సైన్యం కాల్పుల్లో ఉగ్రవాదులు మృతి | Army Foils Infiltration Bid In Nowshera, Two Terrorists Killed | Sakshi
Sakshi News home page

సైన్యం కాల్పుల్లో ఉగ్రవాదులు మృతి

Sep 9 2024 7:51 AM | Updated on Sep 9 2024 9:13 AM

Army Foils Infiltration Bid In Nowshera, Two Terrorists Killed

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సోమవారం (సెప్టెంబర్‌ 9) సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. 

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద నుంచి ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నౌషేరా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఇదే ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించిన  ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు.  ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టింది. 

ఇదీ చదవండి.. ఘనంగా రెండో ప్రపంచ యుద్ధ వీరుడి బర్త్‌డే వేడుకలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement