
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ కేసులు(Covid cases) అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,238 కొత్త కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కి చేరింది. కోవిడ్-19 కారణంగా మహారాష్ట్రలో ముగ్గురు,ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు మృతి చెందారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం కేరళ(Kerala)లో కొత్తగా 114 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలలో కేసులు నమోదయ్యాయి. కేంద్రం నేడు(గురువారం) దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలలోని ఆసుపత్రుల సంసిద్ధతను తనిఖీ చేయనుంది.
వైద్యాధికారులు ఆక్సిజన్ సరఫరా, అవసరమైన మందుల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అలాగే దేశంలోని ప్రధాన ఆసుపత్రులలో వెంటిలేటర్ల లభ్యతను అంచనా వేయనున్నారు. ఓమిక్రాన్ వేరియంట్కు చెందిన ఎన్బీ .1.8.1 ఉప-వేరియంట్ కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణమని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: జులై 5న.. ఆమె జోస్యంతో వణికిపోతున్న జపాన్