాడు. అదే టైంలో అవినాష్ కూడా సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు ఆదివారం ఎపిసోడ్ చివరలో చూపించారు. కానీ అదంతా ఉత్తిదే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)మెహబూబ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బెడ్రూంలోకి వచ్చిన అవినాష్.. రిపోర్ట్ వచ్చింది. కడుపులో ఏదో సమస్యగా ఉంది. మీకు కష్టం అవుతుంది. బయటకు వచ్చేసేయండి అని డాక్టర్స్ చెప్పారు. 'ఏది పడితే చెప్పకు.. అను (అవినాష్ భార్య) మీద ఒట్టేసి చెప్పు' అని నిఖిల్ అడిగేసరికి.. ఫొటోపై ఒట్టేసి మరీ నిజంగానే వెళ్లిపోతున్నా అని అవినాష్ చెప్పాడు. నాపై ఒట్టేసి నిజం చెప్పు అని నయని పావని అడిగినప్పుడు కూడా అవినాష్ అదే చెప్పాడు. 'నొప్పి తట్టుకోలేకపోతున్నా' అని ఏడ్చాడు. హౌస్లో అందరూ ఇతడిని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.అయితే ఇదంతా ప్రాంక్లో భాగంగానే అవినాష్ చేశాడు. సోమవారం ఎపిసోడ్తో ఈ విషయం క్లారిటీ వస్తుంది. 24 గంటల స్ట్రీమింగ్ వల్ల అవినాష్.. తిరిగి ఇంట్లోకి వచ్చిన వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సెల్ఫ్ ఎలిమినేట్ అని చెప్పి అవినాష్.. ప్రాంక్ చేయడం వరకు బాగుంది కానీ మరీ భార్య మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పడమే కాస్త ఇబ్బందిగా అనిపించింది.(ఇదీ చదవండి: మీడియాకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్)#Avinash Back To BB House 😁 Andarini Housemates Ni Kasepu Erri Pap*alni Chesadu Ga 😂😂#BiggBossTelugu8 pic.twitter.com/LbDV2UFXs7— BiggBossTelugu8 (@Boss8Telugu) October 27, 2024 -
హడలెత్తించిన నిఖిల్, పృథ్వీ.. కూతురి కోసం హరి కన్నీళ్లు!
ఫిజికల్ టాస్క్ వస్తే పృథ్వీకి తెలియకుండానే పూనకం వస్తుంది. మనుషుల్ని పిట్టల్లా విసిరేస్తూ, పురుగుల్లా నలిపేస్తుంటాడు. ఈ రోజూ ఇదే జరిగింది. ఈసారి నిఖిల్ తోడయ్యాడు. టాస్కులో ఈ దోస్తులిద్దరూ అరాచకం సృష్టించారు. మరి వీరితో పోటీపడిందెవరు? హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నిఖిల్, పృథ్వీ అరాచకంబీబీ రాజ్యం ఛాలెంజ్ కొనసాగింపుగా నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎనిమిది ధాన్యపు బస్తాలను తోపుడు బండిపై ఎవరు ముందుగా పెడతారో ఆ టీమ్కు రాజ్యంలో వ్యవసాయం దక్కుతుందన్నాడు. ఓజీ టీమ్ నుంచి నిఖిల్, పృథ్వీ విజృంభించి ఆడారు. వారిని అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ చాలావరకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొట్టుకున్నారు, తోసేసుకున్నారు. నానా అరాచకం సృష్టించడంతో బిగ్బాస్ కొన్ని సెకన్లపాటు గేమ్ను పాజ్ చేశాడు. అదుర్స్ అనిపించిన తేజ, అవినాష్అలాగే ఈ ఆటలో పోటీదారులను మార్చుకోవచ్చని వెసులుబాటు కల్పించాడు. అలా గౌతమ్, మెహబూబ్ స్థానంలోకి అవినాష్, తేజ వచ్చారు. వీళ్లు కూడా తమ శక్తికి మించి ప్రయత్నించి ఆడారు. వాళ్లు ఎంతో కష్టపడి ఓ సంచిని బండిపై పెట్టారు. కానీ అది ముందు ఓజీ తోపుడు బండికి టచ్ అయిందంటూ వారికే పాయింట్ ఇస్తానని సంచాలకురాలు యష్మి వితండ వాదం చేసింది. ఒక్క బస్తా కూడా రాయల్ టీమ్ను పెట్టనివ్వకపోవడం నిఖిల్, పృథ్వీల శక్తికి నిదర్శనం.మనలో ఒకరే విన్నర్ఫైనల్గా ఈ గేమ్లో ఓజీ టీమ్ గెలవడంతో వ్యవసాయ భూమి గెలిచారు. అలాగే తన టీమ్లో నుంచి పృథ్వీని మెగా చీఫ్ కంటెండర్గా ప్రకటించారు. ఈ క్రమంలో కంటెండర్ అవ్వాలనుకున్న ప్రేరణకు, యష్మికి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరికీ సర్ది చెప్పిన నిఖిల్.. ఇది మన సీజన్.. మన టీమ్లోని ఒకరే ట్రోఫీ ఎత్తాలి. మనలో మనకు గొడవలొద్దు అని టీమ్ సభ్యులకు హితోపదేశం చేశాడు. ఓడిన రాయల్స్ టీమ్ నుంచి గంగవ్వను మెగా చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు.కూతుర్ని తల్చుకుని హరితేజ ఎమోషనల్వచ్చినప్పటినుంచి మేమే గెలిచాం అని రాయల్స్ ఫీల్ అవుతున్నారు. మనం మిగతా టాస్కులు గెలిచి ఆ పొగరును తగ్గించేయాలని ప్రేరణ.. నబీల్తో అంది. అన్నట్లుగానే తర్వాత టాస్కుల్లోనూ దూకుడు ప్రదర్శించారు. మరోవైపు హరితేజ.. తన కూతురు భూమిని తల్చుకుని ఎమోషనలైంది. అమ్మ గురించి బెంగపెట్టుకోకు, స్కూలుకు వెళ్లు, పిన్నితో ఆడుకో.. వీకెండ్లో నాన్న వస్తాడు. అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు, నీకోసం ఏడవట్లేదు. నువ్వు కూడా ఏడవొద్దంటూనే కన్నీళ్లు పెట్టుకుంది.మళ్లీ ఓజీ టీమ్దే గెలుపుబీబీ రాజ్యంలో సైన్యం, హాస్పిటల్ను పొందడానికి బిగ్బాస్ వైరల్ అటాక్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓజీ టీమ్ నుంచి నిఖిల్, నబీల్ ఆడగా రాయల్ టీమ్ నుంచి గౌతమ్, తేజ ఆడారు. మరోసారి ఓజీ టీమ్ గెలిచి హాస్పిటల్, సైన్యం పొందింది. అలాగే తన టీమ్లో నుంచి నిఖిల్ను మెగా చీఫ్ కంటెండర్గా ప్రకటించారు. రాయల్స్ నుంచి గౌతమ్ను మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్పై మనసు పారేసుకున్న యష్మి, అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!
సమయం దొరికినప్పుడల్లా అవినాష్ అటు హౌస్మేట్స్ను, ఇటు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. అటు తేజ, అవినాష్.. గంగవ్వను దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేయమన్నారు. కానీ గంగవ్వ ఏకంగా జీవించేసింది. ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తిక్క కుదిర్చిన బిగ్బాస్ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని, తన ఆదేశాలను లెక్కచేయట్లేదని బిగ్బాస్ హర్టయ్యాడు. అందుకని ఈ వారం సూపర్మార్కెట్లో షాపింగ్ చేసే సమయాన్ని కాస్త కట్ చేసిపారేశాడు. దీంతో మెగా చీఫ్ గౌతమ్.. నిఖిల్ను మార్కెట్కు పంపించి అతడితో షాపింగ్ చేయించాడు.యష్మి- నిఖిల్ లవ్ ట్రాక్?ఇక యష్మి.. నిఖిల్ను తనతో మాట్లాడమని బతిమాలింది. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే బాగుండేది.. నా వల్ల నీ గేమ్కు ప్రాబ్లం కానివ్వను. నాది పడిపడి చచ్చే క్యారెక్టర్ అయితే కాదు, ఇకపై జస్ట్ ఫ్రెండ్గా ఉంటా అని చెప్పుకుంటూ పోయింది. నిఖిల్ శిలావిగ్రహంలా స్తబ్దుగా కూర్చోవడంతో కోపంతో వెళ్లిపోయింది. ఆమె అలకను తీర్చేందుకు నిఖిల్.. యష్మిని హత్తుకుని ముద్దిచ్చాడు.ఇంకా పృథ్వీ వెనకే పడుతోన్న విష్ణుపృథ్వీ మెడలో గోల్డ్ చెయిన్ చూసి నిలువెత్తు బంగారం.. మళ్లీ బంగారం వేసుకుని తిరగడమేంటో అని మురిసిపోయింది. ఈ మాట విన్న హౌస్మేట్స్ ఇక మా వల్లకాదు, వెళ్లిపోతాం అని జోక్ చేశారు. బిగ్బాస్ కూడా సరే, మీ సరదా నేనెందుకు కాదంటాను అన్నట్లు గేట్లు తెరిచాడు. దీంతో అబ్బాయిలంతా కలిసి అవినాష్ను లాక్కెళ్లి మరీ బయట పడేసేందుకు ప్రయత్నించారు.మనసు మార్చుకున్న బిగ్బాస్అనంతరం బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు అవినాష్ జిమ్ ట్రైనర్గా మారి హౌస్మేట్స్తో చిత్రవిచిత్రమైన కసరత్తులు చేయించి నవ్వించాడు. దీంతో కిచెన్ టైమర్కు మరో రెండు గంటల సమయం యాడ్ చేశాడు. అలాగే మార్కెట్లో మర్చిపోయిన కూరగాయలు, పండ్లను సైతం పంపించి తన మనసు వెన్న అని నిరూపించుకున్నాడు.అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!అవినాష్, తేజ.. గంగవ్వను దెయ్యంలా రెడీ అయి భయపెట్టాలన్నాడు. ఇంకేముంది.. అర్ధరాత్రి గంగవ్వ జుట్టు విరబోసుకుని కేకలు వేయడంతో హౌస్మేట్స్ నిద్రలో నుంచి లేచి జడుసుకున్నారు. ఇది చూసిన తేజ.. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పక్కా అని భయపడిపోయాడు. నిఖిల్, పృథ్వీ, నబీల్ మాత్రం నిద్రలో నుంచి లేవలేదు. అయితే ఇది ప్రాంక్ అని, అవినాష్ చేయించి ఉంటాడని గౌతమ్ అనుమానపడ్డాడు.మెగా చీఫ్ కంటెండర్గా రోహిణిబీబీ రాజ్యం ఏర్పాటు చేసుకునేందుకు రెండు క్లాన్స్ పోటీపడతాయన్నాడు. మొదటగా అక్వేరియంలో నీళ్లను నింపే టాస్కులో రాయల్ టీమ్ గెలిచింది. అందుకు గానూ రాజ్యంలో మంచినీటి సరస్సును పొందారు. అలాగే రాయల్ టీమ్లో నుంచి రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయింది. అలాగే ఓజీ టీమ్లో యష్మి మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకుంది. రోహిణిని కంటెండర్గా సెలక్ట్ చేయడంపై హరితేజ రాద్దాంతం చేసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ సరదా.. నిజంగానే డోర్ తెరిచిన బిగ్బాస్
బిగ్బాస్ హౌసులో ఎనిమిదో వారం నామినేషన్ పూర్తయ్యాయి. మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. మెహబూబ్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, నయని పావని లిస్టులో ఉన్నారు. హరితేజ కూడా నామినేట్ అయింది. కాకపోతే మెగాచీఫ్ గౌతమ్.. సూపర్ పవర్ ఉపయోగించిన ఆమెని తప్పించాడు. ఈ వారానికి సంబంధించి కీలక ఘట్టం ముగియడంతో కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ మొదలుపెట్టారు.(ఇదీ చదవండి: ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత)పృథ్వీ మెడలోని బంగారు గొలుసు గురించి తేజ అడగ్గా.. 'గోల్డ్, గోల్డ్ వేసుకుని తిరగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా' అని విష్ణుప్రియ మధ్యలో దూరి కామెంట్ చేసింది. అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని సరదాగా కామెంట్ చేశారు. అయితే అవినాష్ అన్నప్పుడు బిగ్బాస్ నిజంగానే డోర్ తెరిచాడు. దీంతో అందరూ అతడిని పట్టుకుని మరీ బయటకు తోసేయడానికి ప్రయత్నించారు. ఇదంతా కూడా ఫన్నీగా సాగింది.దీని తర్వాత అవినాష్ జిమ్ ట్రైనర్గా మారి, ఇంటి సభ్యులు వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్పాలని బిగ్బాస్ ఆదేశించాడు. ఆ తర్వాత టేస్టీ తేజతో వర్కౌట్స్ చేయించాడు. ఇదంతా కూడా ఫన్నీగా సాగేసరికి మిగిలిన హౌస్మేట్స్ అందరూ పగలబడి నవ్వారు. పదేపదే అవినాష్, రోహిణి, టేస్టీ తేజతో తప్పితే మిగిలిన వాళ్ల నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది రావట్లేదు. బుధవారం కూడా అవినాష్ తన కామెడీతో నవ్విస్తాడని అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫొటోలతో ప్రభాస్ చెల్లి) -
చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ
హౌస్మేట్స్ ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో తెలియజేసేందుకు నాగార్జున ఓ టాస్క్ పెట్టాడు. మరోవైపు హౌస్లో గౌతమ్ కృష్ణ.. యష్మి అంటే తనకు క్రష్ అంటున్నాడు. అటు బిగ్బాస్ కప్పు గెలుస్తానన్న మణి.. ఇంటికి వెళ్లిపోతానని ఏడ్చాడు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (అక్టోబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..వెళ్లిపోతా..ఈ గొడవలు, కొట్లాటలు నావల్ల కావడం లేదు, వెళ్లిపోతానంటూ కెమెరాల ముందు మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. దయచేసి ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉందామనుకున్నా.. కానీ నా వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై గౌతమ్ క్రష్అటు గౌతమ్.. 'నేను సింగిల్, నీపై నాకు క్రష్ ఉంది.. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్లా ఉందాం. మన మధ్య బాండింగ్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం.. అందరిలో నువ్వు నాకు స్పెషల్' అని యష్మితో మాటలు కదిపాడు. తర్వాత నాగార్జున బీబీటైమ్స్ హెడ్లైన్స్ అని ఓ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లకు సరిపోయే హెడ్లైన్స్ను బోర్డ్పై పెడతాడు. అది నిజంగా ఎంతమేరకు సూట్ అవుతుందన్నది హౌస్మేట్స్ చెప్పాలి. నిన్న హీరో- ఈరోజు జీరోఅలా మొదటగా కండబలం ఎక్కువ- బుద్ధిబలం తక్కువ అన్న హెడ్డింగ్ గౌతమ్కు సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ క్రమంలో నిఖిల్, గౌతమ్ కొట్లాడుకున్న వీడియో చూపించిన నాగ్.. కసిగా ఆడండి కానీ ఉన్మాదంగా ఆడొద్దని హెచ్చరించాడు. నిఖిల్కు నిన్న హీరో- ఈరోజు జీరో అన్న ట్యాగ్ కరెక్ట్గా సరిపోతుందన్నాడు. హరితేజ.. ఒకప్పుడు ఫైర్- ఇప్పుడు ఫ్లవర్లా మారిపోయిందన్నారు.ఆట కంటే నాకు నేనే ముఖ్యంపృథ్వీకి.. 'కింగ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్- వాంట్స్ రెస్పెక్ట్ (అగౌరవపరుస్తాడు కానీ తనను గౌరవించాలనుకుంటాడు)', 'ఆట కంటే నాకు నేనే ముఖ్యం' అన్న రెండు ట్యాగులు సరిగ్గా సూటవుతాయన్నారు. గడ్డం, మీసం తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేశావని నాగ్ ఆరా తీశాడు. పోనీ రూ.5 లక్షలు ప్రైజ్మనీలో యాడ్ చేస్తా, గడ్డం తీసుకుంటావా? అన్నాడు. పృథ్వీ ఒప్పుకోకపోవడంతో దాన్ని రూ.8 లక్షలకు పెంచాడు. అయినా అడ్డంగా తలూపడంతో నామినేషన్స్తో పని లేకుండా నేరుగా పదో వారంలోకి అడుగుపెట్టేందుకు ఛాన్స్ ఇస్తానన్నాడు. అయినా పృథ్వీ అంగీకరించలేదు.అశ్వత్థామ 3.0ఇక నామినేషన్స్లో పృథ్వీ- ప్రేరణపై రివేంజ్ నామినేషన్ చేయడాన్ని నాగ్ సమర్థించడం విశేషం. అనంతరం అవినాష్కు పైకి నవ్విస్తా- వెనక ప్లాన్ వేస్తా అన్న హెడ్డింగ్ సరిగ్గా సరిపోతుందన్నారు. ఆ వెంటనే భార్య అనూజ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పిన ఆడియో ప్లే చేయగా అవినాష్ ఎమోషనలయ్యాడు. ఇక గౌతమ్ అశ్వత్థామ 3.0 అని చెప్తూ నాగ్ అతడిని మెచ్చుకున్నాడు. ముందు ఒక ఆట-వెనక ఒక ఆట హెడ్డింగ్ యష్మికి కాస్త సూట్ అవుతుందన్నారు. ఆటలో వీక్- డ్రామాలో పీక్తర్వాత నాగ్.. ప్రేరణ, తేజను నాగ్ సేవ్ చేశాడు. 'ఆటలో వీక్- డ్రామాలో పీక్' హెడ్డింగ్ మణికంఠకు సెట్ అవుతుందని హౌస్మేట్స్ అన్నారు. ఈ సందర్భంగా మణి.. కూర్చుంటే లేవలేకపోతున్నా.. నా శరీరం నా కంట్రోల్లో లేదు, ఇంకా ఆడాలని ఉంది.. కానీ ఇలాగే ఉంటే నా శరీరం, మెదడు సహకరించదు. నేను వెళ్లిపోతాను సర్. నాకు నేనే వీక్ అయిపోయాను అని తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ ఎలా ఉందో చూద్దామని నాగ్ అతడిని కూర్చోబెట్టాడు.మత్తు వదలరా..తేజకు హౌస్ అంతా కలిసి మత్తు వదలరా ట్యాగ్ ఇచ్చేసింది. ప్రేరణకు.. గుంపులో గుర్తింపు కోరుకోవద్దని చెప్పారు. నయని పావనికి క్రై బేబీ అన్న ట్యాగ్ ఇచ్చారు. మెహబూబ్.. ఈ సీజన్కు ఫ్లాప్ చీఫ్ అని నిర్ణయించారు. కత్తిలాంటి నా నాలుక.. కాదు మీకు తేలిక శీర్షిక గంగవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. తనను ఎవరూ నామినేట్ చేయొద్దని మీరైనా చెప్పండని నాగార్జునను వేడుకుంది.మాటలో పులి- ఆటలో పిల్లిఇక రోహిణికి.. మనసులే కాదు ఆట కూడా గెలవాలన్నారు. విష్ణుప్రియకు 'రివేంజ్ నా సరికొత్త ఆట', 'వీకెండ్లో ఆట, మిగతా రోజులు టాటా' అన్న రెండు హెడ్లైన్స్ కరెక్ట్గా సరిపోయాయన్నారు. నబీల్.. 'మాటలో పులి- ఆటలో పిల్లి' అన్నారు. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రతివారం అరతులం బంగారమిస్తా.. గంగవ్వకు మణి బంపరాఫర్
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు నబీల్. అయితే ఇది గొంతెమ్మ కోరికగా భావించిన బిగ్బాస్ ఈ వారం మాత్రమే కావాల్సినంత ఫుడ్ ఇస్తానన్నాడు. కానీ ఓ తిరకాసు పెట్టాడు. అదేంటో తెలియాలంటే నేటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..నా జీవితంలో జరిగిన ఘోరంవిష్ణుప్రియ తన మనసులోని బాధను చెప్పడంతో గంగవ్వ ఎమోషనలైంది. అమ్మకు ఇష్టం లేదని చిన్నప్పటినుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదు. నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా, అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు. చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు.. అది నా జీవితంలో జరిగిన ఘోరం.. ఇది ఎవరికీ జరగకూడదు. అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే తనతో మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఇది విని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.హౌస్మేట్స్ కోసం నబీల్ త్యాగంఇకపోతే ఇన్ఫినిటీ రూమ్లో నబీల్ అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్న సంగతి తెలిసిందేగా! దాని గురించి బిగ్బాస్ ప్రస్తావిస్తూ.. ఇంట్లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు, కూల్డ్రింక్స్, చాక్లెట్లు త్యాగం చేస్తే ఈ ఒక్క వారం అన్లిమిటెడ్ రేషన్ లభిస్తుందన్నాడు. ఇంటిసభ్యులందరికోసం ఆ కండీషన్కు నబీల్ ఓకే చెప్పాడు. దీంతో మెహబూబ్.. సూపర్ మార్కెట్లో ఉన్న రేషన్ అంతా ఊడ్చేశాడు.బంగారం ఇస్తానన్న మణికంఠతర్వాత నాగమణికంఠ.. తాను నామినేషన్స్లో నుంచి సేవ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానన్నాడు. సేవ్ అయిన ప్రతివారం అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు. మరి నాకేం ఇస్తావని రోహిణి అనగా ఒక ముద్దిస్తానన్నాడు. ఇక అవినాష్-రోహిణి నామినేషన్స్ను రీక్రియేట్ చేసి నవ్వించారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్బాస్ కిచెన్లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంటచేసుకునే ఛాన్సిచ్చాడు. మెగా చీఫ్ కంటెండర్గా గంగవ్వఅనంతరం రాయల్ టీమ్ గెలుపొందిన మెగా చీఫ్ కంటెండర్ షీల్డ్ను గంగవ్వకిచ్చారు. బిగ్బాస్.. రాయల్ టీమ్ను ఓవర్ స్టార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందన్నాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్రూమ్ వంటి వసతులు అందిస్తూ చార్జింగ్ పొందవచ్చని తెలిపాడు.బెంబేలెత్తిపోయిన మణికంఠటాస్క్ పూర్తయ్యేలోపు బతికున్న సభ్యులే మెగాచీఫ్ కంటెండర్లవుతారన్నాడు. టాస్క్ ప్రారంభానికి ముందే మణి బెంబేలెత్తిపోయాడు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. బొక్కలిరగ్గొట్టుకుని బయటకు వెళ్లలేను. ఆరోగ్యం ముఖ్యం.. టీమ్కు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతే ఇస్తానని చెప్పాడు. ఆట మొదలవగానే అవినాష్.. నబీల్కు తెలియకుండా అతడి చార్జర్ను తన ప్లగ్కు కనెక్ట్ చేశాడు. హరికథ చెప్పి చార్జింగ్హరితేజ.. హరికథతో మణికంఠను మెప్పించి అతడి దగ్గర నిమిషం పాటు చార్జింగ్ పొందింది. నయని కూడా యష్మి దగ్గర బలవంతంగా చార్జ్ పొందడానికి ట్రై చేసింది. కానీ నిఖిల్ ఆమెను అడ్డుకుని అవతలకు విసిరేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ను బోల్తా కొట్టించిన అవినాష్.. చాలా స్మార్ట్ గురూ!
నామినేషన్స్తో హీటెక్కిన బిగ్బాస్ హౌస్ను కూల్ చేసేందుకు ఉదయాన్నే ఓ ఫన్ టాస్క్ ఇచ్చినట్లున్నారు. ఇందులో ఒకరనొకరు ఇమిటేట్ చేసి నవ్వుకున్నారు. తర్వాత స్మార్ట్ ఫోన్స్ వర్సెస్ చార్జర్స్ అని ఓ గేమ్ పెట్టాడు. ఇందులో రాయల్ టీమ్ ఫోన్స్ అయితే ఓజీ టీమ్ మెంబర్స్ చార్జర్లుగా ఉంటారు. ఇక రాయల్ క్లాన్ ఆధీనంలో హౌస్ ఉంటే.. ఓజీ క్లాన్ ఆధీనంలో గార్డెన్ ఏరియా ఉంటుంది.నబీల్కు తెలియకుండా..చార్జింగ్ అవకపోతే ఫోన్ బ్యాటరీ తగ్గిపోతూ ఉంటుంది. ఆ బ్యాటరీ తగ్గకుండా ఉండేందుకు రాయల్ టీమ్.. ఓజీ టీమ్ దగ్గరున్న చార్జర్ను వినియోగించుకోవాలి. ఈ క్రమంలో అవినాష్.. నబీల్కు తెలియకుండానే అతడి దగ్గరున్న చార్జర్ను వాడేశాడు. హౌస్ లోపల ఉన్న ఫుడ్ కోసం ఓజీ టీమ్, గార్డెన్ ఏరియాలో ఉన్న వాష్రూమ్స్ కోసం రాయల్ టీమ్ ఏమైనా కాంప్రమైజ్ అవుతారా? లేదంటే గొడవలు పడైనా సరే వాటిని ఉపయోగించుకుంటారా? అనేది నేటి ఎపిసోడ్లో చూడాలి! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!
బిగ్బాస్ 8లో ఏడో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగింది. ఎంతలా అంటే పృథ్వీ నిజంగా పిచ్చోడిలా ప్రవర్తించాడు. ప్రేరణని టార్గెట్ చేశాడు. అవినాష్ వ్యక్తిగత విషయాలు తీసి దారుణంగా మాట్లాడాడు. ఇంతా చేశాడు గానీ ఏదైనా గట్టిగా అనుకున్నాడో అది మాత్రం సాధించలేకపోయాడు. వీళ్లిద్దరి వల్ల హరితేజ అడ్డంగా బుక్ అయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో (అక్టోబర్ 15) ఏమేం జరిగిందనేది హైలైట్స్లో చూద్దాం.యష్మి డబుల్ ఫేస్ఏడో వారం నామినేషన్స ప్రక్రియ మధ్యలో ఆగడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మళ్లీ అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. టోపీని ప్రేరణకి దక్కకుండా చేయాలని నయని, పృథ్వీ అడ్డుకున్నారు. ప్రేరణకి సపోర్ట్ చేస్తూ, వీళ్లని డిఫెండ్ చేసే క్రమంలో యష్మి కింద పడిపోయింది. తనకు కాలు విరిగినా పర్లేదు కానీ ఏది కరెక్టో దానివైపే నిలబడతా అని చెప్పింది.యష్మి కన్ఫ్యూజన్ మాటలుపోడియం పైకి తేజ, నబీల్ వచ్చారు. నబీల్.. తేజని నామినేట్ చేశాడు. సొంత ఫ్రెండ్ని చెప్పి ప్రేరణని నామినేట్ చేస్తానని యష్మి చెప్పిందని, ఇది తనకు నచ్చలేదని యష్మిని నామినేట్ చేశాడు. అయితే యష్మి.. ఫ్రెండ్ అనే ముసుగు వేసుకుని మరీ ప్రేరణని మోసం చేస్తోంది అని, యష్మిది డబుల్ స్టాండర్డ్ అని చెప్పుకొచ్చాడు. ఈ హంగామా అంతా కాసేపు నడిచింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!)టార్గెట్ తేజఓజీ క్లాన్ అందరూ కలిసి తేజని టార్గెట్ చేయాలనుకున్నారు. నిఖిల్ చాలా తెలివిగా తన క్లాన్ అందరికీ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో పోడియంపైకి వచ్చిన విష్ణుప్రియ.. నయని పావనిని రివేంజ్ నామినేషన్ చేయాలనుకుంటున్నానని చెప్పింది. ఇదంతా చెల్లదు అని బిగ్బాస్ చెప్పాడు. అయితే ఇదంతా తనని టార్గెట్ చేయడానికే అని తేజ బయటపెట్టాడు. విష్ణుప్రియ డమ్మీ నామినేషన్ వేస్తే.. పక్కనోళ్లు తన పేరు చెబుతారని.. అలా తను నామినేషన్ లోకి వచ్చేలా ఇదంతా చేస్తున్నారని ఓజీ క్లాన్ బండారాన్ని తేజ బయటపెట్టాడు. కానీ నిఖిల్, తేజ పేరే చెప్పాడు. టోపీ ఉన్న హరితేజ.. తేజ పేరునే నామినేట్ చేస్తూ ఫైనల్ చేసింది. దీని తర్వాత గౌతమ్ మరోసారి పసలేని వాదన తీసుకొచ్చి నబీల్ పేరు చెప్పాడు. కాస్త హంగామా నడిచిన తర్వాత ఊహించని విధంగా నబీల్ నామినేట్ అయ్యాడు.పృథ్వీ చీప్ కామెంట్స్బిగ్బాస్ ఎపిసోడ్స్ ఏం చూడకుండా తనని గతవారం అవినాష్ నామినేట్ చేశాడని, అందుకే ఈ వారం అతడిని నామినేట్ చేస్తున్నానని పృథ్వీ చెప్పాడు. దీంతో అవినాష్ నిజాయతీగా తన వాదన వినిపించాడు. షూటింగ్స్ వల్ల తాను అన్ని ఎపిసోడ్స్ చూడలేదని, ఈ విషయాన్ని నాగ్ సర్కి కూడా చెప్పానని అన్నాడు. తన భార్య ఎపిసోడ్స్ అన్నీ చూసి తనకు కొన్ని పాయింట్స్ చెప్పిందని, వాటి వల్ల పృథ్వీని నామినేట్ చేశానని అన్నాడు. అలాంటప్పుడు మీరెందుకు వచ్చారు, మీ భార్యనే ఇక్కడకు రావాల్సింది అని పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. వైఫ్ మ్యాటర్ తీయకు అని అవినాష్ ఫుల్ సీరియస్ అయ్యాడు.నోరు జారిన పృథ్వీషూటింగ్స్లో బిజీగా ఉండటం తాను చూడలేకపోయానని అవినాష్ ఎంత చెబుతున్నా సరే పృథ్వీ ఊరుకోలేదు. సరికదా సైకోలా ప్రవర్తించి బిగ్బాస్లోకి వచ్చేందుకు షూటింగ్స్ లేవా? అని వెటకారంగా మాట్లాడాడు. పృథ్వీ పనేం చేయట్లేదని, గంగవ్వ కూడా అదే పాయింట్ చెప్పిందని గుర్తుచేశాడు. 'గంగవ్వ అని ఎందుకు చెప్తావ్ రా' అని పృథ్వీ అనేసరికి.. 'రేయ్ రా అనకు' అని అవినాష్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నేను అలానే అంటాను అని పృథ్వీ పైపైకి వచ్చాడు. అలా తన్నుకోవడం ఒక్కటే తక్కువైంది అనే రేంజులో తగాదా పడ్డారు. మరో పోడియంపై నిలబడ్డ నయని.. విష్ణుప్రియ పేరు చెప్పింది. కానీ పాయింట్లో బలం లేకపోయింది. దీంతో పృథ్వీ చెప్పిన అవినాష్ పేరునే పరిగణలోకి తీసుకుంది.అనుకున్నది జరగలేఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, టేస్టీ తేజ, నబీల్, మణికంఠ నామినేషన్స్లో ఉన్నారని.. అలానే తక్కువసార్లు టోపీ పట్టుకున్న కారణంగా ప్రేరణ నామినేట్ అయిందని బిగ్బాస్ ప్రకటించాడు. ఓజీ క్లాన్ దగ్గర ఇమ్యూనిటీ ఉన్నందున ఒకరిని సేవ్ చేసుకోవచ్చని కానీ మరొకరిని ఆ స్థానంలో పెట్టాల్సి ఉంటుందని బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో అవినాష్.. తన బదులు హరితేజ పేరుని చెప్పాడు. అలా ఈసారి ఓజీ క్లాన్ నుంచి ఆరుగురు.. రాయల్ క్లాన్ నుంచి ముగ్గురు నామినేషన్స్లోకి వచ్చారు.పృథ్వీ మనిషి కాదు సైకో?రెండు రోజుల పాటు జరిగిన నామినేషన్స్లో అందరూ గేమ్ పరంగా ఎంత ఉండాలో అంతలా కనిపించారు. పృథ్వీ మాత్రం సైకోలా ప్రవర్తించాడు. ప్రేరణ తనని కావాలనే టార్గెట్ చేసిందని, ఆమెని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక అవినాష్తో అయితే కనీసం బుర్ర లేని పిచ్చోడిలా ప్రవర్తించాడు. ఇలాంటి వాడిని అసలు బిగ్బాస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో? ప్రేక్షకుల మైండ్ ఎందుకు కలుషితం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. -
అవినాష్ భార్యపై పృథ్వీ చీప్ కామెంట్స్.. మరీ ఇలానా?
బిగ్బాస్ 8 షో మరీ హద్దులు దాటేస్తున్నట్లు కనిపిస్తుంది. మాట్లాడుకోవడం, తన్నుకోవడం అనేది గేమ్స్ వరకు అయితే పర్లేదు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. మంగళవారం ఎపిసోడ్లో అలాంటి గొడవే జరిగింది. నామినేషన్ సందర్భంగా అవినాష్ భార్య గురించి పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఫ్రెండ్షిప్ అనే పదాన్ని తీసి మరీ తనని బాధపెట్టారని యష్మి ఏడ్చింది. దీంతో ప్రేరణ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక గ్రూప్గా ఫామ్ అయిన నిఖిల్.. నబీల్, పృథ్వీ, మణికంఠతో మాట్లాడుతూ తేజని ఎలాగైనా సరే టార్గెట్ చేయాలని అన్నాడు. గుర్రం సౌండ్ వినిపించగానే యష్మి టోపీ లాగేసుకుని ప్రేరణకి ఇచ్చింది. పోడియంపై నిలబడ్డ విష్ణుప్రియ.. రివేంజ్ పేరుతో నయని పావనిని నామినేట్ చేయాలనుకుంది. కానీ రివేంజ్ అనేది ఇక్కడ కుదరదని బిగ్బాస్ అల్టిమేటం ఇచ్చేశాడు. ఇదంతా చూసిన తేజ.. ఓజీ క్లాన్ బండారాన్ని బయటపెట్టాడు. తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. ఓజీ vs తేజ చేసేస్తున్నారని, ఇక మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడతా అని తేజ.. వాళ్లకు సవాలు విసిరాడు.(ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి)తర్వాత వచ్చిన పృథ్వీ.. ప్రోమో చూసి తను టాస్క్లు ఆడుతున్నానని చెప్పడం అస్సలు నచ్చలేదని అవినాష్ని నామినేట్ చేశాడు. దీంత ఇద్దరి మధ్య తగువు మొదలైంది. 'నేను చూసిన ఎపిసోడ్స్లో రెండు మూడు టాస్క్లు తప్పితే ఎక్కడా కనిపించలేదు. మా వైఫ్ చూసింది' అని అవినాష్ అనగానే.. మరి అలాంటిప్పుడు మీ భార్యనే బిగ్బాస్కి రావాల్సింది, మీరెందుకు వచ్చారు అని పృథ్వీ నోరు జారాడు. వైఫ్ టాపిక్ తీయకు అని అవినాష్ సీరియస్ అయ్యాడు.సోఫాలు కూర్చోవడం తప్పితే ఇంకేం చేయవ్ అని అవినాష్ అనేసరికి.. కామెడీ తప్ప ఇంకేం చేశావ్ నువ్వు అని పృథ్వీ అన్నాడు. పోయిన వారం నేను ఏ పాయింట్ చెప్పానో, ఈ వారం కూడా గంగవ్వ అదే పాయింట్ చెప్పిందని అవినాష్ అనేసరికి.. 'గంగవ్వ పేరు ఎందుకు చెబుతావ్ రా' అని పృథ్వీ మరోసారి నోరు జారాడు. 'రేయ్ రా అనకు' అని అవినాష్ వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇది నీ సంస్కారం. బిగ్బాస్కి వచ్చావ్ కదా నేర్చుకో' అవినాష్-పృథ్వీ ఒకరిపై ఒకరు వెళ్లారు.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత) -
సిగరెట్ తాగడం తప్ప ఏం చేశావన్న గంగవ్వ.. ఆ కోపం ప్రేరణపై..!
బిగ్బాస్ హౌస్లో ఏడోవారం నామినేషన్స్ జరిగాయి. అయితే కిల్లర్ గర్ల్స్ చేతికి నామినేషన్స్ను ఫైనల్ చేసే అధికారం ఇచ్చారు. మరి ఆ కిల్లర్ గర్ల్స్ ఎవరు? వీళ్లు ఎవర్ని నామినేట్ చేశారు? ఎవర్ని సేవ్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!ఆ ఇద్దరికీ స్పెషల్ డ్రెస్గౌతమ్, తేజ, పృథ్వీ.. ఈ ముగ్గురిలో గౌతమ్ సూట్ కేసు మాత్రమే వెనక్కు వచ్చింది. దీంతో మిగతా ఇద్దరు బిగ్బాస్ ఇచ్చిన చిరిగిన బస్తా డ్రెస్ వేసుకున్నారు. ఆ వెంటనే నామినేషన్స్ మొదలయ్యాయి. బిగ్బాస్ ప్రేరణ, హరితేజను కిల్లర్ గర్ల్స్గా నియమించాడు. గుర్రం సౌండ్ వినిపించినప్పుడు ప్లాట్ఫామ్స్పై నిలబడే ఇద్దరు హౌస్మేట్స్ ఇంటిసభ్యులను నామినేట్ చేస్తారు. అందులో ఒకరి నామినేషన్ను అంగీకరించి, మరొకరి నామినేషన్ తిరస్కరించే హక్కు హ్యాట్ మొదట పట్టుకున్న కిల్లర్ గర్ల్కు ఉంటుంది.అతిగా రియాక్టయిన అవినాష్మొదటగా రోహిణి.. నీకు బాధేసినప్పుడు మైక్ విసిరేయడం నచ్చలేదని గౌతమ్ను నామినేట్ చేసింది. అందుకు గౌతమ్ స్పందిస్తూ.. అవినాష్ చేసిన కామెడీ తనకు బుల్లీయింగ్లా ఉందన్నాడు. దీంతో అవినాష్ మధ్యలో కలగజేసుకుంటూ కామెడీ తీసుకోకపోతే షోకి రావొద్దంటూ చొక్కా విప్పి మరీ ఫైర్ అయ్యాడు. ఇది కామెడీ షో కాదని గౌతమ్ అనడంతో.. అంతలోనే సారీ భయ్యా, తెలియక అనేశాను.. అంటూ అవినాష్ చేతులు జోడిస్తూ కాస్త అతిగా రియాక్టయ్యాడు. నిఖిల్.. తేజ యాక్టివ్గా లేడని నామినేట్ చేశాడు.ఏడ్చేసిన గౌతమ్హ్యాట్ అందుకున్న కిల్లర్ గర్ల్ ప్రేరణ.. రోహిణి చెప్పిన పాయింట్లకు ఏకీభవిస్తూ గౌతమ్ను నామినేట్ చేసింది. అయిపోయినదాన్ని (ట్రోలింగ్ గుర్తు చేస్తున్నారంటూ..) మళ్లీ మళ్లీ తీసుకొస్తున్నారంటూ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు బుల్లీయింగ్ అనడం ఎంత పెద్ద తప్పు? అసలు ఆ పదానికి అర్థం తెలుసా? అని రోహిణి, అవినాష్ సీరియసయ్యారు. రెండో రౌండ్లో నిఖిల్, గంగవ్వ ప్లాట్ఫామ్పై నిల్చున్నారు. నిఖిల్ మరోసారి తేజను నామినేట్ చేశాడు. ప్రేరణపై పీకలదాకా కోపం..గంగవ్వ.. నాతో మాట్లాడట్లేదు, హోటల్ టాస్క్లో పెద్దగా ఆడలేదు.. సిగరెట్ తాగుతూ కూర్చుంటావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. ఇద్దరి పాయింట్లు విన్న ప్రేరణ.. పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో ప్రేరణపై పగ పెంచుకున్న పృథ్వీ.. ఆమె హ్యాట్ పట్టుకోనివ్వకుండా అడ్డుకున్నాడు. తను నామినేట్ అవ్వాల్సిందేనని బలంగా కోరుకున్నాడు. అతడికి సపోర్ట్గా నయని కూడా దిగింది. ప్రేరణ నామినేట్ అవడమే తనకూ కావాలంది.నీ గ్రాఫ్ పడిపోయిందిపృథ్వీకి నిఖిల్ సర్ది చెప్పాలని చూశాడు కానీ వర్కవుట్ కాలేదు. నాకు అన్యాయం జరిగింది.. ఇల్లు మొత్తం అడ్డొచ్చినా నేను తను నామినేట్ అయ్యేలా చూస్తానన్నాడు. అది విని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. మూడో రౌండ్లో యష్మి.. హోటల్ టాస్క్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ తేజ పేరు చెప్పింది. నాగమణికంఠ.. గ్రాఫ్ పడిపోయిందని, హోటల్ టాస్క్లో ఫన్ చేయలేదని నిఖిల్ పేరు చెప్పాడు. హ్యాట్ పట్టుకున్న హరితేజ.. నిఖిల్ను నామినేషన్స్లో వేసింది.యష్మి ఎమోషనల్నాలుగో రౌండ్లో అవినాష్.. టాస్కుల్లో వీక్ అనిపించాడంటూ మణికంఠ పేరు చెప్పాడు. గౌతమ్.. హోటల్ టాస్క్లో పెద్దగా ఆసక్తి చూపించలేదంటూ విష్ణుప్రియ పేరు చెప్పాడు. పృథ్వీ.. ప్రేరణను అడ్డుకోవడంతో మరోసారి హరితేజ హ్యాట్ పట్టుకుంది. ఈమె మణికంఠను నామినేట్ చేసింది. ఇక పృథ్వీ ప్రవర్తన చూసి బెంబేలెత్తిపోయిన యష్మి అది కరెక్ట్ కాదంటూ ఏడ్చేసింది. ఈ నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లోనూ కొనసాగనున్నాయి. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కమెడియన్లని అవమానించిన గౌతమ్? రెచ్చిపోయిన అవినాష్
బిగ్బాస్ షోలో మిగతా వాటి సంగతి పక్కనబెడితే కాస్తంత కామెడీ ఉంటేనే జనాలు చూస్తారు. ఈసారి అది లేకపోవడం వల్లే గత సీజన్లలో పాల్గొన్న పలువురిని వైల్డ్ కార్డ్స్ పేరిట మళ్లీ తీసుకొచ్చారు. ఉన్నంతలో రోహిణి, అవినాష్ కాస్త ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ వాళ్లిద్దరినీ అవమానించేలా కామెంట్స్ చేశాడు. ఇదేం కామెడీ షో కాదు అని చెబుతూనే గొడవ చేశాడు. దీంతో అవినాష్ రెచ్చిపోయాడు.గతవారం ఫన్ టాస్క్ సందర్భంగా గౌతమ్ని ఇమిటేట్ చేసిన అవినాష్. అశ్వద్ధామ 2.0 అని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గౌతమ్ అది ఇబ్బందిగా అనిపించింది. దీంతో మైక్ తీసి నేలకేసి కొట్టాడు. అయితే అప్పుడు మైక్ తీసి పడేయడం తనకు నచ్చలేదని కారణం చెప్పిన రోహిణి.. గౌతమ్ని ఈ వారం నామినేట్ చేసింది. కామెడీ, మరేదైనా గానీ బుల్లీయింగ్ (పరోక్షంగా బాధపెట్టడం) లాంటిదని గౌతమ్ నోరు జారాడు. ఇది చాలా పెద్ద మాట అని హౌస్మేట్స్ అందరూ సీరియస్ అయ్యారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)బుల్లీయింగ్ అంటే ఓ మనిషికి నచ్చని విషయాన్ని మళ్లీ మళ్లీ గుచ్చి గుచ్చి చెబుతారా అని గౌతమ్ ఆవేశపడిపోయాడు. పక్కనే ఉన్న అవినాష్ ఇక తట్టుకోలేకపోయాడు. మాకు తెలీదు తెలీదు తెలీదు అని ఫైర్ అయ్యాడు. మేం కావాలని చెయ్యలేదు, వేలు పెట్టి కెలకలేదు అన్నాడు. దీంతో ఇదేం కామెడీ షో కాదు, మనం వచ్చింది బిగ్బాస్ షోకి అని గౌతమ్ మరోసారి మాట తూలాడు. ఫలితంగా అవినాష్ రెచ్చిపోయాడు.'కామెడీ తీసుకోలేనప్పుడు డబ్బులు తీసుకోకండి. షోకు రాకండి. కామెడీ అంటే ఏమనుకుంటున్నారో' అని అవినాష్ తన జాకెట్ విసేరేశాడు. గౌతమ్ని అశ్వద్ధామ 2.0 అనకండ్రా, మీకు దండం పెడతాను అని కెమెరా చూస్తూ అతడి ఫ్యాన్స్కి చెప్పాడు. పక్కనే ఉన్న గౌతమ్కి క్షమాపణలు కూడా చెబుతూనే సారీ భయ్యా, నాకు తెలీదు అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే కామెడీ చేయడం ఏమో గౌతమ్కి తీరా చేస్తేనేమో తీసుకోలేకపోతున్నాడు. చూస్తుంటే ఈ గొడవే సోమవారం ఎపిసోడ్ అంతా ఉండేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు) -
నబీల్ ఇమ్మెచ్యూర్ అన్న ప్రేరణ.. మణికి గోల్డెన్ ఛాన్స్
బిగ్బాస్ హౌస్లో జరిగిన హోటల్ టాస్క్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా? అని ఎదురు చూశారు. అంత నీరసంగా సాగింది. టాస్క్ అయిపోగానే బెస్ట్ పర్ఫామర్లను సెలక్ట్ చేయాలన్నాడు. వీరే మెగా చీఫ్ కోసం పోటీపడతారని పేర్కొన్నాడు. ఓజీ టీమ్లో మెగా చీఫ్ కంటెండర్ను సెలక్ట్ చేసే క్రమంలో ప్రేరణ, నబీల్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇమ్మెచ్యూర్..నీ మైండ్లో నాకు వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకున్నావ్.. అందులే అలా ప్రవర్తిస్తున్నావ్ అని ప్రేరణ అనేసింది. నీ మాట వినకుండా ఆయన చెప్పింది మాత్రమే చేసినప్పుడు నాది తప్పు అను అని నబీల్ రిప్లై ఇచ్చాడు. అయినా తగ్గని ప్రేరణ.. వెటకారం వద్దు.. నువ్వు నన్ను నమ్మట్లేదు.. నువ్వు ఇమ్మెచ్యూర్ అనేయడంతో నబీల్ నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు.బెస్ట్ పర్ఫామర్లు ఎవరంటే?ఓజీ టీమ్ నుంచి మణికంఠ, రాయల్ టీమ్ నుంచి అవినాష్, రోహిణి, హరితేజ, నయని పావని, మెహబూబ్, గౌతమ్లను బెస్ట్ పర్ఫామర్లుగా ఎంపిక చేశారు. తమ టీమ్లోని మిగతా ఇద్దరు కూడా బానే చేశారని అవినాష్ అనగా.. అలాంటప్పుడు ఫస్ట్ తమ పేరెందుకు చెప్పలేదని గంగవ్వ నిలదీసింది. కడిగి పారేసిన గంగవ్వనేను మహారాణి అయినప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరైనా సేవలు చేశారా? అని ప్రశ్నించింది. అందుకు విష్ణు.. నేను పెరుగన్నం తినిపించా కదా అని గుర్తు చేయగా డబ్బులిస్తే ఆ పని చేశావని గంగవ్వ కౌంటరిచ్చింది. గంగవ్వలో ఈ ఫైర్ చూసి అటు హౌస్మేట్స్, ఇటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గతాన్ని తల్చుకుని కుంగిపోయిన గౌతమ్.. ఈసారి కప్పు కొడతా!
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడుతోంది. బిగ్బాస్ 8లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. వీరితో కలిసి ఫన్ గేమ్ ఆడించాడు. అదే బిగ్బాస్ హోటల్. ఈ టాస్క్లో పాతవాళ్లంతా హోటల్ సిబ్బందిగా, కొత్తవాళ్లంతా గెస్టులుగా ఉన్నారు. మరి ఈ టాస్క్ ఏమేరకు వర్కవుట్ అయిందో నేటి (అక్టోబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..ఫన్ టాస్క్బిగ్బాస్ అమ్మాయిలను ఒక టీమ్గా, అబ్బాయిలను ఒక టీమ్గా విభజించి ఫన్నీ టాస్కు ఇచ్చాడు. ఆడాళ్ల టీమ్కు ముక్కు అవినాష్, అబ్బాయిల టీమ్కు రోహిణిని లీడర్గా పెట్టారు. గేమ్ ఏంటంటే.. టీమ్సభ్యులంతా వారి నోటిని నీటితో నింపుకోవాలి. వీళ్లను ఇతర టీమ్లోని వారు నవ్వించి ఆ నీళ్లు బయటకు వచ్చేలా చేయాలి. ఈ గేమ్లో అబ్బాయిలను నవ్వించే క్రమంలో అవినాష్.. మణికంఠ దగ్గరకు వెళ్లి పాట పాడాడు. కప్పు కొడతా: గౌతమ్తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్లి అశ్వత్థామ 2.0 అని ఇమిటేట్ చేశాడు. అది విని హర్టయిపోయిన గౌతమ్.. అయిపోయినదాన్ని మళ్లీ మళ్లీ తీసి ఇరిటేషన్ తెప్పించొద్దు. వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. అని మైక్ విసిరేసి ఇంట్లోకి వెళ్లి ఏడ్చాడు. నాన్న ఐయామ్ సారీ, నీతో గొడవపడి మాట్లాడకుండా వచ్చేశా.. కానీ ఈసారి నన్ను నేను నిరూపించుకుంటాను. కప్పు కొడతాను అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.ఉప్పు గెల్చుకున్న అవినాష్, రోహిణిమరోవైపు తనను నవ్వించమని అవినాష్, రోహిణికి బిగ్బాస్ టాస్క్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ వీరికి కొట్టిన పిండి కావడంతో ఇరగదీశారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్బాస్.. ఇంటిసభ్యులు రేషన్లో మర్చిపోయిన ఉప్పును కానుకగా ఇచ్చాడు. ఇక తర్వాతి రోజు ఉదయం విష్ణు ధ్యానం చేస్తుంటే గంగవ్వ చెడగొట్టేందుకు ప్రయత్నించడం భలే సరదాగా అనిపించింది. అనంతరం బిగ్బాస్ హోటల్ టాస్క్ పెట్టాడు. ఇందులో ఓల్డ్ కంటెస్టెంట్లు హోటల్ సిబ్బంది కాగా రాయల్ టీమ్ అతిథులుగా ఉంటారు. ఎవరెవరు ఏ పాత్రలో..పాత్రల విషయానికి వస్తే.. నబీల్.. అప్పుల్లో కూరుకుపోయిన హోటల్ యజమాని, ప్రేరణ.. మతిమరుపు మేనేజర్, నిఖిల్.. హెడ్ చెఫ్, సీత.. అసిస్టెంట్ చీఫ్, పృథ్వీ.. అందరినీ ఫ్లర్ట్ చేసే గార్డ్, విష్ణు.. పృథ్వీతో లవ్లో ఉండే పర్సనల్ బట్లర్, యష్మి.. హౌస్ కీపింగ్, మణికంఠ.. హౌస్ కీపింగ్(దొంగిలించడం, దాన్ని తిరిగిచ్చేయడం)గా వ్యవహరిస్తారు.తికమక మనిషిగా హరితేజగంగవ్వ.. రాజవంశానికి చెందిన మహారాణి, నయని పావని.. మహారాణి అసిస్టెంట్, అవినాష్.. సూపర్స్టార్, రోహిణి- పొగరుబోతు రిచ్ కిడ్ (అవినాష్ గర్ల్ఫ్రెండ్), మెహబూబ్.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ (రోహిణి తండ్రి అపాయింట్ చేస్తాడు) హరితేజ.. మెహబూబ్ అసిస్టెంట్(తికమక మనిషి), తేజ.. పాపులర్ ఫుడ్ బ్లాగర్, గౌతమ్.. పోలీసుల నుంచి దాక్కుని తిరుగుతున్న క్రిమినల్గా పాత్రలు పోషించారు.మణిని ఆడుకున్న రోహిణిటాస్కు ప్రారంభానికి ముందే సీత.. ఒక పర్సు కొట్టేయడం గమనార్హం. ఈ టాస్కులో హౌస్మేట్స్ తమ పర్ఫామెన్స్ చూపించారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదని రోహిణి అనగా.. మణి.. నువ్వో మాడియపోయిన కందిపప్పు, మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్ వేశాడు. దీంతో రోహిణి సీరియస్ అయింది.. ఒకసారి, రెండుసార్లు ఓకే.. కానీ మూడోసారి ఒప్పుకోను. నీ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి నీకు నచ్చినట్లు మాట్లాడటం ఫన్ కాదు.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతలోనే జోక్ చేశానంటూ నవ్వేసింది. నీ కళ్లలో భయమే నాకు కావాలంటూ నవ్వుతూ చెప్పడంతో మణి ఊపిరి పీల్చుకున్నాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!
బిగ్బాస్ సీజన్ ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ రియాలిటీ షో మొదలై ఇన్ని రోజులవుతున్నా ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒక్క విష్ణు ప్రియ మినహాయిస్తే అంతా కొత్త వాళ్లే కావడంతో షో చప్పచప్పగా సాగిపోతోంది. అందుకే బిగ్బాస్ సరికొత్త ఐడియాతో ఆడియన్స్ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశాడు.అందులో భాగంగానే గతంలో బిగ్బాస్లో కంటెస్టెంట్స్గా అలరించిన వారిని ఏరికోరి మరీ సెలెక్ట్ చేసుకున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీల్లో మాత్రం కొత్తవాళ్లకు చోటివ్వలేదు. బుల్లితెర ఇండస్ట్రీలో బాగా ఫేమ్ ఉన్నవాళ్లనే పట్టుకొచ్చారు. హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, ముక్కు అవినాష్, గౌతమ్, నయని పావని, మెహబూబ్, రోహిణి లాంటి హౌస్లోకి తోసేశారు. ఇక నుంచైనా అభిమానులను ఆకట్టుకునేందుకు బిగ్బాస్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.(ఇది చదవండి: Bigg Boss 8: ఏడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ముక్కు అవినాష్)వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది హౌస్లో అడుగుపెట్టాక మొదటి ప్రోమో విడుదలైంది. ఇందులో గంగవ్వ హౌస్లో నవ్వులు పూయించారు. రోహిణి- గంగవ్వ మధ్య ఫన్నీ సంభాషణ నడించింది. ఇక తొలిరోజే ముక్కు అవినాశ్ అడ్డంగా బుక్కయ్యాడు. మొదటి రోజే పాత్రలు క్లీన్ చేసే పనికి పూనుకున్నాడు. నేనేదో యుద్ధానికి పోతున్నట్లు అందరూ క్లాప్స్ కొడుతున్నారంటూ కామెడీ పండించాడు. ఈ ప్రోమో చూస్తే కొత్త, పాత వాళ్లతో కలిసి బిగ్బాస్ హౌస్ కళకళలాడుతోంది. ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలైతే అసలు కథ స్టార్ట్ అవుతుంది. -
Bigg Boss 8: టాప్ 5వ స్థానంలో అవినాష్ ఎలిమినేట్
ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.అప్పటికే అమ్మ అనారోగ్యం, కొత్త ఇంటి లోన్ వల్ల పీకల్లోతు అప్పులో ఉన్నాడు. ఈ అప్పులు తీర్చడం కోసం ఆ ఫైన్ కట్టి మరీ బిగ్బాస్కు వెళ్లాడు. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్లో ఉన్నాడు. ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. బిగ్బాస్ ద్వారా అప్పులు తీర్చేసి మరింత ఎదిగాడు. ఇప్పుడు మరోసారి బిగ్బాస్ 8లో వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచి తానేంటో నిరూపించుకున్న అవినాష్ ఫినాలేలో ఐదో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. -
బిగ్బాస్ 8 రీలోడ్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ.. వాటే ట్విస్ట్
గత ఏడు సీజన్లకంటే కూడా ఈసారి బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు అత్యధిక టీఆర్పీ వచ్చింది. కానీ కంటెస్టెంట్లు ఆ రేటింగ్ను అలాగే కాపాడుకోలేకపోయారు. నెమ్మదిగా షో బోరింగ్గా మారుతుండటంతో బిగ్బాస్ ఇక లాభం లేదనుకుని పాత సీజన్లలో పాల్గొన్న పలువురినే వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట హౌసులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం.. 'బిగ్బాస్ గ్రాండ్ రీలోడ్' పేరిట ఎపిసోడ్ ప్రసారమైంది. ఇంతకీ హౌస్లోకి వచ్చిందెవరో చూసేయండి..నైనిక ఎలిమినేట్'జవాన్' టైటిల్ సాంగ్, 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్గా రిలీజైన 'రా మచ్చా' పాటలకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఎలా ఎదుర్కోబోతున్నారో ఎదుర్కోబోతున్నారని హౌస్మేట్స్ను అడగ్గా వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరున ఏడ్చేసింది.ఎవరికి ఏ ట్యాగ్?స్టేజీపైకి వచ్చిన నైనికని హౌసులో ఎవరు ఎలాంటి వారనేది నాగ్ అడగ్గా.. ప్రేరణ మ్యానిప్యులేటర్, మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి, విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు, పృథ్వీ అటెన్షన్ సీకర్, నబీల్ అవకాశవాది, సీత నిజమైన ఫ్రెండ్, నిఖిల్ గేమ్ ఛేంజర్, యష్మిది మంద బుద్ధి అని చెప్పుకొచ్చింది.ఉత్తరాలు వచ్చాయ్..ఈ వారం హౌస్మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్, యష్మి, మణికంఠ తమ లెటర్స్ అందుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్) టీమ్గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్గా ఉంటాయని నాగ్ వెల్లడించాడు.. తొలి వైల్డ్ కార్డ్గా హరితేజసీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్బాస్ మొదటి సీజన్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్గానూ అవతారమెత్తింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. తనకు నవదీప్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపించారు. అలానే హౌసులోకి వెళ్లేముందు స్టేజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.రెండో వైల్డ్ కార్డ్గా టేస్టీ తేజతేజ అసలు పేరు తేజ్దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ చేసిన పాల తాళికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు. అలానే తేజకి శోభాశెట్టి బెస్ట్ విషెస్ చెప్పింది.మరో రూ.20 లక్షలుసెట్పైకి వచ్చిన స్వాగ్ టీమ్ (శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్) తన సినిమా కబుర్లు చెప్పింది .తర్వాత హౌస్లోకి వెళ్లి హౌస్మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్తో గేమ్ ఆడించారు. ఈ గేమ్లో వైల్డ్కార్డ్ కంటెస్టెంట్లు హరి-తేజ గెలిచి రూ.20 లక్షలు ప్రైజ్మనీలో యాడ్ చేశారు. అనంతరం మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా నయని పావని హౌస్లో అడుగుపెట్టింది.మూడో వైల్డ్ కార్డ్గా నయని పావనిఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్టాక్ స్టార్గా ఫేమస్. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక శివాజీ.. నయనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.నాలుగో వైల్డ్ కార్డ్గా మెహబూబ్డ్యాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. ఇక మెహబూబ్ కోసం సొహైల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలానే నాలుగో సీజన్లో ఎలా అయితే ఆడావో ఈసారి అంతకు మించి ఆడి గెలవాలన్నాడు.'జనక అయితే గనక' మూవీ ప్రమోషన్లో భాగంగా సుహాస్, దిల్ రాజ్ టీమ్ వచ్చారు. సుహాస్, హీరోయిన్ సంగీర్తన హౌసులోకి వెళ్లి ఓజీ, రాయల్ టీమ్స్తో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచిన సీత-మణికంఠ.. బెడ్ రూమ్, రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.ఐదో వైల్డ్ కార్డ్గా రోహిణిఒకప్పుడు సీరియల్స్లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్సిరీస్లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. తన కామెడీ టైమింగ్స్తో అందరికీ వినోదాన్ని పంచుతోంది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపిస్తోంది. బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంది.ఆరో వైల్డ్ కార్డ్గా గౌతమ్ కృష్ణగౌతమ్ కృష్ణ.. బిగ్బాస్కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్బాస్ ఏడో సీజన్తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్లోనూ సిద్దూ: ది రాక్స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్కు వెళ్లాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చాడు.ఏడో వైల్డ్ కార్డ్గా అవినాష్ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్బాస్కు వెళ్లాడు. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్లో ఉండి ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్బాస్ 8లో వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలానే స్టేజీపై మణికంఠ, నబీల్, విష్ణుప్రియలా యాక్ట్ చేసి నవ్వించాడు.ఎనిమిదో వైల్డ్ కార్డ్గా గంగవ్వవయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది. స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్బాస్ 8లోకి వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.రాయల్ టీమ్కు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ టీమ్కు చివరగా మరో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ ఆడారు. ఓజీ టీమ్పై వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్లో మూడో వైల్డ్ కార్డ్.. ఎవరో గుర్తుపట్టారా?
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ను రీలోడ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఎలిమినేట్ అవగా హౌస్లో 9 మంది మాత్రమే మిగిలారు. వీరితో షో లాక్కురావడం కష్టమని భావించిన బిగ్బాస్ టీమ్.. రేపు హౌస్లోకి ఎనిమిది మంది వైల్డ్కార్డ్ ఎంట్రీలను పంపనుంది.గుర్తుపట్టారా?ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను గుర్తుపట్టండి అంటూ టేస్టీ తేజ, రోహిణిల ఫోటోలు షేర్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ను గుర్తుపట్టండి అంటూ హాట్స్టార్ ఓ ఫోటో వదిలింది. ఈ ఫోటో చూసిన బిగ్బాస్ ప్రియులు అతడెవరో ఇట్టే గుర్తుపట్టేశారు.మరోసారి డాక్టర్బాబు రీఎంట్రీగత సీజన్లో రెండుసార్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు అని చెప్తున్నారు. బిగ్బాస్ ఏడో సీజన్లో డాక్టర్ బాబు అలియాస్ గౌతమ్ కృష్ణ పాల్గొన్నాడు. అతడిని ఫేక్ ఎలిమినేషన్ ద్వారా సీక్రెట్ రూమ్కు పంపించి తిరిగి హౌస్లోకి వెళ్లనిచ్చారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హౌస్లో అడుగుపెట్టబోతున్నాడు. నాలుగో వైల్డ్ కార్డ్ను గుర్తుపట్టండంటూ బిగ్బాస్ టీమ్ మరో ఫోటో రిలీజ్ చేసింది. అది చూసిన నెటిజన్లు.. మెహబూబ్, అవినాష్లలో ఎవరో ఒకరు అయి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. On his way to cause trouble ‼️ Who could it be? 🤔#biggbosstelugu8 pic.twitter.com/TSKkS8tkrH— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 5, 2024 All set to cause Chaos 🔥Who could this be? #biggbosstelugu8 pic.twitter.com/RnQinEQDb7— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 5, 2024మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8.కొత్త పోకడ, మాజీ కంటెస్టెంట్లతో వర్కవుట్ అవుతుందా?
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డులను తీసుకురావాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. సీజన్ ప్రారంభమయ్యే రోజు కేవలం 14 మందినే హౌస్లోకి పంపించి.. వైల్డ్కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని స్పష్టంగా చెప్పేశారు. హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో చాలామందికి గేమ్ మీదకన్నా కొట్లాటలు, ముచ్చట్ల మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఒకరిద్దరికి తప్ప ఎవరికీ విజేత లక్షణాలు లేవు.ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలువీరితో షో నెట్టుకురావడం కష్టమని భావించిన బిగ్బాస్ టీమ్ వైల్డ్గా ఉంటే కంటెస్టెంట్లను తీసుకురావాలని ప్లాన్ చేసింది. కొత్తవాళ్లను తీసుకొస్తే వర్కవుట్ అవుతుందో, లేదోనని డౌట్ పడ్డారో ఏమో కానీ పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఒక్కో సీజన్లో నుంచి ఒక్కో ఆణిముత్యాన్ని తీసుకుని హౌస్లోకి పంపించనున్నారు. అలా హరితేజ, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, మెహబూబ్ దిల్సేను ఎంపిక చేసినట్లు భోగట్టా! హౌస్లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లు చాలా బెటర్.గంగవ్వఇకపోతే గంగవ్వను తీసుకురావడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బిగ్బాస్ నాలుగో సీజన్లో గంగవ్వతోనే ఐదు వారాలు ఆటను నెట్టుకొచ్చారు. అయితే ఏసీ పడట్లేదు, హౌస్లో ఉండలేను, నన్ను పంపించండి మహాప్రభో.. అని బతిమాలడంతో ఆమెను ఎలిమినేట్ చేసేశారు. కానీ సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న కోరికతో బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టిన గంగవ్వ కలను నాగార్జున సాకారం చేశాడు. ప్రస్తుతం హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మాజీ కంటెస్టెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట! (చదవండి: బిగ్బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆదిత్య ఔట్)ముచ్చటగా మూడోసారి..అందుకే గంగవ్వను బతిమాలో, బలవంతపెట్టోగానీ హౌస్కు తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తనవల్ల కాదని గంగవ్వ చేతులెత్తేయడంతో ఆమె స్థానంలో వితికా షెరును తీసుకువస్తున్నారన్నది లేటెస్ట్ టాక్ గౌతమ్ కృష్ణ.. అశ్వత్థామ 2.0 అంటూ అప్పట్లోనే సీక్రెట్రూమ్కు వెళ్లి వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా మళ్లీ హౌస్లో అడుగుపెట్టాడు. ముచ్చటగా మూడోసారి హౌస్లోకి వెళ్లబోతున్న ఇతడు ఎలా మెప్పిస్తాడో చూడాలి. రోహిణి, అవినాష్, హరితేజల గురించి భయపడాల్సిన పనేలేదు.నయని పావనిఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో వీళ్లెప్పుడూ ముందుంటారు. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఒక్కవారంలోనే ఎలిమినేట్ అయింది. కానీ వారం రోజుల్లోనే తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. మరి ఈసారైనా ఎక్కువవారాలు ఉంటుందేమో చూడాలి. మెహబూబ్ టాస్కులు బాగా ఆడతాడు, తేజ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. మరి ఈ ఎనిమిది మంది హౌస్లో ఉన్నవారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తారేమో వేచి చూడాలి!బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ బుల్లితెరపై ప్రసారమయ్యే షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. జగిత్యాల జిల్లాలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన ఈ కమెడియన్ అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 2021లో అనూజతో పెళ్లి జరగ్గా గతేడాది ఆమె ప్రెగ్నెన్సీ వార్తను వెల్లడించాడు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో అబార్షన్ అయిందని బ్యాడ్ న్యూస్ చెప్పాడు.ఐదు నెలల క్రితమే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. 2021లో అనూజతో నా పెళ్లి జరిగింది. గతేడాది తను గర్భవతి. ఐదు నెలల క్రితమే బిడ్డను కోల్పోయాం. తెల్లవారితే డెలివరీ అనగా సడన్గా అనూజ కడుపులో బేబీ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఉమ్మునీరు మింగడం వల్ల అలా జరిగి ఉండొచ్చన్నారు.అర్ధరాత్రి రోడ్డుపై..అప్పుడు నేను స్టేజీపై షూటింగ్లో ఉన్నాను. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఏదో ఒకటి చేయండని డాక్టర్ కాళ్ల మీద పడ్డాను. హార్ట్బీట్ ఆగిపోతే ఏం చేయలేమన్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఎటు వెళ్తున్నానో కూడా తెలీకుండా రోడ్డుపై ఏడ్చుకుంటూ ఒంటరిగా సాగిపోయాను. ఆ శిశువును బయటకు తీస్తే అచ్చం నాలాగే ఉన్నాడు. 2.75 కిలోల బరువుతో పుట్టాడు. కానీ వాడిలో ప్రాణం లేదు. ఇప్పటికీ నా భార్య అర్ధరాత్రిళ్లు కుమిలి కుమిలి ఏడుస్తోంది. తొమ్మిది నెలలు మోసింది కదా.. ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది' అని అవినాష్ ఎమోషనలయ్యాడు.చదవండి: Satish Joshi: స్టేజీపై కుప్పకూలి తుదిశ్వాస విడిచిన నటుడు -
‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ
టైటిల్: మార్కెట్ మహాలక్ష్మినటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులునిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్ నిర్మాత: అఖిలేష్ కలారుదర్శకత్వం: వియస్ ముఖేష్సంగీతం: జో ఎన్మవ్ నేపథ్య సంగీతం: సృజన శశాంకసినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుములఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘కేరింత’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పార్వతీశం. ఆ సినిమాలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ ఏర్పాటు చేసింది చిత్రబృందం. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి(కేదార్ శంకర్) తన కుమారుడు (పార్వతీశం)ని ఇంజనీరింగ్ చదివిస్తాడు. అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్లని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తోంది. లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు తండ్రి. అలాంటి సంబంధాలనే తీసుకొస్తాడు. కానీ పార్వతీశం(ఈ సినిమాలో హీరో పాత్రకి పేరు లేదు) మాత్రం అన్నింటిని రిజెక్ట్ చేసి, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్ ‘మార్కెట్ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది.దీంతో తనను ఒప్పించేందుకు మార్కెట్లోనే తిష్టవేస్తాడు. చివరకు మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పార్వతీశం.. కూరగాయలు అమ్ముకునే అమ్మాయినే ఎందుకు ఇష్టపడ్డాడు? మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? తన సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్ అయింది? మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?పెళ్లి తర్వాత అమ్మాయి.. అబ్బాయి వాళ్ల ఇంటికే ఎందుకు వెళ్లాలి? అబ్బాయియే అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చి ఎందుకు కాపురం చేయకూడదు? ఉద్యోగ రిత్యా చాలా మంది తమ పెరెంట్స్కి దూరంగా ఉంటున్నారు కదా? మరి అమ్మాయి ఇంటికి వెళ్లి ఉంటే జరిగే నష్టమేంటి? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు. అది మన సంప్రదాయం అని.. ఫాలో అవ్వడమే తప్ప అలానే ఉండాలని ఎక్కడా రాసి పెట్టిలేదు. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు వియస్ ముఖేష్.పెరెంట్స్కి దూరంగా ఉన్నా సరే..వారి బాగోగులను చూసుకునే బాధ్యత మనదనే విషయం గుర్తుంటే చాలు అనే సందేశాన్ని వినోదాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్గా ఎందుకు బతకాలో ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా, సందేశాత్మకంగా ఉంది కానీ.. ఆ పాయింట్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు. కథలోని ఎమోషన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. హీరో.. హీరోయిన్ని చూసి ప్రేమలో పడే సీన్తో పాటు చాలా సన్నివేశాలు సినిమాటిక్గా అనిపిస్తాయి. అలాగే ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు కూడా అంతగా ఆకట్టుకోవు. అక్కడ మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా.. సరిగా వాడుకోలేదోమో అనిపిస్తుంది. అయితే సెకండాఫ్లో మాత్రం దర్శకుడు బలమైన సన్నివేశాలను రాసుకున్నాడు. క్లైమాక్స్లో ప్రేక్షకులను ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథే ఇది. కట్నం కోసం కొడుకును ఇంజనీరింగ్ చదివించాలని గుమాస్తాగా పని చేసే తండ్రి ఆలోచించే సీన్తో కథ ప్రారంభం అవుతుంది. హీరో ఎంట్రీ సీన్ కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం స్లోగా సాగుతుంది. మార్కెట్లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్లు వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ కథంతా మార్కెట్ చుట్టే తిరుగుతుంది. మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడం కోసం హీరో చేసే పనులు పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అలాగే చాలా వరకు కథనం నెమ్మదిగా, ఊహకందేలా సాగుతుంది. మహాలక్ష్మి ఎందుకు ఇండిపెండెంట్గా బతకాలని అనుకోవాడానికి గల కారణం కన్విన్సింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ బాగుటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పార్వతీశం చక్కగా నటించాడు. గత సినిమాలతో పోల్చితే నటన పరంగా ఆయన బాగా మెప్పించాడని చెప్పొచ్చు. ఇక మార్కెట్ మహాలక్ష్మిగా ప్రణికాన్విక ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. తెరపై ఆ విషయం తెలియకుండా చక్కగా నటించింది. హీరో ప్రెండ్గా ముక్కు అవినాష్ కనిపించేంది కాసేపే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ బ్రదర్, తాగుబోతుగా మహబూబ్ బాషా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ‘కోటర్ ఇస్తే చెబుతా’ అంటూ ఆయన పండించిన కామెడీ బాగుంది. కేదార్ శంకర్, జయ, పద్మ, హర్షవర్దన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సృజన శశాంక భ్యాగ్రౌండ్ స్కోర్, జో ఎన్మవ్ మ్యూజీక్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
'మార్కెట్ మహాలక్ష్మి' మూవీ ట్రైలర్ వేడుక (ఫొటోలు)
-
'కూరగాయలు అమ్మేదాన్ని ఎలా చేశావ్ బ్రో'.. ఆసక్తిగా ట్రైలర్!
కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తోన్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బీ2పీ స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో పార్వతీశం మాట్లాడుతూ.. 'ఫ్రాంక్గా చెప్పాలంటే.. కేరింత తర్వాత మంచి హిట్ కొట్టలేకపోయాను. వరుస ఫ్లాప్లతో చాలా డిప్రెషన్లో ఉన్నా. అప్పుడే మనోడు ముఖేష్ నాకు కథ చెప్పాడు. మొదట్లో దర్శకుడిపై నమ్మకం లేదు. కానీ 4-5 రోజుల షూటింగ్ తర్వాత అతనిపై నాకు నమ్మకం ఏర్పడింది. కేరింత చిత్రానికి ఎంత మంచి పేరు వచ్చిందో అదే విధంగా మార్కెట్ మహాలక్ష్మికి కూడా వస్తుందని నమ్ముతున్నా.' అని అన్నారు. హీరోయిన్ ప్రణీకాన్విక మాట్లాడుతూ..'తెలుగులో ఇది నా మొదటి సినిమా. సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ని చూస్తున్నా. మంచి టాలెంట్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. మార్కెట్ మహాలక్ష్మిలో నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది' అని అన్నారు. ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. "మార్కెట్ మహాలక్ష్మిలో నేను రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. పార్వతీశం, ప్రణీకాన్వికతో నా కాంబినేషన్ సీన్స్ నవ్విస్తాయి. దర్శకుడు నా క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. మార్కెట్ మహాలక్ష్మిని థియేటర్లలో చూసి మా టీమ్కి సపోర్ట్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకి థాంక్స్" చెప్పారు. డైరెక్టర్ వీఎస్ ముఖేష్' మాట్లాడుతూ.. ‘నేను కథ రాసుకున్నప్పుడు టైటిల్ వెంటనే తట్టింది మార్కెట్ మహాలక్ష్మి. అప్పుడే ఫిక్స్ అయ్యా. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి హీరోలు, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు అయితే బాగుంటుంది. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా తీసుకోలేకపోయామని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జో ఎన్మవ్ సంగీతమందిస్తున్నారు. -
బిడ్డను కోల్పోవడంపై తొలిసారి పెదవి విప్పిన అవినాష్
గర్భం దాల్చింది మొదలు.. పొట్టలో ఉన్న బుజ్జాయి ఎప్పుడు బయటకు వస్తుందా? ఆ బిడ్డను ఎప్పుడు ఎత్తుకుందామా? అని ఆ మహిళ తెగ ఆరాటపడుతూ ఉంటుంది. ఇక తండ్రి కాబోతున్నానోచ్ అని గాల్లో తేలే భర్త పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ ముందస్తుగానే సిద్దం చేసి పెడతాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారికి తల్లిదండ్రులుగా ప్రమోషన్ లభించినట్లే! జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్- అనూజ కూడా త్వరలోనే అమ్మానాన్న కాబోతున్నామని సంతోషించారు. సీమంతం చేశారు. మెటర్నటీ షూట్ చేశారు. బాధను భరిస్తూ నవ్వించాడు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. పురిటిలోనే బిడ్డ మరణించింది. ఈ విషాద వార్తను జనవరి 7న సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు అవినాష్. అంతటి బాధను పంటి కిందే భరిస్తూ సినిమాలు, ఈవెంట్లు చేస్తున్నాడు. అందరినీ నవ్విస్తున్నాడు. తాజాగా తొలిసారి ఆ బాధాకర ఘటన గురించి మాట్లాడాడు. 'నా బిడ్డ చనిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది కాల్స్ చేశారు. వారికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. దేవుడు మాకలా రాసిపెట్టాడు పైగా నేను మాట్లాడే స్థితిలో లేకపోవడం వల్ల ఎవరి ఫోనూ లిఫ్ట్ చేయలేదు. దీని గురించి అడగొద్దు అని చెప్పినప్పటికీ మానవత్వంతో ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు. చాలా ఫోన్లు చేశారు, మెసేజ్లు చేశారు. మా మీద అంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా జీవితంలో అదొక కరిగిపోయిన మేఘంలాంటిది. దేవుడు మాకు అలా రాసిపెట్టాడు. భవిష్యత్తులో ఏదైనా ఇంకా బెస్ట్ రాబోతుందేమో చూడాలి! అని చెప్పుకొచ్చాడు. కాగా అవినాష్-అనూజ 2021వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: ప్రజలకు రుణపడి ఉంటా.. చేతనైనంతలో సాయం చేయాలనుకున్నా.. పుష్ప 3 ఉందని రూమర్స్.. అలా చేస్తే చిక్కులు గ్యారంటీ! -
బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్
'జబర్దస్త్' షోతో చాలామంది వెలుగులోకి వచ్చారు. వీరిలో ఒకడు అవినాష్. అయితే ముక్కు అవినాష్ అనే పేరుతో ఇతడు పాపులర్ అయ్యాడు. ప్రసుత్తం పలు ఈవెంట్స్, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. 2021 నవంబరులో అవినాష్.. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు స్వయంగా అవినాష్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యతో కలిసి ప్రెగ్నెన్సీ విషయమై పలు వీడియోస్ చేస్తూ వచ్చిన అవినాష్ దంపతులు.. ఇప్పుడు బిడ్డ చనిపోవడంతో బాధపడుతున్నారు. ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన అవినాష్.. దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగి మరింత బాధపెట్టొద్దని చెప్పుకొచ్చాడు. అయితే పురిట్లోనే బిడ్డ చనిపోయిందా? లేదా ప్రసవించిన తర్వాత చనిపోయిందా? అనే విషయం అవినాష్ చెప్పలేదు. (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్) 'నా లైఫ్లో సంతోషమైన, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది' 'అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్' అని కమెడియన్ అవినాష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
చిల్లిగవ్వ లేదు, ఫ్యాన్కు ఉరేసుకుందామనుకున్నాడు: అవినాష్ సోదరుడు
ముక్కు అవినాశ్.. జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్గా గుర్తింపు పొందాడు. బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించాడు. తర్వాత కూడా పలు రియాలిటీ షోలలో పాల్గొని మెరిశాడు. ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. షోలు, ఈవెంట్ల ద్వారా బాగానే వెనకేసిన అవినాష్ ఒకానొక సమయంలో మాత్రం తినడానికి తిండి లేక అలమటించాడు. తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యాడు అవినాష్ సోదరుడు అజయ్. చికెన్ కూడా వద్దన్నాడు! అతడు మాట్లాడుతూ.. 'లాక్డౌన్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఇల్లు, కారు తీసుకున్నాం. ఈ రెండు ఈఎమ్ఐలతో పాటు బయట చిన్నపాటి అప్పులు కూడా ఉండేవి. ఈఎమ్ఐలు కట్టకపోవడంతో నోటీసులు వచ్చాయి. మరోవైపు షూటింగ్స్ ఆగిపోవడంతో చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. ఈ పరిణామాలతో అన్న మానసికంగా కుంగిపోయాడు. ఒకరోజు సరదాగా చికెన్ వండుకుందాం అని అడిగాను. మన పరిస్థితే బాలేదు, రోజూ పప్పు తింటున్నాం కదా.. ఇప్పుడు కూడా అదే తిందాం.. చికెన్ అవసరమా? అన్నాడు. అలాంటి రోజులు కూడా మా జీవితంలో ఉన్నాయి. వాళ్ల సాయంతోనే.. అన్న ఒక రూమ్లో, నేను ఇంకో రూమ్లో నిద్రించేవాళ్లం. అన్న ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉదయం 5 గంటల వరకు పడుకునేవాడే కాదు. ఈ అప్పులు, ఒత్తిళ్ల వల్ల ఒకానొక సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోదామన్న ఆలోచన కూడా వచ్చింది! బిగ్బాస్కు వెళ్లే ముందు తాను చనిపోదామనుకున్న విషయాన్ని నాతో చెప్పాడు. అప్పుడు అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి! అన్న జేబులో రూపాయి లేదు. ఆ సమయంలో బిగ్బాస్ ఆఫర్ రావడంతో ఒప్పుకున్నాడు. జబర్దస్త్కు రూ.10 లక్షలు ఇచ్చి ఆ షో నుంచి బయటకు వచ్చాడు. శ్రీముఖి రూ.5 లక్షలు, గెటప్ శ్రీను రూ.1 లక్ష, చమ్మక్ చంద్ర రూ.2 లక్షలు.. ఇలా అందరి దగ్గరా అప్పు చేసి ఆ డబ్బు ఇచ్చేశాడు. దేవుడి దయ వల్ల బిగ్బాస్ తర్వాత తన కెరీర్ ఇంకా బాగుంది' అని చెప్పాడు అజయ్. బిగ్బాస్ హౌస్లో కష్టాలు చెప్పుకున్న అవినాష్ బిగ్బాస్ హౌస్లోనూ లాక్డౌన్లో తాను పడ్డ కష్టాలను చెప్పాడు అవినాష్. లాక్డౌన్లో ఇంటి ఈఎమ్ఐ కట్టలేకపోయానన్నాడు. ఎందుకంటే అదే సమయంలో తండ్రికి గుండెపోటు రావడంతో మూడు స్టంట్లు వేయడానికి ఇంటి కోసం ఉంచిన రూ. 4 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. అలాగే అమ్మకు కీళ్లు అరిగిపోతే వైద్యం చేయించినట్లు పేర్కొన్నాడు. అప్పుల వల్ల ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపాడు. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. ఆనందంలో తేలియాడుతున్న శోభ -
Mukku Avinash: బేబీ బంప్తో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ భార్య (ఫొటోలు)
-
ముక్కు అవినాశ్ భార్య సీమంతం ఫంక్షన్లో సోహైల్ రచ్చ..
బిగ్బాస్ షోతో బడా క్రేజ్ సంపాదించుకున్న నటుడు సయ్యద్ సోహైల్ రియాన్. అప్పటిదాకా చిన్నాచితకా పాత్రలు చేసిన సోహైల్ ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోగా మారాడు. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించగా మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఇకపోతే సినిమా ప్రమోషన్స్లో భాగంగా సోహైల్ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఇంట జరిగిన ఫంక్షన్కు వెళ్లాడు. అవినాశ్ భార్య అనూజ సీమంతం వేడుక జరిగిన విషయం తెలిసిందే! ఈ వేడుకకు వెళ్లిన సోహైల్ తనకూ సీమంతం చేయాలని పట్టుపట్టాడు. తాను కూడా ప్రెగ్నెంటేనని, తనకెందుకు ఫంక్షన్ చేయరని అడిగాడు. మగవాళ్లకు గర్భం రావడం ఏంటి? అని తిడుతూనే అవినాశ్ అతడిని కూర్చోబెట్టి పట్టు బట్టలు పెట్టి నెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. చివర్లో ఆగస్టు 18 డెలివరీ డేట్.. మిస్టర్ ప్రెగ్నెంట్ థియేటర్లలో చూడండి అని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చేశాక సోహైల్పై చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే అతడిని ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని లైట్ తీసుకున్నాడు. అంతదాకా ఎందుకు, ఈ సినిమా గురించి అతడి తల్లి కూడా మొదట్లో నెగిటివ్గా మాట్లాడింది. కానీ సినిమా చూశాక గర్వంగా ఫీలైంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావంటూ సోహైల్ను మెచ్చుకుంది. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’మూవీ రివ్యూ జైలర్లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై.. -
Mukku Avinash Buys New Car: కొత్త కారు కొన్న జబర్దస్త్ షో కమెడియన్ ముక్కు అవినాశ్
-
కొత్త కారు కొన్న ముక్కు అవినాశ్, తిట్టిపోస్తున్న నెటిజన్లు
జబర్దస్త్ షోతో కమెడియన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ముక్కు అవినాశ్. తన పంచులతో, కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కూడా అవినాశ్ పార్టిసిపేట్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ మధ్య బిగ్బాస్కు కూడా వెళ్లి తన కామెడీతో షోకి కొత్త కళను తీసుకొచ్చాడు. మొత్తంగా అవినాశ్ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే అన్న పేరు తెచ్చుకున్నాడు. ఇకపోతే అవినాశ్ భార్య అనూజ ప్రస్తుతం గర్భిణి అన్న సంగతి తెలిసిందే! ఓపక్క తండ్రి కాబోతున్నాడని సంతోషించే లోపే అతడి తల్లి మల్లమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిపాలైంది. ఇటీవలే మల్లమ్మకు గుండెలో స్టంట్స్ పడ్డాయి. ఈ విషయాన్ని అవినాశ్ స్వయంగా యూట్యూబ్ ఛానల్లో వెల్లడించాడు. ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ సమయంలో అవినాశ్ కొత్త కారు కొన్నాడు. పాత కారుకు యాక్సిడెంట్ అయిందని, అది డ్యామేజ్ కావడంతో దాన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త కారు కొన్నట్లు తెలిపాడు. మహీంద్రా ఎక్స్యూవీ 700 కారును కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దీని ధర దాదాపు రూ.25 లక్షల మేర ఉంటుందని తెలుస్తోంది. ఈ కారుకు పూజ చేయించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేశాడు. చాలామంది అభిమానులు అతడికి శుభాకాంక్షలు చెప్తుంటే కొంతమంది మాత్రం అవినాశ్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'అమ్మకు గుండెపోటు వచ్చి స్టంట్స్ వేయించుకుని అనారోగ్యంతో బాధపడుతుంటే ఇప్పుడు కొత్త కారు తీసుకోవడం అవసరమా?' అని కామెంట్లు చేస్తున్నారు. 'మీ అమ్మకు ఆరోగ్యం బాగోలేదని వీడియో తీశావు. ఆ వీడియో ద్వారా వచ్చిన డబ్బుతో అప్పుడే కొత్త కారు కొన్నావు. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయే' అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: గుంటూరు కారం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అవుట్ -
జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ తల్లి మల్లమ్మ అస్వస్థతకు లోనైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెలో బ్లాక్స్ ఉండటంతో వైద్యులు స్టంట్స్ వేశారు. ఈమేరకు ఓ వీడియోను ముక్కు అవినాశ్ తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. 'ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బందిపడటం చూడలేకపోతున్నా. తను ముందు నుంచే షుగర్ వ్యాధితో బాదపడుతోంది. ఈ షుగర్ వల్ల నచ్చిన ఫుడ్ కూడా తినలేకపోతోంది. ఈ మధ్యే అమ్మకు గుండెపోటు(హార్ట్ స్ట్రోక్) వచ్చింది. తనను ఊరిలో ఆస్పత్రికి తీసుకెళ్తే అమ్మ గుండె వీక్ ఉందన్నారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడే ఒక ఆస్పత్రిలో చూపించాను. గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఆంజియోగ్రామ్ చేయించాం, రెండు స్టంట్స్ వేయించాం. తననిప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి' అని చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన పరిస్థితిని తలుచుకుని అవినాశ్ తల్లి కన్నీటిపర్యంతమైంది. 'నా కొడుకులు బతికించారు, అందుకే బతికినా. జరగబోయేది నాకు తెల్వదు. మీ దయ వల్ల మంచిగుండి డ్యాన్స్ చేశిన, అన్నీ చేశిన. నాకిప్పుడు ఈ కష్టం వచ్చింది. మీరు లేకుంటే బతకలేను, నా పెద్ద కొడుకు లేకపోయుంటే ఊరిలోనే నా ప్రాణం పోయేది. వాడు తొందరగా నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించడం వల్లే బతికి ఉన్నాను' అంటూ ఏడ్చేసింది. కొద్దిరోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ముక్కు అవినాశ్ తల్లిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. చదవండి: శామీర్పేట్ ఘటన.. నాకు సంబంధమే లేదంటున్న నటుడు మనోజ్ -
గుడ్న్యూస్ చెప్పిన జబర్దస్త్ అవినాష్.. త్వరలో బుజ్జి పాపాయి!
ముక్కు అవినాష్.. ఇతడు ఎక్కడుంటే అక్కడ నవ్వుల పంట పండాల్సిందే! ఏ షోలో అడుగుపెట్టినా 100% ఎంటర్టైన్మెంట్ అందిస్తాడు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఇతడు జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బిగ్బాస్ రియాలిటీ షోలోనూ అడుగుపెట్టి మరింత ఫేమస్ అయ్యాడు. బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్గా పేరు తెచ్చుకున్నాడు. తన భార్యతో కలిసి రియాలిటీ షోలు కూడా చేసిన అవినాష్ తాజాగా ఓ గుడ్న్యూస్ చెప్పాడు. త్వరలో తాము పేరెంట్స్గా ప్రమోషన్ పొందబోతున్నామని శుభవార్త తెలిపాడు. ఈ మేరకు ఇద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ యూట్యూబ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'నా భార్య అనూజ ప్రెగ్నెంట్. మా ఇంట్లోకి బాబు లేదా పాపాయి రాబోతోంది. మా పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. అక్టోబర్లో మా పెళ్లి రోజు. పిల్లల్నెప్పుడు కంటారు? అని మమ్మల్ని ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పాం. పెళ్లైన ఏడాదిన్నరకే మేము తల్లిదండ్రులం కాబోతుండటం ఆనందంగా ఉంది. మూడు నెలల వరకు ఎవరికీ చెప్పొద్దని వైద్యులు సలహా ఇచ్చారు. ఇప్పుడు తనకు నాలుగో నెల. అందుకే ఇన్నాళ్లకు ఈ విషయం బయటకు చెప్తున్నాం. మా కంటే కూడా మా అమ్మానాన్న, అత్తామామలు సంతోషంగా ఫీలయ్యారు. నాలుగో నెలలో బేబీ గుండెచప్పుడు కూడా విన్నాం. అప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను' అని ఆనందం వ్యక్తం చేశాడు అవినాష్. చదవండి: ప్రియుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా.. నాన్నకు తెలిసి గుండెపోటు: నటి -
ఫోటో తీసెయ్.. కమెడియన్ అవినాష్కి బన్నీ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ ఇది. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్గా బన్నీ బర్త్డే సందర్భంగా పుష్ప-2 నుంచి అదిరిపోయే స్పెషల్ వీడియోతో పాటు బన్నీ లుక్ని రివీల్ చేసి మేకర్స్ షాక్ ఇచ్చారు. ఫస్ట్లుక్ రిలీజ్ చేసిన క్షణాల్లోనే పుష్ప-2 పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. చీరకట్టు, ముక్కు పుడకతో కనిపించి బన్నీ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్ప-2 లుక్ని ఇమిటేట్ చేస్తూ అరకొర ఎడిటింగ్తో పుష్పరాజ్లా మారిపోయాడు కమెడియన్ అవినాష్. జబర్దస్త్ స్కిట్స్, బిగ్బాస్ షోతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా బన్నీ లుక్ని కాస్త మార్ఫింగ్ చేసి తన ఫోటోను పెట్టుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్పై ఫైర్ అవుతున్నారు.అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది అంటూ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. అర్జెంట్గా ఫోటో డిలీట్ చేయకపోతే బాగోదు అంటూ వార్నింగ్లు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
బిగ్బాస్ హౌస్లో బీబీ జోడీలు.. ఎంటర్టైన్మెంట్ అదిరిపోలా!
రేపటితో బిగ్బాస్ షో కథ క్లోజ్ కానుంది. శ్రీసత్య ఎలిమినేట్ కావడంతో హౌస్లో ఐదుగురు మిగిలారు. వీరంతా ఫైనల్కు చేరుకున్నామన్న సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇకపోతే గత బిగ్బాస్ సీజన్లలో అలరించిన కొందరు కంటెస్టెంట్లతో త్వరలో బీబీ జోడీ రానుంది. ఈ షోలో ముక్కు అవినాష్- అరియానా, అఖిల్-తేజస్వి, అర్జున్- వాసంతి, సూర్య- ఫైమా, రవికృష్ణ- భాను, మెహబూబ్- అషు, చైతు- కాజల్, రోల్ రైడా-స్రవంతి జంటలుగా పాల్గొననున్నారు. ఈ షోను ప్రమోట్ చేసే క్రమంలో నేడు అషు, మెహబూబ్, అవినాష్, అరియానా హౌస్లో అడుగుపెట్టారు. ఇక ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్ అయిన అవినాష్ ఇంట్లో బెల్లీ డ్యాన్స్, నాగిని డ్యాన్స్ చేసి అందరినీ నవ్వించారు. మరి మాజీ కంటెస్టెంట్ల రచ్చ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: డబ్బు కోసమే వచ్చానన్న శ్రీసత్య ఎంత సంపాదించిందంటే? తుస్సుమన్న అవతార్ 2, ఆసినిమాను కూడా దాటలేకపోయింది -
ఏడేళ్ల కష్టార్జితంతో కొన్న ముక్కు అవినాష్ ఇల్లు చూశారా?
Mukku Avinash Shares Home Tour Video: కామెడీ షోలో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించిన ముక్కు అవినాష్ బిగ్బాస్ షోతో వారికి మరింత దగ్గరయ్యాడు. బిగ్బాస్ తెలుగు నాల్గో సీజన్లో పాల్గొన్న అతడు కంటెస్టెంట్లందరితో కలిసిపోతూనే వారిని సరదాగా ఓ ఆటాడిస్తూ ఫుల్ కామెడీ చేసి జనాలను తెగ నవ్వించాడు. బుల్లితెరపై కమెడియన్గానే కాకుండా సినిమాల్లో నటుడిగానూ రాణిస్తున్నాడు. ఇటీవల అవినాష్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఈ క్రమంలో భార్య అనుజతో కలిసి యూట్యూబ్ వీడియోలు, రీల్స్, ఫొటోషూట్స్ అంటూ తెగ సందడి చేస్తున్నాడు. తాజాగా అతడు తన ఇంటిని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాడు. సుమారు ఏడేళ్ల కష్టపడ్డ అనంతరం ఆ డబ్బుతో ఇల్లు, కారు కొనుక్కున్నానని తెలిపాడు. తనది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అంటూ ఇల్లు మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. స్కూల్ఫ్రెండ్ జగదీశ్ తన ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేశాడన్న అవినాష్ తనకు వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను చూపిస్తూ వాటి వెనక స్టోరీని వెల్లడించాడు. బాల్కనీ, కిచెన్, డైనింగ్ టేబుల్, పూజా గది, బెడ్ రూమ్.. ఇలా అన్నింటినీ చూపించాడు. పుట్టబోయే పిల్లల కోసం, ఇంటికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మరో రెండ్ బెడ్ రూమ్స్ను సైతం చూపించాడు. వారి అభిరుచికి తగ్గట్లుగా ఆయా గదుల్లో థీమ్ పోస్టర్లను అతికించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. మీ జంట చూడముచ్చటగా ఎలా ఉందో మీ హౌస్ కూడా అంతే బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. -
దీపావళికి ఎంటర్టైన్మెంట్ మోత, బిగ్బాస్లోకి మాజీ కంటెస్టెంట్లు!
Bigg Boss 5 Telugu, Diwali Episode: పండగ వచ్చిందంటే చాలు సంబరాలు రెట్టింపు చేస్తుంది బిగ్బాస్ టీమ్. దసరాకు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసిన బిగ్బాస్ ఈసారి దీపావళికి మరో కొత్త ప్లాన్తో ముందుకు రాబోతోంది. ఎంటర్టైన్మెంట్ను రెట్టింపు చేసేందుకు మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతోందట! అంటే ఈ వారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బిగ్బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ బాబా భాస్కర్, నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, దివి, సోహైల్, ముక్కు అవినాష్ సండే రోజు నాగ్తో కలిసి సందడి చేయబోతున్నారట! మరి వీరిని లోనికి పంపిస్తారా? లేదా గతేడాది లాగే ఓ ప్రత్యేక గదిలో పెట్టి అక్కడినుంచే గేమ్స్ ఆడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే మరోసారి వారిని బిగ్బాస్లో చూసే అవకాశం రావడంతో తెగ సంబరపడిపోతున్నారు వారి అభిమానులు. వారి రాకతో ఈ దీపావళి మరిత కలర్ఫుల్గా ఉండటం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఏదేమైనా ఈ మాజీ కంటెస్టెంట్లు షోలోకి వస్తున్నారన్న వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు బిగ్బాస్ లవర్స్, -
అవినాష్ పెళ్లిలో యాంకర్ శ్రీముఖి హల్ చల్
-
ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి!
టీవీ కమెడియన్, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ వివాహ వేడుక ముగిసింది. ఇటీవల తన చిన్ననాటి స్నేహితురాలైన అనుజను నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఈ రోజు ఆమె మెడలో మూడు మూళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది నటీనటుల మధ్య అవినాష్ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్స్ దివి, అరియాన గ్లోరీ, సయ్యద్ సోహైల్తో పాటు పలువురు వివాహ వేడుకకు హజరై సందడి చేశారు. చదవండి: పెళ్లి కొడుకుగా ముస్తాబైన ముక్కు అవినాష్..ఫోటోలు వైరల్ ఇక అవినాష్, అనుజ మెడలో తాళి కడుతున్న వీడియోను కమెడియన్ రాంప్రసాద్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అయితే అవినాష్ తన పెళ్లి వీడియోను తన సొంత యుట్యూబ్లో చానల్ ద్వారా విడుదల చేసి అందరికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. కానీ ముందుగానే రాంప్రసాద్ ‘సారీ అవినాష్ బ్లండర్ మిస్టేక్ జరిగింది. కానీ తప్పడం లేదు’ అంటూ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. అలాగే అరియాన, దివితో పాటు పలువురు నటీనటులు పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: పూజా నాకొక్కడికే స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు: అల్లు అర్జున్ View this post on Instagram A post shared by Jabardasth Ram Prasad (@jabardasth_ramprasad) -
పెళ్లికొడుకుగా ముస్తాబైన ముక్కు అవినాష్
-
పెళ్లి కొడుకుగా ముస్తాబైన ముక్కు అవినాష్..ఫోటోలు వైరల్
Mukku Avinash Haldi Function: టీవీ కమెడియన్, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఇంట పెళ్లి గంటలు మోగాయి. ఇటీవలె అనుజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ అతి మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత బిగ్బాస్ సీజన్ 4లో పెళ్లి పెళ్లి అంటూ కలవరించిన అవినాష్ ఎట్టకేలకు పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. సోమవారం అవినాష్ స్వస్థలంలోనే హల్దీ ఫంక్షన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో పలువురు టీవీ నటులు సహా నెటిజన్ల నుంచి అవినాష్కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్
Mukku Avinash Engagement Video: బుల్లితెర షోలపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనుజ అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం జరిగింది. గత బిగ్బాస్ సీజన్ 4లో పెళ్లి పెళ్లి అంటూ కలవరించిన అవినాష్ ఇలా గుట్టు చప్పుడుగా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైతేనే పెళ్లి పెళ్లి అంటూ తహతహలాడిన అవినాష్ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంతోషించారు. చదవండి: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే! అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కానీ, ఫుల్ ఫొటోలు కానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అవినాష్ తన ఎంగేజ్మెంట్ వీడియోను విడుదల చేశాడు. ‘జత కలిసే’ అంటూ నిశ్చితార్థం వీడియోను సోషల్ మీడియా వేదికగా అవినాష్ అభిమానులతో పంచుకున్నాడు. పూలు పండ్లు మార్చుకోవడం, ఆ తర్వాత అనుజతో అవినాష్ ఫొటో షూట్ చేయడం, కాబోయే శ్రీమతికి రొమాంటిక్గా ముద్దు పెట్టుకొని డ్యాన్స్ చేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో అవినాష్ ఎంగేజ్మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
అవినాష్ పెళ్లిపై స్పందించిన బిగ్బాస్ బ్యూటీ..
Ariyana Glory On Avinash Engagement: ముక్కు అవినాష్ జబర్దస్త్ కార్యక్రమంతో మంచి గుర్తింపే కాకుండా బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ నటుడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బిగ్బాస్ బ్యూటీ అరియాన గ్లోరీ స్పందించింది. బిగ్ బాస్ హౌస్లో అవినాష్, అరియానతో చనువుగా ఉండటం, ఈ షో అయ్యాక కూడా తరచూ వీరు కలిసి ఈవెంట్స్ చేయడం, గోవా ట్రిప్లు, వీడియోలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు వచ్చాయి. అయితే అవినాష్ తన పెళ్లి వార్తతో ఆ పుకార్లకు బ్రేక్ వేశాడు. ఇక దీనిపై అరియాన.. అవినాష్ పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ‘మా మధ్య ఏదో ఉందని చాలా పుకార్లు ఉన్నాయి కానీ అలాంటిదేమీ లేదు. తను నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అవినాష్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’..అని క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న అరియాన బాగా డబ్బు సంపాదించి, సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. చదవండి: Tollywood Drug Case: అమ్మతోడు ఈడీ కార్యాలయానికి అందుకే వచ్చా: బండ్ల గణేశ్ -
త్వరలోనే అవినాష్ పెళ్లి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్, అమ్మాయి ఎవరంటే..
Mukku Avinash Engagement Photos: తెలుగు బుల్లితెరపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల అవినాష్ నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అవినాష్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ‘సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు. మా కుటుంబాలు కలుసుకున్నాయి.. తర్వాత మేము కలుసుకున్నాం. ఇది మా నిశ్చితార్థం. చాలా మంది చాలా సార్లు నా పెళ్లి గురించి అడిగారు. అతి త్వరలోనే నా అనూజతో పెళ్లి. ఎప్పటి లాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఓ పోస్టు పెట్టాడు అవినాష్. ఇక అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం తెలియగానే.. అమ్మాయి ఎవరన్న విషయంపై అంతా చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ అమ్మాయి పూర్తి పేరు అనూజ వాకిటి. అవినాష్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయే తను. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
ముక్కు అవినాష్ తల్లికి అనారోగ్యం: CMRF నుంచి చెక్
బిగ్బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తల్లి అనారోగ్యానికి లోనైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్యానికి అవసరమయ్యే డబ్బును చెక్ రూపంలో అందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం (ముక్కు అవినాష్ తల్లి) అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నగదుకు సంబంధించిన చెక్కును శనివారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ లక్ష్మీరాజం కుమారుడు అవినాష్కు అందజేశారు. అనంతరం ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా అవినాష్ బిగ్బాస్ నాలుగో సీజన్లో వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తూ ప్రేక్షకులకు నాన్స్టాప్ కామెడీని పంచాడు. అరియానాతో స్నేహం చేస్తూ మోనాల్ను ఆటపట్టిస్తూ తెగ సందడి చేసిన అతడు ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: 'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్ 'ఆర్ఆర్ఆర్' నుంచి రామ్చరణ్కు స్పెషల్ సర్ప్రైజ్ -
వాళ్ళ వల్లే మంచి సినిమా తీయగలిగాను: విజయ్ కిరణ్
‘సక్సెస్ అనేది రెండు రకాలు. ఒకటి డబ్భుతో వచ్చేది, మరొకటి పేరుతొ వచ్చేది. ‘పైసా పరమాత్మ’ నాకు మంచి దర్శకుడిగా శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చింది. ఒక దర్శకుడిగా నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దానిని పర్ఫెక్ట్ గా వందశాతం స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగాను. సినిమా చూసిన ప్రేక్షకులు వందశాతం మార్కులు దర్శకుడికి వేశారు’అని అన్నారు పైసా పరమాత్మ దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల. యువకులు, బ్రహ్మతో క్రియేటివ్ స్టార్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కిరణ్ తిరుమల కొంతకాలం గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టి రీసెంట్ గా ‘పైసా పరమాత్మ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించారు. మార్చి 12న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తోంది. కాగా ఈ చిత్ర దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘పూర్తిగా స్టోరీ ని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మేము అనుకున్న ధియేటర్స్ కన్నా ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నటీనటులు అందరూ సూపర్బ్ గా నటించారు. క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయి ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఈ సందర్బంగా మా టీం అందరికీ నా స్పెషల్ థాంక్స్. అలాగే నేను కృతజ్ఞతలు చెప్పుకునేవారు ఇద్దరు వ్యక్తులు వున్నారు. మా అమ్మా, నాన్న. ఇంకోటి మా గురువుగారు. వాళ్ళ వల్లే నేను ఇంత మంచి సినిమా తీయగలిగాను. సక్సెస్ అనేది రెండు రకాలు. ఒకటి డబ్భుతో వచ్చేది, మరొకటి పేరుతొ వచ్చేది. ఈ సినిమా నాకు మంచి దర్శకుడిగా శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చింది. ఒక దర్శకుడిగా నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దానిని పర్ఫెక్ట్ గా వందశాతం స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగాను. సినిమా చూసిన ప్రేక్షకులు వందశాతం మార్కులు దర్శకుడికి వేశారు. అంటే నేను సక్సెస్ అయినట్టే . ఫ్రెష్ విజువల్స్ తో కొత్త కంటెంట్ వున్నా మా పైసా పరమాత్మ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. పూరి జగన్నాద్, త్రివిక్రమ్, కృష్ణ వంశీ గారు వాళ్ళ మార్క్ ఏంటో క్రియేట్ చేసుకున్నారు. అలా నాకంటూ నా స్టయిల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. క్యారెక్టర్స్ ఎలివేషన్ హైలెట్ గా చూపించడం జరిగింది. ఆర్టిస్టుల దగ్గరనుండి పాత్రకు తగ్గట్లు పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగాను. అన్ని ప్రధాన పాత్రలు బాగా ఈ చిత్రంలో పండాయి. టైటిల్ కి ఎంత మంచి పేరు వచ్చిందో సినిమాకి కూడా అంతే హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలో ఓటిటి లో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇక నుంచి నేను చేయబోయే చిత్రాలు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి టయ్యప్ అయి చేయాలనీ ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా వున్నాయి.. ప్రాపర్ గా అవి బౌండ్ స్క్రిప్ట్స్ రెడీ చేసి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరపాలి. మా లక్ష్మి సుచిత్ర బ్యానర్ లో కొత్త కంటెంట్ వున్నా అన్ని జానర్ మూవీస్ చేయాలనీ నిర్ణయించుకున్నాం. నా జీవితం అంతా సినిమానే.. సినిమా అంటే నాకు విపరీతమైన ఇష్టం. మంచి స్టార్ కాస్ట్ తో బ్లాక్ బస్టర్స్ మూవీస్ చేయాలనీ దర్శకుడిగా నా గోల్. త్వరలో డి యమ్ కే టైటిల్ తో ఒక పవర్ ఫుల్ కాఫ్ స్టోరీ తో సినిమా చేయబోతున్నాను’అని అన్నారు. -
మార్చి 12న 'పైసా పరమాత్మ'
కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలా సరికొత్త కాన్సెప్టుతో రాబోతున్న చిత్రం 'పైసా పరమాత్మ'. సాంకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కిరణ్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ కాగా ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని మార్చి 12 న విడుదల సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత టి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. "పూర్తిగా స్టోరీని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది. దర్శకుడు కథ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా సినిమా చేశాడు. అయన మీద నమ్మకంతోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాము.. ఈ చిత్రానికి మొదటినుంచి సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా సినిమా పోస్టర్లను ఆవిష్కరించి మమ్మల్ని ఆశీర్వదించిన రాజ్ కందుకూరి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరు సినిమాను ఆదరించండి" అని అన్నారు. బ్యానర్ : లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్, మ్యూజిక్ : కనిష్క్, దర్శకుడు : విజయ్ కిరణ్ తిరుమల, నిర్మాత : టి.కిరణ్ కుమార్ చదవండి: పిచ్చెక్కిపోయింది, నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు: అషూ 16 పాటలు రాశావా గోవిందా.. ఏంటో అవి?! -
కొమురవెల్లిలో ముక్కు అవినాష్
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామిని జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం కుటుంబసమేతంగా స్వామి వారికి పట్నం వేసిన అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలావుంటే మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. పలువురు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చదవండి: వివేక్ ఒబెరాయ్పై కేసు నమోదు -
స్టార్ డైరెక్టర్ హామీ ఇచ్చారు: అవినాష్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ నాల్గో సీజన్లో జబర్ధస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి చప్పగా సాగుతున్న బిగ్బాస్ హౌజ్ను తన కామెడితో ఆసక్తికరంగా మార్చాడు. అయితే అతడు బిగ్బాస్ హౌజ్లో అడుగుపెట్టేందుకు జబర్ధస్త్ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని బ్రేక్ చేసి పెద్ద రిస్క్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో జబర్ధస్త్ను వదిలి వెళుతున్నందుకు గాను నిర్మాతలకు అవినాష్ 10 లక్షల రూపాయల జరిమాన కూడా చెల్లించాడు. అయితే బిగ్బాస్ ద్వారా అవినాష్ బాగానే లాభపడినట్లు తెలుస్తోంది. బిగ్బాస్తో మరింత ఫేంను సంపాదించుకున్న అవినాష్కు.. డబ్బులు కూడా భారీ మొత్తంలో అందినట్లు సమాచారం. అయితే ఇటీవల బిగ్బాస్ ముగియడంతో కంటెస్టెంట్స్ అంతా టీవీ, న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిబీ బిజీగా ఉన్నారు. (చదవండి: బిగ్బాస్: అవినాష్కు నాగ్ ఊహించని గిఫ్ట్) అదే విధంగా అవినాష్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా అయిపోయాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో అవినాష్ మాట్లాడుతూ.. తన సహా కంటెస్టెంట్ అరియాన గ్లోరితో వివాహం అంటూ వస్తున్న పుకార్లను ఖండించాడు. అనంతరం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాల్లో మంచి పాత్ర ఇస్తానని తనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే గత ఆదివారం జరిగిన ఫైనల్ ఎపిసోడ్లో దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా బిగ్బాస్లో హౌజ్లో అడుగుపెట్టి టాప్ 5లోని ఒకరిని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను కలిసిన దర్శకుడు అనిల్ తన తదుపరి సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానని, ఒకసారి కలవమని కూడా చెప్పినట్లు అవినాష్ చెప్పుకొచ్చాడు. -
హోస్ట్గా అవియానా జంట.. ఇక సందడే సందడి
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి వచ్చిన చాలా మంది.. ఇప్పుడు సెలెబ్రెటీలు అయిపోయారు. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్లు ఏం ఆశించి హౌస్లోకి వచ్చారో.. అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించారు. గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్బాస్లో పాల్గొన్న వారికి కాస్త ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా యూట్యూబర్లు, చిన్న నటీనటులు పాల్గొనప్పటికీ.. వారికి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ విన్నర్గా గెలిచిన అభిజీత్కి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మూడో స్థానంలో నిలిచిన సోహైల్కు అయితే.. ఇప్పటికే హీరోగా ఒక సినిమా చాన్స్ కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో నటిస్తానని మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం ఇప్పటికే ప్రకటనలు కూడా ఇచ్చారు. మరోవైపు బిగ్బాస్ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్కు కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలతో పాటు స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఓ షోలో జడ్జిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా నాల్గో సీజన్లో పాల్గొన్న ఒక్కొక్కరికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సీజన్లో క్రేజీ జంటగా పేరొందిన అరియానా-అవినాష్ జోడీకి కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి : భలే చాన్స్ కొట్టేసిన మోనాల్.. బుల్లితెరపై సందడి) బిగ్బాస్ హౌస్లో అరియానా, అవినాష్ జోడికి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదే. నెటిజన్లు అయితే ఈ జంటకు అవియానా అని పేరు పెట్టి మరి ప్రశంసలు కురిపించారు. ఇంట్లో ఉన్నన్ని రోజులు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, అన్నం తినిపించుకోవడం, ఒకరిపైఒకరు పంచ్లు వేసుకోవడం వీక్షకులను బాగా ఆకట్టుకుంది. అవినాష్ ఎలిమినేట్ అయినప్పుడు అరియానా ఎంత భావోద్వేగానికి గురైందో అందరూ చూశారు. ఇలా ఈ సీజన్లో గుడ్ పెయిర్గా గుర్తింపు పొందిన ఈ జంటతో ప్రత్యేక ప్రోగ్రామ్లను నిర్వహించి టీఆర్పీ రేటింగ్ను పెంచుకునే ప్లాన్ చేస్తున్నాయట కొని ఎంటర్టైన్మెంట్ చానళ్లు. దీనికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిని హోస్ట్గా పెట్టి స్పెషల్ ప్రోగ్రామ్లను ప్లాన్ చేస్తున్నారట ఓ చానల్ నిర్వాహకులు. కాగా హోస్ట్గా అరియానాకు మంచి అనుభవం ఉంది. అలాగే అవినాష్ కూడా శ్రీముఖితో కలిసి ఓ షోను హోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరితో కలిసి పలు ఛానెళ్ల వాళ్లు షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అరియానా, అవినాష్ టీవీ ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని చానళ్లకు జంటగా వెళ్లి మరి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ జంట హోస్ట్గా వస్తే.. బుల్లితెరపై సందడి మాత్రం మా..ములుగా ఉండదు మరి. -
నోయల్ టైటిల్ గెలవాల్సింది: అభిజిత్
బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్లు ఆఖరుసారి సంతోషంగా డ్యాన్సులు చేసుకుంటూ గడిపారు. ఎలిమినేట్ అయినవాళ్లను తిరిగి హౌస్లో చూస్తున్నందుకు ఓపక్క సంతోషం, తర్వాతి రోజు నుంచి ఈ హౌస్ ఉండదన్న మరో వైపు బాధ వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో హౌస్లో చివరి రోజు కొంత ఎమోషనల్గా సాగింది. అయితే దేవి నాగవల్లి, సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్ మాత్రం రీయూనియన్ పార్టీకి రాకపోవడం గమనార్హం. మరి సంతోషాలు వెల్లివెరిసిన నేటి బిగ్బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో చదివేయండి.. ఇంటి నుంచి సందేశం.. అఖిలూ, ఓ అఖిలూ.. అని పిలుచుకుంటూనే గంగవ్వ లోపలకు వచ్చింది. అవ్వ పిలుపు వినగానే అఖిల్ ఉత్సాహం ఉరకలెత్తింది. ఆమెను చూడగానే పిల్లాడిలా సంబరపడిపోయాడు. తర్వాత జోర్దార్ సుజాత లోనికి రాగా అవ్వతో కలిసి ఫైనలిస్టులతో ఆటాడించారు. నన్ను ఇంప్రెస్ చేస్తే మీ ఇంటి నుంచి వచ్చిన మెస్సేజ్ను చూపిస్తానని సుజాత బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో అభిజిత్ సోహైల్ పోటీపడుతూ ఇంట్లోకి పరుగెత్తారు. ఈ క్రమంలో అభి మైకు విరగొట్టుకుని మరీ మొదటగా కాఫీ మగ్గు తీసుకొచ్చాడు. తర్వాత సోహైల్ ప్లేటు మీద ఐ లవ్ యూ అని రాసుకొచ్చి మరీ అందించాడు. ఇలా ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేయగా.. ఫైనలిస్టులందరికీ కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలు చూపించారు. అనంతరం గంగవ్వ, సుజాత ఇద్దరూ వీడ్కోలు తీసుకున్నారు. (చదవండి: కృష్ణుడిలాంటి భర్త కావాలి: మోనాల్) నేను నిన్ను గెలిచాను.. తర్వాత వచ్చిన నోయల్ ర్యాప్తో ఊపేస్తూ అందరి సంతోషాన్ని రెట్టింపు చేశాడు. అతడి కోసం ఓ సందేశాన్ని రాసిన బాటిల్ను అభి నోయల్ చేతికందించాడు. దానిపై 'నోయల్ టైటిల్ గెలిచేందుకు అర్హుడు' అని ఉంది. ఇది చదివిన నోయల్ నేను నిన్ను గెలిచాను, ఇది చాలదా.. అంటూ అభిజిత్తో చెప్పుకొచ్చాడు. హౌస్ను మిస్సవలేదు, కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నానని పేర్కొన్నాడు. ఈ బిగ్బాస్ తనకు ఎంతో ఇచ్చిందని, కానీ తను ఏమీ తిరిగివ్వలేకపోతే క్షమించండి అంటూ హౌస్కు గుడ్బై చెప్పాడు. (చదవండి: బిగ్బాస్ : నోయల్కు వచ్చిన వ్యాధి ఇదే) దివి.. దీపిక పదుకొణెలా ఉన్నావు తర్వాత మెహబూబ్ను చూడగానే సోహైల్ తెగ ఎగ్జైట్ అయ్యాడు. అతడు మాత్రం తన ఆతృతను లోలోపలే అణుచుకుంటూ దివితో స్టెప్పులేశాడు. అనంతరం తన జిగిరీ దోస్తులు సోహైల్, అఖిల్, అభిజిత్తో కబుర్లు చెప్పాడు. అటు అఖిల్ మాత్రం దీపిక పదుకొణెలా ఉన్నావంటూ దివిని పొగడ్తలతో ముంచెత్తాడు. చాలా బాగున్నావంటూ అభిజిత్ కూడా మెచ్చుకోవడంతో ఏంటి పులిహోరా? అని దివి ప్రశ్నించింది. మరోపక్క మెహబూబ్, సోహైల్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఫైనలిస్టులు అన్ని హార్ట్ దిండులను మెహబూబ్, దివికి బహుమతిగా ఇచ్చారు. మీ ఐదుగురు విన్నర్లే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండని మెహబూబ్ పదే పదే చెప్తూ సెలవు తీసుకున్నాడు. (చదవండి: బిగ్బాస్: పెద్దగా ఆకట్టుకోని కంటెస్టెంట్లు వీళ్లే..) మిస్ అవుతున్నానంటూ ఏడ్చేసిన అరియానా తర్వాత అవినాష్ ఎంట్రీ ఇవ్వడంతో అరియానా ఆనందంతో గెంతులేసింది. కానీ ఆ వెంటనే నిన్ను మిస్ అవుతున్నానంటూ గుక్కపెట్టి ఏడవటంతో ఆమెను ఓదార్చాడు. తననిప్పుడు అవినాష్ అని కాకుండా ఎంటర్టైనర్ అని పిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. తన ఇంటికి వేరే వేరే జిల్లాల నుంచి అభిమానులు కలిసేందుకు వస్తున్నారని తెలిపాడు. అఖిల్ పులిహోర మామూలుగా కలపడం లేదంటూ సెటైర్లు వేశాడు. హారిక అలాగే చూస్తుండటం చూసి ఏంటి? దినాలకు పిట్టకు పెట్టినట్లు చూస్తున్నావు అని పంచ్ వేశాడు. అనంతరం అందరి హౌస్కు గుడ్బై చెప్తూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. తర్వాత ఫైనలిస్టులు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. (చదవండి: బిగ్బాస్ విన్నర్ అతడే: అలీ రెజా) -
బిగ్బాస్: అదరగొట్టిన ఆ నలుగురు.. కరీంనగర్ బిడ్డలే
బిగ్బాస్ సీజన్–4 రియాల్టీ షో చివరి అంకానికి చేరింది. వంద రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమంలో వచ్చే ఆదివారం విజేత ఎవరో తేలనుంది. ఈ క్రమంలో ఫినాలే పోరులో నిలిచిన సయ్యద్ సోహెల్ది పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ కాగా.. దేత్తడి హారిక సుల్తానాబాద్ ఆడబిడ్డే. సీజన్–4ను రక్తికట్టించిన వారిలో జగిత్యాల జిల్లా లంబాడిపల్లికి చెందిన గంగవ్వ షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. వైల్డ్కార్డుతో ఎంట్రీ ఇచ్చి షోను జబర్దస్త్గా నడిచేలా చేసిన అవినాష్ గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందినవాడు. ఈ సందర్భంగా అవినాష్ ‘సాక్షి’తో తన జీవన ప్రయాణ అనుభవాన్ని పంచుకోగా.. సోహెల్ గురించి ప్రత్యేక కథనం.. బిగ్బాస్ నుంచి కాల్ వచ్చింది ఒకరోజు బిగ్బాస్ షో నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది. రియాల్టీషోలో పని చేయాలని ఆహ్వానించారు. అయితే ఓ టీవీ చానల్లో ఎనిమిదేళ్లుగా చేస్తున్నా... రానన్నాను. ఒక్కసారి ట్రై చేయండి అన్నారు. నాకున్న ఆర్థిక పరిస్థితులు నన్ను కన్విన్స్ చేశాయి. ఓకే చెప్పాను. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే ఒప్పుకోలేదు. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు. దాంతో పాటు ఒక్కసారి వెళ్లినవారికి మరో అవకాశం ఉండదన్నారు. అప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్నా. ఏం చేయాలో తోచలేదు. ఈ క్రమంలో గెటప్ సీను, శ్రీముఖి, చంద్ర నాకు అండగా నిలిచారు. వాళ్లే రూ.10లక్షలు ఫైన్ కట్టారు. అలా నటనలో జన్మనచ్చిన షోను వదిలి బిగ్బాస్లో అడుగుపెట్టాను. పునర్జన్మనిచ్చింది: అవినాష్ గొల్లపల్లి(ధర్మపురి): నాన్న ఉపాధికోసం ఎడాదిదేశాలకు వెళ్తే.. అమ్మా, అన్నయ్యలు వ్యవసాయం చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవారు. చదువుకునే వయసులో స్నేహితుల ప్రోత్సాహం, అన్నయ్య సాయంతో నటనవైపు మళ్లాడు తను. హైదరాబాద్లో అందరిలాగే క్రిష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాలేదు. చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా వచ్చిన చాన్స్ను అందిపుచ్చుకున్నాడు. ఓ టీవీచానల్లోని కామెడీ షో జన్మనిస్తే.. బిగ్బాస్ పునర్జన్మనిచ్చిందని చెబుతున్నాడు ముక్కు అవినాష్. సాధారణ కుటుంబమే.. మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామం. నాన్న లక్ష్మణ్, అమ్మ మల్లమ్మ. ఐదుగురం అన్నదమ్ములం. నేను మూడోవాణ్ని. నాన్న నా చిన్నప్పటినుంచి దుబాయ్ వెళ్లేవాడు. అమ్మ, అన్నలు వ్యవసాయం చేస్తుండేవారు. నేను జగిత్యాలలో పదోతరగతి వరకు, కరీంనగర్లో ఇంటర్, హైదరాబాద్లో బీటెక్ పూర్తిచేశా. స్కూల్ టైంనుంచే నటన అంటే ఇంట్రెస్టు. కల్చరల్ ప్రోగ్రాముల్లో మిమిక్రీ, డ్యాన్స్లు చేసేవాడ్ని. ఇంటర్లో నా ప్రతిభను చూసిన స్నేహితులు ప్రోత్సహించారు. ఇండస్ట్రీకి వెళ్తాఅంటే అమ్మానాన్న ఒప్పుకోలేదు. మా పెద్దన్నయ్య వారిని మెప్పించి నన్ను హైదరాబాద్లోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేర్పించాడు. ఆఫీస్ బాయ్గా చేసిన.. ఐస్క్రీం అమ్మిన రెండునెలలు యాక్టింగ్ నేర్చుకున్నా. బతకడానికి డబ్బులు అవసరం కాబట్టి మూడు నెలలు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్బాయ్గా పనిచేశా. ఐస్క్రీం బండి నడిపా. కిరాణాషాపులో పనిచేశా. బీటెక్ చేస్తుండగా.. సిటీలోని ఓ లోకల్ చానెల్లో పనిచేస్తూ.. రూంరెంట్, ఖర్చులు వెల్లదీసుకున్నా. సినిమాల్లో అవకాశం కోసం కృష్ణానగర్ చుట్టూ తిరిగా. ఆడిషన్లకు వెళ్తే.. నా ఫొటోలు డస్ట్బిన్లో వేసిన సందర్భాలున్నాయి. 16 రోజులకు రూ.వెయ్యి ఇచ్చారు మొట్టమొదటిసారి ఓ సినిమా షూటింగ్ కోసం అండమాన్ నికోబార్ తీసుకెళ్లారు. అక్కడ టీ బాయ్గా ప్రొడక్షన్ చూసుకునేది. 16 రోజులు పనిచేస్తే రూ.వెయ్యి ఇచ్చారు. ‘వాట్హాపెండ్ 6టు6’ సినిమాలో అవకాశం రాగా రెండురోజులు ఆడింది. వరంగల్కు చెందిన కిరణ్ నా యాక్టింగ్ను చూసి కెవ్వుకేక ప్రోగ్రాంలో అవకాశం ఇప్పించారు. ఈ క్రమంలో ఓ టీవీలో వచ్చిన తడాఖా ప్రోగ్రాంలో చాన్స్ వచ్చింది. అప్పుడే చమ్మక్చంద్ర నా యాక్టింగ్ను గుర్తించి తనటీంలో చేర్చుకున్నారు. తరువాత వేణు వండర్స్ టీంలో చేశాను. అలా ఎనిమిదేళ్లలో టీం లీడర్స్థాయికి ఎదిగాను. ఓ వైపు కామెడీ షో చేసూ్తనే పలు ఈవెంట్లు, షోలు చేసేవాడ్ని. వచ్చిన సంపాదనతో 2019లో మణికొండలో ఇల్లు కొన్నా. చీకట్లు నింపిన లాక్డౌన్ ఇల్లు కొన్న సమయంలోనే అమ్మ అనారోగ్యానికి గురైంది. రూ.10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించా. ఆపై రూ.15లక్షలు అప్పు చేశా. ఈ క్రమంలో కరోనా లాక్డౌన్ నా జీవితంలో చీకట్లు నింపింది. లాక్డౌన్తో కామెడీ షో షూటింగ్ నిలిచిపోయింది. షోలు, ఈవెంట్లు లేవు. అప్పు కట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో అర్థంకాక నేను కొనుక్కున్న ఇంటి పైనుంచే దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అదే సమయంలో గెటప్ సీను ఫోన్ చేశాడు. మేమున్నామని ధైర్యం చెప్పాడు. 13 వారాలున్నా.. వైల్డ్కార్డ్ ఎంట్రీ ద్వారా బిస్బాస్ రియాల్టీషోలో అడుగుపెట్టిన నేను 13 వారాలు హౌస్లో ఉన్నా. హౌస్లో బాగానే ఉన్నప్పటికీ అమ్మానాన్నలకు దూరం ఉండడం కొంత బాధేసింది. కానీ నాకున్న కష్టాలు పోవాలంటే గెలవాలనే కసితో ఆడాను. టాప్–5లో నిలుద్దామని అనుకున్నా. కుదరలేదు. ఏదేమైనా అన్నిరోజులు హౌస్లో ఉండేలా నాకు ఓట్లువేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆఫర్లు వస్తున్నాయి షోనుంచి బయటకు వచ్చాక చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆర్థిక కష్టాలు కూడా తీరాయి. అందరిని నవ్విస్తూ.. అందరితో నవ్వుతూ ఉండాలన్నది నా కోరిక. మళ్లీ కామెడీ షో నిర్వాహకుల నుంచి పిలుపు వస్తే.. తప్పకుండా వెళ్తా. ఫైనల్లో సింగరేణి కుర్రోడు రామగిరి(మంథని): ‘అరె ఏందిబై.. నేను గిట్లనే ఉంటా. నా ఇష్టమున్నట్టు చేస్తా.. ఊరమాస్ ఇక్కడా..!’ బిస్బాస్లో ఈ డైలాగులు ఎంతో ఫేమస్. ఆ మాస్ క్యారెక్టరే.. సయ్యద్ సోహైల్. అతడిప్పుడో యూత్ ఐకాన్. సింగరేణి పొత్తిళ్లలో పెరిగి ప్రస్తుతం బిగ్బాస్ ఫైనల్లో నిలిచాడు. సింగరేణి ఉద్యోగం వద్దని.. పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం–ఫాహీమా సుల్తానా దంపతులకు సయ్యద్ సోహెల్ రెండో సంతానం. సలీం సింగరేణి ఉద్యోగం రీత్యా కుటుంబంతో సహా సెంటినరీకాలనీలో స్థిరపడ్డారు. మైనింగ్ సర్దార్గా పనిచేస్తున్న సలీంకు 2016లో ఓపెన్హార్ట్ సర్జరీ అయ్యింది. యాజమాన్యం అతడ్ని అన్ఫిట్ చేసింది. వారసత్వంగా తండ్రి ఉద్యోగాన్ని స్వీకరించేందుకు సోహెల్ నిరాకరించాడు. దీంతో సలీంకు డిమోషన్ కల్పించి జనరల్ మజ్దూర్గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఓసీపీ–2లో విధులు నిర్వహిస్తున్నాడు. బిగ్బాస్ ఫైనల్లో.. ఈ క్రమంలో బిగ్బాస్ షోనుంచి ఆహ్వానం అందింది. ఎంట్రీతోనే సీక్రెట్ కంటిస్టెంట్గా ఉన్న సయ్యద్ సోహెల్ మొదటినుంచి చురుగ్గా ఆడాడు. ఇచ్చిన ప్రతీటాస్క్లో విజయం సాధించాడు. మాస్ క్యారెక్టర్గా పేరు, ఫ్యాన్స్ని సంపాదించాడు. మనసున్న స్నేహితుడిగా మన్ననలు పొందాడు. బిగ్బాస్ ఫైనల్లో అడుగుపెట్టాడు. విజేతగా తిరిగిరావాలని జిల్లా ప్రజలు, కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు. డ్యాన్స్ అంటే ప్రాణం.. నటన అంటే ఇష్టం సయ్యద్ సోహెల్కు చిన్ననాటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 2005లో 9వ తరగతి చదువుతున్న సమయంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమానికి ఎంపిక య్యాడు. ఇంటర్ కరీంనగర్లో చదివి, డిగ్రీ హైదరాబాద్లో పూర్తిచేశాడు. 2009లో దిల్రాజ్ దృష్టిని ఆకర్షించిన సయ్యద్ సోహెల్ కొత్తబంగారు లోకం సినిమాలో సైడ్ క్యారెక్టర్కు ఎంపికయ్యాడు. 2010లో యూఅండ్ఐ, 2013లో మ్యాజిక్ మ్యూజిక్, 2015లో దిబెల్స్, 2017లో సినీ మహల్ సినిమాల్లో నటించాడు. నాతిచరామి, కృష్ణవేణి సీరియల్స్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. విజేతగా వస్తాడు సోహెల్ ఏదైనా సాధించాలంటే పట్టుదలతో ఉంటాడు. అదే సంకల్పంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రాణిస్తున్నాడు. సోహెల్ యూత్ ఐకాన్గా నిలవడం గర్వంగా ఉంది. బిగ్బాస్ షోలో విజేతగా నిలుస్తాడనే నమ్మకం ఉంది. – సయ్యద్ సలీం, సోహెల్ తండ్రి -
బిగ్బాస్: అవినాష్కు నాగ్ ఊహించని గిఫ్ట్
చప్పగా సాగుతున్న బిగ్బాస్ నాల్గో సీజన్కి కామెడీ టచ్ ఇచ్చి ఆసక్తికరంగా మార్చిన ఒకే ఒక వ్యక్తి అవినాష్. హౌస్లోకి వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చి అందరిని తన కామెడీ తో ఆకట్టుకున్నాడు. తనదైన మార్క్ కామెడీతో హౌస్ లో నవ్వులు పూయించాడు. చివరకు నాగార్జున కూడా అవినాష్ కామెడీకి ఫిదా అయ్యాడు. ప్రతి శని, ఆదివారాల్లో నాగ్ నోట అవినాష్ పేరే ఎక్కువసార్లు వచ్చేంది. కామెడీతో పాటు టాస్క్లు కూడా అవినాష్ బాగానే చేశాడు. బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయేటప్పుడు కూడా స్టేజ్ పై నవ్వులు పూయించాడు అవినాష్. బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అవినాష్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఒక సందర్భంలో నాగార్జున వేసుకున్న షర్ట్ బాగుందని అవినాష్ అన్నాడు. అది గుర్తుపెట్టుకొని మరీ నాగార్జున ఆ షర్ట్ ను అవినాష్ ఇంటికి పంపించాడు. నాగ్ పంపిన స్పెషల్ గిఫ్ట్ తో అవినాష్ పట్టలేని ఆనందంలో తేలిపోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాద్వారా తెలిపాడు. అంతేకాకుండా ఆషర్ట్ వేసుకొని దిగిన ఫోటోను కూడా షేర్ చేసాడు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
మోనాల్ స్ట్రాంగ్: బాధను దిగమింగిన అవినాష్
బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారిగా పది కోట్ల ఐదు లక్షల ఓట్లు వచ్చాయని వ్యాఖ్యాత నాగార్జున వెల్లడించారు. ప్రతివారం పెరుగుతున్న ఈ ఓట్ల సంఖ్యను చూస్తుంటే ఫైనల్కు భీభత్సంగానే ఓట్లు పడేట్లు కనిపిస్తోంది. ఇక మోస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద సీజన్ బిరుదు అందుకున్న అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా తను ఎప్పుడూ వీక్ అని పదేపదే నొక్కి చెప్పే మోనాల్ను తొలిసారి స్ట్రాంగ్ అని పేర్కొంటూ సెలవు తీసుకున్నాడు. మనసులోని దుఃఖాన్ని లోపలే అణిచివేసి అందరికీ నవ్వులు పంచి మరీ నిష్క్రమించాడు మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్ ఎలా ముందుకు సాగిందో చదివేయండి.. సోహైల్ అందరి బంధువు.. తొంభై రోజులుగా కలిసి ఉంటున్న కంటెస్టెంట్లకు ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసనేది పరీక్షించేందుకు బిగ్బాస్ 'యారోంకా యార్' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఒక్కో కంటెస్టెంటును నిల్చోమని చెప్పి నాగ్ మూడు ప్రశ్నలు అడుగుతారు. దానికి సదరు కంటెస్టెంటుతో పాటు మిగతా ఇంటి సభ్యులు కూడా సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఎవరు కరెక్ట్గా చెప్తే వారికి గులాబీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో ఎక్కువ మంది గురించి సరైన జవాబులు చెప్పిన సోహైల్కు ఎక్కువ గులాబీలు రావడంతో అతడు గెలిచాడు. రన్నరప్గా నిలిచిన హారిక 'అందరి బంధువయ' సాష్ను సోహైల్ భుజాన వేసింది. (చదవండి: టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?) ఆవును పట్టుకుని గంగిరెద్దు అన్న అవినాష్ "టికెట్ టు ఫినాలే" టాస్క్లో అందరినీ ముప్పుతిప్పలు పెట్టించిన ఆవు మళ్లీ ప్రత్యక్షమైంది. అయితే ఈసారి ఒకరిని సేవ్ చేసేందుకే వచ్చిందని నాగ్ స్పష్టం చేశారు. దీంతో నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యులు తమని కాపాడమంటూ ఆవును వేడుకున్నారు. సంక్రాంతికి ఇంటికొచ్చి వెలుగునిస్తావు, నాకూ అలాగే వెలుగునివ్వు అంటూ అవినాష్ దానికి ముద్దు పెట్టి కాళ్లు పట్టుకున్నాడు. ఇది చూసిన నాగ్ సంక్రాంతికి ఆవు కాదు, గంగిరెద్దు వస్తుందని కౌంటరిచ్చారు. దీంతో నాలుక్కరుచుకున్న అవినాష్.. క్షమించు, నన్ను సేవ్ చెయ్యు అంటూ దాన్ని కాళ్లు పట్టుకున్నా అది కనికరించలేదు. ఎవరి ప్రయత్నాలకు చలించని ఆ కామధేనువు అభిజిత్ అభ్యర్థించగానే అంబా అని అరిచి అతడిని సేవ్ చేసింది. (చదవండి: బిగ్బాస్: అప్పుడు రాహుల్, ఇప్పుడు అఖిల్!) హుషారుగా జోడీ డ్యాన్సులు తర్వాత ఇంటిసభ్యులతో మరో గేమ్ ఆడించారు. గార్డెన్ ఏరియాలో వీళ్లు తమ ఎదురుగా ఉన్న ప్లే లిస్ట్ బోర్డ్స్కు బంతిని కొట్టాలి. ఏ ప్లే లిస్ట్కు బంతి తగిలితే ఆ పాటకు ఒకరిని సెలక్ట్ చేసుకుని డ్యాన్స్ చేయాలి. మొదట హారిక.. ప్యూర్లీ ప్రేమను మోనాల్కు అంకితం చేసింది. అలా వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. తర్వాత అఖిల్ ఎనర్జీ బీట్స్ ప్లే బోర్డ్కు బంతి కొట్టడంతో 'గ్యాంగ్ లీడర్' సాంగ్కు సోహైల్తో కలిసి స్టెప్పులేశాడు. సోహైల్ టాలీవుడ్ హంక్స్ను సెలక్ట్ చేసుకోగా రావణా.. జైజైజైజై.. సాంగ్కు రాక్షసంగా డ్యాన్స్ చేశారు. అరియానా దోస్తు మేరా దోస్త్ ప్లే బోర్డ్ను ఎంపిక చేసుకుని అవినాష్తో చిందేసింది. అవినాష్ సామజవరగమన.. పాటకు అరియానాను ఎత్తుకుని మరీ రొమాన్స్ చేశాడు. అభిజిత్ పార్టీ టైమ్ అంటూ సోహైల్తో చిందులేశాడు. మోనాల్ మాత్రం అఖిల్, హారిక ఇద్దరితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంది. అఖిల్ ప్రేమ చాలా కావాలి: మోనాల్ ఈ సందర్భంగా అఖల్ లవ్ ఎక్కువ కావాలి అని మోనాల్ ఆనందంతో మనసులోని మాటను బయటకు చెప్పేయడంతో అఖిల్ ఆమెను రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. రొమాన్స్ జోనర్లో అభితో డ్యాన్స్ చేయాలనుందని హారిక మనసులోని మాటను చెప్పగా ఆమె కోసం స్పెషల్ సాంగ్ వేయించడంతో అభిక జోడీ కలిసి డ్యాన్స్ చేశారు. తర్వాత హారిక సేవ్ అయినట్లు నాగ్ వెల్లడించగా ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. అనంతరం మోనాల్ సేవ్ అవగా అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. (చదవండి: బిగ్బాస్: ఊహించని ట్విస్టులతో అభిజిత్ కంట నీరు) ఏడుస్తున్న అరియానాను నవ్వించి.. అతడు బిగ్బాస్ హౌస్కు పాదాభివందనం చేసి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు. మోనాల్ స్ట్రాంగ్ అని చెప్తూ కన్నీళ్లను దిగమింగుకున్నాడు. అనంతరం స్టేజీ మీదకు వచ్చిన అతడు అందరి మీద మిమిక్రీ చేసి నవ్వించారు. కానీ కన్నీళ్లు పెట్టుకుంటున్న అరియానాను మాత్రం నవ్వించలేకపోయాడు. నీకోసం ఎదురు చూస్తుంటానని, ఏడవొద్దని ఆమెను ఊరడించాడు. అరియానాను నవ్వించాల్సిందేనని నాగ్ పట్టుపట్టడంతో ఆమెను ఇమిటేట్ చేసి ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చాడు. అనంతరం వారం రోజులు ఏ పనీ చేయాల్సిన అవసరం లేదన్న బిగ్బాంబ్ను అవినాష్ అభిజిత్ మీద వేశాడు. (చదవండి: అఖిల్కు ఫినాలే మెడల్ వేసిన సోహైల్) -
మోనాల్ అవినాష్కు ఎన్ని ముద్దులిచ్చింది?: నాగ్
బిగ్బాస్ హౌస్లో నామినేషన్ అంటే చాలు ఠారెత్తిపోయే కంటెస్టెంటు ఎవరయా అంటే ముందు అవినాష్ పేరే వినిపిస్తుంది. అతడు నామినేట్ అయినవారమంతా మరోలా కనిపిస్తాడు. తన గురించి ఎవరు ఏం మాట్లాడినా వాటన్నింటినీ కాలిక్యులేట్ చేస్తాడు. సరాదాగా అన్న మాటలను కూడా ప్రేక్షకులు ఎక్కడ నెగెటివ్గా తీసుకుంటారో, ఎక్కడ చెడ్డ పేరు వచ్చి ఓట్లు తక్కువ పడతాయో అని తెగ భయపడిపోతుంటాడు. ఆఖరికి అరియానా సరదాగా ఆటపట్టిస్తూ మాట్లాడినా దాన్ని తేలికగా తీసుకోలేడు. ఈ క్రమంలోనే నిన్న అవినాష్కు, అరియానాకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆమె ఏం మాట్లాడినా దాన్ని తప్పు అని చెప్తూ, అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పడాన్ని అరియానా తట్టుకోలేకపోయింది. అతడిని ఏమీ అనలేక తన నెత్తి తనే బాదుకుంది. ఓవైపు మనసులో ఇంతలా భయపడుతున్న అవినాష్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అందరి కంటెస్టెంట్ల మీద పాటలు పాడుతూ, వాళ్లను నవ్విస్తూ, అరియానాను సరదాగా ఏడిపిస్తూ వచ్చాడు. మోనాల్తో పులిహోర కలపడం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ వారం అవినాష్ స్పీడుకు అఖిల్ సడన్ బ్రేక్ వేశాడు. అతడిని బ్రదర్ ఆఫ్ మోనాల్గా అభివర్ణించాడు. మోనాల్ కూడా అఖి మాటకే జై కొడుతూ అవినాష్ను అన్నయ్య అనేసింది. దీంతో అవినాష్ తన పరువు పోయిందని తెగ ఫీలయ్యాడు. (చదవండి: మోనాల్ గుట్టు రట్టు చేసిన అభిజిత్) నేడు నాగార్జున.. అవినాష్ మనసుకు తాకిన గాయాలను తట్టి లేపారు. అవినాష్కు ఎన్నిసార్లు ముద్దు పెట్టావని మోనాల్ను అడిగారు. దీంతో అవినాష్ మధ్యలో కలగజేసుకుంటూ 'చాలాసార్లు పెట్టావు, అన్నీ ఆలోచించుకుని రాయ'మని చెప్పగా అతను జస్ట్ బ్రదర్ సార్ అని సోహైల్ గాలి తీసేశాడు. దీంతో ఫ్రస్టేట్ అయిన అవినాష్ 13 వారాలు గడిచిపోయాయి. అందరూ కలిసి ఆమెతో అన్నయ్య అని పిలిపించారు సార్. చచ్చిపోవాలనిపించింది అని నాగ్తో తన గోడు వెల్లబోసుకున్నాడు. దీంతో నాగ్ ఇది అన్యాయమంటూ సపోర్ట్ ఇచ్చినట్లే ఇచ్చి ఫాదర్ అని పిలవాల్సింది అని పంచ్ వేశారు. ఈ దెబ్బతో అవినాష్ ముఖం వాడిపోగా అతడి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. (చదవండి: బిగ్బాస్: ఈ సారి కూడా అమ్మాయిలకు నో ఛాన్స్) -
బిగ్బాస్: కాళ్లు పట్టుకున్న అవినాష్!
బిగ్బాస్ నాల్గో సీజన్ అంతిమ ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటికే తన కష్టానికి తోడు, సోహైల్ త్యాగం వల్ల అఖిల్ నేరుగా టాప్ 5లోకి అడుగు పెట్టాడు. దీంతో నామినేషన్ భయాలేవీ లేకుండా మరోవారం గుండెల మీద చెయ్యేసుకుని మిగతావాళ్ల ఆటను ఓ కంట కనిపెట్టనున్నాడు. మరోవైపు హౌస్లో కంటెస్టెంట్ల సంఖ్య పలుచబడే కొద్దీ పోటీ వారి మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. దీంతో మనసుకు కష్టంగా అనిపించినా సరే, ఆటకు అడ్డొస్తుందనుకున్న రిలేషన్ మాకొద్దని ఇంటిసభ్యులు నిన్న నాగ్కు తేల్చి చెప్పారు. అంటే ట్రోఫీ గెల్చుకునేందుకు వాళ్లు ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోంది. అయితే ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. ప్రస్తుతం నామినేషన్లో అభిజిత్, అఖిల్, అవినాష్, మోనాల్, హారిక ఉన్నారు. వీరిలో అఖిల్ సేవ్ అయినట్లు నాగార్జున ఇదివరకే ప్రకటించారు. మిగతా నలుగురిలో అవినాష్, మోనాల్ డేంజర్ జోన్లో ఉన్నారు. పులిహోర కలపడంలో అఖిలే నెంబర్ 1 నామినేషన్లో ఉన్న నలుగురిలో ఒకరిని సేవ్ చేస్తున్నట్లుగా ప్రోమోను వదిలారు. మొదటగా ఇంటిసభ్యులు జంటలుగా విడిపోయి డ్యాన్సులు చేశారు. అవినాష్, అరియానా జోడీ రొమాంటిక్ డోసు పెంచి మరీ స్టెప్పులేసినట్లు కనిపిస్తోంది. అభిజిత్-హారిక కూడా తామేమీ తక్కువ కాదని నిరూపించారు. అఖిల్- మోనాల్ కూడా కలిసి డ్యాన్సు చేశారు. ఇక ఈ వారం అఖిల్ అరియానాతో కలిపిన పులిహోర మ్యాటరే బాగా హైలెట్ అవుతోంది. దీనిగురించి నాగ్ ఆరా తీయగా పులిహోర రాజాగా అఖిలే నంబర్ 1 అని మోనాల్ కూడా తేల్చి చెప్పింది. (చదవండి: బిగ్బాస్కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయల్) అవినాష్ను కనికరించని కామధేనువువ తర్వాత గార్డెన్ ఏరియాలో కామధేనువును ప్రవేశపెట్టారు. అది ఎవరి అభ్యర్థనను మన్నించి అంబా అని అరుస్తే వాళ్లు సేవ్ అయినట్లు అని నాగ్ స్పష్టం చేశారు. దీంతో కంటెస్టెంట్లు ఆవుకు దండాలు పెట్టారు. ఈసారి ఎలాగైనా కాపాడమంటూ వేడుకున్నారు. అవినాష్ అయితే ఏకంగా ఆవు కాళ్లు పట్టుకుని సేవ్ చేయమని అడిగాడు. కానీ తన ప్రయత్నం వృథా అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి కామధేనువు హారికను కనికరించినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇక గతవారం ఎవిక్షన్ ఫ్రీ పాస్తో తప్పించుకున్న అవినాష్ ఈసారి మాత్రం ఎలిమినేషన్లో అడ్డంగా బుక్కైనట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో నేడు అవినాష్ హౌస్ నుంచి నిష్క్రమించనున్నట్లు సమాచారం. మరి నిజంగానే అవినాష్ ఎలిమినేట్ కానున్నాడా? లేదా నాగ్ ఏమైనా ట్విస్టులు ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్బాస్: అవినాష్ ఎలిమినేట్!) -
వీడియోతో అడ్డంగా దొరికిపోయిన మోనాల్
ఇన్నాళ్లూ బిగ్బాస్ హౌస్లో అవినాషే పులిహోర కలుపుతాడని తెలుసు. కానీ అఖిల్ కూడా పులిహోర కలుపుతున్నాడని అరియానా మాటలతో బయటపడింది. సోహైల్ చేసిన త్యాగం వల్లే అఖిల్కు ఫినాలే మెడల్ వచ్చిందని నాగ్ మరీమరీ నొక్కి చెప్పారు. సోహైల్ను ఎమోషనల్ ఫూల్గా అభివర్ణించారు మరోవైపు వారం రోజులుగా చర్చనీయాంశమైన మోనాల్, అవినాష్ పంచాయితీ ఓ కొలిక్కి వచ్చింది. మోనాల్ నిజంగానే తన్నిందని నాగార్జున వీడియోతో సహా బయటపెట్టడంతో ఆమె దోషిగా తలదించుకుని అవినాష్కు సారీ చెప్పింది. మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే దీన్ని చదివేయండి.. అవినాష్ వైఖరితో తల బాదుకున్న అరియానా ఉన్నదున్నట్లు చెప్పే అరియానా అఖిల్ బండారం మొత్తం బయటపెట్టింది.. అఖిల్ తనను పెళ్లి చేసుకుంటా అన్నట్లుగా మాట్లాడాడని మోనాల్, సోహైల్తో చెప్పింది, బయటకు వెళ్లాక టచ్లో ఉందామని చెప్పాడని అఖిల్ గుట్టు విప్పింది. తర్వాత ఇంట్లో లగ్జరీ బడ్జెట్ టాస్కు జరిగింది. ఇందులో అభిజిత్ కళ్లకు గంతలు కట్టుకోగా అఖిల్ అతడికి దారి చెప్తూ కింద ఉన్న ఐటమ్స్ తీసుకునేందుకు సహకరించాడు. ఈ క్రమంలో ఓ చోట అభి స్విమ్మింగ్ పూల్ దగ్గర దెబ్బలు తగిలించుకున్నాడు. అరియానా సరదాగా మాట్లాడినదానికి అవినాష్ సీరియస్ అయ్యాడు. చిన్నచిన్నవాటికే పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడని ఆమె తల బాదుకుంది. (చదవండి: బిగ్బాస్కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయల్) అవినాష్కు మరోసారి సారీ చెప్పిన మోనాల్ నాగార్జున కనిపించగానే కంటెస్టెంట్లు మనసులోని బాధనంతా బయటకు కక్కారు. మొదటగా అవినాష్ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లి మాట్లాడుతూ.. ఆవు-అంబా టాస్కులో మోనాల్ తనను కావాలని తన్నిందని చెప్పాడు. దీంతో నాగ్ వీడియో వేసి చూపించి అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాడు. మోనాల్ కావాలని తన్నిందని అఖిల్ తప్ప మిగతా అందరూ ఒప్పుకున్నారు. వీడియోలో మోనాల్ తన్నినట్లు స్పష్టమవుతుండగా ఆ సమయంలో అవినాష్ను చూసి నవ్వడం ఎవరికీ మింగుడు పడలేదు. దీంతో తన తప్పు తెలుసుకున్న మోనాల్ అవినాష్ను మరోసారి క్షమాపణలు కోరింది. కొందరు వ్యక్తిగతంగా ఆడలేదని అవినాష్ ఫిర్యాదు చేయగా నాగ్ మాత్రం సపోర్ట్ తీసుకుని ఆడటం తప్పేమీ కాదని క్లారిటీ ఇచ్చాడు.(చదవండి: బిగ్బాస్: ఈ వారం అవినాష్ తప్పించుకోలేడా?) అఖిల్కు ఫినాలే మెడల్ వేసిన సోహైల్ తర్వాత మోనాల్ మాట్లాడుతూ.. మూడు వారాలుగా నేను వీక్ నేను వీక్ అంటున్నారు. నన్ను ఎలా నిరూపించుకోవాలని ఏడ్చేసింది. ఇక తన్నడం గురించి కూడా ఆమె తన వివరణ ఇచ్చుకుంటుండగా.. క్యాన్ తన్నే క్రమంలో అవినాష్ను తన్నావు అంతే.. అంటూ నాగ్ ఆమెను ఓదార్చారు. సోహైల్ త్యాగం వల్లే అఖిల్ గెలిచాడన్నది ప్రేక్షకులకు తెలుసని నాగ్ చెప్పారు. తర్వాత అఖిల్ సేవ్ అయ్యి ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచాడని నాగ్ వెల్లడించారు. అనంతరం సోహైల్ చేతుల మీదుగా అఖిల్ ఫినాలే మెడల్ వేయించుకున్నాడు. మోనాల్ వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతోంది.. ఆటలో మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న బంధమేదో చెప్పి స్టిక్ విరగ్గొట్టాలని నాగ్ ఆదేశించారు. గేమ్ మీద ఎఫెక్ట్ అయ్యేంత బాండ్ ఎవరితోనూ లేదని చెప్తూనే అరియానా.. సోహైల్ పేరు చెప్పి స్టిక్ విరగ్గొట్టింది. నన్ను ఇబ్బంది పెడుతోందంటూ అభిజిత్.. హారిక పేరు చెప్పి స్టిక్ ముక్కలు చేశాడు. హారిక.. మోనాల్ ఒకరి పేర్లు మరొకరు చెప్తూ స్టిక్ విరగ్గొట్టారు. అవినాష్ తనకు అందరూ అడ్డేనంటూ స్టిక్ను ఆరు ముక్కలు చేసి అందరికీ పంచాడు. మోనాల్ వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతోందని అఖిల్ ఆమెతో బంధాన్ని బ్రేక్ చేశాడు. ఎవరేడ్చినా తనకే బాధేస్తోందని చెప్పిన సోహైల్ను నాగ్ ఎమోషనల్ ఫూల్ అని పిలిచారు. సోహైల్ కూడా స్టిక్ విరగ్గొట్టి అందరికీ ఆ ముక్కలు పంచాడు. (చదవండి: బిగ్బాస్ ఫినాలే రేస్: అతడే విజేత!) -
బిగ్ ఎలిమినేషన్: మోనాల్? అవినాష్?
బిగ్బాస్ నాల్గో సీజన్లో ఉన్న ఏకైక హీరోయిన్ మోనాల్ గజ్జర్. గుజరాతీ భామ అయినా తెలుగు నేర్చుకుని మరీ ముద్దుముద్దుగా మాట్లాడేది. ఈ విషయంలో వ్యాఖ్యాత నాగార్జున ఆమెను చాలాసార్లు మెచ్చుకున్నారు కూడా. కానీ వీకెండ్స్లో ఆమె ధరించే దుస్తులతో స్కిన్ షో చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వత్యిరేకత వ్యక్తమైంది. దీనికి తోడు ట్రయాంగిల్ స్టోరీ కూడా ఆమెను విమర్శల పాలు చేసింది. పగలంతా అఖిల్తో మాట్లాడుతూ, రాత్రి అభిజిత్తో మాట్లాడటం జనాల్లోకి తప్పుగా వెళ్లింది. అయితే యువత మాత్రం ఈ ముగ్గురి స్టోరీ మీద ఆసక్తి చూపించారు. మొదట్లో అంతా బాగానే నడిచినా రానూనురానూ ఈ ముగ్గురి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి అపార్థాల అగాధాన్ని సృష్టించాయి. దీంతో చివరకు మోనాల్ ఏకాకిగా మారింది. మంచి నీళ్ల గొడవతో మొదలైన వీరి ట్రయాంగిల్ స్టోరీ ఆమె అభి, అఖిల్ కంటైనర్లలో రంగు నీళ్లు పోసి నామినేట్ చేయడంతో ఎండ్ అయింది. (చదవండి: బిగ్బాస్: ఈ షోకు నువ్వు అనర్హురాలివి) అవినాష్కు వీడ్కోలు తప్పదా! నిజానికి ఈ బిగ్బాస్ ప్రయాణంలో మోనాల్ ఎన్నోసార్లు నామినేట్ అయినప్పటికీ ఎలాగోలా ఆ గండం నుంచి తప్పించుకుంటూ వచ్చింది. కొన్నిసార్లైతే ఆమెను సేవ్ చేయడం కోసం ఎక్కువ ఓట్లు వచ్చిన స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బయటకు పంపించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వారం అభిజిత్, అఖిల్, అవినాష్, మోనాల్ నామినేషన్లో ఉండగా ఎప్పటిలాగే మిస్టర్ కూల్ ఎక్కువ ఓట్లతో టాప్ స్థానంలో ఉన్నాడు. చివరి రెండు స్థానాల్లో మోనాల్, అవినాష్ ఊగిసలాడారు. ఈసారి కూడా బిగ్బాస్ తన దత్తపుత్రికను పంపించరులే అని అంతా అనుకున్నారు. కానీ పాలు పితికే టాస్కులో అవినాష్.. మోనాల్ తనను తన్నిందని చెప్పడం ఆమెకు నెగెటివ్గా మారింది. ఆమె ఓట్లకు మరింత గండి పడింది. ఫలితంగా ఈ వారం ఆమె ఎలిమినేట్ అయినట్లు ప్రచారం ఊపందుకుంది. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ఎంటర్టైనర్ అవినాష్ను హౌస్ను పంపించేశారట. దీంతో ఈసారి కూడా మోనాల్ మళ్లీ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా ఎలిమినేట్ అయింది మోనాలా? అవినాషా? అనేది క్లారిటీ రావాలంటే నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: దొంగతనంగా వాళ్లింట్లో అన్నం తినేదాన్ని) -
బిగ్బాస్: కాలితో తన్నిందా? నాగ్ తీర్పు ఎటువైపు?
ప్రతివారం లాగే ఈ వారం కూడా నాగ్ ఇంటిసభ్యుల లెక్క తేల్చేందుకు సిద్ధమయ్యారు. కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను తవ్వి చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ వారం అటు కంటెస్టెంట్లతో పాటు, ప్రేక్షకులను కూడా తికమక పెట్టిన అంశం ఒకటుంది. 'రేస్ టు ఫినాలే' మొదటి లెవల్లో పాలు పితకడం టాస్కులో మోనాల్ తన్నడం! ఆమె పాల క్యాన్ను తన్నానని చెప్పింది. కానీ అవినాష్ మాత్రం లేదు, నువ్వు నన్నే తన్నావు, అది కూడా కావాలని చేశావు అంటూ గొడవ పడ్డాడు. అక్కడే ఉన్న మిగతా ఇంటి సభ్యులు ఆటలో మునిగి అక్కడేం జరిగిందన్నది ఎవరూ చూడలేకపోయారు. ఈ విషయంలో అభిజిత్ అవినాష్కు సపోర్ట్ చేయగా సోహైల్ మాత్రం మోనాల్కు మద్దతుగా నిలబడ్డాడు. మోనాల్ తనను తన్నిందని, అప్పుడు ఆమె షూ తీసేస్తున్నానని అవినాష్ తనదే నిజమని వాదించాడు. అసలు ఏం జరిగిందో క్లారిటీ లేదో, లేదా నిజంగానే తన్నిందో కానీ మోనాల్ ఎందుకొచ్చిన గొడవ అనుకుని అవినాష్కు సారీ చెప్పింది. కాళ్లు కూడా పట్టుకోబోయింది. తర్వాత అతడికి హగ్గిచ్చి, బుగ్గన ముద్దు పెట్టి ఆ గొడవ అక్కడితో వదిలేసేలా చేసింది. కొలిక్కి రానున్న పంచాయితీ దీన్ని వీకెండ్లో నాగార్జున లేవనెత్తారు. అవినాష్, మోనాల్ను వేర్వేరుగా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మాట్లాడారు. మోనాల్ తనను కావాలనే తన్ని, తర్వాత ఓ లుక్కించిన అవినాష్ చెప్పుకొచ్చాడు. మరోవైపు మోనాల్ మాత్రం ఈ గొడవలతో తాను అలిసిపోయానంటూ ఏడ్చేసింది. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి అని నర్మద గేట్లు ఎత్తింది. వీరి పంచాయితీని నాగ్ ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరి అనుమానాలను పటాపంచలు చేసేందుకు వీడియో చూపించనున్నారు. దీంతో నిజం ఎవరి వైపు ఉందనేది నేటి ఎపిసోడ్లో నిగ్గు తేలనుంది. (బిగ్బాస్ ట్రోఫీ గెలవలేకపోతున్న అమ్మాయిలు) సోహైల్ను తిట్టడం మంచిదే! 'రేస్ టు ఫినాలే' విషయానికొస్తే ఇందులో మొదటి లెవల్లో సోహైల్, అఖిల్ కలిసి ఆడారు. తర్వాతి రౌండ్లో ఎవరికి వారే ఒంటరిగా ఆడారు. మూడో రౌండ్లో ఈ ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. అయితే స్నేహం కోసం సోహైల్ ఉయ్యాల దిగి రేసు నుంచి తప్పుకున్నాడు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏదేమైనా ఎంతో ముఖ్యమైన ఫినాలే మెడల్ను సోహైల్ చేజేతులా చేజార్చుకోవడాన్ని నాగ్ తప్పుపట్టారు. సాధారణంగా లోపలున్న కంటెస్టెంట్లను నాగార్జున తిడితే వారివారి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ సోహైల్ ఫ్యాన్స్ మాత్రం నాగార్జున క్లాస్ పీకడం మంచిదేనంటున్నారు. అతి మంచితనంతో స్నేహం కోసం సోహైల్ గేమ్లో వెనకబడకుండా ముందుకు వెళ్లడానికి నాగ్ మాటలు అతడికి మార్గనిర్దేశమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (హారిక బెస్ట్ కెప్టెన్ కానే కాదు: నాగార్జున) -
బిగ్బాస్: పరువు తీసుకున్న అవినాష్
బిగ్బాస్ షో ముగింపుకు వస్తున్నా మోనాల్ వ్యవహారం మాత్రం ఎవరికీ ఓ పట్టాన అర్థం కావడం లేదు. మొదట అభిజిత్తో, తర్వాత అఖిల్తో క్లోజ్గా ఉంటూ వస్తున్న మోనాల్ మొన్నటి నామినేషన్లో ఆ ఇద్దరిని తొలిసారి నామినేట్ చేసి షాకిచ్చింది. ఇకపై నా గేమ్ నేను ఆడతా, నేను ఫ్యామిలీ కోసం ఆడతా అంటూ తనలో తానే మాట్లాడుకుంది. అందరూ టార్గెట్ చేసినా వారిని ఎదిరించి పోరాడింది. అయితే రేస్ టు ఫినాలే టాస్క్లో మోనాల్ తనను తన్నిందని అవినాష్ తెగ ఫీలయ్యాడు. పదేపదే ఆమె తన్నిందంటూ దాని గురించే మాట్లాడటం మొదలు పెట్టాడు. దీంతో మోనాల్.. నిజంగా నేను తన్నానో లేదో క్లారిటీ లేదంటూనే అతడికి సారీ చెప్పింది. కాలితో తన్నినందుకు కాళ్లు పట్టుకోబోయింది. దీంతో షాక్ తిన్న అవినాష్ మామూలుగా సారీ చెప్తే సరిపోతుందన్నాడు. అయితే ఆమె మాత్రం సారీ చెప్పి, హగ్గిచ్చి బుగ్గన ముద్దు పెట్టి అతడిని కూల్ చేసింది. (చదవండి: అరియానా ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తుంది?: అవినాష్) దీంతో అవినాష్ గాల్లో తేలిపోయి ఉండొచ్చు. కానీ ఇది జరిగిన తెల్లారే అవినాష్ను అన్నయ్య అని పిలుస్తూ అతడి గాలి తీసేసింది. తాజాగా రిలీజైన ప్రోమోలో రేస్ టు ఫినాలే మూడో లెవల్ మొదలైంది. ఇందులో ఇద్దరు పోటీదారులు సోహైల్, అఖిల్ ఉయ్యాలలో కూర్చున్నారు. వీరికి బిగ్బాస్ జ్యూసుల మీద జ్యూసులు పంపుతున్నాడు. వాటిని తాగలేక కక్కలేక ఆ ఇద్దరు స్నేహితులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు మోనాల్, అవినాష్ కలిసి రావడం చూసిన అఖిల్.. మోనాల్, అతడు మీ తమ్ముడా? అని అడిగాడు. దీంతో అఖిల్కు కౌంటరివ్వాలని భావించిన అవినాష్.. నేను నీకు అన్ననా? అవినాషా? అని మోనాల్ను అడిగాడు. ఈ ప్రశ్నకు మోనాల్ ఏమాత్రం తడుముకోకుండా అవినాష్ అన్న అనడంతో అతడి పరువు పోయినట్లు ఫీలయ్యాడు. (చదవండి: బిగ్బాస్లో పనికి రానోళ్లను తోసేయండి: రాహుల్) -
నన్ను పంపించినా డోంట్ కేర్: అరియానా
బిగ్బాస్ హౌస్లో ఫినాలే రేస్ నడుస్తోంది. ఏడుగురితో మొదలైన ఈ పోటీ ఇప్పుడు ఇద్దరి మధ్యనే జరగనుంది. అందరినీ దాటుకుని అఖిల్, సోహైల్ మూడో లెవల్లో అడుగు పెట్టారు. వీరిలో ఎవరు గెలిచినా ఇద్దరూ సంతోషించేవాళ్లే. అరియానా, అవినాష్ మాత్రం వీళ్ల మీది కోపాన్ని బిగ్బాస్ మీద చూపించారు. ఈ ఇద్దరు కలిసి ఆడుతూ ఫినాలేకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆవేదన చెందారు. నిన్న వాళ్లు కలిసి ఆడుతుంటే బిగ్బాస్ ఎందుకు ఆపలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. అటు హారిక కూడా గెలిచేందుకు తన సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఓటమిపాలవక తప్పలేదు. మరి నేటి 88వ బిగ్బాస్ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే దీన్ని చదివేసేయండి.. తన్నినందుకు సారీ చెప్పిన మోనాల్! నిన్న పాలు పితకడం టాస్కులో అఖిల్, సోహైల్ మాత్రమే కలిసి ఆడలేదు. అభిజిత్ హారిక దగ్గర పాల బాటిళ్లు తక్కువగా ఉన్నాయని ఆమెకు కొన్నింటిని ఇచ్చి సాయం చేశాడు. అటు అఖిల్ కూడా మోనాల్కు బాటిళ్లు ఇచ్చినప్పటికీ ఆమె తిరిగి ఇచ్చేసింది. అయితే అవినాష్.. అఖిల్, సోహైల్ కలిసి ఆడటం వల్ల తన గేమ్ డిస్టర్బ్ అయిందని ఆవేదన చెందాడు. మోనాల్ తన్నడం వల్ల మరింత హర్ట్ అయ్యానని చెప్పాడు. అయితే మోనాల్ను అడిగితే తన్నలేదని చెప్పిందని సోహైల్ క్లారిటీ ఇవ్వగా అభి మాత్రం ఆమె అబద్ధాలు ఆడుతుందని, అందుకే ఆమె ఫ్రెండ్షిప్ వద్దన్నాను అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మోనాల్ నిజంగా తన్నితే మాత్రం ఆమెతో మాట్లాడను అని సోహైల్ చెప్పాడు. ఎందుకొచ్చిన గొడవ అనుకుందో ఏమో కానీ మోనాల్ వెళ్లి అవినాష్ను కూల్ చేసేందుకు సారీ చెప్పి, ముద్దు పెట్టింది. (చదవండి: నీతో రిలేషనే వద్దు: తేల్చేసిన అఖిల్) గొడవకు పునాది వేసిందే హారిక.. తర్వాత ఫినాలే రేసులో రెండో లెవల్ ప్రారంభమైంది. ఇందులో పై నుంచి పడే పూలను సేకరించి మట్టిలో నాటాలి. ఎక్కువ పూలు నాటిన ఇద్దరు తర్వాతి లెవల్కు అర్హత సాధిస్తారు. ఈ పూలు పట్టుడు టాస్క్లో అభిజిత్, అఖిల్, సోహైల్, హారిక ఎవరికి వారే సాటి అన్నట్లుగా పోరాడారు. మొదట హారిక.. సోహైల్ చేతిలో నుంచి పువ్వు లాక్కోవడంతో అతడు ఆమె చేతికందిన పువ్వులన్నింటినీ లాక్కోవడం ప్రారంభించాడు. దీంతో ఖంగు తిన్న హారికకు దుఃఖం పొంగుకొచ్చింది. తర్వాత ఇది గొడవగా మారింది. కానీ సోహైల్ సానుభూతితో చివరకు తను లాక్కున్నవాటిని ఆమెకే తిరిగి ఇచ్చేశాడు. అయినా సరే ఆమె మట్టిలోఎక్కువ పూలు నాటలేకపోవడంతో ఈ లెవల్ నుంచి నిష్క్రమించింది. (చదవండి: బిగ్బాస్: మోనాల్తో డేట్.. అభి కంటతడి) బిగ్బాస్ మీదే ఫైర్ అయిన అరియానా నిన్న ఇద్దరు కలిసి ఆడినప్పుడు బిగ్బాస్ వ్యక్తిగత ఆట అని హెచ్చరించలేదు కానీ ఈ రౌండ్లో మాత్రం ఎందుకు హెచ్చరించాడని అరియానా బాత్రూమ్లోకి వెళ్లి ఏడ్చింది. నిన్న వ్యక్తిగతంగా ఆడి ఓడిపోయాను. మీరు నన్ను ఇప్పటికిప్పుడు పంపించేసినా నేను అస్సలు లెక్క చేయను, కానీ మీరు చేస్తోంది మాత్రం తప్పు.. అని అరియానా బిగ్బాస్ మీద మండిపడింది. అఖిల్, సోహైల్ కలిసి ఆడి టాప్ 5లోకి వెళ్లిపోదామనుకుంటున్నారు అని అక్కసు వెళ్లగక్కింది. ఇక ఈ లెవల్లో హారిక, అభిజిత్ ఓడిపోగా ఇద్దరు స్నేహితులు అఖిల్, సోహైల్ తర్వాతి ఘట్టంలోకి అడుగు పెట్టారు. (చదవండి: బిగ్బాస్: ఈ వారం అవినాష్ తప్పించుకోలేడా?) ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తుంది.. ఇంటి పనులు చేయాల్సిన విషయంలో అవినాష్, అరియానా గొడవ పడ్డారు. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని నన్ను ఎందుకు అన్నావు? అని అవినాష్ ప్రశ్నించడంతో ఆమె సారీ, క్షమించు అంటూ దండం పెట్టేసింది. నేను నామినేషన్లో ఉన్నాను, నువ్వు అలా మాట్లాడొద్దు, ఇలా బిహేవ్ చేయొద్దంటూ అవినాష్ సీరియస్ అవడంతో అభి అతడికి నచ్చజెప్పాడు. అటు అరియానా బాధతో ఏడుస్తుంటే కూడా ఇది కూడా కాలిక్యులేట్ అవుతుందని లెక్కలు వేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన అరియానా నేనేం మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా? అని మండిపడింది. ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తుందని అవినాష్ చిరాకు ప్రదర్శించాడు. కానీ కాసేపటికే ఒంటరిగా బాధపడుతున్న అరియానా దగ్గరకు వెళ్లి బుజ్జగించాడు. నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్పడానికే వచ్చాననడంతో ఇక నుంచి నా మాటలు కంట్రోల్ చేసుకుంటానని అరియానా ముక్తసరిగా మాట్లాడింది. దీంతో అవినాష్ ఆమెను హత్తుకుని ఓదార్చాడు. -
నాకొద్దు, ఎలిమినేట్ చేయండి: అవినాష్
బిగ్బాస్ ప్రయాణం తుది అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో ఒకరు టాప్ 5లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు బిగ్బాస్ రేస్ టు ఫినాలే టాస్క్ ఇచ్చాడు. ఇందులో గార్డెన్ ఏరియాలో ఓ ఆవు బొమ్మ ఉంటుంది. అంబా.. అన్న శబ్ధం వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లు దాని దగ్గరకు వెళ్లి పాలు పట్టుకోవాలి. ఎవరు ఎక్కువ పాల బాటిళ్లు నింపుతే వారు రెండో లెవల్కు అర్హత సాధిస్తారు. ఈ టాస్కులో గెలిస్తే ఇంటిసభ్యులకు రెండు రకాల ప్రయోజనం ఉంటుంది. వాళ్ల గేమ్ నచ్చితే ప్రేక్షకులు ఓట్లు గుద్దుతారు. అలాగే గేమ్లో విజయం సాధిస్తే రెండో లెవల్కు అర్హత సాధిస్తారు. ఆ లెవల్లో కూడా విజయాన్ని ముద్దాడితే నేరుగా ఫైనల్లో అడుగు పెట్టినట్లే.. ఇక ఈ టాస్కులో ఒకరి మీద ఒకరు పడుతూ పక్కనోళ్లను తోస్తూ కంటెస్టెంట్లు గేమ్ ఆడుతున్నారు. పక్కవాళ్ల పాల డబ్బాలను విసిరేస్తూ మరీ ప్రతాపం చూపిస్తున్నారు. (చదవండి: బిగ్బాస్: తెలివైన నిర్ణయం తీసుకున్న అవినాష్) ఈ క్రమంలో అవినాష్, సోహైల్ మధ్య గొడవ రాజుకున్నట్లు కనిపిస్తోంది. అసహనంతో ఊగిపోయిన అవినాష్ అందరూ ఒక్కటైపోయారని మండిపడ్డాడు. తన వల్ల కాదని, తనను ఎలిమినేట్ చేసేయండని బిగ్బాస్కు చెప్పాడు. ఇక ఇప్పటికే ఎవిక్షన్ ఫ్రీ పాస్తో సేవ్ అయినందుకు అవినాష్ ఓరకమైన నిస్తేజంలో ఉన్నాడు. తనకు ప్రేక్షకుల సపోర్ట్ తగ్గిపోయిందేమోనని ఆలోచనలో పడ్డాడు. సేవ్ అయ్యానన్న సంతోషం కన్నా పాస్ లేకపోయుంటే ఎలిమినేట్ అయ్యేవాడిని అన్న బాధే అతడిని ఎక్కువగా వేధిస్తోంది. ఇంకా దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండటం వల్లే ఈ వారం అతడు నామినేషన్లో ఉన్నాడు. ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే రేస్ టు ఫినాలే టాస్క్లో అఖిల్, అభిజిత్, సోహైల్, హారిక రెండో లెవల్కు అర్హత సాధించినట్లు సమాచారం. మరి వీరిలో టికెట్ అందుకునే అదృష్టవంతులు ఎవరో చూడాలి. (చదవండి: మోనాల్ నాకోసం స్టాండ్ తీసుకోవాల్సింది: అభిజిత్) -
బిగ్బాస్: ఊహించని ట్విస్టులతో అభిజిత్ కంట నీరు
ఈసారి బిగ్బాస్ ఇంటిసభ్యులకు కావాల్సినన్ని గొడవలు పెట్టుకునేందుకు బంపరాఫర్ ఇచ్చాడు. ఇద్దరి కన్నా ఎక్కువ మందిని కూడా నామినేట్ చేసుకోవచ్చని తెలిపాడు. ఇద్దరిని నామినేట్ చేయడానికే కిందామీద పడుతున్న కంటెస్టెంట్లు ఈ ఆప్షన్ వాడదల్చుకోలేదు. కానీ మోనాల్, అరియానా మాత్రం ఈ అవకాశాన్ని చేజార్చుకోదల్చుకోలేదు. అయితే అరియానా వేరేవాళ్లతో మామూలుగా మాట్లాడి, మోనాల్తో మాత్రం గొంతు పెంచి డిమాండ్ చేసినట్లు మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వింది. మరోవైపు అవినాష్ గత ఎలిమినేషన్ నుంచి ఇప్పటికీ బయటకు రావడం లేదు. తనకన్నా వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు అని మోనాల్నుద్దేశిస్తూ పదేపదే దెప్పి పొడిచాడు. ఫలితంగా మరోసారి నామినేషన్లో వచ్చిపడ్డాడు. అటు హారిక, అభి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నా.. అర్థం చేసుకుని మళ్లీ కలిసిపోయారు. కానీ అఖిల్, మోనాల్ మాత్రం భగ్గుమంటూ ఎదురు పడటానికి కూడా ఇష్టపడలేదు. అభిని నామినేట్ చేసి ఏడ్చేసిన హారిక బిగ్బాస్ హౌస్లో 13 వారానికిగానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఏడుగురు కంటెస్టెంట్ల ముందు కంటైనర్స్ ఉంటాయి. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కంటెస్టెంట్ల కంటైనర్లలో కలర్ నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఎవరి గిన్నెలో ఎక్కువ రంగు నీళ్లు ఉంటే వాళ్లు నామినేట్ అయినట్లు లెక్క. మొదటగా హారిక నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టింది. నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి నేను కారణం అయినప్పటికీ, నాకు ప్రాధాన్యత ఇవ్వలేదనిపించిందని అవినాష్ను నామినేట్ చేసింది. నీకు విలువిచ్చాను. కాకపోతే నాకంటే వీక్ ఉన్నవాళ్లు నామినేషన్లో ఉన్నప్పుడు నేనెలా ఎలిమినేట్ అవుతాను అన్న సందేహమే నన్ను వేధిస్తోంది అని అవినాష్ స్పష్టం చేశాడు. అనంతరం టాస్కు ఆడటానికి నిరాకరించినందుకుగానూ అభిజిత్ను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించగానే అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. కన్ఫెషన్ రూమ్లో జరిగినదానికి అభిని నామినేట్ చేయలేదని అంతకుముందే ఇది అనుకున్నానని హారిక కెమెరాల ముందు చెప్పుకుంటూ ఏడ్చింది. నీకు ఓవర్ కాన్ఫిడెంట్.. తర్వాత అవినాష్.. మోనాల్ను వీక్ అంటూ నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా మోనాల్ మాట్లాడుతూ నేను వీక్ కాదని జనాలు నిరూపించారు, అది మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది. దీంతో అవినాష్ అందుకుంటూ.. ఆమె వీక్ కాదని నిరూపించారట. 'అంటే నేను వీక్ కదా! ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్లే సేవ్ అయ్యాను కదా. అందుకే ముఖం చూపించుకోలేకపోతున్నా..' అని అవినాష్ ఓవర్ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత తనను వరస్ట్ కెప్టెన్ అని చెప్పినందుకు అఖిల్ను నామినేట్ చేశాడు. అనంతరం అఖిల్.. నీకు ఓవర్ కాన్ఫిడెంట్ ఉందంటూ అవినాష్ను, గేమ్లో ఎఫర్ట్స్ తక్కువగా ఉన్నాయని మోనాల్ను నామినేట్ చేశాడు. (చదవండి: హారికను పెళ్లి చేసుకుంటా: అవినాష్) నాకోసం స్టాండ్ తీసుకోవాల్సింది: అభి అనంతరం అభిజిత్.. 'మొదటి రోజు నుంచీ నీవల్ల నేను ఎమోషనల్గా హర్ట్ అవుతున్నా. ఇది నీ తప్పు అనట్లేదు. కానీ నీకు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా కూడా నీ విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. నువ్వు కావాలని చేస్తున్నావో, దేనికి చేస్తున్నావో తెలీదు కానీ ఎక్కడో ఓసారి నాకోసం నువ్వు స్టాండ్ తీసుకుంటే బాగుండేదనిపించింద'ని మోనాల్ను నామినేట్ చేశాడు. 'టాస్కు చేయకపోవడం నాకు తప్పు. కానీ ఎందుకు చేయలేదనే విషయం నీకు బాగా తెలుసు. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎవరూ అర్థం చేసుకోలేరు' అంటూ హారిక కంటైనర్లో అతి తక్కువ రంగు నీళ్లు పోసి నామినేట్ చేశాడు. (చదవండి: రంగంలోకి ‘ఆర్జీవీ’, వణికిపోయిన హౌస్మేట్స్) ఆ ఇద్దరినీ తొలిసారి నామినేట్ చేసిన మోనాల్ తర్వాత వచ్చిన మోనాల్ తనను చులకనగా చూస్తున్న కంటెస్టెంట్లకు గట్టి కౌంటర్లు ఇచ్చింది. ముందుగా అవినాష్ను నామినేట్ చేస్తూ ఇక్కడున్న అందరూ స్ట్రాంగే అని నొక్కి చెప్పింది. నామినేషన్కు భయపడటమే మీ వీక్నెస్ అని చెప్పింది. తర్వాత టాస్క్ ఆడనందున అభిని నామినేట్ చేస్తూ.. మీరు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా మీకు దూరంగానే ఉంటున్నాను అని క్లారిటీ ఇచ్చింది. అలాగే తన క్లోజ్ ఫ్రెండ్ అఖిల్ను సైతం నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది, నువ్వు బ్రెయిన్తో గేమ్ ఆడితే, నేను మనసుతో ఆడతానని మోనాల్ తెలిపింది. నన్ను నామినేట్ చేయనని మాటిచ్చావు, కానీ చేస్తున్నావు అని అఖిల్ సీరియస్ అవగా నువ్వే కదా గేమ్ ఆడమన్నావు అంటూ ఆమె బదులిచ్చింది. అయినా సరే ఆమె మాటలను వినిపించుకోని అఖిల్.. నువ్వు ప్రతిరోజు నా కళ్లు తెరిపిస్తున్నావు అని మనసులోని బాధను కక్కేశాడు. ఇక హౌస్లోకి వెళ్లి మోనాల్ ఏడ్చేసింది. మొదటి మూడు వారాలు ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, పదే పదే నన్ను వీక్ అంటున్నారని హారికతో తన గోడు వెల్లబోసుకుంది. ముగ్గురిని నామినేట్ చేసిన అరియానా అరియానా.. తనను వరస్ట్ కెప్టెన్ అన్నందుకు హారిక, అవినాష్, సోహైల్ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో అరియానా.. మోనాల్ను డిమాండ్ చేస్తూ మాట్లాడింది. మధ్యలో అందుకుని అవినాష్ తెలుగులో మాట్లాడు అని చెప్పగా మధ్యలో మాట్లాడకు అని మోనాల్ హెచ్చరించింది. సోహైల్.. అవినాష్ను నామినేట్ చేస్తూ మోనాల్ కూడా స్ట్రాంగ్ అయిందని, ఆమెను వీక్ అనొద్దని అభ్యర్థించాడు. మోనాల్ కన్నీళ్లు తుడిచాడు. ఈవారం అభిజిత్, అవినాష్, మోనాల్, అఖిల్, హారిక నామినేట్ అయ్యారు. (చదవండి: బిగ్బాస్ : తొలిసారి అభిజిత్ భావోద్వేగం) -
బిగ్బాస్: ఈ వారం అవినాష్ తప్పించుకోలేడా?
ఏ దారి తెలీని నావలా ఎటో వెళ్లిపోతున్న బిగ్బాస్ హౌస్కు ఎంటర్టైన్మెంట్ను పరిచయం చేశాడు జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చి అందరితో కలిసిపోయాడు. తన కామెడీతో అందర్నీ డామినేట్ చేశాడు కూడా. దీంతో మొదట్లో అతనికి వంక పెట్టడానికి ఏమీ లేకపోవడంతో ఎవరూ అతడిని నామినేట్ చేయలేదు. కానీ రానురానూ కంటెస్టెంట్లు తగ్గేకొద్దీ, ఆటతీరు, మాటతీరు, పని తీరు ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొందరు అవినాష్ను కూడా నామినేట్ చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి అతడిలో మార్పు మొదలైంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అవినాష్ నామినేషన్ అంటే చాలు భగ్గుమని లేచేవాడు. ఆవేశంతో ఊగిపోయేవాడు. ఎలిమినేట్ అయిపోతానేమోనని తెగ భయపడిపోయేవాడు. అతడిని నామినేట్ చేసిన ప్రతిసారి ఇదే జరిగేది. తగ్గుతూ వస్తోన్న అవినాష్ గ్రాఫ్ దీనికి తోడు నోయల్ ఎలిమినేషన్ తర్వాత అతడు మరింత డల్ అయ్యాడు. కామెడీ చేయడం తగ్గించేశాడు. బిగ్బాస్ కోసం తన జీవనాధారమైన జబర్దస్త్ను వదిలేసి వచ్చాను అంటూ సింపథీ కోసం పాకులాడినట్లు కనిపించింది. కానీ జబర్దస్త్లో తన అన్నకు మళ్లీ అవకాశం ఉందని అవినాష్ సోదరులే బాహాటంగా చెప్పడంతో అతని మీద వ్యతిరేకత ఏర్పడింది. ఇక అప్పటి నుంచి అవినాష్ గ్రాఫ్ తగ్గుతూ రాగా దాని ఎఫెక్ట్ పన్నెండో వారంలో స్పష్టంగా కనపడింది. అఖిల్, మోనాల్, అరియానా నామినేషన్లో ఉన్నప్పటికీ వారికన్నా అవినాష్కే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే తను సంపాదించుకున్న ఫ్రీ ఎవిక్షన్ పాస్తో ఎలిమినేషన్ నుంచి ఈజీగా తప్పించుకున్నాడు. (చదవండి: హారికను పెళ్లి చేసుకుంటా: అవినాష్) ఈ వారం డేంజర్ జోన్లో ఆ ఇద్దరూ కానీ దురదృష్టం కొద్దీ ఈ వారం కూడా అవినాష్ నామినేషన్లో ఉన్నాడని లీకువీరులు చెప్తున్నారు. అదే కన నిజమైతే ఈసారి అతడు డేంజర్ జోన్లో ఉన్నట్లే. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్టు ప్రకారం ఈ వారం అఖిల్, అభిజిత్, హారిక, అవినాష్, మోనాల్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో అఖిల్, అభిజిత్ ఎలాగో ముందుగానే సేవ్ అవుతారు. మరోవైపు తన కెప్టెన్సీలో చేసిన తప్పులను ప్రేక్షకులు క్షమించేస్తే హారిక కూడా సేవ్ అయ్యే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి. ఇక ఎన్నోవారాలుగా నామినేషన్లో ఉంటూ వస్తోన్న మోనాల్ను బిగ్బాస్ వదులుకోడన్నది నెటిజన్ల అభిప్రాయం. మిగిలిందల్లా అవినాష్! ఒకవేళ అరియానా అభిమానులు కూడా సపోర్ట్ చేస్తే ఈ వారం కూడా అతడు ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు ఆస్కారం లేకపోలేదు. మొత్తానికి ఈ వారం అవినాష్, మోనాల్ డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది. (చదవండి: బిగ్బాస్ : అవినాష్కి ఏమైంది..ఎందుకలా చేశాడు?) -
నేను ఎలిమినేట్ అయ్యాను: అవినాష్ భావోద్వేగం
బిగ్బాస్ నాల్గో సీజన్ పన్నెండో వారాంతంలో స్పెషల్ గెస్ట్గా వచ్చిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తన మాటల గారడీతో ఆకట్టుకున్నారు. నవ్విస్తూ, పంచ్లు వేస్తూ, కలిసిపోతూ కాసేపటివరకు హోస్ట్గా అందరినీ మైమరిపించారు. మరోవైపు నిన్న నాగ్ చేతులెత్తి వేడుకోవడాన్ని చూసి బాధపడ్డ కంటెస్టెంట్లు ఆయన్ను సంతోషరిచేందుకు డ్యాన్స్లతో హోరెత్తించారు. నాగ్తో తిట్టించుకున్న అభి తన స్టెప్పులతో మెప్పు పొందాడు. ఇక ప్రేక్షకులు తక్కువ ఓట్లతో అవినాష్ను ఫెయిల్ చేసినా బిగ్బాస్ ఇచ్చిన పాస్తో అవినాష్ ఎలిమినేషన్ నుంచి గట్టెక్కాడు. మరి వినోదాల మేళవింపుగా మారిన నేటి బిగ్బాస్ ఎపిసోడ్ ఎలా కొనసాగిందో చదివేయండి.. గుండె ఆగిపోతుందని ఏడ్చేసిన అరియానా నాగార్జున కోపాన్ని చల్లార్చేందుకు ఇంటి సభ్యులు నాగ్ సాంగ్స్కు చిందేస్తూ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో అవినాష్ -అరియానా, అభిజిత్ -మోనాల్, సోహైల్ -హారిక జంటలుగా కలిసి డ్యాన్స్ చేశారు. వీరి మాస్ డ్యాన్స్ చూసి నాగ్ సైతం సంతోషించారు. తర్వాత నాగ్ 'చీకటిలో ధైర్యం స్థైర్యం' టాస్క్తో మరోసారి కంటెస్టెంట్లను భయపెట్టించే ప్రయత్నం చేశారు. మొదటగా అరియానా దెయ్యం గదిలోకి వెళ్లడానికి వెళ్లడానికి నిరాకరించింది. నన్ను ఒదిలేయండి, నా గుండె ఆగిపోతుంది అని ఏడ్చేయడంతో ఆమెను పక్కన పెట్టేశారు. తర్వాత సోహైల్.. లోపలకు వెళ్లగా భయపడుతూనే ఒక్కో అడుగు ముందుకు వేశాడు. గజ్జెల శబ్ధం వినపడేసరికి గజగజ వణికిపోయాడు. అఖిల్ భయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. (చదవండి: బిగ్బాస్ : తొలిసారి అభిజిత్ భావోద్వేగం) లోపల భయపడ్డాను: అభిజిత్ అభిజిత్ అయితే ఈలలు వేసుకుంటూ మరీ వెళ్లాడు కానీ లోపల కొంచెం భయంగా ఉండేనని అసలు విషయం చెప్పాడు. ఇక అవినాష్ దెయ్యం అరుపులకు దడుసుకుంటూనే రూమ్ అంతా కలియతిరిగాడు. లోనికి వెళ్లిన హారిక, మోనాల్ ఏమాత్రం అదరలేదు, బెదరలేదు. మొన్నటి దెయ్యం టాస్కులో సోహైల్, అఖిల్ భయమంటే ఏంటో తెలీదంటూ బయటకు ఫోజులు కొట్టినప్పటికీ చీకటి గదిలోకి వెళ్లాక చిన్నపిల్లల్లా దడుసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అంతటినీ నాగ్ కంటెస్టెంట్లకు చూపించి వారి పరువు తీశారు. తర్వాత అరియానా ధైర్యం తెచ్చుకుని ఒంటరిగా చీకటి గదిలోకి వెళ్లి రాగా, భయాన్ని జయించానని సంబరపడిపోయింది. (చదవండి: నీతో రిలేషనే వద్దు: తేల్చేసిన అఖిల్) కంటెస్టెంట్ల ఆట కట్టించిన కిచ్చా సుదీప్ తర్వాత కన్నడ బిగ్బాస్ ఏడు సీజన్లను వరుసగా హోస్ట్ చేస్తున్న కిచ్చా సుదీప్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. వస్తూనే ఈ కంటెస్టెంట్ల వల్ల చాలా అలిసిపోయాను అని నాగ్ సర్ వెళ్లిపోయారు అని చెప్పారు. కానీ వాళ్లు నమ్మకపోవడంతో, నాగ్ ఎందుకు వెనక్కు రావాలో సరైన కారణాలు చెప్తే లోనికి రానిస్తానన్నారు. దీంతో ఒక్కొక్కరు నాగ్ గురించి చెప్పడం మొదలు పెడుతూ ఉండగా వారందరికీ సుదీప్ కౌంటర్లు ఇస్తూ వచ్చారు. నాగ్ సర్ మా మీద కేరింగ్తో స్వెటర్లు, డ్రైఫూట్లు, డ్రెస్సులు తీసుకువచ్చారు అని అరియానా చెప్పగా ఒకవేళ నేను స్వెటర్ ఇస్తే నేనూ ఇక్కడే ఉండొచ్చా అని పంచ్ వేశారు. కంటెస్టెంట్లపై కౌంటర్ల పర్వం ముగిసిన తర్వాత నాగ్ స్టేజీ మీదకు విచ్చేశారు. (చదవండి: ట్రోలింగ్: అప్పుడు నాని, ఇప్పుడు నాగార్జున) గెలుపు కన్నా విధేయతే ముఖ్యం: హారిక ఇక సుదీప్.. అవినాష్ను ఇరకాటంలో పడేసే చిలిపి ప్రశ్న అడిగారు. ఎవరితో డేట్ చేస్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు? అని ప్రశ్నించారు. మోనాల్తో డేట్, హారికతో పెళ్లి, కానీ అరియానాను మాత్రం చంపుతానని చెప్పారు. హారికను నీకు విధేయతా ముఖ్యమా? గెలుపు ముఖ్యమా? అన్న ప్రశ్నకు ఆమె విధేయతే ముఖ్యమని సమాధానమిచ్చింది. అభిజిత్కు హారిక షార్ట్ హెయిర్తో ఉంటే ఇష్టమా? పొడువు జుట్టుతో ఉంటే ఇష్టమా? అన్న ప్రశ్నకు చిన్న జుట్టు ఉంటేనే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. అరియానాను ఒక్కరోజు నువ్వు అవినాష్లా నిద్రలేస్తే చేసే మొదటి పని ఏంటి? అని అడగ్గా తానసలు నిద్రలో నుంచే లేచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సోహైల్కు మటన్ లేదా చికెన్లో ఏది ఎక్కువ ఇష్టమంటే మటన్ అని జవాబిచ్చాడు. (చదవండి: అభిజిత్కే ఓటేస్తా: జబర్దస్త్ కమెడియన్) అఖిల్ను సేఫ్ చేసిన సుదీప్ తర్వాత సుదీప్ మోనాల్ను పిలవబోయి అఖిల్ను పిలిచారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరిని అడిగినా ఒకటేలే అని నాగ్ ఇద్దరికీ ముడి పెట్టేశారు. తర్వాత.. నీకు ఇంట్లో ఒక హౌస్మేట్ను మాయం చేయగల శక్తి ఉంటే ఎవరిని చేస్తావన్న ప్రశ్నకు అఖిల్.. మోనాల్ పేరు చెప్పాడు. ఒకవేళ నీగురించి నువ్వు ఏదైనా పుకారు మొదలుపెట్టాలనుకుంటే అది ఏంటి? అన్న ప్రశ విసిరగా దానికి మోనాల్.. నేను ఏడవను అని చాటింపు చేస్తానని చెప్పింది. గుజరాతీ అయినా తెలుగు బాగా మాట్లాడుతున్నందుకు సుదీప్ ఆమెను మెచ్చుకున్నారు. పనిలో పనిగా నాగ్ను చూస్తూ ఒక డైలాగ్ చెప్పమన్నారు. దీంతో ఆమె నువ్వు నాకు చాలా ఇష్టం అని నాగ్తో చెప్పి సిగ్గుల మొగ్గయింది. కానీ అది ఇద్దరికీ చెప్పినట్లు అనిపించింది. తర్వాత సుదీప్.. అఖిల్ సేఫ్ అయినట్లు వెల్లడించారు. అనంతరం తెలుగు బిగ్బాస్ షోకు వీడ్కోలు తీసుకుంటూ తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా గీతాంజలి అని చెప్పారు. ప్రేక్షకులు నన్ను ఎలిమినేట్ చేశారు చివరగా అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడటంతో అతడు ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు. అయితే ప్రేక్షకుల దృష్టిలో మాత్రం తాను ఎలిమినేట్ అయ్యానని అవినాష్ బాధపడ్డాడు. ఇప్పుడు నేను ముందుకెళ్లాలా? ఆగిపోవాలా? అనేది అర్థం కావట్లేదన్నారు. దీంతో నాగార్జున అతడికి ధైర్యం చెప్పారు. బిగ్బాస్కు రాకముందు ఉన్న అవినాష్ వేరు, హౌస్లోకి వచ్చాక అవినాష్ వేరని అతడిని ఆకాశానికెత్తారు. నీ దగ్గర పాస్ ఉందనే ఓట్లు వేయలేదు అనుకోవచ్చు కదా అని పాజిటివిటీని నూరి పోశారు. కానీ కొత్తగా ఇలాంటి మాటలతో సింపథీ మాత్రం మొదలు పెట్టొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. అందరూ ఎవరి ఆట వారే ఆడండని మరోసారి స్పష్టం చేశారు. (చదవండి: కెప్టెన్గా విఫలమైన హారిక!) -
బిగ్బాస్: తెలివైన నిర్ణయం తీసుకున్న అవినాష్
బిగ్బాస్ కథ కంచికి చేరుతోంది. ఇప్పుడున్న ఏడుగురిలో ఐదుగురికే టాప్ 5లో చోటు దొరుకుతుంది. ఫైనల్లో చోటు దక్కించుకునేందుకు కంటెస్టెంట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఎలిమినేషన్ వారి రాతను మార్చనుంది. వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట, నడత.. ప్రతీది కూడా వారి గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ఈ నేపథ్యంలో పన్నెండో వారం ఎలిమినేషన్ సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా? ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు? అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. నామినేషన్ అంటేనే గజగజ.. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉన్న అవినాష్ తన పాస్ను ఉపయోగించాడట. దీంతో అతడు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. అదే సమయంలో అవినాష్ను కాదని వేరే వాళ్లని ఇంటి నుంచి పంపించేయడం అన్యాయం కాబట్టి ఈసారి ఎలిమినేషన్ ఎత్తేశారట. ఏదేమైనా అవినాష్ తెలివైన నిర్ణయమే తీసుకున్నాడు. రెండు వారాల గడువు ఉంది కదా అని పాస్ను దాచుకోకుండా వాడుకున్నాడు. ఇక మొదటి నుంచి కూడా అవినాష్ నామినేషన్ అంటేనే గజగజలాడిపోతాడు. ఎవరు తనను నామినేట్ చేసినా శివాలెత్తుతాడు. తనకు తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటూనే ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానో అని భయపడుతుంటాడు. సింపథీ గేమ్.. రివర్స్ అయిన గ్రాఫ్ కానీ అవినాష్ ఎంట్రీ ఇచ్చిన మొదట్లో బిగ్బాస్ హౌస్ స్వరూపమే మారిపోయింది. ఇంట్లో నవ్వుల నదిని పారిస్తూ కొత్త జోష్ నింపాడు. కానీ ఎప్పుడైతే నోయల్ ఎలిమినేట్ అవుతూ చిల్లర కామెడీ అని అవినాష్ను అన్నాడో అప్పటి నుంచి అతడు కాస్త డల్ అయ్యాడు. తర్వాత కామెడీ చేయడానికి కూడా తటపటాయించాడు. తర్వాత తనను జబర్దస్త్లో తిరిగి రానివ్వరు, అన్నీ కోల్పోయాను, ప్రేక్షకులు చూస్తున్నారు.. అని పదే పదే చెప్పడాన్ని కూడా సింపథీ కోసం వెంపర్లాడుతున్నాడన్న అపనిందను మూటగట్టుకున్నాడు. దీంతో అవినాష్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఫలితంగా ఈ వారం అరియానా, అఖిల్, మోనాల్ కన్నా తక్కువ ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. కానీ బిగ్బాస్ ఇచ్చిన పాస్తో ఈ వారం ఎలిమినేషన్ ఈదేశాడని సోషల్ మీడియా కూడా కోడై కూస్తోంది. అలాగే రేపటి ఎపిసోడ్లో కన్నడ హీరో కిచ్చా సుదీప్ ప్రత్యేక అతిథిగా రానున్నారట. అది ఎంతవరకు నిజమనేది చూడాలి. -
అభిజిత్కే ఓటేస్తా: జబర్దస్త్ కమెడియన్
బిగ్బాస్ నాల్గో సీజన్ ఫినాలేలో చోటు దక్కించుకునేందుకు రేసు మొదలైంది. కంటెస్టెంట్లు బంధాలు, అనుబంధాలను పక్కకు నెట్టి పూర్తిగా గేమ్పైనే ఫోకస్ పెడుతున్నారు. పంతొమ్మిది మందితో మొదలైన ఈ ప్రయాణంలో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు.. అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్, మోనాల్, సోహైల్, హారిక మాత్రమే మిగిలారు. టాప్ 5లో చోటు దక్కించుకోవడమే కాకుండా ట్రోఫీని ఎగరేసుకుపోవడమే లక్ష్యంగా కష్టపడుతున్నారు. అయితే వీరు లోపలెంత కష్టపడుతున్నారో వారిని గెలిపించేందుకు అంతకన్నా ఎక్కువే కష్టపడుతున్నారు వారి అభిమానులు. ఇక బిగ్బాస్ ప్రయాణం ముగింపుకు వస్తున్న తరుణంలో సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగుతూ వారి ఫేవరెట్ కంటెస్టెంట్లకే సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పలువురు సీరియల్ నటీనటులు అఖిల్కు ఓటేయాలని కోరుతుండగా హీరో సందీప్ కిషన్ తన ఫుల్ సపోర్ట్ సోహైల్కే అని మొదట్లోనే చెప్పేశాడు. (చదవండి: ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్బాస్లోకి వెళ్లను : యాంకర్) అవినాష్కు జీవితాన్ని ప్రసాదించిన జబర్దస్త్ యూనిట్ కూడా ఈ ప్రచారంలోకి దిగింది. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను.. అవినాష్కు ఓటేసి గెలిపించాలని కోరారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అవినాష్ చివరి వరకు ఉండాలని కోరుకుంటూనే అభిజిత్ అంటే ఇష్టమని చెప్పారు. అభి ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకుంటూ మొదటి నుంచి ఒకేలా ఉంటున్నాడంటూ అతడికి కూడా సపోర్ట్ చేశారు. తాజాగా బుల్లెట్ భాస్కర్ సైతం అభిజిత్కే మద్దతు తెలిపాడు. 'అందరూ బాగా ఆడుతున్నారు, కానీ నా ఫేవరెట్ మాత్రం అభిజిత్. అతడే గెలవాలని కోరుకుంటున్నా. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాడు. నిజాయితీగా ఉంటాడు. సహనంగా ఉండటం చాలా గొప్ప. అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్గా అవినాష్ గెలవాలని ఆశిస్తాను. కానీ ఓటు మాత్రం అభిజిత్కే" అని స్పష్టం చేశాడు. (చదవండి: వారిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే : నాగబాబు) -
బిగ్బాస్ : అవినాష్కి ఏమైంది..ఎందుకలా చేశాడు?
బిగ్బాస్ హౌస్లో నిన్నటి దెయ్యం ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. హౌస్మేట్స్ని భయపెట్టడంతో దెయ్యం విఫలమైంది. అరియానా మొదట్లో కాస్త భయపడినా.. దెయ్యం వాయిస్ విన్నాక ఆమె కూడా మిగతా సభ్యులాగే నార్మల్గానే ఉంది. ఇక అవినాష్, సోహైల్, హారిక అయితే దెయ్యంపైనే పంచ్లు వేస్తూ బిగ్బాస్ ప్లాన్కు బ్రేకులు వేశారు. దీంతో బిగ్బాస్ ఈరోజు ఎలాగైనా ఇంటి సభ్యులను భయపెట్టాలని ఫిక్స్ అయ్యాడు. గార్డెన్ ఏరియాతో పాటు, కన్ఫెషన్ రూమ్ను కూడా దెయ్యాల కొంపలుగా మార్చేశాడు. మరోవైపు అవినాష్ శ్మశానంలో కూర్చొని దెయ్యం పట్టినవాడిలా కిల కిల నవ్వుతున్నాడు. (చదవండి : బిగ్బాస్ : ఆ ఇద్దరికే నా సపోర్ట్.. నాగబాబు) అలాగే ఇంట్లో ఉన్న ఓ బొమ్మని దొంగిలించబోయాడు. మిగిలిన ఇంటి సభ్యులు అవినాష్ని అడ్డుకొని బొమ్మను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హారిక కిందపడిపోయింది. అయినప్పటికీ అవినాష్ మాత్రం ఓ బొమ్మని తీసుకొచ్చి బిగ్బాస్ హౌస్ బయటకి విసిరేశాడు. బయటకి విసిరేస్తే గేమ్ నుంచి అవుటైనట్లే అని అఖిల్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంతకి అవినాష్ ఆ బొమ్మని ఎందుకు దొంగిలించాడు? అసలు ఆ బొమ్మకి అవినాష్కి ఉన్న సంబంధం ఏంటి? అవినాష్కి బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్బాస్ : ఆ ఇద్దరికే నా సపోర్ట్.. నాగబాబు
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజన్ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్లతో గత సీజన్ల కంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తూ విజయవంతగా 11 వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. షో ముగింపునకు 25 రోజులే మిగిలి ఉండటంతో టైటిల్ విజేత ఎవరన్నదానిపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలలోనూ ఆసక్తిమొదలైంది. మరోపక్క ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో హౌస్మేట్స్ ఫోకస్ అంతా గేమ్పైనే పెట్టారు. త్యాగాలు, సపోర్టులు పక్కకు పెట్టి విడివిడిగా గేమ్ ఆడుతున్నారు. ఇక ప్రేక్షకులు మాత్రం తమ అభిమాన కంటెస్టెంట్ని రక్షించేపనిలో పడ్డారు. ఎవరికి వారు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. (చదవండి : బిగ్బాస్లోకి అనుకొని అతిథి.. దడుచుకున్న బోల్డ్ గర్ల్) ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా బిగ్బాస్పై స్పందించారు. జబర్దస్త్ కమెడియన్ అవినాష్, అభిజిత్లకు సపోర్ట్ చేయాల్సిందిగా వీడియో విడుదల చేశారు. అవినాస్ తనకు చాలాకాలంగా తెలుసని అతనికి సపోర్ట్ చేయాలని కోరారు. అయితే, బిగ్ బాస్ షోలో ఓసారి అవినాశ్ తీవ్ర భావోద్వేగాలకు గురికావడం గమనించానని, దాంతో అతడికి కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చిందని అన్నారు. తనకు తెలిసినంత వరకు అవినాష్ ఎమోషనల్ వ్యక్తి కాదని, బహుశా బిగ్ బాస్ షోలో పరిస్థితుల కారణంగా భావోద్వేగాలకు లోనై ఉంటాడని తెలిపారు. అలాగే హౌస్లో తనకు బాగా నచ్చిన కంటెస్టెంట్ అభిజిత్ అని, అతని వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందని చెపుకొచ్చాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన అభిజిత్ ను తాను ఒకట్రెండు సార్లు కలిశాను. మొదటిసారి కలిసినప్పుడే నచ్చాడు. మంచి కుర్రాడు అనిపించాడు. అతను ఓ హీరోగా సక్సెస్ అయ్యుంటే బాగుండును అనిపించింది. కానీ సినిమా కెరీర్ విషయం అటుంచితే బిగ్ బాస్ లో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యక్తిగతంగా అవినాష్కి నా సపోర్ట్ ఉన్నా కూడా నా మనసు, నా ఇష్టం మాత్రం అభిజిత్పైనే ఉంది. నన్ను సపోర్ట్ చేయమని ఎవరూ అడుగలేదు. ఎందుకో ఈ ఇద్దరికి సపోర్ట్ ఇవ్వాలనిపించింది. ఇద్దరిలో ఎవరు విజేత అయినా నాకు ఇష్టమే. ఇద్దరికి ఓట్లు వేసి ఫైనల్ వరకు తీసుకురండి’ అని తన అభిమానులను కోరారు. -
బిగ్బాస్లోకి కొత్త అతిథి.. జడుసుకున్న బోల్డ్ గర్ల్
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజన్ ముంగింపు దశకు వచ్చింది. షో ముగింపునకు మరో 25 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్ని మరింత రసవత్తంగా తిర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు బిగ్బాస్ నిర్వాహకులు. కొత్త కొత్త గేమ్లు, కొత్త తరహా టాస్క్లను ప్రవేశపెట్టి మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా కాస్త వెరైటీగా నిర్వహించారు. శవాల పేటికలను తీసుకురావడం, అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ తీసుకొచ్చి పొలిటికల్ తరహాలో అవినాష్, అఖిల్తో ప్రచార సందడి చేయించారు. ఇలా ప్రతి రోజు ఏదోఒక కొత్తదనాన్ని చూపిస్తున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో బిగ్బాస్ హౌస్లోకి ఓ అతిథిని పంపి అందరిని భయపెట్టే ప్రయత్నం చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని కొత్త తరహా సెట్స్ ని యాడ్ వేశారు. ఇంట్లోకి దెయ్యాన్ని పంపి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే హౌజ్ మెంట్స్ ని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇంట్లో దెయ్యాన్ని చూసి అందరి కంటే బోల్డ్ గర్ల్ అరియానానే ఎక్కువగా భయపడింది. దెయ్యం మొదటగా అరియానాకే కనిపించడంతో భయంతో బిగ్గరగా అరుస్తూ పరుగులు తీసింది. ఇక సోహైల్ అయితే నేను భయపడేదిలేదంటూ కౌంటర్ ఇచ్చాడు. అరియానా భయంతో వణికిపోతుంటే.. హారిక మాత్రం ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. ప్రతి దానికి భయపడితే వాళ్ళు నీ మీదనే ఫోకస్ చేసి ఇంకా భయపెడతారని చెప్పింది. అందుకు అరియానా నేను ఏమి భయపడటం లేదని చెప్పడంతో.. హారిక పీకినవ్ తీయ్ అంటూ మరో కౌంటర్ ఇచ్చింది.ఇక సోహైల్ అయితే కెమెరా ముందుకు చూస్తూ ‘హలో దెయ్యం ఎక్కడున్నావ్ అంటూ.. భయపడతారు అనుకుంటున్నారా? అలా రాత్రి మాత్రం రాకండి ’ అంటూ తనదైన శైలీలో కామెడీ పంచ్ వేశాడు. (చదవండి : నువ్వు మా నాన్నకు నచ్చావంటే..: అభిజిత్) ఇక ఈ రోజు ఎపిసోడ్లో అవినాష్ కామెడీ హైలెట్ కాబోతున్నట్టు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. దెయ్యం గురించి హారిక అవినాష్తో మాట్లాడుతూ.. ఆ మిర్రర్ లో నుంచి రెండు పెద్ద చేతులు వచ్చి నిన్ను లోపలికి గుంజుకపోవాలి అని అనగా.. లాక్ రాగానే రెండు చేతులకు నేయిల్ పాలిష్ పెట్టేస్తానని అవినాష్ పంచ్ వేశాడు. అలాగే చంద్రముఖి డైలాగ్ చెప్పి అందరిని నవ్వించాడు. నేను వెంకటపతి రాజా ఈ దుర్గాష్టమికి నిన్ను అదే అంటూ.. అంటూ అవినాష్ చెప్పిన డైలాగ్కి ఇంటి సభ్యులు పగలబడి నవ్వేశారు. ఇక వెంటనే హే అవినాష్ అని ఒక లేడి దెయ్యంలా సౌండ్ వచ్చింది. అనంతరం వస్తా.. అంటూ గట్టిగా అరిచేసింది. అసలు హౌస్లోకి దెయ్యం ఎందుకు వచ్చింది? హౌస్మేట్స్తో దెయ్యం ఎలా ఆడుకుందో తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే నేటి ఎపిసోడ్ని చూడాల్సిందే. -
కాళ్లు పట్టుకుంటే బాగోదు, ప్లీజ్..: అవినాష్
బిగ్బాస్ పెట్టిన నామినేషన్ మంట కంటెస్టెంట్ల గుండెల్లో జ్వాలగా రగులుతోంది. ఆ అగ్ని కొందరిని దహిస్తోంటే మరికొందరిలో కొత్త ఆలోచనలకు నాందిగా మారుతోంది. వెరసి తన గేమ్ తను ఆడదామనుకున్న మోనాల్ మనసు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. ఇలాంటి సమయంలో అభిజిత్ ఆమెకు తోడుగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఒకరి కోసం ఒకరు త్యాగానికి సిద్ధపడటం లేదని తెలుసుకున్న బిగ్బాస్ నామినేట్ అయినవారికి నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు మరో అవకాశం ఇచ్చాడు. అయితే ఇందులో అవినాష్ గెలిచాడన్నది సోషల్ మీడియాలో ఎప్పుడో తేల్చేసింది. కాకపోతే ఓ చిన్న ట్విస్టుంది. అదేమిటో తెలియాలంటే నేటి బిగ్బాస్ స్టోరీ మీద ఓ కన్నేయండి.. మనసు విప్పి మాట్లాడుకున్న అభి, మోనాల్ నామినేషన్స్లో లక్ కలిసి రాలేదని అరియానా ఏడ్చేసింది. తర్వాత మోనాల్ ఒంటరిగా ఏడుస్తుంటే ఆమెను నామినేట్ చేసి హారిక వెళ్లి ఓదార్చింది. కరెక్ట్ పర్సన్తో స్వాప్ చేయమని చెప్పింది అఖిల్ గురించి అని మోనాల్ అసలు విషయం చెప్పడంతో హారిక తన తప్పును తెలుసుకుని సారీ చెప్పింది. నామినేషన్లో తనపై ఇష్టమొచ్చినట్లుగా అరిచిన అరియానాకు బుద్ధి లేదని కోప్పడింది. మరోవైపు ఒకరిని తొక్కి ముందుకు వెళ్లడం ఇష్టం లేదన్న అభి.. మోనాల్తో స్వాప్కు ఎలా ఒప్పుకున్నాడని అఖిల్ సందేహం వ్యక్తం చేశాడు. తర్వాత అభి, మోనాల్ రాత్రిపూట మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఒకరికి ఒకరు సారీ చెప్పుకున్నారు. జనాలను కరెక్ట్గా అంచనా వేసే మా నాన్నకు నచ్చావని చెప్పుకొచ్చాడు. మీ అమ్మ నన్ను చూస్తుంది.. కానీ నువ్వు చూడట్లేదు అని తన మనసులో మాట బయట పెట్టాడు. (చదవండి: బిగ్బాస్: అఖిల్కి హ్యాండిచ్చిన మోనాల్) హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం తర్వాత బిగ్బాస్ "ఎవిక్షన్ ఫ్రీ పాస్" ప్రవేశపెడుతూ నామినేట్ అయినవారు దాన్ని పొందేందుకు టాస్కు ఇచ్చాడు. మొదటి లెవల్లో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ పోటీపడగా అవినాష్, అఖిల్ ఎక్కువ జెండాలు సేకరించి రెండో లెవల్కు వెళ్లారు. ఇందులో 'బీబీ- కష్టానికే గెలుపు 'అన్న పార్టీ పేరుతో అఖిల్, 'గమ్యం చేరే వరకు' పార్టీ పేరుతో అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కన్నీటితో అవినాష్ ప్రచారం ఇప్పుడు నాకు ఓటేస్తే నా జీవితంలో మర్చిపోలేను అంటూ అవినాష్ హారిక దగ్గర ఏడ్చేశాడు. దీంతో అరియానా అతడికి ధైర్యం నూరిపోసింది. తర్వాత ప్రచార సభలు మొదలు పెట్టారు. ఇందులో అవినాష్ మాట్లాడుతూ.. మీ ఇంటి మనిషే అనుకుని ఓటేయండి, ఫ్రెండ్స్ కాళ్లు పట్టుకుంటే బాగోదు కదా ప్లీజ్ ఓటేయండి అని మరోసారి ఎమోషనల్ అయ్యాడు. (చదవండి: సోహైల్ అర్ధరాత్రి అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తాడు) హారికను అమ్మ అని పిలుస్తా... తర్వాత అఖిల్.. నా గుర్తింపే బీబీ. ఇప్పుడు మీరు వేసే ఓటు నాకు చాలా అవసరం. ఒక్క ఓటు నా జీవితాన్ని మార్చేస్తుంది అని అభ్యర్థించాడు. కానీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి మోనాల్, సోహైల్.. అఖిల్కు పూలమాల వేసి ఓటేయగా అరియానా, అభి.. అవినాష్కు ఓటేశారు. హారిక వేసే చివరి ఓటే కీలకం కాగా ఆమె అవినాష్కే సపోర్ట్ చేసింది. దీంతో అవినాష్ ఇప్పటి నుంచి హారికను జీవితంలో మర్చిపోలేనని ఆమెను అమ్మ అని పిలుస్తానంటూ ఓవర్ ఎమోషనల్ అయ్యాడు. అనంతరం అతడికి రెండు వారాల వాలిడిటీ ఉండే ఇమ్యూనిటీ దక్కింది. దీన్ని ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చని బిగ్బాస్ స్పష్టం చేశాడు. దీంతో అతడికి రెండు వారాలపాటు ఇమ్యూనిటీ అన్న విషయంలో ఏమాత్రం నిజం లేదని తేలింది. (చదవండి: అభిజిత్కు క్లాస్ పీకిన మోనాల్ సోదరి) -
బిగ్బాస్ స్కెచ్: టాప్ 5లోకి అవినాష్!
ఆదివారం వరకు స్నేహగీతాలు పాడుకునే కంటెస్టెంట్లు సోమవారం నాడు మాత్రం ఏదో పూనకం వచ్చినట్లుగా శివాలెత్తుతారు. నామినేషన్ ప్రక్రియలో ఒకరి మీద ఒకరు రాళ్లు విసురుకుంటూ బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో పన్నెండో వారం బిగ్బాస్ చేపట్టిన నామినేషన్ ప్రక్రియ ఎన్నో మలుపులు తిరుగుతోంది. మొదటగా కంటెస్టెంట్ల లక్ ఆధారంగా నామినేషన్ను చేపట్టాడు. ఎరుపు రంగు నింపి ఉన్న టోపీలు ధరించిన అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్ నామినేట్ అవగా గ్రీన్ రంగుతో నిండిన టోపీలు ధరించిన సోహైల్, మోనాల్ సేవ్ అయ్యారు. ఇక్కడే బిగ్బాస్ ట్విస్టిచ్చాడు. సేవ్ అయిన వారితో స్వాప్(స్థానాలు ఇచ్చిపుచ్చికోవడం) చేసుకునే అవకాశాన్ని నామినేట్ అయిన కంటెస్టెంట్లకు కల్పించాడు. (చదవండి: బిగ్బాస్: ఆఖరి ఎపిసోడ్ అప్పుడే!) బిగ్బాస్ హౌస్లో ఎలక్షన్ క్యాంపెయిన్ దీంతో అరియానా, అవినాష్ స్వాప్ కోసం సోహైల్ను అభ్యర్థించి మోనాల్ మీద మాత్రం విరుచుకుపడ్డారు. అవినాష్ అయితే మోనాల్ ఈ షోకు అర్హురాలే కాదు, ఆమె ఏమీ ఆడటం లేదంటూ చిందులు తొక్కాడు. చివరికి కెప్టెన్ హారిక తన పవర్తో మోనాల్ను నామినేషన్లోకి పంపించడం. అభిని సేవ్ చేయడం చకచకా జరిగిపోయాయి. నామినేట్ అవడాన్ని జీర్ణించుకోలేకపోయిన అవినాష్ లక్ లేకపోతే ఎలిమినేట్ కావాల్సిందేనా అని ఆందోళన చెందాడు. ఈ క్రమంలో నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు బిగ్బాస్ మరో అవకాశాన్ని కల్పించాడు. జెండాలు సేకరించే టాస్కు ఇవ్వగా ఇందులో అవినాష్, అఖిల్ గెలిచారు. ఈ ఇద్దరికీ ముడిపడటంతో హౌస్లో ఎలక్షన్ క్యాంపెయిన్ నడిచినట్లు సమాచారం. ఇందులో అఖిల్కు సోహైల్, మోనాల్... అవినాష్కు హారిక, అరియానా, అభిజిత్ సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అవినాష్ ఇమ్యూనిటీ పొందాడు. కానీ అది ఈ వారం కాదట. తర్వాతి రెండు వారాలకు ఇమ్యూనిటీ పొందాడని సమాచారం. (చదవండి: జబర్దస్త్లోకి మళ్లీ తీసుకుంటారు: అవినాష్ తమ్ముళ్లు) అవినాష్ కోసం రంగంలోకి జబర్దస్త్ ఇదే కనక నిజమైతే అవినాష్ ఈ వారం ఒక్క ఎలిమినేషన్ నుంచి గట్టెక్కితే ఏకంగా టాప్ 5లో కర్చీఫ్ వేసినట్లే. కానీ బయట పరిస్థితులు చూస్తుంటే అవినాష్కు ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నామినేషన్లో మోనాల్ మీద విరుచుకుపడటం, సింపథీ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడన్న అపనింద.. వెరసి అతని మీద వ్యతిరేకతను పెంచుతున్నాయి. దీంతో అవినాష్కు అత్యంత కీలకం కానున్న ఈ వారం నుంచి స్నేహితుడిని కాపాడేందుకు జబర్దస్త్ టీమ్ రంగంలోకి దిగింది. అందర్ని నవ్వుల్తో ముంచెత్తుతున్న అవినాష్కు ఓట్లేయాలంటూ కమెడియన్లు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ అభిమానులకు వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు. మరోవైపు అభి, హారిక ఫ్యాన్స్ ఈసారి మోనాల్ను కాపాడే పనిలో ఉన్నారు. అఖిల్కు ఎలాగో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంది. దీంతో అరియానా, అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే బిగ్బాస్ ప్లానింగ్ చూస్తోంటే అవినాష్కు తక్కువ ఓట్లు వస్తే ఈ వారం ఎలిమినేషన్ను ఎత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు జనాలు. చూడాలి మరి.. అవినాష్ లక్ ఎంతుందో? (చదవండి: నీతో రిలేషనే వద్దు: తేల్చేసిన అఖిల్) -
నువ్వు మా నాన్నకు నచ్చావంటే..: అభిజిత్
పన్నెండో వారానికి గానూ జరిగిన నామినేషన్స్తో బిగ్బాస్ హౌస్ కకావికలం అయింది. ఒకర్ని విడిచి ఒకరం ఉండలేం అన్నట్లుగా ఉండే జంట పక్షులు అఖిల్, మోనాల్ అర్ధాంతరంగా విడిపోయారు. నామినేషన్ అంటే చాలు ఠారెత్తిపోయే అవినాష్ తను సేవ్ అయ్యేందుకు ఓ రకంగా మోనాల్తో యుద్ధమే చేశాడు. గట్టిగా మాట్లాడుతూ తన వాదనే నిజమని నిరూపించుకునేందుకు ప్రయత్నించిన అరియానా పథకం కూడా పారలేదు. ఇంతమందితో పోరాడిన మోనాల్ చివరికి కెప్టెన్ హారిక వల్ల నామినేషన్స్లోకి వెళ్లింది. అసలు మోనాల్తో స్వాప్(స్థానాలను ఇచ్చిపుచ్చుకోవడం) చేసుకోనని అభి తేల్చి చెప్పినప్పటికీ కెప్టెన్ తన పవర్ను ఉపయోగిస్తూ అతడిని నామినేషన్ గండం నుంచి గట్టెక్కించి మోనాల్ను బలి చేసింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ హౌస్లోని వాతావరణాన్ని హీటెక్కిచ్చింది. (బిగ్బాస్: రికార్డుల వేటలో అభిజిత్ ఫ్యాన్స్) ముఖ్యంగా అఖిల్, మోనాల్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. మోనాల్ తనను మోసం చేసిందన్న భ్రమలో అఖిల్ కూరుకుపోయాడు. అటు మోనాల్ మాత్రం హారికతో అఖిల్ సూపర్ జెన్యూన్ అని, కానీ ఈ మధ్య అతడికి ఏమైందో అర్థం కావట్లేదని కంటతడి పెట్టుకుంది. బాధలో ఉన్న మోనాల్ను ఓదార్చేందుకు అభి ఆమెతో మాటలు కలిపాడు. నువ్వు మా నాన్నకు నచ్చడమేంటో అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీంతో అభి, మోనాల్ కథ మళ్లీ మొదటికి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు అవినాష్కు ఫ్రస్టేషన్ ఏమాత్రం తగ్గలేదు. నామినేట్ అయినందుకు అరియానా కన్నీళ్లు పెట్టుకోగా ఏడవకు, ఏడిస్తే మనం సేవ్ అవమూ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. కష్టపడి టాస్కులు ఆడనవసరం లేదని అర్థమైందంటూ అభిప్రాయపడ్డాడు. ఇక ఈ వారం అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు. (బిగ్బాస్: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే) -
బిగ్బాస్: ఈ షోకు నువ్వు అనర్హురాలివి
పోయినసారి నామినేషన్ అఖిల్, అభిజిత్ మధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్టయ్యేవరకు వచ్చిందీ పరిస్థితీ. అఖిల్ కోసం కూడా త్యాగానికి సిద్ధపడని మోనాల్ చివరికి కెప్టెన్ వల్ల అభిజిత్ కోసం నామినేషన్లోకి వచ్చింది. మరోవైపు ఎప్పటిలాగే అవినాష్ నామినేషన్ను తట్టుకోలేకపోయాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాల్సిందేనా అంటూ చిందులు తొక్కాడు. మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. కిచెన్లో అభిజిత్ కష్టాలు వంట రాదంటూ ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన అభిజిత్ లాస్య వేసిన బిగ్బాంబ్ వల్ల కిచెన్లో దూరాడు. 20 దోశెలైనా ఆవురావురుమంటూ తినే సోహైల్తో కలిసి దోశెలు వేశాడు. అది చూసిన సోహైల్ దోశె వేయమంటే అభిజిత్ పరోటా చేస్తున్నాడని ఆటపట్టించాడు. ఇజ్జత్ కా సవాల్.. ఇప్పుడు చేస్తా చూడంటూ మరోసారి దోశె వేసేందుకు ప్రయత్నించిన అభి ఈసారి ఏకంగా ఊతప్పం చేశాడు. మరోవైపు కొద్ది రోజులుగా డల్ అయిన అఖిల్.. 'నా జీవితంలో ముందు నుంచీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే నీతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతా. నీ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నా, నీతో అటాచ్మెంటే వద్దు' అంటూ రిలేషన్కు కటీఫ్ చెప్పడంతో మోనాల్ కంటతడి పెట్టుకుంది. (చదవండి: సోహైల్ అర్ధరాత్రి అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తాడు) ఫస్ట్ రౌండ్లో సోహైల్, మోనాల్ సేవ్ తర్వాత అవినాష్ను అరియానా అంకుల్ అని పిలవగా సోహైల్, అఖిల్ మధ్యలో దూరి అవినాష్ను ఏడిపించారు. అవినాష్కు ఈపాటికే పెళ్లి అయితే నలుగురు పిల్లలుండేవారంటూ ఆట పట్టించారు. అనంతరం పన్నెండోవారానికి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. బజర్ మోగగానే ఇంటి సభ్యులు పరుగెత్తుకెళ్లి తలపై టోపీ పెట్టుకున్నారు. గ్రీన్ టోపీలు ధరించిన సోహైల్, మోనాల్ సేవ్ అవగా ఎర్ర టోపీలు ధరించిన అరియానా, అఖిల్, అభిజిత్, అవినాష్ నామినేట్ అయ్యారు. ఈ నలుగురు శవ పేటికలో నిలబడటంతో రెండో లెవల్ ప్రారంభమైంది. ఇందులో నామినేట్ అయినవారు సేఫ్ అయినవారితో స్వాప్ చేసుకునే అవకాశాన్ని బిగ్బాస్ కల్పించాడు. నువ్వు బిగ్బాస్ షోకు అనర్హురాలివి మొదటగా అవినాష్ మాట్లాడుతూ.. నిన్న వీకెండ్లో నాకర్థమైంది నువ్వు ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంటో అంటూ సోహైల్ను స్వాప్ చేయమని అభ్యర్థించగా అతడు అందుకు ఒప్పుకోలేదు. తర్వాత మోనాల్తో మాట్లాడుతూ.. నీ కన్నా నేను స్ట్రాంగ్, ఎప్పుడూ వరస్ట్ పర్ఫామెన్స్ అనిపించుకోలేదు. బల్లగుద్ది మరీ చెప్తున్నా నీ కన్నా 200 % బాగా ఆడుతున్నాను.. నువ్వు కేవలం మూడు వారాల నుంచి పర్ఫామెన్స్ చేసి కప్పు గెలుస్తా అంటే కుదరదు. ఈ షోకు నువ్వు అనర్హురాలివి అని గరమయ్యాడు. నేను అర్హురాలినో కాదో చెప్పడానికి నువ్వు బిగ్బాస్ కాదు అని ఆమె కౌంటరిచ్చింది. నువ్వు స్ట్రాంగ్ అనుకున్నప్పుడు ఇంకా భయమెందుకు? నామినేషన్లో ఉండు అని తేల్చి చెప్పింది. (చదవండి: ఆ అలవాటు మాత్రం పోలేదు: హారిక తల్లి) అఖిల్- మోనాల్ మధ్య రాజుకున్న గొడవ తర్వాత అఖిల్ మోనాల్ను తనకోసం నామినేషన్లోకి రమ్మని కోరగా ఆమె అందుకు ఒప్పుకోలేదు. 'నన్ను ఎలిమినేట్ చేయాలన్నప్పుడు టపీమని నా పేరు చెప్పావు. కానీ కెప్టెన్సీలో మాత్రం నాకు సపోర్ట్ చేయలేదు. నేను నీ కోసం బట్టలు, వస్తువులు అన్నీ త్యాగం చేశాను. సపోర్ట్ చేస్తావనుకున్నా. కానీ చేయలేదు. ఇప్పటికీ చేయట్లేదు!' అని చెప్పుకొచ్చాడు. నేను స్ట్రాంగ్ అని నిరూపించుకునేందుకే కెప్టెన్సీ టాస్క్లో హారికకు సపోర్ట్ చేసి ఆడాను అని మోనాల్ సమాధానమిచ్చింది. అలా ఇద్దరి మధ్య గొడవ రాజుకోవడంతో అటు మోనాల్, ఇటు అఖిల్ బాధపడ్డారు. వీళ్లిద్దరినీ చూసి సోహైల్కు మరింత బాధేసింది. దీంతో నీకోసం నామినేషన్లోకి వెళ్తానని అఖిల్తో చెప్పినప్పటికీ అతడు దానికి అంగీకరించలేదు. మనసులోని మాట చెప్పిన అభిజిత్ అరియానా వంతు రాగా.. ఈ సారి నీ సాయం కావాలంటూ సోహైల్ను కోరగా అతడు ససేమీరా నిరాకరించాడు. నీకన్నా నేను బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నాను అని మోనాల్తో చెప్పుకు రాగా ఆమె మాత్రం స్వాప్ అవనని తేల్చి చెప్పింది. ఇక్కడ అరియానాకు మోనాల్కు మధ్య వాడివేడిగా చర్చ జరుగుతుంటే అవినాష్ మధ్యలో దూరి ఈ చర్చను గొడవగా మార్చాడు. తర్వాత అభిజిత్ మాట్లాడుతూ.. మీ అమ్మ వచ్చి నన్ను ఫేవరెట్ అని చెప్పిన మాట నా మనసును తాకింది. కాబట్టి నాకోసం నిన్ను త్యాగం చేయమని అడగను అని మోనాల్కు మనసులోని మాట చెప్పాడు. ఎవరూ స్వాప్కు ఒప్పుకోకపోవడంతో అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. ఇప్పుడు బాగా ఆడే కంటెస్టెంటు ఎలిమినేట్ అయి ఇంట్లో వెళ్లి కూర్చోవాలా అని ఆవేశపడ్డాడు. దీంతో అభి స్పందిస్తూ ఈ నలుగురిలో నువ్వు బాగా ఆడకపోతే ఎలిమినేట్ అవుతావు తప్ప అదృష్టం లేక కాదు అని క్లారిటీ ఇచ్చాడు. హారిక మీద భారం వేసిన బిగ్బాస్ వీళ్ల గొడవకు చెక్ పెడుతూ బిగ్బాస్ పెద్ద ట్విస్టు ఇచ్చాడు. కెప్టెన్ హారిక తన పవర్ ఉపయోగించి ఒక స్వాప్ చేయాలని బాధ్యత అప్పజెప్పాడు. దీంతో హారిక నీకోసం నేనున్నా అంటూ అభిజిత్ను సేవ్ చేస్తూ తనకు కెప్టెన్సీ ఫలాన్ని అందించిన మోనాల్ను నామినేషన్లోకి పంపించింది. దీంతో తనకు సేవ్ అయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని మోనాల్ ఏడ్చేసింది. అటు హారిక కూడా తనకు స్వాప్ చేయక తప్పలేదని ఎమోషనల్ అయింది. మొత్తానికి ఈ వారం అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ నామినేట్ అయ్యారు. (చదవండి: ఈ ఇద్దరిలో ఒకరే బిగ్బాస్ విజేత: కౌశల్) -
టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?
బిగ్బాస్ నాల్గో సీజన్ పదకొండో వారంలో లాస్య జున్నును కలిసేందుకు ఇంటికి వెళ్లిపోయింది. అసలే లాస్య ఇల్లు విడిచి 70 రోజులు దాటిపోవడంతో జున్ను ఆమెను పూర్తిగా మార్చిపోయాడు. దీంతో ఆమె జున్ను చెంతకు చేరి తల్లి ప్రేమ కురిపించి మళ్లీ దగ్గరకు తీసుకోనుంది. ఇక వెళ్తూ వెళ్తూ కిచెన్ బాధ్యతలనే బిగ్బాంబ్ను ఆమెకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మీద వేసింది. వాళ్లెవరు? నేటి బిగ్బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ కన్నేయండి.. సేఫ్గా ఆడటం మీ స్ట్రాటజీనా? సండేను ఫండేగా మార్చేందుకు సిద్ధమైన నాగార్జున ఇంటి సభ్యులను రెండు టీమ్లుగా విడగొట్టారు. అవినాష్, అరియానా, సోహైల్, మోనాల్ ఏ టీమ్గా మిగిలినవారు బీ టీమ్గా ఏర్పడ్డారు. వీరికి కొన్ని ఫొటోలను చూపించి దాని ఆధారంగా పాటల పేర్లను చెప్పమని గేమ్ ఆడించారు. పోటాపోటీగా సాగిన ఈ గేమ్ ముగిసేసరికి బీ టీమ్ గెలిచింది. బీ టీమ్ కెప్టెన్ హారిక సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. అనంతరం ఓ ప్రేక్షకురాలు సంధించిన ప్రశ్నను వినిపించారు. సేఫ్గా ఆడటం మీ గేమ్ స్ట్రాటజీనా అని ఓ అభిమాని లాస్యను అడగ్గా తాను సేఫ్ గేమ్ ఆడటం లేదని ఆమె స్పష్టం చేసింది. తర్వాత మోనాల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. (చదవండి: సెల్ఫ్డబ్బా కొట్టుకున్న హారిక) అవినాష్కు నెయిల్ పాలిష్ రుద్దిన సోహైల్ ఇంటిసభ్యులతో వెరైటీగా లూడో గేమ్ ఆడించారు. ఇందులో సోహైల్, అవినాష్ ఉన్న అరియానా టీమ్లో మోనాల్, మిగిలిన సభ్యులు ఉన్న హారిక టీమ్లో అభిజిత్ డైస్ రోల్ చేశారు. సోహైల్, అఖిల్ డైస్ రోల్ చేసిన నంబర్ల ఆధారంగా ఒక్కో గడిని దాటుకుంటూ ముందుకు వెళ్లారు. ఇందులో సోహైల్ నోటితో నెయిల్ పాలిష్ను అవినాష్ వేళ్లకు అందంగా రుద్దాడు. అటు అఖిల్ రొమాంటిక్ సాంగ్ను ఏడుస్తూ, ఫాస్ట్ ఫార్వర్డ్లో, స్లో మోషన్లో ఖూనీ చేయకుండా పాడి మెప్పించాడు. తర్వాత లాస్య నాలుక బయటపెట్టి డైలాగులు చెప్పడం అందరికీ నవ్వు తెప్పించింది. అరియానా సేఫ్, లాస్య అవుట్ ఇక అవినాష్ ఒక్క నిమిషంలో చీర కట్టుకుని చిందులు వేయగా.. రాత్రి తొమ్మిది తర్వాత నువ్వు చేసేది ఇదే అన్నమాట అని నాగ్ కౌంటర్ వేశారు. ఈ దెబ్బతో తన పెళ్లి సంబంధాలు గోవిందా అని డీలా పడ్డ అవినాష్ తర్వాత టాస్కులో భాగంగా నిమ్మకాయను నమిలిపారేశాడు. మొత్తానికి లూడో గేమ్లో అరియానా టీమ్ గెలవగా హారిక టీమ్ ఓడిపోయింది. తర్వాత అభిజిత్, అరియానా సేఫ్ అయినట్లు ప్రకటించగా లాస్య ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు. (చదవండి: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..) అందరి కన్నా వీక్ అనుకున్నా.. స్టేజీ మీదకు వచ్చిన లాస్య ముందుగా తన నవ్వు నిజమైనదేనని, కన్నింగ్ కాదని చెప్పుకొచ్చింది. ఆ విషయం ప్రేక్షకులకు కూడా తెలుసని నాగ్ భరోసా కల్పించారు. తర్వాత లాస్య.. సోహైల్, అభిజిత్ టాప్ 2లో ఉంటారని జోస్యం చెప్పింది. దీంతో భావోద్వేగానికి సోహైల్.. అందరికన్నా వీక్ అనుకున్నా కానీ అక్క టాప్ 2లొ ఉంటాను చెప్పగానే ఈ మాట చాలు అనిపించిందని చెప్పుకొచ్చాడు. అవినాష్.. ఎంటర్టైనర్ కానీ నామినేషన్ను తీసుకోలేడని చెప్పింది. మోనాల్ బాగా ఆడుతుంది కానీ కన్ఫ్యూజన్లో ఉంటుందని పేర్కొంది. అరియానా బోల్డ్గా మాట్లాడుతుంది, కానీ కొన్నిసార్లు తప్పును కూడా ఒప్పుకోవాలని సలహా ఇచ్చింది. (చదవండి: మొదటిసారి నాకు ముద్దు పెట్టావు: అఖిల్) అభిజిత్ అంటే ఇష్టం అంటూనే అతడిపై బిగ్బాంబ్ సోహైల్కు ఎంత కోపం వస్తుందో అంత త్వరగా కరిగిపోతుంది అని చెప్పుకొచ్చింది. అఖిల్ బాగా ఆడతాడు. కానీ కోపం ఎక్కువ. ఎదుటివాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వడని, అది మార్చుకోమని సూచించింది. అభి నాకు చాలా ఇష్టం. అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాడు. హారికతో సమయం గడపడం మరీమరీ ఇష్టం. అల్లరి పిల్ల. తనకు అన్యాయం జరిగిందని అనిపిస్తే వాదించి సాధిస్తుంది. తను టాప్ 3 నుంచి 1కి వెళ్లాలని తెలిపింది. అనంతరం కింగ్ ఆఫ్ ద కిచెన్ బిరుదును అభిజిత్కు ఇచ్చింది. దీంతో వారం రోజుల పాటు వంట చేయాలన్న బిగ్బాంబ్ అభి మీద పడింది. కానీ అభి మాత్రం బ్రేక్ఫాస్ట్ ఒక్కటే చేస్తానని చెప్పేశాడు. (చదవండి: అభి, నీ బ్రదర్ను బాగా చూసుకో: అఖిల్ అమ్మ) -
బిగ్బాస్: రాత్రి 9 దాటితే ఆ ఇద్దరి కథ వేరే..
నిన్న ఫ్యామిలీ ఎపిసోడ్తో కంటెస్టెంట్లను హుషారెత్తించిన నాగ్ నేడు వారితో గేమ్స్ ఆడించేందుకు రెడీ అయ్యారు. ఇంటిసభ్యులు సైతం రెట్టింపు ఉత్సాహంతో గేమ్స్ ఆడేందుకు తయారయ్యారు. అందులో భాగంగా మ్యూజిక్ విని, అది ఏ పాటో చెప్పమని ఆదేశించారు. దీంతో మ్యూజిక్ ప్లే అవగానే పోటాపోటీగా బజర్ కొడుతూ పాటల పేర్లు చెప్తున్నారు. ఈ క్రమంలో ఆటలో అరటి పండుగా పేర్కొన్న అవినాష్ను నాగార్జున మరోసారి ఆడుకున్నట్లు తెలుస్తోంది. అటు అవినాష్ కూడా ఇంట్లో వాళ్లను ఇమిటేట్ చేసి వాళ్లను ఆడుకున్నాడు. ఇక మరో గేమ్లో సోహైల్ నోటితో నెయిల్ పాలిష్ను అవినాష్ వేళ్లకు అందంగా రుద్దాడు. ఇది చూసిన నాగ్ ఎంత బాగా వేస్తున్నాడో అనడంతో అవినాష్ అందుకుని రాత్రి 9 తర్వాత అతడికి ఇదే పని అని కౌంటరిచ్చాడు. తర్వాత అవినాష్ చీర కట్టుకుని డ్యాన్స్ చేయగా రాత్రి 9 తర్వాత నీది కూడా ఇదే పనా అని నాగ్ పంచ్ వేశాడు. దీంతో అవినాష్ పరువు గంగలో కలిసింది. మరి సండేను ఫండే చేసేందుకు వచ్చిన నాగార్జున వారితో ఎన్ని రకాల ఆటలు ఆడించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: అవినాష్ టాప్ 2లో ఉండకూడదు: హారిక) కాగా నిన్నటి బిగ్బాస్ ఎపిసోడ్లో స్టేజీ మీదకు వచ్చిన కంటెస్టెంట్ల కుటుంబాలు అందరి గురించి నాలుగు మంచి మాటలు చెప్పి తమ వాళ్లను చెట్టెక్కి కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాయి. కానీ సోహైల్ బంధువులు మాత్రం అతడి పరువు పోగొట్టే వ్యాఖ్యలు చేశారు. రాత్రి తొమ్మిది తర్వాత సోహైల్ చాలా బిజీ అంటూ అతడి గుట్టును రట్టు చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తాడని చెప్పడంతో అందరూ షాకయ్యారు. కాగా మొదట్లో వీరావేశంతో చిందులు తొక్కే సోహైల్ నాగార్జున సూచన మేరకు కోపాన్ని తగ్గించుకుంటానని మాటిచ్చాడు. మరుక్షణం నుంచి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అందరితో కలిసిపోతూ, నవ్విస్తూ, టాస్కులు ఆడుతూ తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. అలా అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నాడు నిన్న వచ్చిన కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ కూడా దాదాపు సోహైల్ టాప్ 5లో ఉంటారని చెప్పడమే ఇందుకు నిదర్శనం. సోహైల్తో పాటు అభిజిత్, అఖిల్, అరియానా, హారిక కూడా ఫైనల్కు వెళ్తారని అంచనా వేశారు. రియాలిటీలోనూ ఈ ర్యాంకింగ్సే నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. (చదవండి: సోహైల్ను తాత అని పిలుస్తాం..) -
ఇంకోసారి ఫిగర్లు అంటూ తిరిగావో: నాగ్ వార్నింగ్
వయసు అనేది కేవలం ఒక నంబర్ అని నిరూపించేవారిలో మన్మథుడు నాగార్జున ముందు వరుసలో ఉంటారు. నిత్య యవ్వనంగానే కనిపించే ఆయన ఇప్పటికీ ఎంతోమంది అమ్మాయిల మనసుల్లో గ్రీకువీరుడిగా నిలిచిపోయారు. ఇప్పటికీ ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. నాగ్ కూడా తన మద్దతు ఎప్పుడూ ఆడవాళ్లకే అని వారికే సపోర్ట్ చేస్తుంటారు. కాగా సండేను ఫండే చేసేందుకు నాగ్ కంకణం కట్టుకున్నారు. బిగ్బాస్ హౌస్లోని ఇంటిసభ్యులతో వెరైటీ గేమ్ ఆడించారు. అందులో భాగంగా కంటెస్టెంట్లు కొందరు గద్దల్లాగా మారిపోగా మరికొందరు కుందేలు లేదా పక్షుల్లాగా అవతారమెత్తినట్లు కనిపిస్తోంది. గద్దలు మిగతా జంతువులను వేటాడినట్లు తెలుస్తోంది. ఇక అభిజిత్ నాకో తిక్కుంది, దానికో లెక్కుంది అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పడంతో నీ తిక్క తెలుసులే అని నాగ్ కౌంటరిచ్చారు. (చదవండి: బిగ్బాస్ : నీకు పడిపోతా అవినాష్.. అరియానా) మరో గేమ్లో కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా డ్రాయింగ్ వేస్తుంటే మిగిలినవారు దాన్ని ఆధారంగా చేసుకుని సినిమా పేరు చెప్పాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో అవినాష్.. హారిక గీసిన బొమ్మను చూసి సినిమా పేరును కరెక్ట్గా ఊహించి చెప్పాడు. దీంతో సంతోషం పట్టలేక గెంతులు వేశాడు. ఒక్కడివే ఎందుకు? అందమైన భామలను తీసుకుని డ్యాన్స్ చెయ్ అనగానే మోనాల్, హారిక, అరియానాతో స్టెప్పులేశాడు. ఇది చూసిన నాగ్ లాస్యను వదిలేశావు కదూ అంటూ ఆంటీ టాపిక్ను మరోసారి ప్రవర్తించాడు. ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అంటూ తిరిగావో.. అని నాగ్ ఏదో గట్టి వార్నింగే ఇచ్చినట్లు కనిపిస్తోంది. సమయం దొరికింది కదా అని హారిక ఏకంగా అవినాష్ మీద నీళ్లు గుమ్మరించింది. దీంతో ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడిగా సాయం చేయండి అవినాష్ అభ్యర్థించాడు. అయితే తానెప్పుడూ ఆడవాళ్లకే సాయం చేస్తానని నాగ్ తేల్చి చెప్పారు. (చదవండి: నువ్వు ఫేక్, ఇది నీ ఎథిక్స్: అఖిల్ ఫైర్) -
అరియానా నీకు పడదు: తేల్చేసిన నాగార్జున
బిగ్బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు చాలా లక్కీ. ఎందుకంటే వాళ్లకు గిఫ్టుల మీద గిఫ్టులు ఇస్తున్నారు. బయట ఉంటే అన్ని బహుమతలు కచ్చితంగా వచ్చి ఉండేవి కావు. మొన్నటికి మొన్న ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకోగా రెండు రోజుల క్రితం ఇంటి సభ్యుల నుంచి లేఖలు అందుకున్నారు. ఊహించని పరిణామానికి ఇంటి సభ్యులు సంతోషంలో మునిగి తేలుతుండగా వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆప్తుల నుంచి బహుమతులు వచ్చాయి. ఇక దీపావళి సందర్భంగా నాగార్జున నేడు వారిని సర్ప్రైజ్ చేయనున్నాడు. (చదవండి: ఆయన ఐడియాలు మాత్రమే ఇస్తాడు.. సోహైల్) నాగార్జున భార్య అమల స్వయంగా కొనుగోలు చేసిన బహుమతులను సంచుల కొద్దీ కంటెస్టెంట్లు అందించడంతో వారు ఎగిరి గంతేశారు. వెలుగులు విరజిమ్మే దీపావళి నాడు కాల్చే పటాసులను ఒక్కొక్కరికి అంకితం చేయమని నాగ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో లాస్య సోహైల్ను చిచ్చుబుడ్డితో పోల్చింది. లాస్యను ఆంటీ అంటున్నారేంటి అని నాగ్ ప్రశ్నిస్తున్నట్లు నటిస్తూనే ఆమెను ఆంటీ ఆంటీ అని పదేపదే పిలుస్తూ ఏడిపించారు. అలాగే అభిజిత్ గే బార్కు వెళ్లిన విషయాన్ని నాగ్ ప్రస్తావించడంతో అతడికి తలెక్కడ పెట్టుకోవాలో తెలీలేదు. ఇక అవినాష్ అరియానాకు ఉల్లిపాయ బాంబు ఇచ్చినట్లు కనిపించగా నాగ్ జోక్యం చేసుకుంటూ నువ్వు ఆటంబాంబు ఇచ్చినా ఆమె పడదు అని క్లారిటీ ఇచ్చారు. దీంతో నా పెళ్లి చూపులు పెటాకులైనట్లేనని అవినాష్ డిసైడ్ అయిపోయాడు. కాగా నేటి ఎపిసోడ్లో అఖిల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. (చదవండి: అవినాష్ను వెంటాడుతున్న ఆత్మహత్య ఆలోచనలు?) కాగా నిన్నటి ఎపిసోడ్లో అరియానా, అవినాష్ పింక్ కలర్ దుస్తులే ధరించిన సంగతి తెలిసిందే. దీంతో కాసేపు పులిహోర కలిపేందుకు ప్రయత్నించిన అవినాష్ను ఆటకు అడ్డుకట్ట వేస్తూ నేనేం పడను నీకు అని చెప్పేసింది. దీంతో నీకు అంత సీను లేదు, నాకు ఆ ఆలోచనే లేదు అని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అతడి ఆవేదనను అర్థం చేసుకున్న అరియానా నేను నీకు పడిపోతాలే అని ధైర్యం చెప్పింది. దీంతో అవినాష్.. మనం ఫ్రెండ్స్. ఎందుకు పడతాం. ఈ పడిపోవడాలు ఏంటి? అంటూ ఏమీ ఎరుగనట్టు మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేశాడు. -
బిగ్బాస్ : నీకు పడిపోతా అవినాష్.. అరియానా
బిగ్బాస్లో హౌస్లో ఒక్క రోజు ముందే దీపావళి వేడుకలు మొదలయ్యాయి. ఇంటి సభ్యులంతా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా ఇళ్లంతా ముస్తాబు చేశారు. పండగ వేళ బిగ్బాస్ హౌస్మేట్స్కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ముఖ్యంగా లాస్యకు ఇచ్చిన గిఫ్ట్అయితే హైలెట్గా నిలించింది. ఇంతకీ బిగ్బాస్ ఇచ్చిన గిఫ్ట్లు ఏంటివి.. ఆ గిఫ్ట్లు పొందేందుకు ఇంటిసభ్యులు చేసిన టాస్క్లు ఏంటో చదివేద్దాం. నిన్న మటన్.. నేడు గుడ్లు అవినాష్ రేషన్ మెనేజర్ ఏ ముహుర్తాన అయ్యాడో కానీ.. ఆయనకి అన్నీ అపశకునాలే ఎదరవుతున్నాయి. నిన్న మటన్ చెడిపోవడంతో అవినాష్ని హౌస్మేట్స్ చితకబాదగా.. నేడు గుడ్లు పగులకొట్టి ఇంట్లో అడ్డంగా బుక్కయ్యాడు. గుడ్లు పగిలిన విషయం దాచేందుకు అవినాష్ ప్రయత్నించగా.. అరియానా ఠక్కున వెళ్లి సోహైల్, మెహబూబ్కు విషయం చెప్పింది. ఇంకేముంది వారిద్దరూ అవినాష్ని ఓ రేంజ్లో వేసుకున్నారు. నిన్న మటన్ పాడు చేశావు.. ఈ రోజు గుడ్లు పగుల గొట్టావ్.. నువ్వేం రేషన్ మేనేజరవయ్యా.. అంటూ సోహైల్, మెహబూబ్, అరియానా కలిసి అవినాష్ని కుమ్మెశారు. అరియానాతో అవినాష్ పులిహోరా ఇక సందు దొరికితే చాలు అమ్మాయిలతో పులిహోరా కలిపే అవినాష్.. ఈ రోజు అరియానాతో ఓ రేంజ్లో ఆడుకున్నాడు. అరియానా చాలా బాగుంటుంది కదా అని మోహబూబ్తో అనగా... ఏమో నాకు తెలియదు అంటూ మెహబూబ్ తప్పించుకున్నాడు. ఇక అవినాష్ మాటలకు అరియానా ముసిముసి నవ్వులు నవ్వుతూనే అవినాష్కు అదిరిపోయే పంచ్లు వేసింది. ‘నువ్ నా ముందే ఇద్దరు ముగ్గుర్ని బాగుంటావ్ అని అన్నావ్.. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి బాగుంటుంది కదా అంటే నేనేం పడను నీకు’ అంటూ ముఖం మీదే చెప్పేసింది. దీంతో అవినాష్ తన మాటలను కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ‘నువ్ ఎవరు నాకు పడటానికి ఛల్.. అంతలేదు.. నీకూ అంత సీన్ లేదూ.. నాకూ అంత సీన్ లేదు.. అసలు నాకు ఆ ఆలోచనే లేదు. మనం ఫ్రెండ్స్ అంతే. అవసరమే లేదు ‘ఛీ ఛీ’ అని ఆ మ్యాటర్ని కవర్ చేశాడు. ఇక అవినాష్ బాధను అర్థం చేసుకున్న అరియానా.. ఓకే అవినాష్ నేను నీకు పడిపోతాలే అని చెప్పింది. దీంతో అవినాష్ ‘మనం ఫ్రెండ్స్ ఎందుకు పడతాం.. ఈ పడిపోవడాలు ఏంటి?? ఏం మాట్లాడుతున్నావ్..’ అంటూ మ్యాటర్ డైవర్ట్ చేశాడు. ఇక అరియానా పింక్ శారీ కట్టుకుంటే.. అవినాష్ కూడా పింక్ షర్ట్ వేసుకున్నాడు.. అరియానా కోసమే పింక్ వేసుకున్నావా? అని మెహబూబ్ అనడంతో.. అవునా అవినాష్ నువ్ నాకోసం పింక్ వేసుకున్నావా?? అని అరియానా అడగడంతో.. ‘బొక్కేం కాదు.. నేను నీకోసం ఎందుకు పింక్ వేసుకుంటా.. నీకు అంత లేదు.. ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయకు’ అంటూ అవినాష్ కాస్త ఓవర్గానే రియాక్ట్ అయ్యాడు.. నవ్వులు పూయించిన ‘నవ్వడం నిషేధం టాస్క్’ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి తీసువస్తే.. మీరెవరూ ఎంటర్మైంట్ చేయడంలో విఫలమయ్యారంటూ హౌస్మేట్స్పై బిగ్బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పనిష్మెంట్గా ‘నవ్వడం నిషేధం’ టాస్క్ ఇచ్చాడు. అంటే ఇంటి సభ్యులు ఒక్కరినొక్కరు నవ్వించుకోవాలి కానీ ఎవరూ నవ్వకూడదు. ఎవరైతే నవ్వుతారో వాళ్లు ఈ టాస్క్ ఓడిపోయినట్లు లెక్క. అలాగే బిగ్బాస్ కూడా ఇంటి సభ్యులను నవ్వించే ప్రయత్నం చేస్తాడు.. కానీ హౌస్మేట్స్ బోర్గా ఫీల్ కావాలి. పేలని లాస్య చీమ ఏనుగు జోక్ మొదటగా లాస్య వచ్చి తన చీమ ఏనుగు జోక్తో నవ్వించే ప్రయత్నం చేసింది. ఓ చీమ అందంగా ముస్తాబై వచ్చి ఏనుకు పడేసేందుకు ప్రయత్నిస్తుందని, కానీ ఏనుగు మాత్రం పడలేదని, చివరకు చీమ కాలు అడ్డం పెట్టి పడేసిందని.. ఇదే జోక్ అని తనకు తానే నవ్వుకుంది. ఇంటి సభ్యులెవరూ నవ్వలేదు. అరియానాకు సోహైల్ పంచ్ ఇక అరియానా మెహబూబ్, సోహైల్లను నవ్వించే ప్రయత్నం చేసి ఓడిపోయింది. సోహైల్ దగ్గరికి వెళ్లి. ‘మనం ఫస్ట్టైం కలిసినప్పుడు నీకు ఇలా ఇలా హాయ్ చెప్పా’ అని అరియానా అంటే.. ‘అయితే ఏంటి ఇప్పుడు’ అని సోహైల్ పంచ్ విసరడంతో అరియానా ఇక నవ్వించలేను బాబూ... అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్నేహితుడైన అవినాష్ దగ్గరకు వెళ్లి ప్రయత్నించగా.. అక్కడ కూడా సక్సెస్ కాలేదు. అందరిని నవ్వించిన అవినాష్ అవినాష్ మాత్రం అందరిని నవ్వించాడు. ముఖ్యంగా సోహైల్ అయితే అవినాష్ని చూసి నవ్వు ఆపులేకపోయాడు. ఇక అలాగే లాస్యను, మెహబూబ్ను తనదైన శైలీలో పంచ్లు వేస్తూ నవ్వించాడు. ఇక అవినాష్ పంచ్లకు సీక్రెట్ రూమ్లో ఉన్న అఖిల్ కూడా పగలబడి నవ్వాడు. ఇక మెహబూబ్ కుందేలు వేషం వేసి నవ్వించే ప్రయత్నం చేశాడు. బిగ్బాస్ నోట సోహైల్ యాస ఒక పక్క ఒక్కో ఇంటి సభ్యుడు మిగిలిన వాళ్లని నవ్వించేందుకు ప్రయత్నం చేస్తుండగా.. మరో పక్క బిగ్బాస్ కూడా హౌస్మేట్స్పై ‘.జోకుల దాడి’ చేశాడు. సోహైల్ని పిలిచి.. ‘సోహైల్ ఏందీ పంచాయితీ.. కథెట్లుంది’ అంటూ అతని స్టైల్లో అన్నాడు. దీంతో సోహైల్ నవ్వు ఆపుకోలేకపోయాడు. బిగ్బాస్ నోట నా మాటలు వచ్చాయి ఇది చాలు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక అవినాష్ని కూడా బిగ్బాస్ ఆటపట్టించాడు. ‘అవినాష్ నీ తెలుగు బాగుంటంది. తెలుగులో నవ్వు అవినాష్’ అంటూ అతన్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. బిగ్బాస్ పంచ్లకు నవ్వట్లేదు .. నవ్వట్లేదు అంటూనే నవ్వేశాడు అవినాష్. ఓడిపోయి బహుమతులు గెలిచారు ఇక ‘నవ్వు నిషేధం’ టాస్క్లు హౌస్మేట్స్ అంతా ఓడిపోయారని బిగ్బాస్ ప్రకటించారు. అయితే ఓడినా.. వినోదం పంచడంలో గెలిచారంటూ.. బహుమతులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. దీంతో ఇంటి సభ్యులంతా తమ తమ బహుమతులు తీసుకొని మురిసిపోయారు. లాస్యకు స్పెషల్ గిఫ్ట్ ఇక అందరికి బహుమతులు అందించిన బిగ్బాస్.. లాస్యకు మరో సర్ప్రైజ్ అందించాడు. బిగ్బాస్ ఇంట్లో ఆమె కుమారుడు ‘జున్ను’ మాటలను వినిపించాడు. తన కొడుకు మాటలు విన్న లాస్య.. ఒక్కసారిగా ఆనందంతో ఇంట్లోకి పరుగులు తీసింది. కొడుకు ముసి ముసి నవ్వులు.. బుజ్జి బుజ్జి మాటలు విని ఎమోషనల్ అయింది. హౌస్మేట్స్ ‘జున్ను’ మాటలు విని ఆనందపడ్డారు. బిగ్బాస్ ఇంట దీపావళి వేడుకలు దీపావళి పండగ సందర్భంగా.. హౌస్మేట్స్కి గులాబ్ జామ్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. లాస్య, మోనాల్ కలిసి గులాబ్ జామ్లను తయారు చేసి ఇంటి సభ్యులకు పంచారు. తర్వాత గార్డెన్ ఏరియాలో దీపాలు వెలిగించి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. -
జబర్దస్త్లోకి మళ్లీ తీసుకుంటారు: అవినాష్ తమ్ముళ్లు
ముక్కు అవినాష్.. జబర్దస్త్ అతనికి జీవితాన్ని ప్రసాదించింది. కమెడియన్గా సమాజంలో గుర్తింపును తెచ్చిపెట్టింది. కానీ హఠాత్తుగా వచ్చిపడ్డ లాక్డౌన్లో అతడిని ఎన్నో కష్టాలు వేధించాయి. ఒకానొక దశలో చావే శరణ్యం అనుకున్నాడు. అలాంటి సమయంలో బిగ్బాస్ నుంచి పిలుపు వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. ఓకే చెప్పాడు. క్వారంటైన్కు వెళ్లాడు. లేటుగా వెళ్లినా లేటెస్టుగా వెళ్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లో అడుగు పెట్టాడు. అప్పటిదాకా సోసోగా ఉన్న బిగ్బాస్ హౌస్ అతడి రాకతో వినోదాలకు నిలయంగా మారింది. అలా కొన్ని వారాలు గడిచాయి. ఇంతలో నోయల్ వెళ్లిపోతూ అవినాష్, మాస్టర్కు క్లాస్ పీకాడు. తన నొప్పి మీద చిల్లర కామెడీ చేశారని మండిపడ్డాడు. దీన్ని అవినాష్ తట్టుకోలేకపోయాడు. స్టేజీ పైనే తీవ్రంగా వ్యతిరేకించాడు. పడ్డవాళ్లు ఎప్పుడూ చెడ్డవాళ్లు కాదని నాగార్జున కూడా అతడిని సముదాయించారు. అయినప్పటికీ ఆ మాటలను అవినాష్ మనసులోనే పెట్టుకున్నట్లు కనిపించింది. ఆ తర్వాత నుంచి కోపంగా మాట్లాడుతూ, ప్రతిదానికి ప్రేక్షకులు చూస్తున్నారంటూ, తన కామెడీని ఎవరేమన్నా సహించను అని చాలా మాట్లాడాడు. ఆ తర్వాత ఓసారి తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను వదిలేసి వచ్చానని, మళ్లీ తీసుకోమన్నారని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశాడు. మొన్న ఇమ్యూనిటీ పొందే టాస్కులో కూడా తను షో కోల్పోయానంటూ సపోర్ట్ చేయమని వేడుకున్నాడు. ఆఖరికి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అని ప్రకటించినప్పుడు కూడా మళ్లీ జీరో దగ్గరకు వచ్చాను. శూన్యం అంటూ అంతా అయిపోయిందన్నట్లు మాట్లాడాడు. దీంతో అవినాష్ ప్రవర్తన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే అవినాష్ మళ్లీ జబర్దస్త్లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మాట అంటోంది మేము కాదు.. అవినాష్ తమ్ముళ్లు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. (చదవండి: మోకరిల్లి సారీ చెప్పినా కనికరించని నోయల్) "అన్నయ్య జబర్దస్త్ షో నుంచి శాశ్వతంగా బయటకు రాలేదు. తన ఇష్టంతోనే బిగ్బాస్కు వెళ్లాడు. బిగ్బాస్ పూర్తయ్యాక మళ్లీ జబర్దస్త్లోకి కంటిన్యూ అవచ్చు. మళ్లీ అదే టీమ్.. మాస్ అవినాష్, కెవ్వు కార్తీక్ టీమ్లో ఉండొచ్చు. మల్లెమాల వాళ్లు అన్నయ్యను మళ్లీ తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అన్నయ్య కెరీర్లో జబర్దస్త్ ఉండదు అనేది కేవలం రూమర్లే" అని చెప్పుకొచ్చారు. కానీ ఇది ఎవరో పుట్టించిన రూమర్ కాదు. స్వయంగా అవినాషే షోలో ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించాడు. దీంతో అతడు సింపథీ గేమ్ ఆడుతున్నాడని జనాలు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: నీ కాళ్లు పట్టుకుంటా, ఏం చేసుకోకు: అరియానా) -
అవినాష్ను వెంటాడుతున్న ఆత్మహత్య ఆలోచనలు?
బిగ్బాస్ నాల్గో సీజన్లోవైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్లో ఎక్కువకాలం ఉండలేకపోయారు. కానీ రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ మాత్రం ఇంటిసభ్యుల్లో ఒకరిగా కలిసిపోయి కామెడీ, పంచులతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు. ఒకప్పుడు కమెడియన్గా వెలుగొందిన అవినాష్ లాక్డౌన్లో ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అందరినీ షాక్కు గురి చేసింది. ఆ మధ్య తన కష్టాల గురించి అవినాష్ మాట్లాడుతూ.. లాక్డౌన్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పాడు. అమ్మ రాజశేఖర్తో పాటు, నాగార్జున కూడా అలాంటి మాటలు వద్దని, బతికి సాధించాలని ధైర్యం నూరిపోశారు. కానీ అరియానా మాటలు విన్నాక అతని మనసులో నుంచి ఆత్మహత్య ఆలోచనను తీసేయలేదేమో అనిపిస్తోంది. గుండె ఆగినంత పనైంది: అవినాష్ నిన్నటి బిగ్బాస్ ఎపిసోడ్లో నాగార్జున నామినేషన్లో ఉన్న ఒక్కొక్కొరిని సేఫ్ చేస్తూ వచ్చారు. చివరికి అవినాష్, మాస్టర్ మిగిలారు. తాను పక్కా సేఫ్ అవుతానని అవినాష్ కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. ఇంతలో డబుల్ ఎలిమినేషన్కు ఛాన్స్ ఉంటుందని నాగ్ చెప్పడంతో అవినాష్కు ఒక్కసారిగా భయం పట్టుకుంది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. శరీరం వణకడం ప్రారంభించింది. ఒక్కసారి అతని మెదడులో తన జీవితం గిర్రున తిరిగింది. తనకు అన్నం పెట్టిన జబర్దస్త్ను వదిలేసి వచ్చాడు, మళ్లీ వస్తే తీసుకోనన్నారు. కాబట్టి ఆ దారి మూసుకుపోయింది. నెక్స్ట్ ఏంటి? శూన్యం.. మళ్లీ జీరో.. నెత్తిమీద బండెడు అప్పులు. అవన్నీ ఎలా కట్టాలి. భవిష్యత్తుకు భరోసా ఏది? కొన్ని క్షణాల పాటు ఈ ఆలోచనల సుడిగండంలో కొట్టుకుపోయాడు. ఇంతలో అవినాష్ సేఫ్ అయ్యాడు అని నాగార్జున వెల్లడించిన కాసేపటి వరకు మామూలు మనిషి కాలేకపోయాడు. గుండె ఆగినంత పనైందంటూ మనసులోని బాధను కక్కేస్తూ గట్టిగా ఏడ్చేశాడు. (లాక్డౌన్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.) జబర్దస్త్ షో ఒక్కటే జీవితం కాదు.. అయితే అతని మనసులోని బాధను అరియానా ముందే పసిగట్టడం విశేషం. పొరపాటున ఎలిమినేట్ అయితే బయటకు వెళ్లాక ఏం చేసుకోవద్దు అని పదే పదే వేడుకుంది. కాళ్లు పట్టుకుంటా, నా గురించి ఆలోచించు, ఎలాంటి పిచ్చి పని చేయకు అంటూ కన్నీళ్లతో వేడుకుంటూ ఒట్టేయించుకుంది. ఈ మాటలు విన్న ప్రేక్షకులు అవినాష్ బుర్రలో ఇంకా ఆత్మహత్య ఆలోచనలే తిరుగుతున్నాయా? అని షాక్ అవుతున్నారు. అరియానా అలా పదే పదే బతిమిలాడుతోందంటే అవినాష్ ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నాడా? అని చర్చిస్తున్నారు. అందరినీ నవ్వించే అవినాష్ బాధలతో కుమిలిపోవడాన్ని ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జబర్దస్త్ ఒక్కటే జీవితం కాదని, బయట ఎన్నో అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. (బిగ్బాస్: సమంత జ్యువెలరీ ఖరీదెంతో తెలుసా) -
బిగ్బాస్: ఇదేం ట్విస్టు, డబుల్ ఎలిమినేషనా?
బిగ్బాస్ నాల్గో సీజన్లోకి బుల్లితెర క్వీన్, యాంకర్ సుమ వైల్డ్కార్డ్ ఎంట్రీ అని జనాలను ఊదరగొట్టారు. కానీ ఎపిసోడ్ వచ్చేంతవరకు కూడా జనాలను నమ్మించే ప్రయత్నం చేయలేదు. తాజాగా రిలీజైన ప్రోమోలో భూతద్దం వేసి వెతికినా ఏ మూలనా సుమ కనిపించనేలేదు. దీంతో సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అబద్ధమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు బిగ్బాస్.. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా? అని ప్రేక్షకుల మెదళ్లలో అనుమానాన్ని నాటే సాహసం చేశారు. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్కు ఆస్కారం లేదని, ఇప్పుడు అంత అవసరం కూడా లేదని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లేటెస్ట్ ప్రోమోలో అమ్మ రాజశేఖర్, అవినాష్ ఇద్దరినీ రెండు గదుల్లోకి పంపించారు. కాసేపటి తర్వాత రెండు గదులను తెరిచి చూస్తే అందులో ఒక్కరే ఉంటారని నాగ్ వెల్లడించారు. (చదవండి: మోనాల్ నీకు ఫ్రెండా? అంతకు మించా?: నాగ్) ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. అవినాష్, నువ్వు ఉంటావంటూ భరోసా ఇచ్చాడు. కానీ అనూహ్యంగా రెండు గదుల్లోనూ ఇద్దరూ మాయమవగా.. డబుల్ ఎలిమినేషన్కు అవకాశం ఉందని బాంబు పేల్చాడు. దీంతో అందరికన్నా ఎక్కువగా అరియానా షాకైంది. కన్నీళ్లను ఆపుకుంటూ మీరు నిజమే చెప్తున్నారా అని నాగ్ను ప్రశ్నించింది. అయితే దీనికి ఆయన మాత్రం ఎలాంటి సమాధానమివ్వలేదు. ఇక అయితే సోషల్ మీడియా మాత్రం షో నుంచి మాస్టర్ మాత్రమే వెళ్లిపోయాడహో.. అని కోడై కూస్తోంది. ఇక నెటిజన్లు కూడా ఎప్పుడూ ఈ డబుల్ ఎలిమినేషన్ డ్రామాలు ఏమిటో? అని విసుగు చెందుతున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే అవినాష్ను సీక్రెట్ రూమ్లోకి పంపుతారేమో అని కామెంట్లు పెడుతున్నారు. మరి నేడు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? ఏదైనా ట్విస్టు ఉంటుందా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: మా ఆయన లేకపోతే బిగ్బాస్ షో లేదు) -
అవినాష్ కన్నీళ్లు: మాస్టర్ వెళ్లిపోతున్నందుకా!?
విపత్తు ఎన్నో మార్పులు తీసుకొచ్చిందంటూ పంచ్ క్వీన్, యాంకర్ సుమ బిగ్బాస్ హౌస్లోకి వస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ప్రోమో కూడా వేసేశారు. కానీ ఆమె దీపావళి కానుకలను కంటెస్టెంట్లకు ఇవ్వడానికో, టీఆర్పీలు పెంచడానికో సూట్కేసుతో సహా హౌస్లోకి అడుగు పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే ఆమె వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇస్తే మాత్రం ప్రేక్షకులకు కన్నులపండగే. ఈ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున ఇంటిసభ్యులందరికీ గిఫ్టులు పంపించారు. కానీ వాటిని పొందాలంటే మాత్రం చెప్పిన టాస్కులు చేయాల్సిందేనని ట్విస్ట్ ఇచ్చాడు. అందులో భాగంగా అభికి అన్నింటికన్నా కష్టమైన డ్యాన్స్ చేయమన్నాడు. దాన్ని పనిష్మెంట్లా భావించిన అభి.. దీని తర్వాత తనకు కెరీర్ ఉండదని వాపోయాడు. (చదవండి: బిగ్బాస్: ఒకరు సేఫ్, మరొకరికి ఇమ్యూనిటీ) మెహబూబ్ను చేతులతో ముట్టుకోకుండా బిస్కెట్లు తినాలన్నాడు. అందరికన్నా అఖిల్ పరిస్థితి మరీ నవ్వు తెప్పిస్తోంది. అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అఖిల్కు ఒంటికళ్లజోడును అందించారు. దీంతో అతడు ఓ కన్నుపోయిన గజదొంగలా కనిపిస్తున్నాడు. చివర్లో అవినాష్ నేలపై మోకరిల్లుతూ ఏడుస్తున్నాడు. స్నేహితుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయిన అరియానా కూడా కంతడి పెడుతోంది. అయితే అవినాష్ వెనకాల సోఫాపై మొబైల్ ఫోన్ కూడా ఉంది. ఇది ఎన్నో అనుమానాలను తావిస్తోంది. ఫోన్ ద్వారా అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసిందా? లేదా తన కుటుంబం నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? అదీ కాకుండా ఏడవాలని నాగ్ టాస్క్ ఇచ్చాడా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.. (చదవండి: పునర్నవి నిశ్చితార్థం అంతా ఉత్తిదే) -
అప్పులున్నాయి, ప్లీజ్ సపోర్ట్: అవినాష్ సింపథీ గేమ్?
బిగ్బాస్ హౌస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్ మీదే ఆధారపడి ఉందని నాగార్జున మరోసారి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చెప్పేది నమ్మకండని సూచిస్తూ షో ప్రారంభించారు. కెప్టెన్ అమ్మ రాజశేఖర్ ఇంట్లో అందరినీ శివాలెత్తిస్తారని చెప్పుకొచ్చారు. హౌస్లో ఎవరి మీదైనా ఫిర్యాదులున్నాయా అని ఇంటిసభ్యులను ఆరా తీశారు. అభిజిత్ మాస్టర్ తాము చెప్పేది వినిపించుకోవడం లేదని చెప్పాడు. కానీ నాగార్జున మాత్రం మాస్టర్ కెప్టెన్ అంటూ అతడినే వెనకేసుకురావడం గమనార్హం. అలాగే టీ స్టాండు టాస్క్లో దగ్గర ఆత్మగౌరవం అంటూ ఆట మధ్యలో నుంచి నిష్క్రమించడాన్ని తప్పు పట్టారు. ఎవరు వెలిగే దీపం, ఎవరు ఆరిపోయే దీపం? కంటెస్టెంటు వెలిగే దీపం ఆరిపోయే దీపం అభిజిత్ మోనాల్ అమ్మ రాజశేఖర్ అరియానా అవినాష్ అభిజిత్ మోనాల్ అఖిల్ అరియానా సోహైల్ మెహబూబ్ అరియానా అవినాష్ అరియానా మోనాల్ హారిక లాస్య అవినాష్ లాస్య హారిక అరియానా మెహబూబ్ సోహైల్ అరియానా అమ్మ రాజశేఖర్ అరియానా అఖిల్ అఖిల్ మోనాల్ అమ్మ రాజశేఖర్ మోనాల్ను దగ్గరకు తీసుకున్న అఖిల్ మోనాల్ ఒంటరిగా ఫీలవడాన్ని చూసి ఏమైందని నాగ్ ప్రశ్నించారు. అఖిల్ నామినేట్ చేయడం తట్టుకోలేకపోయానని, తనతో మాట్లాడేందుకు ప్రయత్నించా కానీ పట్టించుకోలేదని వాపోయింది.. ఈ హౌస్లో అతడు నా ఫ్యామిలీ మెంబర్ అనుకున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీని గురించి అఖిల్ స్పందిస్తూ ఆమె స్ట్రాంగ్ అవ్వాలనే అలా చేశానని సమాధానమిచ్చాడు. దీంతో నాగ్ ఆమె నీకు ఫ్రెండా? అంత కన్నా ఎక్కువా? అని సూటి ప్రశ్న విసిరాడు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డ అఖిల్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇదే ప్రశ్నను మోనాల్ను అడగ్గా ఆమె కూడా జస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. (చదవండి: నోయల్ అవుట్, మోకరిల్లి దండం పెట్టిన అవినాష్) తన ముఖంలో చిరునవ్వులు వెలిగించే దీపం అఖిల్.. అయితే అఖిల్ను వెలిగే దీపమని మోనాల్ చెప్పడంతో అతడు సంతోషం పట్టలేక ఆమెను హత్తుకుంటూ ఇన్నాళ్ల ఎడబాటుకు చెక్ పెట్టాడు. ఇక అరియానా డిక్టేటర్ కెప్టెన్ అని చాలామంది ఇంటిసభ్యులు అభిప్రాయపడ్డారు. కానీ ఆమె మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఆమె కెప్టెన్ అయినప్పుడు అందరికీ సమానంగా పనులు అప్పగించలేదని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎందుకని ప్రశ్నిస్తే నాకు కొందరి కంఫర్ట్ కావాలని సమాధానమిచ్చిందని అరియానాలోని మరో కోణాన్ని వెల్లడించాడు. ఇక మోనాల్ను నామినేట్ చేసినందుకు అఖిల్ను ఆరిపోయే దీపమని చెప్పాడు. అఖిల్ ఆమెకు ట్రూ ఫ్రెండ్ కాదన్నాడు. (చదవండి: ఏయ్ హారిక, నోర్మూయ్: చెలరేగిన మాస్టర్) హారికను సేఫ్ చేసిన కమల్ హాసన్ నిజంగానే నాగ్ చెప్పినట్టు తొలిసారి బిగ్బాస్ షోలో అద్భుతం జరిగింది. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా వర్చువల్ తెరమీద కనిపించారు. మన కంటెస్టెంట్లను వారికి, అక్కడి వాళ్లను మనవారికి పరిచయం చేశారు. మీ హౌస్ ఫుల్లుగా ఉందేంటి అనగా అది నాకు నచ్చని మాట అని కమల్ కౌంటరేశారు. అలా కాసేపు సరదాగా సంభాషించి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు. అనంతరం కమల్ తెలుగు బిగ్బాస్కు వీడ్కోలు తీసుకునే ముందు హారికను సేఫ్ చేశారు. తర్వాత నాగ్ మరో ట్విస్టు ఇచ్చారు. టీ స్టాండు టాస్కులో చివరి వరకు ఆడిన మోనాల్, అవినాష్లు తర్వాతి వారం ఇమ్యూనిటీ పొందేందుకు మరో అవకాశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా ఇద్దరికీ చెరో బుట్ట ఇచ్చి అందులో ఇంటిసభ్యులను ఒప్పించి వారి వస్తువులను త్యాగం చేయాలని కోరాలి. ఎవరి బుట్ట బరువెక్కితే వారు ఇమ్యూనిటీ పొందుతారు. (చదవండి: హిమాలయాలకు వీడ్కోలు) షో వదులుకున్నా, అప్పులున్నాయి, సపోర్ట్ చేయండి.. దీంతో అవినాష్ మిగతా మిగతా కంటెస్టెంట్ల దగ్గర బేరసారాలాడాడు. "నేను షోను వదులుకుని వచ్చాను. మళ్లీ తీసుకోమన్నారు. ఇల్లు అప్పులు క్లియర్ చేసుకోవాలి. మా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి" అని తన బాధను ఏకరువు పెట్టాడు. మరోవైపు మోనాల్ తనకు ఇమ్యూనిటీ అవసరమంటూ సపోర్ట్ చేయమని కోరింది. ఇప్పుడు చేయలేనని లాస్య నిర్మొహమాటంగా చెప్పింది. మిగతావాళ్లు సపోర్ట్ చేయలేమని నేరుగా చెప్పకుండా చేతల్లో నిరూపించారు. మోనాల్కు సపోర్ట్ చేద్దామనుకున్న సోహైల్ను మెహబూబ్ వద్దని వారించాడంతో అవినాష్ కోసం తన వస్తువుల త్యాగానికి సిద్ధపడ్డాడు. ఇమ్యూనిటీ పొందిన అవినాష్ హారికకు మోనాల్కు సపోర్ట్ చేయాలని ఉన్నప్పటికీ అవినాష్ తనకే చేయాలని పట్టుపట్టాడు. కానీ అతడు పక్కు వెళ్లగానే మోనాల్ బుట్టలో తన వస్తువులను వేయడానికి సిద్ధపడగా అప్పటికే బజర్ మోగింది. దీంతో అఖిల్ ఒక్కడే మోనాల్కు సపోర్ట్ చేయగా లాస్య, సోహైల్, మెహబూబ్, అరియానా.. అవినాష్కు మద్దతు తెలిపారు. దీంతో మోనాల్ బుట్ట 13 కిలోలు, అవినాష్ బుట్ట 23 కిలోల బరువు తూగగా తర్వాతి వారానికి గానూ అవినాష్కు ఇమ్యూనిటీ లభించిందని నాగ్ ప్రకటించారు. ఇక కెప్టెన్గా అందరి మీదా అజమాయిషీ చేస్తోన్న అమ్మ రాజశేఖర్ రేపటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయినట్లు సమాచారం. (చదవండి: బిగ్బాస్: కెప్టెన్గా మాస్టర్, మరి ఎలిమినేషన్?) -
జబర్దస్త్లోకి మళ్లీ రానిచ్చేది లేదన్నారు: అవినాష్
సోమవారం గరంగరంగా ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ నేడు పీక్స్కు వెళ్లింది. మిస్టర్ కూల్ అభిజిత్ ఎదుటివాళ్ల మాట వినిపించుకోని మాస్టర్పై తన ప్రతాపాన్ని చూపించాడు. అఖిల్ తను ఎంతో ఇష్టపడే మోనాల్ను నామినేట్ చేశాడన్న మాటే కానీ ఆమె బాధపడుతుంటే చూడలేకపోయాడు. సోహైల్, మెహబూబ్తో గొడవ పెట్టుకున్నాడు. దగ్గరకు వెళ్లి ముఖానికి పట్టిన దుమ్మును తొలగించాడు. కానీ ఆమె మనుసులో రగులుతున్న ఘోషను అర్థం చేసుకోలేకపోయాడు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. నా లైఫ్ను అవమానపరుస్తున్నారు: మాస్టర్ నిన్న అవినాష్ను నామినేట్ చేసిన అభిజిత్ నేడు అమ్మ రాజశేఖర్పై కోడిగుడ్డు పగలగొట్టాడు. దీంతో అసహనంతో ఊగిపోయిన మాస్టర్ అభికి మాట్లాడే చాన్సివ్వకుండా అర్థం పర్థం లేని మాటలన్నీ అనేశాడు. నన్ను మాట్లాడనివ్వకపోతే ఊరుకోను అని అభి హెచ్చరించడంతో నన్ను కొడతావా? అని మాస్టర్ మరింత రెచ్చగొట్టాడు. అందరూ నా జీవితాన్ని అవమానపరుస్తున్నారని ఆవేశంతో ఊగిపోయాడు. ఈ ఇద్దరి మధ్యలో దూరేందుకు అవినాష్ ప్రయత్నించగా హారిక మధ్యలో జోక్యం చేసుకోవద్దని హితవు పలికింది. అప్పటికే నిప్పు కణంలా ఎగిరెగిరి పడుతున్న మాస్టర్ ఆవేశంలో హారికను నోరు మూర్మోయ్ అంటూ నోరు జారాడు. అటు అభిని కూడా కుర్చీలో కూర్చోవడం కాదు, దమ్ముంటే టాస్కు ఆడు అని సవాలు విసిరాడు. అందరి మీద అరిచి చివరలో మాత్రం నేను ఎవరినీ నామినేట్ చేయనంటూ విసురుగా వెళ్లిపోయి ఏడ్చేయడం గమనార్హం. మోనాల్ను తనవైపు తిప్పుకుంటున్న మాస్టర్! తర్వాత హారిక అవినాష్, అమ్మ రాజశేఖర్ను, లాస్య అవినాష్, మోనాల్ను, మోనాల్.. సోహైల్, లాస్యను, అమ్మ రాజశేఖర్.. అభిజిత్, అఖిల్ను, మెహబూబ్.. హారిక, అవినాష్ను నామినేట్ చేశారు. మీరు పోతా పోతా అన్నప్పుడు పంపించడానికి రెడీ అని అఖిల్ మాస్టర్ మీద గుడ్డు పగలగొట్టాడు. లాస్ట్ టాస్క్లో పర్ఫామ్ చేయలేదు, నీకు క్లారిటీ లేదు అనిపించింది అని మోనాల్ను నామినేట్ చేశాడు. ఊహించని పరిణామానికి షాక్ అయిన మోనాల్ శిలా విగ్రహంలా నిల్చుండిపోయింది. దొరికిందే ఛాన్స్ అనుకున్న మాస్టర్ ఈ గొడవను తగ్గించడానికి బదులు పెంచే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. నీ గేమ్ నువ్వు ఆడు అని మొదటి నుంచే చెప్తున్నా, ఇక నుంచి నీకు నేను సపోర్ట్గా ఉంటా అని మోనాల్కు హామీ ఇచ్చాడు. (చదవండి: బిగ్బాస్ : నోయల్కు వచ్చిన వ్యాధి ఇదే) నామినేషన్లో ఉన్నవారికి బిగ్బాస్ ఆఫర్ అయితే అఖిల్ ఇచ్చిన ట్విస్టు నుంచి తేరుకోని మోనాల్ ఆవేదనలో ఏదేదో మాట్లాడేసింది. అబ్బాయి- అమ్మాయి ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ కారు. కొంచెం మోర్ కావాలి. అదే ప్రాబ్లమ్ అని పేర్కొంది. మనుషులను తప్పుగా అంచనా వేశానని బాధపడింది. తాను ఒంటరినంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఇంత జరిగినా ఆమెకు అఖిల్ మీద ఇసుమంత ప్రేమ తగ్గలేదు. రాత్రి ఒళ్లు మరిచి నిద్రపోతున్న అఖిల్కు చలి పెట్టకుండా దుప్పటి కప్పింది. కాగా మొత్తంగా మోనాల్, అభిజిత్, హారిక, అవినాష్, అమ్మ రాజశేఖర్ నామినేషన్లో నిలిచారు. వీరిలో ఒకరు ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యేందుకు బిగ్బాస్ "ముఖం జాగ్రత్త" అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా నామినేట్ అయిన వాళ్లు టీ స్టాండ్ మీద ముఖం పెట్టాలి. ఎండ్ బజర్కు ఎవరి తల స్టాండ్ మీద ఉంటే వారు నామినేషన్ నుంచి సేఫ్. కొట్టుకున్నంత పని చేసిన అఖిల్, సోహైల్ ఇక టాస్క్లో భాగంగా మిగతా ఇంటిసభ్యులు నామినేట్ అయినవాళ్లను ఐస్ గడ్డలు, నీళ్లు, గడ్డి, మట్టి ఉపయోగిస్తూ నానారకాలుగా హింసించారు. అందరి కన్నా కాస్తంత ఎక్కువగా మోనాల్ను హింసించినట్లు కనిపించింది. అది చూసి తట్టుకోలేకపోయిన అఖిల్.. మోనాల్ దగ్గరకు వచ్చి ఆమె ముఖం శుభ్రం చేశాడు. దీంతో మెహబూబ్ మాస్టర్కు సాయం చేస్తే ఎందుకు వ్యతిరేకించావని సోహైల్ అఖిల్ మీద అరిచాడు. అలా వీళ్లిద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. అరియానా మరోసారి రాక్షసిగా మారి అందరినీ రాచిరంపాన పెట్టింది. కానీ ఎండ్ బజర్ మోగేసరికి టీ స్టాండ్ మీద మోనాల్, అవినాష్, అమ్మ రాజశేఖర్ స్టడీగా ఉన్నారు. దీంతో ఒక్కరి కన్నా ఎక్కువ మంది ఉన్న కారణంగా ఎవరికీ ఇమ్యూనిటీ లభించలేదు. (చదవండి: సోనూ సూద్, ప్లీజ్ మోనాల్ను కాపాడండి) ఎన్నో అవమానాలు పడి వచ్చాను: అవినాష్ ఇంతవరకు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని అవినాష్ బాధపడ్డాడు. ఎన్నో అవమానాలు పడి వచ్చాను. మళ్లీ ఆ షో(జబర్దస్త్)లోకి తీసుకోమని చెప్పారు. అవన్నీ గుర్తొచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ తనలాగే ఇక్కడ అందరూ స్ట్రాంగ్గా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. మరోవైపు అఖిల్ చేసిన మోసానికి మోనాల్ కుంగిపోయింది. నేను హర్ట్ అయ్యాను అఖిల్, నువ్వు నన్ను నమ్మనందుకు బాధపడుతున్నానని ఒంటరిగా తన కన్నీళ్లను జారవిడిచింది. (చదవండి: కాబోయే భార్య ఎలా ఉండాలంటే..: అఖిల్) -
బిగ్బాస్ : కామెడీ ఆపేస్తే బాగుంటుంది.. అభిజిత్ ఫైర్
బిగ్బాస్ హౌస్లో తొమ్మిదో వారానికి జరిగిన నామినేషన్ల ప్రక్రియ ప్రకంపనాలు సృష్టించింది. హౌస్మేట్స్ మధ్య మాటల యుద్దం తారాస్థాయి చేరింది. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ గత వారాలకంటే కాస్త విరుద్ధంగా జరిగింది. ప్రతి వారం ఒక్క ఎపిసోడ్లోనే నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేది. కానీ ఈ వారం మాత్రం అది రెండు ఎపిసోడ్లకు చేరింది. ఇక రోజు జరిగిన నామినేషన్ ప్రక్రియలో కోడిగుడ్ల మోత మోగింది. చుక్కలు చూపిపించిన కెప్టెన్ అరియానా, అవినాష్, అభిజిత్ మధ్య చిచ్చు రేపిన నోయల్ వ్యాఖ్యలు, గుడ్డు కొట్టొదని మోనాల్ ఏడుపులు.. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో ఏమేం జరిగాయో చదివేయండి. టామ్ అండ్ జెర్రీ లొల్లి అఖిల్కి ఏమైందో ఏమో కానీ మోనాల్తో కాస్త దూరంగా ఉన్నాడు. దీంతో మోనాల్ అఖిల్ దగ్గరికి వచ్చి ఏమైంది.. ఎందుకు దూరంగా ఉంటున్నావు అని అడిగితే.. అదేం లేదు అన్నట్లు అఖిల్ చెప్పుకొచ్చాడు. హగ్ ఇవ్వు అయితే అని మోనాల్ అడగ్గా.. అఖిల్ మనస్పూర్తిగా కౌగిలించుకోలేదు. దీంతో మనసు చిన్నబుచ్చుకున్న మోనాల్ ‘ నా అఖిల్ అయితే ఇలా కౌగిలించుకోడు’ అంటూ బుగ్గమూతి పెట్టింది. నీకు స్పేస్ కావాలా?? ఏమైంది నీకు.. నాకు అఖిల్ గురించి నాకు తెలుసు.. ఏమైంది అని మోనాల్ అడిగితే... నాకు కొంత టైం కావాలి’ అంటూ ఎప్పటిలాగే తనదైన శైలిలో చెప్పేశాడు అఖిల్. ఇక ఉదయం 11 గంటలు అయినా మెహబూబ్, సోహైల్ నిద్ర పోయారు. దీంతో హౌస్లో కుక్కలు మోరిగాయి. ఇక్కేముంది కెప్టెన్ అరియానా వచ్చి పనిష్మెంట్ ఇచ్చారు. స్నానం చేయాలని సూచించింది. అయితే ఇక్కడ సోహైల్ తెలివిగా తప్పించుకున్నాడు. నేను నిద్రపోలేదని, మెహబూబ్ మాత్రమే నిద్రపోయాడని చెప్పుకొచ్చాడు. దీంతో మెహబూబ్ మాత్రమే పనిష్మెంట్ కింద స్నానం చేశాడు. ఇళ్లు ఊడ్చే విషయంతో అరియానా, మెహబూబ్కు మధ్య వాదన జరిగింది. ప్రతి సారి నన్నే టార్గెట్ చేస్తున్నావంటూ కెప్టెన్ అరియానాపై మెహబూబ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు గార్డెన్ ఏరియాలో కూర్చున్న లాస్య, అభిజిత్..నామినేషన్లు ఎలా ఉండబోతున్నాయో జోస్యం చేప్పారు. నేను గిట్లనే ఉంటా : సోహైల్ మరోసారి సోహైల్ నిద్ర పోవడంతో అరియానా వచ్చి పనిష్మెంట్ కింద స్నానం చేయాల్సిందిగా సూచించింది. అయితే తాను కాసేపటి క్రితమే స్నానం చేశానని, సాయంత్రం చేస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అరియానా మాత్రం 15 నిమిషాల్లో స్నానం చేయాలని కోరింది. దీంతో కోపోద్రిక్తుడైనా సోహైల్.. పరుగునా వచ్చి స్విమ్మింగ్పూల్లో దూకేశాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన వినిపించుకోకుండా స్నానం చేయమని చెప్పడం ఏంటి. కెప్టెన్ అయినంత మాత్రనా ఏది చెబితే అది చేయాలా అంటూ..స్విమ్మింగ్పూల్లోనే జలదీక్ష చేపట్టాడు. మెహబూబ్, అవినాష్ వచ్చి ఎంత నచ్చజెప్పినా పూల్లో నుంచి బయటకు రాలేదు. చివరకు అమ్మరాజశేఖర్ మాస్టర్, అవినాష్, మెహబూబ్ బ్రతిమిలాడడంతో తడి దుస్తులతో ఇంట్లోకి వెళ్లాడు. దుస్తులు మార్చుకోవాలని ఇంటి సభ్యులు చెప్పినా.. పట్టించుకోకుండా నేను గిట్లనే ఉంటా. ఏం చేస్తారో చూస్తా అంటూ తడి దుస్తులతో భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో అఖిల్ కలగజేసుకొని ఆయన్ని అలాగే వదిలేయండి అంటూ అవినాష్, మెహబూబ్లను పక్కకు తీసుకెళ్లాడు. దీంతో మరింత రెచ్చిపోయిన సోహైల్.. ఏంటి అఖిల్..నీకేం తెలుసు నా బాధ అంటూ ఫైర్ అయ్యాడు. బ్రతిమిలాడినకొద్ది నువ్వు ఎక్కువ చేస్తున్నావు. హౌస్మేట్స్తో ఇలాగేనా మాట్లాడేది అని అఖిల్ సోహైల్పై ఆగ్రహంవ్యక్తం చేశాడు. అనంతరం బెడ్పై కూర్చోబెట్టుకొని అలా మాట్లాడడం సరికాదని సూచించాడు. అయితే సోహైల్ మాత్రం ఎవరి మాటవినకుండా అరియానాపై అరుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో సోహైల్ మైక్ మర్చిపోయాడు. దీంతో బిగ్బాస్ మైక్ ధరించాలని సోహైల్కి సూచించాడు. ఇక మరోసారి క్రమశిక్షణ తప్పావంటూ.. అరియానా వచ్చి పనిష్మెంట్ కింద బిగ్బాస్కు క్షమాపణ చెప్పాలని కోరింది. కానీ సోహైల్ ఆ పనిచేయనని కరాఖండిగా చెప్పేశాడు. షూ లేస్ ఇవ్వకుంటే పనిష్మెంట్ ఇస్తా ఇక డే మొత్తం అరియానాపై చిందులేసిన సోహైల్.. సాయంత్రం సమయంలో ఆమెను కూల్ చేసే పనిలో పడ్డాడు. తన షూ లేస్ ఎక్కడ పెట్టావో చెప్పాలని అరియానాను అడిగాడు. అయితే తాను గత రెండు వారాల క్రితం తీసుకొని మళ్లీ ఇచ్చానని అరియానా చెప్పుకొచ్చింది. అయితే తనకు లేస్ ఇవ్వలేదని, అవి పోగొట్టిన కారణంగా పనిష్మెంట్ ఇస్తా అని సోహైల్ గొడవకు దిగాడు. దీంతో పనిష్మెంట్ ఏంటి అని అడిగింది అరియానా. ఆలోచించుకొని చెప్తా అంటూ.. వెళ్లిపోయాడు. ఆ తరువాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో ఈ ఇద్దరి మధ్య రచ్చ మరింత రెట్టింపు అయ్యింది. నామినేషన్ ప్రక్రియ షురూ.. మోతమోగిన కోడి గుడ్లు అయితే ఎప్పటిలా అందరికీ ఒకేసారి కాకుండా.. బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఎవరి పేరు చెప్తారో వాళ్లు వెళ్లి ఇద్దరి తలపై కోడు గుడ్లు పగలకొట్టాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఎగ్అంటే నాకు పడదని.. నా తలపై పగలగొట్టించుకోనానని బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసింది మొనాల్.. ఎలాగూ నామినేట్ అయినా బిగ్ బాస్ సేవ్ చేస్తూ ఉంటారు.. ఇక ఈ గుడ్డు కొట్టించుకోవడం నామినేషన్ అవసరమా బిగ్ బాస్ అనుకుందో ఏమో కానీ.. దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని బిగ్ బాస్ని ఏడుస్తూ రిక్వెస్ట్ చేసింది అతని దత్త పుత్రిక మోనాల్. అయితే మోనాల్ అడగాలే కాని బిగ్ బాస్ కాదంటారా.. మీకు బదులుగా మీరు నామినేట్ చేసేవాళ్ల తలపై పగల గొట్టాలని కోరవచ్చని చెప్పారు. ఈ సారి నామినేషన్ ప్రక్రియను కాస్త భిన్నంగా తిర్చిదిద్దాడు బిగ్బాస్. ఎప్పటిలాగా అందరిని ఒకేసారి కాకుండా.. బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఎవరి పేరు చెప్తారో వాళ్లు వెళ్లి ఇద్దరి తలపై కోడు గుడ్లు పగలకొట్టి నామినేట్కు గల కారణాలు చెప్పాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే తనకు కోడు గుడ్ వాసన పడదని, తన తలపై ఎగ్ పగలగొట్టకుండా చూడాలని మోనాల్ బిగ్బాస్ని రిక్వెస్ట్ చేసింది. దీంతో ఈ ప్రక్రియ నుంచి ఆమెకు మినాహాయింపు ఇస్తూ.. ఆమె నామినేట్ చేసేవాళ్ల తలపై వెరేవాళ్లు కోడి గుడ్లను పగలగొట్టవచ్చని అవకాశం ఇచ్చాడు. పెద్ద పుడింగిలా పీల్ అవ్వకు అరియానా : సోహైల్ మొదటిగా కెప్టెన్ అరియానాకి బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఆమె మొదటి గుడ్డుని హారిక తలపై పగలగొడుతూ.. రాక్షసుల టాస్క్లో ఆమె ప్రవర్తన నచ్చలేదని చెప్పింది. రెండో గుడ్డుని అందరూ ఊహించినట్లే తన చిలిపి శత్రువు సొహైల్ తలపై కొట్టింది. నేను స్ట్రిక్ట్గా కెప్టెన్సీ చేయాలని అనుకున్నా.. కానీ నువ్ మార్నింగ్ నేను పనిష్మెంట్ ఇచ్చినా నువ్ చేయను అని అన్నావ్ అందుకే నిన్ను నామినేట్ చేశా.. అని చెప్పింది. దీంతో సోహైల్ మరోసారి రెచ్చిపోయాడు. ‘ఇప్పటి వరకూ 8 మంది కెప్టెన్లు అయ్యారు.. నేనూ అయ్యా.. నీలా ఎవరూ చేయలేదు.. నీ యాటిట్యూడ్ చూపించకు.. నువ్ పెద్ద పుడింగిలా ఫీల్ అయిపోకు. గలీజ్ రీజన్ చెప్పి నామినేట్ చేయకు. కెప్టెన్ అయినంత మాత్రనా ఏది చెబితే అది చేయ్యం. నీ ప్రతాపం అంతా నామీద, మెహబూబ్ మీదే చూపిస్తావు. ఇది గలీజ్ నామినేషన్’ అంటూ అరియానాపై చిందులు వేశాడు సోహైల్. తెరపైకి చిల్లర కామెడీ.. అవినాష్-అభిల మధ్య మాటల యుద్దం ఇక రెండో అవకాశం అవినాష్ ఇచ్చాడు బిగ్బాస్. దీంతో అవినాష్ తన మొదటి గుడ్డుని అభిజిత్పై కొట్టాడు. నోయల్ చిల్లర కామెడీ అని అన్నప్పుడు నువ్వు లేచి సీరియస్ అవ్వడం నాకు నచ్చలేదు. నోయల్ పర్సనల్గా నన్ను టార్గెట్ చేసినప్పుడు మీరు మధ్యలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పాడు అవినాష్. ఇక రెండో గుడ్డును హారిక తలపై పగలగొట్టాడు. కేర్టేకర్ టాస్క్లో సరైన ఫర్మార్మెన్స్ ఇవ్వలేదని, టాస్క్ చేయకుండా నీకు ఇష్టమైన వాళ్ల దగ్గరు వెళ్లి కూర్చున్నావని చెబుతూ హారికను నామినేట్ చేశాడు. ఆ తరువాత సొహైల్ వంతు రావడంతో.. నాకు అరియానాని నామినేట్ చేయాలని ఉంది కానీ.. ఆమె కెప్టెన్ కావడంతో చేయట్లేదు. ఆమె నెక్స్ట్ వీక్ ఉంటే చేస్తా అని చెప్పి. మొదటి గుడ్డును మోనాల్ తలపై పగలగొట్టాడు. నువ్ ఇక్కడ విషయం అక్కడ అక్కడ విషయం ఇక్కడ చెప్పడం వల్ల అఖిల్కి నాకు మధ్య మనస్పర్థలు వస్తున్నాయని.. అంతేకాకుండా టాస్క్లలో బాగా ఆడటం లేదని అందుకే నామినేట్ చేస్తున్నానని మోనాల్తో చెప్పాడు సొహైల్. కేర్టేకర్ టాస్క్ ఇంకా బాగా ఆడితే బాగుండేదని చెప్పాడు. ఇక రెండో గుడ్డుని అభిజిత్పై కొట్టాడు. నాకు అబద్దాల కోరు అని ట్యాగ్ ఇచ్చారని నేను ఫీల్ అవుతున్నప్పుడు.. నువ్ వచ్చి అన్నీ నీకు సెట్ అవుతాయని అన్నావ్.. అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. అది కామెడీగా అన్నప్పటికీ కాస్త బాధ కలిగిందని చెప్పాడు. అయితే నేను మంచి చెబితే నువ్వు వేరేలా రీసీవ్ చేసుకున్నావ్.. ఇకపై నువ్వు నా మీద జోకులు వేయకు.. నేను నీమీద జోకులు వేయా అని అభిజిత్ చెప్పాడు. కామెడీ ఆపేస్తే బాగుంటుంది ఇక అభిజిత్.. అవినాష్ని నామినేట్ చేస్తూ.. నువ్ ఎప్పుడూ నేను ఎంటర్ టైన్మెంట్ చేస్తా, హెల్దీగా చేస్తా అని మీరు అనుకుంటారు తప్పితే.. నాకు అలా అనిపించదు. నువ్ కామెడీ చేయడానికి వచ్చి ఉండొచ్చు.. కానీ మేం కామెడీ తీసుకోవడానికి రెడీగా లేము.. కామెడీ ఆపేస్తే బాగుంటుందని అవినాష్కి చెప్పాడు. అయితే నేను ఇక్కడకి వినోదం చేయడానికి వచ్చా.. నేను కమెడియన్గా ఎంటర్టైన్ చేయడానికే వచ్చా.. చేస్తా నువ్ వద్దు అనుకుంటే రాకూడదు.. ప్రాణం పోయే వరకూ పెర్ఫామెన్స్ చేస్తా.. నువ్వేం చేయకుండా కూర్చుంటావ్.. నన్ను కామెడీ చేయొద్దని చెప్పడానికి నువ్ ఎవడివి? అంటూ అభిపై అవినాష్ ఫైర్ అయ్యాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. ఇక రేపటి ఎపిసోడ్లో కూడా కోడి గుడ్ల మోత మోగనుంది. అమ్మ రాజశేఖర్ చిందులు, అనూహ్యంగా అఖిల్ని మోనాల్ని నామినేట్ చేశాడు. అసలు అఖిల్ ఏ రీజన్తో మోనాల్ని నామినేట్ చేశాడో రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం. -
మోనాల్ ముద్దు.. అవినాష్కి పిల్ల దొరికేనా!
బిగ్బాస్ హౌజ్లోకి వెళ్లినప్పటి నుంచి అవినాష్ అక్కడి అమ్మాయిలతో పులిహోర కలుపుతూనే ఉన్నాడు. ఒక్క హారికను మినహా మిగతా అందరితో బాగానే ఆడుకుంటున్నాడు. ముఖ్యంగా మోనాల్తో అయితే చాన్స్ దొరికితే చాలు పులిహోర కలిపేస్తూనే ఉన్నాడు. మొదట్లో ఆమె అవినాష్ని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు అవినాష్ నువ్వు చేసే కామెడీ నాకు నచ్చలేదంటూ మొహం మీదే చెప్పేసింది. కానీ రోజులు గడుస్తున్న కొద్ది వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మోనాల్కి ట్రై చేస్తున్న ‘ఏ’ ల్లో అవినాష్ కూడా చేరిపోయాడు. (చదవండి : మాస్టర్ సంచలన నిర్ణయం.. భోరుమన్న మెహబూబ్) ఇక శనివారం నాటి ఎపిసోడ్లో కూడా మోనాల్తో అవినాష్ బాగానే పులిహోర కలిపాడు. మోనాల్ ముద్దు పెట్టిన తర్వాత అవినాష్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చేసి చూపించు అని అరియానాను హోస్ట్ నాగార్జున అడగ్గా.. అరియానా అవినాష్ని ఇమిటేట్ చేసి చూపించింది. దానికి వెంటనే అవినాష్ అలా కాదని, నాలాగా నేను బాగా యాక్ట్ చేస్తానని చెప్పాడు. దీంతో మోనాల్ పరుగున వచ్చి అవినాష్కు ముద్దు ఇచ్చింది. ఇంకేముంది అవినాష్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే నాగార్జున కలుగజేసుకొని అవినాష్కి పిల్లను ఇవ్వాలనుకుంటున్న వాళ్లంతా ఈ షో చూడండి అంటూ ఆట పట్టించాడు. అవినాష్ పెళ్లి టాపిక్ని హౌస్మేట్స్ పాటు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్బాస్ నాల్గో సీజన్ పూర్తయ్యేలోపు అవినాష్కు ఓ మంచి పిల్ల దొరుకాలని కోరుకుందాం. (చదవండి : బిగ్బాస్ : మోనాల్ని ముద్దు అడిగిన అఖిల్!) -
నోయల్ అవుట్, మోకరిల్లి దండం పెట్టిన అవినాష్
నోయల్ అభిమానులకు చేదువార్త. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో రీఎంట్రీ ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో అతడు నోయల్ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని షో నుంచి నిష్క్రమించాడు. హౌస్లో ఉన్నన్ని రోజులు బాబాగా ఉన్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం నిజమైన నోయల్ కనిపించాడు. తాను చెప్పాలనుకున్న మాటలను తూటాలుగా మలిచి కంటెస్టెంట్ల మీదకు వదిలాడు. మరికొందరికి మంచి మాటలతో పూల బాణాలను వదిలాడు. మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే దీన్ని చదివేసేయండి.. కులు మనాలీ నుంచి కొత్త బట్టలు తెచ్చిన నాగ్ ఈ మధ్య ఎలిమినేషన్స్ అన్ఫెయిర్గా ఉంటున్నాయని బిగ్బాస్ షోపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై హోస్ట్ నాగార్జున ఓ క్లారిటీ ఇచ్చారు. మీరు వేసే ఓటును బట్టే ఎలిమినేషన్ జరుగుతుందని కుండ బద్ధలు కొట్టి చెప్పారు. ఇక కులు మనాలీ నుంచి వస్తూ వస్తూ కంటెస్టెంట్ల కోసం కొత్తబట్టలు కూడా తీసుకురావడం విశేషం. అనంతరం అఖిల్, సోహైల్ను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి వీడియో చూపించారు. ఇందులో ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయ్ అని సోహైల్ మోనాల్కు మంచి మాటలు చెప్పాడు. అయినా ఆమె మారకపోగా అఖిల్ దగ్గరకు వెళ్లి సోహైల్ నీ గురించి మాట్లాడుతున్నాడని చెప్పడంతో వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే ఈ వీడియో ద్వారా అసలేం జరిగిందనేది వారికి ఓ క్లారిటీ వచ్చింది. దీంతో వీళ్ల మధ్య అపార్థాలు తొలిగిపోయాయి. మాస్టర్ స్వార్థం కోసం అరియానాకు సాయం అనంతరం మోనాల్కు బిగ్బాస్ ఓ వీడియో చూపించాడు. మోనాల్ నన్ను మోసం చేసింది అని అభి మాట్లాడినదానితో పాటు, ఆమె ఒంటెలా నడుస్తుందని కామెంట్ చేశాడు. లాస్య, నోయల్ కూడా తన గురించి అభికి చెప్పడాన్ని చూపించాడు. దీనిపై నాగార్జున స్పందిస్తూ కొన్నిసార్లు పక్కనున్న వాళ్ల ద్వారా కూడా దూరాలు పెరుగుతాయని హెచ్చరించారు. ఇక అరియానాకు మాస్టర్ మాట్లాడిన వీడియో చూపించారు. నీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాస్టర్ నీకు సాయం చేశాడని నాగ్ స్పష్టం చేశారు. ఈ విషయం గురించి అరియానా మాట్లాడుతూ.. కెప్టెన్ కావాలని కలలు కన్నాను, కానీ అయ్యాక చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది. (చదవండి: కాబోయే భార్య ఎలా ఉండాలంటే..: అఖిల్) సోహైల్కు అరియానా విలన్, కానీ ఆమెకు మాత్రం కాదు ఈ 56 రోజుల జర్నీలో విలన్ ఎవరు? అంటూ నాగ్ కంటెస్టెంట్లతో ఓ ఆట ఆడించారు. అఖిల్ తనకు అభిజిత్ విలన్ అని, సోహైల్కు అరియానా, అమ్మ రాజశేఖర్కు అభిజిత్, హారికకు మెహబూబ్, మెహబూబ్కు హారిక, అవినాష్కు లాస్య, లాస్యకు అవినాష్, అరియానాకు అఖిల్, అభిజిత్కు మాస్టర్, మోనాల్కు లాస్య విలన్గా అనిపించారని చెప్పుకొచ్చారు. తర్వాత అఖిల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. (చదవండి:సంకేతాలిచ్చిన బిగ్బాస్: మాస్టర్ ఎలిమినేట్?!) ఫస్ట్ వీక్లోనే నాకు నొప్పి స్టార్ట్ అయింది: నోయల్ నోయల్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అతడు హౌస్లో ఉండటం సరికాదని వైద్యులు సూచించార, దీంతో అతడు వెళ్లిపోతున్నట్లు నాగ్ వెల్లడించారు. తనకు 'ఆంక్లియో స్పాంటిలైటిస్' ఉందని, హౌస్లోకి వెళ్లిన మొదటి వారంలోనే కాళ్ల నొప్పి ప్రారంభమైందని నోయల్ తెలిపాడు. అయినా సరే ఆ నొప్పిని పంటికింద భరిస్తూ, అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ హౌస్లో రెండు సార్లు కెప్టెన్ అవడం విశేషం. ఇక నోయల్.. అవినాష్, అమ్మ రాజశేఖర్లను ఒంటికాలి మీద నిలబడమని పనిష్మెంట్ ఇచ్చాడు. అభి, హారిక, లాస్య టాప్ 5లో ఉండాలన్నాడు. మోనాల్ను ఏడవద్దని, లాస్యను దేన్నీ పట్టించుకోవద్దని, సోహైల్ను చిన్న పిల్లాడని చెప్పుకొచ్చాడు. హౌస్లో తన వెన్నెముక నోయల్ వెళ్లిపోతున్నాడంటూ హారిక ఏడ్చేసింది. ఆమెను బుజ్జగించడం కోసం ఓ ర్యాప్ సాంగ్ పాడి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. నా బాధను హేళన చేశారు: నోయల్ ఆ తర్వాత ఒంటికాలిపై నిల్చున్న ఆ ఇద్దరినీ కాళ్లు నొప్పెట్టాయా? అని అడగ్గా అవునని తలూపారు. దీని కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ నొప్పి ప్రతిరోజూ అనుభవిస్తున్నానని నోయల్ తన బాధను బయటకు కక్కాడు. "నాకు ఆంక్లియోస్పాటిలైసిస్ ఉంది. పొద్దున లేచాక అరగంట కాళ్లు స్ట్రెచ్ చేసుకుంటేనే నడగలను. దాన్ని మీరిద్దరూ జోక్ చేస్తారేంటి?" అని నిలదీశాడు. తాను ఎలా నడిచానో చూపిస్తూ అవినాష్ ఎగతాళి చేశాడని చెప్పాడు. కానీ అతడి కాలికి దెబ్బ తగిలినప్పుడు తాను కట్టు కట్టానని పేర్కొన్నాడు. దీంతో అవినాష్ "మీరు కావాలని ఇద్దరినీ బ్యాడ్ చేస్తున్నారని మండిపడ్డాడు. ప్రేక్షకుల ముందు బ్యాడ్ చేయొద్దని హితవు పలికాడు. చిల్లర కామెడీ అయితే ఇక్కడి వరకు వస్తానా? "అని ఆవేశంతో ఊగిపోగా ఇవే తగ్గించుకుంటే మంచిదని నోయల్ సమాధానమిచ్చాడు. (చదవండి:సోనూసూద్, మోనాల్కు సపోర్ట్ చేయండి) మోకరిల్లి సారీ చెప్పినా కనికరించని నోయల్ అలా అయితే నువ్వు ఇన్నిరోజులు నటించావంటూ అవినాష్ నోయల్ను తప్పు పట్టాడు. కామెడీని తక్కువ చేసి మాట్లాడొద్దని సూచించాడు. "మిమిక్రీని తప్పు పడుతున్నావు, కళామతల్లిని అవమానిస్తున్నావు అంటూ అవినాష్ అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించినట్లు కనిపించింది. కానీ చివరికి మాత్రం మోకాళ్లపై మోకరిల్లి రెండు చేతులు జోడించి సారీ చెప్పాడు. తప్పు చేసి సారీ చెప్పడం పెద్దరికం కాదని నోయల్ చెంపపెట్టుగా సమాధానమిచ్చాడు. అనంతరం లాస్య సేఫ్ అయినట్లు ప్రకటించారు. చివరగా ర్యాప్ సాంగ్తో నోయల్ వీడ్కోలు తీసుకున్నాడు. ఇన్నిరోజులు అతడు కేవలం శారీరక బాధనే కాకుండా మనాసిక వేదనను కూడా భరించినట్లు నేటి ఎపిసోడ్తో రుజువు అయింది. -
రెచ్చిపోయిన నోయల్; ఆ ఇద్దరికీ వాచిపోయిందంతే!
నేటి బిగ్బాస్ ఎపిసోడ్లో పెద్ద ట్విస్టులే చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న నోయల్ స్టేజీ మీదకు వచ్చాడు. నాగార్జున పక్కనే ఉండి కంటెస్టెంట్లతో మాట్లాడుతున్నాడు. ఈ మేరకు స్టార్ మా తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది. అయితే నోయల్స్టేజీ మీద ఉండటంతో అతడు శాశ్వతంగా హౌస్ నుంచి వెళ్లిపోతున్నాడా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఇంట్లో కొంత కాలంగా నోయల్ కాలి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రోమోలో నోయల్ మాట్లాడుతున్నదాన్ని బట్టి చూస్తే అతడు మానసికంగానూ నరకం అనుభవించినట్లు తెలుస్తోంది. అతడి దీనావస్థను చూసి తోటి కంటెస్టెంట్లు జాలి పడాల్సింది పోయి పుండు మీద కారం చల్లినట్లుగా వెటకారాలు చేశారట. నోయల్ కుంటిగా ఎలా నడుస్తాడో చూపిస్తూ అవినాష్, నోయల్ పరిస్థితి మీద జోకులు చేస్తూ మాస్టర్ అతడిని హేళన చేస్తూ మానసికంగా వేధించారట. వారి వైఖరిని నోయల్ ఆ సమయంలోనే ఖండించాడో తెలీదు కానీ నేడు మాత్రం ఆ ఇద్దరినీ దుమ్ము దులిపాడు. (చదవండి: బిగ్బాస్: సగం కాలం గడిచిపోయాక మంగ్లీ ఎంట్రీ?) ఈ మేరకు నోయల్.. అమ్మ రాజశేఖర్, అవినాష్లను కాసేపు ఒంటికాలిపై నిలబడమన్నాడు. కానీ కాసేపటికే వాళ్లు నొప్పి తాళలేకపోయారు. మీరు పడ్డ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ నొప్పి తనకు రోజూ ఉంటుందని, దాన్ని మీరు జోక్ చేస్తారేంటని నిలదీశాడు. అసలు మీ ప్రవర్తనతో ఏం చెప్పాలనుకుంటారని ప్రశ్నించాడు. తర్వాత అవినాష్ అసలు రంగును కూడా బట్టబయలు చేశాడు. నేనెలా నడుస్తానో అవినాష్ నడిచి చూపిస్తున్నాడు, మీరు రెండు నిమిషాలు నిలబడలేకపోయారు. మరి నాకు ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? అంటూనే ఈ చిల్లర కామెడీలు ఏంటని విమర్శించాడు. దీంతో ఆగ్రహించిన అవినాష్.. మీరు వెళ్తూ వెళ్తూ ఇద్దరిని బ్యాడ్ చేయాలని ఫిక్సయ్యారు అని నోయల్పై మండిపడగా అతడు మాత్రం పిచ్చ లైట్ అంటూ ఎందుకు నటిస్తున్నావ్ అవినాష్? అని కౌంటరిచ్చాడు. దీంతో అవినాష్ ఆవేశం మీద నీళ్లు గుమ్మరించినట్లైంది. ఈ ప్రోమోపై నెటిజన్లు స్పందిస్తూ నోయల్ బాధలో అర్థం ఉందంటూ అతడికి మద్దతిస్తున్నారు. అయితే అవినాష్.. వెళ్లిపోయే ముందు బ్యాడ్ చేస్తున్నావ్ అనడాన్ని బట్టి చూస్తే నోయల్ ఎలిమినేట్ అవుతున్నాడేమో అని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: నీకోసం ఎదురు చూస్తూ ఉంటా: హారిక) -
మోనాల్ బ్రష్ చేశావా? లేదా?: అవినాష్
ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారిన బీబీ డేకేర్ టాస్క్కు బిగ్బాస్ శుభంకార్డు పలికిన విషయం తెలిసిందే. అయితే ఈ టాస్కులో చంటిపిల్లలా మారిన హారిక అమ్మ రాజశేఖర్ దగ్గర చాక్లెట్లు కొట్టేసింది. దీంతో అతడు పెద్ద సీనే క్రియేట్ చేశాడు. హారిక స్నేహితుడు అభిజిత్ కూడా ఆమె వైఖరిని తప్పుపట్టి నిందించడం గమనార్హం. దీంతో హర్టైన హారిక కన్నీళ్లు పెట్టుకుంటూ మాస్టర్ దగ్గరకు వెళ్లి అతని చాక్లెట్ను తిరిగిచ్చేసింది మరోవైపు మెహబూబ్ పిల్లాడిలా నవ్వుతూ అరియానాకు పదే పదే ఐ లవ్ యూ చెప్పడం గమనార్హం. (చదవండి: బిగ్బాస్ టాప్ 5లో ఉండేది వాళ్లే: కౌశల్) ఇక టాస్క్లో ఆడుకుంది చాలదని నేడు అవినాష్ ఇంటిసభ్యులను ఆటపట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. హారికను చూసి వావ్ అని పొగుడుతూ చివర్లో తాను పరోటా బాగుంది అన్నానని పంచ్ వేశాడు. తన జుట్టు ఏమైనా పెరిగిందా? అని హారిక అడగ్గా, ఘోరంగా పెరిగిందంటూ అవినాష్ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఆమె రెండు తగిలించి బుద్ధి చెప్పింది. మాస్టర్తో కలిసి మోనాల్ దగ్గరకు వెళ్లి పులిహోర కలుపుదామని ప్రయత్నించాడు. ఇంతకీ బ్రష్ చేశావా? లేదా అంటూనే తలకు నూనె పెట్టుకుందని అక్కడి నుంచి జారుకున్నారు. మరి అందరినీ ఆడుకుంటున్న ఈ ఇద్దరికీ ఎవరైనా కౌంటర్ ఇస్తారేమో చూడాలి. (చదవండి: సమంత హోస్టింగ్పై నెటిజన్ల రియాక్షన్!) -
బిగ్బాస్: అవినాష్కు ముద్దు పెట్టిన మోనాల్
నామినేట్ చేయాలనుకున్న వ్యక్తితో ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలి తప్ప వేరొకరిని మధ్యలోకి లాగకూడదని నాగార్జున ఇదివరకే వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే నిన్న అమ్మ రాజశేఖర్ అఖిల్ను నామినేట్ చేస్తూ అభిజిత్, మోనాల్ విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో మోనాల్ ఖంగు తింది. మరోవైపు నువ్వు పెద్ద తప్పు చేశావు అంటూ అభి వేలెత్తి చూపడం ఆమె తట్టుకోలేకపోయింది. ప్రతివారం నామినేషన్ లాగే ఈసారి కూడా మళ్లీ ఏడ్చేసింది. దీంతో ఆమె బాధను పోగొట్టేందుకు అఖిల్ అభితో మాట్లాడేందుకు సిద్ధమయ్యాడు. ఆమెను నవ్వించేందుకు అవినాష్ రెడీ అయ్యాడు. (అమ్మతోడు, నీకు చుక్కలు చూపిస్తా: అరియానా) అవినాష్కు ముద్దు, షాక్లో అరియానా "నువ్వు మారిపోయావు, ఛీ ఛీ" అంటూ అలక నటించాడు. దీంతో పక్కన అఖిల్ ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి మోనాల్ పరుగెత్తుకుంటూ వెళ్లి అవినాష్ నుదుటిపై ముద్దు పెట్టింది. దీంతో పక్కనే ఉన్న అరియానా ఒక్కసారిగా షాక్ తింది. ఇక ఊహించని ఆఫర్ దక్కినందుకు అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నా పొలంలో మొలకలొచ్చాయ్ అంటూ గాల్లో తేలిపోయాడు. మోనాల్ దృష్టిలో ఏ అంటే అవినాష్, అందుకే నాకు ముద్దు పెట్టింది అంటూ ఎగిరి గంతులేశాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మోనాల్ మిగతా ఏలతో ఉండే బదులు అవినాష్తో ఉంటే ఏడవాల్సిన పనే ఉండదని, ఎప్పుడూ నవ్వుతూనే చూడొచ్చని అభిప్రాయపడుతున్నారు. (దివి గర్ల్ఫ్రెండ్ అట, తెగ ఫీలవుతున్న మాస్టర్) -
అభిజిత్కు అన్యాయం చేసిన అరియానా
బిగ్బాస్ నాల్గో సీజన్లో ఏడో కెప్టెన్గా అవినాష్ ఎన్నికయ్యాడు. కెప్టెన్ అయ్యాడన్న మాటేకానీ తన స్నేహితురాలు అరియానా కెప్టెన్ అవ్వలేదన్న బాధే అతనిలో ఎక్కువగా కనిపించింది. ఇక అరియానాకి ఉన్న క్లారిటీ రోజురోజుకూ పెరిగిపోతోంది. బిగ్బాస్ ఇచ్చిన ట్విస్ట్లో అభిజిత్ కోసం అందరి కడుపులు మాడ్చుతుందా అనుకునే సమయానికి ఆమె రేషన్ తీసుకునేందుకు మొగ్గు చూపడం ప్రశంసలు అందుకుంటోంది. తనకు ఉన్న క్లారిటీ ఇంట్లో ఎవరికీ లేదని నిరూపించింది. మరోవైపు బయట జరిగిన విషయాల కోసం అమ్మ రాజశేఖర్, నోయల్ గొడవపడ్డారు. దీంతో వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. నువ్వు ప్రామిస్ మీద నిలబడలేదు: మాస్టర్ నోయల్ మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారని అభిజిత్ మాస్టర్ను ప్రశ్నించాడు. నవ్వుతూనే మొదలైన ఈ చర్చ నెమ్మదిగా గొడవకు దారి తీసింది. తన సినిమాకు ర్యాప్ సాంగ్ రాసివ్వమని చెప్పాను. కానీ అది చేయలేదని మాస్టర్ నోయల్పై మండిపడ్డాడు. మళ్లీ అంతలోనే మాట మారుస్తూ.. రాశావు, కానీ అందరికీ అర్థం అయ్యేలా రాయమని అడిగా, కానీ ఆ ప్రామిస్ మీద నిలబడలేదని తప్పు పట్టాడు. దీనిపై నోయల్ మాట్లాడుతూ.. తాను రాసిచ్చానని, పాట కూడా రిలీజ్ అయిందని చెప్పాడు. దానికి తనకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని కూడా ఇంతవరకు ప్రశ్నించలేదని చెప్పుకొచ్చాడు. ఈ గొడవతో మనసు పాడైన నోయల్ అభిపై తన విసుగును ప్రదర్శించాడు. ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడిగాడు. మరోవైపు ఆవేశం తగ్గని మాస్టర్ మాత్రం.. కెమెరా కోసం డైలాగులు చెప్తావు, ప్రామిస్ మీద నిలబడే క్యారెక్టర్ కాదు. బయటకు వెళ్లిపోయినా కూడా నిన్ను ఎన్ని అనాలో అనేస్తాను అంటూ హెచ్చరించాడు. (చదవండి: నువ్వు పెద్ద తోపు, తురుమేం కాదు: అఖిల్) నా భర్త యాక్టర్: మోనాల్ తర్వాతి రోజు ఉదయం మాస్టర్ను చూసి విలన్లా ఉన్నావని సోహైల్ అన్నాడు. డ్యాన్స్ బాగా చేస్తున్నావు కానీ ఒక్క స్టెప్పు నేర్పించలేదని దివి బుంగమూతి పెట్టుకుంది. ఈ వయసులో కూడా బాగా చేస్తున్నాడు అని సోహైల్ పంచ్ వేశాడు. ఇది మనసులో పెట్టుకున్న మాస్టర్ దివి పక్కకు వెళ్లగానే అతడికి అక్షింతలు వేశాడు. పక్కన గర్ల్ఫ్రెండ్ ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంట్రా అని ప్రశ్నించాడు. నువ్వు నన్ను అలా అనగానే దివి ఫీలైందని, నిజానికి తన డ్యాన్సు చేసి ఆమె పడిపోయిందని మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఇక మోనాల్ అఖిల్ను సరదాగా ఓ ఆటాడుకుంది. తన భర్త నటుడని పేర్కొంది. అన్ని భాషల్లో నటిస్తాడని సిగ్గులు ఒలకబోసింది. కానీ పేరు అడిగితే మాత్రం గుజరాత్తో పేరు చెప్పరంటూ తప్పించుకుంది. (చదవండి: బిగ్బాస్: మామ స్థానంలో కోడలు సామ్?) మాస్టర్ సైగతో అవినాష్ స్టేషన్లోకి మోనాల్ బండి తోయరా బాబు కెప్టెన్సీ టాస్కులో అరియానా, అవినాష్ తలపడ్డారు. ఎవరి స్టేషన్లో ఎక్కువ మందిని తోసి దింపేస్తారో వారే గెలిచినట్లు లెక్క. ఇద్దరూ చెరో ఐదుగురిని తమతమ స్టేషన్లలో దింపడంతో గేమ్ టై అయింది. దీంతో ప్రత్యర్థి టీమ్లో దింపినవాళ్లను ఆకర్షించి తమ స్టేషన్కు రప్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం పోటీదారులిద్దరూ ఇంటిసభ్యులతో బేరసారాలు జరిపారు. తనకోసం నామినేట్ అయినందుకు సోహైల్ అవినాష్ను సపోర్ట్ చేయక తప్పలేదు. వారమంతా ఏ పనీ చేయనన్న అభిజిత్ మాటకు అంగీకరించినందుకు అతడు అవినాష్ టీమ్లోనే ఉండిపోయాడు. కానీ చివరి నిమిషంలో మోనాల్ను రమ్మని మాస్టర్ సైగ చేయడంతో ఆమె అవినాష్ టీమ్లోకి వచ్చేసింది. కానీ దివి మాత్రం ఎంతకూ రాలేదని మాస్టర్ ఆమెతో ఇక ఫ్రెండ్షిప్ కట్ అన్నాడు. ఇక టాస్క్ ముగిసే సమయానికి అవినాష్ స్టేషన్లో ఆరుగురు(అఖిల్, మోనాల్, లాస్య, అభిజిత్, మాస్టర్, సోహైల్) ఉండటంతో అతడు గెలిచి కెప్టెన్ అయ్యాడు. కఠిన రూల్స్ ప్రవేశపెట్టిన అవినాష్ తాను కెప్టెన్ అయితే అరియానా కూడా కెప్టెన్ అయినట్టేనని వెల్లడించాడు. అనంతరం ఆమెను రేషన్ మేనేజర్గా ఎన్నుకున్నాడు. అవినాష్ ఇంట్లో కొత్త రూల్స్ పెట్టాడు. ఎవరైనా మైక్ మర్చిపోతే... 50 సార్లు మైక్ మర్చిపోయానని చెప్పాలని ఆదేశించాడు. రెండుసార్లు కన్నా ఎక్కువ నిద్రపోతే రెండుసార్లు స్విమ్మింగ్ పూల్లో దూకాలి. తెలుగులో మాట్లాడకపోతే కెమెరా దగ్గరకు వెళ్లి ఇంకోసారి ఇంగ్లీషులో మాట్లాడను అని చిన్నపిల్లాడిలా నటిస్తూ చెప్పాలని పేర్కొన్నాడు. వీటన్నింటికీ ఇంటిసభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తలాడించడం విశేషం. తర్వాత రేషన్ మేనేజర్ అరియానాను బిగ్బాస్ ఇరకాటంలో పడేశాడు. (చదవండి: బిగ్బాస్: మోనాల్ కోసం అరియానా త్యాగం అభిజిత్ లగేజీ వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయింది అభిజిత్ వస్తువులు లేదా రేషన్ సరుకుల్లో ఏదో ఒకటిని మాత్రమే తీసుకోవాలని చెప్పాడు. అందరూ అరియానా రేషన్ సామాను పట్టుకొస్తుందనుకున్నారు. కానీ ఆమె మాత్రం మరోలా ఆలోచించింది. తోటి కంటెస్టెంటు బట్టలు లేకుండా సీజన్ మొత్తం బాధపడటం నాకిష్టం లేదు, కావాలంటే ఈ ఒక్కవారం ఎలాగోలా అందరం సర్దుకుపోతాం అని ఆమె చెప్పుకొచ్చింది. కానీ చివరి నిమిషంలో మాత్రం ఇంటిసభ్యులు ఆకలితో అలమటించడం ఇష్టం లేదని, అభికి సారీ చెప్తూ రేషన్ తీసుకువచ్చింది. ఇక రాత్రిపూట హారిక అద్దంపై తాను బిగ్బాస్ విన్నర్ అని రాసుకుని మురిసిపోయింది. -
అమ్మతోడు, నీకు చుక్కలు చూపిస్తా: అరియానా
కంటెస్టెంట్లు కలిసిపోయేలా బిగ్బాసే ప్లాన్ చేస్తాడు. మళ్లీ వారిని విడదీసేందుకు పథకాలు రచిస్తాడు. స్నేహితుల మధ్య నామినేషన్ చిచ్చు పెడతాడు. ఇలా హౌస్లో జరిగే అన్నింటికి కర్త, కర్మ, క్రియ బిగ్బాస్. కాగా ఇంట్లో అరియానా, అవినాష్ మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే. రాక్షసుల టాస్కులోనూ వీరిద్దరూ రెచ్చిపోయి ఆడుతూ విజయానికి అడుగు దూరంలో ఆగిపోయారు. కానీ టాస్కులో బెస్ట్ పర్ఫార్మర్లుగా నిలిచి కెప్టెన్సీ కోసం తలపడనున్నారు. అరియానా బలాబలాలు తెలిసిన అవినాష్ ఆమెతో ముందుగానే డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు. 'నువ్వు కెప్టెన్ అయితే నేను అసిస్టెంట్ కెప్టెన్' అని చెప్పుకొచ్చాడు. కానీ ఆమె మాత్రం "ఒకవేళ నేను గెలిస్తే అమ్మతోడు నీకు చుక్కలు చూపిస్తా"నని వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: నువ్వు పెద్ద తోపు, తురుమేం కాదు: అఖిల్) ఇక అఖిల్ అరియానాను చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుంటే అవినాష్ తట్టుకోలేకపోయాడు. ప్లీజ్ చేయి తీసేయని అడిగితే అఖిల్ మరింత దగ్గరగా పట్టుకున్నాడు. దీంతో అతడు మోనాల్ను పట్టుకోబోతే ఆమెను కూడా దగ్గరకు తీసుకుని హత్తుకుంటూ అవినాష్ను మరింత ఉడికించాడు. ఇక బిగ్బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్కులో శక్తిసామర్థ్యాలు చూపించాల్సి ఉంటుంది. మరి ఈ టాస్కులో ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారనేది చూడాలి. మరోవైపు ఒకటే టీ షర్టును మార్చి మార్చి వేసుకుంటున్న అభిజిత్ దుస్తులను బిగ్బాస్ తిరిగి పంపించాడు. కానీ ఓ ట్విస్టు ఇచ్చాడు. రేషన్ కావాలా? అభిజిత్ సూట్కేసు కావాలా? అని అరియానాను అడిగాడు. దీన్ని బట్టి అరియానా కెప్టెన్సీ టాస్క్లో ఓడిపోయి రేషన్ మేనేజర్గా ఎన్నికైనట్లు కనిపిస్తోంది. మరి ఆమె ఒక్కరి కోసం అందరికీ అవసరమయ్యే సరుకును త్యాగం చేస్తుందా? లేదా అభి సూట్కేసును వెనక్కు పంపించేసి రేషన్ సామాను తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్బాస్: కుమార్ సాయిని గెంటేశారు!) -
నరకం చూపించిన ఆ ఇద్దరే బెస్ట్ పర్ఫార్మర్లు
మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధంలో రాక్షసులు విచ్చలవిడిగా ప్రవర్తించారు. నానారకాలుగా హింసిస్తూ చెలరేగిపోయారు. అయినా సరే చెడుపై విజయం సాధించింది. రాక్షసులపై మంచి మనుషుల టీమ్ గెలిచింది. ఈ క్రమంలో కొందరికి చిన్నపాటి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. అయినా సరే వాటిని లెక్క చేయకుండా టాస్కే మాకు సర్వస్వం అన్న రీతిలో రెచ్చిపోయి మరీ ఆడారు. మరి బిగ్బాస్ ఇచ్చిన ఈ ఈ టాస్కులో ఎవరు బాగా ఆడారు? ఎవరి ఐడియా వర్కవుట్ అయిందో చదివేసేయండి.. రాక్షసుల టీమ్ వాళ్లు నన్ను వదిలేశారు: హారిక కొంటె రాక్షసులను మంచి మనుషులుగా మార్చేందుకు మరో టాస్క్ ఇచ్చాడు. గుండంలో ఉన్న బస్తాలను బయట పడేసి వారు లోపలే ఉండాల్సి ఉంటుంది. కానీ వాళ్లు బయట పడేసిన ప్రతీసారి రాక్షసులు లోపలకు వేశారు. దీంతో బస్తాలు మరోసారి లోపలకు వేయకుండా మంచి మనుషులు వాటిని స్విమ్మింగ్ పూల్లో వేశారు. ఇన్ని చేసినా సరే మంచి మనుషులు ఆ టాస్కులో గెలవలేకపోయారు. ఇక రాక్షసిగా ఉన్న తాను మంచిమనుషులకు ఎలా దొరికిపోయానన్నది హారిక లాస్యతో చెప్పుకొచ్చింది. అరియానా, అవినాష్, మెహబూబ్ తనను వదిలేసి ముగ్గురూ ఒకే వాష్రూమ్లో దూరిపోయారని చెప్పింది. అందుకు హర్ట్ అయ్యానంది (చదవండి: సోహైల్కు హారిక పంటిగాట్లు, ఎవ్వరినీ వదల్లేదు) ఇంకా టార్చర్ చేయాలనుంది: అరియానా ఇక తర్వాతి రోజు అరియానా ఇవాళ ఇంకా టార్చర్ చేయాలనిపిస్తుందని మాస్టర్తో అంది. తీరా అన్నంతపనే చేసింది. సోహైల్, అఖిల్ షూలను ఎక్కడపడితే అక్కడ విసిరేసింది. పైగా అఖిల్తో సారీ చెప్పించుకుంది. ఇక అవినాష్.. లాస్యతో విసనకర్ర విసిరించుకున్నాడు. మొత్తానికి అందరి బట్టలను కింద పడేసి హౌస్ను చెత్తకుప్పగా తయారు చేశారు. కళ్ల ముందు జరుగుతున్న ఘోరాలను చూసి లాస్య ఏడ్వలేక నవ్వింది. (చదవండి: అభి, దివికి అహంకారం, మెహబూబ్ వాడుకుంటున్నాడు) మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్.. లాస్య పంచ్ ఆ కోపంలోనే అరియానా, అవినాష్లను 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అని పంచ్ కూడా వేసింది. కానీ వాళ్లు అందుకు ప్రతీకారంగా ఆమె దుస్తులను కింద పడేశారు. దీంతో ఆమె తన మాటను వెనక్కు తీసుకుని 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని పొగిడింది. అప్పటివరకు రెచ్చిపోయిన అవినాష్ మోనాల్ రాగానే సైలెంట్ అయిపోయాడు. కాసేపటివరకు ఇద్దరు గుసగుసలు పెట్టుకున్నారు. ఆమెను వదిలి రాబుద్ధి కావడం లేదని వాపోయాడు. మరోవైపు సోహైల్ తనంతట తానుగా బట్టలు పడేయకపోతే అందరివీ పారేస్తానని మెహబూబ్ వార్నింగ్ ఇవ్వగా.. టైమ్ బ్యాడ్ అనుకుని చిరాకుతో అప్పటివరకు సర్దుకున్న అన్నింటిని సోహైల్ కింద పడేశాడు. అరియానాను పూల్లో తోసేసిన మాస్టర్ కుండలతో స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు తీసుకుని డ్రమ్ములు నింపాలని మంచి మనుషులకు మరో టాస్క్ ఇచ్చాడు. మెహబూబ్ కుండలకు చిల్లులు పెడుతూ వాటిని పగలగొట్టాడు. దీంతో అభిజిత్ సీరియస్ అయ్యాడు. అయినా సరే మెహబూబ్ డ్రమ్మును బోర్లించగా, అదే సమయంలో అక్కడున్న తనకు దెబ్బ తగిలిందని అఖిల్ గరమయ్యాడు. నీళ్లెలా పోస్తారో చూస్తానన్నట్టు డ్రమ్ముపై కూర్చున్న మెహబూబ్ను సోహైల్ ఆ డ్రమ్మును ఎప్పటిలా పెట్టేశాడు. తర్వాత అరియానాను మాస్టర్ స్విమ్మింగ్ పూల్లో తోసేశాడు, కానీ తాను తోయలేదని బుకాయించాడు. (చదవండి: కెప్టెన్గా నోయల్, కానీ తప్పని ముప్పు) నువ్వు పెద్ద తోపేం కాదు: అఖిల్ ఇక స్విమ్మింగ్ పూల్లో తనను అడ్డుకుంటున్న అవినాష్ను మోనాల్ కొరికేసింది. వీళ్లను దాటుకుని టాస్కు గెలవలేమని భావించిన నోయల్ ఓ ఐడియా చెప్పాడు. డ్రమ్ములను స్విమ్మింగ్ పూల్లో పడేసి నింపుదామన్నాడు. ఈ ప్లాన్ వర్కవుట్ అయి వారి విజయానికి కారణమైంది. మరోవైపు టాస్కులో చాలా క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నావని అఖిల్ మెహబూబ్ను అన్నాడు. నన్ను ఆపలేక అంటున్నావా? అని అతడు రివర్స్ కౌంటరివ్వడంతో "నువ్వు పెద్ద తోపు, తురుము ఏం కాదు, దమ్ముంటే నా దగ్గరకు రా" అని అఖిల్ సవాలు విసిరాడు. చివరాఖరకు ఈ టాస్కులో మంచి మనుషుల టీమ్ గెలవడంతో అవినాష్ను తమలో కలుపుకుపోయారు. (చదవండి: నాన్న ఇస్త్రీ పని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్: నోయల్) మెహబూబ్కు బిగ్బాస్ పంచ్ ఒక కొంటె రాక్షసుడిని ఎత్తుకుని ఎండ్ బజర్ మోగేసరికి నేలపై లేకుండా చూసుకోవాలని బిగ్బాస్ చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. దీంతో అరియానా అడ్డంగా దొరికిపోయింది. ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుని అరియానాను మంచి మనిషిగా మార్చేశారు. మిగిలిన మెహబూబ్ కూడా వాళ్లలో కలిసిపోయాడు. మంచి మనిషిగా మారిన మెహబూబ్, మైకు ధరించడం కూడా మంచి లక్షణమే అని బిగ్బాస్ పంచ్ వేయడంతో ఇంటిసభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. కెప్టెన్ నోయల్ ఈ టాస్కులో బెస్ట్ పర్ఫార్మర్గా అరియానా, అవినాష్ పేర్లను వెల్లడించాడు. వీరిద్దరూ కెప్టెన్సీ కోసం పోటీ పడుతారు. మరి రేపటి ఎపిసోడ్లో ఎవరు కెప్టెన్ అవనున్నారనేది చూడాలి.. -
అఖిల్, మెహబూబ్ మధ్య మాటల యుద్ధం
బిగ్బాస్ అంటేనే ఒక బొమ్మలాట. కంటెస్టెంట్లతో రకరకాల ఆటలాడిస్తాడు. నటించాలంటాడు, నవ్వించాలంటాడు, ఎమోషన్స్ దాచేయాలంటాడు. ఇప్పుడు ఇచ్చిన టాస్క్ కూడా అలాంటి కోవకు చెందినదే. ఇందులో రాక్షసులు ఎన్ని వేషాలేసినా, రాచిరంపాలు పెట్టినా మంచి మనుషుల టీమ్లోని సభ్యులు మాత్రం వీసమెత్తు కోపం ప్రదర్శించకూడదు. ఇది అభిజిత్కు ఈజీయేమో కానీ సోహైల్కు మాత్రం కఠిన పరీక్ష అనుకున్నారంతా. కానీ టాస్క్ మొదలయ్యేసరికి అందరి ఊహలు తలకిందులయ్యాయి. కాస్ట్యూమ్ ముట్టుకోవద్దంటూ అభిజిత్ చిరుకోపాన్ని ప్రదర్శించాడు. కానీ సోహైల్ మాత్రం తనను బతికుండగానే మమ్మీ(శవం)లా చేస్తున్నప్పటికీ చిరునవ్వుతోనే భరించడం విశేషం. ఇక మాస్టర్ను నానారకాలుగా హింసిస్తూ విపరీతంగా ఆడేసుకున్నారు. (చదవండి: చెప్పొద్దనుకున్నా, కానీ నా అసలు పేరు: అరియానా) కాగా నేడు రాక్షసులను మంచి మనుషులుగా మార్చేందుకు బిగ్బాస్ నేడు మరిన్ని టాస్కులు ఇవ్వనున్నాడు. కానీ రాక్షసుడి నుంచి మంచి మనిషిగా మారిన అఖిల్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. డ్రమ్ముల్లో నీళ్లు నింపాలన్న టాస్కును చెడగొడుతున్న మెహబూబ్ను ఒక్క తోపు తోశాడు. దీంతో వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరగనున్నట్లు కనిపిస్తోంది. ఇక మెహబూబ్ ఒక్క చుక్క కూడా డ్రమ్ములో పడకుండా దాన్ని తలకిందులుగా బోర్లించి డ్రమ్ముపై ఎక్కి కూర్చున్నాడు. కానీ సోహైల్ వచ్చి అతడిని నెట్టేసి డ్రమ్మును నీళ్లు నింపేందుకు సిద్ధం చేశాడు. హోరాహోరీగా జరుగుతున్న ఈ ఫైట్లో మంచి మనుషులే విజయం సాధించినట్లు తెలుస్తోంది. ముగ్గురు రాక్షసులను మంచి మనుషులుగా మర్చితే వారే గెలుస్తారు. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్లో అఖిల్, హారికను మంచిగా మార్చేశారు. తాజా ప్రోమోలో అవినాష్ను కూడా మంచి మనిషిగా మార్చేయడంతో మంచి మనుషుల టీమ్ గెలిచినట్లు తెలుస్తోంది. (చదవండి: బిగ్బాస్ : దివి ‘పప్పు’ రీజన్పై నెటిజన్ల ట్రోలింగ్) -
అవినాష్ రొమాన్స్; చచ్చిపోండన్న అరియానా
బిగ్బాస్ ఇచ్చిన 'కొంటె రాక్షసులు- మంచి మనుషులు' టాస్క్లో కంటెస్టెంట్లు రెచ్చిపోయి మరీ ఆడేస్తున్నారు. హారిక, అరియానా, అవినాష్ అయితే గత జన్మలో నిజంగానే రాక్షసులుగా పుట్టారేమో అనిపించేలా జీవించేశారు. అందరికీ విసుగు తెప్పించే ఈ అవకాశం చేజారితే మళ్లీ దొరకదని అరియానా అందరికన్నా ఓ అడుగు ముందుకేసి మరీ భీభత్సం సృష్టించింది. బెడ్లను చిందరవందర చేస్తూ హౌస్ను అల్లకల్లోలం చేసింది. మెహబూబ్ టాస్కు ముందుకు సాగకుండా మంచి మనుషులపై ఓ కన్నేశాడు. అఖిల్కు రాక్షసుడిగా ఉండేందుకు ప్రయత్నించడానికే సరిపోయాడు. (సోహైల్కు హారిక పంటిగాట్లు, ఎవ్వరినీ వదల్లేదు) తర్వాత మనుషులు అఖిల్ వారిలో ఒకడిగా కలిపేసుకున్నారు. ఇక హారిక అన్నిరకాలుగా మనుషుల పనులకు ఆటంకం కలిగించింది. కానీ అభిజిత్ ఇక చాలు అని వారించినప్పుడు మాత్రం ఆమె శిలావిగ్రహంలా ఉండిపోయింది. అయితే టాస్కుల్లో అభిని, తనను విడదీయడం హారికకు నచ్చదన్న విషయం తెలిసిందే. దీంతో తనకు కూడా మనుషుల టీమ్లో కలిసిపోవాలని లోలోపలే ఉవ్విళ్లూరింది. చివరి నిమిషంలో ఇదే విషయాన్ని కెమెరా ముందు చెప్పింది. కానీ తీరా మనిషిగా మారాలంటే మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. ఇక ఈ టాస్క్ నేడు కూడా కొనసాగనుంది. అయితే మంచి మనుషుల్లో నోయల్ నీతి సూక్తులు వల్లిస్తుంటే, మాస్టర్ శాంతి జపం చేస్తున్నాడు. (బిగ్బాస్లో ఆ ఒక్కటి చాలా కష్టం: కుమార్ సాయి) మోనాల్ మాత్రం ఆలింగనం చేసుకుంటూ రాక్షసులను మంచిగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఫోకస్ అంతా అవినాష్ మీదే ఉంది. అతడేమో నువ్వే రాక్షసిగా మారిపోవచ్చు కదా అని మోనాల్ను ప్రేమగా అభ్యర్థించాడు. నువ్వే మనిషిగా మారిపోవచ్చు కదా అని ఆమె గారాలు పోయింది. దీంతో విసుగెత్తిన అరియానా 'చచ్చిపోండి మీరిద్దరూ' అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంటే 'నువ్వూ ఇక్కడే ఉన్నావు రా' అని పిలిచాడు. ఇదేంటి, అవినాష్ మారిపోయేలా ఉన్నాడంటూ మెహబూబ్ అనుమానం వ్యక్తం చేయగా మారను కాక మారను అని కరాఖండిగా చెప్తూనే మళ్లీ మోనాల్ మాయలో పడిపోయాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఎప్పుడూ వీళ్ల సోదేనా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో 'మా ఖర్మ కాకపోతే ఇది కూడా ఒక ప్రోమోనా?' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఈ టాస్క్ తమిళ బిగ్బాస్ నుంచి కాపీ కొట్టారని కొందరు నెటిజన్లు చెప్తున్నారు. -
వాళ్లకు సాయం చేయను: ఏడ్చేసిన హారిక
బిగ్బాస్ ఇంటిని కాపాడుకోవడం వచ్చో తెలీదో కానీ హౌస్ను చెడగొట్టమంటే మాత్రం క్షణాల్లో చేసి చూపించారు కంటెస్టెంట్లు. రాక్షసులు కూడా ఇంత క్రూరత్వంగా ప్రవర్తించరేమో అనిపించారు. మంచి మనుషులకు ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించారు. అయినా సరే వాటిని ఓపికగా భరిస్తూ సహనంతో ఒక్కో టాస్కు పూర్తి చేస్తూ వస్తున్న మనుషులు విజయానికి కేవలం ఓ అడుగు దూరంలో ఉన్నారు. ఇంతకీ వాళ్లు చేసిన టాస్కులేంటి? ఏయే రాక్షసులను మంచిగా మార్చారనేది చదివేయండి.. మంచి మనుషుల సహనానికి అగ్ని పరీక్ష బిగ్బాస్ "కొంటె రాక్షసుడు- మంచి మనుషులు" అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. బిగ్బాస్పురం రాజ్యంలో అరియానా, అవినాష్, అఖిల్, మెహబూబ్, హారిక రాక్షసుల టీమ్లో ఉండగా, మిగతావారు మంచి మనుషుల టీమ్లో ఉన్నారు. ఒక్కో రాక్షసుడిని మంచి మనిషిగా మార్చిన ప్రతీసారి రావణుడి బొమ్మలోని పది తలల్లో రెండింటిని పగలగొట్టాల్సి ఉంటుంది. అలా ముగ్గురు రాక్షసులనైనా మార్చితేనే మనుషుల టీమ్ గెలిచినట్లు లెక్క. కానీ మంచి మనుషుల పనులకు కొంటె రాక్షసుల ఆటంకం కలిగిస్తూ ఉంటారు. అయినా సరే వాళ్లు సహనాన్ని వీడకూడదు. (చదవండి: తొలిసారి అవినాష్.. సోహైల్ రిక్వెస్ట్) తన ప్రతాపం చూపించిన అరియానా టాస్కు ప్రారంభం అవగానే అరియానా నిజమైన రాక్షసిలా మారిపోయింది. నోయల్పై గుడ్డు పగలగొట్టినా అతడు కిక్కురుమనలేదు. అవినాస్ రావణుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి డైలాగులు వల్లించాడు. మెహబూబ్ సోహైల్ను బతికుండగానే మమ్మీలా మార్చాడు. హారిక మనుషులను క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇలా నానారకాలుగా చిత్ర చిత్ర హింసలు పెడుతూ వారిపై ముప్పేట దాడి చేశారు. ఇక మంచి మనుషుల టీమ్లోని నోయల్ రాక్షసులను మార్చేందుకు సూక్తులు చెప్తూ నానా యత్నాలు చేశాడు. రాక్షసుల ఆవేశాన్ని చల్లార్చేందుకు మాస్టర్ శాంతి శాంతి అంటూ మొత్తుకుంటున్నా ఆ మాట చెవినెక్కించుకునేవాళ్లే కరువయ్యారు. డ్రెస్సు లోపల ఐస్ గడ్డలు వేసినా మాస్టర్ శాంతి జపం వదల్లేదు. అవినాష్ వీరావేశంతో అరుంధతి డైలాగ్ చెప్పేయడంతో మోనాల్ అతడిని హత్తుకుంది. మంచి మనిషిగా మారిన రాక్షసుడు అఖిల్ కొంటె రాక్షసులను మంచిగా మార్చేందుకు బిగ్బాస్ మంచి మనుషులకు ఓ టాస్క్ ఇచ్చాడు. స్విమ్మింగ్ ఫూల్లోని పూలతో 50 దండాలు అల్లాల్సి ఉంటుందని తెలిపాడు. కానీ అల్లిన దండలను రాక్షసులు పారేస్తూ మెడలో చుట్టుకుంటూ సర్వనాశనం చేశారు. అయినా సరే మంచి మనుషులు ఎట్టకేలకు టాస్క్ను పూర్తి చేసి రాక్షసుడి రెండు తలలు పగలగొట్టారు. రాక్షసుడిగా ఉన్న అఖిల్ను వాళ్ల టీమ్లో కలిపేసుకున్నారు. అనంతరం మంచి మనుషులకు క్లేతో 100 ప్రమిదలను తయారు చేయాలని బిగ్బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. కానీ వాళ్లు దీపాలు తయారు చేయడం మొదలు పెట్టగానే రాక్షసులు క్లేలను దొంగిలించారు. (చదవండి: పాపం..మోనాల్ను మళ్లీ టార్గెట్ చేశారు) గుట్టు చప్పుడు కాకుండా పని చేసిన నోయల్ నోయల్ స్టోర్ రూమ్లోకి వెళ్లి గడియ పెట్టకుని మరీ దీపాలు చేస్తుండటంతో మెహబూబ్, అవినాష్ ఆ రూమ్లోకి చొరబడి మరీ వాటిని దొంగిలించారు. మరోవైపు సోహైల్ హారికను ఆపేందుకు పట్టుకోగా ఆమె అతడిని పంటితో గాటు పెట్టడంతో కేకలు పెట్టాడు. ఇక లాస్య వాళ్లు కష్టపడి మాస్టర్ దగ్గర దీపాలు దాచిపెట్టగా మిగతావారు అతడి దగ్గరి నుంచి లేపేశారు. అయినా సరే 160 దీపాలు తయారు చేసి విజయం సాధించడంతో మంచి మనుషుల టీమ్ ఆనందం పట్టలేక ఇది ఫన్ అంటూ గెంతులేశారు. (చదవండి: నాన్న ఇస్త్రీ పని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్: నోయల్) తన పేరు ముందు చెప్పలేదని ఫీలైన హారిక అయితే మంచి మనుషుల జాబితాలో కలిపేస్తారన్న భయంతో రాక్షసులు అరియానా, మెహబూబ్, అవినాష్ ఒక్క బాత్రూమ్లోనే దూరిపోయారు. ఇక అప్పటికే మెహబూబ్ పేరు చెప్పినప్పటికీ అతడి జాడ దొరక్కపోవడంతో చేతికి చిక్కిన హారికను మంచి మనిషిగా మార్చారు. నిజానికి హారికకు మనిషిగా మారడం ఇష్టమే అయినప్పటికీ మొదట తన పేరు చెప్పలేదని ఫీలయింది. అలాంటప్పుడు తాను మనిషిగా మారినా వారికి ఎలాంటి సాయం చేయను అంటూ ఏడుస్తూ కెమెరాలతో చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్బాస్: సోహైల్నే ఏడిపించిన అవినాష్!) -
బిగ్బాస్ హౌస్లో చెలరేగిపోయిన రాక్షసులు
బిగ్బాస్ నాల్గో సీజన్ ఏడో వారంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఎప్పటిలాగే ఇంటిసభ్యులకు బిగ్బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్కు ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా అభిజిత్, మాస్టర్, మోనాల్, దివి, సోహైల్, లాస్య, నోయల్ మంచి మనుషులుగా, మిగతావాళ్లు రాక్షసులుగా అవతారాలెత్తారు. వస్తువులను విసిరేస్తూ, దుస్తులను స్విమ్మింగ్ పూల్లో పడేస్తూ క్రూరత్వం అంటే ఎలా ఉంటుందనేది వారికి ఈ అసురులు రుచి చూపిస్తున్నారు. వాళ్లను చిత్రవిచిత్రంగా వేధిస్తూ, ఇంటిని మొత్తం చిందరవందర చేస్తూ సహనానికి పరీక్ష పెడుతున్నారు. (చదవండి: నాన్న ఇస్త్రీ పని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్: నోయల్) కసితో, పగతో రగిలిపోతున్నానని ముక్కు అవినాష్ను మంచి మనిషిగా ఉన్న మోనాల్ ఒక్కసారిగా హత్తుకోవడంతో షాకయ్యాడు మంచికి చెడుకు మధ్య జరుగుతున్న ఈ టాస్క్లో ఎవరు ఎవరిని చేంజ్ చేస్తారంటూ స్టార్ మా తాజాగా ప్రోమోను వదిలింది. మరి ఈ టాస్కులో రాక్షసులు పెడుతున్న కష్టాలను నుంచి మనుషుల టీమ్ ఎలా బయటపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాక్షసులను మంచి మనుషులుగా మార్చేందుకు బిగ్బాస్ టాస్కులు ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ అవకాశాన్ని మంచి మనుషులు ఏమేరకు సద్వినియోగం చేసుకుంటారనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. (చదవండి: నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట..) -
బిగ్బాస్: షటప్ అంటూ అభిపై హారిక సీరియస్
బిగ్బాస్ అంటేనే వివాదాలు, కాంట్రవర్సీలు, ఒకరినొకరు అరుచుకోవడం. ఎంత ప్రేమగా ఉండాలని ట్రై చేసిన కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టడమే బిగ్బాస్ పని. అయితే ఈ చిచ్చులకు పునాది వేదేది మాత్రం ప్రతి సోమవారమే. అవును ఆ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. దీంతో ఆ రోజంతా హౌస్మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు, అలగడాలు ఉంటాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టాడు బిగ్బాస్. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ని జతలుగా విడదీసి, ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పి వారిపై రంగు నీళ్లు పోయాల్సిందిగా బిగ్బాస్ ఆదేశించారు. తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే అభిజిత్-హారిక, అవినాష్-సోహైల్, మోనాల్-అఖిల్, అరియానా-మెహబూబ్, లాస్య-దివిలను జంటలుగా విడిపోయారు. ఇక కెప్టెన్ కారణంగా నోయల్, నాగార్జున ఇచ్చిన ఆఫర్తో రాజశేఖర్ మాస్టర్ ఈ నామినేషన్ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. ఇక తాజా ప్రోమో చూస్తే.. అభిజిత్- హారిక మధ్య పెద్ద గొడవే జరిగినట్టు ఉంది. త్యాగాలు, సర్దుబాట్లు చేసుకునే వారం కాదు ఇది అంటూ హారిక అభికి హారిక సలహా ఇచ్చింది. అయితే ఎక్కువగా నేను నామినేట్ అయ్యానని, ఈ వారం తనను సేవ్ చేయాలని హారికను అభి కోరాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ హారిక మాత్రం మాఇద్దరిది అన్పేయిర్ అని, షటప్ అంటూ అభిపై సీరియస్ అయింది. ఇక అరియానా- మెహబూబ్, అవినాష్-సోహైల్ కూడా నేనే ఉంటా అంటే నేనే ఉంటా అంటూ గొడవకు దిగారు. మరి ఈ వారం ఎవరెవరిపై రంగుపడిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
టాస్క్ మధ్యలో పడిపోయిన అవినాష్
బిగ్బాస్ కంటెస్టెంట్ల జీవిత కష్టాలు సినిమా కథలను తలపిస్తూ అందరినీ కంటతడి పెట్టించేశాయి అయితే హౌస్లో ఉన్న అందరూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పైకి వచ్చిన విధానాన్ని తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. దీంతో హౌస్లో ఓ ఉద్విగ్న వాతావరణం అలుముకుంది. దీన్ని పోగొట్టి అందరినీ మళ్లీ మామూలుగా చేసేందుకు బిగ్బాస్ ఓ ఫిజికల్ టాస్క్ ఇవ్వనున్నట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. అందులో భాగంగా హౌస్లో ఉన్న అబ్బాయిలకు బైక్ రేసింగ్ పోటీ పెట్టినట్లు కనిపిస్తోంది. దీనికి అభిజిత్ సంచాలకుడిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్ రేసింగ్ ఆషామాషీగా ఉన్నట్లు లేదు. (చదవండి: రక్తం కారుతున్నా అమ్మ కిలోమీటరు నడిచింది) ఎన్నో గండాలను దాటుకుని చివరాఖరకు బైక్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అఖిల్, మెహబూబ్, సోహైల్, కుమార్ సాయి ఈ టాస్కును ఎలాగోలా పూర్తి చేసేటట్లు కనిపిస్తున్నారు. అఖిల్ టాస్క్ మొదలు పెట్టగానే అక్కడ రిస్క్ ఎక్కువగా ఉండటంతో మోనాల్ కంగారు పడుతోంది. జాగ్రత్త అంటూ అతనికి బలాన్ని నూరిపోసే ప్రయత్నం చేసింది. మరోవైపు అవినాష్ మాత్రం ఈ కష్టతరమైన టాస్కు పూర్తి చేసేందుకు నానాకష్టాలు పడుతున్నాడు. ఒకానొకన సమయంలో ఢమాలున కింద పడటంతో ఇంటిసభ్యులు షాకయ్యారు. మరి ఈ టాస్కులో ఎవరు గెలిచి రేసర్ అనిపించుకుంటారో చూడాలి! (చదవండి: అరియానాకు సారీ చెప్పి గోరుముద్దలు తినిపించిన సోహైల్ ) -
ఇదంతా చూడాల్సి రావడం నా ఖర్మ: మాస్టర్
జబర్దస్త్ అవినాష్ బిగ్బాస్ హౌస్లో బాగానే ఎంటర్టైన్ చేస్తూ టీఆర్పీలు పడిపోకుండా కాపాడుతున్నాడు. అయితే అరియానాతో గుసగుసలు పెడుతూ, చిలిపి పనులు చేస్తూ కెమెరాకు అడ్డం దొరికిపోతున్నాడు. కానీ అతడు చేసిన పనులనే వీకెండ్లో నాగార్జున మరోసారి గుర్తు చేస్తే మాత్రం తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ వదిలేయమని రివర్స్లో వేడుకుంటున్నాడు. ఇదిలా వుంటే తాజా ప్రోమోలో అరియానా ముందే మోనాల్తో పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. (చదవండి: బిగ్బాస్: కళ్లకు గాయాలు, ఎలిమినేట్!) మోనాల్ కూడా అవినాష్కు గోరుముద్దలు తినిపిస్తోంది. ఇదంతా చూడటం తన కర్మ అని మాస్టర్ బుర్ర బద్ధలు కొట్టుకున్నాడు. ఇక రోజూ ఇంట్లో ఉండే అమ్మాయిలనే చూసి బోర్ కొడుతోందని ఎవరైనా ఐశ్వర్యను ఇంట్లోకి పంపించమని నోయల్ అర్జీ పెట్టుకున్నాడు. కానీ అదంతా కుదిరే పని కాదు, ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు ఆడవాళ్లు ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ కూడా ఉంది మరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా బయటకు వెళ్లేందుకు లైన్లో ఉన్నారు. (చదవండి: బిగ్బాస్.. నాకు క్లారిటీ లేకపోతే బాగోదు) ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు మోనాల్ వేషాలు చూడలేకున్నామని తలలు పట్టుకుంటున్నారు. అఖిల్, అభిజిత్ చాలదని ఇప్పుడు అవినాష్ వెంట పడుతోందా? అని సెటైర్లు విసురుతున్నారు. అవినాష్ మోనాల్కు బిస్కెట్లు వేస్తుంటే అరియానా ముఖం మాడిపోయిందని మరికొందరు అంటున్నారు. ఎప్పుడు చూడూ ఈ మోనాల్ సోదేనా? అభిజిత్, హారికల రిలేషన్కు కూడా కాస్త స్క్రీన్ స్పేస్ ఇవ్వండని సలహా ఇస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ ఈ "ఏఏఏ-మోనాల్" ప్రోమోలు మాత్రం రోజూ వస్తాయని అంటున్నారు. -
నాకొక గర్ల్ఫ్రెండ్ కావాలి: అఖిల్
బిగ్బాస్ ఇంటి సభ్యులకు మొదటి రోజును మించిపోయేలా రెండో రోజు కఠినమైన డీల్స్ ఇచ్చాడు. అన్నీ చేసేందుకు తలాడించిన కంటెస్టెంట్లు అరగుండు, సగం గడ్డం గీసుకునేందుకు మాత్రం వెనకడుగు వేశారు. ఇక టాస్క్లో అఖిల్ను కష్టపెడుతుంటే చూడలేకపోయిన మోనాల్ అతడికి సాయం చేసేందుకు ముందుకు రావడంతో అభిజిత్ ఆమెపై మండిపడ్డాడు. కోపాన్ని చంపుకుంటున్న సోహైల్తో ఇంటిసభ్యులు గొడవ పడుతూ అతడి సహనాన్ని పరీక్షిస్తున్నారు. నాగార్జునకు ఇచ్చిన మాట కోసం సోహైల్ ఎవరి మీదా అరవలేక ఏడుపు రూపంలో బాధను బయటకు కక్కాడు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. బిగ్బాస్ నిన్న ఆరు డీల్స్ ఇవ్వగా అందులో అరియానా రెడ్ టీమ్, అఖిల్ బ్లూ టీమ్ చెరో మూడు పూర్తి చేశాయి. నేడు బిగ్బాస్ మరో ఐదు డీల్స్ ఇచ్చాడు. అవేంటంటే.. ఏడో డీల్: తల, గడ్డం సగం గీసుకోవాలి. చెల్లించాల్సిన నాణాలు: 40 మాస్టర్ ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వచ్చాడు. అమ్మ చనిపోతే గుండు గీసుకోలేదని ఎమోషనల్ అయ్యాడు. అయితే అభిజిత్ వెళ్లి ఇది కెప్టెన్సీ కోసం కాదు, కెప్టెన్సీ పోటీదారుల కోసమేనని మాస్టర్తో చెప్పుకొచ్చాడు. మీరు గెలిచినా మళ్లీ కొట్లాడుకోవాల్సిందేనని తెలిపాడు. దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ మాస్టర్ చేయలేనని చేతులెత్తేశాడు. అటు అరియానా టీమ్ కూడా ఈ డీల్ను తిరస్కరించడంతో బిగ్బాస్ దీన్ని రద్దు చేశాడు. ఎనిమిదో డీల్: పేడ కలిగిన బాత్టబ్లో దిగి 100 బటన్లను వెతికి తీయాలి. చెల్లించాల్సిన నాణాలు: 30 అఖిల్ గంట మోగించడంతో అతని టీమ్లో దివి ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వచ్చింది. అఖిల్ ఆమె దగ్గర నిలుచుని పాటలు పాడుతూ ఎంకరేజ్ చేశాడు. తొమ్మిదో డీల్: ముఖానికి స్టాకింగ్ వేసుకుని దానిపై నుంచి అరటి పళ్లను తినాలి. చెల్లించాల్సిన నాణాలు: 10 అరియానా గంట మోగించడంతో అభిజిత్ ఈ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ ముఖానికి అంతటికీ స్టాకింగ్ పెట్టుకోకుండా అతి తెలివి ప్రదర్శించాడు. అయితే సంచాలకుడు అలా కుదరదని చెప్పడంతో అవినాష్ ముఖానికంతటికీ కప్పేసుకుని అరటిపండు నోటిలో కుక్కుకున్నాడు. పదో డీల్: గార్డెన్ ఏరియాలో ఉన్న ఒక కుర్చీలో ఒక సభ్యుడు కూర్చుని ఉండాల్సి ఉంటుంది. మిగతావాళ్లు అతడిని లేపే వరకు వాష్ చేస్తుండాలి. బిగ్బాస్ తదుపరి ఆదేశాల వరకు అతను అందులోనే కూర్చోవాలి. చెల్లించాల్సిన నాణాలు: 25 గంట మోగించిన అఖిల్ ఈ టాస్కు చేసేందుకు రెడీ అయ్యాడు. తర్వాత అతడిని డిస్టర్బ్ చేసేందుకు అందరూ సాయశక్తులా ప్రయత్నించారు. మోనాల్ అతడి గడ్డానికి బ్రష్తో పేస్ట్ రుద్దింది. తర్వాత అభిజిత్, అవినాష్ అతడికి చన్నీళ్లతో తలస్నానం చేయించారు. అయితే అఖిల్ను ఇబ్బంది పెడుతున్నాడని నోయల్ అనడంతో అవినాష్ ఇది టాస్క్లో భాగమని సీరియస్ అయ్యాడు. ఇక కళ్లలోకి షాంపూ పోతుందని మోనాల్ నీళ్లు గుమ్మరించడంతో అభి, మెహబూబ్ ఏం చేస్తున్నావని మండిపడ్డారు. నోయల్ కూడా ముందుకొచ్చి అతనికి కళ్లు తుడుస్తుంటే సంచాలకుడిగా సోహైల్ గుంభనంగా ఉండటాన్ని అవినాష్ ప్రశ్నించాడు. (చదవండి: కథ వేరే ఉంటది: మాస్టర్కు సోహైల్ వార్నింగ్) సంచాలకుడిగా నువ్వు కరెక్ట్ కాదు: అవినాష్ దీంతో సోహైల్ ఎవరూ అఖిల్ దగ్గరకు రావడానికి కూడా ఒప్పుకోలేదు. అయినా సరే అవినాష్ మాత్రం ఆవేశంతో ఊగిపోయాడు. దివి టబ్లో నుంచి ఒకసారి దిగినప్పుడు కూడా ఏమీ చేయలేదని విమర్శించాడు. సంచాలకుడిగా నువ్వు కరెక్ట్ కాదని అనేశాడు. 'బిగ్బాస్.. ఇలానే జరిగితే నేను టాస్కులు ఆడను, కావాలంటే ఎలిమినేట్ చేసేయండి, నాకు క్లారిటీ లేకపోతే బాగోదు' అని వార్నింగ్ ఇచ్చాడు. 'ఎవడు బే ఆడుతోంది సేఫ్ గేమ్' అంటూ నోరు జారాడు. దీంతో సోహైల్కు కోపం వస్తోందని గ్రహించిన అఖిల్ అతడిని పక్కకు తీసుకువెళ్లాడు. కానీ ఆవేశం పట్టలేక చేయిని కుర్చీకి బాదుకున్నాడు. నాగ్ సర్కు ప్రామిస్ ఇచ్చినందుకే తాను అరవట్లేదు అని తన బాధను చెప్పుకొచ్చాడు. పదకొండో డీల్: ఎవరైనా ఒకరు తరువాతి వారం నేరుగా నామినేట్ అవ్వాలి. చెల్లించాల్సిన నాణాలు: 30 అఖిల్ ముందుగా గంట కొట్టడంతో అతని టీమ్లో నుంచి నోయల్ నామినేట్ అవుతానని చెప్పాడు. ఇంతటితో డీల్స్ ముగిసిపోగా అఖిల్ 'రెడ్' టీమ్ గెలిచినట్లు సోహైల్ ప్రకటించాడు. తర్వాత సోహైల్కు ప్లేటులో అన్నం పెట్టుకున్నాడే కానీ బాధతో ముద్ద దిగడం లేదు. ఇది గమనించి అఖిల్ దగ్గరకు వెళ్లగా సోహైల్ చంటి పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'అందరూ అన్నా కూడా పడుతున్నా, ఇంకా ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేద'ని దుఃఖించాడు. దీంతో అఖిల్ వెక్కి వెక్కి ఏడుస్తున్న అతడి కన్నీళ్లు తుడిచాడు. మెహబూబ్ దగ్గరుండి స్నేహితుడికి గోరు ముద్దలు తినిపించాడు. (చదవండి: నోయల్కు మోనాల్ హగ్: షాక్లో అభిజిత్) గర్ల్ఫ్రెండ్ కావాలంటూ అఖిల్ పాటలు తర్వాతి రోజు మధ్యాహ్నం వర్షంలో హారిక, దివి గొడుగు కింద ఆటలాడారు. మరోవైపు అవినాష్.. అరియానాతో కాసేపు చిలిపి సంభాషణలు జరిపాడు. అరియానాను దగ్గరకు రమ్మంటూ పిలిచి సైగలు చేయబోయాడు. సైగలేవీ వద్దు, డైరెక్ట్గా చెప్పు అని అరియానా వారించడంతో 'యూ సో కూల్' అని మరోసారి చెప్పుకొచ్చాడు. ఇక మోనాల్, అఖిల్ బిగ్బాస్ హౌస్లో ఉన్నామన్న విషయాన్నే మర్చిపోయి మరో లోకంలో విహరించారు. ఒకరినొకరు కాసేపు ఆట పట్టించుకున్నారు. నాకో గర్ల్ఫ్రెండ్ కావాలి.. అని అఖిల్ పాట పాడాడు. తర్వాత మళ్లీ తనెప్పుడూ పాడే "మొన్న కనిపించావు, మైమరిచిపోయాను.." అంటూ పాట ఎత్తుకున్నాడు. (చదవండి: నామినేషన్స్ పిచ్చ లైట్: నోయల్) రెండోసారి కెప్టెన్ అయిన నోయల్ బిగ్బాస్ కెప్టెన్సీ పోటీదారులకు "కొట్టు- తలతో ఢీ కొట్టు" అనే టాస్క్ ఇచ్చాడు. దీనికి అవినాష్ సంచాలకుడిగా వ్యవహరించాడు. తలకు బ్యాటు కట్టుకుని వారికి కేటాయించిన కలర్ బాల్స్ను నెట్లో వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్లో నోయల్ గెలవడంతో అతడు రెండోసారి కెప్టెన్ అయ్యాడు. కానీ అమీతుమీ టాస్క్లో నేరుగా నామినేట్ అయినందున తర్వాతి వారంలో అతడికి ఇమ్యూనిటీ లభించదని బిగ్బాస్ స్పష్టం చేశాడు. దీంతో నోయల్ తర్వాతి వారం నామినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. అనంతరం నోయల్.. మెహబూబ్ను రేషన్ మేనేజర్గా ప్రకటించాడు. (చదవండి: బిట్టు అని పిలవడం ఇష్టమేనా అని అడిగారు: సుజాత) -
బిగ్బాస్: సోహైల్నే ఏడిపించిన అవినాష్!
బిగ్బాస్ నాల్గవ సీజన్లో కోపిష్టి ఎవరు అనగానే అందరూ ముక్తకంఠంతో సోహైల్ పేరు చటుక్కున చెప్పేస్తారు. అయితే అమ్మాయిల మీద అరిస్తే కథ వేరే ఉంటదని నాగ్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో అతడు తన పద్ధతి మార్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కోపాన్ని తగ్గించుకుంటానని నాగార్జునకు మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత గొడవ జరుగుతున్నా, ఎంత రెచ్చగొడుతున్నా సహనంతో మాట్లాడుతున్నాడే తప్ప మునుపటిలా నరాలు తెగేలా మాట్లాడటం లేదు. పైగా కెప్టెన్గా విఫలమయ్యాడన్న పేరు రాకుండా ఉండటం కోసం నానా కష్టాలు పడుతున్నాడు. (చదవండి: బిగ్బాస్: అన్నింటినీ త్యాగం చేసిన అభిజిత్) ఇదిలా వుంటే బిగ్బాస్ కెప్టెన్సీ పోటీదారుల కోసం అమీతుమీ అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్నటి కన్నా కఠినతరమైన టాస్కులు నేడు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా అఖిల్కు గార్డెన్ ఏరియాలో షాంపుతో అభిజిత్ తలస్నానం చేయిస్తున్నాడు. అయితే మోనాల్ వెంటనే బకెట్ తెచ్చి నీళ్లు గుమ్మరించడంతో వద్దని వారించారు. అటు నోయల్ కూడా కళ్లలోకి షాంపూ వెళ్తుందేమోనని అఖిల్ కళ్లు తుడిచాడు. దీంతో అవినాష్ కోపానికి వచ్చాడు. మీరు మంచోళ్లు, మేము చెడ్డోళ్లం కాదిక్కడ అని తిడుతూనే సంచాలకుడిని తప్పుపట్టాడు. సంచాలకుడిగా నువ్వు కరెక్ట్ కాదని సోహైల్ ముఖం మీదే అనేశాడు. అక్కడితో ఆగకుండా 'ఎవరు బే ఆడుతుంది సేఫ్ గేమ్' అంటూ నోరు జారాడు. (చదవండి: అన్నయ్య లవర్ను అక్కా అనేవాడిని: అవినాష్ తమ్ముడు) ఒకరికి సపోర్ట్ చేసుకుంటూ ఇంకొకరికి చేయకపోవడం ఏంటని నిలదీశాడు. అతను అంటున్న ఒక్కో మాటకు అగ్నిగుండంలా రగిలిపోతున్న సోహైల్ ధీటుగా సమాధానాలు ఇచ్చేవాడే, కానీ నాగ్కు ఇచ్చిన మాట కోసం సైలెంట్గా ఉండిపోయాడు. అయితే గొంతులో దిగమింగుకుంటున్న కోపం, బాధను తగ్గించేందుకు అఖిల్ అతడిని పక్కకు తీసుకువెళ్లాడు. ఏమీ చేయలేకపోతున్న సోహైల్ ఒక్కసారిగా చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. తప్పు లేకున్నా తననే అంటున్నారని తెగ బాధపడ్డాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు సోహైల్ నవ్వడం, కోప్పడటం చూశాం.. కానీ ఇంతలా రోదిస్తుండటం మొదటిసారి చూస్తున్నామని అంటున్నారు. ఆయన కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అందరూ అతన్ని కావాలనే రెచ్చగొడుతున్నారని విమర్శిస్తున్నారు. (చదవండి: సుజాత ఎలిమినేట్, 'పోకిరీ'పై ప్రతీకారం) -
నేను లేకపోతే ఏమైపోతావో: అవినాష్
బిగ్బాస్ నేడు ఇంటిసభ్యులకు ఆసక్తికరమైన టాస్కులు ఇచ్చాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లు కష్టమైనా నష్టమైనా సరే, టాస్కు గెలిచి తీరాల్సిందేనని హోరాహోరీగా పోరాడుతున్నారు. అయితే దూరంగా ఉందామని డిసైడ్ అయిన అభిజిత్, మోనాల్ ఒక టీమ్లో వచ్చి పడ్డారు. దీంతో వాళ్లిద్దరూ మాట్లాడుకోకుండా ఉండలేకపోయారు. అవినాష్ దివికి ఓ లెటర్ ఇచ్చాడు. అయితే అది లవ్ లెటర్ కాకుండా ఫ్రెండ్షిప్ లెటర్ కావడం గమనార్హం. కానీ అరియానాకు మాత్రం దగ్గరుండి మేకప్ వేశాడు. చంద్రముఖిలా ఉండే నువ్వు ఇప్పుడు ఎలా అయ్యావో చూడు అంటూ ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. నేటి బిగ్బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. కిచెన్గా మారిన సోహైల్ను చితక్కొట్టారు బిగ్బాస్ ఇచ్చిన మార్నింగ్ మస్తీలో సోహైల్ కిచెన్గా మారిపోయాడు. దీంతో దొరికిందే ఛాన్సని అందరూ అతడిని చపాతీలా రుబ్బుతూ, బోళ్లు తోముతున్నట్లూ సాకులు చెప్తూ చితక్కొట్టేశారు. అవినాష్ బెడ్లా మారిపోగా అమ్మ రాజశేఖర్ అతడిపై విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నాడు. అఖిల్ వాష్రూమ్గా మారిపోగా మాస్టర్ అందులోనే స్నానం, నిద్ర అన్నీ చేస్తూ ఛీ అనిపిస్తూనే నవ్వు తెప్పించారు. మోనాల్ తలుపుగా మారిపోగా అందరూ మరోసారి రోబో టాస్కును గుర్తు చేస్తూ డోర్ విరగ్గొట్టేలా విరుచుకుపడ్డారు. దివి కాసేపు డస్ట్బిన్లా చేసింది. (చదవండి: బిగ్బాస్ : కెప్టెన్ పవర్తో ఫ్రెండ్ని సేవ్ చేసిన సోహైల్) దివికి లెటర్ రాసిన అవినాష్ అనంతరం అవినాష్ ఓ లేఖ రాసి దివికి ఇమ్మని మాస్టర్కు ఇచ్చాడు. అందులో ఉన్నది చదివిన మాస్టర్.. నువ్వే ఇచ్చుకో పో అని ఆ లేఖను ముఖాన కొట్టాడు. దీంతో అతడే నేరుగా దివి బెడ్ దగ్గరకు వెళ్లి ఆమె చేతికి కూడా ఇవ్వకుండా బెడ్పై పెట్టేసి వెనుదిరిగాడు. అదేమిటా అని ఆమె తెరిచి చూసింది. అందులో దివి, అవి ఫ్రెండ్స్ అని రాసి ఉండటంతో ఓ స్మైల్ ఇచ్చింది, ఆ వెంటనే ఫ్రెండ్షిప్ గురించి ఓ సాంగ్ కూడా పాడింది. తర్వాత అవినాష్ అరియానా దగ్గర తేలాడు. ఆమెకు దగ్గరుండి కళ్లకు కాటుక పెడుతూ మేకప్ వేశాడు. నేను లేకపోతే ఏమైపోతావో అంటూ కబుర్లు చెప్పుకొచ్చాడు. మరోవైపు అభిజిత్ సోహైల్కు అందరూ ఇచ్చే సలహానే మళ్లీ గుర్తు చేశాడు. నువ్వు కోపం తగ్గించుకుంటే ఇంత మంచోడివా అనిపిస్తది, కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకో అని సలహా ఇచ్చాడు. (చదవండి: గంగవ్వను బయటకు పంపిన బిగ్బాస్!) ఆరోవారం అమీతుమీ కెప్టెన్సీ టాస్క్ బిగ్బాస్ అమీ తుమీ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్లుగా విడగొట్టాడు. అరియానా 'రెడ్' టీమ్లో అభిజిత్, మెహబూబ్, లాస్య, అవినాష్, మోనాల్ ఉండగా అఖిల్ 'బ్లూ' టీమ్లో మిగిలిన ఇంటి సభ్యులు ఉంటారు. సోహైల్ సంచాలకుడిగా వ్యవహరిస్తాడు. ఇక ఈ టాస్క్లో భాగంగా బిగ్బాస్ రెండు టీమ్స్కు సమంగా బంగారు నాణాలు ఇస్తారు. టాస్క్ ముగిసే సమయానికి బిగ్బాస్తో ఎక్కువ డీల్స్ కుదుర్చుకుని ఏ టీమ్ ఎక్కువ నాణాలు ఖర్చుపెడుతుందో వారే గెలుపును సాధించినట్లు లెక్క. గెలిచిన టీమ్ సభ్యులే కెప్టెన్సీకి పోటీ పడతారు. (చదవండి: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అవినాష్) ► మొదటి డీల్: మగ సభ్యుడు ఒంటి మీదున్న బట్టలను కత్తిరించేయాలి. ఇందుకు 10 బంగారు నాణాలు ఇవ్వాలి. మొదట అఖిల్ బెల్ కొట్టడంతో అతని టీమ్లో కుమార్ సాయి షర్టును ముక్కలు ముక్కలుగా కత్తిరించేశాడు. కానీ ఆ షర్టు సోహైల్ది కావడంతో ఆయన ఎక్కువగా బాధపడ్డాడు. ► రెండో డీల్: ఇంటి సభ్యుల్లో ఒకరు వారికి సంబంధించిన దుస్తులను, వస్తువులన్నింటినీ బయటకు పంపించేయాలి. చెల్లించాల్సిన నాణాలు: 20. అరియానా మొదట బెల్ కొట్టగా ఆమె టీమ్లోని అభిజిత్ ఒంటి మీదున్న బట్టలు మినహా తనకు చెందినవి అన్నింటినీ త్యాగం చేశాడు. ► మూడో డీల్: అమ్మాయి తన జుట్టును మెడపై వరకు కత్తిరించుకుని రెడ్ కలర్ వేసుకోవాలి. చెల్లించాల్సిన నాణాలు: 25 అఖిల్,గంట కొట్టడంతో హారిక హెయిర్ కట్ చేయించుకునేందుకు రెడీ అయింది. అయితే ఈ షోకు వచ్చేముందే ఇలా హెయిర్ కట్ చేయించుకోవద్దని అన్నయ్య మరీమరీ చెప్పాడని ఏడ్చేసింది. నోయల్ జుట్టు కత్తిరించేస్తుంటే అన్నను గుర్తు చేసుకుంటూ సారీ చెప్తూ కన్నీళ్లు కార్చింది. అయితే వెళ్లిపోయేలోపు తన జుట్టు పెరిగేలా మసాజ్ చేసే బాధ్యత ఇంటి సభ్యులదేనని వారిపై భారం వేసింది. ► నాలుగో డీల్: ఇసుక మూటను ఒక్క చేత్తో మార్కు కిందకు వెళ్లకుండా చూడాలి. బిగ్బాస్ తదుపరి ఆదేశాల వరకు అదే స్థానంలో కదలకుండా ఉండాలి. చెల్లించాల్సిన నాణాలు: 20 అఖిల్ టీమ్లో కుమార్ సాయి ఈ ఛాలెంజ్ స్వీకరించాడు. చాలాసేపు ఒకేచోట ఉండటంతో అతనికి నోయల్ నీళ్లు తాగిపించాడు. కానీ సమయం ఎక్కువయ్యేకొద్దీ అతడు నొప్పి భరించలేక కేకలు పెట్టాడు. ఏడ్చినంత పని చేశాడు. కానీ ఎట్టకేలకు ఛాలెంజ్ విజయవంతంగా పూర్తి చేశాడు. ► ఐదో డీల్: స్టోర్ రూమ్ ద్వారా పంపించే వస్తువులతో డ్రింక్ తయారు చేసి రెండు గ్లాసులు తాగాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన నాణాలు: 20 అరియానా గంట కొట్టడంతో లాస్య ఛాలెంజ్ స్వీకరించింది. ముక్కు మూసుకుని రెండు గ్లాసులను గటగటా తాగేసింది. మా జున్ను కోసం చేశానని చెప్పుకొచ్చింది. లాస్య కోసం అఖిల్ సాంగ్ పాడి ఆమెను నవ్వించాడు. ► ఆరో డీల్: ఒక ఇంటి సభ్యుడు బిగ్బాస్ తదుపరి ఆదేశం వరకు జ్యూట్తో అల్లిన బట్టలను ధరించాలి. చెల్లించాల్సిన నాణాలు: 20 అఖిల్ కన్నా ముందు గంట కొట్టినందుకు అరియానా టాస్క్ గెలిచినంత ఆనందపడి గెంతులేసింది. ఇక ఆమె టీమ్లోని మోనాల్ జనపనారతో అల్లిన దుస్తులు ధరించింది. దీంతో మాస్టర్ ఆమెతో కోయ డ్యాన్స్ వేయించాడు. -
అన్న లవర్ నాకు డబ్బులిచ్చేది: అవినాష్ తమ్ముడు
బిగ్బాస్ నాల్గో సీజన్లో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ అందరినీ నవ్విస్తూ హౌస్లో బెస్ట్ ఎంటర్టైనర్గా నిలుస్తున్నాడు. అటు ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్లను కూడా మెప్పిస్తుండటంతో కనీసం నామినేషన్లోకి కూడా రావడం లేదు. కానీ అతడు ఇంట్లోకి వచ్చాక హౌస్లోనే ఓ వెలుగు వచ్చిందన్నది నెటిజన్ల అభిప్రాయం. అయితే అందరినీ ఇంతలా నవ్వించే అవినాష్ జీవితంలోనూ ఎన్నో కష్టాలున్నాయని అతడి ఎంట్రీ వీడియోలో చూపించారు. మరీ ముఖ్యంగా అవినాష్ ఓ అమ్మాయిని ప్రేమించడం, చివరాఖరకు ఆ ప్రేమ విఫలమవడాన్ని హైలైట్ చేశారు. అప్పటినుంచి ఆ అమ్మాయి ఎవరు? వాళ్ల ప్రేమ ఎందుకు ముందుకు వెళ్లలేదు? అని అవినాష్ అభిమానులు తెగ చించేస్తున్నారు. దీంతో అతడి బ్రేకప్ స్టోరీ గురించి అవినాష్ తమ్ముడు అజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. (అవినాష్ తిక్క కుదిర్చిన అరియానా) ఆమె పిలిచి మరీ డబ్బులిచ్చేది "మేం ముగ్గురం అన్నదమ్ములం, హాస్టల్లో ఉండేవాళ్లం. అవినాష్ అన్నయ్య టెన్త్లో ఉన్నప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నాను. స్కూల్ డేస్లో అట్రాక్షన్ ఉండేది. కాబట్టి అన్నయ్య ఓ అమ్మాయిని ప్రేమించాడు, ఆమె చుట్టూ తిరిగేవాడు. స్కూల్కు వచ్చినా కూడా ఆమెపైనే ఫోకస్ పెట్టేవాడు, ఆమె ఎక్కడకు వెళ్తే అటు ఫాలో అయ్యేవాడు. అప్పుడు నేను మా అన్న దాగ్గరకు వెళ్లి రూపాయి ఇవ్వు మైసూర్ పాక్ కొనుక్కుంటా, రెండు రూపాలిస్తే సోనీ పాపడ్ కొనుక్కుంటా అని అడిగేవాడిని. వాడేమో లేవు పో, నేనివ్వను అనేవాడు. అప్పుడు ఆ అమ్మాయి నన్ను పిలిచి రూపాయి కావాలా అంటూ డబ్బులిచ్చేది" (లాక్డౌన్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా) అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అయింది "దీంతో ఏదైనా అవసరం ఉంటే అన్నయ్య దగ్గరకు వెళ్లేవాడిని కాదు. అక్కా అక్కా అంటూ ఆమె దగ్గరకే వెళ్లి తీసుకునేవాడిని. అప్పుడు ఆ వరసలు తెలీక అక్కా అని పిలిచేవాడిని. తర్వాత అన్నయ్య చదువైపోయింది. నేను పదో తరగతికి వచ్చాను, అప్పుడు తెలుసుకున్నా, ఆ అమ్మాయిని లవ్ చేశాడని! కానీ ఆ అమ్మాయిని బాగా ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. కానీ కొన్ని కరాణాల వల్ల బ్రేకప్ అయింది. అయితే ఆ కారణాలేంటో తెలీదు. బ్రేకప్ తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. మిమిక్రీ, స్టేజీ షోలు చేసేవాళ్లం. అన్నయ్య టాలెంట్ చూసి ప్రిన్సిపాల్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. అలా ఇక్కడివరకు వచ్చాడు. అతడిని ఈ సీజన్ విజేతగా చూడాలనుకుంటున్నాను" అని అజయ్ చెప్పుకొచ్చాడు. (టాస్కులో పడిపోయిన అవినాష్) -
బిగ్బాస్: అవినాష్ను ఎత్తి పడేసిన అరియానా
ఈ వారం ప్రారంభంలో బిగ్బాస్ ఇంటిసభ్యులకు బీబీ హోటల్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే కదా! అందులో స్టాప్గా పనిచేసే వారిపై అతిథులు జులుం ప్రదర్శించారు. చిత్రవిచిత్ర టాస్కులు ఇస్తూ టిప్పు కేవలం టిప్పు ఇవ్వడానికే మూడు చెరువుల నీళ్లు తాగించారు. అతిథులు చెప్పినదానికల్లా తలాడిస్తూ, చెప్పిన ప్రతిదాన్ని చిటికెలో చేసినా చివరాఖరకు ఒక్క స్టార్ మాత్రమే సంపాదించగలిగారు. కానీ ఈ టాస్క్లో అతిథుల ఓవర్ యాక్షన్ మాత్రం మామూలుగా లేదు. వీరి అతికి భయపడి సుజాత ఏడ్చేసింది కూడా. ఇదంతా ఓ కంట గమనిస్తూ ఉన్న నాగార్జున నేడు హోటల్ సిబ్బంది టీమ్కు, అతిథులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశమిచ్చారు. (చదవండి: ఇక్కడ రిలేషన్స్ పెట్టుకోవడం వేస్ట్: అఖిల్) దీంతో కసి మీద ఉన్న మాస్టర్.. హారికను తలపై నీళ్ల గ్లాసు పెట్టుకోమని చెప్పగా ఆమె ప్రయత్నించి విఫలమైనట్లు కనిపిస్తోంది. తర్వాత సోహైల్ను కోతిలా గెంతమని ఆదేశించినట్లు కనిపిస్తోంది. 'అవినాష్ నా చేయి పట్టుకున్నాడు', 'నన్ను ముద్దు పెట్టుకోబోయాడు' అంటూ గోల గోల చేసిన అరియానాకు పెద్ద కష్టమైన టాస్క్ ఏమీ ఇవ్వలేదు. అవినాష్ను ఎత్తుకుని తిప్పమని చెప్పగా దాన్ని కూడా ఆమె తనకు అనుకూలంగా మార్చేసుకుంది. అతడిని ఎత్తుకున్నట్లే చేసి అమాంతం కిందపడేసింది. తర్వాత మెహబూబ్.. సుజాతను ఎత్తుకుని ఎక్సర్సైజ్ చేశాడు. అలా ప్రతీకారం తీర్చుకునేందుకు నాగ్ కల్పించిన అవకాశాన్ని ఇంటి సభ్యులు విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారని స్రోమో చూస్తేనే స్పష్టమవుతోంది. (చదవండి: 'పుచ్చ పగిలిపోద్ది' డైలాగ్పై నాగ్ సీరియస్) -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అవినాష్
కొద్ది రోజులుగా ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉన్న అఖిల్, మోనాల్ కలిసిపోయారు. ఇంటిసభ్యులు వారికి జరిగిన సంఘటనలను చెప్తూ ఎమోషనల్ అయ్యారు. రాత్రి వచ్చేసరికి మాత్రం పాటల అంత్యాక్షరిలో ఎంజాయ్ చేశారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్లో మెహబూబ్, అఖిల్ పోటీపడ్డారు. మరోవైపు బిగ్బాస్ ఆత్మ అవినాష్లోకి వచ్చి ఇంటి సభ్యులందరి గురించి చెప్పింది. మరి ఆ ఆత్మ ఏం చెప్పింది? లగ్జరీ బడ్జెట్ టాస్క్లో ఎవరు గెలిచారు? అనే విషయాలను చదివేసేయండి.. అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్: నోయల్ హౌస్లో ఐదో కెప్టెన్గా ఎన్నికైన సోహైల్కు బిగ్బాస్ మొదటిరోజే పరీక్ష పెట్టాడు. నీటి సరఫరా ఆగిపోవడంతో సోహైల్ తన ఇజ్జత్ తీయొద్దని వేడుకున్నాడు. అతని మొర ఆలకించిన బిగ్బాస్ వెంటనే నీళ్లను పంపించాడు. తర్వాత మార్నింగ్ మస్తీలో ఇంటిసభ్యులందరూ మనసులో ఉండిపోయిన తమ సందేశాలను తెలియజేయాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా నోయల్ తన అమ్మ గురించి చెప్పుకొచ్చాడు. 207 ఎముకలు విరగ్గొడితే ఎంత నొప్పి ఉంటుందో పురిటి నొప్పి అంత తీవ్రంగా ఉంటుందని వివరించాడు. అందుకే తన కాలి నొప్పిని నేను టాస్కులో ఎప్పుడూ లెక్కచేయలేదన్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అమ్మ అని, తనను తల ఎత్తుకునేలా చేస్తానని సగర్వగా ప్రకటించాడు. దీంతో లాస్యకు జున్ను గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: అతిథుల టార్చర్.. కుప్పకూలిన అభి) ఇంటి కోసం అప్పు చేశాను: అవినాష్ అవినాష్ మాట్లాడుతూ.. "నేను పేరెంట్స్, ప్రేక్షకులను మాత్రమే నమ్ముతా. లాక్డౌన్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. ఎందుకంటే ఇల్లు కొన్నాను, కానీ ఈఎమ్ఐ కట్టలేకపోయాను. ఎందుకంటే అదే సమయంలో నాన్నకు గుండెపోటు వచ్చింది. మూడు స్టంట్లు వేయడానికి ఇంటి కోసం ఉంచిన 4 లక్షలు ఖర్చు పెట్టాను. అమ్మకు కీళ్లు అరిగిపోతే వైద్యం చేయించాను. దీంతో ఇంటి అప్పు తీర్చేందుకు బయట అప్పు చేశాను. కానీ ఇదంతా నా పేరెంట్స్ కోసమే చేశాను. వాళ్లు పోయినప్పుడు బాధపడకుండా ఉన్నప్పుడే వారికి గౌరవం ఇవ్వండి. ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టకండి. వాళ్లతో కలిసి ఉండండి అని కోరుతూ ఓ మంచి సందేశాన్ని వినిపించాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అవినాష్పై మాస్టర్ మండిపడ్డాడు. తాను రూ.6 కోట్ల ఇల్లు కట్టాను, కానీ అమ్మేశాను, కష్టాలు అలా ఉంటాయి అని సముదాయించాడు. బిడ్డ శవం ఎత్తుకుని వెళ్తే బస్సెక్కనియ్యలే తర్వాత గంగవ్వ మాట్లాడుతూ.. "ఐదేళ్లప్పుడే పెళ్లి. 17 ఏళ్లకే కొడుకు. ఇంకో రెండేళ్లకే కూతురు పుట్టింది. తాగి కొట్టే భర్త విదేశాలకు పోయిండు. ఓ రోజు నా కూతురుకు ఫిట్స్ రావడంతో ఆమెను ఎత్తుకుని నడక ప్రారంభించాను. అప్పుడు ఊర్లోకి బస్సు వచ్చేది కాదు. కానీ ఊరి నుంచి వెళ్లే ఓ బండి నన్ను చూసి ఎక్కించుకుంది. అలా జగిత్యాల ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ ఆమె చనిపోయిందని చెప్పగానే బిడ్డను ఎత్తుకుని వెనుదిరిగాను. బస్ ఎక్కబోతే శవంతోని లోపలకు రానీయలేదు. ఆటోలో ఇంటికి వెళ్లాను" అని ఏడ్చేసింది. తర్వాత మళ్లీ అన్నం తినలేకపోతున్నానని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: బిగ్ బాస్ : సీక్రెట్ టాస్క్ అవినాష్ కొంప ముంచేనా?) లగ్జరీ బడ్జెట్ టాస్క్లో గెలుపొందిన మెహబూబ్ బిగ్బాస్ ఇంటిసభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అఖిల్, మెహబూబ్ పోటాపోటీగా ఆడారు. తర్వాత గెలిచిన మెహబూబ్ మోనాల్తో మసాజ్ చేయించుకున్నాడు. ఇక అఖిల్ కొద్దిరోజులుగా దూరం పెట్టిన మోనాల్తో మాట్లాడి ఆమెను కూల్ చేశాడు. కానీ దేవుడి మీద నమ్మకం ఉంది గానీ నీ మీద లేదని మోనాల్ మొహం మీదే చెప్పేశాడు. బిగ్బాస్ ఈసారి ఓ క్రేజీ టాస్క్ ఇచ్చాడు. బిగ్బాస్ను ప్రసన్నం చేసుకోవాలని, అతని ఆత్మను రప్పించాలని చెప్పాడు. ఆ ఆత్మ అవినాష్ శరీరంలోకి వస్తుందని తెలిపాడు. వెంటనే ఇంటి సభ్యులందరూ బిగ్బాస్ ఆవాహయామి అంటూ చేతులు పట్టుకుని వలయాకారంలో అవినాష్ చుట్టూ తిరిగారు. వెంటనే ఉరుములు, మెరుపులతో బిగ్బాస్ ఆత్మ అవినాష్ శరీరంలోకి వచ్చింది. అతడు ఇంటి సభ్యులు ఒక్కొక్కరి గురించి వివరంగా చెప్పాడు. (చదవండి: బిగ్బాస్: గంగవ్వ భజన చూడలేక..) ఐ లవ్ యూ : దివి నోయల్ను కుంటడం మానేయమని, సుజాతను చిన్న చిన్న విషయాలకు అలగడం మానేయాలని చెప్పాడు. మోనాల్ తెలుగులో చక్కగా మాట్లాడుతుందని మెచ్చుకున్నాడు. ఇక గంగవ్వ మాత్రం అవినాష్(బిగ్బాస్)కు ఓ కోడిని కోసి పెడతా, ఇంటికి రా అని చెప్పింది. తర్వాత సోహైల్ను గట్టిగా మాట్లాడటం తగ్గించండని చెప్పాడు. దివి బిగ్బాస్కు ఐ లవ్ యూ చెప్పడంతో కాసేపు మెలికలు తిరిగాడు. మెహబూబ్ బాగా ఆడుతున్నాడని, కానీ కోపానికి వస్తున్నారని అన్నాడు. హారిక ముద్దులతో సైగలు ఇవ్వగా అవినాష్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక హోటల్ టాస్క్లో అవినాష్ను బాగా టార్చర్ పెట్టావని అరియానాను తిడుతూనే, ముక్కుసూటి మనిషి అని మెచ్చుకున్నాడు. ఈ వయసులో కూడా బాగా ఆడుతున్నాడని మాస్టర్పై సెటైర్ వేశాడు. అనంతరం మళ్లీ మెరుపులతో బిగ్బాస్ ఆత్మ అవినాష్ నుంచి వెళ్లిపోయింది. మోనాల్కు దివి, మాస్టర్ సలహాలు తర్వాత గంగవ్వతో ముచ్చట్లు పెట్టుకుంటుంటే మధ్యలో వచ్చినందుకు అవినాష్ను సుజాత ఒక్కటిచ్చింది. రాత్రి ఇంట్లో అంత్యాక్షరి జరిగింది. మాస్టర్, అవినాష్, అరియానా, సోహైల్ పాటలు పాడాడు. ఈ పాటల పోటీ ముగిశాక దివి మోనాల్కు కొన్ని సూచనలు చేసింది. మోనాల్కు నేనంటే ఇష్టమని ఇద్దరు అబ్బాయిలు(అభిజిత్, అఖిల్) ఫీల్ అవుతున్నారు అని ఆమె చెవిన వేసింది. నేనలా చెప్పలేదని, నా పేరు వాడొద్దని మాత్రమే చెప్పానని మోనాల్ తెలిపింది. అఖిల్తో ఉంటే ఏం కాదు కానీ, అభిజిత్తో ఉండొద్దని మాస్టర్ ఉచిత సలహా ఇచ్చాడు. ఇద్దరూ జెన్యూన్, నువ్వే వాళ్లకు క్లారిటీ ఇవ్వు అని దివి చెప్పుకొచ్చింది. (చదవండి: నేను పెళ్లి చేసుకోడానికి రాలేదు: అఖిల్) -
బిగ్బాస్ హౌస్లో చేతబడి: ఎవరికో తెలుసా?
కాదేదీ బిగ్బాస్ టాస్క్కు అనర్హం అన్నట్లుగా ఉంది ప్రస్తుత సీజన్ పరిస్థితి. కెప్టెన్ పోటీకి ఏ ఆటా దొరకనట్టు కింద మంట, పైన ఐస్గడ్డ పట్టుకోమని ఓ రకంగా కంటెస్టెంట్లను చిత్రహింసలు పెట్టారు. ఇది చూసి కెప్టెన్సీ పోటీలో నిలబడలేనివారు బతికిపోయారాం దేవుడా అని గాఢంగా నిట్టూర్పు వదిలారు. కానీ ఆ నరకాన్ని తట్టుకుని మరీ సోహైల్ కెప్టెన్గా విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. ఇక ఈసారి బిగ్బాస్ హౌస్లో చేతబడి జరుగుతోంది. నమ్మశక్యంగా లేదు కదూ.. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను చూడండి. అందులో బిగ్బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్బాస్ అవతారంలో ఉన్న అవినాష్ను అందరూ ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఏమైనా కుప్పిగంతులు వేస్తారేమోననుకుంటే పొరపాటే. (చదవండి: అతడు నాకు అస్సలు నచ్చడు: స్వాతి దీక్షిత్) అందరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని "బిగ్బాస్ ఆవాహయామి" అంటూ పిలుస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అవినాష్కు బిగ్బాస్ పూనాడు. అంతే.. అప్పటికే తెగ ఉవ్విళ్లూరుతున్న హారిక ఏదో ప్రశ్న అడగబోతూ ఇంగ్లీష్లో మాట్లాడటంతో తెలుగులో మాట్లాడమని అవినాష్ కౌంటర్ వేశాడు. బిగ్బాస్ను ఇమిటేట్ చేసిన అవినాష్ అబ్బాయిలకు పంచ్లు విసిరాడు కానీ మిగతా అమ్మాయిల విషయానికి వచ్చేసరికి బోల్తా కొట్టాడు. వాళ్లు ఐ లవ్ యూ అంటూ గాల్లోనే ముద్దులు పంపిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ప్రేమ పాటలు వేసుకుంటూ వేరే లోకంలో మునిగిపోయాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు షోలో ఎంటర్టైన్మెంట్ తగ్గగానే వెంటనే అవినాష్ను హైలెట్ చేస్తారంటున్నారు. ఈ ఒక్క టాస్క్ గత సీజన్ల నుంచి కాపీ కొట్టకుండా, కొత్తగా ఆలోచించారని ప్రశంసిస్తున్నారు. (చదవండి: అఖిల్ పడుకున్నాక అభితో మోనాల్ ముచ్చట్లు!) -
బిగ్ బాస్ : రౌడీయిజం ఊర్లో చేస్కో.. అవినాష్ ఫైర్
బిగ్ బాస్ 4 హౌస్లో బీబీ హోటల్ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. హోటల్ సిబ్బందితో అతిథులు ఆడేసుకుంటున్నారు. ఇష్టం వచ్చిన వంటకాలను ఆర్డర్లు ఇవ్వడమే కాగా, పలాన టైంలోపే ఇవ్వాలని కండీషన్లు పెడుతున్నారు. దాంతో పాటు ఫిజికల్ టాస్కులు ఇచ్చి హోటల్ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక రిచ్మెన్లుగా ఉన్న మోహబూబ్, సోహైల్లో అయితే తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. వారి చేష్టలు హోటల్ సిబ్బందికి కోపం తెప్పిస్తున్నటకీ ఓపికతో అడిగిన పనులన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మెహబూబ్ అయితే సిబ్బందితో ఓ ఆట ఆడుకుంటున్నాడు. మటన్ మండీ కావాలని, చికెన్ బిర్యానీ చెయ్యండంటూ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నాడు. అయితే మెహబూబ్ మరింత రెచ్చిపోవడంతో హౌస్లో గొడవ జరిగింది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే ఆ విషయం తెలుస్తోంది. (చదవండి : బిగ్ బాస్: అతిథుల టార్చర్.. కుప్పకూలిన అభి) రిచ్మెన్లు అబద్దాలు ఆడుతున్నారని అవినాష్ అంటుండగా, నోరు జారకుండా మాట్లాడండి.. ఒక్క మాట తేడా వచ్చినా... పగిలిపోతుంది అంటూ మెహబూబ్ వార్నింగ్ ఇచ్చాయి. దీంతో ఆగ్రహానికి లోనైనా అఖిల్.. మెహబూబ్పై విరుచుకుపడ్డాడు. మాటలు కంట్రోల్ పెట్టుకోవాలని, ఒక లెవల్ దాటి మాట్లాడొదంటూ హెచ్చరించాడు. నేను నిన్ను అన్నానా అంటూ అఖిల్పై మెహబూబ్ ఫైర్ అయ్యారు. ఇక మధ్యలో కలగజేసుకున్న అవినాష్.. రౌడీయిజం చూపించుకోవాలంటే ఊర్లో చూపించుకో.. ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ చేసుకుంటే వేరేలా ఉంటుందంటూ మొహబూబ్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయితే మెహబూబ్ ఎవరిని ఉద్దేశించి సీరియస్ అయ్యారనేది తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. #Mehboob warns the housemates #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/BuLYsviIoI — starmaa (@StarMaa) October 7, 2020 -
బిగ్ బాస్ : సీక్రెట్ టాస్క్ అవినాష్ కొంప ముంచేనా?
బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకుంది. వైల్డ్ కార్డుల ఎంట్రీలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, చిన్న చిన్న గొడవలతో ఇప్పటి వరకు షో కొనసాగుతూ వచ్చింది. ఇక గతంలో షో మొదలైన కొద్ది రోజులకే కంటెస్టెంట్స్కి సీక్రెట్ టాస్క్ ఇచ్చి గొడవలు పెట్టేవాడు బిగ్బాస్. కానీ సీజన్ 4లో మాత్రం నెల రోజుల తర్వాత సీక్రెట్ టాస్క్ వచ్చింది. అదీ కూడా అందరితో కలిసిమెలిసి ఉంటున్న అవినాష్ మెడకు పడింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టిన అవినాష్.. తొలిరోజు నుంచి హౌస్మేట్స్ అందరితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అతని మంచితనం కారణంగానే ఆయన ఇంత వరకు ఒక్కవారం కూడా ఎలిమినేషన్కు నామినేట్ కాలేదు. అతని కామెడీ టైమింగ్, మిమిక్రీకి కంటెస్టెంట్స్ అంతా ఫిదా అయ్యారు. దీంతో అవినాష్ను ఎలిమినేషన్కు నామినేట్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడంతో లేదు. ఇది గమనించిన బిగ్ బాస్.. అవినాష్ని ఎలాగైన రిస్క్లో పెట్టాలని భావించినట్లున్నాడు. అందుకే అతనికి సీక్రెట్ టాస్క్ ఇచ్చి ఇబ్బంది పెట్టాడు. (చదవండి : బిగ్ బాస్: అతిథుల టార్చర్.. కుప్పకూలిన అభిజిత్) బీబీ హోటల్ టాస్క్లో భాగంగా అవినాష్ సీక్రెట్ టాస్క్ చేయాల్సి ఉంది. హోటల్ సిబ్బందిగా ఉంటూనే.. వారికి స్టార్స్ రాకుండా చేయడం అవినాష్ పని. అందులో భాగంగా అవినాష్ ఇప్పటికే అతిథులైన హారిక, అరియానాను ఇరిటేట్ చేశాడు. గెస్ట్గా వచ్చిన తనను పట్టించుకోకుండా అరియానా రాగానే ఆమెవైపు వెళ్లడంతో అవినాష్పై హారిక కోపం పెంచుకుంది. అయితే సీక్రెట్ టాస్క్లో ఇది భాగమని హారికకు తెలియదు. అలాగే యువరాణి అయిన అరియానాను కావాలని రెచ్చగొడుతున్నాడు. తన పంచ్లతో, చేష్టలతో అరియానాకు చిరాకు తెప్పిస్తున్నాడు. అలాగే అతిథుల కోసం చేసిన వంటలలో ఉప్పు వేసి చెడగొట్టాడు. ఇవన్ని చూస్తూంటే అవినాష్కు ఇకపై ఇంట్లో పోరు తప్పదనిపిస్తుంది. సీక్రెట్ టాస్క్ ముగిసేలోపు అవినాష్కు అందరితోనూ గొడవలు జరిగేలా ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ వచ్చేవారం ఎలిమినేషన్ ప్రక్రియలో కచ్చితంగా ఉంటుంది. ఇంటి సభ్యులంతా అవినాష్ను టార్గెట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఇది సీక్రెట్ టాస్క్ అని తెలిస్తే కొంతమంది అవినాష్ను తప్పపట్టకపోవచ్చు. ఏదిఏమైనా అవినాష్కు ఉన్న ‘మంచి’పేరు సీక్రెట్ టాస్క్తో పోతుందనే చెప్పాలి. సీక్రెట్ టాస్క్ ఎఫెక్ట్తో వచ్చే వారం ఎలిమినేషన్ అయ్యేవారిలో అవినాష్ కూడా ఉంటాడని కొంతమంది భావిస్తున్నారు. -
అవినాష్ ముద్దు పెట్టుకోబోయాడు: అరియానా
నామినేషన్లో వీర లెవల్లో ప్రతాపాలు చూపించిన ఇంటి సభ్యులు ఆవేశం చల్లారగానే ఆలోచనలో పడ్డారు. బాధపెట్టామని భావించిన వారికి క్షమాపణలు చెప్పారు. ఎమోషనల్ ఫైట్తో హీటెక్కిన హౌస్ను బిగ్బాస్ బీబీ టాస్క్ ద్వారా కూల్ చేశాడు. రెచ్చిపోయి పర్ఫామ్ చేసిన ఇంటి సభ్యులు పంచ్లు కూడా విసురుకున్నారు. అయితే హోటల్ స్టాఫ్లోనే ఒకరు వారి సేవలను చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటే మరొకరు అతిథుల దగ్గర నుంచే స్టార్లను దొంగిలించడం విశేషం. మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి.. నోయల్కు మాస్టర్ శాపనార్థాలు నామినేషన్లో దివి చెప్పిన పప్పు కారణానికి లాస్య వెక్కి వెక్కి ఏడుస్తుంటే గంగవ్వ ఆమెను తల్లిలా దగ్గరకు తీసుకుని ఊరుకోబెట్టింది. తర్వాత మోనాల్ ఏడుస్తుంటే లాస్య బుజ్జిగించింది. అది చూసిన అభి.. ఇదంతా నా వల్లే జరిగింది అంటూ క్షమాపణలు కోరాడు. అయినా ఆమె అలకతో బయటకు వెళ్లిపోయింది. తర్వాత అఖిల్తో కూర్చుంది. నీ కోసం పోట్లాడితే నామినేషన్లో నన్ను తప్పుగా చూపించావు అని అఖిల్ అలిగి మాట్లాడటం మానేశాడు. అనంతరం నోయల్ తను నామినేట్ చేసిన అమ్మ రాజశేఖర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అతను వినిపించుకోలేదు. ఈ కబుర్లన్నీ చిన్నపిల్లలకు చెప్పుకోపో అని కసురుకున్నాడు. "నన్ను పంపించేయాలని ప్లాన్ చేశావ్, అదే జరగాలి, నువ్వు జీవితాంతం బాధపడాలి" అని శాపనార్థం పెట్టాడు. (చదవండి: బిగ్బాస్: అవినాష్ గుట్టు విప్పనున్న నాగ్) అవినాష్కు సీక్రెట్ టాస్క్ అనంతరం బిగ్బాస్ అవినాష్ను సీక్రెట్ రూమ్లోకి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బీబీ హోటల్లో స్టాఫ్ ఛాలెంజ్లను, అతిథులకు అందించే సర్వీసులను పాడు చేయాలని ఆదేశించాడు. హోటల్ స్టాఫ్కు తక్కువ స్టార్లు వచ్చేలా చూడాలని చెప్పాడు. ఇక హోటల్ మేనేజర్ అఖిల్, స్టాఫ్ అభిజిత్, సెక్యూరిటీ అండ్ చెఫ్ సుజాత, లాస్య, అసిస్టెంట్ చెఫ్ అండ్ వెయిటర్ అమ్మ రాజశేఖర్, హౌస్ కీపింగ్ నోయల్, కుమార్, సర్వీస్ అండ్ స్పా దివి, మోనాల్, అసిస్టెంట్ మేనేజర్గా అవినాష్ వ్యవహరించారు. రిచ్మెన్లుగా మెహబూబ్, సోహైల్, హారిక, రాకుమారిగా అరియానా, ఆమె తల్లిగా గంగవ్వ పాత్రల్లో లీనమయ్యారు. (చదవండి: అఖిల్ పాపం, మోనాల్ ఆడుకుంటోంది) చెంచాతో బకెట్ నింపు: అరియానా ఆట మొదలవగానే అతిథులు దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా హోటల్ సిబ్బందితో సేవలు చేయించుకున్నారు. మెహబూబ్ తనకు చికెన్ పకోడి కావాలంటే గంట, గంటన్నర పడుతుందని అభిజిత్ చెప్పాడు. నేను అరగంటలో చేస్తానని మెహబూబ్ అనడంతో వెళ్లి, చేసుకోండి అని అభిజిత్ పంచ్ వేశాడు. తర్వాత రాకుమారి అరియానా అవినాష్ తన చేయి పట్టుకున్నాడని మహారాణి గంగవ్వతో చెప్పడంతో కాలు మొక్కు అని అతడికి ఆర్డర్ వేసింది. ముద్దు పెట్టుకుందామని కూడా ప్రయత్నించారంటూ అరియానా గగ్గోలు పెట్టింది. అవినాష్ చేసిన పనికి చెంచాతో బకెట్ నింపమని శిక్ష విధించింది. అలా స్టార్స్ ఇవ్వడానికి మూడు చెరువుల నీళ్లు తాగించారు. (చదవండి: నా క్యారెక్టర్తో ఆటలొద్దు : మోనాల్) ఐదు స్టార్లను లేపేసిన అభిజిత్ వీరి ప్రవర్తనతో విసుగెత్తిపోయిన అవినాష్ రాకుమారిని చిల్లరగా ప్రవర్తించకండని విసుక్కున్నాడు. మధ్యలో సోహైల్ కలగజేసుకుని మాట్లాడబోతే దీనితో మీకు సంబంధం లేదంటూ వేలు చూపించాడు. దీంతో మేనేజర్ అఖిల్ రంగంలోకి దిగి అవినాష్ను కొట్టినట్లు చేసి పక్కకు తీసుకెళ్లాడు. రాత్రి కావస్తున్నా ఒక్కరు కూడా స్టార్ ఇవ్వకపోవడంతో చిర్రెత్తిపోయిన మాస్టర్ సోహైల్ను నువ్వెప్పుడైనా ఫైవ్ స్టార్ హోటల్ వెళ్లావా? లేదా? అని సీరియస్ అయ్యాడు. అన్నీ చేయించుకుని కనీసం టిప్పు కూడా ఇవ్వట్లేదని ముఖం మాడ్చుకున్నాడు. కానీ అభిజిత్ అందరిలా అపసోపాలు పడలేదు. ఇక్కడ కూడా అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడు. అతిథులను మెప్పించి సంపాదించాల్సిన 5 స్టార్లను వాళ్లకు తెలియకుండానే కొట్టేశాడు. అటు అవినాష్ కూడా ఎవరికీ ఏ అనుమానం రాకుండానే హోటల్ స్టాఫ్లకు ఏ టిప్పూ, స్టార్ రాకుండా ఆటను చెడగొడుతున్నాడు. రేపు ఈ గేమ్ మరింత సీరియస్ కానున్నట్లు తెలుస్తోంది. -
అవినాష్ చెంప ఛెళ్లుమనిపించిన అఖిల్
బిగ్బాస్ నాల్గవ సీజన్ పడుతూ లేస్తూ ఎలాగోలా నెల రోజులు పూర్తి చేసుకుంది. కానీ అప్పటికీ ఇప్పటికీ ఇంటిసభ్యుల ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ముఖానికి ధరించిన మాస్కులు తీసేశారు. చాలామంది సేఫ్ గేమ్ ఆడటాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఒక్కొక్కరి నిజస్వరూపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో అయితే నువ్వా? నేనా? అన్న రీతిలో పోట్లాటకు దిగారు. వీరావేశంతో ఊగిపోయారు. నామినేషన్తో వేడెక్కిన బిగ్బాస్ హౌస్ను కూల్ చేసేందుకు బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో బీబీ హోటల్కు గంగవ్వ, అరియానా కస్టమర్లుగా విచ్చేశారు. వచ్చీరాగానే అవినాష్.. అరియానా చేయి పట్టుకొని కాస్త దూకుడు ప్రదర్శించాడు. (చదవండి: అవినాష్ పారితోషికం ఎంతో తెలుసా?) మోనాల్, దివి, అభిజిత్ స్పా సెంటర్లో పని చేస్తారు. అయితే హారిక రాగానే అభి తాను కూడా బాగా చేస్తానంటూ ముందుకు వచ్చాడు. తర్వాత కుమార్ సాయి బెడ్రూమ్లో స్ప్రే కొడుతుంటే ఇది వాష్రూమ్ స్ప్రేలా ఉందని మెహబూబ్ మొహం చిట్లించుకున్నాడు. అంటే మీరు ఎక్కువగా వాష్రూమ్లో స్పెండ్ చేస్తారనుకుంటానని కుమార్ పంచ్ వేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అఖిల్.. అవినాష్ చెంప ఛెళ్లుమనిపించాడు. కానీ అదంతా టాస్క్లో భాగంగానే అని తెలుస్తోంది. ఇక బిగ్బాస్ అవినాష్కు సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు. అందులో భాగంగా హోటల్ టాస్క్ను అల్లకల్లోలం చేయమన్నాడా? ఎవరితోనైనా గొడవ పెట్టుకోవాలని చెప్పాడా? అసలు ఆ సీక్రెట్ టాస్క్ ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి ఆయన తనకిచ్చిన సీక్రెట్ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! (చదవండి: బిగ్బాస్: రీ ఎంట్రీపై స్పందించిన దేవి) -
మీరు సిగ్గుపడితే చచ్చిపోవాలనుంది: నాగ్
బిగ్బాస్ హౌస్లో ఏదైనా టాస్క్ ఇస్తే చాలు.. అమ్మాయిల జోలికి వెళ్లద్దని కొందరు, అమ్మాయిలను అడ్డు పెట్టుకుని ఆడొద్దు అని మరికొందరు వార్నింగ్లు ఇచ్చుకుంటారు. ప్రతిసారి వారిని బలహీనులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపై అలాంటివి జరగకుండా చూసుకునేందుకు నాగ్ సంసిద్ధమయ్యారు. కంటెస్టెంట్లకు జెండర్ ఈక్వాలిటీ టాస్క్ ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే బిగ్బాస్ హౌస్ను జంబలకిడి పంబగా మార్చేశారు. అబ్బాయిలు అమ్మాయిల వేషం కట్టగా అందమైన భామలతో పాటు బామ్మ కూడా మగరాయుడిలా రెడీ అయ్యారు. అయితే ఈ నకిలీ అమ్మాయిల అందాలను చూడలేక నాగ్ సిగ్గుతో తల దించుకున్నారు. (చదవండి: అఖిల్ పడుకున్నాక అభితో మోనాల్ ముచ్చట్లు!) అక్కడ వాళ్లు మాత్రం వయ్యారాలు పోతూ, సొగసును చూపిస్తూ చిందులేశారు. మీరు సిగ్గుపడుతుంటే తాను చచ్చిపోయేలా ఉన్నానని నాగ్ అబ్బాయిలకు కౌంటర్ వేశారు. అందరి కన్నా గంగవ్వ గెటప్ హైలెట్గా నిలిచింది. తలపై విగ్గు, ప్యాంటు షర్ట్, మూతికి మీసం పెట్టుకుని మగరాయుడు అనిపించింది. ఇంత కష్టపడి గెటప్లు వేసుకున్నాక ఊరికే ఉంటారా? జంటలుగా విడగొట్టి డ్యాన్సులు కూడా చేయించారు. ఈ క్రమంలో అబ్బాయిలా మారిపోయిన హారిక ఇంకా పొట్టిగా కనిపించడంతో నువ్వు ఏ క్లాస్ అంటూ అవినాష్ ఆమెను ఆటపట్టించాడు. మరి ఇంటి సభ్యుల వేషధారణ, వారు చేసే కామెడీని చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఓపిక పట్టాల్సిందే! (చదవండి: బిగ్బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ) -
అవినాష్, అరియానాల బండారం బయటపడనుందా?
బిగ్బాస్ హౌస్లో ఉన్న జంటలు సరిపోవని ఈ మధ్య కొత్త జంట పుట్టుకొచ్చినట్లు కనిపిస్తోంది. రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లో అడుగు పెట్టిన అవినాష్ వచ్చీ రాగానే మెనాల్ వెంట పడ్డాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. దీంతో అరియానాతో క్లోజ్గా ఉంటున్నాడు. ఆమె కూడా అతడికి ప్రతీ విషయంలో బాగా సపోర్ట్ చేస్తోంది. టాస్కులోనూ అతని కాయిన్లు దొంగతనం చేయడానికి వస్తుంటే అవినాష్ను నిద్ర లేపి మరీ హెచ్చరించింది. ఎవరి కాయిన్లు తీసినా అతనివి మాత్రం తీయొద్దని మిగతా హౌస్మేట్స్ను వేడుకుంది. అలాగే నిన్నటి ఎపిసోడ్లో అద్దం టాస్క్లో భాగంగా అవినాష్ చేసిన కామెడీకి సుజాత హర్ట్ అయింది. దీంతో ఇలాంటి టాస్కులు ఇవ్వకండని అవినాష్ బిగ్బాస్కు చెప్పాడు. అయితే అలా చెప్పడం తప్పని, ఒకరికోసం నువ్వెందుకు మానుకుంటావని అతడికి పాజిటివిటీని నూరిపోసింది. (చదవండి: బిగ్బాస్: అరియానా నోరు మూయించిన గంగవ్వ) ఇంకాస్త వెనక్కు వెళ్తే.. అరియానా, అవినాష్లు సోఫాపై వేలితో రాస్తూ ఏదేదో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అతడికి గట్టిగా ఓ హగ్గిచ్చింది కూడా! కానీ ఆ సైగల భాష వారికి తప్ప ఇంకెవరికీ అర్థం కాలేదు. దీంతో అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. నేటి ఎపిసోడ్లో నాగ్ కూడా వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో వారితోనే చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అరియానా అన్నింటికీ తలాడిస్తున్నప్పటికీ, అవినాష్ మాత్రం ఎక్కడ బండారం బయటపడిపోతుందోనని ఆపేయండి సార్ అంటూ నాగ్ను చేతులెత్తి వేడుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరి సీక్రెట్లను నాగ్ ఎలా బయటపెట్టనున్నాడనేది తెలియాలంటే ఇంకొద్ది గంటలు వేచి చూడాల్సిందే! (చదవండి: బిగ్బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్) -
బిగ్బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ
ఐపీఎల్, కరోనాను ఎదుర్కొని ప్రేక్షకులకు బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు బిగ్బాస్ సీజన్ 4 తమ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. టాస్క్లు, ట్విస్టులు, నామినేషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో భారీ స్థాయిలో వినోదాన్ని పంచుతోంది. ఇక బిగ్బాస్ ఇంటి హౌజ్లో 26వ రోజు సందడి సందడిగా సాగింది. ఉదయాన్నే హుషారైన పాటకు అందరూ ఎనర్జిటిక్గా డ్యాన్స్లు చేశారు. మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులందరికి మెహబూబ్ డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తున్నాడు. ఇంటి సభ్యుల్లో కొంతమందికి మాత్రమే లగ్జరీ బడ్జెట్ లభించింది. ష్యాషన్ షోలో ర్యాంప్ వాక్లతో అలరించారు. ఇంకేం జరిగిందంటే.. చపాతి స్టెప్ చేసిన మెహబూబ్ లాస్య ఎక్కువగా కిచెన్ వర్క్ చేస్తుంటుంది. కిచెన్లో ఆమె చేసే చపాతిని డ్యాన్స్ రూపంలో చేసి చూపించాడు మెహబూబ్. అవినాష్ కాలుకు దెబ్బ తగలడంతో కాలు కదలకుండా, అఖిల్ లాగా వర్కౌట్స్ ఎలా చేయాలో డ్యాన్స్ చేయాలో చేసి చూపించాడు. వీటితోపాటు ఇంట్లో కోపిష్టిగా పేరు తెచ్చుకున్న సోహైల్ ఆగ్రహంతో ఏ విధంగా డ్యాన్స్లు చేయాలో చూపించాడు. మాస్టర్తో కలిసి కాంచనలా మారి స్టెప్పులు వేశాడు. గంగవ్వ, స్వాతి, కుమార్ సాయి.. ఇలా ఇంట్లోని వారందరితోనూ ఏదో ఒక విధంగా డ్యాన్స్ చేపించాడు. అవినాష్ తనలోని మిమిక్రీ టాలెంట్ను ప్రదర్శించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాలోని విలక్షణ నటుడు ప్రకాష్రాజ్ వాయిస్ను మిమిక్రీ చేసి చూపించాడు. చదవండి : అఖిల్కు బిగ్బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి? కన్ఫెషన్ రూమ్లోకి అఖిల్ ఇంటి సభ్యులంతా హాల్లో కూర్చొని ఉండగా అఖిల్ను బిగ్బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించాడు. ఆ రూమ్లోకి వెళ్లిన అఖిల్ మిగతా ఇంటి సభ్యులకు కనిపించనున్నాడు. ఈ వారం రేషన్ మేనేజర్గా అఖిల్ ఎన్నికైనందున అతనికి లగ్జరీ బడ్జెట్ షాపింగ్ చేయాలి. లగ్జరీ బడ్జెట్ సామాన్ల లిస్ట్ను అందించి, తమ దగ్గర ఉన్న 3200 పాయింట్లో ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు చొప్పున16 ఎంపిక చేయాలి. లాస్యకు చికెన్ పచ్చడి, నోయల్కు బ్రెడ్, నూడుల్స్ సోహైల్, పోహ మెహబూబ్, పన్నీర్ మోనాల్, మాస్టర్కు శనగపిండి, కార్నఫ్లెక్స్ గంగవ్వకు కేటాయించాడు. కన్ఫేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చాక తమకు ఏ వస్తువులు రాని ఇంటి సభ్యులు కొంత నిరాశ చెందాడు. అఖిల్ వేరే విధంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండని అనుకున్నారు. చదవండి : బిగ్బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే.. పిచ్చెక్కించిన ఫ్యాషన్ షో ఇంట్లోని సభ్యులందరికి కొత్త బట్టలు వచ్చాయి. చందన బ్రదర్స్ పంపించిన దుస్తులను ధరించి అందంగా తయారు అవ్వాలి. అనంతరం చందన బ్రదర్స్ ఫ్యాషన్ టాస్క్ చేయాలి. ఈ టాస్క్లో ర్యాంప్ వాక్ చేయాలి. ఇందులో మంచిగా చేసిన ఒక అబ్బాయి, అమ్మాయిని విజేతగా ప్రకటించి వారికి లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ను అందించాలి. ర్యాంప్ వాక్లో అబ్బాయిలందరూ ఒక్కొక్కరూ వచ్చి తమదైన స్టైల్లో వాక్ చేశారు. ఆ తర్వాత అమ్మాయిలందరూ అందంగా ర్యాంప్ వాక్ చేసి అబ్బాయిల గుండెల్లో మంటలు రేపారు. కుందనపు బొమ్మలా కనిపించారు. అమ్మాయిల నుంచి గంగవ్వను ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించగా..అవ్వకు లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ అందించారు. అబ్బాయిల నుంచి అవినాష్ను విజేతగా తెలిపారు. బిగ్బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే.. అద్దంలా మారిన అవినాష్ ఇంట్లోని అమ్మాయిలకు అందంగా తయారు అవ్వడం మహా ఇష్టం. ఈ క్రమంలో అవినాష్ అమ్మాయిలకు అద్దంగా వ్యవహరించనున్నాడు. ప్రతి అమ్మాయి అద్దం(అవినాష్) ముందుకు వచ్చి తమ మనసులోని ఫీలింగ్స్ను చెప్పుకోవాలి. ఇందులో అవినాష్ తన దగ్గరకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆటాడుకున్నాడు. వాళ్లపై పంచ్లు వేస్తూ వారిని సరదాగా అలరించాడు. చివరగా ర్యాంప్ వాక్ షో లో ఎవరూ ఎలా చేశారో ఇమిటెట్ చేసి చూపించారు. అయితే సుజాత బుంగమూతి పెట్టుకుని అలిగింది. ఈ నెపంతో లాస్య, సుజాతకు మధ్య చిన్నగా వివాదం మొదలైంది. విన్నర్గా ముందు నోయల్ను చెప్పి ఆ తరువాత అవినాష్ను ప్రకటించినదని లాస్య సుజాత మధ్య గొడవ అయ్యింది. తర్వాత అవినాష్ సుజాతను కూల్ చేశాడు. అంతేగాక తనకు నచ్చినట్లు ఆడి బిగ్బాస్లో ఉండాలని, ఇతరులను బతిమాలడం మానేయాలని అరియానా అవినాష్లో స్పూర్తిని నింపింది. -
బిగ్బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే..
బిగ్బాస్ సీజన్ 4లో కావాల్సినంత వినోదం అందుతోంది. ఆటలు, పాటలు, టాస్క్లతోపాటు హౌజ్లో అందానికి కూడా కొదవేలేదు. ఈ సీజన్లో గంగవ్వ మినహా ప్రస్తుతం ఉన్న అమ్మాయిలంతా దాదాపు యంగ్ వారే కావడంతో కంటెస్టెంట్ల మధ్య బోలెడంత లవ్ట్రాక్లు నడుస్తున్నాయి. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త టాస్క్లు,స్కిట్లతో బిగ్బాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా బిగ్బాస్ ప్రతి సీజన్లోనూ ఓ ఎపిసోడ్ను ఫ్యాషన్ షోకు కేటాయించే సంప్రదాయం కొనసాగుతోంది. అలాగే ఈ సీజన్లో కూడా నేడు బిగ్బాస్ హౌజ్లో ష్యాషన్ షో జరగనుంది. చదవండి: అఖిల్కు సర్ప్రైజ్ ఇవ్వనున్న బిగ్బాస్ అయితే ఈ ఫ్యాషన్ షోలో ఇంటి సభ్యులందరూ సంప్రదాయమైన దుస్తులను ధరించాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్లందరూ తమ ట్రెడీషనల్ లుక్లో జిగేలు మనిపించారు. అబ్బాయిలంతా కుర్తా దుస్తుల్లో స్టేజ్పై ర్యాంప్ వాక్తో అదరగొట్టగా..ఇక అమ్మాయిలయితే తమ అందచందాలతో మైమరిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. చీర కట్టుతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలాగా మెరిసిపోతున్నారు. అంతేగాక బిగ్బాస్ గ్యాంగ్ అంతా స్టేజ్ మీదకు వచ్చి డాన్స్లతో కెవ్వు మనిపించనున్నారు. ఆ తర్వాత అవినాష్ ఇంట్లోని ఆడవాళ్లకు అద్దంలా మారబోతున్నాడు. తన ముందుకు వచ్చిన అమ్మాయిలతో అద్దంగా మారిన అవినాష్ వారిపై సరదాగా సెటైర్లు వేస్తూ హాస్యం పండించనున్నారు. చదవండి: బిగ్బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్ Adarakotte fashion show ayyaka...#Avinash addamlo book aipoyaru 😂 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/gGGvolKgZr — starmaa (@StarMaa) October 2, 2020 -
బిగ్బాస్: టాస్క్లో పడిపోయిన అవినాష్
కాయిన్లు సంపాదించాలనేది బిగ్బాస్ ఇచ్చిన టాస్క్. దొంగతనం చేయడం కూడా టాస్క్లో ఓ భాగమే. కానీ రాత్రిపూట కూడా నిద్రపోకుండా జాగారం చేసి మరీ అందరి కాయిన్లు నొక్కేసినందుకు సోహైల్పై మిగతా హౌస్మేట్స్ అరిచారు. పైగా ఎవరి కాయిన్లు తీయను అంటూ అందరినీ నమ్మిస్తూనే నొక్కేసిన మాస్టర్.. తన కాయిన్లు పోయినందుకు సోహైల్పై కక్ష కట్టాడు. అసలే అతిగా ఆవేశపడే అతడు.. అందరూ తననే టార్గెట్ చేయడంతో కథ వేరే ఉంటది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ ఆటలో గంగవ్వ పాల్గొనకపోవడం గమనార్హం. నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. గుట్టు రట్టవుతుందని మాస్టర్ కంగారు బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లో భాగంగా కొందరు కష్టపడి కాయిన్లు సేకరిస్తుంటే మరికొందరు వాటిని నొక్కేయడంపైనే దృష్టి సారించారు. అలా హారిక కాయిన్లను సోహైల్ లేపేయగా, అక్కడ దాచానని ఎవరు చెప్పారని అడిగింది. తర్వాత చెప్తానులే అని మెహబూబ్ బదులిచ్చాడు. దీంతో ఎవరెవరు కాయిన్లను ఎక్కడెక్కడ పెట్టుకున్నారనేది అందరికీ జారవేస్తున్న మాస్టర్ తన గుట్టు ఎక్కడ బయటపడిపోతుందోనని భయపడ్డాడు. నాతో మాట్లాడకు అంటూ మెహబూబ్కు వార్నింగ్ ఇచ్చాడు. అభితో కాస్త దూరంగా ఉంటున్న హారిక ఈ రోజు అసలు సమస్యను అతడి ముందు ఏకరువు పెట్టింది. నువ్వు స్వాతికెందుకు సపోర్ట్ చేస్తున్నావు అని నిలదీసింది. ఆమె వచ్చి రెండు, మూడు రోజులే అవుతుంది, తనకిచ్చిన పని కూడా చేయలేకపోతోంది, డేంజర్ జోన్లోనూ ఏమీ లేదు. అలాంటిది ఆమె కోసం కిందపడీ, కొట్లాడీ నాణాలు సేకరించాల్సిన పనేంటని ప్రశ్నించింది. ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. నా స్నేహితుడు అయి ఉండి నాకిస్తావనుకున్నా అని చెప్పడంతో అభిజిత్ చేయి పట్టుకుని సారీ చెప్పాడు. రాత్రంతా జాగారం చేసి మరీ దొంగతనం తర్వాత స్విచ్ కాయిన్ను మెహబూబ్ చేతులారా కిందపడేశాడు. అదే ముఖ్యమైన కాయిన్ అని బిగ్బాస్ ప్రకటించడంతో తెల్లముఖం వేసిన మెహబూబ్కు సోహైల్ క్లాస్ పీకాడు. ఆ తర్వాత అందరూ పడుకున్నాక సోహైల్, లాస్య, అరియానా డీల్ మాట్లాడుకుని మాస్టర్ దగ్గర ఉన్న మొత్తాన్ని లేపేశారు. ఆనందంతో సోహైల్ తీన్మార్ డ్యాన్స్ చేశాడు. కానీ తిట్లు, అపనిందలు మాత్రం అతడి మీదనే వచ్చి పడ్డాయి. సుజాత, నోయల్ దగ్గర కూడా మెహబూబ్ కాయిన్లు తీసుకుని ఉడాయించాడు. అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నా రాత్రంతా జాగారం చేసి మరీ కష్టపడి దోచుకుని సోహైల్, మెహబూబ్ కిలాడీ దొంగల్లా నిలిచారు. (చదవండి: ఎలిమినేషన్: అతడు కాదు ఆమె!) గంగవ్వ మాత్రం సోహైల్కే సపోర్ట్ పొద్దునే తన కాయిన్లు కనిపించకపోయేసరికి షాకైన మాస్టర్ సోహైల్పై ఆగ్రహంతో ఊగిపోయాడు. మీరు ఎలా గెలుస్తారో చూస్తానని సవాలు విసిరాడు. చూస్తేనే దొంగల్లా ఉన్నారంటూ, వాళ్లను కొట్టేయాలన్నంత కసితో రగిలిపోయాడు. ఈ కోపం నుంచి బయటపడని మాస్టర్.. కుమార్పై తన చిరాకు ప్రదర్శించాడు. అతడిని నోరు మెదపనీయకుండా చులకనగా మాట్లాడాడు. అనంతరం బ్రాండ్లు కనిపించకుండా బట్టలు ఆరేస్తున్నారని, వాటిని తీసేయాలని బిగ్బాస్ లేఖ పంపించాడు. దీంతో అందరూ సోహైల్, మెహబూబ్ కాయిన్లపై పరిచిన వస్త్రాన్ని తీసేయాలని గొడవ చేశారు. కానీ గంగవ్వ, అఖిల్ మాత్రం సపోర్ట్ చేశారు. అక్కడ బ్రాండ్ వస్తువులే లేవని తేల్చి చెప్పారు. అనంతరం కిల్లర్ కాయిన్స్ టాస్క్ మొదటి లెవల్ పూర్తైనట్లు బిగ్బాస్ ప్రకటించాడు. (చదవండి: నేను పెళ్లి చేసుకోడానికి రాలేదు: అఖిల్) మెహబూబ్కే ఎక్కువ పాయింట్లు ఈ టాస్క్లో అవినాష్ 3160, మాస్టర్ 320, స్వాతి 1930, లాస్య 1560, అభిజిత్ 1770, నోయల్ 900, హారిక 1450, సోహైల్ 3620, మెహబూబ్ 4360, మోనాల్ 610, అఖిల్ 2570, అరియానా 1850, దివి 110, కుమార్ 1570, సుజాత 340 + స్విచ్ కాయిన్ సంపాదించుకున్నారు. కానీ ఇక్కడితో ఆట పూర్తవలేదు. ఇప్పుడు వీటిని కాపాడుకోవడంతో అసలు కథ మొదలవుతుంది రెండో దశలో కిల్లర్ కాయిన్ను ఎవరిపై అతికిస్తే వారి సగం పాయింట్లు ఆవిరైపోతాయి. అందరూ సోహైల్ మీదే పగ పట్టడంతో ఒకరినే టార్గెట్ చేస్తే కథ వేరే ఉంటదని హెచ్చరించాడు. దీంతో మాస్టర్, సోహైల్ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. తర్వాత మోనాల్ అవుట్ అయింది. ఇంతలో అవినాష్ సొమ్మసిల్లి కిందపడిపోయాడు. ఏమయ్యిందోనని కంగారు పడిపోగా కాలు బెణికిందని చెప్పాడు. దీంతో అతడిని ఎత్తుకుని మెడికల్ రూమ్కు తీసుకెళ్లారు. ఇక మాస్టర్ కాయిన్లు అందరూ దొంగిలించినా తనను మాత్రమే ప్రశ్నించారని మోనాల్ వెక్కివెక్కి ఏడ్చింది. (చదవండి: బిగ్బాస్: రెండో వారం పడిపోయిన టీఆర్పీ) -
నాతో జీవితంలో మాట్లాడకు: అమ్మ రాజశేఖర్
ఇంటి సభ్యుల కసి చూస్తుంటే బిగ్బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఓవైపు నిద్రాహారాలు మాని గెలుపు కోసం పరితపిస్తున్న మనుషుల టీమ్ దెబ్బ తిన్న పులిలా ఉంటే, మరోవైపు అన్ని సౌకర్యాలు, సౌలభ్యాలను వాడుకుంటున్న రోబో టీమ్ గెలుపుకు ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ మనుషుల టీమ్కు కండబలం ఉంటే ప్రత్యర్థి టీమ్కు బుద్ధి బలం ఉంది. దీంతో ఎత్తుకు పై ఎత్తులతో ఆట నడుస్తూనే ఉంది. అయితే మాస్టారు అంటూ అమ్మ రాజశేఖర్ దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తూ నెమ్మదిగా చార్జింగ్ పెట్టేసుకుని వెన్నుపోటు పొడిచాడు అవినాష్. (చదవండి: బిగ్బాస్: శత్రువులుగా మారబోతున్న స్నేహితులు?) దీంతో ఆలస్యంగా విషయం అర్థమైన మాస్టర్కు లోపల ఎలా ఉన్నా బయటకు మాత్రం నవ్వేశాడు. కానీ తాజాగా రిలీజైన ప్రోమోను చూస్తుంటే ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోకుండా మనుసులో పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. "ఈ జీవితంలోనే కాదు, జన్మజన్మలలోనూ అవినాష్ తనతో మాట్లాడకూడదు" అని తేల్చి చెప్పాడు. నిన్నటి వరకు ఐకమత్యంగా ఉన్న మనుషుల టీమ్లోనూ బేధాభిప్రాయాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన టీమ్ సభ్యులు చెప్తున్నా వినకుండా రోబోలతో ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. ఇది రోబోల టీమ్కు ప్లస్ పాయింట్గా మారనుండగా మనుషుల టీమ్లో మరిన్ని గొడవలకు దారి తీసేలా కనిపిస్తోంది. మరి ఆమె నిర్ణయం హౌస్లో ఎంత రచ్చకు దారి తీస్తుందో నేటి ఎపిసోడ్లో చూడాలి. (చదవండి: చాలాసార్లు బతకాలనిపించలేదు: వితికా ) -
బిగ్బాస్: చేతకానితనాన్ని నూరిపోసిన అభి
అసలే నామినేషన్ ప్రక్రియతో మంట మీదున్న కంటెస్టెంట్లు నేటి టాస్క్లో తమ సత్తా ఏంటో చూపించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఫిజికల్ టాస్క్ గొడవలకు దారి తీసింది. దేవీ, మెహబూబ్ మధ్య మాటామాటా పెరగడంతో ఇంటి సభ్యులు కల్పించుకుని సర్ది చెప్పాల్సి వచ్చింది. ఫిజికల్ టాస్క్ ఆడగలుగుతుందా అన్న అనుమానాన్ని గంగవ్వ పటాపంచలు చేసింది. రోబో వేషం కట్టిన అవ్వ ప్రత్యర్థులను దగ్గరికి కూడా రానీయలేదు. ఇక తెలుగు మాట్లాడటమే కష్టంగా ఉండే మోనాల్ ఏకంగా తెలుగు పద్యాలను అప్పజెప్పింది. ఇన్ని విశేషాలు చోటు చేసుకున్న నేటి బిగ్బాస్ ఎపిసోడ్ పూర్తి వివరాలు చదివేసేయండి.. కెప్టెన్సీ పోటీకి ఈ టాస్కే కీలకం మోనాల్ ఇంటి సభ్యులకు బావా బావా పన్నీరు పద్యం నేర్పించింది. కానీ ఇది లాఫింగ్ థెరపీలా మారిపోయింది. 'ప్రేమించాను నిన్నే..' అంటూ అవినాష్ మోనాల్ కోసం పాట పాడుతూ ఆమె ముందు కుప్పిగంతులు వేశాడు. మరోవైపు నిన్నటి నామినేషన్ ప్రక్రియ నుంచి గంగవ్వ ఇంకా బయటపడలేదు. ఫొటోలు మంటల్లో వేయడం తనకు నచ్చలేదని బాధపడింది. అనంతరం బిగ్బాస్ ఇంటి సభ్యులకు "ఉక్కు హృదయం" టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న సిల్వర్ బాల్ను మనుషులు పగలగొడితే ఓ రోబో చనిపోయినట్లు. అలా అన్ని రోబోలను చంపేస్తే మనుషుల టీమ్ గెలిచినట్లు లెక్క. ఒక్క రోబో బతికున్నా రోబోల టీమ్ గెలిచినట్లే. ఇక్కడో ట్విస్ట్ ఉంది. గెలిచిన టీమ్ సభ్యులు మాత్రమే కెప్టెన్ పోటీకి అర్హులు. (చదవండి:అతి త్వరలోనే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ) పాజిటివ్గా మాట్లాడని అభి మనుషుల టీమ్లో అఖిల్, అమ్మ రాజశేఖర్, దివి, నోయల్, సోహైల్, సుజాత,ఉన్నారు. రోబోల టీమ్లో దేవి, అరియానా, కుమార్ సాయి, లాస్య,అవినాష్, అభిజిత్, గంగవ్వ, హారిక ఉన్నారు. బజర్ మోగకముందే అత్యుత్సాహంతో ఇరు టీమ్లు ఆట మొదలెట్టేశారు. కిచెన్లో ఉన్న ఆహారాన్నంతా మనుషులు కోతుల్లా దోచుకుంటూ తీసుకువెళ్లడంతో రేషన్ మేనేజర్ అభి వారిపై సీరియస్ అయ్యాడు. మనుషుల టీమ్ను మనం ఆపలేమని తన రోబో టీమ్ మెంబర్స్లో నిరుత్సాహాన్ని నింపాడు. మనం ఏం చేయలేమని ఆట కూడా సరిగా ఆడలేదు. జోష్తో ఆడుతున్న మనుషుల టీమ్పై దేవి మండిపడింది. ఏంటీ పిచ్చి గేమ్ అని అరిచింది. దీంతో ఆమెనే టార్గెట్ చేసిన ప్రత్యర్థి గేమ్ మొదట దేవినే చంపేసింది. (చదవండి:బిగ్బాస్: ఏడుగురిలో ఇంటికెళ్లేది ఎవరు?) గెలుపు కోసం కష్టపడుతున్న మనుషుల టీమ్ కాసేపటివరకు రోబోలు మనుషుల్ని ఆడుకోగా తర్వాత వీళ్ల వంతు రావడంతో ఇంటి లోపల ఉన్న రోబోలను డ్యాన్సుతో ఉడికించారు. పైగా లోన ఉన్న రోబోలు పుష్టిగా భోజనం చేస్తే బయట ఉన్న మనుషులు మాత్రం తినకుండా మాడిపోయారు, కనీసం వాష్ రూమ్ ఉపయోగించుకోడానికి కూడా లేదు. దీంతో అందరూ దుప్పటి అడ్డుపెట్టడంతో సుజాత వాష్రూమ్కు వెళ్లింది. వీరి తెగింపును చూసి రోబోలు షాక్కు లోనయ్యారు. అయితే కెమెరాలకు అడ్డుగా నిలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బిగ్బాస్ హెచ్చరించాడు. తర్వాత అవినాష్ బర్త్డేను మనుషుల టీమ్ సెలబ్రేట్ చేశారు. (చదవండి: హీరో- జీరో గేమ్తో విలన్గా మారిన లాస్య) అవినాష్ బర్త్డే వేడుకలు బర్త్డే పాట పాడుతూ ప్రోటీన్ పౌడర్ను కేక్గా ఊహించుకోమని అతడికి తినిపించారు. కాగా ఏదేమైనా గెలవాలన్న కసి మీద మనుషులు ఉన్నారు. కానీ వారిని ఓడించాలన్న పట్టుదల మాత్రం అందరు రోబోలలో కనిపించలేదు. ముఖ్యంగా టీమ్ సభ్యులను ఎంకరేజ్ చేయాల్సింది అభి వారిని నీరుగార్చే పనిలో ఉన్నాడు. దీంతో అరియానా పోరాడి ఓడిపోదామని చెప్పినప్పటికీ అతడు వినిపించుకోలేదు. ఆమె చెప్పే సలహాను కూడా చిల్లర ప్రయత్నాలు అని, ఇది నీ క్యారెక్టర్ అని నోరు జారుతూ తక్కువ చేసి మాట్లాడాడు. అభి ప్రవర్తన చూస్తుంటే అసలు రోబోల టీమ్కు అభి కట్టప్పలా తయారైనట్లు కనిపిస్తోంది.