Indian Premier League (IPL)
-
#IPL2025 : ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్లు.. (ఫోటోలు)
-
కోల్'కథ' ఎంతవరకు!
ఏ జట్టయినా విజయవంతమైన కూర్పును కొనసాగించాలనుకుంటుంది... కానీ కోల్కతా నైట్రైడర్స్ మాత్రం అందుకు విభిన్నమైన ప్రణాళికలతో అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. దశాబ్దకాలం తర్వాత తమ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ను వేలానికి వదిలేసుకున్న నైట్రైడర్స్... ఓ మామూలు ఆటగాడి కోసం భారీగా ఖర్చు పెట్టింది. జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు పిలిచి మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే ఎన్ని మార్చినా కోర్ గ్రూప్ను మాత్రం కదల్చని కోల్కతా... డిఫెండింగ్ చాంపియన్గా టైటిల్ నిలబెట్టుకునేందుకు సై అంటోంది! ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రమే ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండేళ్లు చాంపియన్గా నిలిచాయి. నైట్రైడర్స్ ఈసారి తమ గెలుపు ‘కథ’ను ఎంతవరకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరం కానుంది! –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకోగా... ఆ తర్వాత అత్యధికంగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) మూడుసార్లు విజేతగా నిలిచింది. 2012, 2014, 2024లో కేకేఆర్ ట్రోఫీ హస్తగతం చేసుకుంది. గతేడాది ఐపీఎల్ వేలంలో ‘కోర్ గ్రూప్’ను తిరిగి కొనసాగించిన ఫ్రాంచైజీ... జట్టుకు మూడోసారి కప్పు అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ్రస్టేలియా స్టార్ పేసర్ స్టార్క్ను మాత్రం వదిలేసుకుంది. పేస్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసి ఆశ్చర్యపరిచిన యాజమాన్యం... కోటిన్నర ప్రాథమిక ధరతో కొనుగోలు చేసుకున్న సీనియర్ బ్యాటర్ అజింక్య రహానేకు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా... కేకేఆర్ 21 మందినే తీసుకుంది. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్కు రూ. 13 కోట్లు... ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి, వెస్టిండీస్ టి20 స్పెషలిస్ట్లు రసెల్, నరైన్లకు రూ. 12 కోట్లు చొప్పున అందించి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... హర్షిత్ రాణా, రమణ్దీప్లను రూ. 4 కోట్లతో కొనసాగించింది. ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంటే దాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంది. నరైన్పై భారీ అంచనాలు... సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్ పండిత్ కేకేఆర్కు కోచ్గా వ్యవహరిస్తుండగా... గతేడాది జట్టుకు మెంటార్గా ఉన్న గౌతమ్ గంభీర్ ... టైటిల్ గెలిచిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్గా వెళ్లిపోయాడు. ఇప్పుడతడి స్థానంలో విండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో మెంటార్గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్లు మాత్రమే వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచాయి. ఇప్పుడు కోల్కతా ముందు అలాంటి అరుదైన అవకాశం మూడోసారి ఉంది. వెస్టిండీస్ స్పిన్ ఆల్రౌండర్ నరైన్ను ఓపెనర్గా దింపి మెరుగైన ఫలితాలు రాబట్టిన కేకేఆర్ ఈసారి కూడా అదే ప్లాన్ అనుసరిస్తుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్కు ఎప్పుడో వీడ్కోలు పలికిన నరైన్... కేకేఆర్ తరఫున అటు స్పిన్నర్గా ఇటు ఓపెనర్గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్లో 488పరుగులు, 17 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గుర్బాజ్, నరైన్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయమే కాగా... అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్దీప్ సింగ్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు రానున్నారు. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, నరైన్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా కీలకం కానున్నారు. రహానే రాణించేనా? డిఫెండింగ్ చాంపియన్గా మరింత బాధ్యతగా ఉండాల్సిన కేకేఆర్... తన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది. కప్పు అందించిన కెపె్టన్ను వదిలేసుకోవడం... తుదిజట్టులో ఉంటాడో లేదో నమ్మకంగా చెప్పలేని ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించడం... వెరసి సీజన్ ఆరంభానికి ముందే వార్తల్లో నిలిచింది. ఫామ్లేమికి తోడు వయసు మీదపడుతున్న కారణంగా భారత జట్టుకు దూరమైన రహానే మరి కేకేఆర్ను ఎలా నడిపిస్తాడో చూడాలి. వెంకటేశ్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా... ఆస్థాన ఆటగాళ్లు రసెల్, నరైన్ కేకేఆర్కు ప్రధాన బలంకానున్నారు. బౌలింగ్, బ్యాటింగ్లో ఈ ఇద్దరు జట్టుకు చేకూర్చే విలువ మాటల్లో చెప్పలేనిది. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన వరుణ్ చక్రవర్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. నోర్జే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, రావ్మన్ పావెల్, వైభవ్ అరోరాతో పేస్ విభాగం బలంగానే ఉన్నా... వీరు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. విదేశీ ఆటగాళ్ల కోటాలో నరైన్, రసెల్, గుర్బాజ్ తుది జట్టులో ఉండటం పక్కా కాగా... నాలుగో ప్లేయర్గా నోర్జే, మొయిన్ అలీలలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. కోల్కతా నైట్రైడర్స్ జట్టు: రహానే (కెప్టెన్), రింకూ సింగ్, డికాక్, గుర్బాజ్, రఘువంశీ, పావెల్, మనీశ్ పాండే, లవ్నిత్ సిసోడియా, వెంకటేశ్ అయ్యర్, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమణ్దీప్, రసెల్, నోర్జే, వైభవ్, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, నరైన్, వరుణ్, చేతన్ సకారియా. అంచనా: డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న కేకేఆర్పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్లో నాణ్యమైన ప్లేయర్లు ఉన్న కోల్కతా... స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే ఫైనల్కు చేరడం పెద్ద కష్టం కాదు. రహానే జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం. -
IPL 2025: ‘విన్’రైజర్స్ అయ్యేనా!
మొదట ఓ మాదిరి స్కోరు చేయడం... ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్తో దాన్ని కాపాడుకోవడం ఇది ఒకప్పుడు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తీరు! కానీ గతేడాది బౌలింగ్ బలాన్ని పక్కన పెట్టిన రైజర్స్... బ్యాటింగ్తో లీగ్లో ప్రకంపనలు సృష్టించింది. ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు చేసిన సన్రైజర్స్... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా... పవర్ప్లేలో అత్యధిక పరుగులు పిండుకున్న టీమ్గా రికార్డుల్లోకెక్కింది!! లీగ్ ఆసాంతం రాణించిన బ్యాటర్లు ఆఖర్లో విఫలమవడంతో గత సీజన్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. కమిన్స్ కెప్టేన్సీకి... అభిషేక్ శర్మ, హెడ్ ఆరంభ మెరుపులు... క్లాసన్, నితీశ్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ టచ్ తోడైతే సన్రైజర్స్ హైదరాబాద్ను ఆపడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనే!!! –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నాణ్యమైన బౌలింగ్కు పెట్టింది పేరైన సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు... గతేడాది అందుకు పూర్తి భిన్నంగా బాదుడే పరమావధిగా విజృంభించి కొత్త గుర్తింపు తెచ్చుకుంది. గత సీజన్లో సన్రైజర్స్ సాగించిన విధ్వంసకాండ మాటలకు అందనిది. అరాచకం అనే పదానికి అర్థం మార్చుతూ... ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తూ సన్రైజర్స్ బ్యాటర్లు సాగించిన ఊచకోత గురించి ఎంత చెప్పినా తక్కువే! ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు వంతులు వేసుకొనిమరీ వీరబాదుడు బాదడంతోనే రైజర్స్... లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు తమ పేరిట లిఖించుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి... ఈ ‘రన్’ చతుష్టయానికి ఇప్పుడు మరో పిడుగు తోడయ్యాడు. ‘పాకెట్ డైనమైట్’ ఇషాన్ కిషన్ ఈ ఏడాది నుంచి రైజర్స్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే హిట్టర్లతో దట్టంగా ఉన్న హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్... ఇషాన్ రాకతో మరింత రాటుదేలనుంది. వేలంలో అత్యధికంగా 25 మందిని తీసుకునే అవకాశం ఉన్నా... కేవలం 20 మంది ప్లేయర్లనే కొనుగోలు చేసుకున్న రైజర్స్... అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల కోసమే భారీగా ఖర్చు పెట్టింది. క్లాసెన్కు రూ. 23 కోట్లు, కెప్టేన్ ప్యాట్ కమిన్స్కు రూ. 18 కోట్లు... అభిషేక్ శర్మ, హెడ్లకు రూ. 14 కోట్ల చొప్పున ఇచ్చిన రైజర్స్... రూ. 6 కోట్లకు నితీశ్ కుమార్ రెడ్డిని కొనసాగించింది. 2016లో తొలిసారి టైటిల్ సాధించిన ఎస్ఆర్హెచ్... 2018, 2024లో రన్నరప్గా నిలిచింది. ఈసారి అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్ దళాన్ని కూడా మరింత పటిష్ట పరుచుకున్న హైదరాబాద్... రెండోసారి కప్పు చేజక్కించుకోవాలని తహతహలాడుతోంది. నాలుగో ఆటగాడు ఎవరో? కెప్టేన్ కమిన్స్తో పాటు క్లాసెన్, హెడ్ తుది జట్టులో ఉండటం ఖాయమే కాగా... గతేడాది నాలుగో విదేశీ ప్లేయర్గా మార్క్రమ్ను ఎంచుకుంది. అయితే ఈసారి మాత్రం ఆడమ్ జాంపా, ముల్డర్, కమిందు మెండిస్ రూపంలో పరిమిత వనరులే ఉన్నాయి. దీంతో హెడ్ కోచ్ డానియల్ వెటోరీ... ఆసీస్ స్పిన్నర్ జాంపా వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అయితే రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ వంటి దేశీయ ఆటగాళ్లు ఈసారి అందుబాటులో లేకపోవడం రైజర్స్కు ప్రతిబంధకంగా మారింది. అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, అథర్వ తైడె, సచిన్ బేబీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. గత సీజన్లో తొలి ఏడు మ్యాచ్ల్లో ఐదింట నెగ్గి ఆరంభంలోనే ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్ జట్టు... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు చేరింది. క్వాలిఫయర్–1లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓడిన రైజర్స్... క్వాలిఫయర్–2లో రాజస్తాన్ రాయల్స్పై గెలిచినా... ఫైనల్లో మరోసారి కోల్కతా చేతిలోనే ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. తమదైన రోజులో అరవీర భయంకరంగా రెచ్చిపోయి రికార్డులు తిరగరాసే రైజర్స్... టాపార్డర్ విఫలమైతే మాత్రం తేలిపోతోందని గత సీజన్తోనే అర్థమైంది. దీంతో ఈసారి ఎలాంటి ప్రణాళికతో ముందడుగు వేస్తుందో చూడాలి. షమీ రాకతో రాత మారేనా! సుదీర్ఘ కాలంగా సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ తురుపుముక్కగా ఉన్న భువనేశ్వర్ కుమార్తో పాటు యార్కర్ కింగ్ నటరాజన్ను వదిలేసుకున్న జట్టు... గతేడాది వేలంలో టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్లను ఎంపిక చేసుకుంది. కమిన్స్, జైదేవ్ ఉనాద్కట్లకు ఈ ఇద్దరూ తోడవడంతో మన బౌలింగ్ మరింత రాటుదేలనుంది. అవకాశం వస్తే పేస్ బౌలింగ్ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఉండనే ఉన్నాడు. ఆడమ్ జాంపా, రాహుల్ చహర్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. అయితే తుది 11 మందితో కూడిన జట్టులో అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, సచిన్ బేబీలలో ఇద్దరికి అవకాశం దక్కొచ్చు. రైజర్స్ తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరు కూడా మేనేజ్మెంట్ అంచనాలను అందుకుంటే జట్టుకు తిరుగుండదు. పవర్ప్లేలో జట్టుకు వికెట్లు అందించాల్సిన బాధ్యత మాత్రం షమీపైనే ఉంది. 2022, 2023 సీజన్లలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన షమీ... గాయం నుంచి తిరిగి వచ్చిన అనంతరం అదే తీవ్రత కొనసాగిస్తే జట్టుకు అదనపు బలం చేకూరినట్లే. గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సుదీర్ఘ విరామం తర్వాత టి20 ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. అతడు జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం. గాయంతో జట్టుకు దూరమైన కార్స్ స్థానంలో దక్షిణాఫ్రికా ప్లేయర్ ముల్డర్ను రైజర్స్ ఎంపిక చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు: కమిన్స్ (కెప్టేన్), ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అథర్వ తైడె, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడమ్ జాంపా, సిమర్జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ మలింగ. అంచనా: గతేడాది కళ్లుచెదిరే ఆటతీరుతో రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్... ఈసారి కూడా హిట్టర్లు దంచికొడితే ప్లే ఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమే! -
లలిత్ మోదీ పాస్పోర్ట్ రద్దు
పోర్ట్ విలా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి ఇటీవల జారీ చేసిన పాస్పోర్ట్ను రద్దు చేయాలని పసిఫిక్ ద్వీప దేశం వనౌతు ప్రధానమంత్రి జొథమ్ నపట్ తమ అధికారులను ఆదేశించారు. పరారీలో ఉన్న ఈ నిందితుడు భారత్కు అప్పగింత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ సారథిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలను లంచంగా తీసుకున్నాడన్న ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు విచారణ చేపట్టాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు 2010లో దేశం వీడిన లలిత్ లండన్లో ఉంటున్నాడు. అయితే, ఇటీవల వనౌతు పాస్పోర్టు పొందిన లలిత్ మోదీ తన భారత పాస్పోర్టును లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయానికి అప్పగిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. ఒకవేళ, ఈ దరఖాస్తును భారత ప్రభుత్వం ఆమోదిస్తే మోదీ లండన్లో చట్ట విరుద్ధంగా ఉంటున్న వ్యక్తి అవుతాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వనౌతు ప్రధాని కార్యాలయం నుంచి సోమవారం తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. లలిత్ పాస్పోర్టు దరఖాస్తు పరిశీలన సమయంలో ఇంటర్పోల్ వంటి అంతర్జాతీయ వ్యవస్థల నుంచి అతడిపై జారీ చేసిన ఎటువంటి నోటీసులు లేని విషయాన్ని అధికారులు గమనించారని చెప్పారు. అయితే, ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లలిత్ పాస్పోర్ట్ రద్దు చేయాలని సిటిజన్షిప్ కమిషన్ను ఆదేశించినట్లు చెప్పారు. లలిత్ మోదీపై అలెర్ట్ నోటీసు ఇవ్వాలంటూ భారత్ ప్రభుత్వం చేసిన వినతులను సరైన ఆధారాల్లేవంటూ ఇంటర్పోల్ 24 గంటల్లో రెండుసార్లు తోసిపుచ్చిందని చెప్పారు. అయితే, అతడు భారత్కు అప్పగించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం స్పష్టమైనందునే పాస్పోర్టు రద్దుకు ఆదేశాలిచ్చినట్లు వనౌతు ప్రధాని వివరించారు. -
61 ఏళ్ల వయసులో మరోసారి ప్రేమలో పడ్డ ‘ఐపీఎల్ సృష్టికర్త’!.. ఎవరీమె?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి చైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ(Lalit Modi) మరోసారి ప్రేమలో పడ్డాడు. రీమా బౌరీ(Rima Bouri)తో పాతికేళ్లుగా తనకున్న స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిందని తెలిపాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ విషయాన్ని లలిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.దేశం విడిచిపారిపోయికాగా వ్యాపార కుటుంబానికి చెందిన లలిత్ మోదీ ఢిల్లీలో జన్మించాడు. ఐపీఎల్(IPL) సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన అతడు.. అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఆర్థిక అవకతవలకు పాల్పడి దేశం విడిచిపారిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం లలిత్ మోదీ లండన్లో తలదాచుకుంటున్నట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది.భార్య కంటే తొమ్మిదేళ్లు చిన్నఇదిలా ఉంటే.. లలిత్ మోదీ వృత్తిగత జీవితం మాదిరే వ్యక్తిగత జీవితం కూడా సంచలనాల మయమే. వయసులో తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన, డివోర్సీ మినాల్ను లలిత్ మోదీ ప్రేమించి పెళ్లాడాడు. ఆమె కోసం కుటుంబాన్ని ఎదిరించి మరీ ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చిన లలిత్.. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగాడు.ఇక లలిత్- మినాల్ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ మోదీ ఉన్నారు. వీరిద్దరితో పాటు మినాల్కు మొదటి వివాహం ద్వారా కలిగిన కుమార్తె కరీమా సంగ్రాణిని కూడా లలిత్ మోదీ చేరదీసినట్లు కథనాలు ఉన్నాయి. లలిత్ ప్రాణంగా ప్రేమించిన మినాల్ క్యాన్సర్తో పోరాడి దురదృష్టవశాత్తూ 2018లో కన్నుమూశారు.సుస్మితా సేన్తో ప్రేమలో ఉన్నట్లుఅప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ గతేడాది.. విశ్వ సుందర్ సుస్మితా సేన్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి సంచలనానికి తెరదీశాడు. అనంతరం.. ఆమెను బెటర్ హాఫ్ అని సంబోధిస్తూ పెళ్లి వార్తలకు ఊతమిచ్చాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరూ వీటిని ఖండించడంతో ఊహాగానాలకు చెక్ పడింది.అయితే, తాజాగా.. 61 ఏళ్ల లలిత్ మోదీ తాను మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలపడం విశేషం. ‘‘ఒక్కసారి అదృష్టం అంటారు... మరి నేను మాత్రం రెండుసార్లు లక్కీ అయ్యాను. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిన వేళ.. అవును ఇది రెండోసారి జరిగింది. మీ జీవితాల్లోనూ ఇలా జరిగే ఉంటుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే’’ అంటూ రీమా బౌరీతో ఉన్న ఫొటోలతో కూడిన వీడియోను లలిత్ మోదీ షేర్ చేశాడు.జీవితాంతం నువ్వే నా ప్రేమఇందుకు స్పందిస్తూ.. ‘‘లవ్ యూ మోర్’’ అని రీమా పేర్కొనగా.. లలిత్.. ‘‘జీవితాంతం నువ్వే నా ప్రేమ’’ అంటూ రొమాంటిక్గా బదులివ్వడం విశేషం. కాగా రీమా బౌరీ వృత్తిరీత్యా మార్కెటింగ్ కన్సల్టెంట్గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. 2022లో లలిత్ మోదీ తన కుమార్తె ఆలియా వివాహం జరిపించాడు. బ్రెట్ కార్ల్సన్ అనే విదేశీయుడిని ఆలియా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే.. 2008లో మొదలైన ఐపీఎల్ పదిహేనేళ్లుగా విజయవంతమైన లీగ్గా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఈ మెగా క్రికెట్ ఈవెంట్ మొదలుకానుంది.చదవండి: అప్పుడే ఆఫర్ వచ్చింది.. కానీ!.. వదిలేసిన ఫ్రాంఛైజీ జట్టుకే కెప్టెన్గా.. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
కాసుల వర్షం: సినీ తారలు, వ్యాపారవేత్తలే కాదు.. ఐటీ దిగ్గజాలు కూడా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిందంటే అతియోశక్తి కాదేమో! ఐపీఎల్ ఆరంభానికి పూర్వం కూడా భారత్ క్రికెట్ యాజమాన్యానికి అంతర్జాతీయ క్రికెట్ పై మంచి పట్టు ఉండేది. కానీ ఐపీఎల్ రాకతో భారత్ ఏకంగా ప్రపంచ క్రికెట్ని శాసించే స్థాయికి చేరుకుంది. ఐపీఎల్ కురిపించే కాసుల వర్షం ఇందుకు ప్రధాన కారణం. గత సంవత్సరం గణాంకాల ప్రకారం ఐపీఎల్ మొత్తం విలువ 1600 కోట్ల డాలర్లను దాటి పోయింది. ఇందుకు ఐపీఎల్ను నిర్వహిస్తున్న తీరు కూడా ఒక కారణం. ఇందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని అభినందించాల్సిందే.ఐపీఎల్ విజయ సూత్రాన్ని ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ తెలుసుకున్నాయి. వివిధ దేశాల్లో జరుగుతున్న టీ20 క్రికెట్ టోర్నమెంట్లు ఇందుకు ఉదాహరణ. ఆయా దేశాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ అక్కడ ఐపీఎల్ తరహాలో కాసుల వర్షం కురవడం లేదు. భారత్లో క్రికెట్కు ఉన్న మోజు కూడా ఇందుకు ప్రధాన కారణం. ఐపీఎల్ జరుగుతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. ఐపీఎల్కి క్రికెట్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ అలాటిది.'ది హండ్రెడ్' ఇక ఐపీఎల్ స్పూర్తితో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 'ది హండ్రెడ్' అనే కొత్త ఫార్మాట్ ని 2021 జులై లో ప్రారంభించింది. ఇందులో ఇరు జట్లు వందేసి బంతులు మాత్రమే ఎదుర్కొంటాయి. ఇప్పుడు తాజాగా అమెరికా లో రాణిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజాల కళ్ళు ఈ క్రికెట్ టోర్నమెంట్పై పడ్డాయి.టెక్ దిగ్గజాలు కూడాఅమెరికాలో టెక్ కంపెనీ సీఈఓలు.. ముఖ్యంగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ వంటి ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. టైమ్స్ ఇంటర్నెట్ వైస్ చైర్మన్ సత్యన్ గజ్వానీ, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా నేతృత్వంలోని అమెరికాకు చెందిన టెక్ లీడర్లతో కూడిన కన్సార్టియం శుక్రవారం జరిగిన వేలంలో లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీలో 49% వాటాను 145 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.అమాంతం పెరిగిపోయిన విలువఈ కన్సార్టియం ఐపీఎల్ లోని లక్నో జట్టు ను నిర్వహిస్తున్న ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ను పక్కకు తోసి లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీ ని చేజిక్కించుకోవడం విశేషం. లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ వేదిక కావడం ఇందుకు ఒక కారణం. లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీపడే ఎనిమిది ఫ్రాంచైజీలలో ఒకటి. ఈ ఒప్పందంతో లండన్ స్పిరిట్ విలువ అమాంతం పెరిగిపోయి, ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈ జట్టు ఇప్పుడు అత్యంత విలువైన ఫ్రాంచైజీగా చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 49%అంతకుముందు గురువారం నాడు ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టులో ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49% వాటా కోసం వెచ్చించిన 60 లక్ష ల పౌండ్ల కంటే ఇది రెండింతలు అధికం. ఇప్ప్పటికే ఐపీఎల్ లో సినీ తారలు, వ్యాపారవేత్తలు వివిధ ఫ్రాంచైజీ ల లో పెట్టుబడులు పెట్టి కోట్ల లాభాలను గడిస్తున్నారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ప్రతీ సంవత్సరం అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లోకి ప్రపంచ ఐటి దిగ్గజాలు రంగ ప్రవేశం చేయడంతో ప్రపంచ క్రికెట్ కొత్త హంగులు దిద్దుకుంటుందనడంలో సందేహం లేదు.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
IPL 2024 MI Vs DC: ముంబై అదిరే బోణీ...
ముంబై: ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ తాజా సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. ఆరంభం నుంచి ఆఖరి బంతిదాకా బ్యాటర్లంతా దంచేయడంతో ముంబై 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. మొదట ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్స్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్లు), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులు... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) విధ్వంసం ఢిల్లీ బౌలర్లను చేష్టలుడిగేలా చేసింది. అక్షర్ పటేల్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేయగలిగింది. పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్ కొయెట్జీ 4 వికెట్లు తీశాడు. మూడు దశల్లో ముంబై వీర విహారం ఓపెనర్లు రోహిత్, ఇషాన్ తొలిదశకు అద్భుతంగా శ్రీకారం చుట్టారు. ఇద్దరు అడ్డుఅదుపులేని బాదుడుతో 4.1 ఓవర్లో ముంబై స్కోరు 50కి చేరింది. ఇంకో మూడు ఓవర్లలోనే జట్టు స్కోరు 80 దాటింది. అక్కడే రోహిత్ అవుట్కాగా స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ (0), ఇషాన్ కిషన్లు కూడా అవుటయ్యారు. తిలక్వర్మ (6) అవుటయ్యాక రెండో దశను హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ ధాటిగా నడిపించారు. 16వ ఓవర్లో 150 దాటింది. డేవిడ్ సిక్స్లతో విరుచుకుపడటంతో మరో మూడు ఓవర్లలో 200 (19వ ఓవర్లో) మైలురాయిని చేరుకుంది. ఆఖరి దశ మాత్రం షెఫర్డ్ అరివీర బాదుడుతో స్టేడియం ఊగిపోయింది. నోర్జే వేసిన 20వ ఓవర్ అసాంతం ఆడుకున్న షెఫర్డ్ 4, 6, 6, 6, 4, 6లతో ఏకంగా 32 పరుగులు పిండేశాడు. ఏ ఒక్కరు కనీసం ఫిఫ్టీ అయినా బాదకుండా టి20 క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ముంబై రికార్డు నమోదు చేసింది. పృద్విషా, స్టబ్స్ మెరుపులు మ్యాచ్లో ఓడింది కానీ... ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరిదాకా పోరాడింది. వార్నర్ (10)తో ఆరంభం కుదరకపోయినా పృథ్వీ షా చక్కని షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించాడు. అభిõÙక్ పోరెల్ (31 బంతుల్లో 41; 5 ఫోర్లు)తో రెండో వికెట్కు చకచకా 88 పరుగులు జోడించాక 12వ ఓవర్లో బుమ్రా కళ్లు చెదిరే యార్కర్కు పృథ్వీ షా నిష్క్రమించాడు. తర్వాత స్టబ్స్ భారీ సిక్సర్ల విధ్వంసంతో ముంబై ఇండియన్స్ బౌలర్లను వణికించాడు. కానీ అవతలి వైపు నిలిచే బ్యాటరే కరువవడంతో ఛేజింగ్లో వెనుకబడింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) అక్షర్ 49; కిషన్ (సి అండ్ బి) అక్షర్ 42; సూర్యకుమార్ (సి) సబ్–ఫ్రేజర్ (బి) నోర్జే 0; హార్దిక్ (సి) సబ్–ఫ్రేజర్ (బి) నోర్జే 39; తిలక్ వర్మ (సి) పటేల్ (బి) ఖలీల్ 6; టిమ్ డేవిడ్ (నాటౌట్) 45; షెఫర్డ్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 234. వికెట్ల పతనం: 1–80, 2–81, 3–111, 4–121, 5–181. బౌలింగ్: ఖలీల్ 4–0–39–1, ఇషాంత్ 3–0– 40–0, రిచర్డ్సన్ 4–0–40–0, అక్షర్ 4–0– 35–2, లలిత్ 1–0–15–0, నోర్జే 4–0– 65–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) బుమ్రా 66; వార్నర్ (సి) పాండ్యా (బి) షెఫర్డ్ 10; పోరెల్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 41; స్టబ్స్ (నాటౌట్) 71; రిషభ్ పంత్ (సి) హార్దిక్ (బి) కొయెట్జీ 1; అక్షర్ పటేల్ (రనౌట్) 8; లలిత్ (సి) ఇషాన్ (బి) కొయెట్జీ 2; కుశాగ్ర (సి) తిలక్ వర్మ (బి) కొయెట్జీ 0; రిచర్డ్సన్ (సి) రోహిత్ (బి) కొయెట్జీ 2; ఎక్స్ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–22, 2–110, 3–144, 4–153, 5–194, 6–203, 7–203, 8– 205. బౌలింగ్: కొయెట్జీ 4–0–34–4, బుమ్రా 4–0–22–2, ఆకాశ్ మధ్వాల్ 4–0–45–0, రొమారియో షెఫర్డ్ 4–0–54–1, నబీ 2–0– 17–0, పీయూశ్ చావ్లా 2–0– 32–0. ఐపీఎల్లో నేడు చెన్నై X కోల్కతా వేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: మే 26న చెన్నైలో ఐపీఎల్ ఫైనల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మే 26న ఐపీఎల్ ఫైనల్కు చెన్నై ఆతిథ్యమిస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 2012 తర్వాత చెన్నైలో మళ్లీ ఐపీఎల్ టైటిల్ పోరు జరగనుండటం విశేషం. మే 19వ తేదీతో లీగ్ దశ మ్యాచ్లు పూర్తవుతాయి. అనంతరం మే 21న క్వాలిఫయర్–1 మ్యాచ్కు... మే 22న ఎలిమినేటర్ మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. మే 24న చెన్నైలో క్వాలిఫయర్–2 మ్యాచ్... మే 26న ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారు కాకముందు ఫిబ్రవరిలో బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్లతో కూడిన తొలి దశ షెడ్యూల్ను విడుదల చేసింది. -
IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. నిలకడైన ఆటతీరుతో కెరీర్ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లో రచిన్ 10 మ్యాచ్లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్గా ఎదగడం ఖాయం. సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై) ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది. ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. యూపీ టి20 లీగ్లో కాన్పూర్ సూపర్స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు. వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై) గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్తో కొయెట్జీ గత వన్డే వరల్డ్కప్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్గా కొయెట్జీని చూడవచ్చు. ఆల్రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్) 2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్గా అవతరించింది. గత ఏడాది రన్నరప్గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్కు ఆల్రౌండర్ కొరత ఏర్పడింది. ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్కప్లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్) మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్ను తీసుకుంది. లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో) ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్ను రూ. 3 కోట్లకు తీసుకుంది. -
ఐపీఎల్ వేలం కాసేపట్లో.. అందలం ఎక్కేదెవరు?
విశ్వవ్యాప్త క్రికెట్ అభిమానాన్ని యేటికేడు పెంచుకుంటున్న ఐపీఎల్లో ఆటకు ముందు వేలం పాట జరగబోతోంది. దుబాయ్లో నేడు నిర్వహించే మినీ వేలానికి 333 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది 77 మంది కాగా... ఇటీవల ప్రపంచకప్తో పాటు పరిమిత ఓవర్ల ఆటలో మెరిపిస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్రపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలన్నీ సై అంటున్నాయి. దుబాయ్: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్కు నేడు దుబాయ్లో ఆటగాళ్ల మినీ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ విదేశీ గడ్డపై జరగనుంది. ఒక రోజు ముందు సోమవారం ఫ్రాంచైజీ యాజమాన్యాలతో మాక్ వేలం కూడా నిర్వహించారు. ఇక కోట్ల పందేరం, ఆటగాళ్లకు అందలం పలికేందుకు ఒకటోసారి, రెండోసారి అని సుత్తి బద్దలు కొట్టే ప్రక్రియే తరువాయి. 1,166 మంది నమోదు చేసుకుంటే... ఈ మినీ వేలం కోసం ఐసీసీ సభ్య, అనుబంధ దేశాలు, దేశవాళ్లీ ఆటగాళ్లు ఆసక్తి చూపారు. ఏకంగా 1,166 మంది ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకుంటే... ఫ్రాంచైజీ జట్లతో సంప్రదింపుల అనంతరం లీగ్ పాలకమండలి 333 మంది ఆటగాళ్లతో తుది జాబితాను సిద్ధం చేసింది. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది మాత్రం 77 మంది ఆటగాళ్లు. ఇందులో 30 ఖాళీలను విదేశీ ఆటగాళ్లతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంది. అత్యధికంగా 12 ఖాళీలు కోల్కతా నైట్రైడర్స్లో ఉన్నాయి. నలుగురు విదేశీ ఆటగాళ్లు సహా 12 మందిని కొనేందుకు కోల్కతా వద్ద రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. హాట్ కేక్... రచిన్? భారత్లో ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో డాషింగ్ బ్యాటర్గా రచిన్ రవీంద్ర అందరికంటా పడ్డాడు. ఆరంభంలో ఎదురుదాడికి దిగి న్యూజిలాండ్ విజయాలకు గట్టి పునాది వేసిన రచిన్ ఈ మినీ వేలంలో హాట్కేక్ కానున్నాడు. రూ.50 లక్షల కనీస ధరతో ఫ్రాంచైజీల్ని ఆకర్షిస్తున్నాడు. ఆసీస్ స్పీడ్స్టర్స్ స్టార్క్, కమిన్స్, బ్యాటర్ ట్రావి హెడ్, దక్షిణాఫ్రికా సంచలనం కొయెట్జీ, హసరంగ (శ్రీలంక) తదితర స్టార్ క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఎగబడే అవకాశాలు న్నాయి. భారత్ నుంచి శార్దుల్ ఠాకూర్, హర్షల్ పటేల్, అన్క్యాప్డ్ ఆల్రౌండర్ల సెట్ నుంచి షారుఖ్ ఖాన్లపై రూ.కోట్లు కురిసే అవకాశముంది. వేలం కోసం ప్లేయర్ల ప్రత్యేకతను బట్టి 19 సెట్లుగా విభజించారు. అంటే బ్యాటర్, ఆల్రౌండర్, పేసర్, స్పిన్నర్, వికెట్ కీపర్, క్యాప్డ్, అన్క్యాప్డ్ ఇలా సెట్ల వారీగా వేలం ప్రక్రియ జరుగుతుంది. -
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024..?
సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న కథనాల ప్రకారం ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ సీజన్ మే చివరి నాటి పూర్తవుతుందని సమాచారం. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికల జరగాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాతే తదనుగుణంగా ఐపీఎల్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పోలింగ్ తేదీలు ఖరారయ్యాక ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదలవుతుందని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్ కోసం ఇప్పటినుంచే హడావుడి మొదలైంది. 2024 సీజన్ వేలం రేపు (డిసెంబర్ 19) జరుగనుండటంతో అన్ని ఫ్రాంచైజీలు సన్నాహకాల్లో నిమగ్నమై ఉన్నాయి. దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో రేపు వేలం జరుగనుంది. ఈ వేలం భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమవుతుంది. వేలం ప్రక్రియ మొత్తం స్టార్ స్పోర్ట్స్ (టీవీ), జియో సినిమాలో (డిజిటల్) ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ వేలంలో 77 స్లాట్ల కోసం 333 మంది ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వేర్వేరు బేస్ ప్రైజ్ విభాగాల్లో ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో మిచెల్ స్టార్క్, గెరాల్డ్ కొయెట్జీ, పాట్ కమిన్స్, హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, రచిన్ రవీంద్రలపై అందరీ దృష్టి ఉంది. ఈ ఆటగాళ్లు వేలంలో గత రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఆయా జట్ల పరిస్థితి ఇది..!
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షమ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ , పీయూష్ చావ్లా, ఆకాష్ మాధ్వల్, జేసన్ బెహ్రెన్డార్ఫ్, రొమారియో షెపర్డ్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (13 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (84.75 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (17.75 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (68.6 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (31.4 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (38.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎంగిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-15 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (71.5 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (28.95 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (9), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్ , అమిత్ మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, దేవదత్ పడిక్కల్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (86.85 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (13.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేష్ ఖాన్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (85.5 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (14.5 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) సన్రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్ హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (66 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (34 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ కుమార్ వైశాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (59.25 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (23.25 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్సిమ్రన్ సింగ్, జితేష్ శర్, సికందర్ రజా, రిషి ధవన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ టైడే, అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్ప్రీత్ భాటియా, విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (70.9 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (29.1 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) కోల్కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-13 (9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (67.3 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (32.7 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (12), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 16 వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. సామ్ కర్రన్- 18.5 కోట్లు (2023, పంజాబ్ కింగ్స్) కెమారూన్ గ్రీన్- 17.5 కోట్లు (2023, ముంబై ఇండియన్స్) బెన్ స్టోక్స్- 16.25 కోట్లు (2023, చెన్నై సూపర్ కింగ్స్) క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (2021,రాజస్తాన్ రాయల్స్) నికోలస్ పూరన్- 16 కోట్లు (2023, లక్నో సూపర్ జెయింట్స్) యువరాజ్ సింగ్-16 కోట్లు (2015, ఢిల్లీ డేర్ డెవిల్స్) పాట్ కమిన్స్-15.5 కోట్లు (2020, కేకేఆర్) ఇషాన్ కిషన్-15.25 కోట్లు (2022, ముంబై ఇండియన్స్) కైల్ జేమీసన్-15 కోట్లు (2021, ఆర్సీబీ) బెన్ స్టోక్స్-14.5 కోట్లు (2017, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) సీజన్ల వారీగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు.. 2023: సామ్ కర్రన్- 18.5 కోట్లు (పంజాబ్ కింగ్స్) 2022: ఇషాన్ కిషన్-15.25 కోట్లు (ముంబై ఇండియన్స్) 2021: క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (రాజస్తాన్ రాయల్స్) 2020: పాట్ కమిన్స్-15.5 కోట్లు (కోల్కతా నైట్రైడర్స్) 2019: జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి- 8.4 కోట్లు (RR, KXIP) 2018: బెన్ స్టోక్స్- 12.5 కోట్లు (రాజస్తాన్ రాయల్స్) 2017: బెన్ స్టోక్స్-14.5 కోట్లు (రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) 2016: షేన్ వాట్సన్- 9.5 కోట్లు (ఆర్సీబీ) 2015: యువరాజ్ సింగ్-16 కోట్లు (ఢిల్లీ డేర్ డెవిల్స్) 2014: యువరాజ్ సింగ్- 14 కోట్లు (ఆర్సీబీ) 2013: గ్లెన్ మ్యాక్స్వెల్- 6.3 కోట్లు (ముంబై ఇండియన్స్) 2012: రవీంద్ర జడేజా- 12.8 కోట్లు (సీఎస్కే) 2011: గౌతమ్ గంభీర్- 14.9 కోట్లు (కేకేఆర్) 2010: షేన్ బాండ్, కీరన్ పోలార్డ్- 4.8 కోట్లు (కేకేఆర్, ముంబై) 2009: కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్- 9.8 కోట్లు (ఆర్సీబీ, సీఎస్కే) 2008: ఎంఎస్ ధోని- 9.5 కోట్లు (సీఎస్కే) ఐపీఎల్లో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లికి ఆర్సీబీ యాజమాన్యం 2023 సీజన్ కోసం 17 కోట్లు ముట్టజెప్పింది. కోహ్లి తర్వాత అత్యధిక మొత్తం అందుకున్న భారత ఆటగాళ్లుగా రోహిత్ శర్మ (2023 సీజన్లో 16 కోట్లు), రవీంద్ర జడేజా (2023లో 16 కోట్లు, రిషబ్ పంత్ (2023లో 16 కోట్లు, యువరాజ్ సింగ్ (2015లో 16 కోట్లు) ఉన్నారు. వీరి తర్వాత ఇషాన్ కిషన్ (2022లో 15.25 కోట్లు), యువరాజ్ సింగ్ (2014లో 14 కోట్లు), దినేశ్ కార్తీక్ (2014లో 12.5 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (2022లో 12.25 కోట్లు) అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్.. ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
16 సీజన్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ను (ఐపీఎల్) విజయవంతంగా నిర్వహించిన అనంతరం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరో కొత్త లీగ్ను నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లీగ్ను కూడా ఐపీఎల్ తరహాలోనే భారీ ప్రణాళికతో రూపొందించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లీగ్ను టీ20 ఫార్మాట్లో కాకుండా టీ10 ఫార్మాట్లో నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారట. ఇందుకు సెప్టెంబర్-అక్టోబర్ మాసాలను పరిశీలిస్తున్నట్లు వినికిడి. భారత్తో పాటు విదేశాల్లోనూ ఈ రెండు నెలల్లో పెద్ద టోర్నీలేవీ లేకపోవడంతో సెప్టెంబర్-అక్టోబర్ మాసాలయితే కొత్త లీగ్ నిర్వహణకు అనువుగా ఉంటాయని బీసీసీఐ పెద్దల చర్చించినట్లు తెలుస్తుంది. కొత్త టీ10 లీగ్ ఆలోచన ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ల కోసం బడా కంపెనీలు ఎగబడుతున్నట్లు సమాచారం. కొత్త లీగ్ ప్రతిపాదనను బీసీసీఐ కార్యదర్శి జై షా లేవనెత్తగా బీసీసీఐ పెద్దలందరూ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. కాగా, బీసీసీఐ ఆధ్వర్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో పరుడు పోసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి క్యాష్ రిచ్ లీగ్ నిరంతరాయంగా 16 సీజన్ల పాటు విజయవంతంగా సాగింది. తదుపరి సీజన్ (2024) సన్నాహకాలు కూడా ఇదిరవకే ప్రారంభమయ్యాయి. ఈ సీజన్కు సంబంధించిన వేలం ఈనెల 19న దుబాయ్లో జరుగనుంది. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలో ఫ్రాంచైజీలు సైతం ఓ క్లారిటీ కలిగి ఉన్నాయి. -
ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం.. తుది జట్లు ఇవే..!
2024 సౌతాఫ్రికా టీ20 లీగ్కు సంబంధించిన వేలం జోహన్నెస్బర్గ్లో నిన్న ముగిసింది. ఈ లీగ్ రెండో ఎడిషన్లో పాల్గొనబోయే ఆరు జట్లు తమతమ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. పర్స్ వ్యాల్యూ మేరకు అన్ని ఫ్రాంచైజీలు పటిష్టమైన జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ వేలంలో సౌతాఫ్రికా ఆల్రౌండర్ దయ్యన్ గలీమ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్ అతన్ని 1.60 మిలియన్లకు దక్కించుకుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్ వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ను వైల్డ్కార్డ్ పిక్గా ఎంపిక చేసుకోగా.. పార్ల్ రాయల్స్ లోర్కన్ టక్కర్ను బేస్ ధరకు వైల్డ్ కార్డ్ పిక్గా ఎంపిక చేసుకుంది. ఆయా జట్ల కెప్టెన్ల విషయానికొస్తే.. పార్ల్ రాయల్స్కు (రాజస్తాన్ రాయల్స్) జోస్ బట్లర్, డర్బన్ సూపర్ జెయింట్స్కు (లక్నో సూపర్ జెయింట్స్) కేశవ్ మహారాజ్, ప్రిటోరియా క్యాపిటల్స్కు (ఢిల్లీ క్యాపిటల్స్) వేన్ పార్నెల్, ముంబై ఇండియన్స్ కేప్టౌన్కు (ముంబై ఇండియన్స్) రషీద ఖాన్, జోబర్గ్ సూపర్కింగ్స్కు (చెన్నై సూపర్ కింగ్స్) ఫాఫ్ డుప్లెసిస్, సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్కు (సన్రైజర్స్ హైదరాబాద్) ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహించనున్నారు. సౌతాఫ్రికన్ లీగ్లో పాల్గొనే ఆరు జట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ ఎడిషన్లో (2023) సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్ను ఖంగుతినిపించి ఛాంపియన్గా అవతరించింది. 2024 సీజన్ జనవరి 10న మొదలై ఫిబ్రవరి 10న ముగుస్తుంది. పూర్తి జట్ల వివరాలు.. ప్రిటోరియా క్యాపిటల్స్: పాల్ స్టెర్లింగ్, కైల్ వెర్రెన్, రిలీ రొస్సో, కొలిన్ ఇంగ్రామ్, థీనిస్ డి బ్రుయిన్, విల్ జాక్స్, షేన్ డాడ్స్వెల్, డారిన్ డుపావిల్లోన్, మిగేల్ ప్రిటోరియస్, అన్రిచ్ నోర్ట్జే, ఆదిల్ రషీద్, ఈథన్ బాష్, కార్బిన్ బాష్, మాథ్యూ బోస్ట్, జిమ్మీ నీషమ్, సెనురన్ ముత్తసామి, వేన్ పార్నెల్ (కెప్టెన్), స్టీవ్ స్టోక్ పార్ల్ రాయల్స్: లోర్కన్ టక్కర్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేన్ విలాస్, మిచెల్ వాన్ బ్యూరెన్, లువాన్ డ్రే ప్రిటోరియస్, జాన్ టర్నర్, క్వేనా మఫాకా, ఒబెద్ మెక్కాయ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, కోడి యూసుఫ్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, విహాన్ లుబ్బే, ఫెరిస్కో ఆడమ్స్, ఇవాన్ జోన్స్, ఫాబియన్ అలెన్ ఎంఐ కేప్ టౌన్: క్రిస్ బెంజమిన్, డెవాల్డ్ బ్రెవిస్, టామ్ బాంటన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, గ్రాంట్ రోలోఫ్సెన్, కానర్ ఎస్టర్హుజెన్, నీలన్ వాన్ హీర్డెన్, థామస్ కబెర్, కగిసో రబడ, రషీద్ ఖాన్ (కెప్టెన్), బ్యూరాన్ హెండ్రిక్స్, ఒల్లీ స్టోన్, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, డెలానో పాట్గెటర్, జార్జ్ లిండే, డువాన్ జన్సెన్ జోబర్గ్ సూపర్ కింగ్స్: వేన్ మాడ్సెన్, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), ల్యూస్ డు ప్లూయ్, రీజా హెండ్రిక్స్, డోనోవన్ ఫెర్రీరా, సిబోనెలో మఖాన్యా, రోనన్ హెర్మన్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, జహీర్ ఖాన్, సామ్ కుక్, లిజాడ్ విలియమ్స్, నాండ్రే బర్గ్డర్, ఆరోన్ ఫాంగిసొ, కైల్ సిమ్మండ్స్, దయ్యన్ గలీమ్, మొయిన్ అలీ, డేవిడ్ వీస్ డర్బన్ సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, భానుక రాజపక్స, హెన్రిచ్ క్లాసెన్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, ప్రేనెలన్ సుబ్రాయెన్, నవీన్ ఉల్ హక్, రీస్ టాప్లీ, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), కైల్ అబాట్, జూనియర్ డాలా, జాసన్ స్మిత్, కైల్ మేయర్స్, డ్వేన్ ప్రిటోరియస్, కీమో పాల్, వియాన్ ముల్దర్, జోన్ జోన్ స్మట్స్, బ్రైస్ పార్సన్స్ సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బవుమా, జోర్డాన్ హెర్మాన్, ఆడమ్ రోసింగ్టన్, సరెల్ ఎర్వీ, కాలేబ్ సెలెకా, ఒట్నీల్ బార్ట్మన్, లియామ్ డాసన్, సిసంద మగాలా, బ్రైడన్ కార్స్, సైమన్ హెర్మెర్, క్రెయిగ్ ఒవర్టన్, బేయర్స్ స్వేన్పోల్, మార్కో జన్సెన్, అయా క్వామేన్, టామ్ అబెల్, ఆండిల్ సిమెలన్ -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL), ద హండ్రెడ్ లీగ్ (THL)ల్లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బ్రూక్కు ముందు ఈ మూడు లీగ్ల్లో సెంచరీలు చేసిన ఆటగాడే లేడు. హండ్రెడ్ లీగ్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్కు ప్రాతినిథ్యం వహించిన బ్రూక్ నిన్న (ఆగస్ట్ 22) వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో (42 బంతులు 105; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) కదంతొక్కాడు. ఈ సెంచరీ హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ (41) కావడం విశేషం. దీనికి ముందు బ్రూక్ 2023 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తూ కోల్కతా నైట్రైడర్స్పై శతకం (55 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఈ సెంచరీతో బ్రూక్ సన్రైజర్స్ యంగెస్ట్ సెంచూరియన్గానూ రికార్డుల్లోకెక్కాడు. 2023 ఐపీఎల్కు ముందు సన్రైజర్స్ బ్రూక్ను 13.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. పై పేర్కొన్న మూడు లీగ్ల్లో (ఐపీఎల్, పీఎస్ఎల్, హండ్రెడ్) బ్రూక్ తన తొలి సెంచరీని పీఎస్ఎల్లో సాధించాడు. 2022 పీఎస్ఎల్లో బ్రూక్, లాహోర్ ఖలందర్స్కు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇస్లామాబాద్ యునైటెడ్పై శతక్కొట్టాడు (49 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు). ఓవరాల్గా బ్రూక్ కెరీర్ చూసుకుంటే, 2022 జనవరిలో విండీస్తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 12 టెస్ట్ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 1181 పరుగులు.. 3 వన్డేల్లో ఫిఫ్టి సాయంతో 86 పరుగులు, 20 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 372 పరుగులు చేశాడు. బ్రూక్ ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున 11 మ్యాచ్ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు చేశాడు. -
కరీబియన్ ప్రీమియర్ లీగ్ బరిలోకి అంబటి రాయుడు.. రేపే ముహూర్తం
టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ సూపర్ స్టార్ అంబటి తిరుపతి రాయుడు కరీబియన్ ప్రీమియర్ లీగ్లో అధికారికంగా జాయిన్ అయ్యాడు. రేపు (ఆగస్ట్ 19) ట్రిన్బాగో నైట్రైడర్స్తో జరిగే మ్యాచ్తో సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున సీపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. సౌతాఫ్రికా ఆల్రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్కు ప్రత్యామ్నాయంగా రాయుడు రేపటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. దీంతో ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న రెండో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. 2020 సీజన్లో ప్రవీణ్ తాంబే ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫున సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. Awesome to be back on the park.. excited to be a part of the @sknpatriots and the @CPL.. pic.twitter.com/dsHC4xtsi8 — ATR (@RayuduAmbati) August 17, 2023 సీపీఎల్లో తన తొలి మ్యాచ్కు ముందు రాయుడు తన ట్విటర్ ఖాతా ద్వారా ఓ మెసేజ్ షేర్ చేశాడు. మళ్లీ బ్యాట్ పట్టి బరిలోకి దిగడం అద్భుతంగా ఉంది.. కరీబియన్ లీగ్లో, ముఖ్యంగా సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందంటూ పేట్రియాట్స్ జెర్సీలోని తన ఫోటోను షేర్ చేశాడు. ఇదిలా ఉంటే, 2023 సీజన్ తర్వాత ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ఇటీవల అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. అయితే, ఏదో బలమైన కారణం చేత రాయుడు ఆ లీగ్లో ఆడలేకపోయాడు. మరోవైపు రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. -
IPL: ‘ఢిల్లీ క్యాపిటల్స్’ కోసం కోట్లు వదులుకున్న సూపర్స్టార్.. అందుకే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం. క్యాష్ రిచ్ లీగ్గా పేరొందిన ఈ మెగా క్రికెట్ ఈవెంట్లో భాగమైన ఫ్రాంఛైజీలలో అత్యధికం బడా సంస్థలకు చెందినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఐపీఎల్లో సక్సెస్ అయితే ఎంతటి క్రేజ్ వస్తుందో.. ఏమాత్రం తేడా జరిగినా అదే స్థాయిలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది! ఐపీఎల్ రెండో సీజన్(2009)లో విజేతగా నిలిచిన దక్కన్ చార్జర్స్ ఆ తర్వాత కనుమరుగైన తీరే ఇందుకు నిదర్శనం. అయితే, అదే ఏడాది.. ఢిల్లీ క్యాపిటల్స్ తాము కూడా చార్జర్స్ మాదిరే చేతులు కాల్చుకోకుండా తీసుకున్న కీలక నిర్ణయం గురించి, దానితో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్కు ఉన్న సంబంధం గురించి బీసీసీఐ మాజీ జీఎం అమృత్ మాథూర్ సంచలన విషయాలు తాజాగా వెల్లడించాడు. బాలీవుడ్తో అనుబంధం ఐపీఎల్కు ప్రాచుర్యం కల్పించే క్రమంలో బాలీవుడ్ను కూడా ఇందులో మమేకం చేసిన విషయం తెలిసిందే. బీ-టౌన్ బాద్షా షారుక్ ఖాన్, అలనాటి హీరోయిన్ జూహీ చావ్లా కోల్కతా నైట్ రైడర్స్కు యజమానులు కాగా.. శిల్పా శెట్టి కుంద్రా రాజస్తాన్ రాయల్స్కు, ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్కు సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంఛైజీ ఓనర్లుగానే గాకుండా ప్రమోషన్లలో భాగమైన, భాగమవుతున్న స్టార్లు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో 2009లో ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం ఢిల్లీ డేర్డెవిల్స్) సూపర్స్టార్ అక్షయ్ కుమార్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అక్కీతో అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోగా ఆర్థికపరంగా నష్టాలూ చవిచూసింది. అనవసర ఖర్చులు ఎందుకు? అనవసర ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అతడితో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు చట్టపరంగా చిక్కులు ఎదరవుతాయని భావించినా.. అక్షయ్ కుమార్ పెద్ద మనసుతో ఈ సమస్య నుంచి ఫ్రాంఛైజీ తేలికగా బయటపడేలా చేశాడు. ‘‘ప్రమోషనల్ ఫిల్మ్స్, మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ల కోసం అక్షయ్ కుమార్తో ఢిల్లీ క్యాపిటల్స్ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. కోట్లా మైదానంలో విన్యాసాలు మినహా క్యాపిటల్స్కు అతడి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. నిజానికి అతడి సేవలు వినియోగించడంలో యాజమాన్యం విఫలమైంది. నష్టాలు వెంటాడాయి. దీంతో అర్ధంతరంగా అక్కీతో డీల్ ముగించాలని భావించింది. న్యాయపరంగా చిక్కులు.. అయితే న్యాయపరంగా అందుకు అనేక అడ్డంకులు ఉండటంతో అక్షయ్ కుమార్ దయపైనే అంతా ఆధారపడి ఉన్న సందర్భం. అక్కీ లాయర్లతో విషయం గురించి చెప్పాం. ఆ తర్వాత ఓరోజు సినిమా షూటింగ్లో ఉన్నపుడు.. షాట్ ముగిసిన తర్వాత అక్షయ్ వానిటీ వ్యాన్లోకి నేను వెళ్లాను. మరేం పర్లేదన్న అక్షయ్ కుమార్ సంశయిస్తూనే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి.. డీల్ రద్దు చేసుకోవాలనుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి వివరించాను. కానీ అక్షయ్ మాత్రం ఎంతో హుందాగా స్పందించాడు. మరేం ప్రాబ్లం లేదండి! ఒకవేళ ఇదంతా వర్కౌట్ కాదనుకుంటే.. వెంటనే రద్దు చేసేయండి. పర్లేదు అన్నాడు. నేను విన్నది నిజమేనా నేను విన్నది నిజమేనా అన్న సందేహంలో కొట్టుమిట్టాతుండగా.. ‘‘మీరేం ఇబ్బంది పడకండి. ఎలాంటి సమస్య రాకుండా దీనిని ఎలా ముగించాలో మా లాయర్లతో నేను మాట్లాడతా అని మళ్లీ అక్షయ్ క్లారిటీ ఇచ్చాడు’’ అని అమృత్ మాథుర్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఆత్మకథలో నాటి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్గా నిలవలేదన్న విషయం తెలిసిందే. తాజా సీజన్లోనూ దారుణ ప్రదర్శనతో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక అక్షయ్ కుమార్ విషయానికొస్తే.. అతడు నటించిన ఓ మై గాడ్ 2 సినియా ఇటీవలే విడుదలైంది. చదవండి: APL 2023: తొలిరోజు మ్యాచ్కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్లో ఆ అదృష్టం మీదైతే! -
సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం..
-
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్
-
'డబ్బు, అహంకారంతో'.. భారత ఆటగాళ్లపై కపిల్ దేవ్ ఆగ్రహం
ప్రస్తుతమున్న క్రికెటర్లపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటుంటారని చెప్పాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచి విషయమేనని... అయితే ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో కొరవడటం నెగెటివ్ పాయింట్ అని అన్నాడు. ఇలా తయారు కావడానికి ప్రధానంగా డబ్బు, పొగరు, అహం అనే మూడు అంశాలే కారణమని తెలిపాడు. మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 50 సీజన్ల (సంవత్సరాలు) క్రికెట్ ను చూసిన గవాస్కర్ తో మాట్లాడేందుకు వీరికి నామోషీ ఎందుకని అడిగారు. తమకు అంతా తెలుసుని వారు అనుకుంటుంటారని... వాస్తవానికి వారికి అంతా తెలియదని చెప్పారు. ''అప్పటి, ఇప్పటి ఆటగాళ్లలో వ్యత్యాసం ఉండడం సహజమే. ప్రస్తుత తరం ప్లేయర్లలో గొప్ప విషయం ఏంటంటే వారంతా ఆత్మవిశ్వాసంతో ఆడటం. నెగటివిటీని పట్టించుకోరు.ఇదే సమయంలో మేం ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదనుకుంటారు'' అంటూ తెలిపాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్తో పాటు కాసులు కురిపించే ఐపీఎల్లో ఒక్క సీజన్ ఆడినా చాలు భారీ మొత్తంలో డబ్బులు దక్కించుకోవచ్చనే భ్రమలో ఆటగాళ్లు బతికేస్తున్నారు. ఏదో ఒకరోజు తిరిగి వారికే దెబ్బకొట్టే అవకాశముందని.. ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: #SackRahulDravid: 'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే ద్రవిడ్ను తొలగించండి' ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు -
ఐపీఎల్ బ్యాన్ చేయాలి.. కోర్టులో దాఖలైన పిటిషన్
సాక్షి, చైన్నె: ఐపీఎల్ మ్యాచ్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ విషయంపై బీసీసీఐను ఆశ్రయించాలని పిటిషనర్, ఐపీఎస్ అధికారికి హైకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ సూచించింది. వివరాలు.. ఐపీఎల్ మ్యాచ్ల క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. భారత్లో జరిగే ఈ మ్యాచ్లను చూసేందుకు స్టేడియాలకు తండో పతండాలుగా అభిమానులు తరలిరావడం జరుగుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్లు అన్ని ఫిక్సింగ్, బెట్టింగ్లతో జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ బెట్టింగ్లు, ఫిక్సింగ్లకు వ్యతిరేకంగా ఐపీఎస్ అధికారి సంపత్కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఐపీఎల్ మ్యాచ్లను బెట్టింగ్, ఫిక్సింగ్ పూర్తిగా కట్టడి అయ్యే వరకు నిర్వహించకూడదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టు సీజే గంగా పుర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. వాదనల అనంతం ఈ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. బెట్టింగ్, ఫిక్సింగ్ ఫిర్యాదులను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. చదవండి సీమా, అంజూ.. ఇప్పుడు జూలీ.. సరిహద్దులు దాటిన ప్రేమలో బిగ్ ట్విస్ట్.. -
మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రోజుల వ్యవధిలోనే రెండు క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల కిందట జింబాబ్వే లీగ్లోని (జిమ్-ఆఫ్రో టీ10 లీగ్) హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించిన సంజూ బాబా.. తాజాగా లంక ప్రీమియర్ లీగ్లోని (శ్రీలంక టీ20 లీగ్) బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. I, along with my brothers Omar Khan (OK) and H.H. Sheikh Marwan Bin Mohammed Bin Rashid Al Maktoum, are excited to announce that we have acquired the B-Love Kandy Cricket Team for the Lanka Premier League T20 2023. pic.twitter.com/ksMauYsHbH — Sanjay Dutt (@duttsanjay) June 25, 2023 తనతో పాటు ఒమర్ ఖాన్, షేక్ మర్వాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కలిసి బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నట్లు సంజూ బాబా ప్రకటించాడు. లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ బరిలో బి-లవ్ క్యాండీ బరిలో నిలువనున్నట్లు తెలిపాడు. కాగా, లంక ప్రీమియర్ లీగ్ 2023 జులై 30 నుంచి ఆగస్ట్ 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20 నుంచి 29 వరకు జరుగనుంది. ఈ లీగ్లో మొత్తం ఐదు జట్లు (డర్బన్ క్వాలండర్స్, కేప్టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్) పాల్గొంటాయి. ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సోహన్ రాయ్తో కలిసి సంజూ ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. -
IPL 2023 CSK Vs GT : ‘ఫైనల్’కు ముందెవరు?
చెన్నై: ఐపీఎల్లో రెండు దీటైన జట్ల మధ్య ఢీ అంటే ఢీ అనే మ్యాచ్కు నేడు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. చెన్నై వేదికగా మ్యాచ్ జరగడం ధోని సేనకు అనుకూలత అయినప్పటికీ... ఈ జట్టుపై ఓటమి ఎరుగని గుజరాత్ కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు సమఉజ్జీల మధ్య ఆసక్తికర సమరం గ్యారంటీ! దీంతో ప్రేక్షకులకు టి20 మెరుపులు, ఆఖరి ఓవర్ డ్రామాకు కొదవుండదు. ఇక చెన్నైలో గెలిచినా... ఓడినా... చివరి మజిలీ మాత్రం అహ్మదాబాదే! నెగ్గితే నేరుగా ఒక జట్టు ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు మరో ప్రయత్నంగా రెండో క్వాలిఫయర్లో ఆడుతుంది. ఈ రెండూ నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగనున్నాయి. చెన్నై చెలరేగితే... బరిలోకి దిగే రెండు జట్లు బలమైన ప్రత్యర్థులు. చెన్నై ఐపీఎల్ ఆరంభం నుంచే లీగ్ ఫేవరేట్లలో ఒకటిగా ఎదిగింది. ధోని నాయకత్వంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎన్నోసార్లు నిరూపించుకుంది. ఈ సీజన్లోనూ సూపర్కింగ్స్ ఆట మేటిగానే ఉంది. టాపార్డర్ లో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, శివమ్ దూబే ధనాధన్ షోకు శ్రీకారం చుడితే ప్రత్యర్థికి చుక్కలే! వెటరన్ ధోని బ్యాటింగ్లో వెనుకబడొచ్చేమో కానీ... జట్టును నడిపించడంలో ఎప్పటికీ క్రికెట్ మేధావే. మిడిలార్డర్లో అంబటి రాయుడు నుంచి ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బహుశా ఈ మ్యాచ్లో ఆ వెలతి తీర్చుకుంటాడేమో చూడాలి. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీ... ఇక బౌలింగ్ దళంలో దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే పవర్ ప్లేలో పరుగులిస్తున్నప్పటికీ వికెట్లను మాత్రం పడగొట్టేస్తున్నారు. తీక్షణ, పతిరణల వైవిధ్యం కూడా జట్టుకు కీలక సమయాల్లో ఉపయోగపడుతుంది. టైటాన్స్ ‘టాప్’షో టోర్నీ మొదలైన మ్యాచ్లోనే చెన్నైపై గెలిచిన గుజరాత్ టైటాన్స్ లీగ్లో ఘనమైన ఆరంభమిచ్చింది. బెంగళూరుతో జరిగిన ఆఖరి మ్యాచ్లోనూ టైటాన్స్దే ఆధిపత్యం. సొంతగడ్డపై బెంగళూరు భారీస్కోరు చేసినా ఛేదించి మరీ నెగ్గింది. పాయింట్ల పట్టికైనా... ఆటలోనైనా... డిఫెండింగ్ చాంపియన్కు లీగ్ దశలో అయితే ఎదురే లేకపోయింది. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ను పాండ్యా సేన సమర్థంగా సరైన దిశలో వినియోగించుకుంటుంది. శుబ్మన్ గిల్ లేదంటే విజయ్ శంకర్ల ‘ఇంపాక్ట్’ జట్టుకు అదనపు పరుగుల్ని కట్టబెడుతోంది. జట్టులో వీళ్లిద్దరే కాదు... సాహా నుంచి రషీద్ ఖాన్ దాకా ఇలా ఎనిమిదో వరుస బ్యాటర్ కూడా బాదేయగలడు. షనక, మిల్లర్, రాహుల్ తెవాటియాలు ధాటిగా ఆడగల సమర్థులు. దీంతో పరుగులకు, మెరుపులకు ఏ లోటు లేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, షమీ, రషీద్ ఖాన్ కలిసొచ్చే పిచ్పై మ్యాచ్నే మలుపుతిప్పే బౌలర్లు. ఏ రకంగా చూసుకున్నా ఎవరికీ ఎవరు తీసిపోరు కాబట్టి హేమాహేమీల మధ్య వార్ వన్సైడ్ అయితే కానే కాదు! తుది జట్లు (అంచనా) గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాహా, గిల్, విజయ్ శంకర్, షనక, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ/యశ్ దయాళ్. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రుతురాజ్, కాన్వే, దూబే/పతిరణ, జడేజా, రహానే, మొయిన్ , రాయుడు, దీపక్ చహర్, తుషార్, తీక్షణ. పిచ్, వాతావరణం ఎప్పట్లాగే చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండే అవకాశముంది. అయితే రాత్రయ్యేకొద్దీ తేమ కారణంగా బౌలర్లకు కష్టాలు తప్పవు. టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్కే మొగ్గు చూపువచ్చు. వర్ష సూచన లేదు. 3: ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరగ్గా... మూడింటిలోనూ గుజరాత్ జట్టే గెలిచింది. ఈ మూడు మ్యాచ్ల్లోనూ చెన్నై నిర్దేశించిన లక్ష్యాలను గుజరాత్ ఛేదించింది. అయితే చెన్నై వేదికగా మాత్రం ఈ రెండు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. 43: ఐపీఎల్ టోర్నీలో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం 61 మ్యాచ్లు ఆడింది. 43 మ్యాచ్ల్లో నెగ్గింది. 18 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 24: ఐపీఎల్ టోర్నీ ప్లే ఆఫ్స్ దశలో చెన్నై మొత్తం 24 మ్యాచ్లు ఆడింది. 15 మ్యాచ్ల్లో విజయం సాధించింది. (తొలుత బ్యాటింగ్ చేసినపుడు 7 సార్లు... ఛేజింగ్ లో 8 సార్లు). మిగతా 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. -
నీ వల్లే ద్రవిడ్కు ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది! ఆరోజు నేను సిక్స్ కొట్టడంతో..
Mumbai Indians vs Rajasthan Royals 2014: ‘‘అప్పుడు నేను ద్రవిడ్ రియాక్షన్ చూడలేదు. కానీ ఆయన చాలా సీరియస్ అయ్యారని చాలా మంది చెప్పారు. నీ వల్లే రాహుల్ ద్రవిడ్కు ఎన్నడూ లేనంత కోపం వచ్చింది. ఆయనను మేము ఎప్పుడూ అలా చూడలేదు’’ అంటూ ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ ఆదిత్య తారే 2014 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ముంబై తరఫున అరంగేట్రం మహారాష్ట్రకు చెందిన ఆదిత్య 2010లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్తో ఐపీఎల్లో అడుగుపెట్టిన అతడు.. అదే జట్టు మీద ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున 2017లో ఆఖరి మ్యాచ్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 35 మ్యాచ్లు ఆడిన ఆదిత్య 339 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. కీలక పోరులో ఇక ఆదిత్య తారే కెరీర్లో 2014 నాటి.. ముంబై ఇండియన్స్- రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ తప్పక గుర్తుండిపోతుంది. ఆ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో రాజస్తాన్, ముంబై మధ్య కీలక పోరు జరిగింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే, రన్రేటు దృష్ట్యా ఈ మ్యాచ్లో ముంబై సుమారు 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి. లేనిపక్షంలో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ చేరితే.. ముంబై ఇంటిబాట పట్టాల్సి వస్తుంది. ఆదిత్య తారే, ద్రవిడ్ రియాక్షన్ ఆండర్సన్, రాయుడు విజృంభించడంతో ఇలాంటి ఉత్కంఠభరిత స్థితిలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్(12), మైకేల్ హస్సీ(22) పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ కోరే ఆండర్సర్ తుపాన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షంతో 44 బంతుల్లోనే 95 పరుగులు చేసిన అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అంబటి రాయుడు(10 బంతుల్లో 30 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్తో అతడికి సహకరించాడు. ఇక 15వ ఓవర్ మూడో బంతికి.. క్రీజులో ఉన్న ఆదిత్య తారే బౌండరీ కొడితే ముంబై ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం. లేదంటే రాజస్తాన్ టాప్-4లో అడుగుపెడుతుంది. నరాలు తెగే ఉత్కంఠ నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఆ బంతికి ఆదిత్య ఏకంగా సిక్సర్ బాదడంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ చేరుకుంది. అప్పటిదాకా ప్లే ఆఫ్ బెర్తు తమదే అని సంతోష పడ్డ రాజస్తాన్కు నిరాశ తప్పలేదు. ఇక ఆదిత్య సిక్స్ కొట్టడంతో నాటి.. రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కోపంతో ఊగిపోయాడు. తమ జట్టు ఓడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించడంతో ఎన్నడూ లేని విధంగా సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో కొత్తగా కనిపించాడు. ఈ విషయం గురించి తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో ఆదిత్య తారే గుర్తు చేసుకున్నాడు. అదే ద్రవిడ్ కోపానికి కారణం ‘‘నేను ఆ బంతిని గాల్లోకి లేపే ముందు తామే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించామని రాజస్తాన్ ఫిక్సైపోయింది. డగౌట్లో ఉన్న వాళ్ల ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. అయితే, అప్పుడే మాకో విషయం తెలిసింది. మేము ప్లే ఆఫ్స్ చేరడానికి మాకు ఇంకో బంతి మిగిలే ఉంది. కాబట్టి బౌండరీ బాదాలని నిశ్చయించుకున్నాం. ముందేమో సిక్స్ కొట్టాలని భావించాం. తర్వాత తెలిసిందేంటే బౌండరీ బాదినా చాలని! అయితే, నేను అప్పటికే సిక్సర్ కొట్టాలని బలంగా నిశ్చయించుకున్నా. అదే అమలు చేశా. ఇదే ద్రవిడ్ కోపానికి కారణమైంది’’ అని 35 ఏళ్ల ఆదిత్య తారే చెప్పుకొచ్చాడు. కాగా 2014లో ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై కథ ముగియగా.. కేకేఆర్ విన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? గావస్కర్..సెహ్వాగ్ దగ్గరకు రాడు! వీరూనే వెళ్లాలి.. అర్థమైందా? వాళ్లిద్దరు అంతే! -
IPL 2023: రసెల్ ధమాకా...
కోల్కతా: ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అడుగంటిన కోల్కతా ఆశలకు సిక్సర్లతో జీవం పోశాడు. మళ్లీ ఆఖరి ఓవర్ డ్రామా కనిపించినా... నైట్రైడర్స్ 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ధావన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం కోల్కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి గెలిచింది. నితీశ్ రాణా (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. ధావన్ ఫిఫ్టీతో... కోల్కతా పవర్ప్లేలోనే ఓపెనర్ ప్రభ్సిమ్రన్ (12), రాజపక్స (0) వికెట్లను కోల్పోయింది. వీరిద్దరిని హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో మిగతా జట్టు సభ్యుల నుంచి సహకారం కరువైనా... శిఖర్ ధావన్ జట్టును నడిపించాడు. లివింగ్స్టోన్ (9 బంతుల్లో 15; 3 ఫోర్లు), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21; 2 సిక్సర్లు) తక్కువే చేసినా... ధావన్ (41 బంతుల్లో) ఫిఫ్టీతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. జితేశ్, ధావన్ నాలుగో వికెట్కు 53 పరుగులు జోడించారు. పరుగుల వేగం పెరగాల్సిన దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్కు పంజాబ్ డీలా పడింది. 106/3 స్కోరు వద్ద పటిష్టంగా కనిపించిన జట్టు స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయింది. స్యామ్ కరన్ (4), రిషి ధావన్ (11 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటిస్థితిలో షారుఖ్ (8 బంతుల్లో 21 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్), హర్ప్రీత్ బ్రార్ ( 9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటితో ఆఖరి 16 బంతుల్లో 40 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ ఇన్నింగ్స్... జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు) బౌండరీలతో కోల్కతా ఇన్నింగ్స్ వేగంగా సాగింది. అయితే గుర్బాజ్ (12 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) వికెట్ పారేసుకోగా... కోల్కతా ఇన్నింగ్స్ కూడా కెప్టెన్ నితీశ్ రాణా అర్ధసెంచరీతోనే నడించింది. రాయ్ దూకుడుకు హర్ప్రీత్ బ్రేకులేయగా, నితీశ్... వెంకటేశ్ (11)తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటింది. మధ్యలో పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగుల వేగం తగ్గింది. 16వ ఓవర్లో రాణా అవుటయ్యాక ఒత్తిడి పెరిగింది. 12 బంతుల్లో 26 పరుగుల సమీకరణం ఇరు జట్లకూ అవకాశమిచ్చింది. కానీ స్యామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రసెల్ 3 భారీ సిక్సర్లతో 20 పరుగులొచ్చాయి. దీంతో 6 బంతుల్లో 6 పరుగుల సమీకరణం కోల్కతావైపే మొగ్గింది. అయితే 2 పరుగుల దూరంలో ఐదో బంతికి రసెల్ రనౌట్ కావడంతో కాస్త ఉత్కంఠ రేకెత్తించినా... అర్‡్ష దీప్ వేసిన చివరి బంతిని రింకూ సింగ్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీకి తరలించి గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రాన్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 12; ధావన్ (సి) వైభవ్ (బి) నితీశ్ రాణా 57; రాజపక్స (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 0; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 15; జితేశ్ (సి) గుర్బాజ్ (బి) వరుణ్ 21; స్యామ్ కరన్ (సి) గుర్బాజ్ (బి) సుయశ్ 4; రిషి ధావన్ (బి) వరుణ్ 19; షారుఖ్ (నాటౌట్) 21; హర్ప్రీత్ బ్రార్ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–21, 2–29, 3–53, 4–106, 5–119, 6–139, 7–139. బౌలింగ్: వైభవ్ 3–0–32–0, హర్షిత్ 3–0–33–2, రసెల్ 1–0–19–0, వరుణ్ 4–0–26–3, సుయశ్ 4–0–26–1, నరైన్ 4–0–29–0, నితీశ్ రాణా 1–0–7–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) షారుఖ్ (బి) హర్ప్రీత్ 38; గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 15; నితీశ్ రాణా (సి) లివింగ్స్టోన్ (బి) చహర్ 51; వెంకటేశ్ (సి) లివింగ్స్టోన్ (బి) చహర్ 11; రసెల్ (రనౌట్) 42; రింకూ సింగ్ (నాటౌట్) 21; శార్దుల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–38, 2–64, 3–115, 4–124, 5–178. బౌలింగ్: రిషి ధావన్ 2–0–15–0, అర్‡్షదీప్ సింగ్ 4–0–39–0, ఎలిస్ 4–0–29–1, స్యామ్ కరన్ 3–0–44–0, లివింగ్స్టోన్ 2–0–27–0, హర్ప్రీత్ 1–0–4–1, రాహుల్ చహర్ 4–0–23–2. -
IPL 2023: తిరుగులేని టైటాన్స్
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో గురువారం వరకు జరిగిన 47 మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఏ జట్టూ కూడా 18 ఓవర్లలోపు ఆలౌట్ కాలేదు. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ పేలవ ఆటతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలింది. గుజరాత్ టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు సొంతగడ్డపై నిలవలేకపోయిన రాయల్స్ భారీ ఓటమిని ఎదుర్కొంది. 119 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఏకంగా 37 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన గుజరాత్... గత మ్యాచ్లో తమ వేదికపై రాజస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో లెక్క సరి చేసింది. జైపూర్: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకుంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. సంజూ సామ్సన్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (3/14) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం గుజరాత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు సాధించి గెలిచింది. వృద్ధిమాన్ సాహా (34 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) శుబ్మన్ గిల్ (35 బంతుల్లో 36; 6 ఫోర్లు) గెలిపించారు. సమష్టి వైఫల్యం... పాండ్యా తొలి ఓవర్లోనే బట్లర్ (8) వెనుదిరగ్గా... షమీ ఓవర్లో సిక్స్, ఫోర్తో జోరు ప్రదర్శించిన గత మ్యాచ్ హీరో యశస్వి జైస్వాల్ (14) దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో జట్టు పతనం మొదలైంది. సామ్సన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్ను అభినవ్ చక్కటి ఫీల్డింగ్తో ఆపగా, బంతిని అందుకున్న మోహిత్ నాన్స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. సింగిల్ కోసం ప్రయత్నించి జైస్వాల్ దూసుకురాగా, సామ్సన్ స్పందించలేదు. ఇద్దరూ ఒకేవైపు ఉండిపోగా, జైస్వాల్ వెనక్కి వెళ్లటంలో విఫలమయ్యాడు. టీమ్ను ఆదుకోవాల్సిన సామ్సన్ కూడా తర్వాతి ఓవర్లోనే అవుట్ కావడం రాయల్స్ను దెబ్బ తీసింది. ఆ తర్వాత ఏ ఒక్కరూ పట్టుదల ప్రదర్శించకపోవడంతో జట్టు కోలుకోలేకపోయింది. అలవోకగా... స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ అందుకుంది. ఓపెనర్లు సాహా, గిల్ చకచకా పరుగులు సాధించడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లతో 49 పరుగులకు చేరింది. తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు గిల్ను అవుట్ చేసి రాయల్స్ ఈ జోడీని విడదీసింది. జంపా ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 4, 6, 6 బాదడం ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (రనౌట్) 14; బట్లర్ (సి) మోహిత్ (బి) పాండ్యా 8; సామ్సన్ (సి) పాండ్యా (బి) లిటిల్ 30; పడిక్కల్ (బి) నూర్ 12; అశ్విన్ (బి) రషీద్ 2; పరాగ్ (ఎల్బీ) (బి) రషీద్ 4; హెట్మైర్ (ఎల్బీ) (బి) రషీద్ 7; జురేల్ (ఎల్బీ) (బి) నూర్ 9; బౌల్ట్ (బి) షమీ 15; జంపా (రనౌట్) 7; సందీప్ శర్మ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 118. వికెట్ల పతనం: 1–11, 2–47, 3–60, 4–63, 5–69, 6–77, 7–87, 8–96, 9–112, 10–118. బౌలింగ్: షమీ 4–0–27–1, పాండ్యా 2–0–22–1, రషీద్ 4–0–14–3, లిటిల్ 4–0–24–1, నూర్ 3–0–25–2, మోహిత్ 0.5–0–5–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (నాటౌట్) 41; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 36; పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119. వికెట్ల పతనం: 1–71. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–0, సందీప్ శర్మ 3–0–19–0, జంపా 3–0–40–0, చహల్ 3.5–0–22–1, అశ్విన్ 1–0–8–0. ఐపీఎల్లో నేడు చెన్నైX ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) ఢిల్లీ X బెంగళూరు (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2023: కోల్కతా ప్రతీకారం
సన్రైజర్స్ విజయానికి ఒకదశలో 30 బంతుల్లో 38 పరుగులే కావాలి... చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ మార్క్రమ్ కూడా అప్పుడే జోరు పెంచాడు... సొంత గడ్డపై గెలుపు ఖాయమనిపించింది. కానీ అంతా తలకిందులైంది. ఓటమి దిశగా వెళుతున్న కోల్కతా ఒక్కసారిగా పుంజుకుంది. పదునైన బౌలింగ్తో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి చివరి వరకు ఆటను తీసుకొచ్చింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి వేసిన ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా 3 పరుగులే వచ్చాయి. దాంతో నైట్రైడర్స్ ఊపిరి పీల్చుకోగా, రైజర్స్ నిరాశలో మునిగింది. సాక్షి, హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్లో ఎదురైన పరాజయానికి ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా 5 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేయగలిగింది. మార్క్రమ్ (40 బంతుల్లో 41; 4 ఫోర్లు), క్లాసెన్ (20 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించినా ఫలితం దక్కలేదు. కీలక భాగస్వామ్యం... ఒక్కరూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడకపోయినా... కీలక ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేయడంతో కోల్కతా చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. మార్కో జాన్సెన్ తన తొలి ఓవర్లోనే గుర్బాజ్ (0), వెంకటేశ్ అయ్యర్ (7)లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. జేసన్ రాయ్ (19 బంతుల్లో 20; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. ఈ దశలో కెప్టెన్ రాణా, రింకూ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 40 బంతుల్లో 61 పరుగులు జోడించారు. కార్తీక్ త్యాగి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6తో రాణా దూకుడు ప్రదర్శించాడు. అయితే మార్క్రమ్ అద్భుత క్యాచ్కు రాణా వెనుదిరగ్గా... ఆండ్రీ రసెల్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్లు) కూడా ఎక్కువసేపు నిలవలేదు. సన్రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఇన్నింగ్స్ చివర్లో కూడా కేకేఆర్ ఆశించినన్ని పరుగులు చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు 42 పరుగులే సాధించింది. క్లాసెన్ మెరిసినా... ఛేదనలో రైజర్స్ కూడా తడబడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (18), అభిషేక్ శర్మ (9)లతో పాటు తక్కువ వ్యవధిలో రాహుల్ త్రిపాఠి (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (0) వికెట్లను జట్టు కోల్పోయింది. అయితే మార్క్రమ్, క్లాసెన్ భాగస్వామ్యం ఇన్నింగ్స్ను నిలబెట్టింది. చక్కటి షాట్లతో, సమన్వయంతో వీరిద్దరు పరుగులు రాబట్టారు. తన తొలి ఫోర్ కొట్టేందుకు మార్క్రమ్ 23 బంతులు తీసుకున్నా... అనుకూల్ రాయ్ ఓవర్లో రెండు సిక్సర్లతో క్లాసెన్ దూకుడు ప్రదర్శించాడు. ఐదో వికెట్కు 47 బంతుల్లో 70 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్ వెనుదిరిగాడు. అయితే మార్క్రమ్ క్రీజ్లో ఉన్నంత వరకు రైజర్స్ గెలుపుపై ధీమాగానే ఉంది. 20 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన స్థితిలో కెప్టెన్ వెనుదిరిగారు. తర్వాతి బ్యాటర్లు మిగిలిన పనిని పూర్తి చేయలేకపోయారు. సమద్ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొంత పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) కార్తీక్ త్యాగి 20; గుర్బాజ్ (సి) బ్రూక్ (బి) జాన్సెన్ 0; వెంకటేశ్ అయ్యర్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 7; నితీశ్ రాణా (సి అండ్ బి) మార్క్రమ్ 42; రింకూ సింగ్ (సి) సమద్ (బి) నటరాజన్ 46; రసెల్ (సి) నటరాజన్ (బి) మార్కండే 24; నరైన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) భువనేశ్వర్ 1; శార్దుల్ ఠాకూర్ (సి) సమద్ (బి) నటరాజన్ 8; అనుకూల్ రాయ్ (నాటౌట్) 13; హర్షిత్ (రనౌట్) 0; వైభవ్ అరోరా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–8, 2–16, 3–35, 4–96, 5–127, 6–130, 7–151, 8–168, 9–168. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–0–24–2, కార్తీక్ త్యాగి 2–0–30–1, మార్క్రమ్ 3–0–24–1, నటరాజన్ 4–0–30–2, మార్కండే 4–0–29–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 9; మయాంక్ అగర్వాల్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 18; రాహుల్ త్రిపాఠి (సి) వైభవ్ అరోరా (బి) రసెల్ 20; మార్క్రమ్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ అరోరా 41; హ్యారీ బ్రూక్ (ఎల్బీ) (బి) అనుకూల్ రాయ్ 0; క్లాసెన్ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 36; సమద్ (సి) అనుకూల్ రాయ్ (బి) వరుణ్ చక్రవర్తి 21; జాన్సెన్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 1; భువనేశ్వర్ (నాటౌట్) 5; మార్కండే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–29, 2–37, 3–53, 4–54, 5–124, 6–145, 7–152, 8–165. బౌలింగ్: హర్షిత్ 4–0–27–1, వైభవ్ 3–0–32–2, శార్దుల్ 3–0– 23–2, రసెల్ 1–0–15–1, అనుకూల్ రాయ్ 3–0–26–1, నరైన్ 2–0–16–0, వరుణ్ చక్రవర్తి 4–0–20–1. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే హెడ్సెట్..
ఐపీఎల్ వీక్షకుల కోసం జియో సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. నేరుగా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించే జియో డైవ్ (JioDive) అనే కొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్సెట్ను లాంచ్ చేసింది. ఇదీ చదవండి: WEF Report: 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్ జియో సినిమా (JioCinema) యాప్లో ఐపీల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీఆర్ హెడ్సెట్ని ఉపయోగించవచ్చు. ఇందులో 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ ఉన్నాయి. దీంతో నేరుగా స్టేడియంలోనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ హెడ్సెట్ను జియో సినిమా యూజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ఈ జియోడైవ్ హెడ్సెట్ ధర రూ. 1,299. జియో మార్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్బ్యాక్ లభిస్తుంది. అయితే హైజనిక్ కారణాల వల్ల ఈ ఒక సారి కొనుగోలు చేసిన ఈ వీఆర్ హెడ్సెట్ను రిటర్న్ చేసే వీలు లేదని కంపెనీ పేర్కొంది. జియోడైవ్ వీఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీల వీక్షణ 4.7 నుంచి 6.7 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్, iOS ఫోన్లకు సపోర్ట్ లెన్స్ ఫోకస్, ఫైన్ ట్యూన్ అడ్జెస్ట్మెంట్ కోసం ఏర్పాటు. హెడ్సెట్ను సౌకర్యవంతంగా పెట్టుకునేందుకు 3వే అడ్జస్టబుల్ స్ట్రాప్ Android 9+, iOS 15+కి సపోర్ట్ ఉపయోగించడం ఎలా? బాక్స్పై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి జియో ఇమ్మెర్స్ (JioImmerse) యాప్ను ఇన్స్టాల్ చేయండి సూచనలకు అనుగుణంగటా అన్ని అనుమతులను ఇచ్చి లాగిన్ చేయండి. ఇందుకోసం జియో నెట్వర్క్కి కనెక్ట్ అయిఉండాలి. జియోడైవ్ (JioDive) ఆప్షన్ను ఎంచుకుని ‘Watch on JioDive’పై క్లిక్ చేయండి హెడ్సెట్లో ఫ్రంట్ కవర్ని తీసి ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్ల మధ్య ఫోన్ను పెట్టిన తర్వాత ఫ్రంట్ కవర్ను మూసివేయండి హెడ్సెట్ను పెట్టకుని స్ట్రాప్స్ను సరిచేసుకోండి ఉత్తమ వీక్షణ అనుభవం, పిక్చర్ క్వాలిటీని అడ్జస్ట్మెంట్ వీల్స్ను సరిచేయండి ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. Bringing you a stadium-like experience at home with #JioDive. - Watch cricket in 360 immersive view - Enjoy #TATAIPLonJioCinema on a 100-inch virtual screen - Experience #360cricket from multiple camera angles Buy now https://t.co/1azFVIwqfR#EnterANewReality #IPL2023 pic.twitter.com/PxplF0SAz9 — JioDive (@jiodiveofficial) April 30, 2023 -
సన్రైజర్స్కు ఢిల్లీ షాక్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ను గెలిపించేందుకు హైదరాబాద్ బౌలర్లు శ్రమిస్తే... బ్యాటర్ల అలసత్వం జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. ఓటమి తప్పదనుకున్న పోరులో ఢిల్లీ పోరాటం జట్టును 7 పరుగులతో గెలిపించింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే (27 బంతుల్లో 34; 2 ఫోర్లు), అక్షర్ పటేల్ (34 బంతుల్లో 34; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారంతే! వాషింగ్టన్ సుందర్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. మయాంక్ (39 బంతుల్లో 49; 7 ఫోర్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్, నోర్జే రెండేసి వికెట్లు తీశారు. ఐపీఎల్లో ఢిల్లీ చేతిలో హైదరాబాద్కిది వరుసగా ఐదో ఓటమి. ఆదుకున్న ఆ ఇద్దరు... ముందుగా హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిల్లాడారు. జట్టును నడిపించే స్కోరుగానీ, ప్రేక్షకుల్ని అలరించే ఆటగానీ ఇన్నింగ్స్లో కరువైంది. సాల్ట్ (0) డకౌట్ కాగా, చకచకా 5 బౌండరీలు బాదిన మార్‡్ష (15 బంతుల్లో 25; 5 ఫోర్లు) ఆట ఐదో ఓవర్లోనే ముగిసింది. 8వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఉచ్చులో అనుభవజ్ఞుడైన వార్నర్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ (10), అమన్ హకీమ్ (4) చిక్కారు. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో మనీశ్ పాండే, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. ఆరో వికెట్కు 69 పరుగులు జోడించారు. బ్యాటర్ల నిర్లక్ష్యం... తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆపసోపాలు పడింది. బ్రూక్ (7), తర్వాత త్రిపాఠి (21 బంతుల్లో 15)తో కలిసి వేగంగా ఆడిన మయాంక్ 12వ ఓవర్లో పెవిలియన్ చేరడంతో సీన్ మారిపోయింది. స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పటేల్ పిచ్ అనుకూలతలతో బంతుల్ని సుడులు తిప్పారు. అభిషేక్ శర్మ (5) మార్క్రమ్ (3) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో 85 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయింది. చివర్లో క్లాసెన్ (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), సుందర్ (15 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు)ల బౌండరీలతో సన్రైజర్స్ ఇన్నింగ్స్ గాడిన పడింది. కానీ క్లాసెన్ వేగానికి నోర్జే బౌలింగ్లో చుక్కెదురవడంతో ఓటమి తప్పలేదు. హైదరాబాద్ విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా ‘ఇంపాక్ట్’ బౌలర్ ముకేశ్ కేవలం 5 పరుగులే ఇచ్చాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) బ్రూక్ (బి) సుందర్ 21; సాల్ట్ (సి) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 0; మార్‡్ష (ఎల్బీడబ్ల్యూ) (బి) నటరాజన్ 25; సర్ఫరాజ్ (సి) భువనేశ్వర్ (బి) సుందర్ 10; మనీశ్ పాండే (రనౌట్) 34; అమన్ (సి) అభిషేక్ (బి) సుందర్ 4; అక్షర్ (బి) భువనేశ్వర్ 34; రిపాల్ (రనౌట్) 5; నోర్జే (రనౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 4; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–1, 2–39, 3–57, 4–58, 5–62, 6–131, 7– 134, 8–139, 9–139. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–11–2, జాన్సెన్ 2–0–27–0, సుందర్ 4–0–28–3, నటరాజన్ 3–0–21–1, మార్కండే 4–0–34–0, ఉమ్రాన్ 2–0–14–0, మార్క్రమ్ 1–0–7–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (బి) నోర్జే 7; మయాంక్ (సి) అమన్ (బి) అక్షర్ 49; రాహుల్ త్రిపాఠి (సి) సాల్ట్ (బి) ఇషాంత్ 15; అభిషేక్ (సి అండ్ బి) కుల్దీప్ 5; మార్క్రమ్ (బి) అక్షర్ 3; క్లాసెన్ (సి) అమన్ (బి) నోర్జే 31; సుందర్ (నాటౌట్) 24; జాన్సెన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–31, 2–69, 3–75, 4–79, 5–85, 6–126. బౌలింగ్: ఇషాంత్ 3–0–18–1, నోర్జే 4–0–33–2, ముకేశ్ 3–0–27–0, అక్షర్ 4–0– 21–2, కుల్దీప్ 4–0–22–1, మార్‡్ష 2–0–16–0. -
IPL: ఆర్సీబీతో ప్రయాణం అద్భుతం అంటూనే కోహ్లి షాకింగ్ కామెంట్స్
Virat Kohli- RCB: టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విడదీయరాని అనుబంధం ఉంది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి.. కీలక ప్లేయర్గా.. అటుపై కెప్టెన్గా ఎదిగి.. ఆర్సీబీ అంటే కోహ్లి... కోహ్లి అంటే ఆర్సీబీ అన్నంతగా ముడిపడిపోయాడు. అలాంటి కోహ్లి పేరు లేని ఆర్సీబీని ఊహించడం కష్టం. 2013- 2021 వరకు ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించనప్పటికీ .. జట్టు అభిమానులను అలరించడంలో మాత్రం విఫలం కాలేదు. తనదైన శైలిలో దూకుడైన ఆటతో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్.. రోజురోజుకీ ఆర్సీబీ ఫ్యాన్ బేస్ పెంచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఆర్సీబీతో ప్రయాణం అద్భుతం ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తాజా వెల్లడించిన ఓ విషయం నెట్టింట వైరల్గా మారింది. ఆర్సీబీతో అనుబంధాన్ని చెబుతూనే.. ఆరంభంలో తాను వేరే ఫ్రాంఛైజీకి మారాలనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు.. జియో సినిమా షోలో రాబిన్ ఊతప్పకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీతో నా ప్రయాణం అద్భుతం. ఫ్రాంఛైజీ అంటే నాకు అమితమైన గౌరవం. ఎందుకంటే జట్టులో చేరిన తొలి మూడేళ్లలో వాళ్లు నన్ను చాలా బాగా సపోర్టు చేశారు. రిటెన్షన్ జరిగిన ప్రతిసారీ.. ‘‘మేము నిన్ను రిటైన్ చేసుకోబోతున్నాం’’ అని చెప్పేవారు. అప్పుడు.. నేను వాళ్లకు చెప్పిన మాట ఒకటే.. ‘‘టాపార్డర్లో ఆడాలనుకుంటున్నా. టీమిండియాకు ఆడేపుడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తా.. ఇక్కడ కూడా అదే చేయాలనుకుంటున్నా’’ అని విజ్ఞప్తి చేశా. అందుకు వాళ్లు సరేనన్నారు. నాపై నమ్మకం ఉంచారు. నాకు కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చారు. అలా ఆర్సీబీతో పాటే నా అంతర్జాతీయ కెరీర్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. నాకు వాళ్లు ఎంతో విలువ ఇస్తారు. నా మాట పట్టించుకోలేదు పేరైతే చెప్పను గానీ.. ఓ ఫ్రాంఛైజీతో అప్పట్లో నేను సంప్రదింపులు జరిపాను. కానీ వాళ్లు కనీసం నేను చెబుతున్నానో కూడా పట్టించుకునే స్థితిలో లేరు. అప్పట్లో నేను 5-6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు వాళ్లతో మాట్లాడాను. ‘‘ఒకవేళ నేను మీ జట్టులోకి వస్తే టాపార్డర్లో ఆడిస్తారా లేదంటే వేరే ప్లేస్లోనా’’.. అని అడిగాను. వాళ్లు పట్టించుకోనేలేదు. అయితే, 2011లో నేను టీమిండియా తరఫున అద్భుతంగా ఆడుతున్న తరుణంలో అదే ఫ్రాంఛైజీ వాళ్లు నా దగ్గరికి వచ్చారు. ‘ప్లీజ్.. వేలంలోకి రాగలరా?’’ అని నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను కచ్చితంగా నో అని చెప్పేశాను. నాకు ఎల్లవేళలా అండగా నిలిచిన ఆర్సీబీతోనే ఉంటానని చెప్పాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లిని వద్దన్న ఫ్రాంఛైజీ ఉందా? ఇందుకు స్పందించిన ఊతప్ప.. కోహ్లి వస్తానంటే పట్టించుకోని ఫ్రాంఛైజీ కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బదులుగా.. ‘‘అవును.. నిజం. వాళ్లు అప్పట్లో నా అభ్యర్థనను నిర్మొహమాటంగా కాదన్నారు. అదే మంచిదైంది’’ అని కోహ్లి.. ఊతప్పతో వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2023లో ఆర్బీసీ స్టార్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో 220 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్. చదవండి: ఎట్టకేలకు టెండుల్కర్ అంటూ సచిన్ ఉద్వేగ ట్వీట్! నీ మనసు బంగారం షారుఖ్! SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL2023: రైజర్స్ జోరుకు బ్రేక్....
వరుసగా రెండు విజయాలతో జోరు పెంచిన సన్రైజర్స్ హైదరాబాద్కు సొంతగడ్డపై అడ్డుకట్ట పడింది. కొంత పోరాటపటిమ కనబర్చినా చివరకు విజయం మాత్రం దక్కలేదు. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ ‘హ్యాట్రిక్’ గెలుపుతో సత్తా చాటింది. కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ విజయంలో కీలకపాత్ర పోషించగా... ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో రైజర్స్ ఉప్పల్లో చతికిలపడింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్రైజర్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కామెరాన్ గ్రీన్ (40 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్ వర్మ (17 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (41 బంతుల్లో 48; 4 ఫోర్లు,1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (16 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. సూర్యకుమార్ విఫలం... కెప్టెన్ రోహిత్ శర్మ (18 బంతుల్లో 28; 6 ఫోర్లు) ముంబై ఇన్నింగ్స్ను ధాటిగా మొదలు పెట్టాడు. సుందర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను ఈ క్రమంలో ఐపీఎల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. నటరాజన్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్, అదే ఓవర్లో వెనుదిరిగాడు. పవర్ప్లేలో ముంబై 53 పరుగులు చేసింది. అనంతరం రైజర్స్ బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో ముంబై స్కోరు వేగం మందగించింది. జాన్సెన్ ఒకే ఓవర్లో కిషన్, సూర్యకుమార్ (7)లను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. ఈ రెండు క్యాచ్లను మార్క్రమ్ అద్భుతంగా అందుకున్నాడు. 14 ఓవర్లలో ముంబై 109 పరుగులు చేసింది. అయితే చివరి 6 ఓవర్లలో చెలరేగిన ఆ జట్టు 83 పరుగులు రాబట్టింది. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో వరుస బంతుల్లో గ్రీన్ 4, 4, 4, 6 తో చెలరేగడం విశేషం. ఈ క్రమంలో 33 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. భువీ తన చివరి 2 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చినా, ఇతర బౌలర్లు విఫలమయ్యారు. తిలక్ జోరు... సొంతగడ్డపై ప్రత్యర్థి జట్టు హైదరాబాద్పై తిలక్ వర్మ సత్తా చాటాడు. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్లో ఉన్న 24 నిమిషాల్లో ఫటాఫట్ బ్యాటింగ్ ప్రదర్శించాడు. జాన్సెన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టిన అతను... మర్కండే, భువీ బౌలింగ్లో ఒక్కో సిక్సర్ బాదాడు. భువీ బౌలింగ్లో మరో షాట్కు ప్రయత్నించి కవర్స్లో చిక్కడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. సమష్టి వైఫల్యం... ఛేదనలో రైజర్స్కు సరైన ఆరంభం లభించలేదు. గత మ్యాచ్ హీరో బ్రూక్ (9), రాహుల్ త్రిపాఠి (7)లను బెహ్రన్డార్ఫ్ తన వరుస ఓవర్లో అవుట్ చేశాడు. మరో ఎండ్లో మయాంక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించాడు. 6 ఓవర్లలో జట్టు స్కోరు 2 వికెట్లకు 42. మార్క్రమ్ (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, అభిషేక్ (1) కూడా వెంటనే అవుటయ్యాడు. రైజర్స్ గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్న దశలో చావ్లా వేసిన 14వ ఓవర్ ఆశలు రేపింది. ఈ ఓవర్లో క్లాసెన్ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. అయితే చివరి బంతికి అతను అవుట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. తర్వాతి ఓవర్లో మయాంక్ వెనుదిరిగాక జట్టు ఓటమి లాంఛనమే అయింది. అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐపీఎల్ వికెట్తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగించగానే ముంబై సంబరాల్లో మునిగిపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 28; ఇషాన్ కిషన్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 38; గ్రీన్ (నాటౌట్) 64; సూర్యకుమార్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 7; తిలక్ (సి) మయాంక్ (బి) భువనేశ్వర్ 37; డేవిడ్ (రనౌట్) 16; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–41, 2–87, 3–95, 4–151, 5–192. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–31–1, జాన్సెన్ 4–0–43–2, సుందర్ 4–0–33–0, నటరాజన్ 4–0–50–1, మర్కండే 4–0–35–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (సి) సూర్యకుమార్ (బి) బెహ్రన్డార్ఫ్ 9; మయాంక్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 48; త్రిపాఠి (సి) ఇషాన్ కిషన్ (బి) బెహ్రన్డార్ఫ్ 7; మార్క్రమ్ (సి) షోకీన్ (బి) గ్రీన్ 22; అభిషేక్ (సి) డేవిడ్ (బి) చావ్లా 1; క్లాసెన్ (సి) డేవిడ్ (బి) చావ్లా 36; సమద్ (రనౌట్) 9; జాన్సెన్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 13; సుందర్ (రనౌట్) 10; భువనేశ్వర్ (సి) రోహిత్ (బి) అర్జున్ 2; మర్కండే (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 19; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 178. వికెట్ల పతనం: 1–11, 2–25, 3–71, 4–72, 5–127, 6–132, 7–149, 8–165, 9–174, 10–178. బౌలింగ్: అర్జున్ టెండూల్కర్ 2.5–0–18–1, బెహ్రన్డార్ఫ్ 4–0–37–2, మెరిడిత్ 4–0–33–2, షోకీన్ 1–0–12–0, చావ్లా 4–0–43–2, గ్రీన్ 4–0–29–1. -
బెంగళూరు చిన్నబోయింది! పరుగుల వరద పారిన పోరులో ఓడిన ఆర్సీబీ
బెంగళూరు: పరుగుల వరద పారిన పోరు... ఏకంగా 33 సిక్సర్లు నమోదు... చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) భారీ స్కోరు సాధిస్తే మేమేం తక్కువ అన్నట్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా విరుచుకుపడింది. అయితే తుది ఫలితంలో మాత్రం సూపర్ కింగ్స్దే పైచేయి అయింది. ఒకదశలో గెలుపు ఖాయమనిపించిన ఆర్సీబీ ఓటమి బాట పట్టడంతో చిన్నస్వామి మైదానంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై 8 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించగా, అజింక్య రహానే (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్స్లు), డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మూడో వికెట్కు 61 బంతుల్లోనే 126 పరుగులు జోడించారు. సమష్టి ప్రదర్శన... సిరాజ్ తొలి ఓవర్లోనే రుతురాజ్ (3) అవుట్ కావడంతో చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. అయితే రహానే, కాన్వే భాగస్వామ్యంలో స్కోరు జోరందుకుంది. వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో పవర్ప్లేలో స్కోరు 4 ఫోర్లు, 3 సిక్స్లతో 53 పరుగులకు చేరింది. హసరంగ తన తొలి ఓవర్లో చక్కటి బంతితో రహానేను బౌల్డ్ చేయడంతో 74 పరుగుల (43 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ తర్వాత కాన్వే, దూబే మరింత ధాటిగా పరుగులు సాధించారు. వైశాక్ ఓవర్లో కాన్వే 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, సిరాజ్ ఓవర్లో దూబే ఫోర్, సిక్స్ బాదాడు. వైశాక్ తర్వాతి ఓవర్లో వీరిద్దరు 19 పరుగులు రాబట్టారు. కాన్వే 32 బంతుల్లో, దూబే 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్కు 80 పరుగులు (37 బంతుల్లో) జోడించిన వీరిద్దరు ఎనిమిది బంతుల వ్యవధిలో వెనుదిరిగినా... చివర్లో అంబటి రాయుడు (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్), మొయిన్ అలీ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 సిక్స్లు) వేగంగా ఆడి కీలక పరుగులు జోడించారు. దాంతో ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు 25వసారి 200 అంతకంటే ఎక్కువ స్కోరు చేసింది. శతక భాగస్వామ్యం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి షాక్ తగిలింది. ఆకాశ్ సింగ్ తొలి ఓవర్లోనే కోహ్లి (6) షాట్ను వికెట్లపైకి ఆడుకోగా, ఆ వెంటనే లోమ్రోర్ (0) వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్, మ్యాక్స్వెల్ అద్భుత భాగస్వామ్యం జట్టును నడిపించింది. వీరిద్దరు చెన్నై బౌలర్లందరిపై విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించారు. ‘సున్నా’ వద్ద డుప్లెసిస్ క్యాచ్ను ధోని వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆకాశ్ ఓవర్లో మ్యాక్స్వెల్ 2 సిక్స్లు బాదగా, అతని తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. తుషార్ ఓవర్లో డుప్లెసిస్ వరుస బంతుల్లో 4, 4, 6... తీక్షణ ఓవర్లో మ్యాక్సీ 2 సిక్స్లు కొట్టడంతో ఆరు ఓవర్లలోనే స్కోరు 75 పరుగులకు చేరింది. ఈ క్రమంలో డుప్లెసిస్ 23 బంతుల్లో, మ్యాక్స్వెల్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నారు. 12వ ఓవర్ వరకు వీరి ధాటి కొనసాగింది. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరిని అవుట్ చేయడంతో చెన్నైకి మళ్లీ పట్టు చిక్కింది. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్తో ఉత్కంఠ క్షణాలను దాటి మ్యాచ్ను కాపాడుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 3; కాన్వే (బి) హర్షల్ 83; రహానే (బి) హసరంగ 37; దూబే (సి) సిరాజ్ (బి) పార్నెల్ 52; రాయుడు (సి) కార్తీక్ (బి) వైశాక్ 14; అలీ (నాటౌట్) 19; జడేజా (సి) (సబ్) ప్రభుదేశాయ్ (బి) మ్యాక్స్వెల్ 10; ధోని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–16, 2–90, 3–170, 4–178, 5–198, 6–224. బౌలింగ్: సిరాజ్ 4–0–30–1, పార్నెల్ 4–0–48–1, వైశాక్ 4–0–62–1, మ్యాక్స్వెల్ 2.4–0–28–1, హసరంగ 2–0–21–1, హర్షల్ పటేల్ 3.2–0–36–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) ఆకాశ్ 6; డుప్లెసిస్ (సి) ధోని (బి) అలీ 62; లోమ్రోర్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 0; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) తీక్షణ 76; షహబాజ్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 12; కార్తీక్ (సి) తీక్షణ (బి) తుషార్ 28; ప్రభుదేశాయ్ (సి) జడేజా (బి) పతిరణ 19; పార్నెల్ (సి) దూబే (బి) తుషార్ 2; హసరంగ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–6, 2–15, 3–141, 4–159, 5–191, 6–192, 7–197, 8–218. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3–0–35–1, తుషార్ దేశ్పాండే 4–0–45–3, తీక్షణ 4–0–41–1, జడేజా 4–0–37–0, పతిరణ 4–0–42–2, మొయిన్ అలీ 1–0–13–1. -
IPL: ఐపీఎల్ కాదు.. అంతకు మించి! వారికి మాత్రం నో చెప్పలేమన్న బీసీసీఐ!
ప్రపంచంలోని టీ20 లీగ్లన్నింటిలో ఐపీఎల్ది ప్రత్యేక స్థానం. క్యాష్ రిచ్ లీగ్గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ఇతర లీగ్లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి. ఆటగాళ్లపై కనక వర్షం కురిపిస్తూ.. అభిమానులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ గత పదిహేనేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందీ ఐపీఎల్. ఎక్కడా లేని క్రేజ్ పదహారవ ఎడిషన్లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి జట్ల ఆటగాళ్ల స్టార్డమ్ పెంచడం సహా.. అసోసియేట్ దేశాల క్రికెటర్లకు కూడా కావాల్సినంత గుర్తింపు దక్కేలా చేస్తోంది. క్రికెట్ను కేవలం ఆటలా కాకుండా మతంలా భావించే కోట్లాది మంది అభిమానులున్న భారత్లో ఐపీఎల్కు దక్కుతున్న ఆదరణ మరే ఇతర దేశాల లీగ్లకు కూడా లేదు. అలాంటిది సౌదీ అరేబియా.. ఐపీఎల్ను మించేలా ధనిక లీగ్ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తామంటూ చేసిన ప్రకటన చేసిందన్న వార్త క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. సౌదీ సంచలనం? ఫార్ములా వన్ రేసులతో పాటు క్రిస్టియానో రొనాల్డో వంటి పాపులర్ స్టార్లను తమ ఫుట్బాల్ లీగ్లలో ఆడిస్తూ వార్తల్లో నిలుస్తున్న సౌదీ.. క్రికెట్పై కూడా దృష్టి సారించినట్లు ఆ వార్తా కథనాల సారాంశం. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూని మించిన లీగ్తో సంచలనం సృష్టించాలని సౌదీ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అవును.. వాళ్లకు ఆసక్తి ఉందన్న ఐసీసీ ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గ్రెగ్ బార్క్లే.. ‘‘అవును.. సౌదీ క్రికెట్పై ఆసక్తి కనబరుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. క్రికెట్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆసక్తిగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలను సంప్రదించి.. తమతో కలిసి టీ20 లీగ్లో భాగం కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలితో కూడా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు కథనాలు వచ్చాయి. వారికి మాత్రం నో చెప్పలేము ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం భారత క్రికెటర్లెవరూ ఇతర దేశాల లీగ్లలో ఆడటం లేదు. అయితే, ఫ్రాంఛైజీలు సదరు లీగ్లో పాల్గొనాలా లేదా అన్నది ఓనర్ల ఇష్టం. ఫ్రాంఛైజీ ఓనర్లను అయితే మేము ఆపలేం కదా! అది వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా, దుబాయ్ లీగ్లలో భాగమయ్యాయి. వారికి మేము నో చెప్పలేదు. ప్రపంచంలోని ఏ లీగ్లోనైనా పాల్గొనే స్వేచ్ఛ వారికి ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా భారత క్రికెటర్లను విదేశీ టీ20 లీగ్లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించడం లేదన్న విషయం తెలిసిందే. అంతసీన్ లేదు! ఒకవేళ ఆటగాళ్లెవరైనా పాల్గొనాలని భావిస్తే మాత్రం బోర్డుతో సంబంధాలన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఫ్రాంఛైజీలు మాత్రం సౌతాఫ్రికా, దుబాయ్ లీగ్లలో పెట్టుబడులు పెట్టినప్పటికీ ఐపీఎల్కు క్రేజ్ ముందు ఈ లీగ్లు పూర్తిగా తేలిపోతున్నాయి. నిజానికి టీమిండియా క్రికెటర్లు లేకుండా సౌదీ టీ20 లీగ్ ప్రవేశపెట్టినా ఆదరణ విషయంలో ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం ఉండదు. చదవండి: ఇదేమైనా టీమిండియానా? గెలిస్తే క్రెడిట్ తీసుకుని.. ఓడితే వేరే వాళ్లను నిందిస్తూ.. గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ.. -
IPL: క్యాష్ రిచ్ లీగ్.. చీర్లీడర్స్ ఆదాయమెంతో తెలుసా? ఒక్కో మ్యాచ్కు..
క్యాష్ రిచ్ లీగ్.. ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.. వేలం సందర్భంగా ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెడుతున్న ప్రతిభావంతులు మొదలు.. స్టార్ ప్లేయర్లపై వేలంలో కనక వర్షం కురవడం షరా మామూలే! ఇక పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మ్యాగ్జిమమ్ సిక్స్లు.. అద్భుత రీతిలో వికెట్లు పడ్డప్పుడు.. ఊహించని క్యాచ్లు అందుకున్నపుడు.. ఇలా ప్రతీ కీలక మూమెంట్లో ఆయా జట్లను ఉత్సాహపరుస్తూ చీర్లీడర్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు! తమదైన శైలిలో హుషారైన స్టెప్పులతో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకూ కనువిందు చేస్తూ ఉంటారు చీర్లీడర్స్. మరి ఒక్కో మ్యాచ్కు వారు అందుకునే మొత్తం, చీర్లీడర్స్కు అధిక మొత్తం చెల్లిస్తున్న ఫ్రాంఛైజీ ఏదో తదితర వివరాలు పరిశీలిద్దాం. ఒక్కో మ్యాచ్కు కనీసం ఎంతంటే డీఎన్ఏ రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్ చీర్లీడర్స్కు ఒక్కో మ్యాచ్కు సగటున 12,000 రూపాయల నుంచి 17 వేల వరకు ఫ్రాంఛైజీలు చెల్లిస్తాయట. ఇక క్రిక్ఫాక్ట్స్ నివేదిక ప్రకారం.. కోల్కతా నైట్రైడర్స్ తమ చీర్లీడర్స్కు అత్యధిక మొత్తం చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. అత్యధికంగా ఒక్కో మ్యాచ్కు రూ. 24 వేలు పారితోషకంగా కేకేఆర్ అందిస్తోందట. అత్యధికంగా చెల్లించే ఫ్రాంఛైజీ ఏదంటే ఇక చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ చీర్లీడర్స్కు మ్యాచ్కు 12 వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. కాగా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్కు పనిచేస్తున్న చీర్లీడర్స్కు ఒక్కో మ్యాచ్కు 20 వేల రూపాయల చొప్పున ముట్టజెప్తున్నారట. అదే విధంగా రాయల చాలెంజర్స్ బెంగళూరు సైతం ముంబై మాదిరే 20 వేలు చెల్లిస్తోందట. ఇలా చీర్లీడర్స్ ఒక్కో మ్యాచ్కు ఈ మేరకు నగదు అందుకోవడమే కాకుండా.. విలాసవంతమైన హోటళ్లలో బస, రుచికరమైన భోజనంతో ఇతర సదుపాయాలు కూడా పొందుతున్నారు. అంత తేలికేం కాదు ఏంటీ.. ఇదంతా వింటుంటే చీర్లీడర్స్ పనే బాగున్నట్లుంది అనుకుంటున్నారా? నిజానికి చీర్లీడర్గా ఎంపిక కావడం అంత తేలికేం కాదు. స్వతహాగా మంచి డాన్సర్లు అయిన వాళ్లు, మోడలింగ్ రంగంలో ఉన్నవాళ్లను.. అనేక ఇంటర్వ్యూల అనంతరం ఆయా ఫ్రాంఛైజీలు సెలక్ట్ చేస్తాయి. అంతేకాదు వేలాది ప్రేక్షకుల నడుమ రాత్రిపగలు మ్యాచ్లనే తేడా లేకుండా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది మరి! ప్రస్తుతం చీర్లీడర్స్గా ఎక్కువ మంది విదేశీయులే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో రెండేసి విజయాలతో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది' -
IPL 2023: చెన్నై చెలరేగగా...
సూపర్ కింగ్స్ సొంత మైదానంలో సత్తా చాటింది...ముందుగా బ్యాటింగ్లో చెలరేగి భారీ స్కోరు నమోదు చేసిన ధోని టీమ్, ఆపై ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమైంది. రుతురాజ్, కాన్వేలు చెన్నైకి భారీ స్కోరును అందిస్తే, బౌలింగ్లో మొయిన్ అలీ ఆఫ్ స్పిన్ జట్టును గెలుపు దిశగా నడిపించింది. మరో వైపు తమ తొలి మ్యాచ్ను గెలుపు జోరు మీదున్న లక్నో ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్ మేయర్స్ ఆట మినహా మిగతా రంగాల్లో విఫలం కావడంతో రాహుల్ బృందానికి ఓటమి తప్పలేదు. చెన్నై: నాలుగేళ్ల తర్వాత ప్రత్యక్షంగా మ్యాచ్ను చూసేందుకు వచ్చిన అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ అమితానందాన్ని పంచింది. గత ఓటమిని మరిచేలా చేస్తూ లీగ్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన పోరులో చెన్నై 12 పరుగుల తేడాతో లక్నోను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (31 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్లు) వరుసగా రెండో మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించగా, డెవాన్ కాన్వే (29 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. రవి బిష్ణోయ్, మార్క్వుడ్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (22 బంతుల్లో 53; 8 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొయిన్ అలీ (4/26) ప్రత్యర్థిని దెబ్బతీశాడు. శతక భాగస్వామ్యం... కేవలం 56 బంతుల్లో 110 పరుగులు...చెన్నై తొలి వికెట్ భాగస్వామ్యమిది. రుతురాజ్, కాన్వే చెలరేగుతూ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. అవేశ్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో కాన్వే మొదలుపెట్టగా, గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రుతురాజ్ మూడు సిక్సర్లతో చెలరేగాడు. వుడ్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్తో 19 పరుగులు రాబట్టిన చెన్నై పవర్ప్లే ముగిసే సరికి 79 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 25 బంతుల్లోనే రుతురాజ్ అర్ధసెంచరీ పూర్తయింది. కృనాల్ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి కాన్వే తన జోరును కొనసాగించాడు. ఎట్టకేలకు బిష్ణోయ్ తన తొలి బంతికే వికెట్ తీసి రుతురాజ్ను వెనక్కి పంపడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కాన్వే అవుట్ కాగా...మూడో స్థానంలో వచ్చిన శివమ్ దూబే (16 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో తాను ఎదుర్కొన్న వరుస నాలుగు బంతుల్లో అతను 6, 4, 6, 6తో చెలరేగిపోయాడు. అతని వికెట్ కూడా బిష్ణోయ్ ఖాతాలోకే చేరగా, అవేశ్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన మొయిన్ అలీ (19)ని కూడా బిష్ణోయ్ అవుట్ చేశాడు. స్టోక్స్ (8), జడేజా (3) విఫలం కాగా...చివర్లో అంబటి రాయుడు (14 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ధోని (12) కలిసి స్కోరును 200 పరుగులు దాటించారు. లక్నో ప్రధాన బౌలర్ మార్క్ వుడ్ తన చివరి రెండు ఓవర్లలో 4 సిక్సర్లతో సహా మొత్తం 30 పరుగులు సమర్పించుకున్నాడు. మేయర్స్ మినహా... భారీ ఛేదనలో జట్టుకు అవసరమైన శుభారంభం లక్నోకు లభించింది. 35 బంతుల్లోనే ఓపెనర్లు 79 పరుగులు జోడించారు. ఇందులో మేయర్స్ మెరుపులే ఎక్కువగా ఉండగా, కేఎల్ రాహుల్ (20) ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు. స్టోక్స్ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన మేయర్స్ చహర్ వరుస రెండు ఓవర్లలో కలిపి మొత్తం 5 ఫోర్లు బాదాడు. తుషార్ ఓవర్లోనూ 4, 6 కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అయితే అలీ తన తొలి ఓవర్లోనే మేయర్స్ను అవుట్ చేసి లక్నో పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత ఏ దశలోనూ జెయింట్స్ కోలులోకపోయింది. హుడా (2), కృనాల్ (9) విఫలం కాగా, స్టొయినిస్ (21) కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేదు. క్రీజ్లో ఉన్నంత సేపు నికోలస్ పూరన్ (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా జట్టు విజయానికి అది సరిపోలేదు. రాజ్వర్ధన్ ఓవర్లోనే వరుసగా 6, 4, 4 కొట్టిన పూరన్ జడేజా ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు. 16వ ఓవర్ చివరి బంతికి పూరన్ అవుట్ కావడంలో లక్నో విజయావకాశాలు పూర్తిగా కోల్పోయింది. స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) వుడ్ (బి) బిష్ణోయ్ 57; కాన్వే (సి) కృనాల్ (బి) వుడ్ 47; దూబే (సి) వుడ్ (బి) బిష్ణోయ్ 27; అలీ (స్టంప్డ్) పూరన్ (బి) బిష్ణోయ్ 19; స్టోక్స్ (సి) యష్ (బి) అవేశ్ 8; రాయుడు (నాటౌట్) 27; జడేజా (సి) బిష్ణోయ్ (బి) వుడ్ 3; ధోని (సి) బిష్ణోయ్ (బి) వుడ్ 12; సాన్ట్నర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–110, 2–118, 3–150, 4–166, 5–178, 6–203, 7–215. బౌలింగ్: మేయర్స్ 2–0–16–0, అవేశ్ 3–0–39–1, కృనాల్ 2–0–21–0, గౌతమ్ 1–0–20–0, వుడ్ 4–0–49–3, యష్ ఠాకూర్ 4–0–36–0, రవి బిష్ణోయ్ 4–0–28–3. లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) రుతురాజ్ (బి) అలీ 20; మేయర్స్ (సి) కాన్వే (బి) అలీ 53; హుడా (సి) స్టోక్స్ (బి) సాన్ట్నర్ 2; కృనాల్ (సి) జడేజా (బి) అలీ 9; స్టొయినిస్ (బి) అలీ 21; పూరన్ (సి) స్టోక్స్ (బి) తుషార్ 32; బదోని (సి) ధోని (బి) తుషార్ 23; గౌతమ్ (నాటౌట్) 17; వుడ్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–79, 2–82, 3–82, 4–105, 5–130, 6–156, 7–195. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–55–0, స్టోక్స్ 1–0–18–0, తుషార్ 4–0–45–2, మొయిన్ అలీ 4–0–26–4, సాన్ట్నర్ 4–0–21–1, రాజ్వర్ధన్ 2–0–24–0, జడేజా 1–0–14–0. ధోని ఫటాఫట్... మ్యాచ్ను తన భుజస్కంధాలపై మోసే భారంనుంచి చాలా కాలంగా దూరమైన ధోని కొద్ది సేపు క్రీజ్లో ఉండి అభిమానులను అలరిస్తే చాలు అన్నట్లుగా ఆడుతున్నాడు. అతని ఆట చూసేందుకు చెపాక్ మైదానానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్ను అతను నిరాశపర్చలేదు. 6, 6, అవుట్...ఆడిన మూడు బంతుల్లోనే రెండు సిక్సర్లతో స్టేడియం హోరెత్తగా, సొంత జట్టు సభ్యులు కూడా ఆ సిక్సర్లకు సంబరాలు చేసుకున్నారు. తొలి మ్యాచ్లోనూ 7 బంతుల్లో ఫోర్, సిక్స్ బాదిన అతను 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్తో ధోని ఐపీఎల్లో 5 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. లీగ్లో ఈ మైలురాయిని దాటిన ఏడో ఆటగాడిగా (కోహ్లి, ధావన్, వార్నర్, రోహిత్, రైనా, డివిలియర్స్ తర్వాత) నిలిచాడు. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2023: నమస్తే ఇండియా! తిరిగి వచ్చేస్తున్నా.. అద్భుతమైన జట్టుతో..
Steve Smith to join IPL 2023: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్-2023 సీజన్లో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్ స్వయంగా ప్రకటించాడు. ‘‘నమస్తే ఇండియా. మీతో ఓ ఆసక్తికర వార్త పంచుబోతున్నా. నేను ఐపీఎల్-2023 ఎడిషన్లో జాయిన్ అవుతున్నా. అవును.. ఇది నిజమే! ఇండియాలోని అద్భుతమైన టీమ్తో నేను జట్టుకట్టనున్నాను’’ అంటూ వీడియో విడుదల చేశాడు. కాగా స్మిత్ గతంలో క్యాష్ రిచ్ లీగ్లో ఆరు ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా ప్రస్తుతం ఉనికిలో లేని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, పుణె వారియర్స్ ఇండియా, కొచ్చి టస్కర్స్ కేరళ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చినా గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన 33 ఏళ్ల స్మిత్.. 8 మ్యాచ్లు ఆడి 152 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో మొత్తంగా 103 మ్యాచ్లు ఆడిన ఈ ఆసీస్ బ్యాటర్.. 2485 పరుగులు సాధించాడు. ఇందులో 11 అర్ధ శతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఇక గతేడాది 2 కోట్ల రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. టీమిండియాతో సిరీస్లో కెప్టెన్గా హిట్ ఈ నేపథ్యంలో కామెంటేటర్గా కొత్త అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్తో కామెంటేటర్గా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇక ఇటీవల టీమిండియాతో ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్లో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ పగ్గాలు చేపట్టి.. మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. తన కెప్టెన్సీ నైపుణ్యాలతో మూడో టెస్టులో ఆసీస్ను గెలిపించాడు. ఇక అతడి సారథ్యంలోనే టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన డికాక్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ! BCCI: భువనేశ్వర్కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! pic.twitter.com/NoU1ZAtZzF — Steve Smith (@stevesmith49) March 27, 2023 -
IPL 2023: గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్.. హ్యాండ్ ఇచ్చిన కిల్లర్ మిల్లర్
David Miller: ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఛాంపియన్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉండనున్నట్లు స్వయంగా వెల్లడించాడు. వరల్డ్ కప్ సూపర్ లీగ్ (WCSL)లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగే అత్యంత కీలకమైన రెండు వన్డే మ్యాచ్లకు అందుబాటులో ఉండేందుకు మిల్లర్తో పాటు ఐపీఎల్లో పాల్గొనే పలువురు సఫారీ స్టార్ ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఐపీఎల్-2023 ప్రారంభ తేదీనే (మార్చి 31) సౌతాఫ్రికా నెదర్లాండ్స్తో తొలి వన్డే, అనంతరం ఏప్రిల్ 2న రెండో వన్డే ఆడాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించాలంటే దక్షిణాఫ్రికా ఈ రెండు వన్డేల్లో గెలిచి తీరాలి. అందుకే క్రికెట్ సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లనంతా ఈ మ్యాచ్లకు అందుబాటులో ఉండాలని కోరింది. ఇది మ్యాండేటరీ కాకపోయినప్పటికీ.. జాతీయ జట్టు అవసరాల దృష్ట్యా సౌతాఫ్రికా క్రికెటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిల్లర్తో పాటు సఫారీ ఆటగాళ్లు ఎయిడెన్ మార్క్రమ్ (ఎస్ఆర్హెచ్), హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), మార్కో జన్సెన్ (ఎస్ఆర్హెచ్), అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి (ఢిల్లీ క్యాపిటల్స్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డికాక్ (లక్నో), రబాడ (పంజాబ్) ఐపీఎల్-2023లో వారాడే ఒకటి, రెండు మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. కాగా, గతేడాది ఐపీఎల్కు ముందు కూడా సౌతాఫ్రికా క్రికెటర్లకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అయితే అప్పుడు రబాడ, ఎంగిడి, జన్సెన్, మార్క్రమ్, డస్సెన్లు జాతీయ జట్టుకు కాకుండా ఐపీఎల్కు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి లీగ్లో ఆడారు. అప్పుడు సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడింది. ఐపీఎలా లేక జాతీయ జట్టా అన్న నిర్ణయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ఆటగాళ్లకే వదిలేయడంతో వారు అప్పట్లో ఐపీఎల్కే ఓటేశారు. -
ఐపీఎల్కు అంత సీన్ లేదు.. పాకిస్తాన్ సూపర్ లీగే తోపు..!
ఐపీఎల్ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పోలిస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ సూపర్ సక్సెస్ అంటూ నిరాధారమైన కామెంట్స్ చేశాడు. పీఎస్ఎల్ 2023 సీజన్ ముగిసిన అనంతరం పీసీబీ చీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్కు మెరుగైన డిజిటల్ రేటింగ్ ఉందని గొప్పలు పోయాడు. డిజిటల్ ప్లాట్ఫాం వేదికగా పీఎస్ఎల్ 8వ ఎడిషన్ను 150 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారని, ఐపీఎల్-2022 సీజన్ను కేవలం 130 మిలియన్ల డిజిటల్ రేటింగ్ మాత్రమే దక్కిందని నిరాధారమైన లెక్కలు చెబుతూ జబ్బలు చరుచుకున్నాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ ఎంతో గొప్పదో చెప్పడానికి ఇదొక్క విషయం చాలంటూ బడాయి ప్రదర్శించాడు. పాక్లో జరగాల్సిన 2023 ఆసియా కప్లో పాల్గొనేది లేదని భారత్ కరాఖండిగా తేల్చి చెప్పిన నేపథ్యంలో సేథీ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ సమాజం అసహనం వ్యక్తం చేస్తుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ, ఇలాంటి నిరధారమైన వ్యాఖ్యలు చేసి అంతంతమాత్రంగా ఉన్న ప్రతిష్టను మరింత దిగజార్చుకోవద్దంటూ నెటిజన్లు పీసీబీకి చురకలంటిస్తున్నారు. ఇదిలా ఉంటే, మార్చి 18న ముగిసిన పీఎస్ఎల్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ విజేతగా నిలిచింది. షాహీన్ అఫ్రిది నేతృత్వంలో ఖలందర్స్ వరుసగా రెండో సీజన్లో టైటిల్ను ఎగరేసుకుపోయింది. పీఎస్ఎల్ 2022 సీజన్లో ఎదురైన ప్రత్యర్ధి ముల్తాన్ సుల్తాన్స్నే ఖలందర్స్ మళ్లీ ఓడించి టైటిల్ను నిలబెట్టుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో సుల్తాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. రన్నరప్గా నిలిచన సుల్తాన్స్కు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్గా వ్యవహరించాడు. -
రెండు ముంబై ఇండియన్స్ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్, వుమెన్స్ ప్రీమియర్ లీగ్లలో ముంబై బేస్డ్, రిలయన్స్ ఓన్డ్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్, డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్ రెండూ ప్రపంచంలోనే మేటి జట్లు అన్న విషయంతో అందరూ ఏకీభవించాల్సిందే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఈ విషయాన్ని ఇదివరకే ప్రూవ్ చేసుకోగా.. డబ్ల్యూపీఎల్ ప్రారంభమైన కొద్ది రోజులకే ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్ ఈ విషయాన్ని రుజువు చేసింది. డబ్ల్యూపీఎల్లో ఎంఐ వుమెన్స్ టీమ్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసి టైటిల్ రేసులో ముందువరుసలో నిలిచింది. ఎంఐ మెన్స్ టీమ్ విషయానికొస్తే.. 15 ఐపీఎల్ ఎడిషన్లలో 5 సార్లు ఛాంపియన్గా, ఐదు ఛాంపియన్స్ లీగ్ ఎడిషన్లలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఈ జట్టు.. కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేనప్పటికీ, కొన్ని గడ్డు పరిస్థితుల దృష్ట్యా గత రెండు సీజన్లుగా దారుణంగా విఫలమవుతూ వస్తుంది. స్టార్ ఆటగాళ్లు అందుబాటు లేకపోవడం, జూనియర్లు ఇప్పుడిప్పుడే కుదురుకుంటుండటం వల్ల ఎంఐ టీమ్కు ఈ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు ఎలా ఉన్నా , వెంటనే సర్దుకుని తిరిగి గెలుపు ట్రాక్పై ఎక్కడం ఆ జట్టుకు ఇది కొత్తేమీ కాదు. కాబట్టి గత సీజన్ల గెలుపోటములతో పని లేకుండా, రాబోయే సీజన్లో ఎంఐ మెన్స్ టీమ్ సత్తా చాటి మరో టైటిల్ సాధిస్తుందని ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. రాబోయే సీజన్లో బుమ్రా అందుబాటులో ఉండడన్న విషయం తప్పిస్తే.. ఆ జట్టు అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్.. ఆల్రౌండర్ల కోటాలో టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, జేసన్ బెహ్రెన్డార్ఫ్, డుయాన్ జన్సెస్, పియుష్ చావ్లా లాంటి ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ పటిష్టంగా ఉంది. గాయపడిన బుమ్రా, జై రిచర్డ్సన్ స్థానాల్లో ఇద్దరు అనుభవజ్ఞులైన పేసర్లు దొరికితే ఈ విభాగంలోనూ ఆ జట్టు పటిష్టంగా మారుతుంది. ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం సోషల్మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. తొట్టతొలి ఐపీఎల్ను ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో ప్రారంభించగా.. అందుకు భిన్నంగా డబ్ల్యూపీఎల్లో ఎంఐ వుమెన్స్ టీమ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని నెటిజన్లు, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే 4 వరుస పరాజయాలతో అరంగేట్రం ఐపీఎల్ సీజన్ను ప్రారంభించిన ఎంఐ మెన్స్ టీమ్.. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ఐపీఎల్ ఛాంపియన్గా.. 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ విజేతగా నిలిచింది. ఎంఐ మెన్స్ టీమ్కు భిన్నంగా వుమెన్స్ టీమ్ ప్రస్తానం సాగుతుండటంతో వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని ఎంఐ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎంఐ వుమెన్స్ టీమ్ స్టార్లతో నిండి ఉంది కాబట్టి, ఆ జట్టే తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ ఎగురేసుకుపోతుందని కొందరు ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. -
కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే జట్టుకు చెందిన మరో ఫాస్ట్ బౌలర్, ఆసీస్ ఆటగాడు జై రిచర్డ్సన్ కూడా గాయం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరంగా ఉంటాడన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల స్థానాలను భర్తీ చేసే పనిలో నిమగ్నమైంది ఎంఐ యాజమాన్యం. ఇందుకోసం 2023 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాను జల్లెడపట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎంఐ యజమాన్యానికి అన్సోల్డ్ జాబితాలో మిగిలిపోయిన ఓ తురుపుముక్క తారసపడింది. అతని పేరు సందీప్ శర్మ. ఐపీఎల్ పవర్ ప్లేల్లో అత్యధిక వికెట్లు (92 ఇన్నింగ్స్ల్లో 53 వికెట్లు) తీసిన రికార్డు కలిగిన సందీప్ శర్మను 2023 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముంబై ఇండియన్స్ బుమ్రా స్థానంలో అనుభవజ్ఞుడైన సందీప్ శర్మను తమ జట్టులోని తెచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. 2018 నుంచి నాలుగు సీజన్ల పాటు సన్రైజర్స్ కీలక బౌలర్గా చలామణి అయిన సందీప్ను 2022 వేలంలో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆ సీజన్లో 5 మ్యాచ్లు ఆడిన సందీప్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టడంతో పంజాబ్ కింగ్స్ కూడా గడిచిన సీజన్ తర్వాత అతన్ని వేలానికి వదిలేసింది. ఐపీఎల్లో రికార్డు స్థాయిలో 114 వికెట్లు పడగొట్టిన సందీప్ను 2023 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. 2013లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన సందీప్.. తన తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్పై కేవలం 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నాటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోని సందీప్.. 2017లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో నాటి స్టార్ క్రికెటర్లు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ భరతం పట్టాడు. ఈ ముగ్గురు దిగ్గజ క్రికెటర్లను ఓ మ్యాచ్లో ఒకే బౌలర్ ఔట్ చేయడం అదే తొలిసారి. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేంటంటే.. సందీప్ శర్మ, ఐపీఎల్లో విరాట్ కోహ్లిని ఏకంగా 7 సార్లు ఔట్ చేశాడు. ఐపీఎల్లో ఏ బౌలర్ కూడా కోహ్లిని ఇన్ని పర్యాయాలు ఔట్ చేయలేదు. నెహ్రా 6, బుమ్రా 4 సార్లు కోహ్లిని పెవిలియన్కు పంపారు. ఐపీఎల్లో సందీప్ బౌలింగ్లో 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. కేవలం 55 పరుగులు మాత్రమే చేసి ఏడు సార్లు ఔటయ్యాడు. ఐపీఎల్లో ఓ బౌలర్కు వ్యతిరేకంగా కోహ్లికి ఇవి చెత్త గణాంకాలుగా రికార్డయ్యాయి. -
సేమ్ సీన్ రిపీట్.. అప్పుడు కేకేఆర్, ఇప్పుడు ముంబై ఇండియన్స్
మహిళల క్రికెట్లో తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) ఆరంభం అదిరింది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్లోనే భారీ స్కోరు నమోదైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇప్పటి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ అర్థసెంచరీతో మెరవగా.. అమెలియా కెర్, హేలీ మాథ్యూస్లు రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ దారుణ ఆటతీరును కనబరిచింది. ఇది చూసిన తర్వాత ఒక విషయం గుర్తుకురాక మానదు. అదే 2008 తొలి ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్. అప్పుడు కేకేఆర్, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మెక్కల్లమ్ 73 బంతుల్లోనే 158 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 82 పరగులకే కుప్పకూలి 140 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. అజిత్ అగార్కర్ మూడు వికెట్లు తీశాడు. సేమ్ టూ సీన్ రిపీట్ అయిందంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. -
IPL 2023: సీఎస్కేకు గుడ్న్యూస్.. బెన్ స్టోక్స్ ఏమన్నాడంటే..?
ఐపీఎల్ 2023 సీజన్ చివరి అంకం మ్యాచ్లకు అందుబాటులో ఉండడని జరుగుతున్న ప్రచారంపై చెన్నై సూపర్ కింగ్స్ ఖరీదైన ఆటగాడు, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. న్యూజిలాండ్తో రెండో టెస్ట్లో పరుగు తేడాతో ఓటమి అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, తాను ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. తన ప్రస్తుత శారీరక పరిస్థితిపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్తో తరుచూ మాట్లాడుతున్నాని, ఐపీఎల్ కోసం ఫిట్గా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తానని తెలిపాడు. అలాగే, తన మోకాలి సమస్యలపై కూడా స్టోక్స్ వివరణ ఇచ్చాడు. దీర్ఘకాలంగా వేధిస్తున్న మోకాలి సమస్యలపై పోరాటం చేస్తున్నానని.. ఫిజియోలు, డాక్టర్ల సాయంతో దానిపై పైచేయి సాధించి, పదేళ్ల కెరీర్లో వంద శాతం తన పాత్రకు న్యాయం చేశానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ తర్వాత తన దృష్టంతా యాషెస్ సిరీస్పైనేనని, ప్రతిష్టాత్మక సిరీస్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నాడు. కాగా, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే తేదీకి (మే 28) సరిగ్గా నాలుగు రోజుల తర్వాత (జూన్ 1) ఇంగ్లండ్.. ఐర్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ వెంటనే (జూన్ 16) ఇంగ్లండ్.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల యాషెస్ సిరీస్ ఆడనుంది. యాషెస్ సిరీస్కు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో ఈసీబీ స్టోక్స్ను ఐర్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉందిగా ఫోర్స్ చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే స్టోక్స్.. ఐపీఎల్లో ఆఖరి మ్యాచ్లకు డుమ్మా కొట్టి, ఐర్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడతాడని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా స్టోక్స్ వివరణ ఇవ్వడంతో సందేహాలన్నీ తొలిగిపోయాయి. మరోవైపు ఈసీబీ.. స్టోక్స్ ఐపీఎల్ 2023లో ఆడేందుకు ఎన్ఓసీ కూడా ఇచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్కు ముందు జరిగిన వేలంలో సీఎస్కే స్టోక్స్ను 16.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
ఇక్కడ ఆడాల్సిన అవసరం వాళ్లకేంటి? బీసీసీఐని చూసి బుద్ధి తెచ్చుకోండి: పాక్ మాజీ ప్లేయర్
BCCI- Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోని పొట్టి ఫార్మాట్ లీగ్లన్నింటిలోకి క్యాష్ రిచ్ లీగ్ అనడంలో సందేహం లేదు. యువ ఆటగాళ్లు ఒక్కసారి ఈ వేదికపై ప్రతిభ నిరూపించుకుంటే చాలు కోటీశ్వరుల జాబితాలో చేరిపోతారు. జాతీయ జట్టులో అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఇక వెటరన్ ప్లేయర్లు సైతం ఇక్కడ తమను తాము నిరూపించుకుంటే మరికొంత కాలం కెరీర్ పొడిగించుకోగలుగుతారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. స్టార్ క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని ఐపీఎల్ ద్వారా ఇప్పటికే ఎంతో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు కెరీర్ పరంగా, ఆర్థికంగా నిలదొక్కుకున్న దాఖలాలు కోకొల్లలు. అయితే, అంతబాగానే ఉన్నా బీసీసీఐ తమ క్రికెటర్లను మాత్రం విదేశీ టీ20 లీగ్లలో ఆడేందుకు అనుమతి ఇవ్వదన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐని సమర్థిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ బోర్డు సరైన పనిచేస్తోందని ప్రశంసించాడు. కాగా పాక్లో ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడిన అక్మల్కు.. టీమిండియా క్రికెటర్లు పీఎస్ఎల్ ఆడటానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్న ఎదురైంది. కమ్రాన్ అక్మల్ వాళ్లకేం అవసరం? ఇందుకు స్పందిస్తూ.. ‘‘భారత క్రికెటర్లు పీఎస్ఎల్లో అస్సలు ఆడకూడదు. విదేశీ లీగ్లలో తమ ప్లేయర్లను ఆడించే విషయంలో ఇండియన్ బోర్డు సరైన దిశలో పయనిస్తోంది. ఐపీఎల్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత వరుస అంతర్జాతీయ సిరీస్లు ఉంటాయి. నిజానికి ఐపీఎల్ ద్వారా ఆర్థికంగా వాళ్లు కావాల్సిన మేర పరిపుష్టం అవుతారు. పీసీబీ బీసీసీఐని చూసి నేర్చుకోవాలి అలాంటపుడు విదేశీ లీగ్లలో ఆడాల్సిన అవసరం వాళ్లకేం ఉంటుంది? నిజానికి మన బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐని చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది. ఆటగాళ్ల కెరీర్ను పొడిగించుకునేందుకు వాళ్లు పాటిస్తున్న విధానాలు గమనించాలి. అక్కడ వంద టెస్టులాడిన వాళ్లు దాదాపు 14- 15 మంది ప్లేయర్లు ఉన్నారు. కానీ ఇక్కడ ఒకరో.. ఇద్దరో ఉంటారు. ఇండియాలో వాళ్లు క్రికెట్కు, క్రికెటర్లకు విలువనిస్తారు. ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లకు భారీ మొత్తంలో చెల్లిస్తారు. నిజానికి ఐపీఎల్ ముందు బీబీఎల్(బిగ్బాష్ లీగ్) దిగదిడుపే. ప్రపంచంలో ఏ లీగ్ కూడా ఐపీఎల్కు సాటిరాదు’’ అని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ పేర్కొన్నాడు. బీసీసీఐని చూసైనా పీసీబీ బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించాడు. చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. BGT 2023: ‘టమ్ టమ్’ పాటకు టీమిండియా క్రికెటర్ స్టెప్పులు.. వీడియో వైరల్ -
కోహ్లిని చూసి సిగ్గు పడు.. ఐపీఎల్కు బుమ్రా ఇస్తున్న ప్రాధాన్యతపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ అభిమానులు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. జాతీయ జట్టును కాదని ఐపీఎల్కు ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఐపీఎల్ ఆడటం కోసం జాతీయ జట్టు ప్రయోజనాలకు తాకట్టు పెట్టడమేంటని నిలదీస్తున్నారు. ఐపీఎల్పై అంత మోజు ఉంటే, అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి, క్యాష్ రిచ్ లీగ్ మాత్రమే ఆడుకోవాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండబట్టి 8 నెలలు పూర్తవుతున్నా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు. బుమ్రాను జాతీయ జట్టుకు ఆడించే విషయంలో బీసీసీఐ కూడా డ్రామాలు ఆడుతుందని దుయ్యబడుతున్నారు. పైకి వన్డే వరల్డ్కప్ను సాకుగా చూపిస్తూ.. లోలోపల బుమ్రా ఫిట్గా ఐపీఎల్లో పాల్గొనేందుకు బీసీసీఐ పెద్దలు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీసీసీఐ ప్రమేయం లేనిదే గాయం బూచి చూపిస్తూ ఇన్నాళ్లు ఇష్టారీతిన వ్యవహరించగలడా అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్కు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని చూసి బుమ్రా సిగ్గు పడాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. BGTలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆసీస్తో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా కోహ్లి ప్రవర్తించిన తీరును ఉదాహరణగా చూపిస్తూ.. దేశానికి కోహ్లి ఇచ్చే ప్రాధాన్యత ఇది, కోహ్లిని చూసి నేర్చుకో అంటూ సలహాలిస్తున్నారు. కాగా, ఢిల్లీ టెస్ట్ మూడో రోజు ఆటలో విరాట్ కోహ్లి స్లిప్్లో ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టాండ్స్లో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన కోహ్లి వారిని వారించి, ఆర్సీబీ అని కాకుండా ఇండియా.. ఇండియా అని తమను ఎంకరేజ్ చేయాలంటూ తన జెర్సీపై ఉన్న బీసీసీఐ ఎంబ్లెంని చూపిస్తూ ఫ్యాన్స్కు సైగ చేశాడు. కోహ్లి ఇలా చెప్పాడో లేదో.. ఇండియా.. ఇండియా.. అకే కేకలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. ఇదిలా ఉంటే, వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న బుమ్రా గతేడాది జులై 1న తన చివరి టెస్ట్, జులై 14న చివరి వన్డే, సెప్టెంబర్ 25న ఆఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. నాటి నుంచి ఆ సాకు ఈ సాకు చూపిస్తూ, జట్టులోకి వస్తూ, పోతూ నేషనల్ క్రికెట్ అకాడమీకే పరిమితమయ్యాడు. -
ఐపీఎల్ మూడ్లోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా వెటరన్ వికెట్కీపర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హార్డ్ హిట్టర్ దినేశ్ కార్తీక్.. ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందే ఆ మూడ్లోకి వచ్చాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరం ఉంటున్న డీకే.. డీవై పాటిల్ టీ20 కప్-2023 సూపర్ లీగ్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆర్బీఐతో జరిగిన మ్యాచ్లో డీవై పాటిల్ గ్రూప్-బి జట్టు తరఫున బరిలోకి దిగిన డీకే.. 38 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 75 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన జట్టు 25 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన డీకే.. పూనకం వచ్చినట్లు ఊగిపోయి, ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నీ.. డీకే తదితర ఐపీఎల్ క్రికెటర్లకు బాగా ఉపయోగపడనుంది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన డీవై పాటిల్ గ్రూప్-బి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించగా.. ఛేదనలో ఆర్బీఐ టీమ్ కోటా ఓవర్లు మొత్తం ఆడి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమై 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డీవై పాటిల్ ఇన్నింగ్స్లో దినేశ్ కార్తీక్ (75 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడగా.. హార్ధిక్ తామోర్ (28), యశ్ ధుల్ (29), శశాంక్ సింగ్ (23) ఓ మోస్తరుగా రాణించారు. ఆర్బీఐ బౌలర్లలో అలీ ముర్తుజా 2, షాబాజ్ నదీమ్, అంకిత్ రాజ్పుత్, సాయన్ మొండల్ చెరో వికెట్ పడగొట్టారు. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్బీఐ.. బల్తేజ్ సింగ్ (3/33), వినీత్ సిన్హా (3/34), సాగర్ ఉదేశీ (1/24) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్బీఐ ఇన్నింగ్స్లో సుమిత్ (49), జ్యోత్ (35), రాజేశ్ బిష్ణోయ్ (33) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాగా, దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
ఉత్తమ కెప్టెన్గా రోహిత్.. కోహ్లి, బుమ్రాలకు అవార్డులు, ధోనికి మొండిచెయ్యి
తొట్ట తొలి ఐపీఎల్ వేలం (2008 ఫిబ్రవరి 20) జరిగి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ సంస్థ.. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో భాగస్వామ్యంలో ఐపీఎల్ ఇన్క్రెడిబుల్ అవార్డులను అనౌన్స్ చేసింది. మొత్తం ఆరు విభాగాల్లో విజేతలను ప్రకటించిన స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో.. ఐపీఎల్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేసింది. రోహిత్ 2013-22 మధ్యలో ముంబై ఇండియన్స్ను 5 సార్లు ఛాంపియన్గా నిలిపినందున అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో సంయుక్త ప్రకటన చేశాయి. కెప్టెన్గా రోహిత్ 143 మ్యాచ్ల్లో 56.64 విన్నింగ్ పర్సంటేజ్తో 79 సార్లు ముంబై ఇండియన్స్ను విజేతగా నిలిపాడు. ఈ విభాగంలో గౌతమ్ గంభీర్, ఎంఎస్ ధోని, లేట్ షేన్ వార్న్ నామినేట్ అయినప్పటికీ హిట్మ్యాన్నే అవార్డు వరించింది. ఉత్తమ బ్యాటర్ కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా నామినేట్ కాగా.. ఏబీడీని అవార్డు వరించింది. మిప్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్.. 2008-21 మధ్యకాలంలో 184 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీల సాయంతో 39.71 సగటున 5162 పరుగులు చేశాడు. ఏబీడీ.. 2016 సీజన్లో ఆర్సీబీ తరఫున 168.97 స్ట్రయిక్ రేట్తో 687 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఓ సీజన్లో ఉత్తమ బ్యాటింగ్ కేటగిరిలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ పోటీ పడగా.. కోహ్లి విజేతగా నిలిచాడు. కోహ్లి.. 2016 సీజన్లో ఆస్సీబీ తరఫున 152.03 స్ట్రయిక్ రేట్తో 973 పరుగులు సాధించాడు. ఐపీఎల్ మొత్తంలో ప్రభావవంతమైన క్రికెటర్ కేటగిరిలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, షేన్ వాట్సన్, రషీద్ ఖాన్ నామినేట్ కాగా.. ఈ అవార్డు ఆండ్రీ రసెల్ను వరించింది. ఉత్తమ బౌలర్ కేటగిరిలో రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్ నామినేట్ కాగా.. బుమ్రా విజేతగా నిలిచాడు. ఐపీఎల్ సీజన్లో ఉత్తమ ప్రదర్శన కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో సునీల్ నరైన్ (2012), రషీద్ ఖాన్ (2018), జోఫ్రా ఆర్చర్ (2020), యుజ్వేంద్ర చహల్ (2022) నామినేట్ కాగా.. చహల్ను ఈ అవార్డు వరించింది. -
మహిళల ఐపీఎల్ మార్చి 4 నుంచి ప్రారంభం
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్కు (డబ్ల్యూపీఎల్) ముహూర్తం ఖరారైంది. ముంబైలోని బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో మార్చి 4 నుంచి లీగ్ ప్రారంభంకానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అధికారికంగా ప్రకటించారు. 22 రోజుల పాటు సాగే డబ్ల్యూపీఎల్ మార్చి 26తో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. లీగ్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల మధ్య జరుగుతుందని తెలిపారు. అలాగే లీగ్కు సంబంధించిన వేలం టీ20 వరల్డ్కప్లో భారత్-పాక్ మ్యాచ్ అయిపోయిన మరుసటి రోజే (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగుతుందని స్పష్టం చేశాడు. కాగా, డబ్ల్యూపీఎల్లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను ఐపీఎల్ యజమాన్యాలే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆయా జట్లను సొంతం చేసుకున్న యజమాన్యాల వివరాలు.. అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు)-గుజరాత్ జెయింట్స్ ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు)- ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు)- ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు)-లక్నో సూపర్ జెయింట్స్ -
'భారత్లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశలో ఉంది'
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఇయాన్ బోథం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశకు చేరుకుందని.. ఐపీఎల్ మోజు వల్లే ఇదంతా జరుగుతుందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇయాన్ బోథం వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. మిర్రర్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఇయాన్ బోథం మాట్లాడాడు. ఇప్పుడు ఇండియాకి వెళ్లి చూడండి.. అక్కడ ఎవరు టెస్టు క్రికెట్ చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇదంతా ఐపీఎల్ వల్లే. ఐపీఎల్ ద్వారా బోర్డుకు కోట్ల ఆదాయం వస్తుంది. ఆ మోజులో పడి అక్కడి జనాలు టెస్టు క్రికెట్ను చూడడం మానేశారు. ఇది ఎక్కడివరకు వెళ్తుందో తెలియదు. అయితే టెస్టు క్రికెట్ మొదలై ఇప్పటికే వందేళ్లు పూర్తయింది. టెస్టు క్రికెట్ ఎక్కడికి వెళ్లదు. ఎన్ని ఫార్మాట్లు వచ్చిన సంప్రదాయ క్రికెట్కు ఎలాంటి ఢోకా లేదు. ఒకవేళ టెస్టు క్రికెట్ చచ్చిపోయే పరిస్థితి వస్తే మనం క్రికెట్నే కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇదంతా మీనింగ్లెస్గా కనిపిస్తున్నా.. ప్రతీ ఆటగాడు ఒక సందర్భంలో టెస్టు మ్యాచ్ తప్పనిసరిగా ఆడాల్సిందే. ఇక యాషెస్ టూర్ గురించి మాట్లాడుకుంటే.. ఈసారి ఇంగ్లండ్ మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. బజ్బాల్ త్రీ లయన్స్(ఇంగ్లండ్)కు చాలా ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించడం మాములు విషయం కాదు. పాక్ గడ్డపై ఈ ఫీట్ను అందుకోవడం ఇంగ్లండ్ క్రికెట్కు మంచి తరుణం అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: మాయ చేసే మెస్సీనే బోల్తా కొట్టించాడు.. వాళ్లిద్దరు నిజంగా కలిశారా..? -
ఐపీఎల్లో నిరాశపరిచినా.. సౌతాఫ్రికా లీగ్లో మాత్రం దుమ్మురేపుతున్న సన్రైజర్స్
Sunrisers Eastern Cape: గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకుంటూ, ఫ్యాన్స్ తలెత్తుకోలేకుండా చేసిన సన్రైజర్స్ ఫ్రాంచైజీ.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో మాత్రం అబ్బురపడే ప్రదర్శన కనబరుస్తూ, వరుస విజయాలతో అదరగొడుతుంది. సీజన్ను వరుస పరాజయాలతో ప్రారంభించినా, ఆతర్వాత హ్రాటిక్ విజయాలు, మధ్యలో ఓ ఓటమి, తాజాగా (జనవరి 22) మరో భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (7 మ్యాచ్ల్లో 4 విజయాలతో 17 పాయింట్లు) ఎగబాకింది. డర్బన్ సూపర్ జెయింట్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్.. ఓపెనర్లు ఆడమ్ రాస్సింగ్టన్ (30 బంతుల్లో 72; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), జోర్డాన్ హెర్మన్ (44 బంతుల్లో 59; 9 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర అర్ధశతకాలతో, కెప్టెన్ మార్క్రమ్ (34 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ట్రిస్టన్ స్టబ్స్ (13 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ టీమ్.. రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్ (4-0-20-6) స్పిన్ మాయాజాలం ధాటికి విలవిలలాడిపోయి 86 పరుగులకే కుప్పకూలింది. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్లో కైల్ మేయర్స్ (11), వియాన్ ముల్దర్ (29), కేశవ్ మహారాజ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వ్ ఆరేయగా.. జెజె స్మట్స్, మార్క్రమ్, జన్సెన్, మాసన్ క్రేన్ తలో వికెట్ పడగొట్టారు. మినీ ఐపీఎల్గా పిలువబడే సౌతాఫ్రికా లీగ్ తొలి సీజన్లో సన్రైజర్స్ అద్భుత ప్రదర్శన పట్ల సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే ఎస్ఏ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
రాటుదేలుతున్న సిరాజ్.. బుమ్రాను మరిపిస్తూ, టీమిండియా గర్వపడేలా..!
Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ స్పీడ్స్టర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో టీమిండియా ప్రధాన బౌలర్గా మారిపోయాడనడం అతిశయోక్తి కాదు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా అతని ప్రదర్శనను ఓసారి గమనిస్తే ఈ విషయం ఇట్టే స్పష్టమవుతుంది. 2017లో అతడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి 2021 ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ వరకు సిరాజ్పై పలు అపవాదులు ఉండేవి. పరుగులు ధారాళంగా సమర్పించుకుంటాడు, వికెట్లు పడగొట్టలేడు, పవర్ ప్లేలో పూర్తిగా చేతులెత్తేస్తాడు, లైన్ అండ్ లెంగ్త్ మెయింటెయిన్ చేయడు.. ఇలా తనలోని లోపాలన్నిటినీ ఫ్యాన్స్తో పాటు విశ్లేషకులు సైతం వేలెత్తి చూపేవారు. దీనికి తోడు నాటి జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మెహర్భానిపై జట్టులో నెట్టుకొస్తున్నాడు అన్న పుకార్లు ఉండేవి. అయితే గత ఏడాదిన్నర కాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సిరాజ్.. తనలోని లోపాలను అధిగమించి, టీమిండియా ప్రధాన బౌలర్గా ఎదిగాడు. తనకు మద్దతుగా నిలిచిన కోహ్లిని కాలర్ ఎగరేసుకునేలా చేయడంతో పాటు యావత్ భారతావని గర్వపడేలా రాటుదేలాడు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా లేని లోటును సైతం పూడుస్తూ, జనాలు పేసు గుర్రాన్ని (బుమ్రా) మరిచిపోయేలా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. నిన్న తన సొంత మైదానమైన ఉప్పల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ నుంచి.. అంతకుముందు అతనాడిన 10 మ్యాచ్లపై ఓ లుక్కేస్తే సిరాజ్ ఇటీవలి కాలంలో ఎంతలా రాటుదేలాడో అర్ధమవుతుంది. కివీస్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్న సిరాజ్.. తన కోటా ఓవర్లు మొత్తం పూరిచేసి 4 కీలక వికెట్లు పడగొట్టి, టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతకుమందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో తొలి వన్డేలో 2/30, రెండో వన్డేలో 3/30, మూడో వన్డేలో 4/32.. ఇలా మ్యాచ్ మ్యాచ్కు తనలోని టాలెంట్ను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అంతకుమందు బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి టెస్ట్లో 4, రెండో టెస్ట్లో 2 వికెట్లు.. అదే జట్టుతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో 3/32, రెండో మ్యాచ్లో 2/73, మూడో మ్యాచ్లో 1/27 గణాంకాలతో ఈ పర్యటన మొత్తంలో 12 వికెట్లు నేలకూల్చాడు. బంగ్లా పర్యటనకు ముందు జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్.. రెండో టీ20లో 2/24, మూడో టీ20లో 4/17 గణాంకాలు నమోదు చేసి పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్న ఈ హైదరాబాదీ పేసర్.. టీమిండియా తరఫున 15 టెస్ట్ల్లో 46 వికెట్లు, 20 వన్డేల్లో 37 వికెట్లు, 8 టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. సీనియర్ల గైర్హాజరీలో భారత పేస్ అటాక్ను అద్భుతంగా లీడ్ చేస్తున్న సిరాజ్ మున్ముందు మరింత రాణించాలని ఆశిద్దాం. -
నాశనం చేయకండి: సన్రైజర్స్పై మాజీ ప్లేయర్ ఘాటు వ్యాఖ్యలు
IPL- Sunrisers Hyderabad: ‘‘నేను, రషీద్ 2017లో జట్టులోకి వచ్చినపుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాతి మూడేళ్లు టీమ్ కాంబినేషన్లు చక్కగా కుదిరాయి. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. కానీ గత రెండేళ్ల కాలంలో భారీ మార్పులు. అందుకు గల కారణాలు ఏమిటో, కారకులు ఎవరో నాకు తెలియదు గానీ.. ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆటగాళ్లు ఆ ఫ్రాంఛైజీకి ఆడేందుకు విముఖత చూపడం ఆరంభించారు’’ అని అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ.. సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. నబీతో పాటు అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఐపీఎల్-2016 విజేత సన్రైజర్స్ తరఫున గతంలో ఆడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఇద్దరికీ ఎస్ఆర్హెచ్తో బంధం లేదు. తరచూ మార్పులు కాగా 2016లో జట్టుకు ట్రోఫీ అందించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ను 2021లో కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్రైజర్స్ తర్వాత అతడిని రిలీజ్ చేసింది. అదే విధంగా.. జట్టులో కీలక సభ్యుడైన రషీద్ ఖాన్ను ఐపీఎల్-2022 వేలానికి ముందు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రషీద్ను సొంతం చేసుకున్న కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్గా నియమించుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ బౌలర్... ట్రోఫీ గెలవడంలో సహాయపడ్డాడు. మరోవైపు.. సన్రైజర్స్ మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ -2023 మినీ వేలానికి ముందు తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను కూడా ఎస్ఆర్హెచ్ వదులుకున్న విషయం తెలిసిందే. దీంతో తరచూ జట్టులో మార్పులు చేస్తున్న సన్రైజర్స్ తీరుపై విశ్లేషకులు పెదవి విరిచారు. నాశనం చేయకండి అంటూ ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ యారీతో మాట్లాడిన ఆ జట్టు మాజీ ప్లేయర్ మహ్మద్ నబీ.. ఇకనైనా తీరు మార్చుకోవాలని ఎస్ఆర్హెచ్కు హితవు పలికాడు. ‘‘జట్టును నాశనం చేయడానికి బదులు.. పటిష్టం చేసేందుకు ప్రయత్నించండి. పేరున్న ఫ్రాంఛైజీగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని అదే. తరచూ మార్పులు చేయకుండా మెరుగైన జట్టు నిర్మాణానికి పాటు పడాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక రషీద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఐదేళ్ల పాటు వాళ్ల జట్టుకు బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న రషీద్ ఖాన్.. వాళ్లను వదిలివెళ్లేలా చేసుకున్నారు. రషీద్ ఒక్కడే కాదు ఎంతో మంది టాప్ ప్లేయర్ల పట్ల కూడా ఇదే వైఖరి. సన్రైజర్స్ ఇలా చేయకుండా ఉండాల్సింది. అసలు వాళ్లకేం కావాలో వాళ్లకైనా అర్థమవుతోందా?’’ అని ఈ ఆల్రౌండర్.. ఎస్ఆర్హెచ్ విధానాల పట్ల విమర్శలు సంధించాడు. కాగా 2021లో మహ్మద్ నబీకి సన్రైజర్స్తో బంధం తెగిపోయింది. ఇక గతేడాది 14 మ్యాచ్లకు గానూ 6 గెలిచిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం! Aus Vs SA 2nd Test: ఎదురులేని ఆసీస్.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక.. -
ఐపీఎల్-2023 మినీ వేలానికి కౌంట్డౌన్ షురూ.. బరిలో 405 మంది ఆటగాళ్లు
IPL 2023 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మినీ వేలం రేపు (డిసెంబర్ 23) మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్గటీ ఐలాండ్లో గల గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభంకానుంది. ఈ వేలం కోసం స్వదేశ, విదేశాలకు చెందిన మొత్తం 991 ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా 405 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. లీగ్లోని 10 ఫ్రాంచైజీలు ఇదివరకే 163 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకోగా.. అవకాశం ఉన్న 87 స్థానాల కోసం వేలం జరుగనుంది. ఇందులో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడినవి కాగా.. మిగతా 57 స్థానాల కోసం స్వదేశీ ప్లేయర్స్ పోటీ పడతారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను 5 సెట్లుగా విభజించారు. తొలి సెట్లో బ్యాటర్లు, రెండో సెట్లో ఆల్రౌండర్లు, మూడో సెట్లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్లో స్పిన్నర్లను ఉన్నారు. వేలం ప్రక్రియ మొత్తం సెట్ల వారీగా జరుగనుంది. రెండో సెట్లో ఉన్న ఆల్రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఈ సెట్లో ఉన్న విదేశీ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, సామ్ కర్రన్, షకీబ్ అల్ హసన్, జేసన్ హోల్డర్, సికిందర్ రజా, ఓడియన్ స్మిత్ భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. తొలి సెట్లో ఉన్న బ్యాటర్లలో రిలీ రోస్సో, హ్యారీ బ్రూక్ జాక్పాట్ కొట్టే ఛాన్స్ ఉండగా.. నికోలస్ పూరన్, ఆదిల్ రషీద్, దేశీయ సంచలనం, తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ కూడా భారీ ధర పలకవచ్చు. పర్స్ వాల్యూ విషయానికొస్తే.. లీగ్లో పాల్గొనే 10 జట్లు ఇదివరకే రీటైన్ చేసుకున్న ఆటగాళ్లపై రూ.743.5 కోట్లు ఖర్చు చేయగా.. ఫ్రాంచైజీల వద్ద ఇంకా రూ.206.5 కోట్ల నిధులు ఉన్నాయి. వేలంలో పాల్గొనే ఫ్రాంఛైజీల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వద్ద అత్యధికంగా 42.25 కోట్లు ఉండగా, కోల్కతా నైట్రైడర్స్ వద్ద అత్యల్పంగా 7.05 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఆయా ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్ బ్యాలెన్స్ వివరాలు.. సన్రైజర్స్ హైదరాబాద్: రూ. 42.25 కోట్లు పంజాబ్ కింగ్స్: రూ. 32.2 కోట్లు లక్నో సూపర్జెయింట్స్: రూ. 23.35 కోట్లు ముంబై ఇండియన్స్: రూ. 20.55 కోట్లు చెన్నై సూపర్కింగ్స్: రూ. 20.45 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్: రూ. 19.25 కోట్లు రాజస్తాన్ రాయల్స్: రూ. 13.2 కోట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రూ. 8.75 కోట్లు కోల్కతా నైట్రైడర్స్: రూ. 7.05 కోట్లు బేస్ ప్రైజ్ ఆధారంగా విభజింపబడ్డ ప్రముఖ ప్లేయర్ల వివరాలు.. రూ.2 కోట్ల లిస్ట్లో ప్లేయర్స్: కౌల్టర్ నైల్, కామెరున్ గ్రీన్, ట్రెవిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమాల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్న్, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వెండెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్. రూ.1.5 కోట్ల లిస్ట్లోని ప్లేయర్స్: సీన్ అబాట్, రైలీ మెరెడిత్, జై రిచర్డసన్, ఆడమ్ జంపా, షకీబుల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జేసన్ రాయ్, షెర్ఫానె రూథర్ఫర్డ్ రూ.కోటి లిస్ట్లోని ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్, మోయిసిస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షంసీ, కుశాల్ పెరీరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్వాల్, షెయ్ హోప్, అకీల్ హొస్సేన్, డేవిడ్ వీస్ ఆయా ప్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరోన్. రన్నరప్ రాజస్తాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: ఆండ్రూ టై, అంకిత్ రాజ్పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తఫిజర్ రెహ్మన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్. కోల్కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తైడే, అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్మర్ సిరాజ్, జోష్ హేజిల్వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్. సన్రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్ హక్ ఫరూఖీ. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్ధర్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. -
వుమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల కనీస ధర ఎంతంటే?
ఐపీఎల్ మరో లెవల్కు చేరనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ మెగా లీగ్ మహిళల కోసం కూడా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐదు టీమ్స్తో తొలి మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ ఐదు ఫ్రాంఛైజీలను త్వరలోనే బీసీసీఐ వేలం నిర్వహించనుంది. దీనికోసం కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించారు. 2008లో తొలి ఐపీఎల్ జరిగినప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచిన ముంబై ఇండియన్స్ ధర రూ. 446 కోట్లను ఆధారంగా చేసుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు మార్కెట్లో ఉన్న డిమాండ్, ఆసక్తిపై కాస్త అధ్యయనం చేసిన బీసీసీఐ కనీస ధరను నిర్ణయించినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ఒక్కో ఫ్రాంఛైజీ రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది. టెండర్ డాక్యుమెంట్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే కచ్చితంగా ఓ ఫ్రాంఛైజీకి ఎంతొస్తుందన్నదానిపై ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. వేలంలో బిడ్ గెలిచిన ఫ్రాంఛైజీ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలను అమ్మడం ద్వారా బీసీసీఐ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకూ రాబట్టాలని చూస్తోంది. -
IPL 2023: వచ్చే నెల 23న ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం కార్యక్రమానికి కేరళలోని కొచ్చి నగరం వేదిక కానుంది. డిసెంబర్ 23న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈసారి మెగా వేలం కాకుండా మినీ వేలం ఉంటుందని, ఈనెల 15వ తేదీలోపు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను కోరినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంతోపాటు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావించింది. చివరకు కొచ్చి నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. -
MS Dhoni: తమిళ, తెలుగు ప్రేక్షకుల కోసం ధోని! లేడీ సూపర్స్టార్ నయన్తోనే..
MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తమిళనాడుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు సారథిగా వ్యవహరిస్తున్న ధోనిని తలా అంటూ అక్కున చేర్చుకున్నారు తమిళ ప్రజలు. అందుకు ప్రతిఫలంగా క్రికెట్తో పాటు తమిళ ప్రేక్షకులకు సినిమాలతోనూ వినోదం అందించేందుకు సిద్ధమయ్యాడట ఈ జార్ఖండ్ డైనమైట్. తమిళం, తెలుగుతో పాటు.. ఇప్పటికే పలు వ్యాపారాల్లో రాణిస్తున్న ధోని.. తాజాగా ‘ధోని ఎంటరైన్మెంట్’ పేరిట సినీ నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు సమాచారం. ఈ కంపెనీ ద్వారా తమిళంలో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలోనూ చిత్రాలు ప్రొడ్యూస్ చేసేందుకు ధోని సిద్ధమయ్యాడని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లెట్స్సినిమా సహా క్రీడా విశేషాలు పంచుకునే ముఫద్దల్ వోహ్రా అనే ట్విటర్ యూజర్ ట్వీట్ల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సౌత్ ఆడియన్స్ లక్ష్యంగా.. కాగా ఇప్పటికే ధోని, ఆయన భార్య సాక్షి ఓ ప్రొడక్షన్ హౌజ్ స్థాపించిన విషయం తెలిసిందే. రోర్ ఆఫ్ ది లయన్(సీఎస్కేపై నిషేధం- రీఎంట్రీ నేపథ్యంలో), బ్లేజ్ టూ గ్లోరీ(2011 వరల్డ్కప్ నేపథ్యంగా డాక్యుమెంటరీ) తదితర చిన్న సినిమాలు నిర్మించారు. ఇప్పుడు సౌత్ సినిమాపై దృష్టి సారించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అంతేకాదు ధోని ఎంటరైన్మెంట్ వ్యవహారాలు చూసుకునేందుకు.. సూపర్స్టార్ రజనీకాంత్కు సన్నిహితుడైన ఓ వ్యక్తిని ధోని నియమించినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇక ఈ ప్రొడక్షన్ కంపెనీలో మొదటగా తీసే సినిమాలో లేడీ సూపర్స్టార్ నయనతార కీలక పాత్ర పోషించనున్నారంటూ గతంలోనూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే, వీటిలో ఎంతవరకు నిజం ఉందన్న విషయం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్కు సంబంధించిన స్పెషల్ వీడియో రూపకల్పనలో నయన్ భర్త విఘ్నేష్ శివన్.. ధోనితో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. కాగా నయన్- విఘ్నేష్ దంపతులు తాము కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. #LetsCinema EXCLUSIVE: Dhoni is launching his film production company in south ‘Dhoni Entertainment’ to produce films in Tamil, Telugu and Malayalam. pic.twitter.com/zgTxzdSynT — LetsCinema (@letscinema) October 9, 2022 MS Dhoni launching his film production company named 'Dhoni Entertainment' to produce films in Tamil, Telugu and Malayalam. — Mufaddal Vohra (@mufaddal_vohra) October 9, 2022 -
రైనా రిటైర్మెంట్పై స్పందించిన చెన్నై యాజమాన్యం
Suresh Raina Retirement: మిస్టర్ ఐపీఎల్, చిన్న తలా సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటనపై అతని తాజా మాజీ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్పందించింది. చరిత్ర మరువని విజయాలు సాధించినప్పుడు తమతో ఉన్నవాడు, ఆ విజయాలు సాధించేందుకు తోడ్పడిన వాడు చిన్న తలా..! థ్యాంక్యూ మిస్టర్ ఐపీఎల్ అంటూ రైనా ఫోటోను పోస్ట్ చేసి ట్విటర్లో భావోద్వేగ సందేశం పంపింది. సీఎస్కే సందేశంలో రైనాపై వారికున్న ఆప్యాయత స్పష్టంగా కనబడింది. ఆఖరి సీజన్లో వారు రైనాను కాదనుకున్నప్పటికీ అతనిపై ఇంత గౌరవం ఉండటాన్ని రైనా అభిమానులు మెచ్చుకుంటున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఎల్లో ఆర్మీతో, ఐపీఎల్తో బంధాన్ని తెంచుకోవడాన్ని చిన్న తలా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. The one who was there when glory was etched in history! The one who made it happen! Thank You for everything, Chinna Thala! 💛#Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/9Olro0z0Bn — Chennai Super Kings (@ChennaiIPL) September 6, 2022 కాగా, రైనాకు అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవమున్నా, ఐపీఎల్తోనే గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. రైనాకు చెన్నై జట్టుతో ఏర్పడిన విడదీయలేని బంధం అతన్ని మిస్టర్ ఐపీఎల్గా నిలబెట్టింది. 2020, 2022 సీజన్లు మినహాయించి రైనా ప్రతి ఐపీఎల్లో ఆడాడు. 2016, 17 సీజన్లలో సీఎస్కేపై నిషేధం ఉండటంతో గుజరాత్ లయన్స్కు ప్రాతినిధ్యం వహించిన అతను.. 11 సీజన్ల పాటు ఎల్లో ఆర్మీలో కొనసాగాడు. చెన్నై టైటిల్ గెలిచిన నాలుగు సార్లూ రైనా జట్టుతోనే ఉన్నాడు. ఐపీఎల్లో మొత్తం 205 మ్యాచ్లు ఆడిన రైనా సెంచరీ, 39 అర్ధసెంచరీల సాయంతో 5528 పరుగులు సాధించాడు. వయసు పైబడటంతో పాటు ఫామ్లో లేకపోవడంతో సీఎస్కే యాజమాన్యం రైనాను 2022 సీజన్కు ముందు రీటైన్ చేసుకోలేదు. ఇదే కారణం చేత ఆ తర్వాత జరిగిన మెగా వేలంలోనే కొనుగోలు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్ వీడాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ (సెప్టెంబర్ 6) భారత క్రికెట్తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. రైనా తీసుకున్న నిర్ణయంతో అతను ఐపీఎల్తో పాటు బీసీసీఐతో అనుబంధం ఉన్న ఏ ఇతర టోర్నీల్లోనూ పాల్గొన్నలేడు. వాస్తవానికి రైనా రెండేళ్ల క్రితమే ధోనీతో కలిసి ఒకే సారి (ఆగస్ట్ 15) అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. -
చెన్నై సూపర్ కింగ్స్కు సంబంధించి బిగ్ అప్డేట్.. కెప్టెన్ ఎవరంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్లో జట్టు కెప్టెన్ ఎవరనే విషయమై ఫ్రాంచైజీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. వచ్చే సీజన్లో కెప్టెన్గా ఎంఎస్ ధోనినే కొనసాగుతాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఆదివారం మరోసారి స్పష్టం చేశాడు. సీఎస్కేను నాలుగు సార్లు ఛాంపియన్గా నిలిపిన ధోనిపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతని సారధ్యంలోనే సీఎస్కే మరోసారి బరిలో నిలువనుందని కాశీ విశ్వనాథ్ వెల్లడించాడు. కాగా, 2022 ఐపీఎల్ సీజన్కు ముందు సీఎస్కే తొలిసారి కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. ధోని ఇష్టపూర్వకంగా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్సీ వరించింది. అయితే జడ్డూ కెప్టెన్సీ భారాన్ని హ్యాండిల్ చేయలేకపోవడంతో యాజమాన్యం తిరిగి ధోనినే జట్టు భారం మోయవలసిందిగా కోరింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధోని మరోసారి సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అప్పటికే గత సీజన్లో సీఎస్కేకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి మ్యాచ్ల్లో ధోని కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ.. సీఎస్కే తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, కెప్టెన్గా సీఎస్కే యాజమాన్యం ధోనినే ప్రకటించినప్పటికీ.. వయసు పైబడిన రిత్యా అతను లీగ్కు అందుబాటులో ఉంటాడో లేదో అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. గత రెండు సీజన్లుగా ఈ విషయమై ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంది. ధోనికి ఇష్టం లేకపోయిన బలవంతంగా అతనిపై కెప్టెన్సీ భారాన్ని మోపుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ధోని ఐదోసారి జట్టును ఛాంపియన్గా నిలిపి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్పుల్ కెప్టెన్గా కెరీర్ ముగించాలని భావిస్తున్నాడని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయమై ధోని క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: పాక్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. యువ పేసర్కు అనారోగ్యం -
IPL: కెప్టెన్పై వేటు.. స్పందించిన పంజాబ్ ఫ్రాంఛైజీ! ఇంతకీ ఏం చెప్పినట్టు?
తమ జట్టు కెప్టెన్సీ అంశంపై వ్యాప్తి చెందుతున్న వదంతులపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ స్పందించింది. ఈ విషయం గురించి కొన్ని స్పోర్ట్స్ వెబ్సైట్లలో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కెప్టెన్సీ విషయానికి సంబంధించి తమ ఫ్రాంఛైజీకి చెందిన ఏ ఒక్క అధికారి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ట్వీట్ చేసింది. కెప్టెన్గా.. బ్యాటర్గా విఫలం కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ను వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో కెప్టెన్గా మయాంక్ అగర్వాల్ను నియమించింది యాజమాన్యం. మయాంక్ సారథ్యంలో పంజాబ్ పద్నాలుగింట 7 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది. జట్టు పరిస్థితి ఇలా ఉంటే.. బ్యాటర్గానూ మయాంక్ అగర్వాల్ విఫలమయ్యాడు. ఆడిన 12 ఇన్నింగ్స్లో అతడు చేసిన పరుగులు మొత్తం 196. అత్యధిక స్కోరు 52. ఇదిలా ఉంటే.. శుభ్మన్ గిల్, పృథ్వీ షా వంటి యువ ఆటగాళ్లు సంప్రదాయ క్రికెట్లోనూ రాణిస్తున్న తరుణంలో టీమిండియాలోనూ మయాంక్కు చోటు కష్టంగానే మారింది. మా వాళ్లు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు! ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి మయాంక్ అగర్వాల్ను తొలగించబోతున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే విధంగా కోచింగ్ విషయంలో ట్రెవర్ బెయిలిస్తోనూ ఫ్రాంఛైజీ సంప్రదింపులు జరుపుతోందంటూ రూమర్లు వ్యాపించాయి. ఈ విషయంపై బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన పంజాబ్ యాజమాన్యం.. సదరు వార్తలు రాసిన సైట్ల తీరును విమర్శించింది. ‘‘గత కొన్ని రోజులుగా స్పోర్ట్స్ న్యూస్ వెబ్సైట్లలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్సీ విషయం గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం గురించి మా అధికారి ఎవరూ కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నాం’’ అని పేర్కొంది. అయితే, ఆ వార్తల్ని మాత్రం ఖండిస్తున్నట్లు పేర్కొనకపోవడంతో మయాంక్ అగర్వాల్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కెప్టెన్సీ ఉంటుందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. కాగా పంజాబ్ ఇంతవరకు ఒక్కసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. ఇక పంజాబ్ను వీడిన రాహుల్.. కొత్త లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఆరంభ సీజన్లోనే లక్నోను ప్లే ఆఫ్స్కు చేర్చి సత్తా చాటాడు. చదవండి: Mayank Agarwal: శతకంతో చెలరేగినా టీమిండియాలోకి రావడం కష్టమే! KL Rahul Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్ ఏంటంటే! News reports published by a certain sports News website pertaining to captaincy of the Punjab Kings franchise has been making the rounds in the last few days. We would like to state that no official of the team has issued any statement on the same. — Punjab Kings (@PunjabKingsIPL) August 24, 2022 -
కొత్త కోచ్గా రంజీ దిగ్గజం.. కేకేఆర్ దశ మారనుందా!
రెండుసార్లు ఐపీఎల్ విజేత అయిన కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) తమ కొత్త కోచ్గా దిగ్గజ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ను ఎంపిక చేసింది. ఈ మేరకు నైట్రైడర్స్ యాజమాన్యం బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటన చేసింది. కేకేఆర్ రెగ్యులర్ కోచ్గా ఉన్న బ్రెండన్ మెక్కల్లమ్.. ఈ ఏడాది ఇంగ్లండ్ హెడ్ కోచ్గా వెళ్లిపోవడంతో అప్పటినుంచి నిఖార్సైన కోచ్ గురించి వెతుకులాటలో ఉంది కేకేఆర్. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోపీలో మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ విజేతగా అవతరించడంలో కోచ్గా చంద్రకాంత్ పండిట్ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు రంజీ క్రికెట్లో అత్యంత సూపర్ సక్సెస్ కోచ్గా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుత తరుణంలో హెడ్కోచ్గా చంద్రకాంత్ పండిట్ సరైనవాడని కేకేఆర్ అభిప్రాయపడుతోంది. అందుకే చంద్రకాంత్ పండిట్ను ఏరికోరి కేకేఆర్ కోచ్గా తీసుకొచ్చింది. ఇదే విషయమై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. '' దేశవాలీ దిగ్గజ కోచ్ చంద్రకాంత్ కేకేఆర్ ఫ్యామిలీలోకి రావడం మమ్మల్ని ఉత్సాహపరిచింది. కోచ్ పాత్రలో మా జట్టును విజయవంతంగా నడిపించాలని.. జర్నీ సాఫీగా సాగిపోవాలని కోరకుంటున్నా. ఆట పట్ల అతనికున్న అంకితభావం, నిబద్ధత.. మరెవరికి లేదు. అందుకే దేశవాలి క్రికెట్లో దిగ్గజ కోచ్గా అవతరించాడు. మా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు విలువైన సలహాలు ఇస్తూ ఐపీఎల్ టైటిల్ అందించాలని కోరుతున్నా అంటూ తెలిపాడు. ఇక చంద్రకాంత్ పండిట్ టీమిండియా తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున చంద్రకాంత్ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్ కాలేకపోయిన చంద్రకాంత్ పండిట్ రంజీ కోచ్గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చంద్రకాంత్ రంజీ కోచ్గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మధ్యప్రదేశ్ను తొలిసారి రంజీ విజేతగా నిలిపి చంద్రకాంత్ దిగ్గజ కోచ్గా అవతరించాడు. ఇక గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో చాంపియన్గా నిలిచిన కేకేఆర్.. మరోసారి కప్ కొట్టడంలో విఫలమైంది. అయితే 2021లో ఇయాన్ మోర్గాన్ సారధ్యంలో ఫైనల్ చేరినప్పటికి.. సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్ చేరడంలో విఫలమైన కేకేఆర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 🚨 We have a new HEAD COACH! Welcome to the Knight Riders Family, Chandrakant Pandit 💜👏🏻 pic.twitter.com/Eofkz1zk6a — KolkataKnightRiders (@KKRiders) August 17, 2022 చదవండి: Ranji Trophy 2022 Final: కెప్టెన్గా సాధించలేనిది కోచ్ పాత్రలో.. అందుకే ఆ కన్నీళ్లు -
మహిళల ఐపీఎల్కు రంగం సిద్ధం
ముంబై: మహిళల క్రికెట్ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక అడుగు ముందుకు వేసింది. 2023లో సీజన్లో తొలిసారి మహిళల ఐపీఎల్ను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. గతంలోనూ పలుమార్లు మహిళల లీగ్ నిర్వహణకు సంబంధించి బోర్డు పెద్దలు ఎన్నో వ్యాఖ్యలు, ప్రకటనలు చేసినా వాస్తవానికి వచ్చేసరికి అవి అమల్లోకి రాలేదు. ఈసారి మాత్రం ఐపీఎల్ కోసం ‘ప్రత్యేక విండో’ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మహిళల దేశవాళీ మ్యాచ్ల షెడ్యూల్లో బోర్డు మార్పులు చేసింది. సాధారణంగా భారత్ మహిళల దేశవాళీ మ్యాచ్ల షెడ్యూల్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. అయితే తాజాగా ప్రకటించిన షెడ్యూల్లో దీనికి ఒక నెల రోజులు ముందుకు జరిపారు. 2022–23 సీజన్ అక్టోబర్ 11న ప్రారంభమై ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే మార్చి నెలలో పూర్తి స్థాయి ఐపీఎల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. టి20 చాలెంజ్ టోర్నీ తర్వాత... సాధారణ దేశవాళీ మ్యాచ్లకు భిన్నంగా లీగ్ రూపంలో 2018 నుంచి బీసీసీఐ ‘టి20 చాలెంజ్’ టోర్నీ నిర్వహిస్తోంది. మొదటి ఏడాది కేవలం రెండు జట్ల మధ్య ఒకే ఒక మ్యాచ్ జరగ్గా, ఆ తర్వాత దానిని మూడు జట్లకు పెంచారు. కరోనా కారణంగా 2021లో మినహా నాలుగుసార్లు నిర్వహించారు. ఇందులో విదేశీ క్రికెటర్లు కూడా భాగమయ్యారు. అయితే మరింత ఆకర్షణీయంగా మారుస్తూ పూర్తి స్థాయిలో ఐపీఎల్ తరహాలో లీగ్ జరపాలనే డిమాండ్ ఇటీవల చాలా పెరిగిపోయింది. టి20 ఫార్మాట్లో గత కొంత కాలంగా మన అమ్మాయిల మెరుగైన ప్రదర్శన కూడా అందుకు కారణం. కామన్వెల్త్ క్రీడల్లో మన జట్టు రజతం సాధించగా... బిగ్బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్లలో కూడా భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. గత మే నెలలో బోర్డు కార్యదర్శి జై షా చెప్పినదాని ప్రకారం లీగ్లో గరిష్టంగా ఆరు జట్ల వరకు ఉండే అవకాశం ఉంది. మహిళల టీమ్లను కూడా సొంతం చేసుకునేందుకు ప్రస్తుత ఐపీఎల్ టీమ్ల యాజమాన్యాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఫ్రాంచైజీల వరకు జట్లను కేటాయిస్తే మొదటి ప్రాధాన్యత ఐపీఎల్ టీమ్లకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం వచ్చే సెప్టెంబరులో జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకుంటారు. చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్పై కన్నేశారు -
ఇండియన్ ప్లేయర్లను ఫారిన్ లీగ్ల్లో ఆడనివ్వండి..!
భారత క్రికెటర్లు విదేశీ లీగ్ల్లో ఆడకపోవడం అనే అంశంపై లెజెండరీ వికెట్కీపర్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ స్పందించాడు. ఈ విషయంలో బీసీసీఐ కాస్త పట్టువీడాలని సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా భారత ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వారిని విదేశీ టీ20ల లీగ్ల్లో ఆడనివ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. భారత క్రికెటర్లు బిగ్బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫారిన్ లీగ్స్లో పాల్గొనడం వల్ల ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ పెరగడంతో పాటు బీసీసీఐకి విశ్వవ్యాప్త గుర్తింపు వస్తుందని అన్నాడు. భారత క్రికెటర్లు విదేశాల్లో (టీ20 లీగ్ల్లో) ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తే, అది క్రికెట్ వ్యాప్తికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు. విదేశీ లీగ్ల్లో భారత క్రికెటర్లు ఆడితే అద్భుతంగా ఉంటుందని, ఐపీఎల్ ఆరు సీజన్లు ఆడిన అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని తెలిపాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే టాప్ టీ20 లీగ్ అని, దాన్ని నడిపిస్తున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్కు పెద్దన్నయ్య లాంటిదని ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్పై ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆధిపత్యం ఎక్కువైందని సంచలన వ్యాఖ్యలు చేసిన మరునాడే గిల్లీ బీసీసీఐకి ఈ రకమైన సూచన చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: బిగ్బాష్ లీగ్ లో ఆడనున్న భారత ఆల్ రౌండర్..! -
ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్గా ఉండకూడదా? పుట్టుకతోనే సంపన్నుడిని.. నన్నే అంటారా?
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి క్రీడా, సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారాడు. సుస్మితను తన భాగస్వామి అని పేర్కొంటూ ఆయన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు లలిత్ మోదీపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్ఫ్రెండ్తో ఉన్నానంటూ ఫొటోలు షేర్ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో సుస్మితతో తన రిలేషన్షిప్పై స్పందించిన లలిత్ మోదీ ఆదివారం ట్విటర్ వేదికగా విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా తన భార్య మినాల్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డాడు. మధ్య యుగ కాలంలో ఉన్నామా? ఈ సందర్భంగా సుస్మితా సేన్, తన దివంగత భార్య మినాల్ మోదీ, కూతురు అలియా మోదీలతో పాటు నెల్సన్ మండేలా, దలైలామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి.. ఇతరులను కూడా వాళ్ల బతుకు వారిని బతకనివ్వండి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకుని వార్తలు రాయండి.. డొనాల్డ్ ట్రంప్ లాగా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకండి’’ అంటూ మీడియాపై కూడా విరుచుకుపడ్డాడు. ఇక తన భార్య మినాల్ మోదీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రియమైన నా భార్య, దివంగత మినాల్ మోదీ.. మా పెళ్లి కంటే 12 ఏళ్ల ముందు నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్.. అందరూ అనుకుంటున్నట్లుగా తను మా అమ్మ స్నేహితురాలు కాదు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు. మెదడు తక్కువ పనులు చేయొద్దు. ఎవరైనా ఓ వ్యక్తి తన దేశం కోసం.. లేదంటే వ్యక్తిగత జీవితంలో ఏదైనా సాధిస్తే ఎంజాయ్ చేయండి. మీ అందరి కంటే నేను బెటర్.. మీకంటే గొప్పగా తలెత్తుకుని తిరిగే అర్హత నాకుంది’’ అంటూ లలిత్ మోదీ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. అదే విధంగా తనను ఆర్థిక నేరగాడు అని పిలిస్తే పట్టించుకోనన్న లలిత్ మోదీ.. తాను డైమండ్స్పూన్తో పుట్టానని.. పుట్టుకతోనే సంపన్నుడినని పేర్కొన్నాడు. తన వల్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుట్టుకొచ్చిందని.. దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్నాడు. ఇక సుస్మిత సేన్తో మాల్దీవుల్లో లలిత్ ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అనడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాము ప్రేమలో ఉన్నామే తప్ప పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. కాగా సుస్మిత సైతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికపుడు తన అప్డేట్లు పంచుకుంటుందన్న సంగతి తెలిసిందే. చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్! చివరికి ఇలా! Too long to write so I put it on a picture slide. For those who don’t have instagram 🙏🏾 pic.twitter.com/v2sXCvyacn — Lalit Kumar Modi (@LalitKModi) July 17, 2022 View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
జై షా చెప్పిందే నిజమైంది.. ఐపీఎల్పై ఐసీసీ కీలక నిర్ణయం
ఐపీఎల్కు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పిందే అక్షరాల నిజమైంది. నివేదికల ప్రకారం.. ఐసీసీ 2023-27 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్టీపీ)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సింహ భాగాన్ని దక్కించుకుంది. తదుపరి ఎఫ్టీపీలో ఐపీఎల్ను రెండున్నర నెలల పాటు నిర్వహించుకునేందుకు ఐసీసీ పచ్చజెండా ఊపింది. ఐపీఎల్తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్లు కూడా ఎఫ్టీపీలో తమ బెర్తులను పొడిగించుకున్నాయి. ఈ మేరకు ఐసీసీ ఎఫ్టీపీని రూపొందిచినట్లు తెలుస్తోంది. తాజా సవరణలతో ఐపీఎల్ మార్చి చివరి వారంలో ప్రారంభమైన జూన్ మొదటి వారంలో (రెండున్నర నెలలు) ముగుస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లు ఎంటర్ కావడంతో మ్యాచ్ల సంఖ్య 60 నుంచి 74కు పొడిగించబడగా.. ఈ సంఖ్య 2023, 2024 సీజన్లలో ఆలాగే కొనసాగి.. 2025, 2026 ఎడిషన్లలో 84కు, 2027 సీజన్లో 94కు చేరుతుంది. ఐపీఎల్ విండో పొడిగించబడినప్పటికీ.. ఇప్పట్లో ఫ్రాంచైజీల సంఖ్య పెంచే ఆలోచన లేదని బీసీసీఐ తెలపడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, ఐసీసీ 2023-27 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాంలో ఐసీసీ విండో పొడిగింపుపై జై షా గత నెలలోనే ట్వీట్ చేశాడు. షా చెప్పినట్లుగానే ఐసీసీ తమ ఎఫ్టీపీలో ఐపీఎల్కు అగ్రతాంబూలం అందించింది. చదవండి: అందుకే బీసీసీఐ కోహ్లిని తప్పించే సాహసం చేయలేకపోతుంది..! -
తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్.. ఇప్పుడు ఇలా!
Lalit Modi Love Story With Minal: లలిత్ కుమార్ మోదీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి క్యాష్ రిచ్ లీగ్ను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్లు ఉన్నా ఐపీఎల్ విజయవంతం కావడంలో లలిత్ మోదీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన లలిత్ మోదీ.. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించడం విశేషం. అయితే, ఎంత వేగంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నాడో అదే తరహాలో పాతాళానికి దిగజారిపోయాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్లో తలదాచుకుంటున్నాడు. మాజీ విశ్వసుందరితో ప్రేమాయణం! ఇక ఇన్నాళ్లూ పెద్దగా లైమ్లైట్లో లేని 58 ఏళ్ల లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్తో డేటింగ్ అంటూ ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అంటూ చర్చకు తెరలేపాడు. PC: lalit modi Instagram ఈ క్రమంలో వీళ్లిద్దరి పెళ్లి అయి పోయిందని నెటిజన్లు ఫిక్సైపోగా అలాంటిదేమీ లేదని సుస్మిత, లలిత్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నామని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా 46 ఏళ్ల సుస్మితాసేన్ ఇప్పటికే ఎంతో మందితో డేటింగ్ చేసింది. సుస్మిత రూటు సెపరేటు! స్థాయి.. వయసుతో సంబంధం లేకుండా తన కంటే చిన్నవాళ్లూ, పెద్దవాళ్లతోనూ ప్రణయ బంధం కొనసాగించింది సుస్మిత. కానీ ఎవ్వరికీ తనను వివాహం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛాయుత జీవనం గడపడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం లలిత్తో ప్రేమ వ్యవహారం కూడా అలాంటిదేనా.. లేదంటే పెళ్లిదాకా వెళ్తారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. PC: lalit modi Instagram కాగా సుస్మిత ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇక లలిత్తో సుస్మిత పరిచయం ఈనాటిది కాదు. లలిత్ మోదీ దివంగత భార్య మినాల్ మోదీకి కూడా ఆమె ఫ్రెండ్ కావడం విశేషం. వీళ్లు ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించేవారట. ఇంతకీ మినాల్ ఎవరు? మినాల్ సంగ్రాణి నైజీరియాకు చెందిన సింధీ హిందూ వ్యాపారవేత్త పెసూ అస్వాని కుమార్తె. లలిత్ మోదీతో స్నేహానికి కంటే ముందే ఆమెకు వివాహమైంది. వ్యాపారవేత్త జాక్ సాంగ్రాణిని ఆమె పెళ్లాడింది. వారికి కూతురు సంతానం. అయితే, జాక్ ఓ స్కామ్లో ఇరుక్కోవడంతో జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. PC: lalit modi Instagram లలిత్ కంటే తొమ్మిదేళ్లు పెద్ద! భర్తకు విడాకులిచ్చిన మినాల్తో ప్రేమలో పడ్డ లలిత్ మోదీ ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అయితే, మోదీ కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. ఆమె డివోర్సీ కావడం ఒక అభ్యంతరమైతే.. లలిత్ కంటే మినాల్ వయసులో దాదాపు తొమ్మిదేళ్లు పెద్దది కావడం మరో కారణం. కుటుంబాన్ని ఎదిరించి! అయినా, అతడు ఆమె చేయిని వీడలేదు. కుటుంబంతో విభేదించాడు. 1991లో మినాల్ను పెళ్లిచేసుకున్నాడు. దీంతో తన ఫ్యామిలీకి దూరమయ్యాడు. తమను అందరూ దూరం పెట్టడంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే లలిత్- మినాల్లకు ఇద్దరు సంతానం. PC: lalit modi Instagram కొడుకు రుచిర్, కూతురు అలియా ఉంది. వీరితో పాటు మినాల్ మొదటి కూతురు కరిమా సంగ్రాణిని కూడా చేరదీశాడని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాన్సర్ బారిన పడ్డ మినాల్ ఆఖరి వరకు వ్యాధితో పోరాడి 64 ఏళ్ల వయస్సులో 2018లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ సుస్మితతో ప్రేమాయణంతో అటు క్రీడా, ఇటు సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారాడు. చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్ను వణికించారు! వరుస సెంచరీలతో.. Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్సెట్ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే.. -
BBL 2022-23: మరో మహా సంగ్రామం ఎప్పటి నుంచి అంటే..?
Big Bash League 2022-23: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సక్సెస్ అయిన మరో క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహా సంగ్రామానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. 2022-23 సీజన్ పురుషుల వెర్షన్ ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి ప్రారంభంకానుండగా.. మహిళల బీబీఎల్ అంతకంటే రెండు నెలల ముందు అక్టోబర్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. Our heroes are returning home! For the first time in three years, every Club is playing at home and we couldn't be more pumped 🤩 Full #WBBL08 schedule deets: https://t.co/oUaicm0FOH pic.twitter.com/oXPyYwRr71 — Weber Women's Big Bash League (@WBBL) July 6, 2022 సిడ్నీ థండర్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్తో పురుషుల బీబీఎల్ మొదలుకానుండగా.. బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్ మధ్య మ్యాచ్తో మహిళల టోర్నీ ప్రారంభంకానుంది. మహిళల టోర్నీ అక్టోబర్ 13న మొదలై నవంబర్ 27 వరకు జరుగనుండగా.. పురుషుల లీగ్ డిసెంబర్ 13 నుంచి వచ్చే ఏడాది (2023) జనవరి 25 వరకు జరుగుతుంది. ఈ రెండు లీగ్లకు సంబంధించిన ఫిక్షర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.. 🗓 #BBL12 SCHEDULE 🗓 The 12th instalment of the Big Bash is coming your way this summer! pic.twitter.com/npDQAd7U7c — KFC Big Bash League (@BBL) July 14, 2022 చదవండి: BBL: మరోసారి రెనెగేడ్స్తో జట్టు కట్టిన భారత కెప్టెన్! -
పొలమే గ్రౌండ్, కూలీలే క్రికెటర్లు.. గుజరాత్లో బయటపడ్డ ఫేక్ ఐపీఎల్ బండారం
గ్రౌండ్లో ఐపీఎల్ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఓ వైపు బ్యాట్స్మన్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. మరో వైపు బౌలర్లు వికెట్లు పడగొట్టేస్తున్నారు.. లైవ్లో ప్రేక్షకులు ఊపిరిబిగపట్టుకుని చూస్తున్నారు. అటు మ్యాచ్లో ఏ ఓవర్లో ఎన్ని రన్స్ రావొచ్చన్న దాని నుంచి ఫోర్లు, సిక్సర్లు, ఔట్లు, ఎవరెంత స్కోర్ చేస్తారనే దాకా బెట్టింగ్ల మీద బెట్టింగ్లు సాగుతున్నాయి. క్రికెట్ అన్నాక ఇదంతా కామనే అంటారు కదా.. ఇందులో చివరన చెప్పిన బెట్టింగులు మాత్రమే నిజం. మిగతా అంతా ఉత్త ఫేక్! విదేశీయులతో బెట్టింగ్లు కాయించి డబ్బులు దండుకోవడానికి ఓ ముఠా ఏకంగా ఫేక్ ఐపీఎల్నే నడిపించింది. ఇటీవలే గుజరాత్ పోలీసులు ఈ ఫేక్ ఐపీఎల్ మ్యాచులు, బెట్టింగ్ దందాను బయటపెట్టారు. అచ్చం ఐపీఎల్ మ్యాచ్లను తలపించేలా.. కొందరు గుజరాత్లోని మెహ్సానా పట్టణానికి కాస్త దూరంలోని మోలిపూర్ గ్రామంలో శ్మశానం పక్కన ఓ పొలాన్ని నెలవారీ అద్దెకు తీసుకున్నారు. దాన్ని చదును చేసి.. మధ్యలో పిచ్ను, ఇతర గుర్తులను సిద్ధం చేసి ఓ క్రికెట్ గ్రౌండ్లా మార్చారు. స్థానికంగా ఉన్న 25 మంది రైతులు, కూలీలకు రోజుకు రూ. నాలుగైదు వందలు ఇస్తామని చెప్పి క్రికెట్ ఆటగాళ్లుగా పెట్టుకున్నారు. అచ్చం ఐపీఎల్ టోర్నీలో వివిధ జట్లను పోలిన డ్రెస్లను వేయించి.. ఆయా జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతున్న ట్టుగా హడావుడి చేశారు. అంపైర్లను పెట్టి, వారికి వాకీటాకీలు ఇచ్చి.. నిజమైన మ్యాచ్ను తలపించేలా చేశారు. దీనంతటినీ అధునాతన కెమెరాలతో చిత్రీకరిస్తూ.. ‘ఐపీఎల్’ పేరిట క్రియేట్ చేసిన యూట్యూబ్లో చానల్లో లైవ్ ప్రసారం చేశారు. నిజమైన మ్యాచ్ల తరహాలో స్కోర్, బాల్స్, ఇతర గ్రాఫిక్స్ను పెట్టి.. నిజంగానే ఏదో పెద్ద ఆటగాళ్ల లైవ్ మ్యాచ్ అనిపించేలా జాగ్రత్త తీసుకున్నారు. ప్రేక్షకుల గోల, ఈలలు, చప్పట్లు వినిపించేలా సౌండ్ను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని లైవ్కు యాడ్ చేశారు. ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్ ‘హర్ష భోగ్లే’ వాయిస్ను పోలినట్టుగా ఓ వ్యక్తితో కామెంట్ కూడా చెప్పించారు. ఇదంతా ఎందుకోసం..? ముందే చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లు, ఆటగాళ్లు అంతా ఫేక్ అయినా.. ఇదంతా చేసింది మాత్రం బెట్టింగ్ కోసం. మన దేశం వాళ్లయితే ఆటగాళ్లను, మ్యాచ్ను ఇట్టే గుర్తుపట్టేస్తారు కాబట్టి.. రష్యాలో బెట్టింగ్లు నిర్వహించారు. దీనికి ప్లాన్ వేసింది కూడా రష్యాలోని పబ్లు, బార్లలో బెట్టింగ్లు నిర్వహించే ఆసిఫ్ మొహమ్మద్ అనే వ్యక్తి, ఆ పబ్లలో పనిచేసి తిరిగి వచ్చిన షోయబ్ దావ్డా అనే గుజరాతీ వ్యక్తి. వాళ్లు ఇక్కడ ఫేక్ ఐపీఎల్ నిర్వహిస్తూ.. నిజమైన మ్యాచ్ల్లా కలరింగ్ ఇస్తూ పందాలు కాశారు. వచ్చిన బెట్టింగ్లకు అనుగుణంగా.. మ్యాచ్లో ఫోర్లు, సిక్సర్లు కొట్టిస్తూ.. ఔట్ చేయిస్తూ.. కావాల్సిన టీమ్ను గెలిపించుకుంటూ.. డబ్బులు దండుకున్నారు. చిత్రమేంటంటే మొత్తం ఉన్నది 25 మందే. కానీ చాలా టీమ్లు ఆడినట్టుగా... వారికే వేర్వేరు టీమ్ల డ్రెస్లు వేయిస్తూ, మార్చుతూ ఆడుతున్నట్టుగా నటింపజేశారు. ఎలా బయటపడింది? తమ ఊరిలో పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లు జరుగుతు న్నాయని మోలిపూర్ వాసులు చర్చించుకోవడం.. ఆ నోటా ఈ నోటా ఈ విషయం మెహ్సానా పోలీసులకు చేరడం జరిగిపోయింది. ఓ పల్లెటూరిలో, అదీ తమకు తెలియకుండా మ్యాచ్లు ఏమిటని పోలీసులు ఆరా తీయడంతో.. ఫేక్ ఐపీఎల్, బెట్టింగ్ దందా గుట్టు బయటపడింది. ఈ వ్యవహారంలో పోలీసులు షోయబ్ దావ్డా సహా నలుగురిని అరెస్టు చేసి కేసు పెట్టారు. ఇంతా చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్న క్రికెట్ కిట్లు, జనరేటర్లు, ఐదు వీడియో కెమెరాలు, లైట్లు, టీవీలు, ల్యాప్టాప్లు, మైక్రోఫోన్లు, వాకీటాకీలన్నీ కలిపి విలువ అంతా నాలుగు లక్షలలోపే కావడం గమనార్హం. -
ఆ ఐపీఎల్లో ఆటగాళ్ల రెమ్యునరేషన్ రూ. 400 మాత్రమే..!
ఐపీఎల్ పేరిట నకిలీ మ్యాచ్లు నిర్వహిస్తూ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు గుజరాత్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని మెహ్సాన జిల్లా మోలిపూర్ గ్రామంలోని ఓ ముఠా ఐపీఎల్ పేరిట ఫేక్ మ్యాచ్లు నిర్వహిస్తూ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. సాంకేతికత ద్వారా అచ్చం ఐపీఎల్ మ్యాచ్ల్లా చిత్రీకరించిన ఈ మ్యాచ్ల ద్వారా సదరు ముఠా రష్యాలోని బెట్టింగ్ రాయుళ్లకు గాలం వేస్తోంది. ఈ ఫేక్ ఐపీఎల్లో వ్యవసాయ కూలీలే ఆటగాళ్లు. ఒక్కో మ్యాచ్లో ఆటగాడిగా నటించినందుకు గాను వీరికి లభించే రెమ్యునరేషన్ రూ.400. వీరు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జెర్సీలు ధరించి నిజమైన ఆటగాళ్లలా బిల్డప్ ఇస్తుంటారు. ఈ మ్యాచ్లకు అంపైర్లుగా వ్యవహరించే వారు బొమ్మ వాకీ టాకీలు పట్టుకుని నిజమైన అంపైర్ల కంటే ఎక్కువ ఫోజులు కొడుతుంటారు. హర్ష భోగ్లే స్వరాన్ని ఇమిటేట్ చేస్తూ కామెంటరీ చేయడం ఈ ఫేక్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్. ఈ మ్యాచ్లను హెచ్డీ కెమెరాలతో రికార్డు చేసి ఐపీఎల్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తుంటారు. ఈ నకిలీ ఐపీఎల్ ఇప్పటికే క్వార్టర్ ఫైనల్కు చేరుకోవడం మరో విశేషం. రష్యాలోని త్వెర్, వోరోనెజ్, మాస్కో తదితర ప్రాంతాల నుంచి పంటర్లు (పందెం కాసేవాళ్లు) బెట్టింగ్లు పాల్పడుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయంశంగా మారింది. నిజమైన ఐపీఎల్ను తలపించే ఈ ఫేక్ ఐపీఎల్ గురించి తెలిసి క్రికెట్ ఫాలోవర్స్ నివ్వెరపోతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫేక్ ఐపీఎల్ నిర్వహణకు సూత్రధారి షోయబ్ దవ్దా రష్యాలోని ప్రముఖ బెట్టింగ్ కేంద్రంలో గతంలో పని చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: వరల్డ్ ఎలెవెన్తో టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే..? -
ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఇకపై రెండున్నర నెలలు క్రికెట్ పండుగ
IPL: ఐపీఎల్ ఫ్యాన్స్కు బీసీసీఐ సెక్రెటరీ జై షా శుభవార్త తెలిపాడు. రానున్న సీజన్ల నుంచి ఐపీఎల్ పండుగను రెండున్నర నెలలకు పెంచబోతున్నట్లు స్పష్టం చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ను 10 వారాల పాటు నిర్వహించేందుకు ఐసీసీ కూడా అంగీకరించిందని వెల్లడించాడు. మంగళవారం ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన షా.. రానున్న సీజన్లలో క్రికెట్ పండుగ కాలవ్యవధి మరింత పెరుగనుందని కన్ఫర్మ్ చేశాడు. అయితే కొత్త ఫ్రాంచైజీలను ఇప్పట్లో తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని, ఉన్న జట్లతోనే మ్యాచ్ల సంఖ్యను, ఆటగాళ్ల సంఖ్యను మరింత పెంచదలచుకున్నామని వివరించాడు. 2024-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్పై చర్చించేందుకు ఐసీసీ వచ్చే వారం సమావేశం కానుందని, ఈ సమావేశాల్లో ఐపీఎల్ విండోపై పూర్తి క్లారిటీ వస్తుందని పేర్కొన్నాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీల సంఖ్య ఎనిమిది నుంచి పదికి పెరగడంతో క్యాష్ రిచ్ లీగ్ రెండు నెలల పాటు సాగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022లో మ్యాచ్ల సంఖ్య 74కు పెరగగా.. రానున్న సీజన్లలో ఈ సంఖ్య 94కు పెరిగే అవకాశం ఉంది. చదవండి: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్ -
గంగూలీ పిలిచినా వెళ్లలేదు.. ఐపీఎల్ నేపథ్యంలో పీసీబీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు చూసేందుకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ గతంలో తనను రెండుసార్లు (2021, 2022) ఆహ్వానించాడని, అయినా తాను గంగూలీ ఆహ్వానాన్ని తిరస్కరించానని పేర్కొన్నాడు. ఐపీఎల్ మీడియా హక్కులు భారీ మొత్తంలో అమ్ముడుపోయిన అంశంపై పాక్ మీడియా అడిగిన ప్రశ్నల సందర్భంగా రమీజ్ ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా రమీజ్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు బీసీసీఐ బాస్ తనను ఆహ్వానించాడని, అయినా తాను వెళ్లలేకపోయానని అన్నాడు. గంగూలీ నుంచి ఆహ్వానం అందాక వెళ్లాలా..? వద్దా..? అని చాలా రోజుల పాటు ఆలోచించానని, ఒకవేళ ఐపీఎల్ ఫైనల్స్ను వీక్షించేందుకు తాను వెళ్లుంటే పాక్ అభిమానులు నన్ను ఎప్పటికీ క్షమించేవారు కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ల మైత్రిపరమైన సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్కు వెళ్లే సాహసం చేయలేకపోయానని వ్యాఖ్యానించాడు. క్రికెట్ను ఓ క్రీడలా చూస్తే తాను గంగూలీ ఆహ్వానం మేరకు వెళ్లాల్సిందని, అయితే దాయది దేశాల్లో ఆ పరిస్థితులు లేవని తెలిపాడు. ఇదే సందర్భంగా రమీజ్ పీసీబీ ప్రతిపాదించిన నాలుగు దేశాల (భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) టీ20 సిరీస్పై కూడా స్పందించాడు. పీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడాన్ని ఆయన తప్పుబట్టాడు. నాలుగు దేశాల టీ20 సిరీస్పై గంగూలీతో డిస్కస్ చేశానని అన్నాడు. ఈ సిరీస్ సాధ్యాసాధ్యలపై దాదా త్వరలో ఓ ప్రకటన చేస్తానని హామీ ఇచ్చాడని తెలిపాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్లు అదృష్టవంతులు.. కానీ పాక్లో అలా కాదు! అయినా! -
'ఐపీఎల్ అంటేనే బిజినెస్'.. విషం చిమ్మిన పాక్ మాజీ క్రికెటర్
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అన్ని క్రికెట్ లీగ్ల్లోకెళ్లా అత్యధిక సంపాదన అర్జిస్తుంది. దీనికి అనుబంధగా ఉన్న బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా ఏటా కాసుల పంట కురుస్తుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మీడియా రైట్స్ ఈ వేలం బోర్డుకు కనివినీ ఎరుగని రీతిలో కనకవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 2023-2027 మధ్య ఐదేళ్ల కాలానికి గానూ రూ.48, 390 కోట్ల రికార్డు ధరకు ఐపీఎల్ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం. ఈ వేలం ప్రక్రియలో డిస్సీ స్టార్ రూ.23,575 కోట్లు వెచ్చించి ఐపిఎల్ టీవీ హక్కులు సొంతం చేసుకోగా.. ముఖేష్ అంబానికి చెందిన వయాకామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్ రూ. 24,815 కోట్లకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్నాయి. దీంతో ప్రపంచంలో ఐపీఎల్ ప్రస్తుతం బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్గా అవతరించింది. అంతేకాదు అంతర్జాతీయంగా నేషనల్ ఫుట్బాల్ లీగ్(యూఎస్ఏ), నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్(యూఎస్ఏ), ఇంగ్లీష్ ప్రమీయర్ లీగ్(ఇంగ్లండ్) సరసన ఐపీఎల్ కూడా చోటు దక్కించుకుంది. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ విలువ ధర కూడా భారీగా పెరిగిపోయింది. గతంలో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54.5 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.114 కోట్లకు చేరుకోవడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంపాదన కలిగిన లీగ్గా ఐపీఎల్ దూసుకెళ్తుంటే కొంతమంది మాత్రం పనిగట్టుకొని విషం చిమ్ముతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఐపీఎల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ అంతా బిజినెస్ అని.. ఎవరి స్వలాభం వారు చూసుకుంటున్నారని తెలిపాడు. లతీఫ్ మాట్లాడుతూ..''ఐపీఎల్ గురించి మాట్లాడితే క్రికెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐపీఎల్ అంతా బిజినెస్. ఎవరి స్వలాభం వారు చూసుకుంటున్నారు..డబ్బులే ముఖ్యమనుకుంటే అదే దారిలో చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.. వారిని కూడా జత చేసుకోండి. ఐపీఎల్లో బిజినెస్ ఎక్కువయ్యి క్వాలిటి తగ్గిపోయింది. అంతా కమర్షియల్ అయిపోవడంతో ప్రస్తుతం ఐపీఎల్ చూసేవారి సంఖ్య తగ్గిపోతుంది.ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఒక భారతీయుడిని పిలిచి మీరు ఎన్ని గంటలు మ్యాచ్ చూస్తున్నారని అడగండి.. సమాధానం మీకే తెలుస్తుంది. అందుకే అంటాను ఐపీఎల్ ఒక బిజినెస్ అని.. నా మాటకు కట్టుబడి ఉంటా'' అంటూ పేర్కొన్నాడు. -
ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్ప అన్న వారు ఈ లెక్కలు చూస్తే ఖంగుతినాల్సిందే..!
IPL VS PSL: ఇటీవలి కాలంలో పాకిస్థాన్కు చెందిన కొందరు క్రికెటర్లు తమ దేశంలో జరిగే పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కంటే తోపు అని జెబ్బలు చరుచుకున్న విషయం విధితమే. అయితే వారు వాపును చూసి బలుపు అన్న భ్రమలో ఉన్నారని తాజాగా జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బహిర్గతమైంది. 2023-27 సీజన్కు గాను ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ కనీవినీ ఎరుగని రీతిలో రూ. 48,390 కోట్లు అర్జించడంతో క్యాష్ రిచ్ లీగ్పై అవాక్కులు చవాక్కులు పేలిన పాక్ ప్రస్తుత, మాజీలు ముక్కున వేలేసుకున్నారు. ఈ స్థాయిలో ఐపీఎల్ మీడియా హక్కులు అమ్ముడుపోవడంతో వారంతా నీళ్లునములుతున్నారు. ఐపీఎల్ మీడియా హక్కులు ఈ రేంజ్లో అమ్ముడుపోవడంతో చేసేదేమీలేక ఐసీసీకి చాడీలు చెప్పడం ద్వారా తమ అక్కసుకు వెళ్లగక్కుతున్నారు. ఐపీఎల్ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతమైన స్పోర్ట్స్ లీగ్గా అవతరించడాన్ని ఆ దేశ అభిమానులతో పాటు అక్కడి రాజకీయ నాయకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ వర్సెస్ పీఎస్ఎల్.. ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కులు రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోగా.. 2022-2023 సీజన్కు గాను పీఎస్ఎల్ మీడియా హక్కులు కేవలం రూ. 166 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయాయి. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 118 కోట్లు (టీవీ, డిజిటల్, ఇతర రైట్స్ అన్నీ కలిపి) ఉండగా.. పీఎస్ఎల్లో కేవలం రూ. 2.76 కోట్లు మాత్రమే. ఐపీఎల్లో ఒక్కో ఓవర్ విలువ రూ. 2.95 కోట్లు కానుండగా.. పీఎస్ఎల్లో మ్యాచ్ మొత్తం విలువ మన ఒక్క ఓవర్ విలువ కంటే తక్కువే. ఐపీఎల్లో రాబోయే సీజన్ల నుంచి ఒక్కో బాల్ విలువ దాదాపు రూ. 50 లక్షలుగా ఉంటే.. పీఎస్ఎల్లో వేసే ఒక్కో బంతి విలువ లక్ష కంటే తక్కువగా ఉంది. పీఎస్ఎల్ మొత్తం మీడియా హక్కుల విలువ (రూ. 166 కోట్లు) ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ విలువతో (రూ. 118 కోట్లు) పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పీఎస్ఎల్ కంటే 50 రెట్లు అధికంగా ఉంది. 2017-2022 సీజన్కు గాను ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 16,347.50 కోట్లుకు అమ్ముడుపోగా.. 2023-27 సీజన్కు ఈ లెక్క దాదాపు మూడింతలవ్వడం విశేషం. చదవండి: IPL 2023: కోట్లు ఇచ్చారు... కోట్లు తెచ్చుకునేదెలా? -
ముగిసిన ఐపీఎల్ వేలం.. 'స్టార్' చేతికి టీవీ ప్రసార హక్కులు
గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మంగళవారంతో ముగిసింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్వర్క్తో రసవత్తరంగా సాగిన పోటీలో స్టార్ నెట్వర్క్ పైచేయి సాధించింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకు టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ చెందిన ‘వయాకామ్–18’, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకోగా.. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ మరోసారి చేజిక్కించుకుంది. 2018-22 సీజన్లో స్టార్ నెట్వర్క్ తొలిసారి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను దక్కించుకుంది. మొత్తంగా ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి 48,390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జరిగిన బిడ్డింగ్లో వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమెజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడగా స్టార్ నెట్వర్క్ భారీ మొత్తం చెల్లించి మీడియా హక్కులను సొంతం చేసుకుంది. చదవండి: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు కొట్టిన ఐపీఎల్ -
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు కొట్టిన ఐపీఎల్
క్రీడా ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సంచలనాలకు కేంద్ర బింధువుగా మారింది. 15 ఏళ్ల కాలంలో ప్రపంచంలో మేటి లీగ్లకు ధీటుగా నిలిచి అత్యంత ప్రజాధరణ పొందిన లీగ్గా అవతరించిన క్యాష్ రిచ్ లీగ్.. తాజాగా మీడియా హక్కుల పరంగా మరో రికార్డును బద్దలు కొట్టింది. విశ్వవ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ కలిగిన ప్రముఖ ఫుట్బాల్ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను వెనక్కునెట్టిన ఐపీఎల్.. విలువ పరంగా ప్రపంచంలో టాప్-2 లీగ్గా నిలిచింది. ఒక్కో మ్యాచ్ విలువ విషయంలో ఐపీఎల్ ఈపీఎల్ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది. ఈపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు (11 యూఎస్ మిలియన్ డాలర్లు) కాగా, ఐపీఎల్లో అది రూ. 107.5 కోట్లకు (13.4 యూఎస్ మిలియన్ డాలర్లు) చేరుకుంది. గతంలో ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉండేది. తాజాగా జరిగిన మీడియా హక్కుల వేలం ద్వారా ఐపీఎల్ విలువ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. టీవీ ప్రసారాలు (రూ. 57.5 కోట్లు), డిజిటల్ (రూ. 50 కోట్లు) హక్కుల ద్వారా ఐపీఎల్ ఒక్కో మ్యాచ్ విలువ రూ. 107.5 కోట్లకు చేరింది. ప్రస్తుతం మ్యాచ్ విలువ పరంగా అమెరికన్ ఫుట్బాల్ లీగ్ అయిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) ఐపీఎల్ కంటే ముందుంది. ఎన్ఎఫ్ఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 133 కోట్లు (17 యూఎస్ మిలియన్ డాలర్లు)గా ఉంది. ఇదిలా ఉంటే, గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ ఖజానాలో రూ. 44,075 కోట్లు చేరాయి. లీగ్ ప్రసారహక్కుల కోసం నాలుగు ప్యాకేజీలు ప్రకటిస్తే రెండు ప్యాకేజీలకే (ఏ, బీ) ఇప్పటి వరకు ఇంత ఆదాయం సమకూరింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్కు సంబంధించి టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ (రూ.23,575 కోట్లు) దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.23,773 కోట్లకు సొంతం చేసుకుంది. చదవండి: IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, వయాకామ్–18..! -
రికార్డులు బద్దలు కొడుతున్న ఐపీఎల్ మీడియా రైట్స్..
ఐపీఎల్ మీడియా హక్కులకు సంబంధించిన ఈ-వేలం జోరుగా సాగుతుంది. 2023-2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ముంబై లో ఇ-వేల ప్రారంభమైంది. నాలుగు ప్యాకేజీలుగా విభజించి వేలాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ ఇప్పటికే రూ. 40 వేల కోట్లు దాటిందని తెలుస్తున్నది. ముందుగా ఉపఖండంలో టీవీ హక్కులు.. ఆ తర్వాత డిజిటల్ హక్కుల విభాగాలకు వేర్వేరుగా వేలం నిర్వహిస్తున్నారు. టీవీ ప్రసారం హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీవీ ప్రసార హక్కుల వేలం రూ. 24 వేల కోట్లు చేరిందని.. డిజిటల్ హక్కులు రూ. 19 వేల కోట్లు దాటాయని తెలుస్తున్నది. మొత్తానికి ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కుల విలువ రూ. 43 వేల కోట్లు దాటిందని సమాచారం. ఈ అంకె ప్రతి అరగంటకూ పెరుగుతున్నది. ఈ-వేలం సోమవారం కూడా కొనసాగనుంది. దీనిని బట్టి చూస్తే బీసీసీఐ పెట్టుకున్న టార్గెట్ (రూ. 50వేల కోట్లు) చేరుకోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్ లు పోటీలో ఉన్నాయి. 2017-2022 కాలానికి గాను (డిస్నీ స్టార్) మీడియా హక్కుల ప్రారంభ ధర రూ. 16 వేల కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా డబుల్ (రూ. 32 వేల కోట్లు) అయింది. పోటీ నుంచి అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తప్పుకున్నా పోటీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే బీసీసీఐ.. రూ. 60 వేల కోట్లు అర్జించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చదవండి: ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్ రిప్లై Bidding for IPL TV, digital rights goes past Rs 42,000 cr Read @ANI Story | https://t.co/Ah5MWfeuKv#IPL #IPLMediaRights #BCCI pic.twitter.com/z87ATGtUiX — ANI Digital (@ani_digital) June 12, 2022 -
IPL: అమెజాన్ అవుట్
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే... మరోకటి జరిగింది. ఈ రేసు నుంచి ఓటీటీ సంస్థ అమెజాన్ తప్పుకుంది. దీంతో రిలయన్స్కు చెందిన ‘వయాకామ్ 18’ మిగతా మూడు సంస్థలతో రేసులో నిలిచింది. అమెజాన్ సహా డిస్నీ స్టార్, వయాకామ్–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వైదొలగడంతో ఇప్పుడు టీవీ, డిజిటల్ హక్కుల పోటీ ప్రధానంగా నాలుగు సంస్థల మధ్యే నెలకొనే అవకాశముంది. నిజానికి అపర కుబేరుడికి చెందిన అమెజాన్ పోటీలో ఉన్నంతసేపూ ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా రూ. 70 వేల కోట్ల మొత్తం రావొచ్చని బ్రాడ్కాస్టింగ్ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశముంది. ‘అవును అమెజాన్ ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల ప్రక్రియ నుంచి వైదొలగింది. బిడ్ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ శుక్రవారం కీలకమైన సాంకేతిక బిడ్డింగ్లో వాటిని దరఖాస్తు చేయలేదు. గూగుల్కు చెందిన యుట్యూబ్ వాళ్లు కూడా డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. కానీ వారు కూడా దరఖాస్తు సమర్పించలేదు. అయితే నాలుగు ప్రధాన టెలివిజన్, స్ట్రీమింగ్కు చెందిన మొత్తం 10 సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే ఇ–వేలం రెండు రోజులపాటు జరిగే అవకాశ ముంది.’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిజమా... రూ. 45 వేల కోట్లా? అమెజాన్ వైదొలగినప్పటికీ... పోటీలో ఉన్న సంస్థలన్నీ పెద్ద మొత్తం చెల్లించేందుకు సై అంటున్నాయి. ఐదారేళ్ల క్రితంతో పోల్చుకుంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఇప్పుడు అందరి ‘అరచేతి’ లో ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్ ప్రారంభ ధరే రూ. 32 వేల కోట్లు ఖాయమంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇదే జరిగితే పోటాపోటీలో అక్షరాలా 45 వేల కోట్ల రూపాయాలు ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రావొచ్చని అంచనా. అంటే గత మొత్తం రూ. 16,347.50 కోట్లకు రెండున్నర రెట్లు అధిక మొత్తం ఈసారి గ్యారంటీ! ఇ–వేలం సంగతేంటి? బీసీసీఐ టెండర్ల ప్రక్రియతో గత హక్కు లు కట్టబెట్టింది. ఇప్పుడు ఇ–ఆక్షన్ (ఎలక్ట్రానిక్ వేలం) నిర్వహించనుంది. ఆదివారం మొదలయ్యే ఈ ఇ–ఆక్షన్లో పోటీదారులంతా ఆన్లైన్ పోర్టల్లో బిడ్లు వేస్తారు. స్క్రీన్లో ఎక్కువ మొత్తం పెరుగుతున్న కొద్దీ పోటీలో ఉన్న సంస్థలు తప్పుకుంటాయి. చివరకు మిగిలిన సంస్థ విజేతగా నిలుస్తుంది. అయితే ఎంత మొత్తమో కనబడుతుంది కానీ ఎవరు వేసింది అనేది స్క్రీన్లో కనపడదు. ఎందుకంటే పలా నా సంస్థ వేసిందంటే దానికి ధీటుగా వేయా లని ఇతర సంస్థలు నిర్ణయించుకుంటాయి. నాలుగు ‘ప్యాకేజీ’లు నాలుగు ప్యాకేజీల్లో ఎ, బి, సి పూర్తిగా భారత ఉపఖండానికి సంబంధించినవి. ‘ఎ’ టీవీ హక్కులు, ‘బి’ డిజిటల్ రైట్స్. ‘సి’ ప్లే–ఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్లకు సంబంధించిన డిజిటల్ రైట్స్. ఇక ‘డి’ ఉపఖండం మినహా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్ రైట్స్. కొత్తగా ‘ప్రత్యేక’ హక్కులేంటంటే... సీజన్లో ఒక్కోసారి మ్యాచ్లు పెరిగితే దానికి సంబంధించిన ప్యాకేజీ అన్నమాట. ఒక సీజన్లో 74 ఉండొచ్చు. ఇవి మరో సీజన్లలో 84 లేదంటే 94కు పెరగొచ్చు. ఇవీ ప్రారంభ ధరలు... ‘ఎ’ టీవీ ప్యాకేజి కోసం ఒక్కో మ్యాచ్కు రూ. 49 కోట్లు ప్రారంభ బిడ్డింగ్ ధర కాగా... ‘బి’ డిజిటల్ కోసం మ్యాచ్కు రూ. 33 కోట్లు, ‘సి’లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు, ‘డి’లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక సంస్థ ఒకదానికే పరిమితమన్న నిబంధన లేదు. నాలుగు ప్యాకేజీలకూ ఒకే సంస్థ పోటీ పడొచ్చు. అయితే గతంలో ఏక మొత్తంలో ఒకే సంస్థకు కట్టబెట్టినట్లుగా కాకుండా ఈసారి ప్రతీ ప్యాకేజీలో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వాళ్లకే హక్కులిస్తారు. గతంలో టీవీ హక్కులకు భారీ మొత్తం కోట్ చేసిన స్టార్ నెట్వర్క్ డిజిటల్కు తక్కువ కోట్ చేసింది. ఫేస్బుక్ డిజిటల్ కోసం రూ.3,900 కోట్లు కోట్ చేసినా... ఓవరాల్గా గరిష్ట మొత్తాన్ని పరిగణించి స్టార్కు హక్కులిచ్చారు. ఈసారి డిజిటల్ విభాగంలో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ఆసియా, డ్రీమ్11, ఫ్యాన్కోడ్... ఉపఖండం ఆవల హక్కుల కోసం స్కై స్పోర్ట్స్ (ఇంగ్లండ్), సూపర్స్పోర్ట్ (దక్షిణాఫ్రికా) కూడా బరిలో ఉన్నాయి. -
IPL 2022: టైటాన్స్ విజయారంభం
ముంబై: కొత్త ఐపీఎల్ జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. దీపక్ హుడా (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్లు), ఆయుశ్ బదోని (41 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. షమీ 3 వికెట్లు తీశాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ తెవాటియా (24 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మిల్లర్ (21 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్లు) దంచేశారు. షమీ నిప్పులు ఆట ఆరంభమైన క్షణాన్నే షమీ... లక్నో నెత్తిన పిడుగు వేశాడు. కెప్టెన్ లోకేశ్ రాహుల్ (0)ను తొలి బంతికే డకౌట్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ డికాక్ (7)ను క్లీన్బౌల్డ్ చేశాడు. ఇది చాలదన్నట్లు వన్డౌన్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ (10)ను శుబ్మన్ గిల్ సూపర్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. బౌలర్ వరుణ్ ఆరోన్ అయినప్పటికీ ఈ వికెట్ పతనంలో కచ్చితంగా క్రెడిట్ గిల్కే దక్కుతుంది. బౌన్సర్ను లూయిస్ పుల్ షాట్ ఆడగా బ్యాట్ అంచును తాకిన బంతి స్క్వేర్లెగ్ దిశగా గాల్లోకి లేచింది. సర్కిల్ లోపలి నుంచి ఏకంగా 25 గజాల దూరం పరుగెత్తిన గిల్ డైవ్చేసి క్యాచ్ అందుకున్నాడు. మళ్లీ షమీ తన వరుస ఓవర్లో మనీశ్ పాండే (6)ను బౌల్డ్ చేశాడు. ఐదు ఓవర్లయినా పూర్తవకముందే లక్నో 29 పరుగులకు 4 వికెట్లను కోల్పోయింది. ఆదుకున్న హుడా, బదోని షమీ (3–0–10–3) అద్భుతమైన స్పెల్కు కుదేలైన లక్నోను దీపక్ హుడా, ఆయుశ్ బదోని ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 87 పరుగులు జోడించడంతో సూపర్ జెయింట్స్ కోలుకుంది. ఈ క్రమంలో హుడా (36 బంతుల్లో) 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తయ్యింది. స్కోరు వేగం పుంజుకుంటున్న తరుణంలో హుడాను రషీద్ ఖాన్ ఎల్బీగా పంపాడు. తర్వాత కృనాల్ పాండ్యా (13 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) అండతో బదోని (38 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ శతకం సాధించాడు. ఆరోన్ ఆఖరి ఓవర్లో భారీషాట్కు యత్నించి హార్దిక్ పాండ్యా చేతికి చిక్కాడు. తెవాటియా, మిల్లర్ ధనాధన్ టైటాన్స్ ఇన్నింగ్స్ కూడా కష్టాలతోనే ఆరంభమైంది. చమీర దెబ్బకు గిల్ (0) డకౌట్గా వెనుదిరిగాడు. తన మరుసటి ఓవర్లో విజయ్ శంకర్ (4) నూ చమీర పెవిలియన్ చేర్చడంతో లక్నో శిబిరం లో ఒక్కసారిగా ఎక్కడలేని ఆనందం! ఈ దశలో ఓపెనర్ వేడ్ (30; 4 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (33; 5 ఫోర్లు, 1 సిక్స్) స్కోరు బోర్డును కదిలించారు. 10 ఓవర్లలో 72/2తో మెరుగ్గా కనిపించిన గుజరాత్ వరుస ఓవర్లలో పాండ్యా, వేడ్ వికెట్లను కోల్పోయి ఓటమికి దగ్గరైంది. ఈ దశలో డేవిడ్ మిల్లర్, తెవాటియా జట్టుకు ఆపద్భాంధవులయ్యారు. ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు చేయాల్సి ఉండగా... దీపక్ హుడా వేసిన 16వ ఓవర్లో తెవాటియా 6, 4 కొడితే మిల్లర్ కూడా 4, 6 బాదేశాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఇదే జోరుతో తెవాటియా... రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్నూ ఆడుకున్నాడు. ఒక సిక్స్, 2 ఫోర్లతో ఆ ఓవర్లో కూడా 17 పరుగులు రావడంతో విజయసమీకరణం 18 బంతుల్లో 29 పరుగులుగా మారిపోయింది. 18వ ఓవర్లో మిల్లర్ను అవేశ్ అవుట్ చేయగా... అభినవ్ మనోహర్ క్రీజులోకి వచ్చాడు. ఆఖరి 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా... 19వ ఓవర్లో చమీర 9 పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో మనోహర్ రెండు బౌండరీలు, తెవాటియా ఫోర్తో టైటాన్స్ విజయం సాధించింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) వేడ్ (బి) షమీ 0; డికాక్ (బి) షమీ 7; లూయిస్ (సి) గిల్ (బి) ఆరోన్ 10; పాండే (బి) షమీ 6; హుడా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 55; బదోని (సి) హార్దిక్ (బి) ఆరోన్ 54; కృనాల్ పాండ్యా (నాటౌట్) 21; చమీర (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–20, 4–29, 5–116, 6–156. బౌలింగ్: షమీ 4–0–25–3, ఆరోన్ 4–0–45–2, ఫెర్గూసన్ 4–0– 24–0, హార్దిక్ 4–0–37–0, రషీద్ ఖాన్ 4–0–27–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) హుడా (బి) చమీర 0; వేడ్ (బి) హుడా 30; శంకర్ (బి) చమీర 4; హార్దిక్ (సి) పాండే (బి) కృనాల్ 33; మిల్లర్ (సి) రాహుల్ (బి) అవేశ్ 30; తెవాటియా (నాటౌట్) 40; అభినవ్ (నాటౌట్) 15; ఎక్స్ ట్రా లు 9; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–4, 2–15, 3–72, 4–78, 5– 138. బౌలింగ్: చమీర 3–0–22–2, అవేశ్ 3.4–0– 33–1, మోసిన్ 2–0–18–0, బిష్ణోయ్ 4–0–34– 0, కృనాల్ 4–0–17–1, హుడా 3–0– 31–1. -
రెండు గ్రూప్లు... జట్లకు సీడింగ్లు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో రెండు కొత్త జట్ల రాకతో 2022 సీజన్ మొత్తం 74 మ్యాచ్లతో కొత్తగా కనిపించనుంది. ఇప్పటి వరకు ప్రతీ జట్టు మిగతా 7 టీమ్లతో రెండు సార్లు తలపడి లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడేది. ఇప్పుడు కూడా ఒక్కో జట్టు గరిష్టంగా 14 మ్యాచ్లే ఆడనుండగా, ఫార్మాట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేరుకు హోం, అవే మ్యాచ్లు అని చెబుతున్నా... టోర్నీని నాలుగు వేదికలకే పరిమితం చేయడం తో ‘సొంత మైదానం’ అనే ప్రభావం కూడా ఉండకపోవచ్చు. మొత్తం లీగ్ మ్యాచ్ల సంఖ్య 70 కాగా, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లుంటాయి. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ నిర్వహిస్తారు. ఎలా ఆడతారు? ప్రతీ జట్టు తమ గ్రూప్లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు, మరో గ్రూప్లోని ఒక జట్టుతో (గ్రూప్లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్లు అవుతాయి. మరో గ్రూప్లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ ‘ఎ’ గ్రూప్లోని నాలుగు టీమ్లతో పాటు గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్తో రెండు మ్యాచ్లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కడ ఎన్ని మ్యాచ్లు? 70 లీగ్ మ్యాచ్లలో 20 మ్యాచ్లు ముంబై వాంఖెడే స్టేడియంలో, 20 మ్యాచ్లు ముంబై డీవై పాటిల్ స్టేడియంలో, 15 మ్యాచ్లు ముంబై బ్రబోర్న్ స్టేడియంలో, 15 మ్యాచ్లు పుణే స్టేడి యంలో నిర్వహిస్తారు. నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు అహ్మదాబాద్లో జరిగే అవకాశం ఉంది. ఏ గ్రూప్లో ఎవరు? ఐపీఎల్లో ఆయా జట్ల రికార్డును బట్టి ఒక్కో జట్టుకు సీడింగ్ కేటాయించారు. సాధించిన టైటిల్స్, ఫైనల్ చేరిన సంఖ్యను బట్టి దీనిని రూపొందించారు. దాని ప్రకారమే 1వ సీడ్ టీమ్ గ్రూప్ ‘ఎ’లో, రెండో సీడ్ గ్రూప్ ‘బి’లో... ఇలా పది టీమ్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్ (సీడింగ్–1), కోల్కతా నైట్రైడర్స్(3), రాజస్తాన్ రాయల్స్ (5), ఢిల్లీ క్యాపిటల్స్ (7), లక్నో సూపర్ జెయింట్స్ (9). గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్ (2), సన్రైజర్స్ హైదరాబాద్ (4), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6), పంజాబ్ కింగ్స్ (8), గుజరాత్ టైటాన్స్ (10). -
IPL 2022 Auction: అక్షరాలా రూ. 551 కోట్ల 70 లక్షలు
ఐపీఎల్కు ఆర్థిక మాంద్యం ఉండదని మరోసారి రుజువైంది. రెండు రోజుల పాటు సాగిన లీగ్ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్ నుంచి 137 మంది ఉండగా... విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. 2022 సీజన్ వేలం కోసం అన్ని టీమ్లు కలిపి రూ. 551 కోట్ల 70 లక్షలు ఖర్చు చేయడం విశేషం. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా... మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించకపోవడంతో మరికొందరు పెద్ద క్రికెటర్లు కూడా నిరాశగా చూస్తుండిపోవడం కూడా సహజ పరిణామంలా కనిపించింది. రెండో రోజు ఆదివారం సాగిన వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్స్టోన్ను అత్యధికంగా రూ. 11 కోట్ల 50 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఓవరాల్గా నలుగురు హైదరాబాద్ క్రికెటర్లు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ, సీవీ మిలింద్, భగత్ వర్మ, రాహుల్ బుద్ధిలకు... ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు అంబటి రాయుడు, కేఎస్ భరత్, అశ్విన్ హెబర్లను వివిధ ఫ్రాంచైజీలు వేలంలో ఎంచుకున్నాయి. వేలానికే ముందే సిరాజ్ను బెంగళూరు ఎంచుకోగా... ఆశ్చర్యకరంగా టెస్టు క్రికెటర్ హనుమ విహారి పేరు కూడా వేలంలో వినిపించలేదు. వేలంతో క్రికెటర్ల విలువపై ఒక అంచనా ఏర్పడగా ఏప్రిల్–మేలో జరిగే టోర్నీలో ఆటగాళ్ల అసలు సత్తా ఏమిటో బయటపడుతుంది. బెంగళూరు: దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్తో వేలం మొదలైంది. రూ. 1 కోటి బేస్ప్రైస్ కాగా, ముంబైతో పోటీ పడి చివరకు సన్రైజర్స్ దక్కించుకుంది. భారత ఆటగాడు అజింక్య రహానే కోసం ఎవరూ పోటీ పడకపోగా, కనీస ధర రూ.1 కోటితోనే కోల్కతా సొంతం చేసుకుంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో ఐదో స్థానంలో ఉన్న మలాన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు లబుషేన్, ఫించ్, భారత టెస్టు బ్యాటర్ పుజారా కోసం ఎవరూ ఆసక్తి చూపించకపోగా...గత సీజన్ వరకు కోల్కతాకు కెప్టెన్గా ఉన్న ఇయాన్ మోర్గాన్ కోసం కూడా ఏ జట్టూ ముందుకు రాలేదు. ► ధాటిగా ఆడగల విండీస్ బ్యాటర్ ఒడెన్ స్మిత్ కోసం పోటీ బాగా సాగింది. రూ. 5.75 కోట్ల వరకు వచ్చి సన్రైజర్స్ తప్పుకోగా, రూ. 6 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. ఇటీవల సొంతగడ్డపై భారత్ను ఇబ్బంది పెట్టిన దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాన్సెన్ కోసం అతని తొలి ఐపీఎల్ జట్టు ముంబై రూ. 4 కోట్ల వరకు బాగా ఆసక్తి చూపిం చింది. అయితే మరో 20 లక్షలు జోడించి హైదరాబాద్ అతడిని తీసుకుంది. గత సీజన్లో రూ. 9.25 కోట్లకు అమ్ముడుపోయిన కృష్ణప్ప గౌతమ్కు ఈ సారి రూ. 90 లక్షలు దక్కడం గమనార్హం. ► అండర్–19 ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్ యష్ ధుల్ను అతని సొంత నగరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 50 లక్షలకు ఎంచుకుంది. ప్రపంచకప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అంగద్ రాజ్ బావాను పంజాబ్ సొంతం చేసుకుంది. ► ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోసం భారీ పోటీ సాగింది. గాయంతో అతను 2022లో ఆడే అవకాశం లేకపోయినా వచ్చే సీజన్లను దృష్టిలో పెట్టుకొని టీమ్లు పోటీ పడ్డాయి. రాజస్తాన్, హైదరాబాద్లతో పోటీ పడి చివరకు ముంబై రూ. 8 కోట్లకు దక్కించుకుంది. ► జమ్ము కశ్మీర్కు చెందిన 21 ఏళ్ల రసిఖ్ సలామ్ను రూ. 20 లక్షల బేస్ప్రైస్కు కోల్కతా ఎంచుకుంది. 2019లో ముంబై ఇండియన్స్ తరఫున అతను ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అయితే ఆ తర్వాత వయసు తప్పుగా చూపించాడంటూ బీసీసీఐ అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది. ముంబై ఇండియన్స్ రెండేళ్ల పాటు అతని బాధ్యత తీసుకొని రసిఖ్ను ముంబైకి రప్పించింది. అన్ని సౌకర్యాలూ కల్పించి ప్రాక్టీస్కు అవకాశం ఇస్తూ స్థానిక మ్యాచ్లు కూడా ఆడించింది. అయితే వేలంలో అతని పేరు వచ్చినప్పుడు మాత్రం ముంబై అసలు స్పందించనే లేదు! లివింగ్స్టోన్కు రూ. 11 కోట్ల 50 లక్షలు విధ్వంసక బ్యాటింగ్తో పాటు అటు ఆఫ్స్పిన్, ఇటు లెగ్స్పిన్ బౌలింగ్ వేయగల నైపుణ్యం లివింగ్స్టోన్ సొంతం. 165 టి20 మ్యాచ్లలో 144.29 స్ట్రయిక్రేట్ కాగా 2 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. బౌలింగ్లోనూ మెరుగైన 7.86 ఎకానమీని అతను నమోదు చేశాడు. గత ఐపీఎల్లో రూ. 75 లక్షలకు రాజస్తాన్ తరఫున ఆడిన అతను 5 మ్యాచ్లలో 42 పరుగులే చేశాడు. అయితే ఏడాది కాలంగా అతని ఆటతీరు అద్భుతంగా మారిపోయింది. 2021లో టి20ల్లో 86 సిక్స్లు బాదిన అతను పాకిస్తాన్పై 43 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. ఓపెనింగ్ నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు. లివింగ్స్టోన్ ఆట గురించి బాగా తెలిసిన పంజాబ్ కింగ్స్ అనలిస్ట్ డాన్ వెస్టన్ కూడా అతడిని సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. రూ. 1 కోటి కనీస ధరతో మొదలైన లివింగ్స్టోన్ బిడ్డింగ్ ఆ తర్వాత దూసుకుపోయింది. వేలంలో ఒకరిని మించి మరొకరు మొత్తం ఐదు జట్లు అతని కోసం పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ రూ. 11 కోట్ల 50 లక్షలకు లివింగ్స్టోన్ను గెలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలో స్టోక్స్ (రూ. 14 కోట్ల 50 లక్షలు), స్టోక్స్ (రూ. 12 కోట్ల 50 లక్షలు), టైమల్ మిల్స్ (రూ. 12 కోట్లు) తర్వాత అత్యధిక మొత్తం పలికిన ఇంగ్లండ్ ఆటగాళ్ల జాబితాలో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 85 మ్యాచ్ల టి20 కెరీర్లో 159.39 స్ట్రయిక్రేట్తో పరుగులు చేసిన డేవిడ్ గత ఏడాది బెంగళూరు టీమ్తో ఉన్నాడు. రూ.40 లక్షలతో ఢిల్లీ బిడ్ మొదలు పెట్టగా మరో నాలుగు జట్లు బరిలో నిలిచాయి. చివరకు అతడిని ముంబై ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇచ్చిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. అతను ఐదు లేదా ఆరో స్థానంలో ఆడతాడని ఓనర్ అంబానీ ప్రకటించాడు. టిమ్ డేవిడ్ తండ్రి రోడరిగ్ డేవిడ్ది ఆస్ట్రేలియా కాగా, ఉద్యోగరీత్యా అతను సింగపూర్కు వలస వచ్చాడు. రోడరిక్ కూడా సింగపూర్ జాతీయ జట్టు తరఫున ఆడాడు. సారీ రైనా..! 205 మ్యాచ్లు... 5,528 పరుగులు... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం... అద్భుత ప్రదర్శనలతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర... ‘చిన్న తలా’ సురేశ్ రైనా సూపర్ కెరీర్ ముగిసినట్లే. వేలంలో రైనాను తీసుకోవడానికి చెన్నై సహా ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఇన్నేళ్లలో చెన్నైపై నిషేధం ఉన్న రెండేళ్లు మినహా (అప్పుడు గుజరాత్కు) మరే ఫ్రాంచైజీకి అతను ఆడలేదు. అతను రెగ్యులర్గా మ్యాచ్లు ఆడకపోవడం కూడా ప్రధాన కారణం. కనీసం బేస్ప్రైస్ వద్ద కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈ సీజన్ వేలంలో అమ్ముడుపోని కీలక ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఇషాంత్ శర్మ, షమ్సీ, కేదార్ జాదవ్, గ్రాండ్హోమ్, గప్టిల్, కార్లోస్ బ్రాత్వైట్, పుజారా, హనుమ విహారి తదితరులు ఉన్నారు. -
మెగా వేలంలో అపశ్రుతి: కుప్పకూలిన వేలంపాటదారు.. చారు శర్మ ఎంట్రీ
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ మెగా వేలంలో తొలి రోజు చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు వచ్చిన ప్రముఖ వేలంపాటదారు హ్యూజ్ ఎడ్మీడ్స్ వేలం జరుగుతుండగానే కుప్పకూలారు. ఉన్నపళంగా లో బీపీ (అల్ప రక్తపోటు)కి గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించడంతో పాటు... ప్రక్రియకు ఆటంకం కలుగకుండా వెంటనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేలంపాట బాధ్యతల్ని సుప్రసిద్ధ క్రీడా వ్యాఖ్యాత చారు శర్మకు అప్పగిం చింది. శనివారం శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ పేరు వేలానికి పిలిచిన సమయంలో 60 ఏళ్ల హ్యూజ్ ఎడ్మీడ్స్ రక్తపోటు ఉన్నపళంగా పడిపోయింది. నిల్చున్న చోటే కుప్పకూలిన ఆయన్ని సత్వరం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ఎడ్మీడ్స్ ప్రపంచ వ్యాప్తంగా 2700 పైచిలుకు వేలం పాటలు నిర్వహించారు. -
IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. కాగా ఫిబ్రవరి 12న బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ను సొంతం చేసుకుంది. రిటెన్షన్లో అతడిని వదిలేసిన ముంబై వేలంలో 15.25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం. కాగా ఇషాన్ కనీస ధర 2 కోట్లు కాగా ముంబై, హైదరాబాద్ పోటీ పడ్డాయి. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఇషాన్ కిషన్... ‘‘అందరికి నమస్కారం. ముంబై ఇండియన్స్తో మళ్లీ చేరడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. జట్టులోని ప్రతి ఒక్కరు నన్ను తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. నిజంగా నా జట్టుతో తిరిగి కలవడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ ఉత్సాహంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ట్విటర్లో షేర్ చేసింది. కాగా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ముందు వరుసలో ఉన్నాడు. (చదవండి: అప్పుడు రూ.20 లక్షలు.. ఇప్పుడు ఏకంగా రూ.10.75 కోట్లు.. వారెవ్వా హర్షల్!) 2008లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిని 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు రికార్డు ధర పలికిన ఇషాన్ యువీ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. మరో టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ను 12.25 కోట్లు పెట్టి కోల్కతా కొనుగోలు చేసింది. ఇక విదేశీ ఆటగాళ్లలో క్రిస్ మోరిస్(16 కోట్లు), ప్యాట్ కమిన్స్(15.5 కోట్లు), కైలీ జెమీషన్(15 కోట్లు) తదితరులు గతంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. 𝐓𝐡𝐞 𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐃𝐲𝐧𝐚𝐦𝐨 shares a message for the Paltan after coming ℍ𝕆𝕄𝔼 💙#AalaRe #MumbaiIndians #AalaRe #IPLAuction @ishankishan51 pic.twitter.com/Q9QcTQ34gL — Mumbai Indians (@mipaltan) February 12, 2022 -
ఐపీఎల్-2022 గెలుపు గుర్రాలకోసం ఫ్రాంఛైజీ వేట షురూ
-
IPL 2022 Auction: 10 జట్లు... చేతిలో రూ. 561.50 కోట్లు... బాక్స్లు బద్దలు కానున్నాయి
IPL 2022 Mega Auction: 10 జట్లు... చేతిలో రూ. 561.50 కోట్లు... అదృష్టం పరీక్షించుకోనున్న 600 మంది... క్రికెట్ అభిమానుల పండగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అసలు ఆటకు ముందు ‘నోట్లాట’కు రంగం సిద్ధమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు అందుబాటులోకి వస్తూ మెగా వేలం జరగనుంది. అబ్బో అనిపించే ఆశ్చర్యాలు, అయ్యో అనిపించే నిరాశలు, ఆహా అనిపించే ఎంపికలు, అంతేనా అనిపించే సర్దుబాట్లు... ఎప్ప టిలాగే ఇలా అన్ని భావోద్వేగాలు అభిమానుల నుంచి కనిపించవచ్చు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తన పేరు రాగానే ఆటగాళ్ల లబ్డబ్ చప్పుళ్ల వేగం గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క సీజన్ వరకే కాకుండా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుంటూ ఫ్రాంచైజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వేలంలో ఎవరు ఎంత ధరతో రికార్డులు బద్దలు కొడతారనేది ఆసక్తికరం! వేలం వేదిక: బెంగళూరు వేలం తేదీలు: ఫిబ్రవరి 12, 13 మొత్తం జట్లు: ఇప్పటికే ఉన్న 8 టీమ్లతో పాటు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా వచ్చాయి. ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య: 33 వేలం బరిలో ఉన్నవారు: 600 మంది (377 మంది భారతీయులు, 223 విదేశీ ఆటగాళ్లు) వేలంలో ఎంపికయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లు: 227 (గరిష్టంగా) ఒక్కో టీమ్లో ఎంత మంది: కనిష్టంగా 18, గరిష్టంగా 25 (ఇందులో 8 మంది విదేశీయులు) ఒక్కో జట్టు ఖర్చు చేయాల్సిన సొమ్ము: గరిష్టంగా ప్రతీ జట్టుకు రూ. 90 కోట్ల వరకు ఖర్చు చేసే అనుమతి ఉండగా...ఆటగాళ్లను ఎంచుకునేందుకు కనిష్టంగా 67.5 కోట్లయినా వాడాలి. తొలి రోజు ఎంత మంది: శనివారం వేలంలో 161 మంది క్రికెటర్లు మాత్రమే అందుబాటులోకి వస్తారు. మిగిలిన ఆటగాళ్ల కోసం ఆదివారం కూడా వేలం ‘యాక్సెలరేటెట్ ప్రాసెస్’ ద్వారా కొనసాగుతుంది. అంటే 161 పోగా, మిగిలిన 439 మందిని ఆదివారం వేలంలోకి తీసుకురారు. తొలి రోజు ముగిసిన తర్వాత పది ఫ్రాంచైజీలు ఇంకా ఎవరెవరు వేలంలో ఉంటే బాగుంటుందని తమ సూచనలు ఇస్తాయి. ఆ ఆటగాళ్లు పేర్లు మాత్రమే రెండో రోజు వేలంలో వినపడతాయి. -
త్వరలోనే ‘మహిళల ఐపీఎల్’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మహిళల కోసం పూర్తి స్థాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ను నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. ఈ ఏడాదికి మాత్రం ఎప్పటిలాగే మూడు జట్లతో మహిళల టి20 చాలెంజ్ మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించలేదు. ‘మహిళల క్రికెట్కు సంబంధించి కూడా త్వరలోనే పరిస్థితులు మారతాయి. ఐపీఎల్ తరహాలో మహిళల టోర్నీ కూడా నిర్వహించాలనే ఆలోచనకు బీసీసీఐ కట్టుబడి ఉంది. అందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళల టి20 చాలెంజ్ టోర్నీకి అభిమానులు, ఆటగాళ్ల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే త్వరలోనే ఐపీఎల్ సాధ్యమమవుతుందని అనిపిస్తోంది’ అని జై షా అన్నారు. 2022లో ఐపీఎల్ను పూర్తిగా భారత్లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఒక అంచనాకు వస్తామని ఆయన చెప్పారు. మరోవైపు నాలుగు పెద్ద జట్లతో టి20 టోర్నీ నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా చేసిన ప్రతిపాదనపై కూడా జై షా స్పందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టే అలాంటి వాణిజ్యపరమైన ఆలోచనకంటే క్రికెట్ను అభివృద్ధి చేయడం ముఖ్యం. ఐపీఎల్ విస్తృతమవడంతో పాటు ప్రతీ ఏడాది ఐసీసీ టోర్నీలు ఉంటున్నాయి. పైగా టెస్టులపై దృష్టి పెడుతూ ద్వైపాక్షిక సిరీస్లు కూడా ముఖ్యం. ఇలాంటి సమయంలో తాత్కాలిక ప్రయోజనాలకంటే ఆటకు ప్రాచుర్యం కల్పించడమే కీలకం’ అని షా అభిప్రాయపడ్డారు. -
ర్యాంకింగ్స్లో దుమ్మురేపిన ఐపీఎల్.. రెండో స్థానంలో సమ్మర్ ఒలింపిక్స్
క్యాచ్రిచ్ లీగ్గా ముద్రపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ర్యాంకింగ్స్లోనూ దూసుకుపోయింది. యుగోవ్స్ 2022 స్పోర్ట్స్ బజ్ ర్యాంకింగ్స్లో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలించింది. రెండో స్థానంలో టోక్యో ఒలింపిక్స్(సమ్మర్ ఒలింపిక్స్) నిలవగా.. మూడోస్థానంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు యుగోవ్స్ తెలిపింది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలి అంచె పోటీలు మనదగ్గరే జరగ్గా.. కరోనా విజృంభణతో రెండో అంచె పోటీలు యూఏఈ వేదికగా జరిగింది. అయినప్పటికి భారత అభిమానులను అలరించిన ఐపీఎల్ 50.8 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. కాగా యుగోవ్స్ స్పోర్ట్స్ ర్యాంకింగ్స్లో ఐపీఎల్ తొలిస్థానంలో నిలవడం వరుసగా రెండోసారి. గతేడాది ప్రకటించిన ర్యాంకింగ్స్లోనూ ఐపీఎల్దే తొలిస్థానం. ►ఇక ఐపీఎల్ తర్వాత ఇండియాలో అత్యంత ఎక్కువ జనాధరణ పొందింది టోక్యో ఒలింపిక్స్. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా మరుసటి ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో గతేడాది ఆగస్టులో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్లో ఎన్నడూ లేనంతగా మనకు ఏడు పతకాలు రావడం విశేషం. ఇందులో నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చరిత్రలో నిలిచిపోయింది. 49.2 పాయింట్లతో .. కేవలం 1.6 పాయింట్ల తేడాతో తొలిస్థానం కోల్పోయినప్పటికి.. రెండోస్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ►సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగితే ఇండియాలో ఎక్కువమంది చూస్తుంటారు. కానీ గతేడాది జరిగిన ఐసీసీ టి20 ప్రపంచకప్లో టీమిండియా నిరాశపరిచింది. సూపర్-12 దశలోనే ఇంటిబాట పట్టినప్పటికి.. ఐసీసీ టోర్నీని ఇండియా అభిమానులు ఆదరించారని సర్వేలో తేలింది. 45.9 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచిన ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్.. అంతకముందు ఇచ్చిన స్కోరు కంటే 0.4 మాత్రమే తక్కువగా ఉండడం విశేషం. ►ఈ మూడింటి తర్వాత ఫుట్బాల్ వరల్డ్కప్(28.3 పాయింట్లు), ఇండియన్ సూపర్ లీగ్(20.4 పాయింట్లు), వింబుల్డన్ చాంపియన్షిప్(టెన్నిస్, 18 పాయింట్లు) వరుసగా 4,5,6 స్థానాల్లో నిలవగా.. ప్రొ కబడ్డీ లీగ్ 17.9 పాయింట్లతో ఏడోస్థానం.. ఏసియన్ గేమ్స్ 15.3 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) 13.3.. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 13 పాయింట్లతో తొమ్మిది, 10 స్థానాల్లో ఉన్నాయి. ఇక యుగోవ్స్ తమ ర్యాంకింగ్స్ను స్పోర్ట్స్ ఇండెక్స్ రోజువారీగా బ్రాండ్ల పట్ల ప్రజల అవగాహనను కొలమానంలోకి తీసుకొని నిర్థారణ చేస్తుంది. -
మార్చి 27 నుంచి ఐపీఎల్ 2022 సీజన్.. ప్రేక్షకులు లేకుండానే!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం సందడి మొదలైంది. 2022 లీగ్ కోసం భారత ఆటగాళ్ల మొదలు అసోసియేట్ టీమ్ల క్రికెటర్ల వరకు అందరూ వేలంలో తామూ భాగం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేలంలో అవకాశం దక్కించుకునే క్రమంలో తొలి అడుగుగా ఏకంగా 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీయులు. ఇందులో గరిష్టంగా ఆస్ట్రేలియానుంచి 59 మంది క్రికెటర్లు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా రెండు టీమ్లతో మొత్తం జట్ల సంఖ్య పదికి చేరింది. కొత్త సీజన్కు ముందు నిబంధనల ప్రకారం గరిష్టంగా నలుగురు ఆటగాళ్లనే టీమ్ను కొనసాగించే అవకాశం ఉండటంతో భారత జట్టులో రెగ్యులర్ సభ్యుల్లో కూడా దాదాపు అందరూ వేలంలోకి రానున్నారు. వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన 896 మంది భారత క్రికెటర్లలో 61 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినవారు ఉన్నారు. ఈ లిస్ట్ను బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంపిస్తుంది. వేలంలో తాము కోరుకుంటున్న ఆటగాళ్లతో వివిధ టీమ్లు ఇచ్చే పేర్లను బట్టి తుది జాబితా సిద్ధమవుతుంది. అందులో ఉన్న ఆటగాళ్లకే వేలంలో అవకాశం లభిస్తుంది. ఎనిమిది టీమ్లు కలిసి 27 మంది ఆటగాళ్లను, రెండు కొత్త టీమ్ను ఎంచుకున్న ఆరుగురు ఆటగాళ్లు కలిపితే జట్ల వద్ద 33 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఒక్కో టీమ్కు గరిష్టంగా 25 మందికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేలంలో 217 మంది క్రికెటర్లే చివరకు ఎంపికవుతారు. బరిలో వార్నర్, మిచెల్ మార్ష... రూ. 2 కోట్ల కనీస విలువతో మొత్తం 49 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆపై వేలంలో వీరికి ఎంత మొత్తం లభిస్తుందనేది ఆసక్తికరం. ఐపీఎల్ ఆల్టైమ్ స్టార్లలో ఒకడు, ఇటీవల టి20 ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన డేవిడ్ వార్నర్పైనే అందరి దృష్టి నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మిచెల్ మార్‡్ష కూడా లీగ్లో తన అవకాశం కోసం చూస్తున్నాడు. రూ. 2 కోట్ల లిస్ట్లో ఉన్న భారత క్రికెటర్లలో శ్రేయస్, ధావన్, ఇషాన్ కిషన్, రాయుడులకు మంచి విలువ పలికే అవకాశం ఉంది. విదేశీ క్రికెటర్లలో కమిన్స్, జోర్డాన్, బౌల్ట్, డి కాక్, డుప్లెసిస్, రబడలకు భారీ డిమాండ్ ఖాయం. రూ.1.5 కోట్ల జాబితాలో సుందర్, బెయిర్స్టో, మోర్గాన్, హోల్డర్...రూ.1 కోటి జాబితాలో నటరాజన్, మనీశ్ పాండే, రహానే, షమ్సీలకు ఫ్రాంచైజీలకు ఆకర్షించవచ్చు. ఫిక్సింగ్కు పాల్పడి నిషేధం పూర్తి చేసుకున్న పేసర్ శ్రీశాంత్ కూడా రూ. 50 లక్షల కనీస విలువతో తన పేరు నమోదు చేసుకోవడం విశేషం. తొలి ఐపీఎల్ మినహా 2009నుంచి లీగ్పై తనదైన ముద్ర వేసి దాదాపు అన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న క్రిస్ లీగ్ ఈ సారి లీగ్నుంచి తప్పుకోవడంతో తన పేరును నమోదు చేసుకోలేదు. ముంబై, పుణేలలో... ఐపీఎల్–2022ను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై శనివారం బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ఫ్రాంచైజీలన్నీ భారత్లో జరిపితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ప్రేక్షకులను అనుమతించకుండా ముంబై, పుణేలలోనే అన్ని మ్యాచ్లు జరపాలనేది ప్రాథమికంగా బీసీసీఐ ఆలోచన. ముంబైలో మూడు పెద్ద మైదానాలు ఉండగా, సమీపంలోనే పుణేలో మరో స్టేడియం ఉండటంతో బయోబబుల్ తదితర ఏర్పాట్ల విషయంలో ఎలాంటి సమస్య రాదని వారు చెబుతున్నారు. అయితే భారత్లో కరోనా కాస్త తగ్గుముఖం పడితేనే ఇది సాధ్యమవుతుందని... లేదంటే ప్రత్యామ్నాయంగా మళ్లీ యూఏఈనే ఉంచాలని బోర్డు భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే మార్చి 27న ఐపీఎల్ మొదలవుతుంది. చదవండి: KL Rahul: కెప్టెన్సీతో పాటు భారీ మొత్తం ఆఫర్ చేసిన లక్నో ఫ్రాంచైజీ -
ఐపీఎల్: తెరపైకి మరో ప్లాన్తో టాటా..! సానుకూలంగా బీసీసీఐ..!
ఐపీఎల్-15 సీజన్ టైటిల్ స్పాన్సర్గా వివో తప్పుకున్న విషయం తెలిసిందే. 2022లో జరగబోయే ఐపీఎల్కు భారత పారిశ్రామిక దిగ్గజం టాటా టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. కాగా మరో ఐదు సంవత్సరాలకుగాను టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించేందుకు టాటా కొత్త ప్లాన్ను బీసీసీఐ ముందు ఉంచిన్నట్లు సమాచారం. సానుకూలంగా బీసీసీఐ..! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో దీర్ఘకాలిక అనుబంధం కోసం టాటా గ్రూప్స్ చేసిన అభ్యర్థనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సానుకూలంగా పరిగణించినట్లు సమాచారం. ఈ టైటిట్ స్పాన్సర్షిప్ను ‘రైట్-టు-మ్యాచ్’ ప్రతిపాదికన సొంతం చేసుకోవాలని టాటా గ్రూప్స్ చూస్తోన్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదించింది. ఐపీఎల్-2022, 2023తో పాటుగా మరో ఐదేళ్లపాటు అధిక బిడ్తో (2024-28) టైటిల్ స్పాన్సర్షిప్ను టాటా గ్రూప్స్ కైవసం చేసుకోనేందుకు ప్రణాళికలను వేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..మరో ఐదేళ్ల పాటు అసోసియేషన్ కోసం టాటా చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటే, 2024-28గాను టైటిల్ స్పాన్సర్ హక్కులను ‘రైట్-టు-మ్యాచ్’ కింద బీసీసీఐ స్పాన్సర్షిప్ను టాటాకు ఇచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయంపై టాటా గ్రూప్స్ను ప్రశ్నించగా దీనిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఫ్రాంచైజీలకు రైట్-టు-మ్యాచ్ కార్డు ఐపీఎల్ వేలంలో ఒక ఆకర్షణీయమైన అంశం రైట్-టు-మ్యాచ్’ కార్డ్. సింపుల్గా ఆర్టీఎం కార్డ్గా పిలుస్తారు. ఈ ఆర్టీఎం కార్డుతో సదరు ఫ్రాంచైజీ మునుపటి ఎడిషన్లో తమ కోసం ఆడిన రిటైన్ చేయని ప్లేయర్ను వచ్చే వేలంలో ఇతర ఫ్రాంచైజీలు ఇచ్చే అత్యధిక బిడ్డింగ్ మొత్తాన్ని చెల్లించి సదరు ప్లేయర్ను మళ్లీ రిటైన్ చేసుకోవచ్చును. కాగా రాబోయే IPL 2022 మెగా వేలం కోసం రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ వినియోగాన్ని రద్దు చేసింది. గతంలో ఆర్టీఎం కార్డ్ ప్రతిపాదికన డీఎల్ఎఫ్ ఐపీఎల్ స్పాన్సర్షిప్ను కోరగా బీసీసీఐ అప్పట్లో నిరాకరించింది. బీసీసీఐకు ఎక్స్ట్రా బెనిఫిట్స్..! వివో ఐపీఎల్-15 తప్పుకోవడంతో బీసీసీఐకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చేశాయి.టాటా స్పాన్సర్గా రావడంతో బీసీసీఐకు కాసుల వర్షం కురిసింది. ఒకేసారి రెండు సంస్థల నుంచి ఆదాయం వస్తుండటంతో బోర్డు మరోసారి జాక్పాట్ కొట్టింది. టాటా గ్రూప్ రెండేళ్ల కోసం రూ. 670 కోట్లు (ఏడాదికి రూ. 335 కోట్లు) చెల్లిస్తుంది. అయితే 2022లో రూ. 547 కోట్లు, 2023లో రూ. 577 కోట్లు చెల్లిస్తామని ‘వివో’ గతంలో ఒప్పందం (రెండేళ్లకు మొత్తం రూ. 1,124 కోట్లు) కుదుర్చుకుంది. చదవండి: ఉచితంగా నెట్ఫ్లిక్స్, డిస్నీ+హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్..! వీటితో పాటుగా మరో 14 ఓటీటీ సేవలు ఉచితం..! -
IPL: కోహ్లి, ధోని జట్ల ప్రపంచ రికార్డు..
CSK And RCB In Top 10 Popular Teams: ఐపీఎల్ జట్లైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)లు ప్రపంచ స్థాయిలో అరుదైన ఘనతను సాధించాయి. గతేడాది విశ్వవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధిక ఎంగేజ్మెంట్లు (లైకులు, షేర్స్, కామెంట్స్ విషయంలో) కలిగిన భారత క్రీడా క్లబ్లుగా రికార్డు నెలకొల్పాయి. ఆర్సీబీ 820 మిలియన్ల ఎంగేజ్మెంట్లతో 8వ స్థానంలో నిలవగా.. సీఎస్కే 752 మిలియన్ల ఎంగేజ్మెంట్లతో 9వ ప్లేస్లో ఉంది. ఈ జాబితాలో ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ 2.6 బిలియన్ల ఎంగేజ్మెంట్లతో ప్రథమ స్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానాల్లో బార్సిలోనా (2.3 బిలియన్స్), రియల్ మాడ్రిడ్ (1.3 బిలియన్స్), పారిస్ సెయింట్ జర్మైన్ (1.2 బిలియన్స్), చెల్సీ (1.2 బిలియన్స్), లివర్ పూల్ (1.1 బిలియన్స్), గలాటాసరే (857 మిలియన్స్) వంటి ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్లు ఉన్నాయి. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఫుట్ బాల్ క్లబ్ల సరసన కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ, ధోని సారధ్యంలోని సీఎస్కే జట్లు నిలిచాయి. కాగా, ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీలైన లక్నో, అహ్మదాబాద్ల కోసం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ బిడ్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: బీసీసీఐ జాక్పాట్ కొట్టేసింది.. అదనంగా 130 కోట్లు! -
ఇంగ్లండ్ ప్లేయర్లకు ఐపీఎల్ సెగ..!
Mike Atherton: యాషెస్ సిరీస్ 2021-22లో దారుణంగా విఫలమవుతున్న ఇంగ్లండ్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ దేశ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ ఐపీఎల్ను కార్నర్ చేసి ఇంగ్లీష్ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎల్లో ఆడడం కోసం కొందరు ఆటగాళ్లు దేశ బాధ్యతలను పణంగా పెడుతున్నారని విరుచుకుపడ్డాడు. క్యాష్ రిచ్ లీగ్ సహా ఇతర లీగ్ల్లో ఆడేందుకు ఇంగ్లీష్ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్లకు దూరం కాకూడదని, ఇలా జరగకుండా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చర్యలు తీసుకోవాలని ఆయన సూచించాడు. జేసన్ రాయ్, జోఫ్రా ఆర్చర్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్లు ఐపీఎల్ కారణంగానే గాయాలపాలై జాతీయ జట్టుకు దూరమాయ్యరని ప్రస్తావించాడు. ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా.. రొటేషన్ విధానంలో ఏదో ఒక టోర్నీలో ఆడే విధంగా ఈసీబీ షెడ్యూల్ ప్రిపేర్ చేయాలని ఓ కాలమ్లో రాసుకొచ్చాడు. అలాగే ఇంగ్లండ్ టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి రూట్ను తప్పించి బెన్స్టోక్స్కు అప్పగిస్తే సత్ఫలితాలు రాబట్టొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోచ్ సిల్వర్వుడ్ను సైతం సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. తుది జట్టు ఎంపిక నుంచి గేమ్ స్ట్రాటజీ వరకు కెప్టెన్, కోచ్లు దారుణంగా విఫలమవుతున్నారని మండిపడ్డాడు. ఇదిలా ఉంటే, 5 టెస్ట్ల యాషెస్ సిరీస్లో మొదటి మూడు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయాల్ని చవిచూసిన సంగతి తెలిసిందే. చదవండి: రెండో టెస్ట్కు ముందు నాలుగు రికార్డులపై కన్నేసిన కోహ్లి -
సన్రైజర్స్ బ్యాటింగ్ కోచ్గా బ్రియాన్ లారా...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్లోనే చెత్త ప్రదర్శన సన్రైజర్స్ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు... దిగ్గజాలతో సన్రైజర్స్ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్ఆర్హెచ్ మళ్లీ హెడ్ కోచ్గా నియమించింది. ఈ సీజన్లో హెడ్ కోచ్గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్లోని ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్కు హెడ్ కోచ్గా పనిచేశాడు. భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్ను స్పిన్ బౌలింగ్ కోచ్గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది. -
IPL 2022 Auction: ‘బంపర్ అనౌన్స్మెంట్’.. ఇదే చివరి మెగా వేలం.. ఇక ముందు!
Report: No More Mega Auctions After IPL 2022 Franchises To Create Own Ecosystems: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. బీసీసీఐ, ఆటగాళ్లకు, ఫ్రాంఛైజీలకు కాసులు కురిపించే ఈ క్యాష్ రిచ్ లీగ్పై క్రీడాభిమానుల్లో ఆసక్తి మెండు. ఇప్పటికే విజయవంతంగా 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ వచ్చే ఏడాది రెండు జట్ల రాకతో మరింత రసవత్తరంగా మారనుంది. ఈ క్రమంలో మెగా వేలం-2022 నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రిటెన్షన్(అట్టిపెట్టుకునే ఆటగాళ్లు)కు సంబంధించి నవంబరు 30న తుది జాబితా సమర్పించేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఏ ఆటగాడిని కొనసాగిస్తుంది? ఎవరిని వదులుకుంటుంది? వేలంలో ఎవరు ఎంత ధర పలుకుతారు? అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ రావు అనే నెటిజన్ బంపర్ అనౌన్స్మెంట్ అంటూ ఓ ‘బాంబు’ పేల్చాడు. ఐపీఎల్-2022 మెగా వేలమే చివరిదని, ఇకపై ఐపీఎల్లో వేలం ఉండబోదంటూ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు.. ‘‘ఇదే చివరి మెగా వేలం. దీని తర్వాత ఫ్రాంఛైజీలు తమకంటూ సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయని భావిస్తున్నా. వేలం అనేది పాత పద్ధతి.. దానికి కాలం చెల్లింది. కాబట్టి ఇకపై మెగా వేలం ఉండబోదని అనుకుంటున్నా’’ అని ట్వీట్ చేశాడు. ఇందుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిజంగా ఇదే చివరి మెగా వేలం అయితే.. జట్లు చాలా సీరియస్గానే ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. బిగ్బాష్ మాదిరి డ్రాఫ్ట్ సిస్టమ్ ఉంటే ఐపీఎల్కు మేలే జరుగుతుంది. నేరుగా ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తారా ఏంటి?’’ అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Ind Vs Nz Test Series: డ్రా.. అంపైర్ల నిర్ణయం సరైందే; మరి రెండో టెస్టులో రహానేపై వేటు?! IPL 2022 Auction: రాహుల్, రషీద్ ఖాన్ను లాక్కొన్నారు.. పంజాబ్, హైదరాబాద్ లబోదిబో! Bumper announcement: This is probably the last #IPL mega auction. After this, franchises have to work on -- and create -- their own ecosystems. After this no mega auction for quite time (I guess forever). P.s.... as it is, I think auctions have gone past their sell by date. — KSR (@KShriniwasRao) November 29, 2021 -
‘నా చివరి మ్యాచ్ చెన్నైలోనే’
MS Dhoni Announcement About His Last T20 Match For CSK.. ఐపీఎల్–2021లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను విజేతగా నిలిపిన కెప్టెన్ కెప్టెన్ ధోని లీగ్ నుంచి తప్పుకోవడం లేదని స్పష్టమైంది. అతను కనీసం మరో సీజన్ జట్టు తరఫున ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్లో సీఎస్కే తరఫున తాను ఆడే చివరి మ్యాచ్ వేదిక చెన్నైనే అవుతుందని ధోని వెల్లడించాడు. అయితే అది వచ్చే ఏడాదేనా లేక ఐదేళ్ల తర్వాతా అనేది చెప్పలేనని... పైగా ఐపీఎల్ కూడా ఏప్రిల్లో జరుగుతుంది కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఇంకా చాలా సమయం ఉందని ధోని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని టీమ్ యాజమాన్యం ఇండియా సిమెంట్స్ శనివారం విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. చదవండి: Mitchell McClenaghan: 72 గంటలు కాలేదు.. భారత్- న్యూజిలాండ్ సిరీస్ 'మీనింగ్లెస్' ధోని మాలో ఒకడు: స్టాలిన్ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే సీజన్లలో కూడా సీఎస్కేకు ధోని కెప్టెన్గా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు. ‘నన్ను ముఖ్యమంత్రి హోదాలో సీఎస్కే యజమాని శ్రీనివాసన్ ఆహ్వానించారు. కానీ నేను ధోని ఫ్యాన్గా వచ్చాను. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి పెద్ద స్థాయికి ఎదిగిన ధోని అంటే నాన్నకు కూడా ఎంతో అభిమానం. అతను జార్ఖండ్ నుంచి వచ్చి ఉండవచ్చు. కానీ మా దృష్టిలో మాత్రం అతను తమిళనాడు ప్రజలలో ఒకడు’ అని స్టాలిన్ వ్యాఖ్యా నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ 2022 ఐపీఎల్ భారత్లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. A promise from #Thala…#Anbuden awaiting… 💛🦁#WhistlePodu #Yellove pic.twitter.com/zGKvtRliOY — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 20, 2021 -
ఈసారి ఐపీఎల్ వేలంలో నా పేరు చూడబోతున్నా
David Warner Confirms Name In IPL Mega Auction.. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ ఐపీఎల్ మెగా వేలంలో తన పేరును చూస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో వార్నర్ను ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాటర్గాను వార్నర్ పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన వార్నర్ 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక కరోనా విరామం తర్వాత మొదలైన ఐపీఎల్ సెకండ్ఫేజ్లో వార్నర్ కేవలం ఒక్క మ్యాచ్కు మాత్రమే పరిమితమయ్యాడు. ఆ తర్వాత డగౌట్కే పరిమితం కావడం.. ఆ తర్వాత జట్టుతో కలిసి కూర్చోకపోవడం.. క్రమేపీ దూరమవ్వడం స్పష్టంగా కనిపించింది. దీంతో వార్నర్ ఎస్ఆర్హెచ్ను వదిలి వేరే జట్టులో చేరబోతున్నట్లుగా సంకేతాలు అందాయి. తాజాగా టి20 ప్రపంచకప్ 2021 నేపథ్యంలో యూఏఈలోనే ఉన్న వార్నర్ స్పందించాడు. '' ఈసారి వేలంలో నా పేరును చూడాలనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ నన్ను ఎలాగో రిటైన్ చేసుకోదు కాబట్టి కచ్చితంగా వేలంలోకి వస్తా. ఈసారి కొత్త జట్టుతో చేరి ఫ్రెష్గా ఐపీఎల్ సీజన్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నా.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ENG Vs BAN: కన్ఫ్యూజ్ రనౌట్.. ఇంగ్లండ్ ఆటగాడి డ్యాన్స్ -
IPL: లక్నో ఫ్రాంచైజీ @ రూ.7,090 కోట్లు: టోర్నీ ఎలా మారబోతోంది? ఎన్ని మ్యాచ్లు?
పోలా... అదిరిపోలా! ఐపీఎలా మజాకా... మైదానంలో ఓ బ్యాట్, ఓ బాల్ ఆడే ఆట కోట్లకు, కోటాను కోట్లకు, రూ.వేలకోట్లకు అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. మళ్లీ లీగ్ను పది జట్ల విస్తృతి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నం రూ. 12,715 కోట్లు కురిపించింది. గోయెంకా గ్రూప్ అదానీని తలదన్నేసింది. అహ్మదాబాద్, లక్నోలపై ఎవరి ఊహకందని విధంగా రూ.7,090 కోట్లతో బిడ్ వేసింది. రెండింటిలో ఒకటి ఎంచుకునే అవకాశం కొట్టేసింది. చివరకు లక్నోవైపే మొగ్గు చూపింది. IPL New Teams Lucknow Ahmedabad : ఐపీఎల్లోకి వచ్చేందుకు ఎన్నో అంచనాలు రేకెత్తించిన అదానీ గ్రూప్... మ్యాచ్ దాకా కాదు కదా... కనీసం టాస్ దాకా అయినా రాలేకపోయింది. సోమవారం టెండర్లు తెరువగా... భారత కార్పొరేట్ సంస్థ గోయెంకా గ్రూప్, అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్)లు వరుసగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. ప్రాధాన్యక్రమంలో ఉన్న అహ్మదా బాద్ను కాదని తను మొదటి నుంచి కన్నేసిన లక్నోనే గోయెంకా గ్రూప్ ఎంచుకుంది. ఇందుకోసం రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా (ఆర్పీఎస్జీ) వెంచర్స్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్ డాలర్లు) వెచ్చించింది. ప్రపంచ వ్యాప్తంగా 22 కంపెనీలు బిడ్డింగ్పై ఆసక్తి కనబరిచాయి. చివరకు 9 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా అత్యధిక మొత్తం గోయెంకా గ్రూప్దే! ఐరిలియా కంపెనీ (సీవీసీ క్యాపిటల్) రూ. 5,625 కోట్లతో అహ్మదాబాద్ను దక్కించుకుంది. కొన్నాళ్లుగా వార్తల్లో, అంచనాల్లో... చివరకు బిడ్డర్ల జాబితాలో కూడా తొలి స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ రూ.5,100 కోట్లతో ఏ ఒక్క నగరాన్ని దక్కించుకోలేక వెనక్కి వెళ్లిపోయింది. ఏదేమైనా మన క్రికెట్ బోర్డు భాండాగారం మరింత బరువెక్కింది. రెండు ఫ్రాంచైజీలతోనే ఏకంగా రూ. 12,715 కోట్లు (సుమారు 1.7 బిలియన్ డాలర్లు) జమ చేసుకుంది. నిజానికి బోర్డు అంచనా వేసు కున్న మొత్తం రూ. 7 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లే! కానీ అంచనాను మించి రూ. 2,715 కోట్లు ఎక్కువ మొత్తం వచ్చింది. 2022లో జరిగే ఐపీఎల్ –15 సీజన్లో ఈ రెండు జట్లు బరిలోకి దిగుతాయి. ఐపీఎల్ విస్తరణ, టెండర్ల కంటే ముందే... అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియం మొదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్ ఐపీఎల్ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఒకానొక దశలో అదానీ జట్టు కోసమే లీగ్ విస్తరణ అనే గుసగుసలు వినిపించాయి. ఇంకా చెప్పాలంటే అహ్మదాబాద్, లక్నోల్లో ఆరునూరైనా అహ్మదాబాద్ అదానీదే అన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా గతేడాది కాలంగా రోజుకు రూ. 1,000 కోట్లకుపైగా ఆర్జించిన సంస్థ కావడంతో బీసీసీఐ లీగ్ విస్తరణ ప్రకటన నుంచే... మీడియాలో ప్రచురితమైన ప్రతీ వార్తలో అదానీ పేరు కనిపించింది. చివరకు 9 సంస్థలు పాల్గొన్న బిడ్డింగ్లో మూడో స్థానంతో అదానీ గ్రూప్ కంగుతినడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సీవీసీ క్యాపిటల్ ఎక్కడిది? లండన్ ప్రధాన కేంద్రంగా లక్జెంబర్గ్కు చెందిన ఈక్విటీ కంపెనీ సీవీసీ క్యాపిటల్. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ. ప్రధానంగా సేవల రంగానికి చెందిన ఈ సంస్థ 37 దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 300పైగా పెట్టుబడిదారులకు ఫండ్ మేనేజ్మెంట్ సేవలందిస్తోంది. మనదేశంలో బెంగళూరు కేంద్రంగా హెల్త్కేర్ రంగంలో ఉంది. అలాగే యునైటెడ్ లెక్స్ పేరుతో ఔట్సోర్సింగ్ సేవలు అందిస్తోంది. ఐపీఎల్కు కొత్తకావొచ్చేమో కానీ... క్రీడలతో సీవీసీకి సుదీర్ఘ బంధముంది. 2006 నుంచి 2017 వరకు ఫార్ములావన్లో మెజారిటీ స్టేక్హోల్డర్గా కొనసాగింది. సాకర్ క్రేజ్ యూరోప్లో ఫుట్బాల్, రగ్బీలపై కూడా సంస్థ పెట్టుబడులున్నాయి. గోయెంకా మనకు తెలిసిందే... గోయెంకా గ్రూప్ కోల్కతాకు చెందిన భారతీయ బహుళజాతి సంస్థ. దివంగత వ్యాపారవేత్త, టేకోవర్ కింగ్గా పేరుగాంచిన రాజీవ్ ప్రతాప్ గోయెంకా (ఆర్పీజీ) తన పేరుమీద స్థాపించిన సంస్థ. ఆయన తనయుడు సంజీవ్ గోయెంకా తండ్రి పేరును జత చేసి ఆర్పీఎస్జీ వెంచర్స్ లిమిటెడ్తో టెండరు వేసి గెలిచారు. ‘స్పెన్సర్స్’ హైపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ వాళ్లవే. అలా మన వంటింటి నేస్తమైంది. ఇంకా ఐటీ, విద్యుత్, ఎఫ్ఎమ్సీజీ, మీడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ రంగాల్లో గోయెంకా గ్రూప్ విస్తరించింది. కోల్కతా మహానగరానికి వెలుగులు నింపుతున్న ఏకైక విద్యుత్ పంపిణీ సంస్థ కలకత్త ఎలెక్ట్రిక్ సప్లయ్ కార్పోరేషన్ (సీఈఎస్సీ) గోయెంకాదే. ఉత్తర ప్రదేశ్లో కూడా విద్యుత్ పంపిణీ చేస్తోంది. పైగా ఐపీఎల్కు గోయెంకా గ్రూప్ కొత్తేం కాదు. 2016, 2017 సీజన్లలో రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ పేరుతో ఆడింది కూడా! ఐఎస్ఎల్ (ఫుట్బాల్ లీగ్)లో ఏటీకే మోహన్ బగాన్ ఎఫ్సీ యజమాని కూడా! ఎప్పట్లాగే 14 మ్యాచ్లే! ఇన్నాళ్లు 8 జట్లు ఆడినట్లే ఇకపైనా 10 జట్లు కూడా లీగ్ దశలో 14 మ్యాచ్లే ఆడతాయి. అయితే రెండు జట్ల వల్ల మ్యాచ్ల సంఖ్య మాత్రం 74కు చేరింది. అయితే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్లో 5 జట్లు తలపడతాయి. ఈ ఐదు జట్ల మధ్య ఇంటా (4), బయటా (4) ఎనిమిది మ్యాచ్లు జరుగుతాయి. అనంతరం అవతలి గ్రూప్లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్, ఒక్క జట్టుతో మాత్రం రెండు మ్యాచ్లు ఆడటం ద్వారా 14 మ్యాచ్లు పూర్తవుతాయి. చదవండి: T20 World Cup 2021: అఫ్గన్ సంచలనం.. 130 పరుగుల తేడాతో విజయం -
ఐపీఎల్ లో రెండు కొత్త జట్లును ప్రకటించిన బీసీసీఐ..
Two New IPL Teams Announced Lucknow And Ahmedabad: ఐపీఎల్-2022లో పాల్గొనే రెండు కొత్త జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఐపీఎల్ కొత్త జట్లుగా అహ్మదాబాద్, లక్నో అవతరించనున్నాయి. దుబాయ్లో జరిగిన బిడ్డింగ్లో అహ్మదాబాద్, లక్నో ఐపీఎల్ ప్రాంఛైజీలను దక్కించుకున్నాయి. ఈ బిడ్డింగ్ పక్రియలో ధర్మశాల, గువహతి, రాంచీ, లక్నో, అహ్మదాబాద్, కటక్ పోటీపడ్డాయి. సంజీవ్ గోయెంకా గ్రూప్ 7090 కోట్లకు లక్నో ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. సీవీసీ క్యాపిటల్స్ రూ. 5,625 కోట్లకు అహ్మదాబాద్ ప్రాంఛైజీని దక్కించుకుంది. దీంతో వచ్చే ఏడాది మెత్తం 10 జట్లు ఈ క్యాష్ రిచ్ లీగ్లో పాల్గొననున్నాయి. చదవండి: Ashish Nehra: రిజ్వాన్, బాబర్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు.. అయితే.. -
రేసులో అదానీ, గోయెంకా
దుబాయ్: మళ్లీ పది జట్ల ఐపీఎల్కు నేడు అడుగు పడనుంది. రూ.వేల కోట్ల అంచనాలతో దాఖలైన టెండర్లను నేడు తెరువనున్నారు. సుమారు 22 కంపెనీలు రూ. 10 లక్షలు వెచ్చించి మరీ టెండర్ దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ పోటీలో ప్రధానంగా ఐదారు కంపెనీలే ఉన్నట్లు తెలిసింది. ఇందులోనూ ఎలాగైనా దక్కించుకోవాలనే సంస్థలు మూడే! దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థలైన అదానీ గ్రూప్, గోయెంకా, అరబిందో సంస్థలు ఐపీఎల్లో తమ ‘జెర్సీ’లను చూడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ అదాయంపై గంపెడాశలు పెట్టుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశిస్తోంది. అందుకే కనీస బిడ్ ధర రూ. 2,000 కోట్లు పెట్టింది. అయినాసరే 22 కంపెనీలు టెండర్ల ప్రక్రియపై ఆసక్తి చూపాయంటే ఐపీఎల్ బ్రాండ్విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా బ్రాడ్కాస్టింగ్ హక్కుల మార్కెట్ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరింది. లీగ్కు సమకూరే ఈ ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. ఈ రకంగా చూసినా బోర్డు ఆశించినట్లు ఒక్కో జట్టుకు రూ. 7,000 కోట్లు కాకపోయినా రెండు కలిపి (రూ. 3,500 కోట్లు చొప్పున) ఆ మొత్తం గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. రేసులో అరబిందో గ్రూప్ ఉన్నప్పటికీ అదానీ, గోయెంకా కంపెనీలు ఫ్రాంచైజీలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్ లక్ష్యంగా అదానీ ఐపీఎల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్తాన్, పంజాబ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరే ఇంకో రెండు నగరాలేవో నేడు తేల్చేస్తారు. బరిలో అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్ ఉన్నప్పటికీ ప్రధానంగా అహ్మదాబాద్, లక్నోలే ఖరారు అవుతాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్, లక్నోలే ఫేవరెట్ నగరాలు. ముఖ్యంగా గుజరాత్కు చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్ లక్ష్యంగా టెండరు దాఖలు చేసింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ అనుభవమున్న ఆర్పీఎస్జీ (రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా) గ్రూపు లక్నోను చేజిక్కించుకునే అవకాశముంది. ఐపీఎల్లో చెన్నై, రాజస్తాన్లు రెండేళ్ల నిషేధానికి గురైనపుడు పుణే (రైజింగ్ పుణే సూపర్జెయింట్స్)తో ఐపీఎల్లోకి ప్రవేశించింది. -
నలుగురిని రిటైన్ చేసుకోవచ్చు.. సీఎస్కే నుంచి ధోని సహా 'ఆ ముగ్గురు'..!
IPL Teams Can Retain Upto 4 Players From Their Current Squad Before 2022 Auction: వచ్చే ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు జట్లు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల సంఖ్యపై బీసీసీఐ ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను నిలుపుకునేందుకు అవకాశం ఉంటుందని ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ పేర్కొంది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ముగ్గురు భారతీయ ఆటగాళ్లతో పాటు ఓ విదేశీ ఆటగాడు ఉంటాడని సమాచారం. ఇదిలా ఉంటే, ఆటగాళ్లను అట్టిపెట్టువడంపై ప్రస్తుత ఛాంపియన్ సీఎస్కే యాజమాన్యం ఇది వరకే ఓ క్లారిటీ ఇచ్చింది. జట్టు సారధి ధోనిని రిటైన్ చేసుకోనున్నట్లు స్వయానా ఆ ఫ్రాంచైజీ యజమానే వెల్లడించారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యపై తాజాగా ఓ క్లారిటీ రావడంతో మిగిలిన ముగ్గురు ఆటగాళ్లపై కూడా సీఎస్కే యాజమాన్యం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్లను స్వదేశీ ఆటగాళ్ల కోటాలో.. విదేశీ ప్లేయర్స్ కోటాలో బ్రావో లేదా డుప్లెసిస్లలో ఒకరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సీఎస్కే వర్గాల సమాచారం. చదవండి: T20 World Cup 2021: పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ అత్యంత చెత్త రికార్డు -
ఐపీఎల్పై ఆసక్తి చూపుతున్న క్రిస్టియానో రొనాల్డో జట్టు..!
Manchester United Owners Interested To Bid For Two IPL New Franchises: ఐపీఎల్-2022లో పాల్గొనే రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రపంచంలోనే సంపన్నమైన ఫుట్బాల్ క్లబ్లలో ఒకటైన మాంచెస్టర్ యునైటెడ్.. కొత్త ఐపీఎల్ జట్లలో ఒక దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం క్లబ్ యాజమాన్యమైన గ్లేజర్ కుటుంబం టెండర్ పత్రాలు సైతం కొనుగోలు చేసిందని సమాచారం. టెండర్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 20తో ముగినప్పటికీ.. సదరు క్లబ్ కోసం బీసీసీఐ చివరి తేదీని సైతం పొడిగించిందని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మాంచెస్టర్ క్లబ్ కొత్త ఐపీఎల్ జట్టును చేజిక్కించుకుంటే.. డబ్బుతో పాటు ఐపీఎల్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని బీసీసీఐ భావిస్తుంది. కాగా, స్టార్ ఫుట్బాలర్, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొత్త ఫ్రాంచైజీల రేసులో అహ్మదాబాద్, లక్నో, గౌహతి, కటక్, ఇండోర్, ధర్మశాల వంటి నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్, టోరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్పి-సంజీవ్ గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, జిందాల్ స్టీల్ వంటి దేశీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. వీటితో పాటు విదేశీ సంస్థలు కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొన వచ్చని బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఐపీఎల్ కొత్త జట్ల కొనుగోలు రేసులో నిలిచినట్లు తెలుస్తోంది. చదవండి: సండే బిగ్ మ్యాచ్.. మీరు ఒత్తిడిలో? మరి నా పరిస్థితి! -
చెన్నై‘సూపర్ కింగ్స్’.. అరుదైన ఘనత!
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశ్చర్యకర పరిణామాలకు కారణం కాబోతోంది. ధనా ధన్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఇటు ఐపీఎల్ లీగ్పరంగానే కాకుండా అటు మార్కెట్ వేల్యుయేషన్పరంగానూ దుమ్ము రేపుతోంది. ఏకంగా క్రీడా రంగంలో తొలి యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల పైగా విలువ) హోదా దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ఈ విషయంలో మాతృ సంస్థ ఇండియా సిమెంట్స్ వేల్యుయేషన్ను కూడా దాటిపోతుండడం మరో విశేషం. ఈమధ్యే నాలుగోసారి లీగ్ను గెల్చుకోవడంతో సీఎస్కే టీమ్ విలువపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్లో రెండు జట్లకు చోటు కల్పించనున్నారని, వీటి విలువను సుమారు రూ. 4,000– 5,000 కోట్లుగా లెక్కించనున్నారని అంచనాలు నెలకొన్నాయి. దీన్ని బట్టి చూస్తే, తొలి నుంచి నిలకడగా రాణిస్తున్న సీఎస్కే వేల్యుయేషన్ దాదాపు రెట్టింపు స్థాయికి చేరవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘‘గత శుక్రవారం అనధికారిక మార్కెట్లో సీఎస్కే షేరు ధర రూ. 135గా ఉంది. దీని ప్రకారం సీఎస్కే మార్కెట్ వేల్యుయేషన్ సుమారు రూ. 4,200 కోట్లు. అయితే, కొత్తగా వచ్చే జట్ల విలువ దాదాపు రూ. 4,000– 5,000 కోట్లుగా ఉంటే సీఎస్కే రిటైల్ షేరు ధర ఏకంగా రూ. 200కి చేరవచ్చు. దీంతో టీమ్ విలువ రూ. 8,000 కోట్లకు ఎగియవచ్చు. తద్వారా యూనికార్న్గా మారవచ్చు’’ అని పేర్కొన్నాయి. మరోవైపు, మంగళవారం నాటి పరిస్థితుల ప్రకారం సీఎస్కే మాతృ సంస్థ ఇండి యా సిమెంట్స్ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో షేరు ధర రూ. 205) మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 6,343 కోట్లుగా ఉంది. అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే సీఎస్కే విలువ ఇండియా సిమెంట్స్ వేల్యుయేషన్ను కూడా దాటిపోనుంది. ఇండియా సిమెంట్స్కు ఊతం ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్ శ్రీనివాసన్ కూడా ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే విలువ.. మాతృ సంస్థ వేల్యుయేషన్ను దాటేసే అవకాశాలపై ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీ లీగ్లు మరింతగా ప్రాచుర్యంలోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరో సందర్భంలో ఇండియా సిమెంట్స్కు సీఎస్కే ఊతంగా నిలుస్తోందంటూ ఆయన అంగీకరించారు. ‘‘ఇండియా సిమెంట్స్ నెలకొల్పి 75 ఏళ్లవుతోంది. అది స్వయంగా ఒక పటిష్టమైన బ్రాండ్. కానీ ఇప్పుడు సీఎస్కే మాతృ సంస్థగా గుర్తింపు పొందుతోంది. సీఎస్కే అనతికాలంలోనే ఇండియా సిమెంట్స్ ప్రాచుర్యాన్ని అధిగమించింది’’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ‘‘సీఎస్కే స్వయంగా ఒక భారీ బ్రాండ్గా ఆవిర్భవిస్తోంది. వేల్యుయేషన్ గణనీయంగా పెరుగుతోంది. అయితే, ఇండియా సిమెంట్స్ దీన్నేమీ విక్రయించకపోవచ్చు. ఎందుకుంటే బ్రాండింగ్పరంగా ఇది మాతృ సంస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది’’ అని బ్రాండ్ మార్కెటింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఇండియా సిమెంట్స్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎస్కే టీమ్ ప్లేయర్లు సందడి చేయడం ఇందుకు నిదర్శనంగా తెలిపాయి. సీఎస్కే టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అటు ఇండియా సిమెంట్స్లో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. నిలకడగా రాణింపు 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పట్నుంచీ .. మిగతా టీమ్లతో పోలిస్తే సీఎస్కే నిలకడగా రాణిస్తోంది. 196 మ్యాచ్లలో 117 మ్యాచ్లలో గెలుపొంది.. 59.69 శాతం విజయాల రేట్తో కొనసాగుతోంది. ధోనీ సారథ్యంలో సీఎస్కే ఇప్పటికే పటిష్టమైన బ్రాండ్గా ఎదిగిందని, ఒకవేళ రేపు ఎప్పుడైనా అతను తప్పుకున్నా కూడా దాని ప్రాభవం తగ్గకపోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సీఎస్కే టీమ్ నిర్వహణ తీరు ఇందుకు కారణమని వివరించాయి. ‘‘మంచి బ్రాండ్స్ ఎలా వ్యవహరించాలన్నది సీఎస్కే చూపించింది. నిలకడగా రాణించడం, ప్రజల ఆప్యాయతను చూరగొనడం ఇలా అన్ని కీలకమైన అంశాల్లోనూ ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది. పనితీరులో నిలకడగా రాణిస్తోంది. మిగతా బడా పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన టీమ్లను ధైర్యంగా ఎదుర్కొని, నిలబడగలుగుతోంది. పేరుకు చెన్నై సూపర్ కింగ్స్ అయినప్పటికీ చెన్నై పరిధిని దాటి దేశవ్యాప్తంగా అందరూ ఇష్టపడే టీమ్గా ఎదిగింది’’ అని పేర్కొన్నాయి. చదవండి: ఇన్వెస్టర్లకు ఐఆర్సీటీసీ షాక్ -
ధోని అభిమానులకు వరుస శుభవార్తలు.. తాజాగా మరొకటి
First Retention Card At Auction Will Be Used For Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2021 టైటిల్ చేజిక్కించుకున్న నాటి నుంచి ఆ జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు వరుసగా శుభవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తొలుత ధోని రెండోసారి తండ్రి కాబోతున్నాడన్న వార్త విని సంబరపడిపోయిన ఆయన అభిమానులు.. తాజాగా సీఎస్కే యాజమాన్యం చేసిన ప్రకటనతో ఎగిరి గంతులేస్తున్నారు. తాము ఉపయోగించబోయే తొలి రిటెన్షన్ కార్డు ధోని కోసమే అని సీఎస్కే వర్గాలు అధికారికంగా ప్రకటించడంతో తలా ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబైపోతున్నారు. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్కు ధోని అందుబాటులో ఉంటాడో లేదోనన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది. కాగా, తాను సీఎస్కేతోనే ఉండాలని అనుకుంటున్నానని, చెన్నైలో ఫేర్వెల్ గేమ్ ఆడాలని అనుకుంటున్నానని ధోని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్-2022లో ధోని ఆడేది లేనిది బీసీసీఐ రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆటగాళ్లకు అట్టిపెట్టుకునే పాలసీకి బీసీసీఐ స్వస్తి పలికితే.. ధోని ఐపీఎల్కు సైతం వీడ్కోలు పలికే అవకాశాలు లేకపోలేదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2021 ఫైనల్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్పై 27 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. చదవండి: నువ్వు కాకపోతే ఇంకొకరు.. పంత్కు కోహ్లి వార్నింగ్..! -
నాలుగోసారి ‘కింగ్స్’
ఐపీఎల్లో మళ్లీ ‘విజిల్ పొడు’... పసుపు మయమైన దుబాయ్ మైదానంలో తమ ఆరాధ్య ఆటగాడు మాహి మళ్లీ ఐపీఎల్ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తుంటే... దసరా రోజున చెన్నై క్రికెట్ అభిమానుల పండగ ఆనందం రెట్టింపైంది... అనుభవం, అద్భుత నాయకత్వం వెరసి చెన్నై మరోసారి ధనాధన్ లీగ్లో తమ విలువేంటో చూపించింది. తుది పోరులో అన్ని రంగాల్లో మెరిసి నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. మెరుపు బ్యాటింగ్తో మొదటి భాగంలోనే విజయానికి బాటలు వేసుకున్న జట్టు, బౌలింగ్లో కీలక సమయంలో సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టింది. ఫైనల్ పోరులో తమదైన పాత్ర పోషించిన ప్రతీ ప్లేయర్ హీరోలుగా నిలిచారు. అటు కోల్కతా నైట్రైడర్స్ ఆరంభంలోనే భారీగా పరుగులు సమరి్పంచుకొని పట్టు కోల్పోయింది. నమ్ముకున్న బౌలర్లంతా విఫలం కాగా... బ్యాటింగ్లో టోర్నీ ఆసాంతం వెంటాడిన మిడిలార్డర్ వైఫల్యం అసలు సమయంలో పెద్ద దెబ్బ కొట్టింది. ఫలితంగా తమ మూడో ఫైనల్ను ఓటమితో ముగించాల్సి వచి్చంది. దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నాలుగో టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మొయిన్ అలీ (20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 31; 3 సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు. అనంతరం కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శుబ్మన్ గిల్ (43 బంతుల్లో 51; 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఒకదశలో 91/0తో లక్ష్యం దిశగా సాగిన జట్టు... 34 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ కోల్కతా జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... సీజన్ మొత్తంలో ఆడిన తరహాలోనే చెన్నైకి మరోసారి ఓపెనర్లు రుతురాజ్, డు ప్లెసిస్ శుభారంభం అందించారు. షకీబ్ ఓవర్లో రుతురాజ్ వరుసగా 4, 6 కొట్టగా, అదృష్టం కలిసొచ్చిన డు ప్లెసిస్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. నరైన్ ఈ జోడీని విడదీసిన సమయంలో కోల్కతా స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది. అయితే మూడో స్థానంలో వచి్చన రాబిన్ ఉతప్ప ఉన్న కొద్దిసేపు మెరుపు బ్యాటింగ్తో ఆట గమనాన్ని మార్చేశాడు. మరోవైపు ఫెర్గూసన్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన 35 బంతుల్లోనే డు ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ బౌలింగ్లో ఉతప్ప వెనుదిరిగినా అలీ దూకుడుతో చెన్నై ఇన్నింగ్స్లో జోరు తగ్గలేదు. శివమ్ మావి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అలీ, వరుణ్ చక్రవర్తి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ కొట్టాడు. ఫెర్గూసన్ ఓవర్లో 19 పరుగులు రాబట్టి కింగ్స్ పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి బంతికి డు ప్లెసిస్ అవుటైనా... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల్లో (61, 63, 68) అతను తన పాత్రను సమర్థంగా పోషించాడు. ఓపెనర్లు మినహా... చెన్నైతో పోలిస్తే ఛేదనలో కోల్కతా మరింత దూకుడు కనబర్చింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వరుస బౌండరీలతో జోరును ప్రదర్శించగా, గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహర్, శార్దుల్ ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టాడు. పవర్ప్లేలో 55 పరుగులు రాగా, జడేజా ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. అయితే ఈ దశలో శార్దుల్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతని ఓవర్లో భారీ షాట్కు ప్రయతి్నంచిన వెంకటేశ్... జడేజా అద్భుత క్యాచ్కు వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడగా, అదే ఓవర్లో రాణా (0) అవుటయ్యాడు. నరైన్ (2), కార్తీక్ (9), షకీబ్ (0), గాయంతో బ్యాటింగ్కు దిగిన త్రిపాఠి (2), పేలవ ఫామ్లో ఉన్న కెపె్టన్ మోర్గాన్ (4) వరుసగా విఫలమయ్యారు. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్ వేగంగా పతనమైంది. చివర్లో 21 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన శివమ్ మావి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫెర్గూసన్ (18 నాటౌట్) కొన్ని మెరుపు షాట్లు ఆడి 39 పరుగులు జోడించినా అది వృథా ప్రయాసే అయింది. డు ప్లెసిస్కు అవకాశం ఇచి్చ... సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ చేసిన పెద్ద తప్పు చెన్నైకి ఊపిరి పోసింది. షకీబ్ బౌలింగ్లో డు ప్లెసిస్ ముందుకు దూసుకు రాగా, సునాయాస స్టంపింగ్ అవకాశాన్ని కార్తీక్ వదిలేశాడు. ఆ సమయంలో ప్లెసిస్ స్కోరు 4 మాత్రమే! ఆ తర్వాత అతనే భారీ స్కోరుకు కారణమయ్యాడు. కోల్కతా ఆటగాడు వెంకటేశ్ ‘0’ వచి్చన ఇచ్చిన క్యాచ్ను అనూహ్యంగా ధోని వదిలేసి అతని అర్ధ సెంచరీకి అవకాశం ఇచి్చనా... చివరకు అది నష్టం కలిగించలేదు. మరోవైపు 27 పరుగుల వద్ద గిల్ క్యాచ్ను రాయుడు అందుకున్నా... బంతి స్పైడర్ క్యామ్ వైర్కు తగిలి రావడంతో అంపైర్లు డెడ్బాల్గా ప్రకటించడం ధోనికి అసహనం తెప్పించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మావి (బి) నరైన్ 32; డు ప్లెసిస్ (సి) వెంకటేశ్ (బి) మావి 86; ఉతప్ప (ఎల్బీ) (బి) నరైన్ 31; మొయిన్ అలీ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–61, 2–124, 3–192. బౌలింగ్: షకీబ్ 3–0–33–0, మావి 4–0–32–1, ఫెర్గూసన్ 4–0–56–0, వరుణ్ 4–0–38–0, నరైన్ 4–0–26–2, వెంకటేశ్ 1–0–5–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 51; వెంకటేశ్ (సి) జడేజా (బి) శార్దుల్ 50; రాణా (సి) డు ప్లెసిస్ (బి) శార్దుల్ 0; నరైన్ (సి) జడేజా (బి) హేజల్వుడ్ 2; మోర్గాన్ (సి) చహర్ (బి) హేజల్వుడ్ 4; దినేశ్ కార్తీక్ (సి) రాయుడు (బి) జడేజా 9; షకీబ్ (ఎల్బీ) (బి) జడేజా 0; త్రిపాఠి (సి) అలీ (బి) శార్దుల్ 2; ఫెర్గూసన్ (నాటౌట్) 18; మావి (సి) చహర్ (బి) బ్రేవో 20; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–91, 2–93, 3–97, 4–108, 5–119, 6–120, 7–123, 8–125, 9–164. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–32–1, హేజల్వుడ్ 4–0–29–2, శార్దుల్ ఠాకూర్ 4–0–38–3, బ్రావో 4–0–29–1, జడేజా 4–0–37–2. ఐపీఎల్–2021 అవార్డులు ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ రుతురాజ్ గైక్వాడ్ –ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) హర్షల్ పటేల్–32 వికెట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హర్షల్ పటేల్ – ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ హర్షల్ పటేల్ – ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ రవి బిష్ణోయ్ (పంజాబ్ కింగ్స్) ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ హెట్మైర్ – ఢిల్లీ క్యాపిటల్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వెంకటేశ్ అయ్యర్ కోల్కతా నైట్రైడర్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ కేఎల్ రాహుల్ (30 సిక్స్లు) పంజాగ్ కింగ్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఫెయిర్ ప్లే టీమ్ ఆఫ్ ద సీజన్: రాజస్తాన్ రాయల్స్ -
వచ్చే ఏడాది ఐపీఎల్పై బీసీసీఐ బాస్ కీలక వ్యాఖ్యలు..
IPL 2022 Will Be Held In India Says Sourav Ganguly: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2022) భారత్లోనే జరగాలని కోరుకుంటున్నానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ భారత టోర్నీ అని, అందుకే భారత అభిమానులు ఈ లీగ్ స్వదేశంలో జరగాలని కోరుకుంటున్నారని అన్నాడు. 2022 సీజన్కు ఇంకా 8 నెలల సమయం ఉందని, అప్పటిలోగా దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ తొలి దశ మ్యాచ్లు భారత్లోనే జరిగినప్పటికీ.. కరోనా కారణంగా లీగ్ వాయిదా పడి యూఏఈకి తరలి వెళ్లింది. చదవండి: 17 ఏళ్ల తర్వాత పాక్లో పర్యటించనున్న టీమిండియా..! -
ధోని ఫ్యాన్స్కు శుభవార్త.. ఫేర్వెల్ గేమ్ అక్కడే..!
Dhoni Hints Playing Fare Well Game In Chennai: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన నాటి నుంచి అతని ఐపీఎల్ రిటైర్మెంట్పై కూడా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు, అప్పుడు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే వీటన్నిటిపై మాహీ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాడు. తన ఐపీఎల్ రిటైర్మెంట్ ఇప్పట్లో లేదని.. వచ్చే ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడతానని.. తన ఫేర్వెల్ గేమ్ చెన్నైలోని చెపాక్లోనే ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించాడు. తాజాగా తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇండియా సిమెంట్స్కు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ.. తన ఐపీఎల్ భవితవ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రకటనతో సీఎస్కే అభిమానులతో పాటు ధోని వ్యక్తిగత అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సోషల్మీడియా వేదికగా తెగ హల్చల్ చేస్తున్నారు. కాగా, ధోని.. 2019 ఐపీఎల్లో చివరిసారిగా చెన్నైలో ఆడాడు. గతేడాది ఐపీఎల్ యూఏఈలో జరగగా.. ఈ ఏడాది తొలి అంచె పోటీలు భారత్లో జరిగినా కరోనా కేసుల కారణంగా తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదు. ఇదిలా ఉంటే, వచ్చే సీజన్ కోసం జరుగబోయే మెగా వేలానికి ముందు ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్లను సీఎస్కే జట్టు రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చదవండి: పాక్తో పోరుకు ముందు అగ్రశ్రేణి జట్లను ఢీకొట్టనున్న కోహ్లి సేన.. షెడ్యూల్ ఇదే -
IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే
Debut Performances By Uncapped Indian Players.. ఐపీఎల్ లాంటి లీగ్ వల్ల చాలా మంది ఆటగాళ్లు పరిచయమవ్వడమే గాక జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశాలు తలుపు తట్టాయి. అలాంటి ఐపీఎల్ కొందరికి వెలుగునివ్వగా.. మరికొందరు రాణించినప్పటికి దేశవాలికే పరిమితమయ్యారు. జాతీయ జట్టుకు ఆడకుండానే ఐపీఎల్లో డెబ్యూ మ్యాచ్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు కొందరు ఉన్నారు. తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ డెబ్యూ మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్గా ఐపీఎల్లో అదరగొట్టిన ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం. చదవండి: PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ జస్ప్రీత్ బుమ్రా(2013, ముంబై ఇండియన్స్) Courtesy: Mumbai Indians బుమ్రా ఇప్పుడంటే టీమిండియా స్టార్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బుమ్రాకు గుర్తింపు రావడానికి మాత్రం ఐపీఎల్ ఒక కారణమని చెప్పొచ్చు. టీమిండియాకు ఆడకముందు 2013లో ముంబై ఇండియన్స్ తరపున బుమ్రా డెబ్యూ మ్యాచ్ ఆడాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్లో మూడు వికెట్లతో రాణించాడు. బుమ్రా తాను వేసిన తొలి బంతిని కోహ్లి బౌండరీ తరలించగా.. తరువాతి బంతికే కోహ్లిని అవుట్ చేసి ఐపీఎల్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్లను పెవిలియన్ చేర్చిన బుమ్రా ఓవరాల్గా 4 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. కానీ ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రెండు పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అలా తొలి మ్యాచ్లోనే తన బౌలింగ్తో ఆకట్టుకున్న బుమ్రా ప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక బౌలర్గా మారాడు. 𝐌𝐔𝐌𝐁𝐀𝐈 𝐈𝐍𝐃𝐈𝐀𝐍𝐒 - महाराष्ट्राच्या प्रत्येक फॅमिलीचा अभिमान 💙 चला पलटन, #IPL2021 मध्ये होऊ द्या आपलाच आवाज 🔥😎#OneFamily #MumbaiIndians pic.twitter.com/KkTSbiOkYg — Mumbai Indians (@mipaltan) September 15, 2021 స్వప్నిల్ అస్నోడ్కర్(2008, రాజస్తాన్ రాయల్స్) Courtesy: IPL. Com ఐపీఎల్ తొలి సీజన్(2008)లో రాజస్తాన్ రాయల్స్ చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అండర్డాగ్స్గా బరిలోకి దిగిన రాజస్తాన్ టైటిల్ గెలవడం వెనుక గోవా కుర్రాడు స్వప్నిల్ అస్నోడ్కర్ పాత్ర చాలా ఉంది. అప్పటి రాజస్తాన్ కెప్టెన్ షేన్ వార్న్ అస్నోడ్కర్పై నమ్మకముంచి ఓపెనింగ్ స్థానంలో పంపించాడు. అలా కేకేఆర్తో ఆడిన తొలి మ్యాచ్లోనే అస్నోడ్కర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. 34 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు చేశాడు. అతని దెబ్బకు రాజస్తాన్ 196 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో రాజస్తాన్ 45 పరుగులతో విజయాన్ని అందుకుంది. గ్రేమి స్మిత్కు జతగా ఓపెనర్గా వచ్చిన అస్నోడ్కర్ తొమ్మిది మ్యాచ్ల్లో 311 పరుగులు సాధించాడు. చదవండి: KKR vs RCB: డెస్సింగ్రూంలో సంబరాలు.. మేం మిమ్మల్ని ఓడించగలం వెంకటేశ్ అయ్యర్(2021, కోల్కతా నైట్రైడర్స్) Courtesy: KKR తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. డెబ్యూ మ్యాచ్లోనే శుబ్మన్ గిల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన అతను (41 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలిచి మ్యాచ్ను గెలిపించాడు. 27 బంతుల్లో 41 పరుగులు చేసిన వెంకటేశ్ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఆర్సీబీపై గెలవడంలో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్ అయ్యర్ రానున్న మ్యాచ్ల్లో కేకేఆర్కు కీలకంగా మారనున్నాడు. చదవండి: Suresh Raina Wicket: అయ్యో రైనా.. వికెట్తో పాటు బ్యాట్ను విరగొట్టుకున్నాడు -
కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు
అబుదాబీ: ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. లీగ్ చరిత్రలో ఒకే జట్టు తరఫున 200 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహించిన కోహ్లి.. నేడు కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్తో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లి తర్వాత ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 182 మ్యాచ్లు ఆడాడు. వీరిద్దరి తర్వాత సురేశ్ రైనా(సీఎస్కే తరఫున 172 మ్యాచ్లు), కీరన్ పోలార్డ్(ముంబై ఇండియన్స్ తరఫున 172 మ్యాచ్లు), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్ తరఫున 162 మ్యాచ్లు) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. ఇక ఇవాళ కేకేఆర్తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాచ్ రెండో ఓవర్లోనే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్లో 4 బంతులను ఎదుర్కొన్న విరాట్.. ఓ బౌండరీ బాది 5 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి ఔట్ అయ్యే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజ్లో పడిక్కల్(4), అరంగేట్రం కుర్రాడు శ్రీకర్ భరత్ ఉన్నారు. చదవండి: భారత్లో క్రికెట్ పండుగ.. కివీస్తో మొదలై దక్షిణాఫ్రికాతో ముగింపు -
ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2021 సీజన్ రెండో దశ చేరువవుతుండగా వేర్వేరు కారణాలతో జట్లలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్తాన్ రాయల్స్ జట్టు తమ అత్యంత కీలక ఆటగాడిని కోల్పోయింది. వికెట్ కీపర్ జాస్ బట్లర్ వ్యక్తిగత కారణాలతో లీగ్నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే అతని భార్య ప్రసవం ఉండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే రాజస్తాన్ జట్టు ఆర్చర్ సేవలు కోల్పోగా...స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఆడేది కూడా సందేహంగానే మారింది. బట్లర్ స్థానంలో న్యూజిలాండ్కు చెందిన వికెట్కీపర్ బ్యాట్స్మన్ గ్లెన్ ఫిలిప్స్ను రాయల్స్ ఎంచుకుంది. దూకుడైన ఆటకు పేరుపొందిన ఫిలిప్స్ కివీస్ జట్టు తరఫున 25 టి20ల్లో 149.70 స్ట్రైక్రేట్తో 506 పరుగులు సాధించాడు. తొలి సింగపూర్ ఆటగాడు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కూడా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి దశ పోటీల్లో ఆడిన ఆడమ్ జంపా, ఫిన్ అలెన్, డానియెల్ స్యామ్స్ ఈ సారి లీగ్కు దూరమయ్యారు. వారి స్థానాల్లో శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను జట్టు ఎంచు కుంది. సింగపూర్కు చెందిన బ్యాట్స్మన్ టిమ్ డేవిడ్ కూడా ఆర్సీబీ టీమ్లోకి ఎంపికయ్యాడు. సింగపూర్కు చెందిన ఒక ఆటగాడు ఐపీఎల్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ టీమ్ కూడా యూఏఈ చేరుకుంది. శనివారం ఆ జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. లెఫ్టార్మ్ పేసర్ అర్జున్ టెండూల్కర్ టీమ్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ పర్యవేక్షణలో సాధన చేశాడు. -
ముంబై, చెన్నై పోరుతో...
న్యూఢిల్లీ: భారత్లో మిగిలిపోయిన ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో షెడ్యూల్ ఖరారైంది. దుబాయ్లో సెప్టెంబర్ 19న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్తో ఐపీఎల్–14 పునఃప్రారంభం కానుంది. మొత్తం 31 మ్యాచ్ల్ని 27 రోజుల వ్యవధిలో నిర్వహిస్తామని, ఇందులో ఏడు రోజులు రెండేసి మ్యాచ్లు జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈలోని మూడు వేదికలైన దుబాయ్లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్లు జరుగుతాయి. రెండు మ్యాచ్లుంటే తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య అక్టోబర్ 8న జరిగే మ్యాచ్తో లీగ్ దశ ముగుస్తుంది. అనంతరం 10న దుబాయ్లో తొలి క్వాలిఫయర్, 11న ఎలిమినేటర్తోపాటు 13న రెండో క్వాలిఫయర్ షార్జాలో జరుగుతుంది. అక్టోబర్ 15న దుబాయ్లో జరిగే ఫైనల్తో ఐపీఎల్ ముగుస్తుంది. యూఏఈ ప్రభుత్వం అనుసరిస్తున్న క్వారంటైన్, ప్రొటోకాల్ నిబంధనల్ని ఆటగాళ్లు, నిర్వాహకులు పాటించాలి. కోవిడ్తో ఆలస్యమైన గత సీజన్ మ్యాచులన్నీ యూఏఈలోనే నిర్వహించారు. భారత్లో మొదలైన ఈ సీజన్ మేలో కరోనా కేసుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
రెండు కొత్త జట్లు.. భారీ వేలం..మార్గదర్శకాలను సిద్ధం చేసిన బీసీసీఐ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆగస్టు 2021 నుంచి జనవరి 2022 మధ్యలో రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం, భారీ వేలం, జట్ల సాలరీ పర్స్ ఇంక్రిమెంట్, మీడియా హక్కులు తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్లో విక్రయం పూర్తి చేస్తామని వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో(డిసెంబర్) భారీ వేలాన్ని నిర్వహిస్తామని, అలాగే మరుసటి ఏడాది జనవరిలో ప్రత్యక్ష ప్రసారాల హక్కులకు టెండర్లు పిలుస్తామని బీసీసీఐ ప్రకటించింది. కొత్త ఫ్రాంచైజీల కొనుగోలు కోసం సంజీవ్ గోయెంకా గ్రూప్ (కోల్కతా), అదానీ గ్రూప్ (అహ్మదాబాద్), అరబిందో ఫార్మా (హైదరాబాద్), టొరెంట్ గ్రూప్ (గుజరాత్) సహా మరికొన్ని వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అంశంపై కూడా బీసీసీఐ స్పష్టతనిచ్చింది. వేలానికి ముందు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లని రీటెయిన్ చేసుకోవచ్చని, ఇందులో ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడు లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. అలాగే ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. మరోవైపు పది జట్లతో నిర్వహించే ఐపీఎల్ ప్రసార హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోతాయని బీసీసీఐ అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఎనిమిది జట్లతో 60 మ్యాచులు నిర్వహిస్తుండగా, పది జట్లతో అయితే 90కి పైగా మ్యాచులు పైగా నిర్వహించే అవకాశం ఉంది. దాంతో 25% ఎక్కువ ధర లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
క్రికెటర్ అంకిత్ చవాన్కు ఊరట.. నిషేధం ఎత్తివేత
ఢిల్లీ: 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్లో దోషిగా తేలి జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ అంకిత్ చవాన్కు ఊరట కలిగింది. ఈ ముంబై మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. బీసీసీఐ బ్యాన్ ఎత్తివేయడంతో ఇకపై ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు అంకిత్ చవాన్కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడడంపై తాను పశ్చాత్తాపం చెందుతున్నానని.. అంకిత్ చవాన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ను కోరగా.. వారి సలహా మేరకు బీసీసీఐకి తనకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ మే నెలలో ఒక లేఖను రాశాడు. తాజాగా బీసీసీఐ అంకిత్ చవాన్పై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా అంకిత్ చవాన్ తన కెరీర్లో 7 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 15 లిస్ట్ ఏ మ్యాచ్లు, 19 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు బూకీలతో సంప్రదింపులు జరిపి స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు నిజమని తేలడంతో బీసీసీఐ వారిని జీవితకాలం క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కాగా తాను నిర్దోషినంటూ శ్రీశాంత్ గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. దాంతో గతేడా ఏడాది సెప్టెంబర్తో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తయింది. అనంతరం కేరళ తరపున శ్రీశాంత్ ముస్తాక్ అలీ ట్రోపీలో పాల్గొన్నాడు. చదవండి: 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు PSL: ఆటగాళ్ల బూతు పురాణం.. వీడియో -
అతని కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి..
ఆక్లాండ్: అరంగేట్రంలోనే డబుల్ సెంచరీతో దుమ్మురేపిన న్యూజిలాండ్ నయా సెన్సేషన్ డెవాన్ కాన్వేపై అతని వ్యక్తిగత కోచ్ గ్లెన్ పొక్నాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా క్రిక్ ట్రాకర్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్న అతి కొద్దిమంది క్రికెటర్లలో డెవాన్ కాన్వే అత్యుత్తమ ఆటగాడని ఆకాశానికెత్తాడు. త్వరలో జరుగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా.. కాన్వే పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని లేకపోతే, మ్యాచ్ను కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించాడు. కాన్వే ఐపీఎల్ ఎంట్రీపై గ్లెన్ పొక్నాల్ స్పందిస్తూ.. ఐపీఎల్ 2021 సీజన్ కోసం జరిగిన మినీ వేళంలో కాన్వే అన్ సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోవడం బాధించిందన్నాడు. రూ.50 లక్షల బేస్ ప్రైజ్కు కూడా అతన్ని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనపర్చకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. అయితే తదుపరి సీజన్లో పరిస్థితి వేరుగా ఉంటుందని, కాన్వే కోసం ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓపెనర్గా, మిడిలార్డ్ బ్యాట్స్మన్గా అవసరమైతే వికెట్ కీపర్గా రాణించగలిగే సత్తా ఉన్న కాన్వేను ముంబై ఇండియన్స్ సొంతం చేసకునే అవకాశాలున్నాయని అభిప్రాయడ్డాడు. ఇదే జరిగితే, రోహిత్ శర్మ, కాన్వేల జోడీ చూడముచ్చటగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా, దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కాన్వే.. 2017లో ఆ దేశాన్ని వదిలి న్యూజిలాండ్కు వలస వచ్చి అక్కడే సెట్ అయ్యాడు. 2017 మార్చిలో దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్లో ఆఖరి మ్యాచ్ ఆడిన కాన్వే.. అందులో డబుల్ సెంచరీ సాధించి, ఆ దేశానికి గుడ్బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 14 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడిన కాన్వే.. టీ20ల్లో 151.12 సగటులో 473 పరుగులు(4 అర్ధశతకాలు), వన్డేల్లో 75 సగటులో 225 పరుగులు(సెంచరీ, హాఫ్ సెంచరీ), టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 306 పరుగులు సాధించాడు. చదవండి: శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్ -
ఎట్టకేలకు సొంతగడ్డపై...
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనూహ్యంగా వాయిదా పడిన రోజునుంచి ఎప్పుడెప్పుడు ఇళ్లకు చేరుదామా అని ఎదురు చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఊరట లభించింది. భారత్నుంచి వచ్చే విమానాలపై తమ దేశం విధించిన ఆంక్షల నేపథ్యంలో మాల్దీవులలో కొన్ని రోజులు గడిపిన అనంతరం వీరంతా సొంతగడ్డపై అడుగు పెట్టారు. లీగ్లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు అందరూ సోమవారం ఉదయం స్వదేశంలోకి ప్రవేశించారు. ‘ఎయిర్ సీషెల్స్’ ఫ్లయిట్ ద్వారా వీరంతా సిడ్నీ నగరానికి చేరుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రికెటర్లు ఇప్పుడే తమ ఇంటికి వెళ్లేందుకు వీలు లేదు. రెండు వారాల పాటు వీరంతా స్థానిక మారియట్ హోటల్లో క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న చెన్నై కోచ్ మైక్ హస్సీ కూడా విడిగా ఖతర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మే 4న బీసీసీఐ ప్రకటించగా... అందరికంటే చివరగా ఆసీస్ క్రికెటర్లు సొంత దేశానికి వెళ్లగలిగారు. తమ ఆటగాళ్లు క్షేమంగా తిరిగి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ...అందుకు తగిన ఏర్పాట్లు చేసిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
IPL 2021 SRH vs DC: మరో గెలుపే లక్ష్యంగా...
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో పోరుకు సిద్ధమైంది. మూడు వరుస పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్పై గెలుపొందిన హైదరాబాద్... నేడు ఇక్కడి చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్లో మరో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో బంతితో, బ్యాట్తో మెరిసి తొలి విజయాన్ని అందుకున్న వార్నర్ బృందం ఆత్మ విశ్వాసంతో ఉంది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒకదాంట్లో మాత్రమే ఓడి మూడింటిలో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ సన్రైజర్స్కు చెక్ పెట్టేందుకు రెడీగా ఉంది. మరోసారి స్పిన్నర్లే కీలకం ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై ఆతిథ్యమివ్వనున్న చివరి మ్యాచ్ ఇదే. ఇప్పటి వరకు ఇక్కడ 9 మ్యాచ్లు జరగ్గా... కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే ఇరు జట్లు కూడా 150కిపైగా స్కోర్లను నమోదు చేశాయి. అంటే ఇక్కడి పిచ్ ఎంత మందకొడిగా ఉందో అర్థమవుతోంది. దాంతో హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్లో కూడా మరోసారి బౌలర్లే కీలకం కానున్నారు. అయితే బౌలర్ల గాయాలు హైదరాబాద్ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే మోకాలి గాయంతో నటరాజన్ ఐపీఎల్ నుంచి తప్పుకోగా... తొడ కండరాలు పట్టేయడంతో పంజాబ్తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే పేసర్ భువనేశ్వర్ కుమార్ మైదానం వీడాడు. ఆ మ్యాచ్లో అతడు తన పూర్తి కోటా ఓవర్లను వేయలేదు. దాంతో భువనేశ్వర్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగేది అనుమానమే. హైదరాబాద్కు నమ్మకమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న రషీద్ ఖాన్ ఈ సీజన్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో పేసర్ ఖలీల్ అహ్మద్, ఆల్రౌండర్ అభిషేక్ శర్మలు బౌలింగ్లో సత్తా చాటారు. కేన్ విలియమ్సన్ జట్టులోకి రావడంతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా బెయిర్స్టో సూపర్ ఫామ్లో ఉండగా... వార్నర్ కూడా పరుగులు సాధిస్తున్నాడు. ఢిల్లీ జట్టులో శిఖర్ ధావన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయితే మరో ఓపెనర్ పృథ్వీ షా ఫామ్ జట్టును కలవరపెడుతోంది. అతడు గాడిన పడాల్సి ఉంది. రిషభ్ పంత్, స్టీవ్ స్మిత్, హెట్మైర్, స్టొయినిస్లతో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లో అమిత్ మిశ్రా, రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్లు ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు రెడీగా ఉన్నారు. ముఖాముఖి పోరులో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 18 మ్యాచ్లు జరగ్గా... హైదరాబాద్ 11 మ్యాచ్లలో విజయం సాధించింది. ఢిల్లీ ఏడింటిలో గెలిచింది. -
కమిన్స్ మెరుపులు వృథా.. ఛేజింగ్లో కోల్కతా రనౌట్!
ముంబై: లక్ష్యం 221... ఛేదనలో ఆరు ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 45/5... ఇదీ క్లుప్తంగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఇన్నింగ్స్ ఆరంభం. అయితే ప్యాట్ కమిన్స్ (34 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్స్లు), ఆండ్రీ రసెల్ (22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్లు)ల విధ్వంసకర ఇన్నింగ్స్లు కేకేఆర్కు విజయాన్ని ఖాయం చేసేలా కనిపించాయి. చివర్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం... అదే సమయంలో చేతిలో వికెట్లు లేకపోవడంతో చిరస్మరణీయ విజయానికి కేకేఆర్ కొద్ది దూరంలో ఆగి ఓడింది. తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ డు ప్లెసిస్ (60 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలువగా... రుతురాజ్ గైక్వాడ్ (42 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన కోల్కతాను ఆరంభంలో దీపక్ చహర్ (4/29) తన పేస్తో దెబ్బకొట్టినా... అనంతరం పుంజుకుని 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇన్గిడి (3/28) కూడా ఆకట్టుకున్నాడు. తడబడి... 0, 9, 8, 7, 4 భారీ ఛేదనలో కోల్కతా టాప్–5 బ్యాట్స్మెన్ స్కోర్లు ఇవి. కొత్త బంతితో దీపక్ చహర్ మరోసారి మెరవడంతో కోల్కతా బ్యాట్స్మెన్ క్రీజులోకి అలా వచ్చి ఇలా వెళ్లారు. గిల్ (0), నితీశ్ రాణా (9), మోర్గాన్ (7), నరైన్ (4)లను దీపక్ చహర్ అవుట్ చేయగా... రాహుల్ త్రిపాఠి (8)ని ఇన్గిడి పెవిలియన్కు చేర్చాడు. రఫ్ఫాడించిన రసెల్, కమిన్స్ కోల్కతా టాప్–5 బ్యాట్స్మెన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా... రసెల్ రూపంలో ఓ భారీ తుఫాన్ సీఎస్కే బౌలర్లను ముంచేందుకు అప్పుడే వాంఖడే స్టేడియాన్ని తాకింది. రసెల్ ఆడింది 22 బంతులే అయినా... అతడు సృష్టించిన విధ్వంసం ఒక దశలో సీఎస్కే చేతుల్లో ఉన్న మ్యాచ్ను చేజారేలా చేసింది. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను బౌండరీకి తరలించిన అతడు... ఆ తర్వాత భారీ సిక్సర్ కొట్టాడు. ఇక శార్దుల్ ఠాకూర్ వేసిన పదో ఓవర్లో ఉగ్రరూపం దాల్చిన రసెల్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్తో మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. ఇదే జోరును కొనసాగించిన అతడు 21 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు దినేశ్ కార్తీక్ కూడా మెరుపులు మెరిపించడంతో విజయంపై కేకేఆర్కు ఆశలు మొదలయ్యాయి. అయితే స్యామ్ కరన్ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయకుండా రసెల్ క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. రసెల్, దినేశ్ కార్తిక్ ఆరో వికెట్కు కేవలం 24 బంతుల్లో 81 పరుగులు జోడించారు. రసెల్ అవుటైన కొద్ది సేపటికే దినేశ్ కార్తీక్ కూడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేరాడు. హమ్మయ్య... గెలిచేశాం... అని ధోని అనుకునేలోపల కమిన్స్ రూపంలో మరో తుఫాన్ వాంఖెడేను తాకింది. స్యామ్ కరన్ వేసిన 16వ ఓవర్లో కమిన్స్ వరుసగా 2, 6, 6, 6, 4, 6 బాది 30 పరుగులు రాబట్టడంతో చెన్నై మరోసారి అయోమయంలో పడింది. ఆ తర్వాత కూడా కమిన్స్ అడపాదడపా బౌండరీలు సాధిస్తూ 23 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. చెన్నై కూడా నాగర్కోటి (0), వరుణ్ చక్రవర్తి (0)లను అవుట్ చేయడంతో 19వ ఓవర్ ముగిసేసరికి కేకేఆర్ 201/9గా నిలిచింది. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 20 పరుగులు అవసరం కాగా... తొలి బంతిని స్ట్రయిట్గా ఆడిన కమిన్స్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా ప్రసిధ్ కృష్ణ నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో రనౌట్ అయ్యాడు. జస్ట్ మిస్... మరోసారి చెన్నై జట్టులో చోటు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోయాడు. మరో ఎండ్లో డు ప్లెసిస్ సమయోచితంగా ఆడాడు. పవర్ప్లే ముగిసేసరికి సీఎస్కే 54 పరుగులు చేసింది. రుతురాజ్ 33 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మరికొద్ది సేపటికే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన రుతురాజ్... మిడ్వికెట్ దగ్గర కమిన్స్ అద్భుతమైన క్యాచ్కు పెవిలియన్కు చేరాడు. రుతురాజ్ అవుటయ్యాక డు ప్లెసిస్... ధనాధన్ ఇన్నింగ్స్ను షురూ చేశాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసిన అతడు... మొయిన్ అలీ (12 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి రెండో వికెట్కు 50 పరుగులు, ధోని (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్కు 36 పరుగులు జోడించాడు. 19వ ఓవర్ ముగిసే సమయానికి డు ప్లెసిస్ 55 బంతుల్లో 82గా ఉన్నాడు. చివరి ఓవర్లో అతడి సెంచరీకి మరో 18 పరుగులు అవసరం కాగా... రెండు సిక్సర్లతో 13 పరుగులు మాత్రమే చేసిన డు ప్లెసిస్ సెంచరీ చేసే చాన్స్ను మిస్ చేసుకున్నాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) కమిన్స్ (బి) వరుణ్ చక్రవర్తి 64; డు ప్లెసిస్ (నాటౌట్) 95; మొయిన్ అలీ (స్టంప్డ్) దినేశ్ కార్తీక్ (బి) సునీల్ నరైన్ 26; ధోని (సి) మోర్గాన్ (బి) రసెల్ 17; జడేజా (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–115, 2–165, 3–201. బౌలింగ్: వరుణ్ చక్రవర్తి 4–0–27–1; కమిన్స్ 4–0–58–0; సునీల్ నరైన్ 4–0–34–1; ప్రసిధ్ కృష్ణ 4–0–49–0; రసెల్ 2–0–27–1; నాగర్కోటి 2–0–25–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) ఇన్గిడి (బి) దీపక్ చహర్ 0; నితీశ్ రాణా (సి) ధోని (బి) దీపక్ చహర్ 9; త్రిపాఠి (సి) ధోని (బి) ఇన్గిడి 8; మోర్గాన్ (సి) ధోని (బి) దీపక్ చహర్ 7; నరైన్ (సి) జడేజా (బి) దీపక్ చహర్ 4; దినేశ్ కార్తీక్ (ఎల్బీ) (బి) ఇన్గిడి 40; రసెల్ (బి) స్యామ్ కరన్ 54; కమిన్స్ (నాటౌట్) 66; నాగర్కోటి (సి) డు ప్లెసిస్ (బి) ఇన్గిడి 0; వరుణ్ చక్రవర్తి (రనౌట్) 0; ప్రసిధ్ కృష్ణ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 202. వికెట్ల పతనం: 1–1, 2–17, 3–27, 4–31, 5–31, 6–112, 7–146, 8–176, 9–200, 10–202. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–29–4, స్యామ్ కరన్ 4–0–58–1, ఇన్గిడి 4–0–28–3, జడేజా 4–0–33–0, శార్దుల్ ఠాకూర్ 3.1–0–48–0. -
SRH Vs PBKs: హైదరాబాద్ గెలిచిందోచ్!
హ్యాట్రిక్ పరాజయాల నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తేరుకుంది. నాలుగో మ్యాచ్తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో పంజాబ్ కింగ్స్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి... అనంతరం ఛేజింగ్లో బెయిర్స్టో, వార్నర్, విలియమ్సన్ నిలకడగా ఆడటంతో సన్రైజర్స్ తమ ఖాతాలో తొలివిజయాన్ని వేసుకుంది. చెన్నై: వరుస పరాజయాలకు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఫుల్స్టాప్ పెట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో తొలి విజయాన్ని అందుకుంది. ఇక్కడి చెపాక్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్లతో పంజాబ్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (17 బంతుల్లో 25; 2 సిక్స్లు), మయాంక్ అగర్వాల్ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఖలీల్ అహ్మద్ (3/21), అభిషేక్ శర్మ (2/24) బంతితో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి 121 పరుగులు చేసి సీజన్లో బోణీ కొట్టింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్స్టో (56 బంతుల్లో 63 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... వార్నర్ (37 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగాడు. అతడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆడుతూ పాడుతూ... గత మూడు మ్యాచ్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న వార్నర్, బెయిర్స్టో ఈసారి ఎటువంటి తడబాటుకు గురి కాలేదు. స్వల్ప లక్ష్యమే కావడంతో నింపాదిగా ఇన్నింగ్స్ను ఆరంభించారు. తొలి ఓవర్లో వార్నర్ పాయింట్ దిశగా ఫోర్ కొట్టగా... ఆ మరుసటి ఓవర్లో బెయిర్స్టో 4, 6 సాధించాడు. ఆ తర్వాత కూడా ఈ జంట బౌండరీలు రాబట్టడంతో హైదరాబాద్ స్కోరు బోర్డు సాఫీగా సాగింది. బౌండరీలతో పాటు వీరు సింగిల్స్, డబుల్స్కు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో పవర్ప్లేలో రైజర్స్ 50/0తో నిలిచింది. పేసర్లతో లాభం లేదనుకున్న పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పిన్నర్లను బరిలోకి దించాడు. పిచ్పై బంతి టర్న్ అవుతుండటంతో జాగ్రత్త పడ్డ వార్నర్, బెయిర్స్టో మూడు ఓవర్ల (7, 8, 9) పాటు బౌండరీ బాదలేకపోయారు. అయితే పదో ఓవర్ మూడో బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్ కొట్టిన వార్నర్... అలెన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దాంతో 73 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వార్నర్ అవుటయ్యే సమయానికి హైదరాబాద్ విజయ సమీకరణం 60 బంతుల్లో 48గా ఉంది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న కేన్ విలియమ్సన్ (19 బంతుల్లో 16 నాటౌట్)... బెయిర్స్టోతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హుడా బౌలింగ్లో ఫోర్ కొట్టిన బెయిర్స్టో 48 బంతుల్లో ఆర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీజన్లో బెయిర్స్టోకి ఇది రెండో అర్ధ సెంచరీ కావడం విశేషం. విలియమ్సన్, బెయిర్స్టో మరో వికెట్ పడకుండా ఇంకో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లాంఛనం పూర్తి చేశారు. టపటపా... అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ను హైదరాబాద్ బౌలర్లు ఏ దశలోనూ క్రీజులోకుదురుకోనివ్వలేదు. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ (4) భువనేశ్వర్ బౌలింగ్లో మిడ్వికెట్ దగ్గర ఉన్న కేదార్ జాదవ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఖాతా తెరవకముందే తాను ఇచ్చిన క్యాచ్ను రషీద్ ఖాన్ నేలపాలు చేయడంతో బతికిపోయిన మయాంక్ అగర్వాల్ రెండు ఫోర్లు కొట్టి టచ్లో ఉన్నట్లే కనిపించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన గేల్ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు)... సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఒక్కో బౌండరీ సాధించాడు. దాంతో పవర్ప్లేలో పంజాబ్ 32/1గా నిలిచింది. అయితే ఇక్కడే హైదరాబాద్ ఫీల్డర్లు మెరిశారు. ఖలీల్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతిని మయాంక్ పుల్ షాట్ ఆడగా... మిడ్వికెట్ దగ్గర ఉన్న రషీద్ ఖాన్ కుడి వైపునకు డైవ్ చేస్తూ బంతి నేలను తాకేలోపు చక్కటి క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్యాచ్పై ఫీల్డ్ అంపైర్లు టీవీ అంపైర్ను సంప్రదించారు.. రీప్లేలో బంతి కింద రషీద్ ఖాన్ వేళ్లు ఉండటంతో క్లీన్ క్యాచ్గా పరిగణించిన టీవీ అంపైర్ తన నిర్ణయాన్ని అవుట్గా ప్రకటించాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (0) ఒక్క బంతిని కూడా ఆడకుండానే రనౌట్ అయ్యాడు. ఎనిమిదో ఓవర్ తొలి బంతికి గేల్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా... వార్నర్ ఒక చక్కటి త్రోతో నేరుగా వికెట్లను గిరాటేసి పూరన్ (0)ను డగౌట్కు చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లో రషీద్ ఖాన్ గేల్ను వికెట్ల ముందు దొరకబ్చుకున్నాడు. దాంతో పంజాబ్ 10 ఓవర్లు ముగిసేసరికి 53/4తో కష్టాల్లో పడింది. క్రీజులో ఉన్న దీపక్ హుడా (13), హెన్రిక్స్ (14)లను తన వరుస ఓవర్లలో అభిషేక్ శర్మ అవుట్ చేయడంతో పంజాబ్ మూడంకెల స్కోరును చేరుకోవడం కూడా కష్టంగానే కనిపించింది. అయితే యువ ప్లేయర్ షారుఖ్ ఖాన్ మరోసారి పంజాబ్ పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచాడు. రెండు సిక్సర్లు బాది జట్టు స్కోరును 100 దాటించాడు. చివర్లో మరోసారి కమ్బ్యాక్ చేసిన సన్రైజర్స్ షారుఖ్ ఖాన్తో పాటు మురుగన్ అశ్విన్ (9), షమీ (3)లను అవుట్ చేయడంతో పంజాబ్ 20 ఓవర్లను కూడా పూర్తిగా ఆడకుండానే ఆలౌటైంది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) జాదవ్ (బి) భువనేశ్వర్ 4; మయాంక్ అగర్వాల్ (సి) రషీద్ ఖాన్ (బి) ఖలీల్ అహ్మద్ 22; క్రిస్ గేల్ (ఎల్బీ) (బి) రషీద్ ఖాన్ 15; నికోలస్ పూరన్ (రనౌట్) 0; దీపక్ హుడా (ఎల్బీ) (బి) అభిషేక్ శర్మ 13; హెన్రిక్స్ (స్టంప్డ్) బెయిర్స్టో (బి) అభిషేక్ శర్మ 14; షారుఖ్ ఖాన్ (సి) అభిషేక్ శర్మ (బి) ఖలీల్ అహ్మద్ 22; అలెన్ (సి) వార్నర్ (బి) ఖలీల్ అహ్మద్ 6; మురుగన్ అశ్విన్ (సి) బెయిర్స్టో (బి) సిద్దార్థ్ కౌల్ 9; షమీ (రనౌట్) 3; అర్‡్షదీప్ సింగ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–15, 2–39, 3–39, 4–47, 5–63, 6–82, 7–101, 8–110, 9–114, 10–120. బౌలింగ్: అభిషేక్ శర్మ 4–0–24–2, భువనేశ్వర్ 3–0–16–1, ఖలీల్ అహ్మద్ 4–0–21–3, సిద్ధార్థ్ కౌల్ 3.4–0–27–1, విజయ్ శంకర్ 1–0–6–0, రషీద్ ఖాన్ 4–0–17–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మయాంక్ (బి) అలెన్ 37; బెయిర్స్టో (నాటౌట్) 63; విలియమ్సన్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 121. వికెట్ల పతనం: 1–73. బౌలింగ్: షమీ2–0–16–0, ఫాబియన్ అలెన్ 4–1–22–1, అర్‡్షదీప్ సింగ్ 3.4–0–31–0, హెన్రిక్స్ 1–0–7–0, మురుగన్ అశ్విన్ 4–0–22–0, దీపక్ హుడా 4–0–22–0. -
IPL 2021, CSK vs RR: చెన్నై సూపర్...
ఒకరిద్దరు కాకుండా... కలసికట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 33 దాటకున్నా వచ్చిన వారందరూ క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడేసి తమవంతు పరుగులు చేసేసి వెళ్లారు. దాంతో చెన్నై జట్టు ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. అనంతరం బౌలింగ్లోనూ చెన్నై సమష్టిగా మెరిసింది. మొయిన్ అలీ, రవీంద్ర జడేజా ‘స్పిన్’తో తిప్పేయగా... పేస్తో స్యామ్ కరన్, శార్దుల్, బ్రావో హడలెత్తించారు. వెరసి ఐపీఎల్లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ముంబై: ఆల్రౌండ్ షోతో అలరించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వాంఖెడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో ధోని నాయకత్వంలోని సీఎస్కే 45 పరుగుల ఆధిక్యంతో రాజస్తాన్ రాయల్స్పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అంబటి రాయుడు (17 బంతుల్లో 27; 3 సిక్స్లు), మొయిన్ అలీ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు) తలా ఓ చెయ్యి వేశారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ను చెన్నై బౌలర్లు మొయిన్ అలీ (3/7), స్యామ్ కరన్ (2/24), రవీంద్ర జడేజా (2/28) కట్టడి చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. మెరిసిన టాపార్డర్ టాస్ ఓడి సీఎస్కే బ్యాటింగ్కు దిగగా... రుతురాజ్ గైక్వాడ్ (10) మరోసారి విఫలమయ్యాడు. మరో ఓపెనర్ డు ప్లెసిస్ మాత్రం తన బ్యాట్ను స్వేచ్ఛగా ఝుళిపించాడు. ఉనాద్కట్ వేసిన ఐదో ఓవర్లో రెచ్చిపోయిన డు ప్లెసిస్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అయితే అదే దూకుడును కొనసాగించలేకపోయిన అతడు... మోరిస్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి డీప్ పాయింట్ వద్ద పరాగ్ చేతికి చిక్కాడు. మరో ఎండ్లో ఉన్న మొయిన్ అలీ కూడా దూకుడుగా ఆడాడు. ముస్తఫిజుర్ వేసిన ఏడో ఓవర్లో షార్ట్ థర్డ్మ్యాన్, డీప్ మిడ్వికెట్ దిశగా రెండు బౌండరీలు బాదిన అలీ... ఆ మరుసటి ఓవర్లో డీప్ మిడ్వికెట్ మీదుగా కొట్టిన ఫ్లాట్ సిక్సర్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అయితే అలీ కూడా డు ప్లెసిస్లాగే తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోరు చేయడానికి ఉపయోగించుకోలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 82/3గా ఉంది. ఈ దశలో రైనా, రాయుడు కూడా హిట్టింగ్కే ప్రాధాన్యం ఇచ్చారు. 14వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన సకారియా... ఆ ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి రాయుడు, రైనాలను అవుట్ చేసి రాజస్తాన్కు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. ధోని (18), జడేజా (8) వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరగా... చివర్లో బ్రావో (8 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్)... స్యామ్ కరన్ (6 బంతుల్లో 13; 1 సిక్స్) 14 బంతుల్లో 33 పరుగులు జోడించారు. బట్లర్ బాదినా... ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ను స్యామ్ కరన్ దెబ్బ కొట్టాడు. తన వరుస ఓవర్లలో మనన్ వోహ్రా (14), కెప్టెన్ సామ్సన్ (1)లను అవుట్ చేసి చెన్నైకి శుభారంభం చేశాడు. మరో ఎండ్లో బట్లర్ బౌండరీలు బాదేస్తూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా... అతనికి శివమ్ దూబే (17; 2 ఫోర్లు) సహకరించాడు. దాంతో రాజస్తాన్ 10 ఓవర్లు ముగిసేసరికి 81/2గా నిలిచింది. 12వ ఓవర్ వేసిన జడేజా... మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గుడ్లెంగ్త్ బాల్తో బట్లర్ను జడేజా క్లీన్బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి దూబేను ఎల్బీగా అవుట్ చేసి మ్యాచ్ను సీఎస్కే వైపు తిప్పాడు. ఆ తర్వాత ఆశలు పెట్టుకున్న మిల్లర్ (2), పరాగ్ (3), మోరిస్ (0)లను మొయిన్ అలీ అవుట్ చేయడంతో... ఒకదశలో 87/2గా ఉన్న రాజస్తాన్ 8 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయి 95/7గా నిలిచింది. చివర్లో తెవాటియా (20; 2 సిక్స్లు), ఉనాద్కట్ (24; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా ఫలితం లేకపోయింది. వావ్... ధోని 40 ఏళ్లకు చేరువలో ఉన్నా ధోని ఫిట్నెస్లో మాత్రం ఏ మార్పు లేదు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ధోని... ఆ ఏడాది జరిగిన ఐపీఎల్లో తప్ప క్రికెట్ ఆడింది లేదు. అయినా సరే వికెట్ల వెనుక, వికెట్ల మధ్య అతడి వేగం ఏ మాత్రం తగ్గలేదు. ఈ విషయం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో మరోసారి నిరూపితమైంది. ఏడో నెంబర్లో బ్యాటింగ్ వచ్చిన ధోని... 15వ ఓవర్ రెండో బంతిని షార్ట్ ఎక్స్ట్రా కవర్లోకి ఆడి పరుగు కోసం పిచ్ మధ్య వరకు వచ్చాడు. అయితే బంతి బట్లర్ వద్దకు వెళ్లడంతో పరుగు వద్దంటూ నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న జడేజా ధోనిని వారించాడు. బట్లర్ రాకెట్ వేగంతో బంతిని కీపర్కు విసరగా... రెప్పపాటులో ధోని... వెనక్కి తిరిగి సామ్సన్ వికెట్లను గిరాటేసేలోపు సూపర్ డైవ్తో క్రీజును చేరుకున్నాడు. దాంతో అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) శివమ్ దూబే (బి) ముస్తఫిజుర్ 10; డు ప్లెసిస్ (సి) పరాగ్ (బి) మోరిస్ 33; మొయిన్ అలీ (సి) పరాగ్ (బి) తెవాటియా 26; రైనా (సి) మోరిస్ (బి) సకారియా 18; రాయుడు (సి) పరాగ్ (బి) సకారియా 27; జడేజా (సి) సామ్సన్ (బి) మోరిస్ 8; ధోని (సి) బట్లర్ (బి) సకారియా 18; స్యామ్ కరన్ (రనౌట్) 13; బ్రావో (నాటౌట్) 20; శార్దుల్ ఠాకూర్ (రనౌట్) 1; దీపక్ చహర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–25, 2–45, 3–78, 4–123, 5–125, 6–147, 7–163, 8–174, 9–180. బౌలింగ్: జైదేవ్ ఉనాద్కట్ 4–0–40–0; చేతన్ సకారియా 4–0–36–3; ముస్తఫిజుర్ 4–0–37–1; మోరిస్ 4–0–33–2; రాహుల్ తెవాటియా 3–0–21–1; రియాన్ పరాగ్ 1–0–16–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (బి) జడేజా 49; మనన్ వొహ్రా (సి) జడేజా (బి) స్యామ్ కరన్ 14; సామ్సన్ (సి) బ్రావో (బి) స్యామ్ కరన్ 1; శివమ్ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 17; మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మొయిన్ అలీ 2; పరాగ్ (సి) జడేజా (బి) మొయిన్ అలీ 3; తెవాటియా (సి) రుతురాజ్ (బి) బ్రావో 20; మోరిస్ (సి) జడేజా (బి) మొయిన్ అలీ 0; ఉనాద్కట్ (సి) జడేజా (బి) శార్దుల్ ఠాకూర్ 24; సకారియా (నాటౌట్) 0; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–30, 2–45, 3–87, 4–90, 5–92, 6–95, 7–95, 8–137, 9–143. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–32–0; స్యామ్ కరన్ 4–0–24–2; శార్దుల్ ఠాకూర్ 3–0–20–1; జడేజా 4–0–28–2; బ్రావో 3–0–28–1; మొయిన్ అలీ 3–0–7–3. -
సంజూ ఔట్... పంజాబ్ విన్
అయ్యయ్యో ప్రేక్షకులు! మాయదారి కరోనా వల్ల మంచి మ్యాచ్లను మైదానంలో చూడలేకపోతున్నారు! లేదంటే సోమవారం నాటి మ్యాచ్లో దంచిన సిక్సర్లు ప్రేక్షకుల గ్యాలరీలో ఎంతమంది చేతుల్లో పడేవో! ఏదైతేనేం టీవీల్లో బోలెడంత వినోదాన్ని పంచిన మ్యాచ్లో కొండంత స్కోరు, సిక్సర్ల హోరు ఆఖరిదాకా ఇదే జోరు ఉత్కంఠ రేకెత్తించింది. చివరి బంతికి తేలిన ఫలితంలో రాజస్తాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. ముంబై: ఐపీఎల్లో అదిరిపోయే బొమ్మ పడింది. భారీస్కోర్లతో అభిమానులకు మజా పంచింది. ఆఖరిదాకా ఉత్కంఠ పెంచింది. చివరకు ఓ అసాధారణ పోరాటం (సంజూ సామ్సన్) బౌండరీ లైన్ దగ్గర దీపక్ హుడా చేతికి చిక్కింది. దీంతో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 200 పైచిలుకు పరుగులు చేసి కూడా... పంజాబ్ కింగ్స్ 4 పరుగులతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ (63 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... దీపక్ హుడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్లు) హైలైట్స్ చూపించాడు. చేతన్ సకారియా 3, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసి ఓడిపోయింది. రాహుల్, హుడా ఎడాపెడా... పంజాబ్ ఇన్నింగ్స్లో మయాంక్ (14) ఎక్కువ సేపు నిలువలేదు. గేల్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్లు) పదో ఓవర్ పూర్తికాకముందే ఔటయ్యాడు. సగం ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 89/2. ఆ తర్వాత 10 ఓవర్లలో పంజాబ్ ఏకంగా 132 పరుగులు చేసింది. స్కోరు 17.1వ ఓవర్లలోనే 200 పరుగుల్ని అవలీలగా దాటేసింది. ఇన్నింగ్స్ 13, 14 ఓవర్లయితే ప్రత్యర్థి బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చాయి. దూబే 13వ ఓవర్లో రాహుల్ సిక్స్ కొట్టి 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంటే... హుడా రెండు సిక్స్లు బాది విధ్వంసానికి తెగబడ్డాడు. ఈ 12 బంతుల వ్యవధిలో అరడజను సిక్సర్లు వచ్చాయి. స్కోరేమో కొండంత అయ్యింది. కేవలం 20 బంతుల్లోనే దీపక్ హుడా అర్ధసెంచరీని అధిగమించాడు. సెంచరీకి చేరువైన రాహుల్ చివరి ఓవర్లో ఔటయ్యాడు. సామ్సన్ సూపర్... కొండంత లక్ష్యాన్ని చూసి రాజస్తాన్ రాయల్స్ జడిసిపోలేదు. హిట్టర్ స్టోక్స్ (0) తొలి ఓవర్లో డకౌటైనా కంగారు పడిపోలేదు. దిమ్మదిరిగే బదులిచ్చేందుకు రాజస్తాన్ పరుగూ పరుగూ పోగేసింది. బౌండరీలనూ జతచేసింది. సిక్సర్లతో వేగం పెంచుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ సామ్సన్కు వచ్చిన రెండు లైఫ్లు లక్ష్యాన్ని దించేందుకు దోహదం చేశాయి. 12 పరుగుల వద్ద కీపర్ రాహుల్ సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తయ్యాక ఎల్బీగా వెనుదిరగాల్సిన సంజూ రివ్యూతో బతికిపోయాడు. బట్లర్ (25; 5 ఫోర్లు), శివమ్ దూబే (23; 3 ఫోర్లు) వేగంగా ఆడినా... ఎక్కువసేపు నిలువలేదు. ఆ తర్వాత రియాన్ పరాగ్ (11 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్లు)తో కలిసి సామ్సన్ ప్రత్యర్థి బౌలర్లను చావబాదాడు. ఐదో వికెట్కు వీరిద్దరి మధ్య చకచకా సాగిన 52 పరుగుల భాగస్వామ్యం జట్టులో ఆశల్ని కసికసిగా పెంచింది. చివరకు సామ్సన్ 54 బంతుల్లోనే సాధించిన సెంచరీ గెలుపుదారిలో పడేసింది. కానీ ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అర్‡్షదీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి సామ్సన్కు పరుగు రాలేదు. రెండో బంతికి సామ్సన్... మూడో బంతికి మోరిస్ సింగిల్స్ తీశారు. నాలుగో బంతిని సామ్సన్ సిక్సర్గా మలిచాడు. దాంతో రాజస్తాన్ గెలుపునకు 2 బంతుల్లో 5 పరుగులు అవరసమయ్యాయి. ఐదో బంతిని సామ్సన్ లాంగ్ఆఫ్ వద్దకు ఆడగా... మోరిస్ సింగిల్ కోసం వచ్చాడు. కానీ సామ్సన్ సింగిల్ వద్దనడంతో మోరిస్ వెనక్కి వెళ్లిపోయాడు. దాంతో చివరి బంతికి రాజస్తాన్ గెలుపునకు 5 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆరో బంతిని సామ్సన్ కవర్స్లో కొట్టిన భారీ షాట్ బౌండరీ దాటకుండా పంజాబ్ ఫీల్డర్ దీపక్ హుడా చేతికి చిక్కింది. దాంతో చేజారిందనుకున్న మ్యాచ్లో పంజాబ్ విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) తెవాటియా (బి) సకారియా 91; మయాంక్ (సి) సంజూ సామ్సన్ (బి) సకారియా 14; గేల్ (సి) స్టోక్స్ (బి) పరాగ్ 40; దీపక్ హుడా (సి) పరాగ్ (బి) మోరిస్ 64; పూరన్ (సి) సకారియా (బి) మోరిస్ 0; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 6; జే రిచర్డ్సన్ (సి) మోరిస్ (బి) సకారియా 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–22, 2–89, 3–194, 4–201, 5–220, 6–221. బౌలింగ్: చేతన్ సకారియా 4–0–31–3, ముస్తాఫిజుర్ 4–0–45–0, మోరిస్ 4–0–41–2, శ్రేయస్ గోపాల్ 3–0–40–0, స్టోక్స్ 1–0–12–0, తెవాటియా 2–0–25–0, రియాన్ పరాగ్ 1–0–7–1, దూబే 1–0–20–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (సి అండ్ బి) షమీ 0; వొహ్రా (సి అండ్ బి) అర్‡్షదీప్ సింగ్ 12; సంజూ సామ్సన్ (సి) హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 119; బట్లర్ (బి) రిచర్డ్సన్ 25; శివమ్ దూబే (సి) హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 23, పరాగ్ (సి) రాహుల్ (బి) షమీ 25; తెవాటియా (సి) రాహుల్ (బి) మెరెడిత్ 2; మోరిస్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–0, 2–25, 3–70, 4–123, 5–175, 6–201, 7–217. బౌలింగ్: షమీ 4–0–33–2, రిచర్డ్సన్ 4–0–55–1, అర్‡్షదీప్ సింగ్ 4–0–35–3, మెరెడిత్ 4–0–49–1, మురుగన్ అశ్విన్ 4–0–43–0. ఐపీఎల్లో నేడు కోల్కతా నైట్రైడర్స్ X ముంబై ఇండియన్స్ వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
ఐపీఎల్ 2021: ఢిల్లీ ధమాకా...
కొన్నేళ్లుగా తమను ఊరిస్తోన్న ఐపీఎల్ టైటిల్ వేటను గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ప్రారంభించింది. మూడుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. లక్ష్యం భారీగా ఉన్నా ఆరంభం నుంచే శిఖర్ ధావన్, పృథ్వీ షా ఎదురుదాడి చేయడంతో తుదకు ఢిల్లీకి విజయం సునాయాసంగానే దక్కింది. పునరాగమనంలో సురేశ్ రైనా దూకుడు కనబర్చినా... బౌలింగ్, పేలవ ఫీల్డింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ను ఓటమితో మొదలుపెట్టింది. ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కు అదిరే ఆరంభం లభించింది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ ఏడు వికెట్లతో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా (36 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... మొయిన్ అలీ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు), స్యామ్ కరన్ (15 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. వోక్స్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం ఢిల్లీ 18.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (54 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్లు), పృథ్వీ షా (38 బంతుల్లో 72; 9 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో ఢిల్లీ జట్టు (డేర్డెవిల్స్, క్యాపిటల్స్) తరఫున 100వ మ్యాచ్ ఆడిన తొలి ప్లేయర్గా అమిత్ మిశ్రా నిలిచాడు. ఆడుతూ పాడుతూ... ఛేదనను ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతూ పాడుతూ ఆరంభించింది. భారీ లక్ష్యం కళ్లముందున్నా ఎక్కడా తొందరపాటుకు గురికాని ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా స్కోరు బోర్డును పరుగెత్తించారు. స్యామ్ కరన్ వేసిన నాలుగో ఓవర్లో ధావన్ సిక్స్, ఫోర్ కొట్టగా... పృథ్వీ షా మరో ఫోర్ సాధించడంతో 17 పరుగులు లభించాయి. ఐదో ఓవర్లో మరింత రెచ్చిపోయిన పృథ్వీ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో కూడా 17 పరుగులు వచ్చాయి. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. పృథ్వీ షా (38, 47 పరుగుల వద్ద్ద) ఇచ్చిన రెండు క్యాచ్లను సాన్ట్నెర్, రుతురాజ్ జారవిడిచారు. దాంతో 27 బంతుల్లో పృథ్వీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... రెండు బంతుల అనంతరం ధావన్ కూడా 35 బంతుల్లో ఆ మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ 10.1 ఓవర్లలో 100 పరుగుల మార్కును అందుకుంది. ఆ తర్వాత మరింత దూకుడును కనబర్చిన ధావన్–పృథ్వీ జంట ఏ బౌలర్నూ వదల్లేదు. శార్దుల్ ఠాకూర్, బ్రావో, మొయిన్ అలీ ఇలా ఎవరు బౌలింగ్కు దిగినా వారికి ఫోర్ లేదా సిక్స్తో స్వాగతం లభించింది. అయితే 14వ ఓవర్లో సీఎస్కేకు తొలి వికెట్ లభించింది. ఆ ఓవర్లో బ్రావో వేసిన మూడో బంతిని బ్యాలెన్స్ తప్పి పృథ్వీ షాట్ ఆడగా... స్వీపర్ కవర్ దగ్గర అలీ క్యాచ్ అందుకోవడంతో 138 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. మరికాసేపటికే సెంచరీ చేసేలా కనిపించిన ధావన్ను శార్దుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అప్పటికే ఢిల్లీ విజయానికి చేరువ కాగా... మిగిలిన పనిని పంత్ (15 నాటౌట్; 2 ఫోర్లు), స్టొయినిస్ ( 14; 3 ఫోర్లు) పూర్తి చేశారు. రైనా జోరు... అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు శుభారంభం లభించలేదు. పేలవ ఫామ్లో ఉన్న డు ప్లెసిస్ (0) డకౌట్గా వెనుదిరగ్గా... ఫోర్ కొట్టి టచ్లో కనిపించిన రుతురాజ్ గైక్వాడ్ (5)ను వోక్స్ పెవిలియన్కు చేర్చడంతో సీఎస్కే 7 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సురేశ్ రైనా, మొయిన్ అలీ ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. మూడో ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టిన రైనా తన పరుగుల వేటను ఆరంభించాడు. అవేశ్ ఖాన్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అలీ... తన ఇన్నింగ్స్ను కూడా ధాటిగా ఆరంభించాడు. ఇక్కడి నుంచి వీరిద్దరూ ఓవర్కు రెండు బౌండరీల చొప్పును రాబడుతూ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. అశ్విన్ వేసిన 9వ ఓవర్ తొలి రెండు బంతులను బౌలర్ మీదుగా రెండు సిక్స్లు కొట్టిన అలీ... ప్రమాదకారిగా కనిపించాడు. అయితే ఆ మరుసటి బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయిన అలీ షార్ట్ థర్డ్ మ్యాన్ దగ్గర ఉన్న ధావన్ చేతికి చిక్కాడు. దాంతో అలీ, రైనా 53 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అలీ పెవిలియన్ చేరాక గేర్ మార్చిన రైనా ధనాధన్ ఇన్నింగ్స్ను షురూ చేశాడు. మూడు ఓవర్ల వ్యవధిలో నాలుగు సిక్స్లు బాది 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు. మరో ఎండ్లో అంబటి రాయుడు (23; 1 ఫోరు, 2 సిక్స్లు) అతడికి చక్కటి సహకారం అందించడంతో చెన్నై స్కోరు 100 పరుగులు దాటింది. వీరు నాలుగో వికెట్కు 63 పరుగులు జోడించారు. రాయుడు అవుటైన కాసేపటికే జడేజా (26 నాటౌట్; 3 ఫోర్లు)తో సమన్వయ లోపంతో రైనా రనౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన ధోని (0) నిరాశ పరిచాడు. చివర్లో స్యామ్ కరన్, జడేజా దూకుడుగా ఆడటంతో సీఎస్కే చివరి ఐదు ఓవర్లో 52 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్కు చెందిన ‘కరన్ బ్రదర్స్’ స్యామ్, టామ్ ఈ మ్యాచ్లో ఎదురెదురుగా ఆడారు. స్యామ్ చెన్నై తరఫున, టామ్ ఢిల్లీ తరఫున బరిలోకి దిగారు. చెన్నై ఇన్నింగ్స్లో టామ్ బౌలింగ్లో స్యామ్ 9 బంతులు ఎదుర్కొన్నాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) ధావన్ (బి) వోక్స్ 5; డు ప్లెసిస్ (ఎల్బీ) అవేశ్ ఖాన్ 0; మొయిన్ అలీ (సి) ధావన్ (బి) అశ్విన్ 36; రైనా (రనౌట్) 54; రాయుడు (సి) ధావన్ (బి) టామ్ కరన్ 23; జడేజా (నాటౌట్) 26; ధోని (బి) అవేశ్ ఖాన్ 0; స్యామ్ కరన్ (బి) వోక్స్ 34; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–60, 4–123, 5–137, 6–137, 7–188. బౌలింగ్: వోక్స్ 3–0–18–2; అవేశ్ ఖాన్ 4–0–23–2; అశ్విన్ 4–0–47–1; టామ్ కరన్ 4–0– 40–1; మిశ్రా 3–0–27–0; స్టొయినిస్ 2–0–26–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) మొయిన్ అలీ (బి) బ్రావో 72; ధావన్ (ఎల్బీ) (బి) శార్దుల్ 85; పంత్ (నాటౌట్) 15; స్టొయినిస్ (సి) స్యామ్ కరన్ (బి) శార్దుల్ 14; హెట్మైర్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు 4, మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–138, 2–167, 3–186. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–36–0; స్యామ్ కరన్ 2–0–24–0; శార్దుల్ 3.4–0–53–2; జడేజా 2–0–16–0; అలీ 3–0–33–0; బ్రావో 4–0–28–1. ఐపీఎల్లో నేడు సన్రైజర్స్ హైదరాబాద్ X కోల్కతా నైట్రైడర్స్ వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
స్మిత్ వచ్చేశాడు...
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ శనివారం ముంబై చేరుకున్నాడు. ప్రొటోకాల్ ప్రకారం ‘బయో బబుల్’లో అడుగు పెట్టిన అతడు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ను ముగించుకోవాల్సి ఉంది. అనంతరం స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుతో చేరతాడు. ‘డీసీ కుటుంబంలోకి స్మిత్కు స్వాగతం’ అంటూ స్మిత్ ఉన్న ఫోటోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో డీసీ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. 2020 ఐపీఎల్ ముగిసిన అనంతరం 31 ఏళ్ల స్మిత్ను రాజస్తాన్ రాయల్స్ విడుదల చేయగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అతడిని రూ. 2.2 కోట్లకు డీసీ దక్కించుకుంది. ఈ నెల 10న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తమ తొలి మ్యాచ్తో డీసీ ఐపీఎల్ టైటిల్ వేటను ఆరంభించనుంది. -
‘నమ్దే’ ఇంకెప్పుడు?
సాక్షి క్రీడా విభాగం: ‘ఓటములు మమ్మల్ని ఓడించలేవు. పోరాట స్ఫూర్తి మమ్మల్ని సజీవంగా ఉంచుతుంది’... తమ అధికారిక వెబ్సైట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ రాసుకున్న వాక్యం ఇది. అదేంటో గానీ పోరాటాలే తప్ప జట్టు ఖాతాలో విజయాలు మాత్రం లేవు. ఐపీఎల్లో పాపులారి టీ విషయంలో మిగతా జట్లతో పోలిస్తే ఎక్కడా తక్కువ కాదు, పెద్ద సంఖ్యలో అభిమాన గణం, వాణిజ్యపరంగా చూస్తే వహ్వా అనిపించే కంపెనీలతో సహవాసం... స్వయంగా భారత కెప్టెన్ సుదీర్ఘ కాలంగా జట్టును నడిపిస్తుండగా, టి20లో విధ్వంసానికి చిరునామాలాంటి డివిలియర్స్, గతంలో గేల్లాంటి ఆటగాళ్లు ఐపీఎల్ను ఒక ఊపు ఊపారు. కానీ తుది ఫలితానికి వచ్చేసరికి మాత్రం సున్నా! మూడుసార్లు ఫైనల్లో ఓడిన బెంగళూరు ఇప్పుడైనా ఆ గండాన్ని దాటి కన్నడ అభిమానులతో ‘కప్ నమ్దే ( మనదే)’ అనిపిస్తుందో లేదో వేచి చూడాలి! కొత్తగా వచ్చినవారు ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఇద్దరు ఆటగాళ్ల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కైల్ జేమీసన్ (రూ. 15 కోట్లు), ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ. 14.25 కోట్లు)లకు అనూహ్య మొత్తం ఇచ్చి సొంతం చేసుకుంది. వేలానికి ముందు విదేశీ ఆల్రౌండర్, మిడిలార్డర్ బ్యాట్స్మన్ అవసరం ఆ జట్టుకు ఉంది. అందుకు తగినట్లుగానే ఐపీఎల్ అనుభవం ఉన్న మరో ఆల్రౌండర్ డాన్ క్రిస్టియాన్ (రూ. 4.80 కోట్లు)ను కూడా తీసుకుంది. ఈ ముగ్గురు కాకుండా మరో ఐదుగురు భారత వర్ధమాన ఆటగాళ్లను కనీసం మొత్తం రూ.20 లక్షలకే సొంతం చేసుకుంది. సచిన్ బేబీ, రజత్ పటిదార్, మొహమ్మద్ అజహరుద్దీన్, సుయాష్ ప్రభుదేశాయ్లతో పాటు ఆంధ్ర జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇంత మొత్తం చెల్లించినా... భారత గడ్డపై ఇప్పటి వరకు ఒక్కబంతి కూడా వేయని జేమీసన్, గత కొన్నేళ్లుగా వరుసగా విఫలమవుతున్న మ్యాక్స్వెల్ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ఒక భారత మిడిలార్డర్ బ్యాట్స్మన్ కోసం బెంగళూరు చివరి వరకు ప్రయత్నించినా సరైన ఆటగాడు దక్కలేదు. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, పవన్ దేశ్పాండే, షహబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, హర్షల్ పటేల్, సచిన్ బేబీ, రజత్ పటిదార్, మొహమ్మద్ అజహరుద్దీన్, సుయాష్ ప్రభుదేశాయ్, కోన శ్రీకర్ భరత్. విదేశీ ఆటగాళ్లు: డివిలియర్స్, డానియెల్ స్యామ్స్, ఫిన్ అలెన్, జేమీసన్, డాన్ క్రిస్టియాన్, మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్. సహాయక సిబ్బంది: మైక్ హెసన్ (డైరెక్టర్, క్రికెటర్ ఆపరేషన్స్), సైమన్ కటిచ్ (హెడ్ కోచ్), సంజయ్ బంగర్ (బ్యాటింగ్ కన్సల్టెంట్), శ్రీధరన్ శ్రీరామ్ (బ్యాటింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ కోచ్), ఆడమ్ గ్రిఫిత్ (బౌలింగ్ కోచ్). తుది జట్టు అంచనా/ఫామ్ మూడు–కోహ్లి, నాలుగు–డివిలియర్స్, ఐదు–మ్యాక్స్వెల్... భారీ మొత్తాన్ని చెల్లించి మ్యాక్సీని తీసుకోవడం ఐదో స్థానంలో ఆడించాలనే వ్యూహంలో భాగమే. కోహ్లి, డివిలియర్స్లు కాకుండా ఇన్నింగ్స్ చివర్లో మెరుపు షాట్లు ఆడే ఒక బ్యాట్స్మన్ అవసరం ఉన్న టీమ్ ఇప్పుడు ఆసీస్ ఆటగాడిపై ఆశలు పెట్టుకుంది. ఓపెనింగ్లో పడిక్కల్కు తోడుగా ఫిన్ అలెన్ (కివీస్) బరిలోకి దిగవచ్చు. నాలుగో విదేశీ ఆటగాడిగా జేమీసన్కే ఎక్కువ అవకాశాలు ఉన్నా యి. రెండో ఓపెనర్గా కూడా భారత ఆటగాడి (అజహరుద్దీన్)కే అవకాశం ఇస్తే జంపా, రిచర్డ్సన్లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. వేలం తర్వాత ఇలాంటి కూర్పులో కూడా ఆరో స్థానంలో ఒక భారత బ్యాట్స్మన్పైనే జట్టు ఆధారపడాల్సి వస్తోంది. మ్యాక్స్వెల్ విఫలమైతేనే క్రిస్టియాన్కు చాన్స్ లభిస్తుంది. స్పిన్నర్లుగా తుది జట్టులో చహల్, సుందర్ ఖాయం. సిరాజ్, సైనీలలో ఎవరికి ఎన్ని మ్యాచ్లు లభిస్తాయనేది చూడాలి. అత్యుత్తమ ప్రదర్శన 3 సార్లు రన్నరప్ (2009, 2011, 2016) 2020లో ప్రదర్శన: పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. లీగ్లో తొలి 10 మ్యాచ్లలో 7 గెలిచి ఒక దశలో టాపర్గా నిలుస్తుందనుకున్న ఆర్సీబీ, వరుసగా మిగిలిన నాలుగు మ్యాచ్లు ఓడింది. చివరకు అతి కష్టమ్మీద నెట్రన్రేట్తో ముందంజ వేయగలిగింది. కోహ్లి తన స్థాయి మేరకు ఆడకపోవడం కూడా (15 ఇన్నింగ్స్లలో 121.35 స్ట్రయిక్రేట్తో 466 పరుగులు) జట్టు అవకాశాలపై ప్రభావం చూపించింది. -
ఐపీఎల్ 2021: ముంబైకి అడ్డుందా!
ఒకటి... రెండు... మూడు... నాలుగు... ఐదు... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయయాత్ర సాగిపోతూనే ఉంది. తొలి ఐదు సీజన్లలో తమదైన ముద్ర కోసం ప్రయత్నించి విఫలమైన ఆ జట్టు తర్వాతి ఎనిమిది ఏళ్లలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచి సత్తా చాటింది. గత సీజన్లో ఆట, జట్టు సభ్యుల తాజా ఫామ్ చూసుకుంటే ముంబైని నిలువరించడం ప్రత్యర్థికి మరోసారి అసాధ్యం కావచ్చు. సిక్సర్లతో విరుచుకుపడే హిట్టర్లు, పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేసే బౌలర్లు, మైదానం బయటా హంగామాతో భారీ బడ్జెట్ సినిమాను తలపించే టీమ్ గత ఏడాది గెలుపుతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. రోహిత్ కెప్టెన్సీలో జట్టు దాదాపు ఎలాంటి లోపాలు లేకుండా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగించి ‘సిక్సర్’ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. -సాక్షి క్రీడా విభాగం కొత్తగా వచ్చినవారు టీమ్ అన్ని రకాలుగా కుదురుకొని ఉండటంతో ముంబైకి వేలంలో ప్రత్యేకంగా కొందరు ఆటగాళ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేకపోయింది. అయితే వేలానికి ముందు విదేశీ పేస్ బౌలర్లతో పాటు రాహుల్ చహర్కు తోడుగా అదనపు లెగ్స్పిన్నర్ అవసరం కనిపించింది. వేలానికి ముందు తామే విడుదల చేసిన నాథన్ కూల్టర్నైల్ (రూ. 5 కోట్లు)ను మళ్లీ ఎంచుకుంది. కివీస్ పేసర్ ఆడమ్ మిల్నేపై రూ. 3.20 కోట్లు వెచ్చించిన జట్టు సీనియర్ లెగ్స్పిన్నర్ పీయూష్ చావ్లాను రూ. 2.40 కోట్లకు తీసుకుంది. వీరితోపాటు కివీస్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ జట్టులోకి వచ్చాడు. మరో ముగ్గురు వర్ధమాన ఆటగాళ్లు యుధ్వీర్ చరక్, అర్జున్ టెండూల్కర్ (భారత్), మార్కో జాన్సన్ (దక్షిణాఫ్రికా)లను కనీస ధర రూ. 20 లక్షల చొప్పున చెల్లించి జట్టులో భాగం చేసింది. మొత్తంగా చూస్తే హడావిడి పడకుండా టీమ్ అవసరాలకు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లను మాత్రమే తీసుకోగా, చివరకు రూ. 3.65 కోట్ల స్వల్ప మొత్తమే జట్టు ఖాతాలో మిగిలింది. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఆదిత్య తారే, అనుకూల్ రాయ్, అన్మోల్ప్రీత్ సింగ్, ధావల్ కులకర్ణి, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, మొహసిన్ ఖాన్, రాహుల్ చహర్, సౌరభ్ తివారి, సూర్యకుమార్ యాదవ్, పీయూష్ చావ్లా, యుధ్వీర్ చరక్, అర్జున్ టెండూల్కర్. విదేశీ ఆటగాళ్లు: క్రిస్ లిన్, కీరన్ పొలార్డ్, క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, నాథన్ కూల్టర్నైల్, జిమ్మీ నీషమ్, మార్కో జాన్సన్ సహాయక సిబ్బంది: మహేలా జయవర్ధనే (హెడ్ కోచ్), జహీర్ ఖాన్ (డైరెక్టర్, క్రికెట్ ఆపరేషన్స్), రాబిన్ సింగ్ (బ్యాటింగ్ కోచ్), షేన్ బాండ్ (బౌలింగ్ కోచ్), జేమ్స్ ప్యామెంట్ (ఫీల్డింగ్ కోచ్), తుది జట్టు అంచనా/ఫామ్ గత కొన్నేళ్లుగా ఒకటి, రెండు స్థానాలు మినహా... లేదంటే ఆటగాళ్లు గాయపడితే తప్ప ముంబై ఇండియన్స్ తుది జట్టులో ఎప్పుడూ మార్పులు జరగలేదు. అసలు అలాంటి అవసరం కూడా కనిపించలేదు. అంత పక్కాగా ఆ టీమ్ కూర్పు, వ్యూహాలు ఉన్నాయి. రోహిత్, డి కాక్, పొలార్డ్, హార్దిక్, కృనాల్, బుమ్రా, బౌల్ట్ మరో సందేహం లేకుండా తుది జట్టులో ఉంటారు. ఇక ఇటీవలే భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సీజన్లోనూ అదరగొట్టిన వీరిద్దరితో కలిపితే తొమ్మిది స్థానాలు ఖాయం. నాలుగో విదేశీ ఆటగాడిగా మిల్నే, కూల్టర్నైల్లలో ఒకరు ఆడతారు. లిన్, నీషమ్లకు అవకాశం దక్కడం చాలా కష్టం. స్పిన్నర్గా రాహుల్ చహర్కు తొలి ప్రాధాన్యత ఉంటుంది కానీ అవసరమైతే చావ్లాను అతనికి బదులుగా వాడుకోవచ్చు. ఆఫ్ స్పిన్నర్ జయంత్కు కూడా కొన్ని మ్యాచ్లలో అవకాశం దక్కవచ్చు. ఆరంభ ఓవర్లలో సూపర్ బౌలింగ్తో బౌల్ట్ 2020 విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఇప్పుడు కివీస్ తరఫున చక్కటి ఫామ్లో ఉండగా... ఇటీవలే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది పొలార్డ్ తానేమిటో గుర్తు చేశాడు. అత్యుత్తమ ప్రదర్శన 5 సార్లు చాంపియన్ (2013, 2015, 2017, 2019, 2020) 2020లో ప్రదర్శన: సీజన్ మొత్తం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి చివరకు విజేతగా నిలిచింది. లీగ్ దశలో 9 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు తొలి క్వాలిఫయర్, ఫైనల్లలో అలవోక విజయాలు సాధించింది. ఓడిన ఐదింటిలో కూడా రెండు మ్యాచ్లు ‘టై’గా ముగిసినవే. గాయంతో రోహిత్ నాలుగు మ్యాచ్లకు దూరమైనా జట్టుపై దాని ప్రభావం పడలేదు. ఒకరిని మించి మరొకరు పోటీ పడి అద్భుత ప్రదర్శనతో టీమ్కు ఐదో టైటిల్ను అందించారు. -
సాఫ్ట్ సిగ్నల్ బెంగలేదు.. 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సిందే!
సాక్షి క్రీడావిభాగం: మన పొట్టి లీగ్... మరో 11 రోజుల్లో మెరుపులు మెరిపించేందుకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 9న మొదలయ్యే 14వ సీజన్ ఐపీఎల్ టోర్నీకి కొన్ని విశేషాలున్నాయి. కోవిడ్తో గతేడాది మన ఆతిథ్యానికి దూరమైంది. ఇప్పుడు మళ్లీ మన దేశానికి వచ్చేసింది. అలాగే తక్కువ వ్యవధిలో అంటే అర్ధసంవత్సరానికే ఈ సీజన్ జరగనుంది. లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లు ‘బయో బబుల్’లో నిర్వహించారు. ఇప్పుడు భారత్ ‘బబుల్’లో జరిగే తొలి ఐపీఎల్ కూడా ఇదే! ఇన్నాళ్లు జరిగినట్లుగా ఇంటా బయటా కాకుండా మ్యాచ్లన్నీ తటస్థ వేదికల్లోనే జరుగుతాయి. ఫలితంగా ఏ జట్టుకూ తమ సొంత మైదానాల్లో మ్యాచ్లు ఆడే అవకాశం లేకుండాపోయింది. సాఫ్ట్ సిగ్నల్ బెంగలేదు... ఇటీవల భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టి20 సిరీస్ సందర్భంగా చర్చనీయాంశమైన ‘సాఫ్ట్ సిగ్నల్’ను ఈ ఐపీఎల్లో పక్కనబెట్టేశారు. అంటే ఫీల్డ్ అంపైర్లు సందేహాస్పద నిర్ణయాలను థర్డ్ అంపైర్ (టీవీ అంపైర్)కు నివేదించినప్పుడు స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు ఈ ‘సాఫ్ట్ సిగ్నల్’ అడ్డుకాబోదు. తనకు నివేదించిన అప్పీలుపై థర్డ్ అంపైర్దే తుది నిర్ణయం అవుతుంది. షార్ట్ రన్ లెక్క ఇక పక్కా.. గత ఐపీఎల్లో పరుగు కొరత పంజాబ్ కింగ్స్ను నిండా ముంచేసింది. ఫీల్డ్ అంపైర్ల తప్పిదం షార్ట్రన్కు దారితీస్తుంది. దీనిపై ఆ ఫ్రాంచైజీ అధికారికంగా ఐపీఎల్ పాలకమండలికి ఫిర్యాదు చేయడంతో దీనిపై కూడా మూడో కన్ను (థర్డ్ అంపైర్) వేయాలని నిర్ణయించారు. దీంతో ఇక ప్రతీ పరుగు లెక్క ఇక పక్కాగా ఉంటుంది. టీవీ అంపైర్కు నోబాల్... నోబాల్స్ తరచూ ఆ నోటా ఈ నోటా పేలుతోంది. చర్చనీయాంశమవుతుంది. మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఘటనలో వివాదాస్పదం కూడా అవుతోంది. ఫీల్డు అంపైర్లను ఈ నోబాల్ దోషిగా నిలబెడుతోంది. ఈ దోషాన్ని దూరం చేయాలని నిర్ణయించిన పాలకమండలి టీవీ అంపైర్ దీనిపై సమీక్షించే అధికారాన్ని కట్టబెట్టింది. సూపర్ ఓవర్ గంట దాటదు... సూపర్ ఓవర్కు టైమ్ పీరియడ్ ఉంది. గతంలో ‘టై’ అయితే ఓ సూపర్ ఓవర్ ఆడించేవారు. అక్కడా సమమైతే ఇంకో ఓవర్, అక్కడా విజేత తేలకపోతే మరో ఓవర్.... ఇలా ఇకపై సాగదు. ఏదేమైనా సూపర్ ఓవర్లు గంట దాటడానికి వీల్లేదు. నిర్ణీత 20 ఓవర్ల కోటా అంటే 40వ ఓవర్ ఆఖరి బంతి ముగిసే సమయం నుంచి ఈ గంట మొదలవుతుంది. 90 నిమిషాల్లో 20 ఓవర్లు... ఐపీఎల్ టి20 మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో నిర్ణీత 20 ఓవర్లు గంటన్నరలో పూర్తి చేయాల్సిందే! అంటే గంటకు కనీసం 14.11 ఓవర్లు నమోదు కావాలి. ప్రతీ ఇన్నింగ్స్లో 20 ఓవర్లును 90 (85 నిమిషాలు+5 నిమిషాలు టైమ్ అవుట్) నిమిషాల్లోనే కచ్చితంగా పూర్తి చేయాలి. ఇతర కారణాలతో ఓవర్ల సంఖ్యను కుదించాల్సి వస్తే అప్పుడు ఒక్కో ఓవర్ను నాలుగు నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కాస్త ఆలస్యంగా కోహ్లి... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి చెన్నైలో నిర్వహించే శిబిరంలో వచ్చే నెల 1న చేరనున్నాడు. నిజానికి నేటి (మంగళవారం) నుంచే ఈ శిబిరం మొదలవుతుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్సీబీ ఆటగాళ్లు చెన్నై చేరుకోగా... వన్డే సిరీస్కు ఎంపికైన చహల్, సిరాజ్ పుణేలో ఆఖరి వన్డే ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. అయితే కెప్టెన్ కోహ్లి మాత్రం రెండు రోజుల ఆలస్యంగా బృందంలో చేరతాడు. అలాగే మోర్గాన్, శుబ్మన్ గిల్, ప్రసిధ్ కృష్ణ కోల్కతా నైట్రైడర్స్ క్యాంప్లోకి వెళ్లారు. ముంబై ఏకమైంది... డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్లతో ఏకమైంది. విజయవంతమైన సారథి రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ జట్టుతో కలిశారు. వీళ్లంతా ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ముగించుకొని ఆ బబుల్ నుంచి ఐపీఎల్ బబుల్లోకి బదిలీ అయ్యారు. దీంతో కచ్చితమైన క్వారంటైన్ నిబంధన నుంచి తప్పించుకున్నారు. లేదంటే వారంపాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చేది. ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, బిల్లింగ్స్, టామ్ కరన్, అక్షర్ పటేల్, క్రిస్ వోక్స్లు సోమవారమే ముంబైలో జట్టుతో జతకలిశారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని ఫ్రాంచైజీ సామాజిక సైట్లలో పోస్ట్ చేసి అభిమానుల్ని అలరించింది. కాగా జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం శస్త్రచికిత్స కారణంగా ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. వచ్చే నెల 10న జరిగే తమ తొలి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్... చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. భారత్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ జరుగుతుందన్న సంతోషమైతే ఉంది కానీ... స్టేడియానికి వెళ్లి చూసే భాగ్యమైతే లేదు. మనదేశంలో జరిగే మెరుపుల్ని మనం ప్రత్యక్షంగా ఆస్వాదించే అవకాశం ‘నో ఎంట్రీ’తో దూరమైంది. కోవిడ్–19 పడగలో జరుగుతున్న ఈ సీజన్ బుడగలో ముసుగు (మాస్క్) తొడుక్కుంది. ఏదేమైనా ‘ఏప్రిల్ 9 విడుదల’ ఆటకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ సీజన్లో కొత్తగా ఐదు నిబంధనలు ప్రవేశపెట్టారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతుండగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తమ పేరును ‘పంజాబ్ కింగ్స్’గా మార్చుకొని అడుగుపెట్టనుంది. -
ఐపీఎల్... ప్రేక్షకుల్లేకుండానే!
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ ఏమాత్రం ఆలస్యం కాకుండా అలరించేందుకు త్వరలోనే మన ముందుకొస్తోంది. కానీ ప్రేక్షకులకు మాత్రం గత సీజన్లాగే ఎంట్రీ లేదు. అయితే అది యూఏఈలో జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ స్వదేశంలో జరిగే పోటీలను ప్రత్యక్షంగా వెళ్లి చూడలేకపోవడం మాత్రం భారత క్రికెట్ ప్రేమికులకు కాస్త నిరాశ కలిగించే అంశం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి మే 6 దాకా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తదుపరి దశ మ్యాచ్లకు ప్రేక్షకులకు అనుమతించే విషయం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. ► మొత్తం ఆరు వేదికల్లో (చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా) ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్–2021 మ్యాచ్లు జరుగుతాయి. కానీ 8 ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టుకు సొంత వేదికలో మ్యాచ్లు ఉండవు. అన్ని జట్లూ తటస్థ వేదికలపై మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ► ఏప్రిల్ 9న చెన్నైలో జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్తో విరాట్ కోహ్లి నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. ► బెంగాల్లో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆరంభ దశ మ్యాచ్లను కోల్కతాకు కేటాయించలేదు. ఎన్నికల కౌంటింగ్ మే 2న ముగిశాక కోల్కతాలో మే 9 నుంచి ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తారు. ► ప్రతీ జట్టు నాలుగు వేదికల్లో తలపడుతుంది. మొత్తం 56 లీగ్ దశ మ్యాచ్ల్లో చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో పదేసి మ్యాచ్లు జరుగుతాయి. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలపై ఎనిమిది చొప్పున లీగ్ పోటీలు నిర్వహిస్తారు. అహ్మదాబాద్లో మే 25న క్వాలిఫయర్–1, మే 26న ఎలిమినేటర్, మే 28న క్వాలిఫయర్–2, మే 30న ఫైనల్ జరుగుతాయి. ► ఈ సీజన్లో 11 రోజులు రెండు మ్యాచ్ల చొప్పున జరుగుతాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలైతే, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. -
ఐపీఎల్ షెడ్యూల్ ఇదేనా!
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్కు సంబంధించి మ్యాచ్ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 9న మొదలై.. మే 30 వరకు జరగనుంది. కాగా 52 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్లో మొత్తం 60 మ్యాచ్లు జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ మే 30వ తేదీన జరగనుంది.అయితే దీనిపై గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికి సంబంధించి వచ్చేవారం ఐపీఎల్ గవర్నింగ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్తో పాటు వేదికలను కూడా ఖరారు చేయనున్నారు. అయితే తొలుత ఒకే వేదికపై ఐపీఎల్ను నిర్వహించాలనుకున్నారు.. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆరు వేదికలను ఖరారు చేసినట్లు తెలిసింది. అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూ ఢిల్లీ, కోల్కత, ముంబైలు ఉన్నాయి. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న వేళ ముంబైలో మ్యాచ్లు జరగడం కష్టమే. అయితే మ్యాచ్ వేదికలపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకునే నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ధోని నేతృత్వంలోని సీఎస్కే జట్టు చెన్నై చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ను యూఏఈ వేదికగా నిర్వహించిన సంగతి తెలిసిందే. చదవండి: తలైవా.. వెల్కమ్ టూ చెన్నై 'ఆ వ్యాఖ్యలు చేసుంటే నన్ను క్షమించండి' -
నేడు ఐపీఎల్ వేలం
చెన్నై: ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్మన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఫ్రాంచైజీల ఫేవరెట్గా మారాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని చేజిక్కించుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇరు ఫ్రాంచైజీలు పోటీపడితే మాత్రం అతనిపై కోట్లు కురిసే అవకాశముంది. మ్యాక్సీతో పాటు ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ, ఇతని సహచరుడు, నంబర్వన్ టి20 బ్యాట్స్మన్ డేవిడ్ మలాన్లు కూడా వేలంలో చెప్పుకోదగ్గ ధర పలకొచ్చు. వేలానికి వెయ్యిమందికి పైగా ఆటగాళ్లు ఆసక్తి చూపగా... వడపోత అనంతరం చివరకు 292 మంది వేలంలోకి వచ్చారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లయితే... 125 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు. మొత్తం 8 ఫ్రాంచైజీల్లో కలిపి 61 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 ఖాళీలుండగా... ఈ ఫ్రాంచైజీ చేతిలో రూ. 35.40 కోట్లు మిగిలున్నాయి. అతి తక్కువగా మూడే ఖాళీలు హైదరాబాద్లో ఉన్నాయి. ఇందుకోసం రూ. 10.75 కోట్లు అందుబాటులో ఉన్నాయి. -
ఐపీఎల్ వేలం.. బరిలో అర్జున్ టెండూల్కర్
చెన్నై: వివాదాస్పద భారత క్రికెటర్ శ్రీశాంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్లో మళ్లీ ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు రూ. 75 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫిక్సింగ్ మరకలున్న అతనిపై ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూస్తోందో వేచి చూడాలి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఈ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అర్జున్ రూ. 20 లక్షల కనీస ధరతో పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ నెల 18న జరిగే ఆటగాళ్ల వేలానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో కేవలం 61 ఖాళీలే ఉన్న ఈ సీజన్ కోసం 1,097 మంది ఆటగాళ్లు వేలంలో పోటీపడుతున్నారు. మిషెల్ స్టార్క్, ప్యాటిన్సన్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్)లాంటి అంతర్జాతీయ స్టార్లు ఈ వేలంలో పాల్గొనడం లేదు. వేలం బరిలో 814 మంది భారత ఆటగాళ్లు (21 అంతర్జాతీయ క్రికెటర్లు, 793 అన్క్యాప్డ్ ప్లేయర్లు) ఉన్నారు. 283 మంది విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీల కంటపడేందుకు బోర్డు వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆటగాళ్ల నమోదుకు గడువు గురువారంతో ముగియడంతో బీసీసీఐ వేలం జాబితాను శుక్రవారం విడుదల చేసింది. విదేశాల నుంచి అందుబాటులో ఉన్న క్రికెటర్లలో వెస్టిండీస్ ఆటగాళ్లే (56 మంది) ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత సంఖ్య ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఆటగాళ్లది. ప్రస్తుతమున్న 61 ఖాళీల్లో విదేశీ ఆటగాళ్లతోనే 22 స్థానాల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 2 కోట్ల ధరలో... హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ (భారత్), స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా), షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్), మొయిన్ అలీ, బిల్లింగ్స్, ప్లంకెట్, జేసన్ రాయ్, మార్క్ వుడ్ (ఇంగ్లండ్), ఇంగ్రామ్ (దక్షిణాఫ్రికా). ఏ దేశం నుంచి ఎందరంటే... వెస్టిండీస్ (56), ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38), శ్రీలంక (31), అఫ్గానిస్తాన్ (30), న్యూజిలాండ్ (29), ఇంగ్లండ్ (21), యూఏఈ (9), నేపాల్ (8), స్కాట్లాండ్ (7), బంగ్లాదేశ్ (5), ఐర్లాండ్ (2), అమెరికా (2), జింబాబ్వే (2), నెదర్లాండ్స్ (1). -
ధోనీ అరుదైన రికార్డు.. భారీగా ఆదాయం!
చెన్నై: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రూ.150 కోట్లను ఆర్జించిన తొలి క్రికెటర్గా(భారత్ లేదా విదేశీ) మిస్టర్ కూల్ ధోనీ చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధోని.. 2020 వరకు ఆడిన లీగ్ ద్వారా రూ.137 కోట్ల ఆదాయం ఆర్జించాడు. అంతేగాక ఐపీఎల్ 2021 సీజన్కు కూడా చెన్నై ఫ్రాంచైజీ ధోనీకి కొనసాగిస్తూ.. రూ.15 కోట్లు చెల్లించనుంది. దీంతో మహీ సంపాదన రూ.152 కోట్లకు చేరింది. ఈ లెక్కలతో రూ.150 కోట్ల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా ధోని ఈ ఘనత సాధించాడు. ధోని తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రూ.146.6 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తరువాత రూ.143 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా 2008 నుంచి జరుగుతున్న ఐపీఎల్లో ధోనీ మొత్తం 13 సీజన్లు ఆడాడు. 2008లో రూ.6 కోట్లకు ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. మూడేళ్లు అదే ధరకి కొనసాగాడు. 2011లో బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్ రిటెన్షన్ ప్లేయర్ ధరని రూ.8 కోట్లకి పెంచింది. దాంతో 2011 నుంచి 13 వరకు రూ.8.25 కోట్లు ఆర్జించాడు. 2014లో మెగా వేలానికి ముందు బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్ రిటెన్షన్ ప్లేయర్ ధరని రూ.12 కోట్లకి పెంచగా.. 2014, 2015 సీజన్లలో ధోనీకి రూ.12.5 కోట్లు చెన్నై చెల్లించింది. అయితే ఫిక్సింగ్ కారణంగా 2016, 2017 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం పడటంతో.. ఆ రెండేళ్లు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కి ఎంఎస్ ధోనీ ఆడాడు. అప్పుడు కూడా ఒక్కో ఏడాది రూ.12.5 కోట్లు ఆర్జించాడు. ఇక గత మూడేళ్ల నుంచి(2018,19,20) ధోనికి రూ. 15 కోట్లు చెల్లిస్తూ వస్తోంది. -
ఐపీఎల్–2021 భారత్లోనే నిర్వహిస్తాం!
ముంబై: ఐపీఎల్–2021ను నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఈ సారి కచ్చితంగా భారత్లోనే నిర్వహించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అవసరమైతే ఆటగాళ్లందరికీ వ్యాక్సిన్ ఇప్పించే ఆలోచన కూడా ఉందని ధుమాల్ వెల్లడించారు. ‘ఐపీఎల్ ఎక్కడ జరపాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. భారత్లో నిర్వహించగల వనరులు మాకు ఉన్నాయని నమ్ముతున్నాం. కాబట్టి ప్రత్యామ్నాయ వేదిక అనే మాటే ఉదయించదు. ప్రస్తుత పరిస్థితుల్లో యూఏఈకంటే భారత్లోనే పరిస్థితులు బాగున్నాయి. ఇదే కొనసాగి ఇక్కడే ఐపీఎల్ జరగాలని కోరుకుందాం’ అని ధుమాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్–ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగే తొలి రెండు టెస్టులను ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించనున్న బీసీసీఐ... అహ్మదాబాద్లో జరిగే తర్వాతి రెండు టెస్టుల విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. స్టేడియం మొత్తం సామర్థ్యం వరకు కాకుండా కనీసం 25–50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా ధుమాల్ చెప్పారు. -
చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్(2021)కు సంబంధించి మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్దమవుతుంది. ఈ మేరకు ఐపీఎల్ తన ట్విటర్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే ఐపీఎల్లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. లసిత్ మలింగ, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, హర్భజన్ సింగ్ లాంటి స్టార్ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్ చేయడంతో 2021 ఐపీఎల్ సీజన్కు వేలంలోకి రానున్నారు. చదవండి: ఐసీసీ సరికొత్త అవార్డు.. పరిశీలనలో వారి పేర్లు! కాగా ఆయా ఫ్రాంచైజీలు మొత్తం 139 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. 57 మందిని రిలీజ్ చేశాయి. కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా జరిగినా ఈ ఏడాది మాత్రం భారత్లోనే నిర్వహించడానికి బీసీసీఐ భావిస్తుంది. కాగా ఐపీఎల్ 14వ సీజన్ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఏప్రిల్- మే నెలల్లో ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ తేదీలతో పాటు ఎక్కడ నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇంగ్లండ్తో జరగనున్న సిరీస్కు 50 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇచ్చిన వేళ ఐపీఎల్ మ్యాచ్లకు కూడా ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ 🚨ALERT🚨: IPL 2021 Player Auction on 18th February🗓️ Venue 📍: Chennai How excited are you for this year's Player Auction? 😎👍 Set your reminder folks 🕰️ pic.twitter.com/xCnUDdGJCa — IndianPremierLeague (@IPL) January 27, 2021 -
'స్మిత్ను పంపించాం.. స్టోక్స్ను వదులుకోలేం'
జైపూర్: ఫిబ్రవరి 18న జరగబోయే ఐపీఎల్ 2021 మినీ వేలానికి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.ఇప్పటికే రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల లిస్టును ప్రకటించిన ఫ్రాంచైజీలు.. ఇప్పుడు ట్రేడింగ్ ద్వారా తమకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ అభిమాని ఒకరు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ను ముంబై జట్టుకు ట్రేడింగ్ చేయాలని కోరాడు. ముంబై అభిమానికి రాజస్థాన్ తనదైన శైలిలో పంచ్ ఇచ్చింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్ అభిమాని దళపతి విగ్నేశ్వరన్.. బెన్ స్టోక్స్ను ముంబై జట్టుకు ట్రేడింగ్ చేయాలని రాజస్థాన్ రాయల్స్ జట్టును కోరాడు. అభిమాని ట్వీట్కు స్పందించిన రాజస్థాన్ ఫ్రాంచైజీ స్టోక్స్ను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీనికి నో.. నో అంటూ ఒక ఎమోజీని రీ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ను వదిలేసుకున్న రాజస్తాన్ ఇప్పుడు స్టోక్స్ను కూడా వదిలేస్తే ఆ జట్టుకు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది. చదవండి: ధోని దంపతులతో చిల్ అయిన పంత్ అయితే ముంబై ఇండియన్స్కు ముగ్గురు నాణ్యమైన ఆల్రౌండర్లు ఉన్న సంగతి తెలిసిందే. కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అలాంటప్పుడు ఆ జట్టు బెన్ స్టోక్స్ను కొనుగోలు చేసే అవసరం లేదు. ఇప్పటికే జట్టులో ఉన్న కొంతమంది బెంచ్కే పరిమితమవుతున్నారు. కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్లో స్టోక్స్ అన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు. టోర్నీకి ఆలస్యంగా రావడంతో 8 మ్యాచ్లే ఆడిన స్టోక్స్ 285 పరుగులు చేశాడు. ముంబైతో ఆడిన లీగ్ మ్యాచ్లో 107 పరుగులతో శతకం సాధించి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. స్మిత్ కెప్టెన్సీ నుంచి వైదొలగించి అతని స్థానంలో సంజూ శామ్సన్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా భారత్, ఇంగ్లండ్ల మధ్య ఫిబ్రవరి 5 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు లంక నుంచి నేరుగా ఇండియాకు రానుండగా.. బెన్ స్టోక్స్ ఇప్పటికే ఇండియాకు వచ్చి క్వారంటైన్లో ఉన్నాడు. ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: బెయిర్ స్టో ప్రతీకారం.. కానీ ట్విస్ట్ ఏంటంటే Your last 3 emojis describe your feelings on seeing Ben retained.#HallaBol | #RoyalsFamily | @benstokes38 pic.twitter.com/7wLTpZ1fYI — Rajasthan Royals (@rajasthanroyals) January 25, 2021 pic.twitter.com/SlI4pxm9zU — Rajasthan Royals (@rajasthanroyals) January 25, 2021 -
మ్యాక్సీని కొనుగోలు చేస్తే మూల్యం చెల్లించుకున్నట్లే
ముంబై : ఐపీఎల్ 2021కి సంబంధించి మినీ వేలానికి సన్నద్ధమవుతున్న ఫ్రాంచైజీలు ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతో పాటు రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్టును ప్రకటించాయి. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కూడా తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్లను ప్రకటించింది. కింగ్స్ ప్రకటించిన రిలీజ్ జాబితాలో ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున 13 మ్యాచులాడిన మ్యాక్స్వెల్ కేవలం 108 పరుగులు మాత్రమే చేసి దారుణ ప్రదర్శన కనబరిచాడు. మ్యాక్స్వెల్ వరుసగా విఫలమవుతున్న వేళ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకముంచి అవకాశాలు కల్పించినా తన ఆటతీరులో ఏ మాత్రం మార్పు లేదు. దీనికి తోడు మ్యాక్సీ ప్రదర్శనపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. 2019 డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో కింగ్స్ పంజాబ్ రూ. 10.5 కోట్లు పెట్టి మ్యాక్స్వెల్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: పంత్ నిరాశకు లోనయ్యాడు తాజాగా కివీస్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరిస్ మ్యాక్స్వెల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టైరిస్ మాట్లాడుతూ.. 'మాక్స్వెల్కు ఈసారి జరగబోయే ఐపీఎల్ వేలంలో ఆశించినంత ధర రాకపోవచ్చు... కానీ రాణించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నకు నా సమాధానాన్ని ఒక్క జవాబుతో చెప్పాలనుకుంటున్నా.. ఏ ఆటగాడైనా సరే వేలంలో 10 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోతే.. వాళ్ల తలలకు కొమ్ములు వస్తాయి.. మ్యాక్సీ విషయంలో ఇప్పటికే నిరుపితమైంది. ఒక ఆటగాడి ప్రదర్శనకు వేలంలో ఎక్కువ ధర ఇస్తే బాగుంటుంది.. కానీ అతని అంతర్జాతీయ ఆటతీరు చూసి మాత్రం తీసుకోవద్దని నా సలహా. ఈ విషయం ఫ్రాంచైజీలు తెలుసుకుంటే రానున్న వేలంలో మ్యాక్స్వెల్ను కనీస మద్దుత ధరకే ఎక్కువ అమ్ముడుపోయే అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసి మ్యాక్స్వెల్ ఏనాడు ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరచలేదు. గత ఐదారేళ్లుగా మ్యాక్సీ ఐపీఎల్ ఆడుతున్నా.. 2014 మినహా ఏనాడు చెప్పుకోదగ్గ విధంగా రాణించలేదు. ఒకవేళ ఏ జట్టైనా అతన్ని కొనుగోలు చేసినా .. మ్యాక్సీ మంచి ప్రదర్శన చేయకపోతే ఆయా జట్టు మేనేజ్మెంట్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.' అంటూ అభిప్రాయపడ్డాడు. చదవండి: ‘బాగా ఆడింది వారైతే నాకెందుకు ఆ క్రెడిట్’ -
ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్కు ముందే ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమైంది. రాబోయే సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం పీటీఐకి తెలిపారు. 'ఫిబ్రవరి 18న వేలం జరగనుంది. వేదికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది' అని అధికారి చెప్పారు. ఈ ఏడాది ఐపీఎల్ భారత్లో జరుగుతుందా లేదా అనే విషయంపై బీసీసీఐ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. రాబోయే సీజన్ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే పేర్కొన్నారు. కాగా సొంతగడ్డపై వచ్చే నెల నుంచి ఇంగ్లండ్తో భారత్ సిరీస్ సజావుగా జరిగితే స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది. చదవండి: 'అక్కడుంది టీమిండియా.. కాస్త జాగ్రత్తగా ఆడండి' -
ఐపీఎల్: రిటైన్ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం
ఐపీఎల్ 2021 సీజన్కు సంబంధించి మినీ వేలంకు సిద్ధమవుతున్న 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను భారీగానే వదులుకున్న సంగతి తెలిసిందే. జనవరి 20 (బుధవారం)తో దాదాపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్లతో పాటు రిలీజ్ చేసిన ఆటగాళ్ల ఫైనల్ లిస్టును విడుదల చేశాయి. కాగా ఐపీఎల్ మినీ వేలం ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఫుట్బాలర్.. ఇంగ్లండ్ ఫుట్బాల్ కెప్టెన్ హారీ కేన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హారీ కేన్కు ఐపీఎల్ అంటే మహా ప్రాణం.. ఇంగ్లీష్ ఫుట్బాల్ను ఎంతగా ఆస్వాదిస్తాడో ఐపీఎల్ను కూడా అంతే సమానంగా ఆదరిస్తాడు.. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్లోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). ఆర్సీబీ అంటే హారి కేన్కు విపరీతమైన ప్రేమ.. అందునా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట అంటే అతనికి చాలా పిచ్చి. తాజాగా ఆర్సీబీ రిటైన్, రిలీజ్ లిస్ట్ విడుదల చేసిన సందర్భంగా కేన్ ఫన్నీ కామెంట్స్ చేశాడు.చదవండి: 'నట్టూ.. నీకు కెప్టెన్ అయినందుకు గర్విస్తున్నా' 'నన్ను సెలెక్ట్ చేయనందుకు చాలా నిరాశతో ఉన్నా.. రిటైన్ లిస్ట్లో నా పేరు లేకపోవడం బాధాకరం కానీ ఇప్పుడు ఏం చేయడానికి లేదు.. ఆర్సీబీపై ఉన్న ఇష్టం మాత్రం చచ్చిపోదు.. జట్టులోని ఆటగాళ్లను ఉత్సాహపరియేందుకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది.' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఈసారి ఆర్సీబీ 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వారిలో స్టార్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మెయిన్ అలీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసిన తర్వాత రూ. 35.7 కోట్లతో ఆర్సీబీ వేలానికి సిద్ధమవుతుంది. కాగా ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన తర్వాత హారి కేన్ తన బ్యాటింగ్ స్కిల్కు సంబంధించిన వీడియోను కోహ్లి, ఆర్సీబీ హాష్ట్యాగ్తో షేర్ చేశాడు. మీ టీమ్ తరపున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు నేను సిద్ధం. వచ్చే సీజన్లో అవకాశం ఉంటే నాకు ఒక చాన్స్ ఇవ్వండి .. నేనేంటో చూపిస్తాను అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనిపై కోహ్లి స్పందించాడు. కేన్ నీ బ్యాటింగ్ సిల్క్స్ సూపర్.. వచ్చే సీజన్లో కౌంటర్ అటాక్ బ్యాట్స్మన్గా తీసుకునేందుకు ప్రయత్నిస్తాం అంటూ లాఫింగ్ ఎమోజీతో తెలిపాడు. చదవండి: ‘ప్రాక్టీస్ వద్దంటే గోల చేసేవాడు.. లెజెండ్ అవుతాడు’ Got a match winning T20 knock in me I reckon. 😂🏏 Any places going for @RCBTweets in the @IPL next season @imVkohli?? pic.twitter.com/tjUZnedVvI — Harry Kane (@HKane) November 27, 2020 Bit disappointed not to be selected but nothing I can do now. Will still be cheering the boys on 😂🏏🔥 https://t.co/Jq17o1m3aO — Harry Kane (@HKane) January 20, 2021 -
స్మిత్కు గుడ్బై.. శాంసన్కు కెప్టెన్సీ
ముంబై: రాజస్తాన్ రాయల్స్ నూతన కెప్టెన్గా టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్ను ఎంపిక చేసినట్లు బుధవారం జట్టు యాజమాన్యం స్పస్టం చేసింది. ఐపీఎల్ 13వ సీజన్లో స్టీవ్ స్మిత్ కెప్టెన్గా విఫలం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. ఐపీఎల్ 2021కి సంబంధించి వేలానికి సిద్ధమైన ఫ్రాంచైజీలు కొందరు స్టార్ ఆటగాళ్లను వదులుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సీజన్లో విఫలమైన స్టీవ్ స్మిత్ను వదులుకుంటున్నట్లు ఆర్ఆర్ ఇప్పటికే ప్రకటించింది.స్మిత్ సారధ్యంలోని ఆర్ఆర్ 14 మ్యాచ్లకు గానూ కేవలం ఆరు విజయాలు మాత్రమే సాధించి.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది.చదవండి: క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్న్యూస్ అటు కెప్టెన్గా విఫలమైన స్మిత్ ఇటు బ్యాటింగ్లోనూ అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. గత సీజన్లో మొత్తం14 మ్యాచ్లాడిన స్మిత్ 311 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు స్మిత్ స్థానంలో సంజూ శాంసన్ను కొత్త కెప్టెన్గా ఎంపికచేయడం పట్ల ఆసక్తి నెలకొంది. వాస్తవానికి సంజూ శాంసన్ ఐపీఎల్ 13వ సీజన్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. 14 మ్యాచ్ల్లో 375 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ గార్డ్ మార్క్ను చెరిపేసి స్మిత్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఈ కారణంగా కూడా స్మిత్పై రాయల్స్ వేటు వేసినట్లు రూమర్లు వస్తున్నాయి. -
ఐపీఎల్: స్టార్ ఆటగాళ్లకు ఫ్రాంచైజీల షాక్
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్కు సంబంధించి వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ఆటగాళ్లకు షాక్ ఇస్తున్నాయి. ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ను వదులుకునేందుకు రాజస్తాన్ రాయల్స్ సిద్ధమైంది. ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున 14 మ్యాచ్లాడి 311 పరుగులు చేసిన స్మిత్.. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ గార్డ్ మార్క్ను చెరిపేసి అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇలాంటి చీటింగ్ చేసే వ్యక్తి ఐపీఎల్లో ఆడకుండా బ్యాన్ చేయాలంటూ స్మిత్పై సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: థ్యాంక్యూ బీసీసీఐ.. మంచి సిరీస్ను గిఫ్ట్గా ఇచ్చారు దీంతో పాటు టీమిండియా వెటరన్ ఆటగాళ్లు హర్బజన్ సింగ్, మురళీ విజయ్, పియూష్ చావ్లాలతో పాటు కేదార్ జాదవ్ను సీఎస్కే వదులుకున్నట్లు ప్రకటించింది. అయితే ఐపీఎల్ 13వ సీజన్కు దూరంగా ఉన్న సురేశ్ రైనా మాత్రం సీఎస్కేతో కొనసాగనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పలువురు ఆటగాళ్లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది. ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్తో పాటు అలెక్స్ హేల్స్, భారత ఆటగాళ్లు సందీప్, మోహిత్ శర్మలకు గుడ్బై చెప్పనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. కాగా ఐపీఎల్ 2021కి సంబంధించి వేలంపాట ఫిబ్రవరి చివరివారంలో నిర్వహించనున్నట్లు సమాచారం.చదవండి: ఆసీస్తో సిరీస్ : అసలైన హీరో అతనే -
సీఎస్కేకు వెటరన్ ప్లేయర్ గుడ్బై
చెన్నై: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్కు గుడ్బై చెప్పాడు. ఈ విషయాన్ని భజ్జీనే ట్విటర్ వేదికగా స్వయంగా ప్రకటించాడు. చెన్నై టీమ్తో తనకున్న రెండేళ్ల అనుబంధం బుధవారంతో ముగిసిందని తెలిపాడు. ' ఐపీఎల్లో చెన్నై టీమ్తో ఈరోజుతో నా ఒప్పందం పూర్తైంది. చెన్నై టీమ్కు ప్రాతినిధ్యం వహించనడం గొప్ప అనుభవం. రెండెళ్ల పాటు చెన్నైకు ప్రాతినిధ్యం వహించిన తనకు జట్టుతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అంతేగాక ఈ రెండేళ్లలో నన్ను గుర్తుపెట్టుకునే.. నేను గుర్తుంచుకునే స్నేహితులను పొందాను. ఈ సందర్భంగా నాకు అండగా నిలిచిన సీఎస్కే యాజమాన్యానికి, సిబ్బందికి, నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు. కాగా హర్భజన్ సింగ్ ఐపీఎల్లో 2018 నుంచి 2020 వరకు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో జరిగిన వేలంలో చెన్నై జట్టు భజ్జీని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ కెరీర్లో ముంబై ఇండియన్స్కు ఎక్కువకాలం పాటు కొనసాగిన హర్బజన్ మొత్తం 160 మ్యాచ్లాడి 150 వికెట్లు తీశాడు. కాగా 2018 సీజన్లో చెన్నై తరపున 13 మ్యాచ్ల్లో 7 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. అయితే మలి సీజన్(2019లో) మాత్రం 11 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్(2020)కు మాత్రం వ్యక్తిగత కారణాల రిత్యా దూరమైనట్లు భజ్జీ ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు. As my contract comes to an end with @ChennaiIPL, playing for this team was a great experience..beautiful memories made &some great friends which I will remember fondly for years to come..Thank you @ChennaiIPL, management, staff and fans for a wonderful 2years.. All the best..🙏 — Harbhajan Turbanator (@harbhajan_singh) January 20, 2021 -
ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఇరు జట్ల ఆటగాళ్లు గాయపడడం వెనుక ప్రధాన కారణం ఐపీఎల్ అని లాంగర్ పేర్కొన్నాడు. ఎప్పుడు సమయానికి జరిగే ఐపీఎల్ గతేడాది కరోనాతో ఆలస్యంగా ప్రారంభకావడంతోనే ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారని తెలిపాడు. అయితే తాను ఐపీఎల్ను తప్పు బట్టడం లేదని.. కేవలం ఐపీఎల్ ప్రారంభించిన సమయాన్ని మాత్రమే తప్పుబడుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. (చదవండి: పాపం పకోవ్స్కీ.. మళ్లీ ఔట్!) మూడో టెస్టు అనంతరం ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు. 'ఈసారి ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న సిరీస్ నాకు కాస్త విచిత్రంగా కనిపిస్తుంది. వన్డే సిరీస్తో మొదలైన గాయాల బెడద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొదట మా జట్టు ఆటగాళ్లు గాయాల బారీన పడగా.. ఇప్పుడు టీమిండియా వంతు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వన్డే సిరీస్, టీ20 సందర్భంగా మా జట్టు తరపున డేవిడ్ వార్నర్, మార్కస్ స్టొయినిస్లు గాయపడగా.. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే కామెరాన్ గ్రీన్, విల్ పకోవ్స్కీ లాంటి వారు గాయాలతో ఇబ్బంది పడ్డారు. (చదవండి: 'ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధం') తాజాగా టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లలో షమీ మొదలుకొని ఉమేశ్, జడేజా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రాలు గాయపడ్డారు. దీంతో పాటు తొడ కండరాలు పట్టేయడంతో టీమిండియా కీలక స్పిన్నర్ అశ్విన్ నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది. ఐపీఎల్ ఆలస్యంగా జరగడం వల్లే ఇలా జరిగిందనేది నా అభిప్రాయం. ఇలాంటి పెద్ద సిరీస్కు ముందు ఐపీఎల్ సరికాదు. ఐపీఎల్ అంటే నాకూ ఇష్టమే. ఇంగ్లిష్ కౌంటీ ఎలాగైతే ప్లేయర్స్కు ఉపయోగపడేదో.. ఇప్పుడు ఐపీఎల్ కూడా అంతే ' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇరు జట్ల మధ్య జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. -
ఆసీస్ స్టార్ ఆటగాడిపై వేటు!
న్యూఢిల్లీ: కరోనా ప్రతిబంధకాలను దాటుకుని ఐపీఎల్ 13వ సీజన్ను విజయవంతం చేసుకుంది. 2021లో 14వ సీజన్కు రెడీ అవుతోంది. ఇక తాజా సీజన్లో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ ఏడాది వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ అతన్ని వదులుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. గత సీజన్లో కెప్టెన్గా, ఆటగాడిగా పేలవ ప్రదర్శన కనబర్చినందుకుగాను స్మిత్పై వేటు వేయాలని ఆర్ఆర్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే స్మిత్ స్థానంలో జట్టు నాయకత్వ బాధ్యతలను కేరళ డాషింగ్ ప్లేయర్ సంజు శాంసన్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, జట్టులో కొనసాగే ఆటగాళ్ల జాబితాను ఈ నెల 20లోగా సమర్పించాల్సి ఉండటంతో ఆర్ఆర్ యాజమాన్యం త్వరలో తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా దుబాయ్, షార్జా వేదికలుగా జరిగిన గత ఐపీఎల్లో స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఆ సీజన్లోని ఆరంభ మ్యాచ్ల్లో చెన్నై, పంజాబ్ జట్లపై వరుస అర్ధ శతకాలు సాధించి, జట్టును గెలిపించిన స్మిత్.. ఆతరువాతి మ్యాచ్ల్లో ఆశించిన స్థాయి ప్రదర్శనను కనబర్చలేకపోయాడు. ఆటగాడిగా, కెప్టెన్గా పూర్తిగా విఫలమై జట్టు వైఫల్యాలకు పరోక్షంగా బాధ్యుడయ్యాడు. ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఆర్ఆర్ యాజమాన్యం.. అతనిపై వేటు వేయాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఐపీఎల్-2020 సీజన్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన స్మిత్.. 131.22 స్ట్రైక్రేట్తో 311 పరుగులు సాధించాడు. ఇందులో 3 అర్ధ శతకాలు ఉన్నాయి. కాగా, బాల్ టాంపరింగ్ వివాదం ముగిసాక 2018 వేలానికి ముందు ఆర్ఆర్ జట్టు స్మిత్ను 12.5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి తిరిగి దక్కించుకున్న విషయం తెలిసిందే. -
ఆటగాళ్ల రిటెన్షన్కు 21 వరకు గడువు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదు పరి సీజన్ కోసం స న్నా హాలు మొదలయ్యాయి. వచ్చే సీజన్లో కూడా తమ ఫ్రాంచైజీతోనే కొనసాగే ఆటగాళ్ల జాబితాను ఈ నెల 21 లోగా పంపించాలని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ గురువారం ఫ్రాంచైజీ యజమానులను కోరారు. ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీతో ట్రేడింగ్ విండో గడువు ముగుస్తుందని వెల్లడించారు. 2021 సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల మినీ వేలం నిర్వహణ తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో ఆటగాళ్ల వేలం జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు నిర్దేశించిన బడ్జెట్లో ఎలాంటి పెంపుదల లేదని స్పష్టం చేశారు. భారత్లో కరోనా వ్యాప్తి దృష్ట్యా లీగ్ వేదికపై మరో నెల రోజుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
'అతన్ని వదులుకునేందుకు మేం సిద్ధం'
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కేదార్ జాదవ్ ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్ 2021 సీజన్కి సంబంధించిన మినీ వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా జనవరి 21లోపు అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే క్రికెటర్ల జాబితాని టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు సమర్పించాలని బీసీసీఐ ఇటీవలే ఆదేశించింది. దాంతో.. చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి కేదార్ జాదవ్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఐపీఎల్ 2021 సీజన్కు మొదట 10 జట్లతో లీగ్ను ఆడిద్దామని భావించిన బీసీసీఐ మరోసారి ఆలోచించి ఈ సారికి మాత్రం 8 జట్లతోనే లీగ్ జరుగుతుందని తెలిపింది. అయితే 2022 ఐపీఎల్ సీజన్లో మాత్రం పది జట్లతో లీగ్ ఆడించాలని బీసీసీఐ చూస్తుంది. (చదవండి: ఈ మ్యాచ్లో నా ఫోకస్ మొత్తం అశ్విన్పైనే..) ఐపీఎల్ 2020 సీజన్లో 8 మ్యాచ్లాడిన కేదార్ జాదవ్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. ఈ 8 మ్యాచ్ల్లో కలిపి కనీసం ఒక్క సిక్స్ కూడా కేదార్ జాదవ్ కొట్టలేకపోవడం గమనార్హం.ఐపీఎల్ 2018 సీజన్ వేలంలో రూ. 7.8 కోట్లకి కేదార్ జాదవ్ని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే 24 పరుగులతో చెన్నై టీమ్ని గెలిపించిన కేదార్ జాదవ్.. ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ 2019 సీజన్లో మొత్తంగా 162 పరుగులు మాత్రమే చేసిన జాదవ్.. ప్లేఆఫ్ మ్యాచ్లకి గాయంతో దూరమయ్యాడు. ఐపీఎల్ 2020 సీజన్లో కెప్టెన్ ధోనీ వరుసగా అవకాశాలిచ్చినా.. అతను వినియోగించుకోలేకపోయాడు. దాంతో.. ఆఖరి లీగ్ మ్యాచ్ల్లో అతనిపై వేటు పడింది. మొత్తంగా పేలవ ఫామ్, ఫిట్నెస్లేమితో నిరాశపరుస్తున్న కేదార్ జాదవ్ని వేలంలోకి వదులుకునేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు తెలుస్తుంది. అంతేగాక కేదార్ జాదవ్తో పాటు పీయూష్ చావ్లా, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, సురేశ్ రైనాలను కూడా వదులుకోవాలని చెన్నై భావిస్తోంది. కాగా ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముందేవ్యక్తిగత కారణాలతో రైనా, హర్భజన్ సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే.(చదవండి: ఏబీ జెర్సీ ధరించాడు.. అందుకే అలా పడ్డాడు) -
మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రేకు కీలక పదవి
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే ఎంపికయ్యాడు. రాబోయే రెండు ఐపీఎల్ సీజన్లకు అతను సహాయ కోచ్గా కొనసాగనున్నట్లు ఢిల్లీ ఫ్రాంఛైజీ బుధవారం ప్రకటించింది. 2014-2019 మధ్య ఫ్రాంఛైజీ టాలెంట్ హెడ్గా పనిచేసిన 52ఏండ్ల ఆమ్రే..రికీ పాంటింగ్ నేతృత్వంలోని ప్రస్తుత కోచింగ్ సిబ్బందిలో చేరనున్నాడు. టీమ్ఇండియా తరఫున ఆమ్రే 11 టెస్టులు, 37 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్లో ఆటగాడిగా గొప్ప రాణించిన ఆమ్రే కోచింగ్ అనుభవం కూడా ఉంది. ముంబై మూడు రంజీ ట్రోఫీ టైటిళ్లు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.(చదవండి: ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు) -
ఐపీఎల్: బీసీసీఐ కీలక నిర్ణయం!
అహ్మదాబాద్: ఐపీఎల్–2022 సీజన్కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు అదనంగా మరో రెండు టీమ్లను కొత్తగా చేర్చనుంది. దీంతో మొత్తంగా 10 జట్లు ఈ మెగాటోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ మేరకు గురువారం అహ్మదాబాద్లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాగా కరోనా కాలంలోనూ బీసీసీఐ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ను విజయవంతంగా పూర్తిచేసిన సంగతి తెలిసిందే. కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా క్యాష్ రిచ్ లీగ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజా అందించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ మెగాటోర్నీలో ముంబై ఇండియన్స్ మరోసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. (చదవండి: సెలక్షన్ ప్యానెల్; రేసులో అగార్కర్, మోంగియా) ఇక గత నెలలో ఐపీఎల్-2020కి శుభం కార్డు పడిన నాటి నుంచి వచ్చే సీజన్లో 10 జట్లను ఆడిస్తారంటూ ప్రచారం జరిగిన విషయం విదితమే. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్కు చాలా తక్కువ సమయం ఉండటంతో టెండరింగ్ ప్రక్రియ, మెగా వేలం నిర్వహించడం కష్టతరమని బీసీసీఐ పెద్దలు భావించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ చరిత్రలో 2011, 2012, 2013 మినహా ఇంతవరకు ఏ సీజన్లోనూ 9 కంటే ఎక్కువ జట్లు బరిలోకి దిగలేదు. ఇక 2022లో 10 జట్లు, 94 మ్యాచ్లతో బిగ్ టోర్నమెంట్ చూడవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఒలింపిక్స్(2028)లో క్రికెట్ను చేర్చాలన్న అంశంపై ఈ సమావేశంలో విస్త్రృత చర్చ నడుస్తున్నట్లు సమాచారం. -
ఐపీఎల్ 2021: ఈసారికి ఎనిమిదే!
ముంబై : ఐపీఎల్–2021లో ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లతో పాటు అదనంగా మరో రెండు టీమ్లను చేర్చాలనే అంశంపై బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు సమాచారం. వచ్చే లీగ్ను ప్రస్తుతం ఉన్న తరహాలోనే కొనసాగించి 2022లో పది జట్లను ఆడిస్తే బాగుంటుందని బోర్డులో పలువురి నుంచి సూచనలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్కు చాలా తక్కువ సమయం ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. గురువారం అహ్మదాబాద్లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ‘ఐపీఎల్ ఆరంభానికి కనీసం నాలుగు నెలల సమయం కూడా లేదు. ఇంత తక్కువ వ్యవధిలో రెండు జట్లను ఎంపిక చేసి వారి కోసం ఆటగాళ్ల వేలం నిర్వహించి టోర్నీకి సిద్ధమయ్యేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. పైగా ఆట మాత్రమే కాకుండా ఇన్నేళ్లుగా సాగుతున్న ఐపీఎల్ వ్యవస్థలో వారు భాగమై అలవాటు పడేందుకు ఈ సమయం సరిపోదు. అదే ఈసారి కొత్త జట్లను అనుమతించకపోతే 2022కు కావాల్సిన విధంగా జట్ల ఎంపిక, స్పాన్సర్లు, మీడియా హక్కులు, టెండర్లు... ఇలా అన్ని విషయాల్లో హడావిడి లేకుండా ప్రశాంతంగా పని చేయవచ్చు’ అని బోర్డు సీనియర్ సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. -
ఇక అగస్త్య డ్యూటీ...
ముంబై: నాలుగు నెలల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఆస్ట్రేలియా సిరీస్ అంటూ క్రికెట్లో తలమునకలై ఉన్న హార్దిక్ పాండ్యా శనివారం కొత్త బాధ్యతల్ని స్వీకరించాడు. తన నాలుగు నెలల కొడుకు అగస్త్య బాగోగుల్ని పాండ్యా భుజానికెత్తుకున్నాడు. ఆసీస్తో పరిమిత ఓవర్ల సిరీస్కే ఎంపికైన హార్దిక్ భారత్కు తిరిగి వచ్చేశాడు. ఇంటికి చేరుకోగానే తన బుజ్జాయి అగస్త్యకు పాలు పట్టిస్తూ సేదతీరాడు. ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్న పాండ్యా ‘జాతీయ విధుల నుంచి తండ్రి బాధ్యతల్లోకి’ అనే వ్యాఖ్యను జతచేశాడు. ఆసీస్తో వన్డేలు, టి20ల్లో అదరగొట్టిన పాండ్యాకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ‘వన్డే, టి20 సిరీస్ ముగియగానే ఇంటికి వెళ్లేందుకే ప్రణాళికలు వేసుకున్నా. నేను వదిలి వచ్చినప్పుడు అగస్త్య 15 రోజుల పసికందు. ఇప్పుడు 4 నెలల చిన్నారి. అతన్ని చాలా మిస్ అయ్యా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని ఎదురు చూశా’ అని పాండ్యా పేర్కొన్నాడు. -
ఐపీఎల్లో మరో రెండు జట్లు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ దశావతారం ఎత్తనుంది. పది జట్లతో లీగ్ను విస్తరించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 24న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్) ఏర్పాటు చేసింది. మొత్తం 23 అంశాలపై చర్చించేందుకు బోర్డు సమావేశమవుతున్నప్పటికీ ఏజీఎమ్ ప్రధాన ఎజెండా మాత్రం లీగ్లో తలపడే జట్లను పెంచడమేనని బోర్డు వర్గాలు తెలిపాయి. నిజానికి పది జట్లతో ఐపీఎల్ నిర్వహణ బోర్డుకు కొత్తేం కాదు. తొమ్మిదేళ్ల క్రితమే పది జట్లు (పుణే సహారా వారియర్స్, కొచ్చి టస్క ర్స్) ఐపీఎల్లో తలపడ్డాయి. అయితే ఈ పది జట్ల ముచ్చట 2013లోనే ముగిసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత విస్తరణ తెర మీదికొచ్చింది. దీనికి ప్రధాన కారణం అదానీ గ్రూప్. గుజరాత్కు చెందిన ఈ కార్పొరేట్ సంస్థ అహ్మదాబాద్ వేదికగా ఫ్రాంచైజీ కోసం ఆసక్తి కనబరుస్తోంది. ఇదివరకే రెండేళ్లు రైజింగ్ పుణే సూపర్స్టార్స్ ఫ్రాంచైజీ ఉన్న సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీజీ సంస్థ కూడా తిరిగి వచ్చేందుకు తహతహలాడుతోంది. దీనికి లక్నో వేదిక కావచ్చు. -
అక్షరాలా రూ. 4,000 కోట్ల ఆదాయం!
ముంబై: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ఆగిపోయాయి. కనీసం చిన్న స్థాయి టోర్నీ కూడా నిర్వహించలేని పరిస్థితి. మన దేశంలోనైతే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020లో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ గురించి ఆలోచించింది. ► సాధారణంగా ప్రతీ ఏటా నిర్వహించే ఏప్రిల్–మే షెడ్యూల్ సమయం గడిచిపోయినా ఆశలు కోల్పోలేదు. కోవిడ్–19 కాలంలో ఎన్నో కష్టాలకోర్చి క్రికెట్ నిర్వహించడం అవసరమా అని ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ► అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ ఆలోచించి చివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో విజయవంతంగా ఐపీఎల్ను నిర్వహించింది. బీసీసీఐ ఎందుకు ఇంతగా శ్రమించిందో తాజా లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ► ఐపీఎల్–13 సీజన్ ద్వారా భారత బోర్డుకు ఏకంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. లీగ్ జరపకుండా ఉండే ఇంత భారీ మొత్తాన్ని బోర్డు కోల్పోయేదేమో! తాజా సీజన్ ఐపీఎల్ను టీవీలో వీక్షించినవారి సంఖ్య గత ఏడాదికంటే 25 శాతం ఎక్కువగా ఉండటం విశేషం. –మరోవైపు ఐపీఎల్ సాగిన కాలంలో బోర్డు మొత్తంగా 1800 మందికి 30 వేల (ఆర్టీ–పీసీఆర్) కరోనా పరీక్షలు నిర్వహించడం మరో విశేషం. ఖర్చులు తగ్గించుకొని... సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిన 60 మ్యాచ్ల ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ► ఐపీఎల్ తొలి మ్యాచ్కు దాదాపు రెండు నెలల ముందు ఎగ్జిబిషన్ టోర్నీ సమయంలో వరల్డ్ నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ జొకోవిచ్కు కరోనా రావడంతో మా లీగ్ నిర్వహణపై కూడా సందేహాలు కనిపించాయి. చాలా మంది మమ్మల్ని ముందుకు వెళ్లవద్దని వారించారు. ఎవరైనా క్రికెటర్కు కరోనా వస్తే ఎలా అని వారు అడిగారు. అయితే మేం వాటిని పట్టించుకోలేదు. ∙గత ఐపీఎల్తో పోలిస్తే బీసీసీఐ 35 శాతం నిర్వహణా ఖర్చులు తగ్గించుకుంది. నిర్వహణకు శ్రీలంక నుంచి కూడా ప్రతిపాదన వచ్చినా యూఏఐ వైపు మొగ్గు చూపాం. మూడు నగరాల మధ్యలో బస్సులో ప్రయాణించే అవకాశం ఉండటంతో అలా కూడా ఖర్చు తగ్గించాం. ► సుమారు 40 సార్లు కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా గంటలకొద్దీ చర్చలు సాగాయి. బయో సెక్యూర్ బబుల్ కోసం రెస్ట్రాటా అనే కంపెనీ సహకారం తీసుకున్నాం. బీసీసీఐ అధికారులు ముందుగా వెళ్లి ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. క్వారంటైన్ విషయంలో దుబాయ్ ప్రభుత్వం ఆటగాళ్లకు సడలింపులు ఇచ్చినా... యూఏఈ ప్రభుత్వం ససేమిరా అంది. చివరకు ఎంతో శ్రమించి వారిని కూడా ఒప్పించగలిగాం. ఇంత చేసినా ఆరంభంలోనే చెన్నై బృందంలో చాలా మందికి కరోనా వచ్చినట్లు తేలడంలో ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత అంతా కోలుకున్నారు. మొత్తంగా యూఏఈ ప్రభుత్వ సహకారంతో లీగ్ సూపర్ హిట్ కావడం సంతోషకరం. చివరకు మాకు రూ. 4 వేల కోట్ల ఆదాయం కూడా వచ్చింది. -
సుదీర్ఘ కాలం ‘బయో బబుల్’లో కష్టమే
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ కోసం భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘బయో బబుల్’లోకి ప్రవేశించి 75 రోజులైంది. మరో ఐదు రోజులు కలుపుకుంటే 80 రోజులవుతుంది. ఆ తర్వాత వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం అతను బయలుదేరాల్సి ఉంది. అక్కడా బయో బబుల్లో గడపాల్సి ఉండగా, జనవరి 19న పర్యటన ముగుస్తుంది. ఇదే విషయంపై కోహ్లి ఆందోళన వ్యక్తం చేశాడు. సుదీర్ఘ కాలం ‘బయో బబుల్’లో ఉండాల్సి రావడం చాలా కష్టమని అతను వ్యాఖ్యానించాడు. ఇది ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపిస్తుందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇండోర్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లు, ప్రైవేట్ బీచ్లలో సరదాలు కొంత వరకు ఒత్తిడిని తప్పించగలవేమో తప్ప పూర్తిగా కాదని అతను అన్నాడు. ‘బయో బబుల్’లో జరిగే సిరీస్ల వ్యవధిని తగ్గించే విషయంపై దృష్టి పెట్టాలని కోహ్లి సూచించాడు. ‘బయో బబుల్లో సహచరులతో కలిసి గడపడం, మంచి సాహచర్యం ఉండటంతో ఆరంభంలో బాగానే అనిపించింది. కానీ ఇది సుదీర్ఘంగా కొనసాగడమే సమస్య. రాన్రానూ అంతా కఠినంగా అనిపిస్తోంది. వినోదం కోసం ఎన్ని ఏర్పాట్లు చేసినా... మానసికంగా ప్రశాంతంగా ఉండే విషయం గురించి కూడా సీరియస్గా ఆలోచించాలి. ఇదే అన్నింటికంటే ముఖ్యం. రాబోయే రోజుల్లో సిరీస్ల వ్యవధి తగ్గించే అంశంపై దృష్టి పెట్టాలి. ఒకే రకమైన వాతావరణంలో 80 రోజుల పాటు ఉంటూ మరో ప్రత్యామ్నాయం లేకుండా, భిన్నంగా కనిపించకుండా చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం చాలా కష్టం. ఇది మానసికంగా మాపై ప్రభావం చూపిస్తుంది’ అని కోహ్లి విశ్లేషించాడు. -
ఢిల్లీ తడాఖా
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఐపీఎల్లో దూసుకెళుతోంది. ముందుగా బ్యాటింగ్లో, తర్వాత బౌలింగ్లో చెలరేగడంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చిత్తుగా ఓడింది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 59 పరుగుల తేడాతో బెంగళూరును కంగుతినిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. స్టొయినిస్ (26 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించగా... పృథ్వీషా (23 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన హైదరాబాద్ బౌలర్ సిరాజ్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్ కోహ్లి (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప ఎవరూ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్ నోర్జేకు రెండు వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ‘షా’న్దార్ ఇన్నింగ్స్... కుర్రాడు పృథ్వీ షా దూకుడుతో ఢిల్లీ ఆట మొదలైంది. ఉదాన వేసిన తొలి ఓవర్లోనే అతను మూడు బౌండరీలు బాదాడు. సైనీ ఓవర్లో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫోర్ కొడితే... షా ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్ బాదాడు. వెంటనే కోహ్లి ఐదో ఓవర్లోనే చహల్కు బంతి అప్పగించాడు. పృథ్వీ అతన్ని బౌలింగ్ను తేలిగ్గా కొట్టిపారేశాడు. వరుస బంతుల్లో 4, 6 సిక్స్ కొట్టాడు. ధావన్ మరో ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 4.5 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరింది. బెంగళూరు శిబిరాన్ని కలవరపెట్టిన ఈ జోడీని సిరాజ్ తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 7) విడదీశాడు. దీంతో 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సూపర్ స్టొయినిస్... ఆల్రౌండర్ స్టొయినిస్ విలువైన ఇన్నింగ్స్తో ఢిల్లీ భారీస్కోరు సాధించింది. ఓపెనింగ్ జోడి ఇచ్చిన ఆరంభానికి తన మెరుపులు జతచేశాడు. రిషభ్ పంత్ (25 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి నాలుగో వికెట్కు 89 పరుగులు జతచేశాడు. ఈ క్రమంలో స్టొయినిస్ 24 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 12వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన అతను ఆఖరి దాకా నిలిచాడు. మొయిన్ అలీ వేసిన 14వ ఓవర్లో సిక్స్, ఫోర్తో టచ్లోకి వచ్చిన అతను మరుసటి ఓవర్ వేసిన సైనీ బౌలింగ్లో డోస్ పెంచాడు. 6, 4, 4తో 17 పరుగులు పిండుకున్నాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి భారీ షాట్కు ప్రయత్నించగా డీప్ మిడ్వికెట్ వద్ద చహల్ క్యాచ్ను జారవిడిచాడు. మళ్లీ 17వ ఓవర్ సైనీ వేయగా... స్టొయినిస్ 4, 6తో తన జోరు కొనసాగించాడు. ఆడింది... కోహ్లి ఒక్కడే! కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు శుభారంభమైనా కావాలి. లేదంటే టాప్–3 బ్యాట్స్మెన్ బాధ్యతగా ఆడాలి. కానీ ఈ మ్యాచ్లో బెంగళూరు వైపు నుంచి ఈ రెండూ జరగలేదు. దేవ్దత్ (4) ఔట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రబడ చేతిలో ఓ సారి, ధావన్ చేతిలో మరోసారి క్యాచ్లు నేలపాలైనా సద్వినియోగం చేసుకోలేకపోయిన ఫించ్ (13) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ‘మిస్టర్ 360’ డివిలియర్స్ (9) సింగిల్ డిజిట్కే ఔట్ కావడంతో 43 పరుగులకే బెంగళూరు 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ ముగ్గురు ఔటయినా క్రీజులో కోహ్లి ఉన్నాడన్న ధీమా కాసేపు ఉన్నా... అవతలివైపు మొయిన్ అలీ (11)లాంటి ప్రధాన బ్యాట్స్మెన్ అంతా తేలిగ్గా వికెట్ పారేసుకోవడంతో బెంగళూరు పరాజయం ఖాయమైంది. కుదురుగా ఆడిన కోహ్లిని బోల్తా కొట్టించిన రబడ తన వరుస ఓవర్లలో వాషింగ్టన్ సుందర్ (17), దూబే (11), ఉదాన (1)లను పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ మన్కడింగ్ చేయలేదు గత సీజన్లో రాజస్తాన్ బ్యాట్స్మన్ బట్లర్ను అశ్విన్ మన్కడింగ్ చేశాడు. ఇది పెద్ద చర్చకే దారి తీసినా... అశ్విన్ మాత్రం నిబంధనల ప్రకారమే చేశానని గట్టిగా వాదించాడు. ఈ మ్యాచ్లోనూ తన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 3)లోనే ఓపెనర్ ఫించ్ను మన్కడింగ్ చేసే అవకాశమున్నా... ఎందుకనో తనను తాను సముదాయించుకొని ఫించ్ను వెనక్కి రప్పించాడు తప్ప వికెట్లను గిరాటే వేయలేదు. కోహ్లి @ 9000 టి20 క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారతీయ క్రికెటర్గా, ఓవరాల్గా ఏడో క్రికెటర్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. తన 271వ టి20 మ్యాచ్లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో గేల్ (13,296 పరుగులు–396 మ్యాచ్లు), పొలార్డ్ (10,345–461 మ్యాచ్లు), షోయబ్ మాలిక్ (9,926–365 మ్యాచ్లు), బ్రెండన్ మెకల్లమ్ (9,922–364 మ్యాచ్లు), వార్నర్ (9,391–285 మ్యాచ్లు), ఫించ్ (9,140 పరుగులు–285 మ్యాచ్లు) వరుసగా తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 42; ధావన్ (సి) అలీ (బి) ఉదాన 32; శ్రేయస్ (సి) దేవ్దత్ (బి) అలీ 11; పంత్ (బి) సిరాజ్ 37; స్టొయినిస్ (నాటౌట్) 53; హెట్మైర్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–68, 2–82, 3–90, 4–179. బౌలింగ్: ఉదాన 4–0–40–1, సుందర్ 4–0–20–0, సైనీ 3–0–48–0, చహల్ 3–0–29–0, సిరాజ్ 4–0–34–2, మొయిన్ అలీ 2–0–21–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవదత్ (సి) స్టొయినిస్ (బి) అశ్విన్ 4; ఫించ్ (సి) పంత్ (బి) అక్షర్ 13; కోహ్లి (సి) పంత్ (బి) రబడ 43; డివిలియర్స్ (సి) ధావన్ (బి) నోర్జే 9; మొయిన్ అలీ (సి) హెట్మైర్ (బి) అక్షర్ 11; సుందర్ (సి) అశ్విన్ (బి) రబడ 17; శివమ్ దూబే (బి) రబడ 11; ఉదాన (సి) శ్రేయస్ (బి) రబడ 1; సైనీ (నాటౌట్) 12; సిరాజ్ (బి) నోర్జే 5; చహల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–20, 2–27, 3–43, 4–75, 5–94, 6–115, 7–118, 8–119, 9–127. బౌలింగ్: రబడ 4–0–24–4, నోర్జే 4–0–22–2, అశ్విన్ 4–0–26–1, అక్షర్ పటేల్ 4–0–18–2, హర్షల్ పటేల్ 4–0–43–0. -
చెన్నై తొలి ప్రాధాన్యం ధోని కాదు!
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ను ముంబై ఇండియన్స్ (4 సార్లు) తర్వాత అత్యధికంగా గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (3 సార్లు) ఉంది. అంతేకాకుండా ఐపీఎల్లో ఆడిన ప్రతిసారీ (2016, 17 సీజన్ల్లో జట్టు పాల్గొనలేదు) ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన ఏకైక జట్టు కూడా చెన్నైయే. అంతలా చెన్నై విజయవంతం అయిందంటే దానికి కారణం మహేంద్ర సింగ్ ధోని నాయకుడిగా ఉండటమే అనేది అక్షర సత్యం. అయితే 2008 ఐపీఎల్ ఆరంభ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం... తమ జట్టు మార్కీ ప్లేయర్(కీలక ఆటగాడు)గా మొదట ధోనిని అనుకోలేదని ఆ జట్టు మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ తెలిపాడు. అతడి స్థానంలో అప్పటి భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను తీసుకొని, అతడికే సారథ్య బాధ్యతలు అప్పగించాలనే భావనలో చెన్నై ఓనర్లు ఉన్నట్లు బద్రీనాథ్ వ్యాఖ్యానించాడు. అయితే సెహ్వాగ్ ఢిల్లీ జట్టుకు ఆడతానని అనడంతో... చెన్నై ధోనిపై గురిపెట్టిందని పేర్కొన్నాడు. వేలంలో ధోనిని 15 లక్షల అమెరికన్ డాలర్ల (అప్పటి డాలర్ విలువ ప్రకారం రూ. 6 కోట్లు)కు దక్కించుకోగానే... ఆ ముందు ఏడాది జరిగిన ఆరంభ టి20 ప్రపంచ కప్లో అతడి సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలవడాన్ని పరిగణలోకి తీసుకొని ధోనికి సారథ్య బాధ్యతలు అప్పగించారని బద్రీనాథ్ తెలిపాడు. (చదవండి: మూడో స్థానంలో రాయుడు ఆడాలి) -
కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి'
సాక్షి, హైదరాబాద్ : కరోనా కారణంగా నిరాశలో కూరుకున్న క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13 సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరో 15 రోజుల్లో యూఏఈ వేదికగా ఈ వేడుక మొదలు కానుంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 మ్యాచ్లు జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. గత సీజన్లలో పోలిస్తే అరగంట ముందే ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకి బదులుగా 3.30కు, రాత్రి 8 గంటలకు బదులుగా 7.30కి మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. (సీఎస్కేకు మరో ఎదురుదెబ్బ!) ఈ క్రమంలో ఐపీఎల్ టైమింగ్స్ మార్చాలంటూ ఓ తెలుగు అభిమాని సౌరవ్ గంగూలీ, చెన్నై ఐపీఎల్, స్టార్ మా ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో కోరారు. శివ చరణ్ అనే ట్విటర్ యూజర్ రాత్రి 7.30 గంటలకు స్టార్ మాలో కార్తీక దీపం సీరియల్ వస్తుందని ఆ సమయంలో ఇంట్లో గొడవలు కాకుండా చూడాలని కోరాడు. ‘సౌరవ్ గంగూలీ సర్ ఐపీఎల్ టైమింగ్స్ రాత్రి 7.30 నుంచి 8.00 గంటలకు మార్చండి. ఎందుకంటే 7.30 సమయానికి మా ఇంట్లో ‘కార్తీక దీపం' సీరియల్ చూస్తారు. అసలే మా ఇంట్లో ఒకే టీవీ ఉంది. దయచేసి టైమింగ్స్ మార్చి మా ఇంట్లో గొడవలు జరగకుండా చూడండి సార్.' అని పేర్కొన్నాడు. ఇక శివ చరణ్చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియెట్ చేస్తున్నారు. (వారి ప్రేమే నన్ను కట్టి పడేసింది: కోహ్లి) @SGanguly99 sir please change the timing of @IPL from 7:30pm to 8:00pm because at 7:30pm our family will watch #KarthikaDeepam and we have only one TV in my house .so please change the timings sir and avoid conflicts in my house@ChennaiIPL@StarMaa — పవిత్రపు శివ చరణ్ (@pscharan07) September 3, 2020 కాగా ఈ ట్వీట్పై స్టార్ మా స్పందించడం విశేషం. ‘ఇది చాలా నిజాయితీతో కూడి అభ్యర్థన' అంటూ సదరు వ్యక్తికి బదులిచ్చింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ కార్యక్రమానికే కార్తీక దీపం అడ్డు వస్తుందంటే ఆ సీరియల్కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టెలివిజన్లో టాప్ రేటింగ్తో దూసుకుపోతూ.. ప్రజల ఆదరణను విశేషంగా ఆకట్టుకుంది. సీరియల్ చూడని వారికి కూడా అందులోని డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు తెలిసేలా ప్రాచూర్యం పొందింది. మరి నెటిజన్ల అభ్యర్థన మేరకు ఐపీఎల్ టైమింగ్ మార్చుతారో లేదా అదే సమయానికి ఉంటుందో వేచి చూడాలి. (భజ్జీ.. ఎల్లో టీషర్ట్ మిస్సవుతున్నాం) Looks like a genuine request 🙂#KarthikaDeepam https://t.co/mDqYnHCzPu — starmaa (@StarMaa) September 3, 2020 -
భజ్జీ.. ఎల్లో టీషర్ట్ మిస్సవుతున్నాం
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభం కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ దెబ్బ మీద దెబ్బ తింటుంది. దుబాయ్లో అడుగుపెట్టిన రెండు రోజులకే 13 మందికి కరోనా సోకడం.. వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా ఐపీఎల్లో ఆడలేనంటూ స్వదేశానికి పయనమవ్వడం చూశాం. తాజాగా సీఎస్కే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఐపీఎల్ 13వ సీజన్కు అందుబాటులో ఉండడం లేదంటూ బాంబ్ పేల్చాడు. దీంతో సీఎస్కే ఒక ప్రధాన ఆటగాడి సేవలను కోల్పోయినట్టయింది. 'తల్లి అనారోగ్యం దృష్యా.. మరికొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ సమయంలో నా కుటుంబంతో గడపాలనుకుంటున్నా. అందుకే లీగ్లో ఆడటం లేదంటూ' తన ట్విటర్ ద్వారా సీఎస్కేకు చేరవేశాడు. భజ్జీ చేసిన ట్వీట్పై సీఎస్కే స్పందించింది. 'ఈ సమయంలోనే దృడంగా ఉండాలి పులరవే.. ఈ ఏడాది ఎల్లో టీషర్ట్లో నీ దర్శనం లేకపోవడం బాధాకరం.. భజ్జీ నిన్ను మిస్సవుతున్నాం ' అంటూ ట్వీట్ చేసింది. ఇదే విషయమై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. 'వ్యక్తిగత కారణాల రిత్యా తాను ఐపీఎల్కు అందుబాటులో ఉండడం లేదని హర్భజన్ మాకు సమాచారం అందించాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకొని సీఎస్కే అతని నిర్ణయానికి మద్దతిస్తుంది. ఇలాంటి కష్టకాలంలో భజ్జీ తన ఫ్యామిలీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.. అందుకే అతని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. 'అంటూ పేర్కొన్నాడు. కాగా గతేడాది జరిగిన వేలం పాటలో హర్భజన్ను బేస్ ప్రైజ్(రూ.2 కోట్లు)కు సీఎస్కే దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్గా పేరు పొందిన భజ్జీ.. అన్ని సీజన్లు కలిపి 150 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో లసిత్ మలింగ(170), అమిత్ మిశ్రా(157) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా రికార్డు సాధించాడు. కాగా యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. చదవండి : ధోనితో వాట్సన్ బ్రేక్ఫాస్ట్.. సీఎస్కేకు మరో ఎదురుదెబ్బ! చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగాడా