సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డు వివాదంపై అక్టోబర్ నాలుగో తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ వివాదంపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సుబ్బారెడ్డి పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు పిటిషన్ లిస్ట్ అయ్యింది.
తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశివ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘లడ్డూ’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు
Comments
Please login to add a commentAdd a comment