దళిత రచనలతోనే సినీ ప్రయాణం ప్రారంభించాను: పా.రంజిత్‌ | I Started My Cinematic Journey With Dalit Writings PA Ranjith Says | Sakshi
Sakshi News home page

దళిత రచనలతోనే సినీ ప్రయాణం ప్రారంభించాను: పా.రంజిత్‌

Published Sun, May 1 2022 10:42 AM | Last Updated on Sun, May 1 2022 10:45 AM

I Started My Cinematic Journey With Dalit Writings PA Ranjith Says - Sakshi

పా. రంజిత్‌

సాక్షి, చెన్నై: దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని దర్శక, నిర్మాత పా.రంజిత్‌ పేర్కొన్నారు. తన చిత్రాల ద్వారా సమాజంలోని అసమానతలు, అణగారిన జీవితాలను ఆవిష్కృతం చేసే దర్శకుడీయన. అలా తనకంటూ ప్రత్యేక బాటను ఏర్పరచుకుని సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్న పా.రంజిత్‌ తన నీలం ఫౌండేషన్‌ ద్వారా ఏప్రిల్‌ నెల అంతా దళిత చరిత్ర మాసం పేరుతో చెన్నైలో సాంస్కృతిక కళలు, ఫొటో ఎగ్జిబిషన్, చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు.

అందులో భాగంగా మదురైలో శుక్ర, శనివారాల్లో దళితుల రచయితల కోసం దళిత సాహితీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని తెలిపారు. దళితుల ఉన్నతికి దళిత సాహితీవేత్తలే దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు. 1990 ప్రాంతంలో దళిత సాహిత్యం మొదలైనప్పుడు పలు ప్రశ్నలు ఎదురయ్యాయని అన్నారు. ఇప్పుడు దళిత సాహిత్యం ఎంతో అభివృద్ధి చెందిందని పా.రంజిత్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement