నల్లమలలో కార్చిచ్చు
కొత్తపల్లి: ముసలిమడుగు సమీపంలో ఉన్న నల్లమల అడవికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం రాత్రంతా అడవిలో మంటలు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. మంగళవారం ఉదయం కూడా అడవిలో మంటలతో పాటు పొగ ఎగజిమ్ముతూనే ఉంది. గాలి ఏ దిశకు వీస్తుందో అటువైపుగా ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. బర్రెలు మేపుకునేందుకు గానీ, వంట కట్టెల కోసం గానీ ఎవ్వరిని అటవీలోకి వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ మంటలు ఎలా చెలరేగాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment