Producer MS Raju Interesting Comments On Mahesh Babu And Prabhas - Sakshi

MS Raju: ప్రభాస్‌, మహేశ్‌ డేట్స్‌ ఇచ్చినా సరే, వాళ్లతో సినిమా చేయను

Jun 10 2022 9:47 PM | Updated on Jun 11 2022 8:49 AM

Producer MS Raju Interesting Comments On Mahesh Babu, Prabhas - Sakshi

9 ఏళ్ల క్రితం గుణశేఖర్‌, మీరూ నేను కలిసి చేద్దామండీ అని రవితేజ అడిగారు. నేను కుదరదని చెప్పేశా. త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేద్దామని మహేశ్‌బాబు అడిగినా కూడా చేయనన్నాను. అలా ఖలేజా వదిలేశాను. ఆ తర్వాత అల్లు అర్జున్‌ రుద్రమదేవి నా దగ్గరకు వచ్చింది,

వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. వంటి ఎన్నో హిట్‌ సినిమాలను అందించాడు నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు. టాలీవుడ్‌లో బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఈయన పరిచయాలు ఉన్నాయి కదా అని పదేపదే స్టార్‌ హీరోలతో సినిమాలు తీయనని అంటున్నాడు. తనకు కథే ముఖ్యమని, ఎంత పెద్ద హీరో అయినా సరే స్క్రిప్ట్‌ బాగోలేకపోతే సినిమాను రిజెక్ట్‌ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆయన దర్శకుడిగా వ్యవహరించిన 7 డేస్‌ 6 నైట్స్‌ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రమోషన్లలో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్‌ఎస్‌ రాజు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

'9 ఏళ్ల క్రితం గుణశేఖర్‌, మీరూ నేను కలిసి చేద్దామండీ అని రవితేజ అడిగారు. నేను కుదరదని చెప్పేశా. త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేద్దామని మహేశ్‌బాబు అడిగినా కూడా చేయనన్నాను. అలా ఖలేజా వదిలేశాను. ఆ తర్వాత అల్లు అర్జున్‌ రుద్రమదేవి నా దగ్గరకు వచ్చింది, దాన్ని కూడా వద్దనుకున్నాను. . మహేశ్‌, ప్రభాస్‌ కలిసి సినిమా చేద్దామన్నా నేను వారితో చేయను. ఒట్టేసి చెబుతున్నా.. డేట్స్‌ ఇచ్చి చేద్దామన్నా సరే నేను చేయను. నేను స్టార్‌ హీరోల కన్నా కథనే ఎక్కువగా నమ్ముతాను. నిజం చెప్పాలంటే పెద్ద హీరోల సినిమాల కంటే మనసంతా నువ్వే చిత్రంతో నాకు ఎక్కువ లాభాలొచ్చాయి. నాకు నచ్చిన సినిమాలే చేస్తాను' అని తెలిపాడు ఎమ్‌ఎస్‌ రాజు.

చదవండి: రాముడు బుద్ధిమంతుడు అని చెప్తే ఇప్పుడు ఎవడూ వినడు
 మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన నయనతార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement