
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న డంపర్ కారును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం అయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక ఎస్పీ హెచ్సీ దోషీ దర్యాప్తు చేస్తున్నారు. తాజా ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.