Tamil Nadu: Petition Filed To Ban Indian Premier League (IPL) - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ బ్యాన్‌ చేయాలి.. కోర్టులో దాఖలైన పిటిషన్‌

Published Fri, Jul 28 2023 10:40 AM | Last Updated on Fri, Jul 28 2023 10:57 AM

Tamil Nadu: Petition Filed Against To Ban Indian Premier League - Sakshi

సాక్షి, చైన్నె: ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాగా ఈ విషయంపై బీసీసీఐను ఆశ్రయించాలని పిటిషనర్‌, ఐపీఎస్‌ అధికారికి హైకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్‌ సూచించింది. వివరాలు.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల క్రికెట్‌ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు తండో పతండాలుగా అభిమానులు తరలిరావడం జరుగుతోంది.

అదే సమయంలో ఈ మ్యాచ్‌లు అన్ని ఫిక్సింగ్‌, బెట్టింగ్‌లతో జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌ బెట్టింగ్‌లు, ఫిక్సింగ్‌లకు వ్యతిరేకంగా ఐపీఎస్‌ అధికారి సంపత్‌కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లను బెట్టింగ్‌, ఫిక్సింగ్‌ పూర్తిగా కట్టడి అయ్యే వరకు నిర్వహించకూడదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌ గురువారం హైకోర్టు సీజే గంగా పుర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్‌ ముందు విచారణకు వచ్చింది. వాదనల అనంతం ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. బెట్టింగ్‌, ఫిక్సింగ్‌ ఫిర్యాదులను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

చదవండి   సీమా, అంజూ.. ఇప్పుడు జూలీ.. సరిహద్దులు దాటిన ప్రేమలో బిగ్ ట్విస్ట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement