రూ.15 వేల కోట్ల ఎలక్టోరల్‌ బాండ్ల అమ్మకం | Electoral bonds worth over Rs15000 crore sold since 2018 | Sakshi
Sakshi News home page

రూ.15 వేల కోట్ల ఎలక్టోరల్‌ బాండ్ల అమ్మకం

Dec 29 2023 5:20 AM | Updated on Dec 29 2023 5:20 AM

Electoral bonds worth over Rs15000 crore sold since 2018 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2018 ఏడాది నుంచి ఇప్పటిదాకా రూ.15 వేల కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించామని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) వెల్లడించింది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కింద ఒక ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎస్‌బీఐ ఈ విషయం చెప్పింది. ‘‘2018 ఏడాది నుంచి ఇప్పటిదాకా 29 దఫాలుగా ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించాం.

వాటి మొత్తం విలువ రూ.15,956.30 కోట్లు. ఇందులో రూ.23.88 కోట్ల విలువైన 194 బాండ్లు ఏ రాజకీయ పార్టీ బ్యాంక్‌ ఖాతాలో జమకాని కారణంగా ఆ బాండ్ల మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌)కు బదిలీ చేశాం’’ అని బ్యాంక్‌ తెలిపింది. లోకేశ్‌ బాత్రా అనే మాజీ నావికా అధికారి ఆర్టీఐ చట్టం కింద అభ్యరి్థంచడంతో బ్యాంక్‌ పై విధంగా సమాధానమిచి్చంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement