మిరప సాగుకు అనువైన సమయం ఇదే.. | - | Sakshi
Sakshi News home page

మిరప సాగుకు అనువైన సమయం ఇదే..

Published Tue, Jun 27 2023 1:52 AM | Last Updated on Tue, Jun 27 2023 1:28 PM

ట్రేలలో పెరుగుతున్న మిరప నారు - Sakshi

పెద్దవూర: గత వానాకాలం సీజన్‌లో మిరప పంటకు అధిక ధరలు పలకడంతో ఈ యేడాది అధిక విస్తీర్ణంలో సాగు చేయటానికి సిద్ధం అవుతున్నారు. మిరప పంటలో సాగు విధానం, యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యానవన శాఖ అధికారి మురళి వివరించారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ, మిరప చేను చుట్టూ రక్షణ పంటలుగా హైబ్రిడ్‌ జొన్న లేదా మొక్కజొన్న రెండు లేదా మూడు సాళ్లలో వేయాలి. కీటక ఆకర్షణ(ఎర) పంటలుగా బంతి, ఆముదాన్ని పొలంలో అక్కడక్కడా వేయాలని సూచిస్తున్నారు. మిరప సాగుకు ఉదజని సూచిక(పీహెచ్‌) 6 నుంచి 6.5 ఉన్న నేలలు అత్యంత అనుకూలమని చెబుతున్నారు.

వాతావరణం, విత్తే సమయం
మిరప పంట అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. మిరపకు 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. ఎండు మిరప కోసం వేసే పంటను వానాకాలం సీజన్‌లో వేసుకోవడం మంచిది. పచ్చి మిరప కోసం సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా మిరప పంటను ఖరీఫ్‌ సీజన్లో జూలై, ఆగస్టు నెలల్లోనూ, యాసంగిలో అయితే అక్టోబర్‌, నవంబర్‌ నెలలో సాగుకు అనుకూలం.

నేల తయారీ : పొలాన్ని వేసవిలో లోతుగా దున్ని, ఆఖరి దుక్కిలో ఎకరానికి 10టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల వేపపిండి, 150 కిలోల సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ వేయాలి. అలాగే 90కిలోల పశువుల ఎరువు, 10కిలోల వేపపిండి, 2కిలోల ట్రైకోడెర్మావిరిడి శిలీంద్రపు పొడిని కలిపి 10–15 రోజులు నీడలో ఉంచి శిలీంద్రం వృద్ధి చెందిన తర్వాత ఆఖరి దుక్కిలో వేసినట్‌లైతే తొలి దశలో మొక్కలను ఆశించే తెగుళ్ల నుంచి కాపాడవచ్చు. పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరొట్ట లేదా మినుము పంటను వేసుకుని భూమిలో కలియ దున్నాలి. దీనివలన భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10–15 రోజుల తరువాత ట్రాక్టర్‌ కల్టివేటర్‌తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 1–3 సార్లు దున్నుకోవాలి.

విత్తనశుద్ధి
విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా చీడపీడల నుంచి దీర్ఘకాలం పాటు పంటను రక్షించవచ్చు. మిరప విత్తనాలను మూడు రకాలుగా విత్తనశుద్ధి చేసుకోవచ్చు. వైరస్‌ తెగుళ్ల నివారణకు గాను కిలో మిరప విత్తనానికి గాను 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్పేటును ఒక లీటరు నీటిలో కరిగించి దీనిలో 15నుంచి 20 నిమిషాల పాటు విత్తనాన్ని నానబెట్టాలి. తర్వాత నీటిని తీసివేసి మంచి నీటితో శుభ్రంగా కడిగి విత్తనాలను నీడలో ఆరబెట్టుకోవాలి. రసం పీల్చు పురుగుల నివారణకు గాను కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ను పట్టించాలి. దీనివలన విత్తిన 20–25 రోజుల వరకు రసం పీల్చు పురుగుల ఉధృతి నివారణ జరుగుతుంది. బ్యాక్టీరియా, బూజు తెగుళ్ల నివారణకు గాను కిలో విత్తనానికి 3గ్రాముల మాంకోజెబ్‌ లేదా కాప్టాన్‌ మందును పట్టించి విత్తుకోవాలి. చివరిగా అదే విత్తనాన్ని ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రం పొడిని 5–10 గ్రాముల విత్తనానికి పట్టించి నారుమడిలో విత్తుకోవాలి.

విత్తన మోతాదు
మిరపను రెండు రకాల పద్ధతుల ద్వారా సాగు చేయవచ్చు. మిరప విత్తనాలను నేరుగా ప్రధాన పొలంలో విత్తడానికి అయితే ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నారు పెంచుటకు విత్తన మోతా దు సూటి రకాలకు 650 గ్రాములు, హైబ్రిడ్‌ రకాలైతే 75 నుంచి 100 గ్రాముల విత్తనం సరిపోతుంది.

ప్రోట్రేలలో..
ఈ పద్ధతిలో ప్రతి విత్తనం సమానంగా, ఆరోగ్యంగా మొక్కలు పెరిగి పంట ఒకేసారి కాపుకు వస్తుంది. దీనితో పాటు నారు దృఢంగా పెరగడంతో పాటు నారుకుళ్లు, వైరస్‌ తెగుళ్లను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక ఎకరా ప్రధాన పొలంలో నాటుటకు కావాల్సిన వారు 98 సెల్స్‌ కలిగిన 120 ట్రేలు సరిపోతాయి. ఒక్కో ప్రోట్రేసు నింపుటకు సుమారు 1.2 కిలోల కోకోపీట్‌ మిశ్రమం అవసరం. ఒక్కొక్క సెల్‌లో ఒక్క విత్తనం నాటుకుని తిరిగి కోకోపీట్‌తో కప్పుకోవాలి. 6 రోజుల తర్వాత మొక్క మొలకెత్తడం ప్రారంభమయ్యాక వీటిని ఎత్తైన బెడ్లలోకి మార్చుకోవాలి.

మొక్కలను నాటుకునే విధానం
మొక్కలను నీటి వసతి నేలల్లో నాటుకునేప్పుడు 24్ఙశ్రీ24 అంగుళాలు(ఇంచులు) లేదా 26్ఙశ్రీ26 లేదా 28్ఙశ్రీ28 అంగుళాల దూరంలో నేల స్వభావాన్ని బట్టి నాటుకోవాలి. మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాల్లో కొద్దిగా నీరు పోసి వేర్లు మడత పడకుండా జాగ్రత్తగా నాటుకోవాలి. డ్రిప్‌ పద్ధతిలో నాటుకునేటప్పడు మొక్కల మధ్య దూరం 30–45 అంగుళాలు అనువైనది.

కలుపు యాజమాన్యం
కలుపు నివారణకు మొక్కలు నాటిన 20–25 రోజుల తరువాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి 15–20 రోజులకు ఒక్కసారి దున్నాలి. ఎలా మొక్క నేల మొత్తాన్ని కప్పివేసేవరకు 4–5 సార్లు దున్నాలి. మొక్కలను నాటుకునే 1–2 రోజుల ముందు లీటర్‌ నీటిలో 1.5మిల్లీలీటర్ల పెండిమిథాలిన్‌ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. పంటలో కలుపు మొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన 25 రోజుల తర్వాత ఎకరానికి 400–500 మిల్లీలీటర్ల కై ్వజాలోఫాస్‌ ఇథైల్‌ను మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి.

నారు పెంచే విధానం
మిరప నారును రెండు పద్ధతుల్లో పెంచవచ్చు. మిరప నారుమడికి సారవంతమైన ఒండ్రునేలలు, నీటి వసతి, ఒక మోస్తరు నీడ కలిగిన ప్రదేశాలు చాలా అ నుకూలం. ఒక మీటరు వెడల్పు, 40 మీటర్ల పొడవు, 15 సెం.మీ. ఎత్తుగల మడిలో ఒక ఎకరంలో నాటడానికి అవసరమైన నారు పెంచుకోవచ్చు. నారు పెంచటానికి నేలకు కొంచెం ఎత్తులో మట్టిని బెడ్డుగా చేసుకోవాలి. నాలుగు మూలలు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమళ్లలో విత్తనాలను 5 నుంచి 8 సెం.మీ. మధ్యదూరం, 1.5 సెం,మీ లోతులో వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన 9వ రోజు, 13వ రోజున లీటర్‌ నీటిలో 3 గ్రా. కాఫర్‌ ఆక్సీక్లోరైడ్‌ను కలిపిన ద్రావణంలో నారుమళ్లను తడపాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
పాడి పంట1
1/1

పాడి పంట

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement