Indian Premier League (IPL)
-
61 ఏళ్ల వయసులో మరోసారి ప్రేమలో పడ్డ ‘ఐపీఎల్ సృష్టికర్త’!.. ఎవరీమె?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి చైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ(Lalit Modi) మరోసారి ప్రేమలో పడ్డాడు. రీమా బౌరీ(Rima Bouri)తో పాతికేళ్లుగా తనకున్న స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిందని తెలిపాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ విషయాన్ని లలిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.దేశం విడిచిపారిపోయికాగా వ్యాపార కుటుంబానికి చెందిన లలిత్ మోదీ ఢిల్లీలో జన్మించాడు. ఐపీఎల్(IPL) సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన అతడు.. అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఆర్థిక అవకతవలకు పాల్పడి దేశం విడిచిపారిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం లలిత్ మోదీ లండన్లో తలదాచుకుంటున్నట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది.భార్య కంటే తొమ్మిదేళ్లు చిన్నఇదిలా ఉంటే.. లలిత్ మోదీ వృత్తిగత జీవితం మాదిరే వ్యక్తిగత జీవితం కూడా సంచలనాల మయమే. వయసులో తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన, డివోర్సీ మినాల్ను లలిత్ మోదీ ప్రేమించి పెళ్లాడాడు. ఆమె కోసం కుటుంబాన్ని ఎదిరించి మరీ ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చిన లలిత్.. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగాడు.ఇక లలిత్- మినాల్ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ మోదీ ఉన్నారు. వీరిద్దరితో పాటు మినాల్కు మొదటి వివాహం ద్వారా కలిగిన కుమార్తె కరీమా సంగ్రాణిని కూడా లలిత్ మోదీ చేరదీసినట్లు కథనాలు ఉన్నాయి. లలిత్ ప్రాణంగా ప్రేమించిన మినాల్ క్యాన్సర్తో పోరాడి దురదృష్టవశాత్తూ 2018లో కన్నుమూశారు.సుస్మితా సేన్తో ప్రేమలో ఉన్నట్లుఅప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ గతేడాది.. విశ్వ సుందర్ సుస్మితా సేన్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి సంచలనానికి తెరదీశాడు. అనంతరం.. ఆమెను బెటర్ హాఫ్ అని సంబోధిస్తూ పెళ్లి వార్తలకు ఊతమిచ్చాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరూ వీటిని ఖండించడంతో ఊహాగానాలకు చెక్ పడింది.అయితే, తాజాగా.. 61 ఏళ్ల లలిత్ మోదీ తాను మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలపడం విశేషం. ‘‘ఒక్కసారి అదృష్టం అంటారు... మరి నేను మాత్రం రెండుసార్లు లక్కీ అయ్యాను. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిన వేళ.. అవును ఇది రెండోసారి జరిగింది. మీ జీవితాల్లోనూ ఇలా జరిగే ఉంటుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే’’ అంటూ రీమా బౌరీతో ఉన్న ఫొటోలతో కూడిన వీడియోను లలిత్ మోదీ షేర్ చేశాడు.జీవితాంతం నువ్వే నా ప్రేమఇందుకు స్పందిస్తూ.. ‘‘లవ్ యూ మోర్’’ అని రీమా పేర్కొనగా.. లలిత్.. ‘‘జీవితాంతం నువ్వే నా ప్రేమ’’ అంటూ రొమాంటిక్గా బదులివ్వడం విశేషం. కాగా రీమా బౌరీ వృత్తిరీత్యా మార్కెటింగ్ కన్సల్టెంట్గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. 2022లో లలిత్ మోదీ తన కుమార్తె ఆలియా వివాహం జరిపించాడు. బ్రెట్ కార్ల్సన్ అనే విదేశీయుడిని ఆలియా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే.. 2008లో మొదలైన ఐపీఎల్ పదిహేనేళ్లుగా విజయవంతమైన లీగ్గా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఈ మెగా క్రికెట్ ఈవెంట్ మొదలుకానుంది.చదవండి: అప్పుడే ఆఫర్ వచ్చింది.. కానీ!.. వదిలేసిన ఫ్రాంఛైజీ జట్టుకే కెప్టెన్గా.. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
కాసుల వర్షం: సినీ తారలు, వ్యాపారవేత్తలే కాదు.. ఐటీ దిగ్గజాలు కూడా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిందంటే అతియోశక్తి కాదేమో! ఐపీఎల్ ఆరంభానికి పూర్వం కూడా భారత్ క్రికెట్ యాజమాన్యానికి అంతర్జాతీయ క్రికెట్ పై మంచి పట్టు ఉండేది. కానీ ఐపీఎల్ రాకతో భారత్ ఏకంగా ప్రపంచ క్రికెట్ని శాసించే స్థాయికి చేరుకుంది. ఐపీఎల్ కురిపించే కాసుల వర్షం ఇందుకు ప్రధాన కారణం. గత సంవత్సరం గణాంకాల ప్రకారం ఐపీఎల్ మొత్తం విలువ 1600 కోట్ల డాలర్లను దాటి పోయింది. ఇందుకు ఐపీఎల్ను నిర్వహిస్తున్న తీరు కూడా ఒక కారణం. ఇందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని అభినందించాల్సిందే.ఐపీఎల్ విజయ సూత్రాన్ని ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ తెలుసుకున్నాయి. వివిధ దేశాల్లో జరుగుతున్న టీ20 క్రికెట్ టోర్నమెంట్లు ఇందుకు ఉదాహరణ. ఆయా దేశాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ అక్కడ ఐపీఎల్ తరహాలో కాసుల వర్షం కురవడం లేదు. భారత్లో క్రికెట్కు ఉన్న మోజు కూడా ఇందుకు ప్రధాన కారణం. ఐపీఎల్ జరుగుతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. ఐపీఎల్కి క్రికెట్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ అలాటిది.'ది హండ్రెడ్' ఇక ఐపీఎల్ స్పూర్తితో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 'ది హండ్రెడ్' అనే కొత్త ఫార్మాట్ ని 2021 జులై లో ప్రారంభించింది. ఇందులో ఇరు జట్లు వందేసి బంతులు మాత్రమే ఎదుర్కొంటాయి. ఇప్పుడు తాజాగా అమెరికా లో రాణిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజాల కళ్ళు ఈ క్రికెట్ టోర్నమెంట్పై పడ్డాయి.టెక్ దిగ్గజాలు కూడాఅమెరికాలో టెక్ కంపెనీ సీఈఓలు.. ముఖ్యంగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ వంటి ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. టైమ్స్ ఇంటర్నెట్ వైస్ చైర్మన్ సత్యన్ గజ్వానీ, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా నేతృత్వంలోని అమెరికాకు చెందిన టెక్ లీడర్లతో కూడిన కన్సార్టియం శుక్రవారం జరిగిన వేలంలో లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీలో 49% వాటాను 145 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.అమాంతం పెరిగిపోయిన విలువఈ కన్సార్టియం ఐపీఎల్ లోని లక్నో జట్టు ను నిర్వహిస్తున్న ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ను పక్కకు తోసి లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీ ని చేజిక్కించుకోవడం విశేషం. లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ వేదిక కావడం ఇందుకు ఒక కారణం. లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీపడే ఎనిమిది ఫ్రాంచైజీలలో ఒకటి. ఈ ఒప్పందంతో లండన్ స్పిరిట్ విలువ అమాంతం పెరిగిపోయి, ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈ జట్టు ఇప్పుడు అత్యంత విలువైన ఫ్రాంచైజీగా చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 49%అంతకుముందు గురువారం నాడు ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టులో ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49% వాటా కోసం వెచ్చించిన 60 లక్ష ల పౌండ్ల కంటే ఇది రెండింతలు అధికం. ఇప్ప్పటికే ఐపీఎల్ లో సినీ తారలు, వ్యాపారవేత్తలు వివిధ ఫ్రాంచైజీ ల లో పెట్టుబడులు పెట్టి కోట్ల లాభాలను గడిస్తున్నారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ప్రతీ సంవత్సరం అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లోకి ప్రపంచ ఐటి దిగ్గజాలు రంగ ప్రవేశం చేయడంతో ప్రపంచ క్రికెట్ కొత్త హంగులు దిద్దుకుంటుందనడంలో సందేహం లేదు.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
IPL 2024 MI Vs DC: ముంబై అదిరే బోణీ...
ముంబై: ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ తాజా సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. ఆరంభం నుంచి ఆఖరి బంతిదాకా బ్యాటర్లంతా దంచేయడంతో ముంబై 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. మొదట ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్స్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్లు), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులు... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) విధ్వంసం ఢిల్లీ బౌలర్లను చేష్టలుడిగేలా చేసింది. అక్షర్ పటేల్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేయగలిగింది. పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్ కొయెట్జీ 4 వికెట్లు తీశాడు. మూడు దశల్లో ముంబై వీర విహారం ఓపెనర్లు రోహిత్, ఇషాన్ తొలిదశకు అద్భుతంగా శ్రీకారం చుట్టారు. ఇద్దరు అడ్డుఅదుపులేని బాదుడుతో 4.1 ఓవర్లో ముంబై స్కోరు 50కి చేరింది. ఇంకో మూడు ఓవర్లలోనే జట్టు స్కోరు 80 దాటింది. అక్కడే రోహిత్ అవుట్కాగా స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ (0), ఇషాన్ కిషన్లు కూడా అవుటయ్యారు. తిలక్వర్మ (6) అవుటయ్యాక రెండో దశను హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ ధాటిగా నడిపించారు. 16వ ఓవర్లో 150 దాటింది. డేవిడ్ సిక్స్లతో విరుచుకుపడటంతో మరో మూడు ఓవర్లలో 200 (19వ ఓవర్లో) మైలురాయిని చేరుకుంది. ఆఖరి దశ మాత్రం షెఫర్డ్ అరివీర బాదుడుతో స్టేడియం ఊగిపోయింది. నోర్జే వేసిన 20వ ఓవర్ అసాంతం ఆడుకున్న షెఫర్డ్ 4, 6, 6, 6, 4, 6లతో ఏకంగా 32 పరుగులు పిండేశాడు. ఏ ఒక్కరు కనీసం ఫిఫ్టీ అయినా బాదకుండా టి20 క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ముంబై రికార్డు నమోదు చేసింది. పృద్విషా, స్టబ్స్ మెరుపులు మ్యాచ్లో ఓడింది కానీ... ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరిదాకా పోరాడింది. వార్నర్ (10)తో ఆరంభం కుదరకపోయినా పృథ్వీ షా చక్కని షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించాడు. అభిõÙక్ పోరెల్ (31 బంతుల్లో 41; 5 ఫోర్లు)తో రెండో వికెట్కు చకచకా 88 పరుగులు జోడించాక 12వ ఓవర్లో బుమ్రా కళ్లు చెదిరే యార్కర్కు పృథ్వీ షా నిష్క్రమించాడు. తర్వాత స్టబ్స్ భారీ సిక్సర్ల విధ్వంసంతో ముంబై ఇండియన్స్ బౌలర్లను వణికించాడు. కానీ అవతలి వైపు నిలిచే బ్యాటరే కరువవడంతో ఛేజింగ్లో వెనుకబడింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) అక్షర్ 49; కిషన్ (సి అండ్ బి) అక్షర్ 42; సూర్యకుమార్ (సి) సబ్–ఫ్రేజర్ (బి) నోర్జే 0; హార్దిక్ (సి) సబ్–ఫ్రేజర్ (బి) నోర్జే 39; తిలక్ వర్మ (సి) పటేల్ (బి) ఖలీల్ 6; టిమ్ డేవిడ్ (నాటౌట్) 45; షెఫర్డ్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 234. వికెట్ల పతనం: 1–80, 2–81, 3–111, 4–121, 5–181. బౌలింగ్: ఖలీల్ 4–0–39–1, ఇషాంత్ 3–0– 40–0, రిచర్డ్సన్ 4–0–40–0, అక్షర్ 4–0– 35–2, లలిత్ 1–0–15–0, నోర్జే 4–0– 65–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) బుమ్రా 66; వార్నర్ (సి) పాండ్యా (బి) షెఫర్డ్ 10; పోరెల్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 41; స్టబ్స్ (నాటౌట్) 71; రిషభ్ పంత్ (సి) హార్దిక్ (బి) కొయెట్జీ 1; అక్షర్ పటేల్ (రనౌట్) 8; లలిత్ (సి) ఇషాన్ (బి) కొయెట్జీ 2; కుశాగ్ర (సి) తిలక్ వర్మ (బి) కొయెట్జీ 0; రిచర్డ్సన్ (సి) రోహిత్ (బి) కొయెట్జీ 2; ఎక్స్ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–22, 2–110, 3–144, 4–153, 5–194, 6–203, 7–203, 8– 205. బౌలింగ్: కొయెట్జీ 4–0–34–4, బుమ్రా 4–0–22–2, ఆకాశ్ మధ్వాల్ 4–0–45–0, రొమారియో షెఫర్డ్ 4–0–54–1, నబీ 2–0– 17–0, పీయూశ్ చావ్లా 2–0– 32–0. ఐపీఎల్లో నేడు చెన్నై X కోల్కతా వేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: మే 26న చెన్నైలో ఐపీఎల్ ఫైనల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మే 26న ఐపీఎల్ ఫైనల్కు చెన్నై ఆతిథ్యమిస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 2012 తర్వాత చెన్నైలో మళ్లీ ఐపీఎల్ టైటిల్ పోరు జరగనుండటం విశేషం. మే 19వ తేదీతో లీగ్ దశ మ్యాచ్లు పూర్తవుతాయి. అనంతరం మే 21న క్వాలిఫయర్–1 మ్యాచ్కు... మే 22న ఎలిమినేటర్ మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. మే 24న చెన్నైలో క్వాలిఫయర్–2 మ్యాచ్... మే 26న ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారు కాకముందు ఫిబ్రవరిలో బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్లతో కూడిన తొలి దశ షెడ్యూల్ను విడుదల చేసింది. -
IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. నిలకడైన ఆటతీరుతో కెరీర్ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లో రచిన్ 10 మ్యాచ్లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్గా ఎదగడం ఖాయం. సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై) ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది. ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. యూపీ టి20 లీగ్లో కాన్పూర్ సూపర్స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు. వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై) గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్తో కొయెట్జీ గత వన్డే వరల్డ్కప్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్గా కొయెట్జీని చూడవచ్చు. ఆల్రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్) 2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్గా అవతరించింది. గత ఏడాది రన్నరప్గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్కు ఆల్రౌండర్ కొరత ఏర్పడింది. ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్కప్లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్) మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్ను తీసుకుంది. లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో) ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్ను రూ. 3 కోట్లకు తీసుకుంది. -
ఐపీఎల్ వేలం కాసేపట్లో.. అందలం ఎక్కేదెవరు?
విశ్వవ్యాప్త క్రికెట్ అభిమానాన్ని యేటికేడు పెంచుకుంటున్న ఐపీఎల్లో ఆటకు ముందు వేలం పాట జరగబోతోంది. దుబాయ్లో నేడు నిర్వహించే మినీ వేలానికి 333 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది 77 మంది కాగా... ఇటీవల ప్రపంచకప్తో పాటు పరిమిత ఓవర్ల ఆటలో మెరిపిస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్రపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలన్నీ సై అంటున్నాయి. దుబాయ్: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్కు నేడు దుబాయ్లో ఆటగాళ్ల మినీ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ విదేశీ గడ్డపై జరగనుంది. ఒక రోజు ముందు సోమవారం ఫ్రాంచైజీ యాజమాన్యాలతో మాక్ వేలం కూడా నిర్వహించారు. ఇక కోట్ల పందేరం, ఆటగాళ్లకు అందలం పలికేందుకు ఒకటోసారి, రెండోసారి అని సుత్తి బద్దలు కొట్టే ప్రక్రియే తరువాయి. 1,166 మంది నమోదు చేసుకుంటే... ఈ మినీ వేలం కోసం ఐసీసీ సభ్య, అనుబంధ దేశాలు, దేశవాళ్లీ ఆటగాళ్లు ఆసక్తి చూపారు. ఏకంగా 1,166 మంది ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకుంటే... ఫ్రాంచైజీ జట్లతో సంప్రదింపుల అనంతరం లీగ్ పాలకమండలి 333 మంది ఆటగాళ్లతో తుది జాబితాను సిద్ధం చేసింది. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది మాత్రం 77 మంది ఆటగాళ్లు. ఇందులో 30 ఖాళీలను విదేశీ ఆటగాళ్లతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంది. అత్యధికంగా 12 ఖాళీలు కోల్కతా నైట్రైడర్స్లో ఉన్నాయి. నలుగురు విదేశీ ఆటగాళ్లు సహా 12 మందిని కొనేందుకు కోల్కతా వద్ద రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. హాట్ కేక్... రచిన్? భారత్లో ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో డాషింగ్ బ్యాటర్గా రచిన్ రవీంద్ర అందరికంటా పడ్డాడు. ఆరంభంలో ఎదురుదాడికి దిగి న్యూజిలాండ్ విజయాలకు గట్టి పునాది వేసిన రచిన్ ఈ మినీ వేలంలో హాట్కేక్ కానున్నాడు. రూ.50 లక్షల కనీస ధరతో ఫ్రాంచైజీల్ని ఆకర్షిస్తున్నాడు. ఆసీస్ స్పీడ్స్టర్స్ స్టార్క్, కమిన్స్, బ్యాటర్ ట్రావి హెడ్, దక్షిణాఫ్రికా సంచలనం కొయెట్జీ, హసరంగ (శ్రీలంక) తదితర స్టార్ క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఎగబడే అవకాశాలు న్నాయి. భారత్ నుంచి శార్దుల్ ఠాకూర్, హర్షల్ పటేల్, అన్క్యాప్డ్ ఆల్రౌండర్ల సెట్ నుంచి షారుఖ్ ఖాన్లపై రూ.కోట్లు కురిసే అవకాశముంది. వేలం కోసం ప్లేయర్ల ప్రత్యేకతను బట్టి 19 సెట్లుగా విభజించారు. అంటే బ్యాటర్, ఆల్రౌండర్, పేసర్, స్పిన్నర్, వికెట్ కీపర్, క్యాప్డ్, అన్క్యాప్డ్ ఇలా సెట్ల వారీగా వేలం ప్రక్రియ జరుగుతుంది. -
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024..?
సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న కథనాల ప్రకారం ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ సీజన్ మే చివరి నాటి పూర్తవుతుందని సమాచారం. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికల జరగాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాతే తదనుగుణంగా ఐపీఎల్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పోలింగ్ తేదీలు ఖరారయ్యాక ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదలవుతుందని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్ కోసం ఇప్పటినుంచే హడావుడి మొదలైంది. 2024 సీజన్ వేలం రేపు (డిసెంబర్ 19) జరుగనుండటంతో అన్ని ఫ్రాంచైజీలు సన్నాహకాల్లో నిమగ్నమై ఉన్నాయి. దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో రేపు వేలం జరుగనుంది. ఈ వేలం భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమవుతుంది. వేలం ప్రక్రియ మొత్తం స్టార్ స్పోర్ట్స్ (టీవీ), జియో సినిమాలో (డిజిటల్) ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ వేలంలో 77 స్లాట్ల కోసం 333 మంది ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వేర్వేరు బేస్ ప్రైజ్ విభాగాల్లో ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో మిచెల్ స్టార్క్, గెరాల్డ్ కొయెట్జీ, పాట్ కమిన్స్, హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, రచిన్ రవీంద్రలపై అందరీ దృష్టి ఉంది. ఈ ఆటగాళ్లు వేలంలో గత రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఆయా జట్ల పరిస్థితి ఇది..!
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షమ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ , పీయూష్ చావ్లా, ఆకాష్ మాధ్వల్, జేసన్ బెహ్రెన్డార్ఫ్, రొమారియో షెపర్డ్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (13 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (84.75 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (17.75 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (68.6 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (31.4 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (38.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎంగిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-15 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (71.5 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (28.95 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (9), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్ , అమిత్ మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, దేవదత్ పడిక్కల్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (86.85 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (13.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేష్ ఖాన్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (85.5 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (14.5 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) సన్రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్ హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (66 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (34 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ కుమార్ వైశాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (59.25 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (23.25 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్సిమ్రన్ సింగ్, జితేష్ శర్, సికందర్ రజా, రిషి ధవన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ టైడే, అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్ప్రీత్ భాటియా, విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (70.9 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (29.1 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) కోల్కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-13 (9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (67.3 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (32.7 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (12), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 16 వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. సామ్ కర్రన్- 18.5 కోట్లు (2023, పంజాబ్ కింగ్స్) కెమారూన్ గ్రీన్- 17.5 కోట్లు (2023, ముంబై ఇండియన్స్) బెన్ స్టోక్స్- 16.25 కోట్లు (2023, చెన్నై సూపర్ కింగ్స్) క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (2021,రాజస్తాన్ రాయల్స్) నికోలస్ పూరన్- 16 కోట్లు (2023, లక్నో సూపర్ జెయింట్స్) యువరాజ్ సింగ్-16 కోట్లు (2015, ఢిల్లీ డేర్ డెవిల్స్) పాట్ కమిన్స్-15.5 కోట్లు (2020, కేకేఆర్) ఇషాన్ కిషన్-15.25 కోట్లు (2022, ముంబై ఇండియన్స్) కైల్ జేమీసన్-15 కోట్లు (2021, ఆర్సీబీ) బెన్ స్టోక్స్-14.5 కోట్లు (2017, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) సీజన్ల వారీగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు.. 2023: సామ్ కర్రన్- 18.5 కోట్లు (పంజాబ్ కింగ్స్) 2022: ఇషాన్ కిషన్-15.25 కోట్లు (ముంబై ఇండియన్స్) 2021: క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (రాజస్తాన్ రాయల్స్) 2020: పాట్ కమిన్స్-15.5 కోట్లు (కోల్కతా నైట్రైడర్స్) 2019: జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి- 8.4 కోట్లు (RR, KXIP) 2018: బెన్ స్టోక్స్- 12.5 కోట్లు (రాజస్తాన్ రాయల్స్) 2017: బెన్ స్టోక్స్-14.5 కోట్లు (రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) 2016: షేన్ వాట్సన్- 9.5 కోట్లు (ఆర్సీబీ) 2015: యువరాజ్ సింగ్-16 కోట్లు (ఢిల్లీ డేర్ డెవిల్స్) 2014: యువరాజ్ సింగ్- 14 కోట్లు (ఆర్సీబీ) 2013: గ్లెన్ మ్యాక్స్వెల్- 6.3 కోట్లు (ముంబై ఇండియన్స్) 2012: రవీంద్ర జడేజా- 12.8 కోట్లు (సీఎస్కే) 2011: గౌతమ్ గంభీర్- 14.9 కోట్లు (కేకేఆర్) 2010: షేన్ బాండ్, కీరన్ పోలార్డ్- 4.8 కోట్లు (కేకేఆర్, ముంబై) 2009: కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్- 9.8 కోట్లు (ఆర్సీబీ, సీఎస్కే) 2008: ఎంఎస్ ధోని- 9.5 కోట్లు (సీఎస్కే) ఐపీఎల్లో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లికి ఆర్సీబీ యాజమాన్యం 2023 సీజన్ కోసం 17 కోట్లు ముట్టజెప్పింది. కోహ్లి తర్వాత అత్యధిక మొత్తం అందుకున్న భారత ఆటగాళ్లుగా రోహిత్ శర్మ (2023 సీజన్లో 16 కోట్లు), రవీంద్ర జడేజా (2023లో 16 కోట్లు, రిషబ్ పంత్ (2023లో 16 కోట్లు, యువరాజ్ సింగ్ (2015లో 16 కోట్లు) ఉన్నారు. వీరి తర్వాత ఇషాన్ కిషన్ (2022లో 15.25 కోట్లు), యువరాజ్ సింగ్ (2014లో 14 కోట్లు), దినేశ్ కార్తీక్ (2014లో 12.5 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (2022లో 12.25 కోట్లు) అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్.. ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
16 సీజన్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ను (ఐపీఎల్) విజయవంతంగా నిర్వహించిన అనంతరం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరో కొత్త లీగ్ను నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లీగ్ను కూడా ఐపీఎల్ తరహాలోనే భారీ ప్రణాళికతో రూపొందించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లీగ్ను టీ20 ఫార్మాట్లో కాకుండా టీ10 ఫార్మాట్లో నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారట. ఇందుకు సెప్టెంబర్-అక్టోబర్ మాసాలను పరిశీలిస్తున్నట్లు వినికిడి. భారత్తో పాటు విదేశాల్లోనూ ఈ రెండు నెలల్లో పెద్ద టోర్నీలేవీ లేకపోవడంతో సెప్టెంబర్-అక్టోబర్ మాసాలయితే కొత్త లీగ్ నిర్వహణకు అనువుగా ఉంటాయని బీసీసీఐ పెద్దల చర్చించినట్లు తెలుస్తుంది. కొత్త టీ10 లీగ్ ఆలోచన ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ల కోసం బడా కంపెనీలు ఎగబడుతున్నట్లు సమాచారం. కొత్త లీగ్ ప్రతిపాదనను బీసీసీఐ కార్యదర్శి జై షా లేవనెత్తగా బీసీసీఐ పెద్దలందరూ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. కాగా, బీసీసీఐ ఆధ్వర్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో పరుడు పోసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి క్యాష్ రిచ్ లీగ్ నిరంతరాయంగా 16 సీజన్ల పాటు విజయవంతంగా సాగింది. తదుపరి సీజన్ (2024) సన్నాహకాలు కూడా ఇదిరవకే ప్రారంభమయ్యాయి. ఈ సీజన్కు సంబంధించిన వేలం ఈనెల 19న దుబాయ్లో జరుగనుంది. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలో ఫ్రాంచైజీలు సైతం ఓ క్లారిటీ కలిగి ఉన్నాయి. -
ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం.. తుది జట్లు ఇవే..!
2024 సౌతాఫ్రికా టీ20 లీగ్కు సంబంధించిన వేలం జోహన్నెస్బర్గ్లో నిన్న ముగిసింది. ఈ లీగ్ రెండో ఎడిషన్లో పాల్గొనబోయే ఆరు జట్లు తమతమ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. పర్స్ వ్యాల్యూ మేరకు అన్ని ఫ్రాంచైజీలు పటిష్టమైన జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ వేలంలో సౌతాఫ్రికా ఆల్రౌండర్ దయ్యన్ గలీమ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్ అతన్ని 1.60 మిలియన్లకు దక్కించుకుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్ వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ను వైల్డ్కార్డ్ పిక్గా ఎంపిక చేసుకోగా.. పార్ల్ రాయల్స్ లోర్కన్ టక్కర్ను బేస్ ధరకు వైల్డ్ కార్డ్ పిక్గా ఎంపిక చేసుకుంది. ఆయా జట్ల కెప్టెన్ల విషయానికొస్తే.. పార్ల్ రాయల్స్కు (రాజస్తాన్ రాయల్స్) జోస్ బట్లర్, డర్బన్ సూపర్ జెయింట్స్కు (లక్నో సూపర్ జెయింట్స్) కేశవ్ మహారాజ్, ప్రిటోరియా క్యాపిటల్స్కు (ఢిల్లీ క్యాపిటల్స్) వేన్ పార్నెల్, ముంబై ఇండియన్స్ కేప్టౌన్కు (ముంబై ఇండియన్స్) రషీద ఖాన్, జోబర్గ్ సూపర్కింగ్స్కు (చెన్నై సూపర్ కింగ్స్) ఫాఫ్ డుప్లెసిస్, సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్కు (సన్రైజర్స్ హైదరాబాద్) ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహించనున్నారు. సౌతాఫ్రికన్ లీగ్లో పాల్గొనే ఆరు జట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ ఎడిషన్లో (2023) సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్ను ఖంగుతినిపించి ఛాంపియన్గా అవతరించింది. 2024 సీజన్ జనవరి 10న మొదలై ఫిబ్రవరి 10న ముగుస్తుంది. పూర్తి జట్ల వివరాలు.. ప్రిటోరియా క్యాపిటల్స్: పాల్ స్టెర్లింగ్, కైల్ వెర్రెన్, రిలీ రొస్సో, కొలిన్ ఇంగ్రామ్, థీనిస్ డి బ్రుయిన్, విల్ జాక్స్, షేన్ డాడ్స్వెల్, డారిన్ డుపావిల్లోన్, మిగేల్ ప్రిటోరియస్, అన్రిచ్ నోర్ట్జే, ఆదిల్ రషీద్, ఈథన్ బాష్, కార్బిన్ బాష్, మాథ్యూ బోస్ట్, జిమ్మీ నీషమ్, సెనురన్ ముత్తసామి, వేన్ పార్నెల్ (కెప్టెన్), స్టీవ్ స్టోక్ పార్ల్ రాయల్స్: లోర్కన్ టక్కర్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేన్ విలాస్, మిచెల్ వాన్ బ్యూరెన్, లువాన్ డ్రే ప్రిటోరియస్, జాన్ టర్నర్, క్వేనా మఫాకా, ఒబెద్ మెక్కాయ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, కోడి యూసుఫ్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, విహాన్ లుబ్బే, ఫెరిస్కో ఆడమ్స్, ఇవాన్ జోన్స్, ఫాబియన్ అలెన్ ఎంఐ కేప్ టౌన్: క్రిస్ బెంజమిన్, డెవాల్డ్ బ్రెవిస్, టామ్ బాంటన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, గ్రాంట్ రోలోఫ్సెన్, కానర్ ఎస్టర్హుజెన్, నీలన్ వాన్ హీర్డెన్, థామస్ కబెర్, కగిసో రబడ, రషీద్ ఖాన్ (కెప్టెన్), బ్యూరాన్ హెండ్రిక్స్, ఒల్లీ స్టోన్, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, డెలానో పాట్గెటర్, జార్జ్ లిండే, డువాన్ జన్సెన్ జోబర్గ్ సూపర్ కింగ్స్: వేన్ మాడ్సెన్, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), ల్యూస్ డు ప్లూయ్, రీజా హెండ్రిక్స్, డోనోవన్ ఫెర్రీరా, సిబోనెలో మఖాన్యా, రోనన్ హెర్మన్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, జహీర్ ఖాన్, సామ్ కుక్, లిజాడ్ విలియమ్స్, నాండ్రే బర్గ్డర్, ఆరోన్ ఫాంగిసొ, కైల్ సిమ్మండ్స్, దయ్యన్ గలీమ్, మొయిన్ అలీ, డేవిడ్ వీస్ డర్బన్ సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, భానుక రాజపక్స, హెన్రిచ్ క్లాసెన్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, ప్రేనెలన్ సుబ్రాయెన్, నవీన్ ఉల్ హక్, రీస్ టాప్లీ, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), కైల్ అబాట్, జూనియర్ డాలా, జాసన్ స్మిత్, కైల్ మేయర్స్, డ్వేన్ ప్రిటోరియస్, కీమో పాల్, వియాన్ ముల్దర్, జోన్ జోన్ స్మట్స్, బ్రైస్ పార్సన్స్ సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బవుమా, జోర్డాన్ హెర్మాన్, ఆడమ్ రోసింగ్టన్, సరెల్ ఎర్వీ, కాలేబ్ సెలెకా, ఒట్నీల్ బార్ట్మన్, లియామ్ డాసన్, సిసంద మగాలా, బ్రైడన్ కార్స్, సైమన్ హెర్మెర్, క్రెయిగ్ ఒవర్టన్, బేయర్స్ స్వేన్పోల్, మార్కో జన్సెన్, అయా క్వామేన్, టామ్ అబెల్, ఆండిల్ సిమెలన్ -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL), ద హండ్రెడ్ లీగ్ (THL)ల్లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బ్రూక్కు ముందు ఈ మూడు లీగ్ల్లో సెంచరీలు చేసిన ఆటగాడే లేడు. హండ్రెడ్ లీగ్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్కు ప్రాతినిథ్యం వహించిన బ్రూక్ నిన్న (ఆగస్ట్ 22) వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో (42 బంతులు 105; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) కదంతొక్కాడు. ఈ సెంచరీ హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ (41) కావడం విశేషం. దీనికి ముందు బ్రూక్ 2023 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తూ కోల్కతా నైట్రైడర్స్పై శతకం (55 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఈ సెంచరీతో బ్రూక్ సన్రైజర్స్ యంగెస్ట్ సెంచూరియన్గానూ రికార్డుల్లోకెక్కాడు. 2023 ఐపీఎల్కు ముందు సన్రైజర్స్ బ్రూక్ను 13.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. పై పేర్కొన్న మూడు లీగ్ల్లో (ఐపీఎల్, పీఎస్ఎల్, హండ్రెడ్) బ్రూక్ తన తొలి సెంచరీని పీఎస్ఎల్లో సాధించాడు. 2022 పీఎస్ఎల్లో బ్రూక్, లాహోర్ ఖలందర్స్కు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇస్లామాబాద్ యునైటెడ్పై శతక్కొట్టాడు (49 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు). ఓవరాల్గా బ్రూక్ కెరీర్ చూసుకుంటే, 2022 జనవరిలో విండీస్తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 12 టెస్ట్ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 1181 పరుగులు.. 3 వన్డేల్లో ఫిఫ్టి సాయంతో 86 పరుగులు, 20 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 372 పరుగులు చేశాడు. బ్రూక్ ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున 11 మ్యాచ్ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు చేశాడు. -
కరీబియన్ ప్రీమియర్ లీగ్ బరిలోకి అంబటి రాయుడు.. రేపే ముహూర్తం
టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ సూపర్ స్టార్ అంబటి తిరుపతి రాయుడు కరీబియన్ ప్రీమియర్ లీగ్లో అధికారికంగా జాయిన్ అయ్యాడు. రేపు (ఆగస్ట్ 19) ట్రిన్బాగో నైట్రైడర్స్తో జరిగే మ్యాచ్తో సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున సీపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. సౌతాఫ్రికా ఆల్రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్కు ప్రత్యామ్నాయంగా రాయుడు రేపటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. దీంతో ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న రెండో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. 2020 సీజన్లో ప్రవీణ్ తాంబే ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫున సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. Awesome to be back on the park.. excited to be a part of the @sknpatriots and the @CPL.. pic.twitter.com/dsHC4xtsi8 — ATR (@RayuduAmbati) August 17, 2023 సీపీఎల్లో తన తొలి మ్యాచ్కు ముందు రాయుడు తన ట్విటర్ ఖాతా ద్వారా ఓ మెసేజ్ షేర్ చేశాడు. మళ్లీ బ్యాట్ పట్టి బరిలోకి దిగడం అద్భుతంగా ఉంది.. కరీబియన్ లీగ్లో, ముఖ్యంగా సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందంటూ పేట్రియాట్స్ జెర్సీలోని తన ఫోటోను షేర్ చేశాడు. ఇదిలా ఉంటే, 2023 సీజన్ తర్వాత ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ఇటీవల అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. అయితే, ఏదో బలమైన కారణం చేత రాయుడు ఆ లీగ్లో ఆడలేకపోయాడు. మరోవైపు రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. -
IPL: ‘ఢిల్లీ క్యాపిటల్స్’ కోసం కోట్లు వదులుకున్న సూపర్స్టార్.. అందుకే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం. క్యాష్ రిచ్ లీగ్గా పేరొందిన ఈ మెగా క్రికెట్ ఈవెంట్లో భాగమైన ఫ్రాంఛైజీలలో అత్యధికం బడా సంస్థలకు చెందినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఐపీఎల్లో సక్సెస్ అయితే ఎంతటి క్రేజ్ వస్తుందో.. ఏమాత్రం తేడా జరిగినా అదే స్థాయిలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది! ఐపీఎల్ రెండో సీజన్(2009)లో విజేతగా నిలిచిన దక్కన్ చార్జర్స్ ఆ తర్వాత కనుమరుగైన తీరే ఇందుకు నిదర్శనం. అయితే, అదే ఏడాది.. ఢిల్లీ క్యాపిటల్స్ తాము కూడా చార్జర్స్ మాదిరే చేతులు కాల్చుకోకుండా తీసుకున్న కీలక నిర్ణయం గురించి, దానితో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్కు ఉన్న సంబంధం గురించి బీసీసీఐ మాజీ జీఎం అమృత్ మాథూర్ సంచలన విషయాలు తాజాగా వెల్లడించాడు. బాలీవుడ్తో అనుబంధం ఐపీఎల్కు ప్రాచుర్యం కల్పించే క్రమంలో బాలీవుడ్ను కూడా ఇందులో మమేకం చేసిన విషయం తెలిసిందే. బీ-టౌన్ బాద్షా షారుక్ ఖాన్, అలనాటి హీరోయిన్ జూహీ చావ్లా కోల్కతా నైట్ రైడర్స్కు యజమానులు కాగా.. శిల్పా శెట్టి కుంద్రా రాజస్తాన్ రాయల్స్కు, ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్కు సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంఛైజీ ఓనర్లుగానే గాకుండా ప్రమోషన్లలో భాగమైన, భాగమవుతున్న స్టార్లు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో 2009లో ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం ఢిల్లీ డేర్డెవిల్స్) సూపర్స్టార్ అక్షయ్ కుమార్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అక్కీతో అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోగా ఆర్థికపరంగా నష్టాలూ చవిచూసింది. అనవసర ఖర్చులు ఎందుకు? అనవసర ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అతడితో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు చట్టపరంగా చిక్కులు ఎదరవుతాయని భావించినా.. అక్షయ్ కుమార్ పెద్ద మనసుతో ఈ సమస్య నుంచి ఫ్రాంఛైజీ తేలికగా బయటపడేలా చేశాడు. ‘‘ప్రమోషనల్ ఫిల్మ్స్, మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ల కోసం అక్షయ్ కుమార్తో ఢిల్లీ క్యాపిటల్స్ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. కోట్లా మైదానంలో విన్యాసాలు మినహా క్యాపిటల్స్కు అతడి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. నిజానికి అతడి సేవలు వినియోగించడంలో యాజమాన్యం విఫలమైంది. నష్టాలు వెంటాడాయి. దీంతో అర్ధంతరంగా అక్కీతో డీల్ ముగించాలని భావించింది. న్యాయపరంగా చిక్కులు.. అయితే న్యాయపరంగా అందుకు అనేక అడ్డంకులు ఉండటంతో అక్షయ్ కుమార్ దయపైనే అంతా ఆధారపడి ఉన్న సందర్భం. అక్కీ లాయర్లతో విషయం గురించి చెప్పాం. ఆ తర్వాత ఓరోజు సినిమా షూటింగ్లో ఉన్నపుడు.. షాట్ ముగిసిన తర్వాత అక్షయ్ వానిటీ వ్యాన్లోకి నేను వెళ్లాను. మరేం పర్లేదన్న అక్షయ్ కుమార్ సంశయిస్తూనే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి.. డీల్ రద్దు చేసుకోవాలనుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి వివరించాను. కానీ అక్షయ్ మాత్రం ఎంతో హుందాగా స్పందించాడు. మరేం ప్రాబ్లం లేదండి! ఒకవేళ ఇదంతా వర్కౌట్ కాదనుకుంటే.. వెంటనే రద్దు చేసేయండి. పర్లేదు అన్నాడు. నేను విన్నది నిజమేనా నేను విన్నది నిజమేనా అన్న సందేహంలో కొట్టుమిట్టాతుండగా.. ‘‘మీరేం ఇబ్బంది పడకండి. ఎలాంటి సమస్య రాకుండా దీనిని ఎలా ముగించాలో మా లాయర్లతో నేను మాట్లాడతా అని మళ్లీ అక్షయ్ క్లారిటీ ఇచ్చాడు’’ అని అమృత్ మాథుర్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఆత్మకథలో నాటి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్గా నిలవలేదన్న విషయం తెలిసిందే. తాజా సీజన్లోనూ దారుణ ప్రదర్శనతో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక అక్షయ్ కుమార్ విషయానికొస్తే.. అతడు నటించిన ఓ మై గాడ్ 2 సినియా ఇటీవలే విడుదలైంది. చదవండి: APL 2023: తొలిరోజు మ్యాచ్కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్లో ఆ అదృష్టం మీదైతే! -
సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం..
-
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్
-
'డబ్బు, అహంకారంతో'.. భారత ఆటగాళ్లపై కపిల్ దేవ్ ఆగ్రహం
ప్రస్తుతమున్న క్రికెటర్లపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటుంటారని చెప్పాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచి విషయమేనని... అయితే ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో కొరవడటం నెగెటివ్ పాయింట్ అని అన్నాడు. ఇలా తయారు కావడానికి ప్రధానంగా డబ్బు, పొగరు, అహం అనే మూడు అంశాలే కారణమని తెలిపాడు. మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 50 సీజన్ల (సంవత్సరాలు) క్రికెట్ ను చూసిన గవాస్కర్ తో మాట్లాడేందుకు వీరికి నామోషీ ఎందుకని అడిగారు. తమకు అంతా తెలుసుని వారు అనుకుంటుంటారని... వాస్తవానికి వారికి అంతా తెలియదని చెప్పారు. ''అప్పటి, ఇప్పటి ఆటగాళ్లలో వ్యత్యాసం ఉండడం సహజమే. ప్రస్తుత తరం ప్లేయర్లలో గొప్ప విషయం ఏంటంటే వారంతా ఆత్మవిశ్వాసంతో ఆడటం. నెగటివిటీని పట్టించుకోరు.ఇదే సమయంలో మేం ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదనుకుంటారు'' అంటూ తెలిపాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్తో పాటు కాసులు కురిపించే ఐపీఎల్లో ఒక్క సీజన్ ఆడినా చాలు భారీ మొత్తంలో డబ్బులు దక్కించుకోవచ్చనే భ్రమలో ఆటగాళ్లు బతికేస్తున్నారు. ఏదో ఒకరోజు తిరిగి వారికే దెబ్బకొట్టే అవకాశముందని.. ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: #SackRahulDravid: 'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే ద్రవిడ్ను తొలగించండి' ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు -
ఐపీఎల్ బ్యాన్ చేయాలి.. కోర్టులో దాఖలైన పిటిషన్
సాక్షి, చైన్నె: ఐపీఎల్ మ్యాచ్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ విషయంపై బీసీసీఐను ఆశ్రయించాలని పిటిషనర్, ఐపీఎస్ అధికారికి హైకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ సూచించింది. వివరాలు.. ఐపీఎల్ మ్యాచ్ల క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. భారత్లో జరిగే ఈ మ్యాచ్లను చూసేందుకు స్టేడియాలకు తండో పతండాలుగా అభిమానులు తరలిరావడం జరుగుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్లు అన్ని ఫిక్సింగ్, బెట్టింగ్లతో జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ బెట్టింగ్లు, ఫిక్సింగ్లకు వ్యతిరేకంగా ఐపీఎస్ అధికారి సంపత్కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఐపీఎల్ మ్యాచ్లను బెట్టింగ్, ఫిక్సింగ్ పూర్తిగా కట్టడి అయ్యే వరకు నిర్వహించకూడదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టు సీజే గంగా పుర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. వాదనల అనంతం ఈ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. బెట్టింగ్, ఫిక్సింగ్ ఫిర్యాదులను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. చదవండి సీమా, అంజూ.. ఇప్పుడు జూలీ.. సరిహద్దులు దాటిన ప్రేమలో బిగ్ ట్విస్ట్.. -
మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రోజుల వ్యవధిలోనే రెండు క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల కిందట జింబాబ్వే లీగ్లోని (జిమ్-ఆఫ్రో టీ10 లీగ్) హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించిన సంజూ బాబా.. తాజాగా లంక ప్రీమియర్ లీగ్లోని (శ్రీలంక టీ20 లీగ్) బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. I, along with my brothers Omar Khan (OK) and H.H. Sheikh Marwan Bin Mohammed Bin Rashid Al Maktoum, are excited to announce that we have acquired the B-Love Kandy Cricket Team for the Lanka Premier League T20 2023. pic.twitter.com/ksMauYsHbH — Sanjay Dutt (@duttsanjay) June 25, 2023 తనతో పాటు ఒమర్ ఖాన్, షేక్ మర్వాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కలిసి బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నట్లు సంజూ బాబా ప్రకటించాడు. లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ బరిలో బి-లవ్ క్యాండీ బరిలో నిలువనున్నట్లు తెలిపాడు. కాగా, లంక ప్రీమియర్ లీగ్ 2023 జులై 30 నుంచి ఆగస్ట్ 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20 నుంచి 29 వరకు జరుగనుంది. ఈ లీగ్లో మొత్తం ఐదు జట్లు (డర్బన్ క్వాలండర్స్, కేప్టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్) పాల్గొంటాయి. ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సోహన్ రాయ్తో కలిసి సంజూ ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. -
IPL 2023 CSK Vs GT : ‘ఫైనల్’కు ముందెవరు?
చెన్నై: ఐపీఎల్లో రెండు దీటైన జట్ల మధ్య ఢీ అంటే ఢీ అనే మ్యాచ్కు నేడు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. చెన్నై వేదికగా మ్యాచ్ జరగడం ధోని సేనకు అనుకూలత అయినప్పటికీ... ఈ జట్టుపై ఓటమి ఎరుగని గుజరాత్ కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు సమఉజ్జీల మధ్య ఆసక్తికర సమరం గ్యారంటీ! దీంతో ప్రేక్షకులకు టి20 మెరుపులు, ఆఖరి ఓవర్ డ్రామాకు కొదవుండదు. ఇక చెన్నైలో గెలిచినా... ఓడినా... చివరి మజిలీ మాత్రం అహ్మదాబాదే! నెగ్గితే నేరుగా ఒక జట్టు ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు మరో ప్రయత్నంగా రెండో క్వాలిఫయర్లో ఆడుతుంది. ఈ రెండూ నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగనున్నాయి. చెన్నై చెలరేగితే... బరిలోకి దిగే రెండు జట్లు బలమైన ప్రత్యర్థులు. చెన్నై ఐపీఎల్ ఆరంభం నుంచే లీగ్ ఫేవరేట్లలో ఒకటిగా ఎదిగింది. ధోని నాయకత్వంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎన్నోసార్లు నిరూపించుకుంది. ఈ సీజన్లోనూ సూపర్కింగ్స్ ఆట మేటిగానే ఉంది. టాపార్డర్ లో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, శివమ్ దూబే ధనాధన్ షోకు శ్రీకారం చుడితే ప్రత్యర్థికి చుక్కలే! వెటరన్ ధోని బ్యాటింగ్లో వెనుకబడొచ్చేమో కానీ... జట్టును నడిపించడంలో ఎప్పటికీ క్రికెట్ మేధావే. మిడిలార్డర్లో అంబటి రాయుడు నుంచి ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బహుశా ఈ మ్యాచ్లో ఆ వెలతి తీర్చుకుంటాడేమో చూడాలి. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీ... ఇక బౌలింగ్ దళంలో దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే పవర్ ప్లేలో పరుగులిస్తున్నప్పటికీ వికెట్లను మాత్రం పడగొట్టేస్తున్నారు. తీక్షణ, పతిరణల వైవిధ్యం కూడా జట్టుకు కీలక సమయాల్లో ఉపయోగపడుతుంది. టైటాన్స్ ‘టాప్’షో టోర్నీ మొదలైన మ్యాచ్లోనే చెన్నైపై గెలిచిన గుజరాత్ టైటాన్స్ లీగ్లో ఘనమైన ఆరంభమిచ్చింది. బెంగళూరుతో జరిగిన ఆఖరి మ్యాచ్లోనూ టైటాన్స్దే ఆధిపత్యం. సొంతగడ్డపై బెంగళూరు భారీస్కోరు చేసినా ఛేదించి మరీ నెగ్గింది. పాయింట్ల పట్టికైనా... ఆటలోనైనా... డిఫెండింగ్ చాంపియన్కు లీగ్ దశలో అయితే ఎదురే లేకపోయింది. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ను పాండ్యా సేన సమర్థంగా సరైన దిశలో వినియోగించుకుంటుంది. శుబ్మన్ గిల్ లేదంటే విజయ్ శంకర్ల ‘ఇంపాక్ట్’ జట్టుకు అదనపు పరుగుల్ని కట్టబెడుతోంది. జట్టులో వీళ్లిద్దరే కాదు... సాహా నుంచి రషీద్ ఖాన్ దాకా ఇలా ఎనిమిదో వరుస బ్యాటర్ కూడా బాదేయగలడు. షనక, మిల్లర్, రాహుల్ తెవాటియాలు ధాటిగా ఆడగల సమర్థులు. దీంతో పరుగులకు, మెరుపులకు ఏ లోటు లేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, షమీ, రషీద్ ఖాన్ కలిసొచ్చే పిచ్పై మ్యాచ్నే మలుపుతిప్పే బౌలర్లు. ఏ రకంగా చూసుకున్నా ఎవరికీ ఎవరు తీసిపోరు కాబట్టి హేమాహేమీల మధ్య వార్ వన్సైడ్ అయితే కానే కాదు! తుది జట్లు (అంచనా) గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాహా, గిల్, విజయ్ శంకర్, షనక, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ/యశ్ దయాళ్. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రుతురాజ్, కాన్వే, దూబే/పతిరణ, జడేజా, రహానే, మొయిన్ , రాయుడు, దీపక్ చహర్, తుషార్, తీక్షణ. పిచ్, వాతావరణం ఎప్పట్లాగే చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండే అవకాశముంది. అయితే రాత్రయ్యేకొద్దీ తేమ కారణంగా బౌలర్లకు కష్టాలు తప్పవు. టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్కే మొగ్గు చూపువచ్చు. వర్ష సూచన లేదు. 3: ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరగ్గా... మూడింటిలోనూ గుజరాత్ జట్టే గెలిచింది. ఈ మూడు మ్యాచ్ల్లోనూ చెన్నై నిర్దేశించిన లక్ష్యాలను గుజరాత్ ఛేదించింది. అయితే చెన్నై వేదికగా మాత్రం ఈ రెండు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. 43: ఐపీఎల్ టోర్నీలో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం 61 మ్యాచ్లు ఆడింది. 43 మ్యాచ్ల్లో నెగ్గింది. 18 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 24: ఐపీఎల్ టోర్నీ ప్లే ఆఫ్స్ దశలో చెన్నై మొత్తం 24 మ్యాచ్లు ఆడింది. 15 మ్యాచ్ల్లో విజయం సాధించింది. (తొలుత బ్యాటింగ్ చేసినపుడు 7 సార్లు... ఛేజింగ్ లో 8 సార్లు). మిగతా 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. -
నీ వల్లే ద్రవిడ్కు ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది! ఆరోజు నేను సిక్స్ కొట్టడంతో..
Mumbai Indians vs Rajasthan Royals 2014: ‘‘అప్పుడు నేను ద్రవిడ్ రియాక్షన్ చూడలేదు. కానీ ఆయన చాలా సీరియస్ అయ్యారని చాలా మంది చెప్పారు. నీ వల్లే రాహుల్ ద్రవిడ్కు ఎన్నడూ లేనంత కోపం వచ్చింది. ఆయనను మేము ఎప్పుడూ అలా చూడలేదు’’ అంటూ ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ ఆదిత్య తారే 2014 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ముంబై తరఫున అరంగేట్రం మహారాష్ట్రకు చెందిన ఆదిత్య 2010లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్తో ఐపీఎల్లో అడుగుపెట్టిన అతడు.. అదే జట్టు మీద ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున 2017లో ఆఖరి మ్యాచ్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 35 మ్యాచ్లు ఆడిన ఆదిత్య 339 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. కీలక పోరులో ఇక ఆదిత్య తారే కెరీర్లో 2014 నాటి.. ముంబై ఇండియన్స్- రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ తప్పక గుర్తుండిపోతుంది. ఆ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో రాజస్తాన్, ముంబై మధ్య కీలక పోరు జరిగింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే, రన్రేటు దృష్ట్యా ఈ మ్యాచ్లో ముంబై సుమారు 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి. లేనిపక్షంలో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ చేరితే.. ముంబై ఇంటిబాట పట్టాల్సి వస్తుంది. ఆదిత్య తారే, ద్రవిడ్ రియాక్షన్ ఆండర్సన్, రాయుడు విజృంభించడంతో ఇలాంటి ఉత్కంఠభరిత స్థితిలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్(12), మైకేల్ హస్సీ(22) పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ కోరే ఆండర్సర్ తుపాన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షంతో 44 బంతుల్లోనే 95 పరుగులు చేసిన అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అంబటి రాయుడు(10 బంతుల్లో 30 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్తో అతడికి సహకరించాడు. ఇక 15వ ఓవర్ మూడో బంతికి.. క్రీజులో ఉన్న ఆదిత్య తారే బౌండరీ కొడితే ముంబై ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం. లేదంటే రాజస్తాన్ టాప్-4లో అడుగుపెడుతుంది. నరాలు తెగే ఉత్కంఠ నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఆ బంతికి ఆదిత్య ఏకంగా సిక్సర్ బాదడంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ చేరుకుంది. అప్పటిదాకా ప్లే ఆఫ్ బెర్తు తమదే అని సంతోష పడ్డ రాజస్తాన్కు నిరాశ తప్పలేదు. ఇక ఆదిత్య సిక్స్ కొట్టడంతో నాటి.. రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కోపంతో ఊగిపోయాడు. తమ జట్టు ఓడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించడంతో ఎన్నడూ లేని విధంగా సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో కొత్తగా కనిపించాడు. ఈ విషయం గురించి తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో ఆదిత్య తారే గుర్తు చేసుకున్నాడు. అదే ద్రవిడ్ కోపానికి కారణం ‘‘నేను ఆ బంతిని గాల్లోకి లేపే ముందు తామే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించామని రాజస్తాన్ ఫిక్సైపోయింది. డగౌట్లో ఉన్న వాళ్ల ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. అయితే, అప్పుడే మాకో విషయం తెలిసింది. మేము ప్లే ఆఫ్స్ చేరడానికి మాకు ఇంకో బంతి మిగిలే ఉంది. కాబట్టి బౌండరీ బాదాలని నిశ్చయించుకున్నాం. ముందేమో సిక్స్ కొట్టాలని భావించాం. తర్వాత తెలిసిందేంటే బౌండరీ బాదినా చాలని! అయితే, నేను అప్పటికే సిక్సర్ కొట్టాలని బలంగా నిశ్చయించుకున్నా. అదే అమలు చేశా. ఇదే ద్రవిడ్ కోపానికి కారణమైంది’’ అని 35 ఏళ్ల ఆదిత్య తారే చెప్పుకొచ్చాడు. కాగా 2014లో ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై కథ ముగియగా.. కేకేఆర్ విన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? గావస్కర్..సెహ్వాగ్ దగ్గరకు రాడు! వీరూనే వెళ్లాలి.. అర్థమైందా? వాళ్లిద్దరు అంతే! -
IPL 2023: రసెల్ ధమాకా...
కోల్కతా: ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అడుగంటిన కోల్కతా ఆశలకు సిక్సర్లతో జీవం పోశాడు. మళ్లీ ఆఖరి ఓవర్ డ్రామా కనిపించినా... నైట్రైడర్స్ 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ధావన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం కోల్కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి గెలిచింది. నితీశ్ రాణా (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. ధావన్ ఫిఫ్టీతో... కోల్కతా పవర్ప్లేలోనే ఓపెనర్ ప్రభ్సిమ్రన్ (12), రాజపక్స (0) వికెట్లను కోల్పోయింది. వీరిద్దరిని హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో మిగతా జట్టు సభ్యుల నుంచి సహకారం కరువైనా... శిఖర్ ధావన్ జట్టును నడిపించాడు. లివింగ్స్టోన్ (9 బంతుల్లో 15; 3 ఫోర్లు), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21; 2 సిక్సర్లు) తక్కువే చేసినా... ధావన్ (41 బంతుల్లో) ఫిఫ్టీతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. జితేశ్, ధావన్ నాలుగో వికెట్కు 53 పరుగులు జోడించారు. పరుగుల వేగం పెరగాల్సిన దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్కు పంజాబ్ డీలా పడింది. 106/3 స్కోరు వద్ద పటిష్టంగా కనిపించిన జట్టు స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయింది. స్యామ్ కరన్ (4), రిషి ధావన్ (11 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటిస్థితిలో షారుఖ్ (8 బంతుల్లో 21 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్), హర్ప్రీత్ బ్రార్ ( 9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటితో ఆఖరి 16 బంతుల్లో 40 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ ఇన్నింగ్స్... జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు) బౌండరీలతో కోల్కతా ఇన్నింగ్స్ వేగంగా సాగింది. అయితే గుర్బాజ్ (12 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) వికెట్ పారేసుకోగా... కోల్కతా ఇన్నింగ్స్ కూడా కెప్టెన్ నితీశ్ రాణా అర్ధసెంచరీతోనే నడించింది. రాయ్ దూకుడుకు హర్ప్రీత్ బ్రేకులేయగా, నితీశ్... వెంకటేశ్ (11)తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటింది. మధ్యలో పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగుల వేగం తగ్గింది. 16వ ఓవర్లో రాణా అవుటయ్యాక ఒత్తిడి పెరిగింది. 12 బంతుల్లో 26 పరుగుల సమీకరణం ఇరు జట్లకూ అవకాశమిచ్చింది. కానీ స్యామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రసెల్ 3 భారీ సిక్సర్లతో 20 పరుగులొచ్చాయి. దీంతో 6 బంతుల్లో 6 పరుగుల సమీకరణం కోల్కతావైపే మొగ్గింది. అయితే 2 పరుగుల దూరంలో ఐదో బంతికి రసెల్ రనౌట్ కావడంతో కాస్త ఉత్కంఠ రేకెత్తించినా... అర్‡్ష దీప్ వేసిన చివరి బంతిని రింకూ సింగ్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీకి తరలించి గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రాన్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 12; ధావన్ (సి) వైభవ్ (బి) నితీశ్ రాణా 57; రాజపక్స (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 0; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 15; జితేశ్ (సి) గుర్బాజ్ (బి) వరుణ్ 21; స్యామ్ కరన్ (సి) గుర్బాజ్ (బి) సుయశ్ 4; రిషి ధావన్ (బి) వరుణ్ 19; షారుఖ్ (నాటౌట్) 21; హర్ప్రీత్ బ్రార్ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–21, 2–29, 3–53, 4–106, 5–119, 6–139, 7–139. బౌలింగ్: వైభవ్ 3–0–32–0, హర్షిత్ 3–0–33–2, రసెల్ 1–0–19–0, వరుణ్ 4–0–26–3, సుయశ్ 4–0–26–1, నరైన్ 4–0–29–0, నితీశ్ రాణా 1–0–7–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) షారుఖ్ (బి) హర్ప్రీత్ 38; గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 15; నితీశ్ రాణా (సి) లివింగ్స్టోన్ (బి) చహర్ 51; వెంకటేశ్ (సి) లివింగ్స్టోన్ (బి) చహర్ 11; రసెల్ (రనౌట్) 42; రింకూ సింగ్ (నాటౌట్) 21; శార్దుల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–38, 2–64, 3–115, 4–124, 5–178. బౌలింగ్: రిషి ధావన్ 2–0–15–0, అర్‡్షదీప్ సింగ్ 4–0–39–0, ఎలిస్ 4–0–29–1, స్యామ్ కరన్ 3–0–44–0, లివింగ్స్టోన్ 2–0–27–0, హర్ప్రీత్ 1–0–4–1, రాహుల్ చహర్ 4–0–23–2. -
IPL 2023: తిరుగులేని టైటాన్స్
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో గురువారం వరకు జరిగిన 47 మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఏ జట్టూ కూడా 18 ఓవర్లలోపు ఆలౌట్ కాలేదు. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ పేలవ ఆటతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలింది. గుజరాత్ టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు సొంతగడ్డపై నిలవలేకపోయిన రాయల్స్ భారీ ఓటమిని ఎదుర్కొంది. 119 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఏకంగా 37 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన గుజరాత్... గత మ్యాచ్లో తమ వేదికపై రాజస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో లెక్క సరి చేసింది. జైపూర్: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకుంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. సంజూ సామ్సన్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (3/14) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం గుజరాత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు సాధించి గెలిచింది. వృద్ధిమాన్ సాహా (34 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) శుబ్మన్ గిల్ (35 బంతుల్లో 36; 6 ఫోర్లు) గెలిపించారు. సమష్టి వైఫల్యం... పాండ్యా తొలి ఓవర్లోనే బట్లర్ (8) వెనుదిరగ్గా... షమీ ఓవర్లో సిక్స్, ఫోర్తో జోరు ప్రదర్శించిన గత మ్యాచ్ హీరో యశస్వి జైస్వాల్ (14) దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో జట్టు పతనం మొదలైంది. సామ్సన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్ను అభినవ్ చక్కటి ఫీల్డింగ్తో ఆపగా, బంతిని అందుకున్న మోహిత్ నాన్స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. సింగిల్ కోసం ప్రయత్నించి జైస్వాల్ దూసుకురాగా, సామ్సన్ స్పందించలేదు. ఇద్దరూ ఒకేవైపు ఉండిపోగా, జైస్వాల్ వెనక్కి వెళ్లటంలో విఫలమయ్యాడు. టీమ్ను ఆదుకోవాల్సిన సామ్సన్ కూడా తర్వాతి ఓవర్లోనే అవుట్ కావడం రాయల్స్ను దెబ్బ తీసింది. ఆ తర్వాత ఏ ఒక్కరూ పట్టుదల ప్రదర్శించకపోవడంతో జట్టు కోలుకోలేకపోయింది. అలవోకగా... స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ అందుకుంది. ఓపెనర్లు సాహా, గిల్ చకచకా పరుగులు సాధించడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లతో 49 పరుగులకు చేరింది. తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు గిల్ను అవుట్ చేసి రాయల్స్ ఈ జోడీని విడదీసింది. జంపా ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 4, 6, 6 బాదడం ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (రనౌట్) 14; బట్లర్ (సి) మోహిత్ (బి) పాండ్యా 8; సామ్సన్ (సి) పాండ్యా (బి) లిటిల్ 30; పడిక్కల్ (బి) నూర్ 12; అశ్విన్ (బి) రషీద్ 2; పరాగ్ (ఎల్బీ) (బి) రషీద్ 4; హెట్మైర్ (ఎల్బీ) (బి) రషీద్ 7; జురేల్ (ఎల్బీ) (బి) నూర్ 9; బౌల్ట్ (బి) షమీ 15; జంపా (రనౌట్) 7; సందీప్ శర్మ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 118. వికెట్ల పతనం: 1–11, 2–47, 3–60, 4–63, 5–69, 6–77, 7–87, 8–96, 9–112, 10–118. బౌలింగ్: షమీ 4–0–27–1, పాండ్యా 2–0–22–1, రషీద్ 4–0–14–3, లిటిల్ 4–0–24–1, నూర్ 3–0–25–2, మోహిత్ 0.5–0–5–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (నాటౌట్) 41; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 36; పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119. వికెట్ల పతనం: 1–71. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–0, సందీప్ శర్మ 3–0–19–0, జంపా 3–0–40–0, చహల్ 3.5–0–22–1, అశ్విన్ 1–0–8–0. ఐపీఎల్లో నేడు చెన్నైX ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) ఢిల్లీ X బెంగళూరు (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2023: కోల్కతా ప్రతీకారం
సన్రైజర్స్ విజయానికి ఒకదశలో 30 బంతుల్లో 38 పరుగులే కావాలి... చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ మార్క్రమ్ కూడా అప్పుడే జోరు పెంచాడు... సొంత గడ్డపై గెలుపు ఖాయమనిపించింది. కానీ అంతా తలకిందులైంది. ఓటమి దిశగా వెళుతున్న కోల్కతా ఒక్కసారిగా పుంజుకుంది. పదునైన బౌలింగ్తో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి చివరి వరకు ఆటను తీసుకొచ్చింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి వేసిన ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా 3 పరుగులే వచ్చాయి. దాంతో నైట్రైడర్స్ ఊపిరి పీల్చుకోగా, రైజర్స్ నిరాశలో మునిగింది. సాక్షి, హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్లో ఎదురైన పరాజయానికి ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా 5 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేయగలిగింది. మార్క్రమ్ (40 బంతుల్లో 41; 4 ఫోర్లు), క్లాసెన్ (20 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించినా ఫలితం దక్కలేదు. కీలక భాగస్వామ్యం... ఒక్కరూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడకపోయినా... కీలక ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేయడంతో కోల్కతా చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. మార్కో జాన్సెన్ తన తొలి ఓవర్లోనే గుర్బాజ్ (0), వెంకటేశ్ అయ్యర్ (7)లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. జేసన్ రాయ్ (19 బంతుల్లో 20; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. ఈ దశలో కెప్టెన్ రాణా, రింకూ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 40 బంతుల్లో 61 పరుగులు జోడించారు. కార్తీక్ త్యాగి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6తో రాణా దూకుడు ప్రదర్శించాడు. అయితే మార్క్రమ్ అద్భుత క్యాచ్కు రాణా వెనుదిరగ్గా... ఆండ్రీ రసెల్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్లు) కూడా ఎక్కువసేపు నిలవలేదు. సన్రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఇన్నింగ్స్ చివర్లో కూడా కేకేఆర్ ఆశించినన్ని పరుగులు చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు 42 పరుగులే సాధించింది. క్లాసెన్ మెరిసినా... ఛేదనలో రైజర్స్ కూడా తడబడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (18), అభిషేక్ శర్మ (9)లతో పాటు తక్కువ వ్యవధిలో రాహుల్ త్రిపాఠి (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (0) వికెట్లను జట్టు కోల్పోయింది. అయితే మార్క్రమ్, క్లాసెన్ భాగస్వామ్యం ఇన్నింగ్స్ను నిలబెట్టింది. చక్కటి షాట్లతో, సమన్వయంతో వీరిద్దరు పరుగులు రాబట్టారు. తన తొలి ఫోర్ కొట్టేందుకు మార్క్రమ్ 23 బంతులు తీసుకున్నా... అనుకూల్ రాయ్ ఓవర్లో రెండు సిక్సర్లతో క్లాసెన్ దూకుడు ప్రదర్శించాడు. ఐదో వికెట్కు 47 బంతుల్లో 70 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్ వెనుదిరిగాడు. అయితే మార్క్రమ్ క్రీజ్లో ఉన్నంత వరకు రైజర్స్ గెలుపుపై ధీమాగానే ఉంది. 20 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన స్థితిలో కెప్టెన్ వెనుదిరిగారు. తర్వాతి బ్యాటర్లు మిగిలిన పనిని పూర్తి చేయలేకపోయారు. సమద్ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొంత పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) కార్తీక్ త్యాగి 20; గుర్బాజ్ (సి) బ్రూక్ (బి) జాన్సెన్ 0; వెంకటేశ్ అయ్యర్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 7; నితీశ్ రాణా (సి అండ్ బి) మార్క్రమ్ 42; రింకూ సింగ్ (సి) సమద్ (బి) నటరాజన్ 46; రసెల్ (సి) నటరాజన్ (బి) మార్కండే 24; నరైన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) భువనేశ్వర్ 1; శార్దుల్ ఠాకూర్ (సి) సమద్ (బి) నటరాజన్ 8; అనుకూల్ రాయ్ (నాటౌట్) 13; హర్షిత్ (రనౌట్) 0; వైభవ్ అరోరా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–8, 2–16, 3–35, 4–96, 5–127, 6–130, 7–151, 8–168, 9–168. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–0–24–2, కార్తీక్ త్యాగి 2–0–30–1, మార్క్రమ్ 3–0–24–1, నటరాజన్ 4–0–30–2, మార్కండే 4–0–29–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 9; మయాంక్ అగర్వాల్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 18; రాహుల్ త్రిపాఠి (సి) వైభవ్ అరోరా (బి) రసెల్ 20; మార్క్రమ్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ అరోరా 41; హ్యారీ బ్రూక్ (ఎల్బీ) (బి) అనుకూల్ రాయ్ 0; క్లాసెన్ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 36; సమద్ (సి) అనుకూల్ రాయ్ (బి) వరుణ్ చక్రవర్తి 21; జాన్సెన్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 1; భువనేశ్వర్ (నాటౌట్) 5; మార్కండే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–29, 2–37, 3–53, 4–54, 5–124, 6–145, 7–152, 8–165. బౌలింగ్: హర్షిత్ 4–0–27–1, వైభవ్ 3–0–32–2, శార్దుల్ 3–0– 23–2, రసెల్ 1–0–15–1, అనుకూల్ రాయ్ 3–0–26–1, నరైన్ 2–0–16–0, వరుణ్ చక్రవర్తి 4–0–20–1. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే హెడ్సెట్..
ఐపీఎల్ వీక్షకుల కోసం జియో సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. నేరుగా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించే జియో డైవ్ (JioDive) అనే కొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్సెట్ను లాంచ్ చేసింది. ఇదీ చదవండి: WEF Report: 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్ జియో సినిమా (JioCinema) యాప్లో ఐపీల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీఆర్ హెడ్సెట్ని ఉపయోగించవచ్చు. ఇందులో 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ ఉన్నాయి. దీంతో నేరుగా స్టేడియంలోనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ హెడ్సెట్ను జియో సినిమా యూజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ఈ జియోడైవ్ హెడ్సెట్ ధర రూ. 1,299. జియో మార్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్బ్యాక్ లభిస్తుంది. అయితే హైజనిక్ కారణాల వల్ల ఈ ఒక సారి కొనుగోలు చేసిన ఈ వీఆర్ హెడ్సెట్ను రిటర్న్ చేసే వీలు లేదని కంపెనీ పేర్కొంది. జియోడైవ్ వీఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీల వీక్షణ 4.7 నుంచి 6.7 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్, iOS ఫోన్లకు సపోర్ట్ లెన్స్ ఫోకస్, ఫైన్ ట్యూన్ అడ్జెస్ట్మెంట్ కోసం ఏర్పాటు. హెడ్సెట్ను సౌకర్యవంతంగా పెట్టుకునేందుకు 3వే అడ్జస్టబుల్ స్ట్రాప్ Android 9+, iOS 15+కి సపోర్ట్ ఉపయోగించడం ఎలా? బాక్స్పై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి జియో ఇమ్మెర్స్ (JioImmerse) యాప్ను ఇన్స్టాల్ చేయండి సూచనలకు అనుగుణంగటా అన్ని అనుమతులను ఇచ్చి లాగిన్ చేయండి. ఇందుకోసం జియో నెట్వర్క్కి కనెక్ట్ అయిఉండాలి. జియోడైవ్ (JioDive) ఆప్షన్ను ఎంచుకుని ‘Watch on JioDive’పై క్లిక్ చేయండి హెడ్సెట్లో ఫ్రంట్ కవర్ని తీసి ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్ల మధ్య ఫోన్ను పెట్టిన తర్వాత ఫ్రంట్ కవర్ను మూసివేయండి హెడ్సెట్ను పెట్టకుని స్ట్రాప్స్ను సరిచేసుకోండి ఉత్తమ వీక్షణ అనుభవం, పిక్చర్ క్వాలిటీని అడ్జస్ట్మెంట్ వీల్స్ను సరిచేయండి ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. Bringing you a stadium-like experience at home with #JioDive. - Watch cricket in 360 immersive view - Enjoy #TATAIPLonJioCinema on a 100-inch virtual screen - Experience #360cricket from multiple camera angles Buy now https://t.co/1azFVIwqfR#EnterANewReality #IPL2023 pic.twitter.com/PxplF0SAz9 — JioDive (@jiodiveofficial) April 30, 2023 -
సన్రైజర్స్కు ఢిల్లీ షాక్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ను గెలిపించేందుకు హైదరాబాద్ బౌలర్లు శ్రమిస్తే... బ్యాటర్ల అలసత్వం జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. ఓటమి తప్పదనుకున్న పోరులో ఢిల్లీ పోరాటం జట్టును 7 పరుగులతో గెలిపించింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే (27 బంతుల్లో 34; 2 ఫోర్లు), అక్షర్ పటేల్ (34 బంతుల్లో 34; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారంతే! వాషింగ్టన్ సుందర్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. మయాంక్ (39 బంతుల్లో 49; 7 ఫోర్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్, నోర్జే రెండేసి వికెట్లు తీశారు. ఐపీఎల్లో ఢిల్లీ చేతిలో హైదరాబాద్కిది వరుసగా ఐదో ఓటమి. ఆదుకున్న ఆ ఇద్దరు... ముందుగా హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిల్లాడారు. జట్టును నడిపించే స్కోరుగానీ, ప్రేక్షకుల్ని అలరించే ఆటగానీ ఇన్నింగ్స్లో కరువైంది. సాల్ట్ (0) డకౌట్ కాగా, చకచకా 5 బౌండరీలు బాదిన మార్‡్ష (15 బంతుల్లో 25; 5 ఫోర్లు) ఆట ఐదో ఓవర్లోనే ముగిసింది. 8వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఉచ్చులో అనుభవజ్ఞుడైన వార్నర్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ (10), అమన్ హకీమ్ (4) చిక్కారు. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో మనీశ్ పాండే, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. ఆరో వికెట్కు 69 పరుగులు జోడించారు. బ్యాటర్ల నిర్లక్ష్యం... తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆపసోపాలు పడింది. బ్రూక్ (7), తర్వాత త్రిపాఠి (21 బంతుల్లో 15)తో కలిసి వేగంగా ఆడిన మయాంక్ 12వ ఓవర్లో పెవిలియన్ చేరడంతో సీన్ మారిపోయింది. స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పటేల్ పిచ్ అనుకూలతలతో బంతుల్ని సుడులు తిప్పారు. అభిషేక్ శర్మ (5) మార్క్రమ్ (3) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో 85 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయింది. చివర్లో క్లాసెన్ (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), సుందర్ (15 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు)ల బౌండరీలతో సన్రైజర్స్ ఇన్నింగ్స్ గాడిన పడింది. కానీ క్లాసెన్ వేగానికి నోర్జే బౌలింగ్లో చుక్కెదురవడంతో ఓటమి తప్పలేదు. హైదరాబాద్ విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా ‘ఇంపాక్ట్’ బౌలర్ ముకేశ్ కేవలం 5 పరుగులే ఇచ్చాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) బ్రూక్ (బి) సుందర్ 21; సాల్ట్ (సి) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 0; మార్‡్ష (ఎల్బీడబ్ల్యూ) (బి) నటరాజన్ 25; సర్ఫరాజ్ (సి) భువనేశ్వర్ (బి) సుందర్ 10; మనీశ్ పాండే (రనౌట్) 34; అమన్ (సి) అభిషేక్ (బి) సుందర్ 4; అక్షర్ (బి) భువనేశ్వర్ 34; రిపాల్ (రనౌట్) 5; నోర్జే (రనౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 4; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–1, 2–39, 3–57, 4–58, 5–62, 6–131, 7– 134, 8–139, 9–139. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–11–2, జాన్సెన్ 2–0–27–0, సుందర్ 4–0–28–3, నటరాజన్ 3–0–21–1, మార్కండే 4–0–34–0, ఉమ్రాన్ 2–0–14–0, మార్క్రమ్ 1–0–7–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (బి) నోర్జే 7; మయాంక్ (సి) అమన్ (బి) అక్షర్ 49; రాహుల్ త్రిపాఠి (సి) సాల్ట్ (బి) ఇషాంత్ 15; అభిషేక్ (సి అండ్ బి) కుల్దీప్ 5; మార్క్రమ్ (బి) అక్షర్ 3; క్లాసెన్ (సి) అమన్ (బి) నోర్జే 31; సుందర్ (నాటౌట్) 24; జాన్సెన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–31, 2–69, 3–75, 4–79, 5–85, 6–126. బౌలింగ్: ఇషాంత్ 3–0–18–1, నోర్జే 4–0–33–2, ముకేశ్ 3–0–27–0, అక్షర్ 4–0– 21–2, కుల్దీప్ 4–0–22–1, మార్‡్ష 2–0–16–0. -
IPL: ఆర్సీబీతో ప్రయాణం అద్భుతం అంటూనే కోహ్లి షాకింగ్ కామెంట్స్
Virat Kohli- RCB: టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విడదీయరాని అనుబంధం ఉంది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి.. కీలక ప్లేయర్గా.. అటుపై కెప్టెన్గా ఎదిగి.. ఆర్సీబీ అంటే కోహ్లి... కోహ్లి అంటే ఆర్సీబీ అన్నంతగా ముడిపడిపోయాడు. అలాంటి కోహ్లి పేరు లేని ఆర్సీబీని ఊహించడం కష్టం. 2013- 2021 వరకు ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించనప్పటికీ .. జట్టు అభిమానులను అలరించడంలో మాత్రం విఫలం కాలేదు. తనదైన శైలిలో దూకుడైన ఆటతో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్.. రోజురోజుకీ ఆర్సీబీ ఫ్యాన్ బేస్ పెంచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఆర్సీబీతో ప్రయాణం అద్భుతం ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తాజా వెల్లడించిన ఓ విషయం నెట్టింట వైరల్గా మారింది. ఆర్సీబీతో అనుబంధాన్ని చెబుతూనే.. ఆరంభంలో తాను వేరే ఫ్రాంఛైజీకి మారాలనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు.. జియో సినిమా షోలో రాబిన్ ఊతప్పకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీతో నా ప్రయాణం అద్భుతం. ఫ్రాంఛైజీ అంటే నాకు అమితమైన గౌరవం. ఎందుకంటే జట్టులో చేరిన తొలి మూడేళ్లలో వాళ్లు నన్ను చాలా బాగా సపోర్టు చేశారు. రిటెన్షన్ జరిగిన ప్రతిసారీ.. ‘‘మేము నిన్ను రిటైన్ చేసుకోబోతున్నాం’’ అని చెప్పేవారు. అప్పుడు.. నేను వాళ్లకు చెప్పిన మాట ఒకటే.. ‘‘టాపార్డర్లో ఆడాలనుకుంటున్నా. టీమిండియాకు ఆడేపుడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తా.. ఇక్కడ కూడా అదే చేయాలనుకుంటున్నా’’ అని విజ్ఞప్తి చేశా. అందుకు వాళ్లు సరేనన్నారు. నాపై నమ్మకం ఉంచారు. నాకు కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చారు. అలా ఆర్సీబీతో పాటే నా అంతర్జాతీయ కెరీర్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. నాకు వాళ్లు ఎంతో విలువ ఇస్తారు. నా మాట పట్టించుకోలేదు పేరైతే చెప్పను గానీ.. ఓ ఫ్రాంఛైజీతో అప్పట్లో నేను సంప్రదింపులు జరిపాను. కానీ వాళ్లు కనీసం నేను చెబుతున్నానో కూడా పట్టించుకునే స్థితిలో లేరు. అప్పట్లో నేను 5-6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు వాళ్లతో మాట్లాడాను. ‘‘ఒకవేళ నేను మీ జట్టులోకి వస్తే టాపార్డర్లో ఆడిస్తారా లేదంటే వేరే ప్లేస్లోనా’’.. అని అడిగాను. వాళ్లు పట్టించుకోనేలేదు. అయితే, 2011లో నేను టీమిండియా తరఫున అద్భుతంగా ఆడుతున్న తరుణంలో అదే ఫ్రాంఛైజీ వాళ్లు నా దగ్గరికి వచ్చారు. ‘ప్లీజ్.. వేలంలోకి రాగలరా?’’ అని నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను కచ్చితంగా నో అని చెప్పేశాను. నాకు ఎల్లవేళలా అండగా నిలిచిన ఆర్సీబీతోనే ఉంటానని చెప్పాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లిని వద్దన్న ఫ్రాంఛైజీ ఉందా? ఇందుకు స్పందించిన ఊతప్ప.. కోహ్లి వస్తానంటే పట్టించుకోని ఫ్రాంఛైజీ కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బదులుగా.. ‘‘అవును.. నిజం. వాళ్లు అప్పట్లో నా అభ్యర్థనను నిర్మొహమాటంగా కాదన్నారు. అదే మంచిదైంది’’ అని కోహ్లి.. ఊతప్పతో వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2023లో ఆర్బీసీ స్టార్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో 220 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్. చదవండి: ఎట్టకేలకు టెండుల్కర్ అంటూ సచిన్ ఉద్వేగ ట్వీట్! నీ మనసు బంగారం షారుఖ్! SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL2023: రైజర్స్ జోరుకు బ్రేక్....
వరుసగా రెండు విజయాలతో జోరు పెంచిన సన్రైజర్స్ హైదరాబాద్కు సొంతగడ్డపై అడ్డుకట్ట పడింది. కొంత పోరాటపటిమ కనబర్చినా చివరకు విజయం మాత్రం దక్కలేదు. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ ‘హ్యాట్రిక్’ గెలుపుతో సత్తా చాటింది. కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ విజయంలో కీలకపాత్ర పోషించగా... ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో రైజర్స్ ఉప్పల్లో చతికిలపడింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్రైజర్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కామెరాన్ గ్రీన్ (40 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్ వర్మ (17 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (41 బంతుల్లో 48; 4 ఫోర్లు,1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (16 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. సూర్యకుమార్ విఫలం... కెప్టెన్ రోహిత్ శర్మ (18 బంతుల్లో 28; 6 ఫోర్లు) ముంబై ఇన్నింగ్స్ను ధాటిగా మొదలు పెట్టాడు. సుందర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను ఈ క్రమంలో ఐపీఎల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. నటరాజన్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్, అదే ఓవర్లో వెనుదిరిగాడు. పవర్ప్లేలో ముంబై 53 పరుగులు చేసింది. అనంతరం రైజర్స్ బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో ముంబై స్కోరు వేగం మందగించింది. జాన్సెన్ ఒకే ఓవర్లో కిషన్, సూర్యకుమార్ (7)లను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. ఈ రెండు క్యాచ్లను మార్క్రమ్ అద్భుతంగా అందుకున్నాడు. 14 ఓవర్లలో ముంబై 109 పరుగులు చేసింది. అయితే చివరి 6 ఓవర్లలో చెలరేగిన ఆ జట్టు 83 పరుగులు రాబట్టింది. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో వరుస బంతుల్లో గ్రీన్ 4, 4, 4, 6 తో చెలరేగడం విశేషం. ఈ క్రమంలో 33 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. భువీ తన చివరి 2 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చినా, ఇతర బౌలర్లు విఫలమయ్యారు. తిలక్ జోరు... సొంతగడ్డపై ప్రత్యర్థి జట్టు హైదరాబాద్పై తిలక్ వర్మ సత్తా చాటాడు. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్లో ఉన్న 24 నిమిషాల్లో ఫటాఫట్ బ్యాటింగ్ ప్రదర్శించాడు. జాన్సెన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టిన అతను... మర్కండే, భువీ బౌలింగ్లో ఒక్కో సిక్సర్ బాదాడు. భువీ బౌలింగ్లో మరో షాట్కు ప్రయత్నించి కవర్స్లో చిక్కడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. సమష్టి వైఫల్యం... ఛేదనలో రైజర్స్కు సరైన ఆరంభం లభించలేదు. గత మ్యాచ్ హీరో బ్రూక్ (9), రాహుల్ త్రిపాఠి (7)లను బెహ్రన్డార్ఫ్ తన వరుస ఓవర్లో అవుట్ చేశాడు. మరో ఎండ్లో మయాంక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించాడు. 6 ఓవర్లలో జట్టు స్కోరు 2 వికెట్లకు 42. మార్క్రమ్ (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, అభిషేక్ (1) కూడా వెంటనే అవుటయ్యాడు. రైజర్స్ గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్న దశలో చావ్లా వేసిన 14వ ఓవర్ ఆశలు రేపింది. ఈ ఓవర్లో క్లాసెన్ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. అయితే చివరి బంతికి అతను అవుట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. తర్వాతి ఓవర్లో మయాంక్ వెనుదిరిగాక జట్టు ఓటమి లాంఛనమే అయింది. అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐపీఎల్ వికెట్తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగించగానే ముంబై సంబరాల్లో మునిగిపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 28; ఇషాన్ కిషన్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 38; గ్రీన్ (నాటౌట్) 64; సూర్యకుమార్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 7; తిలక్ (సి) మయాంక్ (బి) భువనేశ్వర్ 37; డేవిడ్ (రనౌట్) 16; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–41, 2–87, 3–95, 4–151, 5–192. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–31–1, జాన్సెన్ 4–0–43–2, సుందర్ 4–0–33–0, నటరాజన్ 4–0–50–1, మర్కండే 4–0–35–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (సి) సూర్యకుమార్ (బి) బెహ్రన్డార్ఫ్ 9; మయాంక్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 48; త్రిపాఠి (సి) ఇషాన్ కిషన్ (బి) బెహ్రన్డార్ఫ్ 7; మార్క్రమ్ (సి) షోకీన్ (బి) గ్రీన్ 22; అభిషేక్ (సి) డేవిడ్ (బి) చావ్లా 1; క్లాసెన్ (సి) డేవిడ్ (బి) చావ్లా 36; సమద్ (రనౌట్) 9; జాన్సెన్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 13; సుందర్ (రనౌట్) 10; భువనేశ్వర్ (సి) రోహిత్ (బి) అర్జున్ 2; మర్కండే (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 19; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 178. వికెట్ల పతనం: 1–11, 2–25, 3–71, 4–72, 5–127, 6–132, 7–149, 8–165, 9–174, 10–178. బౌలింగ్: అర్జున్ టెండూల్కర్ 2.5–0–18–1, బెహ్రన్డార్ఫ్ 4–0–37–2, మెరిడిత్ 4–0–33–2, షోకీన్ 1–0–12–0, చావ్లా 4–0–43–2, గ్రీన్ 4–0–29–1. -
బెంగళూరు చిన్నబోయింది! పరుగుల వరద పారిన పోరులో ఓడిన ఆర్సీబీ
బెంగళూరు: పరుగుల వరద పారిన పోరు... ఏకంగా 33 సిక్సర్లు నమోదు... చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) భారీ స్కోరు సాధిస్తే మేమేం తక్కువ అన్నట్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా విరుచుకుపడింది. అయితే తుది ఫలితంలో మాత్రం సూపర్ కింగ్స్దే పైచేయి అయింది. ఒకదశలో గెలుపు ఖాయమనిపించిన ఆర్సీబీ ఓటమి బాట పట్టడంతో చిన్నస్వామి మైదానంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై 8 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించగా, అజింక్య రహానే (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్స్లు), డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మూడో వికెట్కు 61 బంతుల్లోనే 126 పరుగులు జోడించారు. సమష్టి ప్రదర్శన... సిరాజ్ తొలి ఓవర్లోనే రుతురాజ్ (3) అవుట్ కావడంతో చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. అయితే రహానే, కాన్వే భాగస్వామ్యంలో స్కోరు జోరందుకుంది. వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో పవర్ప్లేలో స్కోరు 4 ఫోర్లు, 3 సిక్స్లతో 53 పరుగులకు చేరింది. హసరంగ తన తొలి ఓవర్లో చక్కటి బంతితో రహానేను బౌల్డ్ చేయడంతో 74 పరుగుల (43 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ తర్వాత కాన్వే, దూబే మరింత ధాటిగా పరుగులు సాధించారు. వైశాక్ ఓవర్లో కాన్వే 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, సిరాజ్ ఓవర్లో దూబే ఫోర్, సిక్స్ బాదాడు. వైశాక్ తర్వాతి ఓవర్లో వీరిద్దరు 19 పరుగులు రాబట్టారు. కాన్వే 32 బంతుల్లో, దూబే 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్కు 80 పరుగులు (37 బంతుల్లో) జోడించిన వీరిద్దరు ఎనిమిది బంతుల వ్యవధిలో వెనుదిరిగినా... చివర్లో అంబటి రాయుడు (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్), మొయిన్ అలీ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 సిక్స్లు) వేగంగా ఆడి కీలక పరుగులు జోడించారు. దాంతో ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు 25వసారి 200 అంతకంటే ఎక్కువ స్కోరు చేసింది. శతక భాగస్వామ్యం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి షాక్ తగిలింది. ఆకాశ్ సింగ్ తొలి ఓవర్లోనే కోహ్లి (6) షాట్ను వికెట్లపైకి ఆడుకోగా, ఆ వెంటనే లోమ్రోర్ (0) వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్, మ్యాక్స్వెల్ అద్భుత భాగస్వామ్యం జట్టును నడిపించింది. వీరిద్దరు చెన్నై బౌలర్లందరిపై విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించారు. ‘సున్నా’ వద్ద డుప్లెసిస్ క్యాచ్ను ధోని వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆకాశ్ ఓవర్లో మ్యాక్స్వెల్ 2 సిక్స్లు బాదగా, అతని తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. తుషార్ ఓవర్లో డుప్లెసిస్ వరుస బంతుల్లో 4, 4, 6... తీక్షణ ఓవర్లో మ్యాక్సీ 2 సిక్స్లు కొట్టడంతో ఆరు ఓవర్లలోనే స్కోరు 75 పరుగులకు చేరింది. ఈ క్రమంలో డుప్లెసిస్ 23 బంతుల్లో, మ్యాక్స్వెల్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నారు. 12వ ఓవర్ వరకు వీరి ధాటి కొనసాగింది. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరిని అవుట్ చేయడంతో చెన్నైకి మళ్లీ పట్టు చిక్కింది. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్తో ఉత్కంఠ క్షణాలను దాటి మ్యాచ్ను కాపాడుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 3; కాన్వే (బి) హర్షల్ 83; రహానే (బి) హసరంగ 37; దూబే (సి) సిరాజ్ (బి) పార్నెల్ 52; రాయుడు (సి) కార్తీక్ (బి) వైశాక్ 14; అలీ (నాటౌట్) 19; జడేజా (సి) (సబ్) ప్రభుదేశాయ్ (బి) మ్యాక్స్వెల్ 10; ధోని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–16, 2–90, 3–170, 4–178, 5–198, 6–224. బౌలింగ్: సిరాజ్ 4–0–30–1, పార్నెల్ 4–0–48–1, వైశాక్ 4–0–62–1, మ్యాక్స్వెల్ 2.4–0–28–1, హసరంగ 2–0–21–1, హర్షల్ పటేల్ 3.2–0–36–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) ఆకాశ్ 6; డుప్లెసిస్ (సి) ధోని (బి) అలీ 62; లోమ్రోర్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 0; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) తీక్షణ 76; షహబాజ్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 12; కార్తీక్ (సి) తీక్షణ (బి) తుషార్ 28; ప్రభుదేశాయ్ (సి) జడేజా (బి) పతిరణ 19; పార్నెల్ (సి) దూబే (బి) తుషార్ 2; హసరంగ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–6, 2–15, 3–141, 4–159, 5–191, 6–192, 7–197, 8–218. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3–0–35–1, తుషార్ దేశ్పాండే 4–0–45–3, తీక్షణ 4–0–41–1, జడేజా 4–0–37–0, పతిరణ 4–0–42–2, మొయిన్ అలీ 1–0–13–1. -
IPL: ఐపీఎల్ కాదు.. అంతకు మించి! వారికి మాత్రం నో చెప్పలేమన్న బీసీసీఐ!
ప్రపంచంలోని టీ20 లీగ్లన్నింటిలో ఐపీఎల్ది ప్రత్యేక స్థానం. క్యాష్ రిచ్ లీగ్గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ఇతర లీగ్లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి. ఆటగాళ్లపై కనక వర్షం కురిపిస్తూ.. అభిమానులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ గత పదిహేనేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందీ ఐపీఎల్. ఎక్కడా లేని క్రేజ్ పదహారవ ఎడిషన్లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి జట్ల ఆటగాళ్ల స్టార్డమ్ పెంచడం సహా.. అసోసియేట్ దేశాల క్రికెటర్లకు కూడా కావాల్సినంత గుర్తింపు దక్కేలా చేస్తోంది. క్రికెట్ను కేవలం ఆటలా కాకుండా మతంలా భావించే కోట్లాది మంది అభిమానులున్న భారత్లో ఐపీఎల్కు దక్కుతున్న ఆదరణ మరే ఇతర దేశాల లీగ్లకు కూడా లేదు. అలాంటిది సౌదీ అరేబియా.. ఐపీఎల్ను మించేలా ధనిక లీగ్ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తామంటూ చేసిన ప్రకటన చేసిందన్న వార్త క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. సౌదీ సంచలనం? ఫార్ములా వన్ రేసులతో పాటు క్రిస్టియానో రొనాల్డో వంటి పాపులర్ స్టార్లను తమ ఫుట్బాల్ లీగ్లలో ఆడిస్తూ వార్తల్లో నిలుస్తున్న సౌదీ.. క్రికెట్పై కూడా దృష్టి సారించినట్లు ఆ వార్తా కథనాల సారాంశం. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూని మించిన లీగ్తో సంచలనం సృష్టించాలని సౌదీ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అవును.. వాళ్లకు ఆసక్తి ఉందన్న ఐసీసీ ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గ్రెగ్ బార్క్లే.. ‘‘అవును.. సౌదీ క్రికెట్పై ఆసక్తి కనబరుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. క్రికెట్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆసక్తిగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలను సంప్రదించి.. తమతో కలిసి టీ20 లీగ్లో భాగం కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలితో కూడా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు కథనాలు వచ్చాయి. వారికి మాత్రం నో చెప్పలేము ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం భారత క్రికెటర్లెవరూ ఇతర దేశాల లీగ్లలో ఆడటం లేదు. అయితే, ఫ్రాంఛైజీలు సదరు లీగ్లో పాల్గొనాలా లేదా అన్నది ఓనర్ల ఇష్టం. ఫ్రాంఛైజీ ఓనర్లను అయితే మేము ఆపలేం కదా! అది వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా, దుబాయ్ లీగ్లలో భాగమయ్యాయి. వారికి మేము నో చెప్పలేదు. ప్రపంచంలోని ఏ లీగ్లోనైనా పాల్గొనే స్వేచ్ఛ వారికి ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా భారత క్రికెటర్లను విదేశీ టీ20 లీగ్లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించడం లేదన్న విషయం తెలిసిందే. అంతసీన్ లేదు! ఒకవేళ ఆటగాళ్లెవరైనా పాల్గొనాలని భావిస్తే మాత్రం బోర్డుతో సంబంధాలన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఫ్రాంఛైజీలు మాత్రం సౌతాఫ్రికా, దుబాయ్ లీగ్లలో పెట్టుబడులు పెట్టినప్పటికీ ఐపీఎల్కు క్రేజ్ ముందు ఈ లీగ్లు పూర్తిగా తేలిపోతున్నాయి. నిజానికి టీమిండియా క్రికెటర్లు లేకుండా సౌదీ టీ20 లీగ్ ప్రవేశపెట్టినా ఆదరణ విషయంలో ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం ఉండదు. చదవండి: ఇదేమైనా టీమిండియానా? గెలిస్తే క్రెడిట్ తీసుకుని.. ఓడితే వేరే వాళ్లను నిందిస్తూ.. గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ.. -
IPL: క్యాష్ రిచ్ లీగ్.. చీర్లీడర్స్ ఆదాయమెంతో తెలుసా? ఒక్కో మ్యాచ్కు..
క్యాష్ రిచ్ లీగ్.. ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.. వేలం సందర్భంగా ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెడుతున్న ప్రతిభావంతులు మొదలు.. స్టార్ ప్లేయర్లపై వేలంలో కనక వర్షం కురవడం షరా మామూలే! ఇక పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మ్యాగ్జిమమ్ సిక్స్లు.. అద్భుత రీతిలో వికెట్లు పడ్డప్పుడు.. ఊహించని క్యాచ్లు అందుకున్నపుడు.. ఇలా ప్రతీ కీలక మూమెంట్లో ఆయా జట్లను ఉత్సాహపరుస్తూ చీర్లీడర్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు! తమదైన శైలిలో హుషారైన స్టెప్పులతో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకూ కనువిందు చేస్తూ ఉంటారు చీర్లీడర్స్. మరి ఒక్కో మ్యాచ్కు వారు అందుకునే మొత్తం, చీర్లీడర్స్కు అధిక మొత్తం చెల్లిస్తున్న ఫ్రాంఛైజీ ఏదో తదితర వివరాలు పరిశీలిద్దాం. ఒక్కో మ్యాచ్కు కనీసం ఎంతంటే డీఎన్ఏ రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్ చీర్లీడర్స్కు ఒక్కో మ్యాచ్కు సగటున 12,000 రూపాయల నుంచి 17 వేల వరకు ఫ్రాంఛైజీలు చెల్లిస్తాయట. ఇక క్రిక్ఫాక్ట్స్ నివేదిక ప్రకారం.. కోల్కతా నైట్రైడర్స్ తమ చీర్లీడర్స్కు అత్యధిక మొత్తం చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. అత్యధికంగా ఒక్కో మ్యాచ్కు రూ. 24 వేలు పారితోషకంగా కేకేఆర్ అందిస్తోందట. అత్యధికంగా చెల్లించే ఫ్రాంఛైజీ ఏదంటే ఇక చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ చీర్లీడర్స్కు మ్యాచ్కు 12 వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. కాగా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్కు పనిచేస్తున్న చీర్లీడర్స్కు ఒక్కో మ్యాచ్కు 20 వేల రూపాయల చొప్పున ముట్టజెప్తున్నారట. అదే విధంగా రాయల చాలెంజర్స్ బెంగళూరు సైతం ముంబై మాదిరే 20 వేలు చెల్లిస్తోందట. ఇలా చీర్లీడర్స్ ఒక్కో మ్యాచ్కు ఈ మేరకు నగదు అందుకోవడమే కాకుండా.. విలాసవంతమైన హోటళ్లలో బస, రుచికరమైన భోజనంతో ఇతర సదుపాయాలు కూడా పొందుతున్నారు. అంత తేలికేం కాదు ఏంటీ.. ఇదంతా వింటుంటే చీర్లీడర్స్ పనే బాగున్నట్లుంది అనుకుంటున్నారా? నిజానికి చీర్లీడర్గా ఎంపిక కావడం అంత తేలికేం కాదు. స్వతహాగా మంచి డాన్సర్లు అయిన వాళ్లు, మోడలింగ్ రంగంలో ఉన్నవాళ్లను.. అనేక ఇంటర్వ్యూల అనంతరం ఆయా ఫ్రాంఛైజీలు సెలక్ట్ చేస్తాయి. అంతేకాదు వేలాది ప్రేక్షకుల నడుమ రాత్రిపగలు మ్యాచ్లనే తేడా లేకుండా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది మరి! ప్రస్తుతం చీర్లీడర్స్గా ఎక్కువ మంది విదేశీయులే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో రెండేసి విజయాలతో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది' -
IPL 2023: చెన్నై చెలరేగగా...
సూపర్ కింగ్స్ సొంత మైదానంలో సత్తా చాటింది...ముందుగా బ్యాటింగ్లో చెలరేగి భారీ స్కోరు నమోదు చేసిన ధోని టీమ్, ఆపై ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమైంది. రుతురాజ్, కాన్వేలు చెన్నైకి భారీ స్కోరును అందిస్తే, బౌలింగ్లో మొయిన్ అలీ ఆఫ్ స్పిన్ జట్టును గెలుపు దిశగా నడిపించింది. మరో వైపు తమ తొలి మ్యాచ్ను గెలుపు జోరు మీదున్న లక్నో ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్ మేయర్స్ ఆట మినహా మిగతా రంగాల్లో విఫలం కావడంతో రాహుల్ బృందానికి ఓటమి తప్పలేదు. చెన్నై: నాలుగేళ్ల తర్వాత ప్రత్యక్షంగా మ్యాచ్ను చూసేందుకు వచ్చిన అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ అమితానందాన్ని పంచింది. గత ఓటమిని మరిచేలా చేస్తూ లీగ్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన పోరులో చెన్నై 12 పరుగుల తేడాతో లక్నోను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (31 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్లు) వరుసగా రెండో మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించగా, డెవాన్ కాన్వే (29 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. రవి బిష్ణోయ్, మార్క్వుడ్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (22 బంతుల్లో 53; 8 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొయిన్ అలీ (4/26) ప్రత్యర్థిని దెబ్బతీశాడు. శతక భాగస్వామ్యం... కేవలం 56 బంతుల్లో 110 పరుగులు...చెన్నై తొలి వికెట్ భాగస్వామ్యమిది. రుతురాజ్, కాన్వే చెలరేగుతూ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. అవేశ్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో కాన్వే మొదలుపెట్టగా, గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రుతురాజ్ మూడు సిక్సర్లతో చెలరేగాడు. వుడ్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్తో 19 పరుగులు రాబట్టిన చెన్నై పవర్ప్లే ముగిసే సరికి 79 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 25 బంతుల్లోనే రుతురాజ్ అర్ధసెంచరీ పూర్తయింది. కృనాల్ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి కాన్వే తన జోరును కొనసాగించాడు. ఎట్టకేలకు బిష్ణోయ్ తన తొలి బంతికే వికెట్ తీసి రుతురాజ్ను వెనక్కి పంపడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కాన్వే అవుట్ కాగా...మూడో స్థానంలో వచ్చిన శివమ్ దూబే (16 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో తాను ఎదుర్కొన్న వరుస నాలుగు బంతుల్లో అతను 6, 4, 6, 6తో చెలరేగిపోయాడు. అతని వికెట్ కూడా బిష్ణోయ్ ఖాతాలోకే చేరగా, అవేశ్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన మొయిన్ అలీ (19)ని కూడా బిష్ణోయ్ అవుట్ చేశాడు. స్టోక్స్ (8), జడేజా (3) విఫలం కాగా...చివర్లో అంబటి రాయుడు (14 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ధోని (12) కలిసి స్కోరును 200 పరుగులు దాటించారు. లక్నో ప్రధాన బౌలర్ మార్క్ వుడ్ తన చివరి రెండు ఓవర్లలో 4 సిక్సర్లతో సహా మొత్తం 30 పరుగులు సమర్పించుకున్నాడు. మేయర్స్ మినహా... భారీ ఛేదనలో జట్టుకు అవసరమైన శుభారంభం లక్నోకు లభించింది. 35 బంతుల్లోనే ఓపెనర్లు 79 పరుగులు జోడించారు. ఇందులో మేయర్స్ మెరుపులే ఎక్కువగా ఉండగా, కేఎల్ రాహుల్ (20) ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు. స్టోక్స్ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన మేయర్స్ చహర్ వరుస రెండు ఓవర్లలో కలిపి మొత్తం 5 ఫోర్లు బాదాడు. తుషార్ ఓవర్లోనూ 4, 6 కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అయితే అలీ తన తొలి ఓవర్లోనే మేయర్స్ను అవుట్ చేసి లక్నో పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత ఏ దశలోనూ జెయింట్స్ కోలులోకపోయింది. హుడా (2), కృనాల్ (9) విఫలం కాగా, స్టొయినిస్ (21) కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేదు. క్రీజ్లో ఉన్నంత సేపు నికోలస్ పూరన్ (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా జట్టు విజయానికి అది సరిపోలేదు. రాజ్వర్ధన్ ఓవర్లోనే వరుసగా 6, 4, 4 కొట్టిన పూరన్ జడేజా ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు. 16వ ఓవర్ చివరి బంతికి పూరన్ అవుట్ కావడంలో లక్నో విజయావకాశాలు పూర్తిగా కోల్పోయింది. స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) వుడ్ (బి) బిష్ణోయ్ 57; కాన్వే (సి) కృనాల్ (బి) వుడ్ 47; దూబే (సి) వుడ్ (బి) బిష్ణోయ్ 27; అలీ (స్టంప్డ్) పూరన్ (బి) బిష్ణోయ్ 19; స్టోక్స్ (సి) యష్ (బి) అవేశ్ 8; రాయుడు (నాటౌట్) 27; జడేజా (సి) బిష్ణోయ్ (బి) వుడ్ 3; ధోని (సి) బిష్ణోయ్ (బి) వుడ్ 12; సాన్ట్నర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–110, 2–118, 3–150, 4–166, 5–178, 6–203, 7–215. బౌలింగ్: మేయర్స్ 2–0–16–0, అవేశ్ 3–0–39–1, కృనాల్ 2–0–21–0, గౌతమ్ 1–0–20–0, వుడ్ 4–0–49–3, యష్ ఠాకూర్ 4–0–36–0, రవి బిష్ణోయ్ 4–0–28–3. లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) రుతురాజ్ (బి) అలీ 20; మేయర్స్ (సి) కాన్వే (బి) అలీ 53; హుడా (సి) స్టోక్స్ (బి) సాన్ట్నర్ 2; కృనాల్ (సి) జడేజా (బి) అలీ 9; స్టొయినిస్ (బి) అలీ 21; పూరన్ (సి) స్టోక్స్ (బి) తుషార్ 32; బదోని (సి) ధోని (బి) తుషార్ 23; గౌతమ్ (నాటౌట్) 17; వుడ్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–79, 2–82, 3–82, 4–105, 5–130, 6–156, 7–195. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–55–0, స్టోక్స్ 1–0–18–0, తుషార్ 4–0–45–2, మొయిన్ అలీ 4–0–26–4, సాన్ట్నర్ 4–0–21–1, రాజ్వర్ధన్ 2–0–24–0, జడేజా 1–0–14–0. ధోని ఫటాఫట్... మ్యాచ్ను తన భుజస్కంధాలపై మోసే భారంనుంచి చాలా కాలంగా దూరమైన ధోని కొద్ది సేపు క్రీజ్లో ఉండి అభిమానులను అలరిస్తే చాలు అన్నట్లుగా ఆడుతున్నాడు. అతని ఆట చూసేందుకు చెపాక్ మైదానానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్ను అతను నిరాశపర్చలేదు. 6, 6, అవుట్...ఆడిన మూడు బంతుల్లోనే రెండు సిక్సర్లతో స్టేడియం హోరెత్తగా, సొంత జట్టు సభ్యులు కూడా ఆ సిక్సర్లకు సంబరాలు చేసుకున్నారు. తొలి మ్యాచ్లోనూ 7 బంతుల్లో ఫోర్, సిక్స్ బాదిన అతను 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్తో ధోని ఐపీఎల్లో 5 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. లీగ్లో ఈ మైలురాయిని దాటిన ఏడో ఆటగాడిగా (కోహ్లి, ధావన్, వార్నర్, రోహిత్, రైనా, డివిలియర్స్ తర్వాత) నిలిచాడు. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2023: నమస్తే ఇండియా! తిరిగి వచ్చేస్తున్నా.. అద్భుతమైన జట్టుతో..
Steve Smith to join IPL 2023: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్-2023 సీజన్లో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్ స్వయంగా ప్రకటించాడు. ‘‘నమస్తే ఇండియా. మీతో ఓ ఆసక్తికర వార్త పంచుబోతున్నా. నేను ఐపీఎల్-2023 ఎడిషన్లో జాయిన్ అవుతున్నా. అవును.. ఇది నిజమే! ఇండియాలోని అద్భుతమైన టీమ్తో నేను జట్టుకట్టనున్నాను’’ అంటూ వీడియో విడుదల చేశాడు. కాగా స్మిత్ గతంలో క్యాష్ రిచ్ లీగ్లో ఆరు ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా ప్రస్తుతం ఉనికిలో లేని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, పుణె వారియర్స్ ఇండియా, కొచ్చి టస్కర్స్ కేరళ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చినా గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన 33 ఏళ్ల స్మిత్.. 8 మ్యాచ్లు ఆడి 152 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో మొత్తంగా 103 మ్యాచ్లు ఆడిన ఈ ఆసీస్ బ్యాటర్.. 2485 పరుగులు సాధించాడు. ఇందులో 11 అర్ధ శతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఇక గతేడాది 2 కోట్ల రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. టీమిండియాతో సిరీస్లో కెప్టెన్గా హిట్ ఈ నేపథ్యంలో కామెంటేటర్గా కొత్త అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్తో కామెంటేటర్గా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇక ఇటీవల టీమిండియాతో ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్లో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ పగ్గాలు చేపట్టి.. మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. తన కెప్టెన్సీ నైపుణ్యాలతో మూడో టెస్టులో ఆసీస్ను గెలిపించాడు. ఇక అతడి సారథ్యంలోనే టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన డికాక్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ! BCCI: భువనేశ్వర్కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! pic.twitter.com/NoU1ZAtZzF — Steve Smith (@stevesmith49) March 27, 2023 -
IPL 2023: గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్.. హ్యాండ్ ఇచ్చిన కిల్లర్ మిల్లర్
David Miller: ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఛాంపియన్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉండనున్నట్లు స్వయంగా వెల్లడించాడు. వరల్డ్ కప్ సూపర్ లీగ్ (WCSL)లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగే అత్యంత కీలకమైన రెండు వన్డే మ్యాచ్లకు అందుబాటులో ఉండేందుకు మిల్లర్తో పాటు ఐపీఎల్లో పాల్గొనే పలువురు సఫారీ స్టార్ ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఐపీఎల్-2023 ప్రారంభ తేదీనే (మార్చి 31) సౌతాఫ్రికా నెదర్లాండ్స్తో తొలి వన్డే, అనంతరం ఏప్రిల్ 2న రెండో వన్డే ఆడాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించాలంటే దక్షిణాఫ్రికా ఈ రెండు వన్డేల్లో గెలిచి తీరాలి. అందుకే క్రికెట్ సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లనంతా ఈ మ్యాచ్లకు అందుబాటులో ఉండాలని కోరింది. ఇది మ్యాండేటరీ కాకపోయినప్పటికీ.. జాతీయ జట్టు అవసరాల దృష్ట్యా సౌతాఫ్రికా క్రికెటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిల్లర్తో పాటు సఫారీ ఆటగాళ్లు ఎయిడెన్ మార్క్రమ్ (ఎస్ఆర్హెచ్), హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), మార్కో జన్సెన్ (ఎస్ఆర్హెచ్), అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి (ఢిల్లీ క్యాపిటల్స్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డికాక్ (లక్నో), రబాడ (పంజాబ్) ఐపీఎల్-2023లో వారాడే ఒకటి, రెండు మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. కాగా, గతేడాది ఐపీఎల్కు ముందు కూడా సౌతాఫ్రికా క్రికెటర్లకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అయితే అప్పుడు రబాడ, ఎంగిడి, జన్సెన్, మార్క్రమ్, డస్సెన్లు జాతీయ జట్టుకు కాకుండా ఐపీఎల్కు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి లీగ్లో ఆడారు. అప్పుడు సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడింది. ఐపీఎలా లేక జాతీయ జట్టా అన్న నిర్ణయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ఆటగాళ్లకే వదిలేయడంతో వారు అప్పట్లో ఐపీఎల్కే ఓటేశారు. -
ఐపీఎల్కు అంత సీన్ లేదు.. పాకిస్తాన్ సూపర్ లీగే తోపు..!
ఐపీఎల్ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పోలిస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ సూపర్ సక్సెస్ అంటూ నిరాధారమైన కామెంట్స్ చేశాడు. పీఎస్ఎల్ 2023 సీజన్ ముగిసిన అనంతరం పీసీబీ చీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్కు మెరుగైన డిజిటల్ రేటింగ్ ఉందని గొప్పలు పోయాడు. డిజిటల్ ప్లాట్ఫాం వేదికగా పీఎస్ఎల్ 8వ ఎడిషన్ను 150 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారని, ఐపీఎల్-2022 సీజన్ను కేవలం 130 మిలియన్ల డిజిటల్ రేటింగ్ మాత్రమే దక్కిందని నిరాధారమైన లెక్కలు చెబుతూ జబ్బలు చరుచుకున్నాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ ఎంతో గొప్పదో చెప్పడానికి ఇదొక్క విషయం చాలంటూ బడాయి ప్రదర్శించాడు. పాక్లో జరగాల్సిన 2023 ఆసియా కప్లో పాల్గొనేది లేదని భారత్ కరాఖండిగా తేల్చి చెప్పిన నేపథ్యంలో సేథీ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ సమాజం అసహనం వ్యక్తం చేస్తుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ, ఇలాంటి నిరధారమైన వ్యాఖ్యలు చేసి అంతంతమాత్రంగా ఉన్న ప్రతిష్టను మరింత దిగజార్చుకోవద్దంటూ నెటిజన్లు పీసీబీకి చురకలంటిస్తున్నారు. ఇదిలా ఉంటే, మార్చి 18న ముగిసిన పీఎస్ఎల్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ విజేతగా నిలిచింది. షాహీన్ అఫ్రిది నేతృత్వంలో ఖలందర్స్ వరుసగా రెండో సీజన్లో టైటిల్ను ఎగరేసుకుపోయింది. పీఎస్ఎల్ 2022 సీజన్లో ఎదురైన ప్రత్యర్ధి ముల్తాన్ సుల్తాన్స్నే ఖలందర్స్ మళ్లీ ఓడించి టైటిల్ను నిలబెట్టుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో సుల్తాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. రన్నరప్గా నిలిచన సుల్తాన్స్కు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్గా వ్యవహరించాడు. -
రెండు ముంబై ఇండియన్స్ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్, వుమెన్స్ ప్రీమియర్ లీగ్లలో ముంబై బేస్డ్, రిలయన్స్ ఓన్డ్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్, డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్ రెండూ ప్రపంచంలోనే మేటి జట్లు అన్న విషయంతో అందరూ ఏకీభవించాల్సిందే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఈ విషయాన్ని ఇదివరకే ప్రూవ్ చేసుకోగా.. డబ్ల్యూపీఎల్ ప్రారంభమైన కొద్ది రోజులకే ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్ ఈ విషయాన్ని రుజువు చేసింది. డబ్ల్యూపీఎల్లో ఎంఐ వుమెన్స్ టీమ్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసి టైటిల్ రేసులో ముందువరుసలో నిలిచింది. ఎంఐ మెన్స్ టీమ్ విషయానికొస్తే.. 15 ఐపీఎల్ ఎడిషన్లలో 5 సార్లు ఛాంపియన్గా, ఐదు ఛాంపియన్స్ లీగ్ ఎడిషన్లలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఈ జట్టు.. కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేనప్పటికీ, కొన్ని గడ్డు పరిస్థితుల దృష్ట్యా గత రెండు సీజన్లుగా దారుణంగా విఫలమవుతూ వస్తుంది. స్టార్ ఆటగాళ్లు అందుబాటు లేకపోవడం, జూనియర్లు ఇప్పుడిప్పుడే కుదురుకుంటుండటం వల్ల ఎంఐ టీమ్కు ఈ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు ఎలా ఉన్నా , వెంటనే సర్దుకుని తిరిగి గెలుపు ట్రాక్పై ఎక్కడం ఆ జట్టుకు ఇది కొత్తేమీ కాదు. కాబట్టి గత సీజన్ల గెలుపోటములతో పని లేకుండా, రాబోయే సీజన్లో ఎంఐ మెన్స్ టీమ్ సత్తా చాటి మరో టైటిల్ సాధిస్తుందని ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. రాబోయే సీజన్లో బుమ్రా అందుబాటులో ఉండడన్న విషయం తప్పిస్తే.. ఆ జట్టు అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్.. ఆల్రౌండర్ల కోటాలో టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, జేసన్ బెహ్రెన్డార్ఫ్, డుయాన్ జన్సెస్, పియుష్ చావ్లా లాంటి ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ పటిష్టంగా ఉంది. గాయపడిన బుమ్రా, జై రిచర్డ్సన్ స్థానాల్లో ఇద్దరు అనుభవజ్ఞులైన పేసర్లు దొరికితే ఈ విభాగంలోనూ ఆ జట్టు పటిష్టంగా మారుతుంది. ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం సోషల్మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. తొట్టతొలి ఐపీఎల్ను ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో ప్రారంభించగా.. అందుకు భిన్నంగా డబ్ల్యూపీఎల్లో ఎంఐ వుమెన్స్ టీమ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని నెటిజన్లు, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే 4 వరుస పరాజయాలతో అరంగేట్రం ఐపీఎల్ సీజన్ను ప్రారంభించిన ఎంఐ మెన్స్ టీమ్.. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ఐపీఎల్ ఛాంపియన్గా.. 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ విజేతగా నిలిచింది. ఎంఐ మెన్స్ టీమ్కు భిన్నంగా వుమెన్స్ టీమ్ ప్రస్తానం సాగుతుండటంతో వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని ఎంఐ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎంఐ వుమెన్స్ టీమ్ స్టార్లతో నిండి ఉంది కాబట్టి, ఆ జట్టే తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ ఎగురేసుకుపోతుందని కొందరు ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. -
కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే జట్టుకు చెందిన మరో ఫాస్ట్ బౌలర్, ఆసీస్ ఆటగాడు జై రిచర్డ్సన్ కూడా గాయం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరంగా ఉంటాడన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల స్థానాలను భర్తీ చేసే పనిలో నిమగ్నమైంది ఎంఐ యాజమాన్యం. ఇందుకోసం 2023 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాను జల్లెడపట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎంఐ యజమాన్యానికి అన్సోల్డ్ జాబితాలో మిగిలిపోయిన ఓ తురుపుముక్క తారసపడింది. అతని పేరు సందీప్ శర్మ. ఐపీఎల్ పవర్ ప్లేల్లో అత్యధిక వికెట్లు (92 ఇన్నింగ్స్ల్లో 53 వికెట్లు) తీసిన రికార్డు కలిగిన సందీప్ శర్మను 2023 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముంబై ఇండియన్స్ బుమ్రా స్థానంలో అనుభవజ్ఞుడైన సందీప్ శర్మను తమ జట్టులోని తెచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. 2018 నుంచి నాలుగు సీజన్ల పాటు సన్రైజర్స్ కీలక బౌలర్గా చలామణి అయిన సందీప్ను 2022 వేలంలో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆ సీజన్లో 5 మ్యాచ్లు ఆడిన సందీప్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టడంతో పంజాబ్ కింగ్స్ కూడా గడిచిన సీజన్ తర్వాత అతన్ని వేలానికి వదిలేసింది. ఐపీఎల్లో రికార్డు స్థాయిలో 114 వికెట్లు పడగొట్టిన సందీప్ను 2023 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. 2013లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన సందీప్.. తన తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్పై కేవలం 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నాటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోని సందీప్.. 2017లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో నాటి స్టార్ క్రికెటర్లు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ భరతం పట్టాడు. ఈ ముగ్గురు దిగ్గజ క్రికెటర్లను ఓ మ్యాచ్లో ఒకే బౌలర్ ఔట్ చేయడం అదే తొలిసారి. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేంటంటే.. సందీప్ శర్మ, ఐపీఎల్లో విరాట్ కోహ్లిని ఏకంగా 7 సార్లు ఔట్ చేశాడు. ఐపీఎల్లో ఏ బౌలర్ కూడా కోహ్లిని ఇన్ని పర్యాయాలు ఔట్ చేయలేదు. నెహ్రా 6, బుమ్రా 4 సార్లు కోహ్లిని పెవిలియన్కు పంపారు. ఐపీఎల్లో సందీప్ బౌలింగ్లో 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. కేవలం 55 పరుగులు మాత్రమే చేసి ఏడు సార్లు ఔటయ్యాడు. ఐపీఎల్లో ఓ బౌలర్కు వ్యతిరేకంగా కోహ్లికి ఇవి చెత్త గణాంకాలుగా రికార్డయ్యాయి. -
సేమ్ సీన్ రిపీట్.. అప్పుడు కేకేఆర్, ఇప్పుడు ముంబై ఇండియన్స్
మహిళల క్రికెట్లో తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) ఆరంభం అదిరింది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్లోనే భారీ స్కోరు నమోదైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇప్పటి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ అర్థసెంచరీతో మెరవగా.. అమెలియా కెర్, హేలీ మాథ్యూస్లు రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ దారుణ ఆటతీరును కనబరిచింది. ఇది చూసిన తర్వాత ఒక విషయం గుర్తుకురాక మానదు. అదే 2008 తొలి ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్. అప్పుడు కేకేఆర్, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మెక్కల్లమ్ 73 బంతుల్లోనే 158 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 82 పరగులకే కుప్పకూలి 140 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. అజిత్ అగార్కర్ మూడు వికెట్లు తీశాడు. సేమ్ టూ సీన్ రిపీట్ అయిందంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. -
IPL 2023: సీఎస్కేకు గుడ్న్యూస్.. బెన్ స్టోక్స్ ఏమన్నాడంటే..?
ఐపీఎల్ 2023 సీజన్ చివరి అంకం మ్యాచ్లకు అందుబాటులో ఉండడని జరుగుతున్న ప్రచారంపై చెన్నై సూపర్ కింగ్స్ ఖరీదైన ఆటగాడు, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. న్యూజిలాండ్తో రెండో టెస్ట్లో పరుగు తేడాతో ఓటమి అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, తాను ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. తన ప్రస్తుత శారీరక పరిస్థితిపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్తో తరుచూ మాట్లాడుతున్నాని, ఐపీఎల్ కోసం ఫిట్గా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తానని తెలిపాడు. అలాగే, తన మోకాలి సమస్యలపై కూడా స్టోక్స్ వివరణ ఇచ్చాడు. దీర్ఘకాలంగా వేధిస్తున్న మోకాలి సమస్యలపై పోరాటం చేస్తున్నానని.. ఫిజియోలు, డాక్టర్ల సాయంతో దానిపై పైచేయి సాధించి, పదేళ్ల కెరీర్లో వంద శాతం తన పాత్రకు న్యాయం చేశానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ తర్వాత తన దృష్టంతా యాషెస్ సిరీస్పైనేనని, ప్రతిష్టాత్మక సిరీస్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నాడు. కాగా, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే తేదీకి (మే 28) సరిగ్గా నాలుగు రోజుల తర్వాత (జూన్ 1) ఇంగ్లండ్.. ఐర్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ వెంటనే (జూన్ 16) ఇంగ్లండ్.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల యాషెస్ సిరీస్ ఆడనుంది. యాషెస్ సిరీస్కు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో ఈసీబీ స్టోక్స్ను ఐర్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉందిగా ఫోర్స్ చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే స్టోక్స్.. ఐపీఎల్లో ఆఖరి మ్యాచ్లకు డుమ్మా కొట్టి, ఐర్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడతాడని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా స్టోక్స్ వివరణ ఇవ్వడంతో సందేహాలన్నీ తొలిగిపోయాయి. మరోవైపు ఈసీబీ.. స్టోక్స్ ఐపీఎల్ 2023లో ఆడేందుకు ఎన్ఓసీ కూడా ఇచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్కు ముందు జరిగిన వేలంలో సీఎస్కే స్టోక్స్ను 16.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
ఇక్కడ ఆడాల్సిన అవసరం వాళ్లకేంటి? బీసీసీఐని చూసి బుద్ధి తెచ్చుకోండి: పాక్ మాజీ ప్లేయర్
BCCI- Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోని పొట్టి ఫార్మాట్ లీగ్లన్నింటిలోకి క్యాష్ రిచ్ లీగ్ అనడంలో సందేహం లేదు. యువ ఆటగాళ్లు ఒక్కసారి ఈ వేదికపై ప్రతిభ నిరూపించుకుంటే చాలు కోటీశ్వరుల జాబితాలో చేరిపోతారు. జాతీయ జట్టులో అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఇక వెటరన్ ప్లేయర్లు సైతం ఇక్కడ తమను తాము నిరూపించుకుంటే మరికొంత కాలం కెరీర్ పొడిగించుకోగలుగుతారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. స్టార్ క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని ఐపీఎల్ ద్వారా ఇప్పటికే ఎంతో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు కెరీర్ పరంగా, ఆర్థికంగా నిలదొక్కుకున్న దాఖలాలు కోకొల్లలు. అయితే, అంతబాగానే ఉన్నా బీసీసీఐ తమ క్రికెటర్లను మాత్రం విదేశీ టీ20 లీగ్లలో ఆడేందుకు అనుమతి ఇవ్వదన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐని సమర్థిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ బోర్డు సరైన పనిచేస్తోందని ప్రశంసించాడు. కాగా పాక్లో ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడిన అక్మల్కు.. టీమిండియా క్రికెటర్లు పీఎస్ఎల్ ఆడటానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్న ఎదురైంది. కమ్రాన్ అక్మల్ వాళ్లకేం అవసరం? ఇందుకు స్పందిస్తూ.. ‘‘భారత క్రికెటర్లు పీఎస్ఎల్లో అస్సలు ఆడకూడదు. విదేశీ లీగ్లలో తమ ప్లేయర్లను ఆడించే విషయంలో ఇండియన్ బోర్డు సరైన దిశలో పయనిస్తోంది. ఐపీఎల్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత వరుస అంతర్జాతీయ సిరీస్లు ఉంటాయి. నిజానికి ఐపీఎల్ ద్వారా ఆర్థికంగా వాళ్లు కావాల్సిన మేర పరిపుష్టం అవుతారు. పీసీబీ బీసీసీఐని చూసి నేర్చుకోవాలి అలాంటపుడు విదేశీ లీగ్లలో ఆడాల్సిన అవసరం వాళ్లకేం ఉంటుంది? నిజానికి మన బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐని చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది. ఆటగాళ్ల కెరీర్ను పొడిగించుకునేందుకు వాళ్లు పాటిస్తున్న విధానాలు గమనించాలి. అక్కడ వంద టెస్టులాడిన వాళ్లు దాదాపు 14- 15 మంది ప్లేయర్లు ఉన్నారు. కానీ ఇక్కడ ఒకరో.. ఇద్దరో ఉంటారు. ఇండియాలో వాళ్లు క్రికెట్కు, క్రికెటర్లకు విలువనిస్తారు. ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లకు భారీ మొత్తంలో చెల్లిస్తారు. నిజానికి ఐపీఎల్ ముందు బీబీఎల్(బిగ్బాష్ లీగ్) దిగదిడుపే. ప్రపంచంలో ఏ లీగ్ కూడా ఐపీఎల్కు సాటిరాదు’’ అని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ పేర్కొన్నాడు. బీసీసీఐని చూసైనా పీసీబీ బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించాడు. చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. BGT 2023: ‘టమ్ టమ్’ పాటకు టీమిండియా క్రికెటర్ స్టెప్పులు.. వీడియో వైరల్ -
కోహ్లిని చూసి సిగ్గు పడు.. ఐపీఎల్కు బుమ్రా ఇస్తున్న ప్రాధాన్యతపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ అభిమానులు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. జాతీయ జట్టును కాదని ఐపీఎల్కు ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఐపీఎల్ ఆడటం కోసం జాతీయ జట్టు ప్రయోజనాలకు తాకట్టు పెట్టడమేంటని నిలదీస్తున్నారు. ఐపీఎల్పై అంత మోజు ఉంటే, అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి, క్యాష్ రిచ్ లీగ్ మాత్రమే ఆడుకోవాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండబట్టి 8 నెలలు పూర్తవుతున్నా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు. బుమ్రాను జాతీయ జట్టుకు ఆడించే విషయంలో బీసీసీఐ కూడా డ్రామాలు ఆడుతుందని దుయ్యబడుతున్నారు. పైకి వన్డే వరల్డ్కప్ను సాకుగా చూపిస్తూ.. లోలోపల బుమ్రా ఫిట్గా ఐపీఎల్లో పాల్గొనేందుకు బీసీసీఐ పెద్దలు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీసీసీఐ ప్రమేయం లేనిదే గాయం బూచి చూపిస్తూ ఇన్నాళ్లు ఇష్టారీతిన వ్యవహరించగలడా అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్కు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని చూసి బుమ్రా సిగ్గు పడాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. BGTలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆసీస్తో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా కోహ్లి ప్రవర్తించిన తీరును ఉదాహరణగా చూపిస్తూ.. దేశానికి కోహ్లి ఇచ్చే ప్రాధాన్యత ఇది, కోహ్లిని చూసి నేర్చుకో అంటూ సలహాలిస్తున్నారు. కాగా, ఢిల్లీ టెస్ట్ మూడో రోజు ఆటలో విరాట్ కోహ్లి స్లిప్్లో ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టాండ్స్లో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన కోహ్లి వారిని వారించి, ఆర్సీబీ అని కాకుండా ఇండియా.. ఇండియా అని తమను ఎంకరేజ్ చేయాలంటూ తన జెర్సీపై ఉన్న బీసీసీఐ ఎంబ్లెంని చూపిస్తూ ఫ్యాన్స్కు సైగ చేశాడు. కోహ్లి ఇలా చెప్పాడో లేదో.. ఇండియా.. ఇండియా.. అకే కేకలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. ఇదిలా ఉంటే, వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న బుమ్రా గతేడాది జులై 1న తన చివరి టెస్ట్, జులై 14న చివరి వన్డే, సెప్టెంబర్ 25న ఆఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. నాటి నుంచి ఆ సాకు ఈ సాకు చూపిస్తూ, జట్టులోకి వస్తూ, పోతూ నేషనల్ క్రికెట్ అకాడమీకే పరిమితమయ్యాడు. -
ఐపీఎల్ మూడ్లోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా వెటరన్ వికెట్కీపర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హార్డ్ హిట్టర్ దినేశ్ కార్తీక్.. ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందే ఆ మూడ్లోకి వచ్చాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరం ఉంటున్న డీకే.. డీవై పాటిల్ టీ20 కప్-2023 సూపర్ లీగ్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆర్బీఐతో జరిగిన మ్యాచ్లో డీవై పాటిల్ గ్రూప్-బి జట్టు తరఫున బరిలోకి దిగిన డీకే.. 38 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 75 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన జట్టు 25 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన డీకే.. పూనకం వచ్చినట్లు ఊగిపోయి, ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నీ.. డీకే తదితర ఐపీఎల్ క్రికెటర్లకు బాగా ఉపయోగపడనుంది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన డీవై పాటిల్ గ్రూప్-బి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించగా.. ఛేదనలో ఆర్బీఐ టీమ్ కోటా ఓవర్లు మొత్తం ఆడి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమై 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డీవై పాటిల్ ఇన్నింగ్స్లో దినేశ్ కార్తీక్ (75 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడగా.. హార్ధిక్ తామోర్ (28), యశ్ ధుల్ (29), శశాంక్ సింగ్ (23) ఓ మోస్తరుగా రాణించారు. ఆర్బీఐ బౌలర్లలో అలీ ముర్తుజా 2, షాబాజ్ నదీమ్, అంకిత్ రాజ్పుత్, సాయన్ మొండల్ చెరో వికెట్ పడగొట్టారు. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్బీఐ.. బల్తేజ్ సింగ్ (3/33), వినీత్ సిన్హా (3/34), సాగర్ ఉదేశీ (1/24) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్బీఐ ఇన్నింగ్స్లో సుమిత్ (49), జ్యోత్ (35), రాజేశ్ బిష్ణోయ్ (33) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాగా, దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
ఉత్తమ కెప్టెన్గా రోహిత్.. కోహ్లి, బుమ్రాలకు అవార్డులు, ధోనికి మొండిచెయ్యి
తొట్ట తొలి ఐపీఎల్ వేలం (2008 ఫిబ్రవరి 20) జరిగి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ సంస్థ.. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో భాగస్వామ్యంలో ఐపీఎల్ ఇన్క్రెడిబుల్ అవార్డులను అనౌన్స్ చేసింది. మొత్తం ఆరు విభాగాల్లో విజేతలను ప్రకటించిన స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో.. ఐపీఎల్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేసింది. రోహిత్ 2013-22 మధ్యలో ముంబై ఇండియన్స్ను 5 సార్లు ఛాంపియన్గా నిలిపినందున అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో సంయుక్త ప్రకటన చేశాయి. కెప్టెన్గా రోహిత్ 143 మ్యాచ్ల్లో 56.64 విన్నింగ్ పర్సంటేజ్తో 79 సార్లు ముంబై ఇండియన్స్ను విజేతగా నిలిపాడు. ఈ విభాగంలో గౌతమ్ గంభీర్, ఎంఎస్ ధోని, లేట్ షేన్ వార్న్ నామినేట్ అయినప్పటికీ హిట్మ్యాన్నే అవార్డు వరించింది. ఉత్తమ బ్యాటర్ కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా నామినేట్ కాగా.. ఏబీడీని అవార్డు వరించింది. మిప్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్.. 2008-21 మధ్యకాలంలో 184 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీల సాయంతో 39.71 సగటున 5162 పరుగులు చేశాడు. ఏబీడీ.. 2016 సీజన్లో ఆర్సీబీ తరఫున 168.97 స్ట్రయిక్ రేట్తో 687 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఓ సీజన్లో ఉత్తమ బ్యాటింగ్ కేటగిరిలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ పోటీ పడగా.. కోహ్లి విజేతగా నిలిచాడు. కోహ్లి.. 2016 సీజన్లో ఆస్సీబీ తరఫున 152.03 స్ట్రయిక్ రేట్తో 973 పరుగులు సాధించాడు. ఐపీఎల్ మొత్తంలో ప్రభావవంతమైన క్రికెటర్ కేటగిరిలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, షేన్ వాట్సన్, రషీద్ ఖాన్ నామినేట్ కాగా.. ఈ అవార్డు ఆండ్రీ రసెల్ను వరించింది. ఉత్తమ బౌలర్ కేటగిరిలో రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్ నామినేట్ కాగా.. బుమ్రా విజేతగా నిలిచాడు. ఐపీఎల్ సీజన్లో ఉత్తమ ప్రదర్శన కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో సునీల్ నరైన్ (2012), రషీద్ ఖాన్ (2018), జోఫ్రా ఆర్చర్ (2020), యుజ్వేంద్ర చహల్ (2022) నామినేట్ కాగా.. చహల్ను ఈ అవార్డు వరించింది. -
మహిళల ఐపీఎల్ మార్చి 4 నుంచి ప్రారంభం
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్కు (డబ్ల్యూపీఎల్) ముహూర్తం ఖరారైంది. ముంబైలోని బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో మార్చి 4 నుంచి లీగ్ ప్రారంభంకానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అధికారికంగా ప్రకటించారు. 22 రోజుల పాటు సాగే డబ్ల్యూపీఎల్ మార్చి 26తో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. లీగ్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల మధ్య జరుగుతుందని తెలిపారు. అలాగే లీగ్కు సంబంధించిన వేలం టీ20 వరల్డ్కప్లో భారత్-పాక్ మ్యాచ్ అయిపోయిన మరుసటి రోజే (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగుతుందని స్పష్టం చేశాడు. కాగా, డబ్ల్యూపీఎల్లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను ఐపీఎల్ యజమాన్యాలే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆయా జట్లను సొంతం చేసుకున్న యజమాన్యాల వివరాలు.. అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు)-గుజరాత్ జెయింట్స్ ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు)- ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు)- ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు)-లక్నో సూపర్ జెయింట్స్ -
'భారత్లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశలో ఉంది'
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఇయాన్ బోథం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశకు చేరుకుందని.. ఐపీఎల్ మోజు వల్లే ఇదంతా జరుగుతుందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇయాన్ బోథం వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. మిర్రర్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఇయాన్ బోథం మాట్లాడాడు. ఇప్పుడు ఇండియాకి వెళ్లి చూడండి.. అక్కడ ఎవరు టెస్టు క్రికెట్ చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇదంతా ఐపీఎల్ వల్లే. ఐపీఎల్ ద్వారా బోర్డుకు కోట్ల ఆదాయం వస్తుంది. ఆ మోజులో పడి అక్కడి జనాలు టెస్టు క్రికెట్ను చూడడం మానేశారు. ఇది ఎక్కడివరకు వెళ్తుందో తెలియదు. అయితే టెస్టు క్రికెట్ మొదలై ఇప్పటికే వందేళ్లు పూర్తయింది. టెస్టు క్రికెట్ ఎక్కడికి వెళ్లదు. ఎన్ని ఫార్మాట్లు వచ్చిన సంప్రదాయ క్రికెట్కు ఎలాంటి ఢోకా లేదు. ఒకవేళ టెస్టు క్రికెట్ చచ్చిపోయే పరిస్థితి వస్తే మనం క్రికెట్నే కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇదంతా మీనింగ్లెస్గా కనిపిస్తున్నా.. ప్రతీ ఆటగాడు ఒక సందర్భంలో టెస్టు మ్యాచ్ తప్పనిసరిగా ఆడాల్సిందే. ఇక యాషెస్ టూర్ గురించి మాట్లాడుకుంటే.. ఈసారి ఇంగ్లండ్ మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. బజ్బాల్ త్రీ లయన్స్(ఇంగ్లండ్)కు చాలా ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించడం మాములు విషయం కాదు. పాక్ గడ్డపై ఈ ఫీట్ను అందుకోవడం ఇంగ్లండ్ క్రికెట్కు మంచి తరుణం అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: మాయ చేసే మెస్సీనే బోల్తా కొట్టించాడు.. వాళ్లిద్దరు నిజంగా కలిశారా..? -
ఐపీఎల్లో నిరాశపరిచినా.. సౌతాఫ్రికా లీగ్లో మాత్రం దుమ్మురేపుతున్న సన్రైజర్స్
Sunrisers Eastern Cape: గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకుంటూ, ఫ్యాన్స్ తలెత్తుకోలేకుండా చేసిన సన్రైజర్స్ ఫ్రాంచైజీ.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో మాత్రం అబ్బురపడే ప్రదర్శన కనబరుస్తూ, వరుస విజయాలతో అదరగొడుతుంది. సీజన్ను వరుస పరాజయాలతో ప్రారంభించినా, ఆతర్వాత హ్రాటిక్ విజయాలు, మధ్యలో ఓ ఓటమి, తాజాగా (జనవరి 22) మరో భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (7 మ్యాచ్ల్లో 4 విజయాలతో 17 పాయింట్లు) ఎగబాకింది. డర్బన్ సూపర్ జెయింట్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్.. ఓపెనర్లు ఆడమ్ రాస్సింగ్టన్ (30 బంతుల్లో 72; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), జోర్డాన్ హెర్మన్ (44 బంతుల్లో 59; 9 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర అర్ధశతకాలతో, కెప్టెన్ మార్క్రమ్ (34 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ట్రిస్టన్ స్టబ్స్ (13 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ టీమ్.. రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్ (4-0-20-6) స్పిన్ మాయాజాలం ధాటికి విలవిలలాడిపోయి 86 పరుగులకే కుప్పకూలింది. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్లో కైల్ మేయర్స్ (11), వియాన్ ముల్దర్ (29), కేశవ్ మహారాజ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వ్ ఆరేయగా.. జెజె స్మట్స్, మార్క్రమ్, జన్సెన్, మాసన్ క్రేన్ తలో వికెట్ పడగొట్టారు. మినీ ఐపీఎల్గా పిలువబడే సౌతాఫ్రికా లీగ్ తొలి సీజన్లో సన్రైజర్స్ అద్భుత ప్రదర్శన పట్ల సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే ఎస్ఏ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
రాటుదేలుతున్న సిరాజ్.. బుమ్రాను మరిపిస్తూ, టీమిండియా గర్వపడేలా..!
Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ స్పీడ్స్టర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో టీమిండియా ప్రధాన బౌలర్గా మారిపోయాడనడం అతిశయోక్తి కాదు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా అతని ప్రదర్శనను ఓసారి గమనిస్తే ఈ విషయం ఇట్టే స్పష్టమవుతుంది. 2017లో అతడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి 2021 ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ వరకు సిరాజ్పై పలు అపవాదులు ఉండేవి. పరుగులు ధారాళంగా సమర్పించుకుంటాడు, వికెట్లు పడగొట్టలేడు, పవర్ ప్లేలో పూర్తిగా చేతులెత్తేస్తాడు, లైన్ అండ్ లెంగ్త్ మెయింటెయిన్ చేయడు.. ఇలా తనలోని లోపాలన్నిటినీ ఫ్యాన్స్తో పాటు విశ్లేషకులు సైతం వేలెత్తి చూపేవారు. దీనికి తోడు నాటి జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మెహర్భానిపై జట్టులో నెట్టుకొస్తున్నాడు అన్న పుకార్లు ఉండేవి. అయితే గత ఏడాదిన్నర కాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సిరాజ్.. తనలోని లోపాలను అధిగమించి, టీమిండియా ప్రధాన బౌలర్గా ఎదిగాడు. తనకు మద్దతుగా నిలిచిన కోహ్లిని కాలర్ ఎగరేసుకునేలా చేయడంతో పాటు యావత్ భారతావని గర్వపడేలా రాటుదేలాడు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా లేని లోటును సైతం పూడుస్తూ, జనాలు పేసు గుర్రాన్ని (బుమ్రా) మరిచిపోయేలా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. నిన్న తన సొంత మైదానమైన ఉప్పల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ నుంచి.. అంతకుముందు అతనాడిన 10 మ్యాచ్లపై ఓ లుక్కేస్తే సిరాజ్ ఇటీవలి కాలంలో ఎంతలా రాటుదేలాడో అర్ధమవుతుంది. కివీస్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్న సిరాజ్.. తన కోటా ఓవర్లు మొత్తం పూరిచేసి 4 కీలక వికెట్లు పడగొట్టి, టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతకుమందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో తొలి వన్డేలో 2/30, రెండో వన్డేలో 3/30, మూడో వన్డేలో 4/32.. ఇలా మ్యాచ్ మ్యాచ్కు తనలోని టాలెంట్ను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అంతకుమందు బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి టెస్ట్లో 4, రెండో టెస్ట్లో 2 వికెట్లు.. అదే జట్టుతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో 3/32, రెండో మ్యాచ్లో 2/73, మూడో మ్యాచ్లో 1/27 గణాంకాలతో ఈ పర్యటన మొత్తంలో 12 వికెట్లు నేలకూల్చాడు. బంగ్లా పర్యటనకు ముందు జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్.. రెండో టీ20లో 2/24, మూడో టీ20లో 4/17 గణాంకాలు నమోదు చేసి పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్న ఈ హైదరాబాదీ పేసర్.. టీమిండియా తరఫున 15 టెస్ట్ల్లో 46 వికెట్లు, 20 వన్డేల్లో 37 వికెట్లు, 8 టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. సీనియర్ల గైర్హాజరీలో భారత పేస్ అటాక్ను అద్భుతంగా లీడ్ చేస్తున్న సిరాజ్ మున్ముందు మరింత రాణించాలని ఆశిద్దాం. -
నాశనం చేయకండి: సన్రైజర్స్పై మాజీ ప్లేయర్ ఘాటు వ్యాఖ్యలు
IPL- Sunrisers Hyderabad: ‘‘నేను, రషీద్ 2017లో జట్టులోకి వచ్చినపుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాతి మూడేళ్లు టీమ్ కాంబినేషన్లు చక్కగా కుదిరాయి. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. కానీ గత రెండేళ్ల కాలంలో భారీ మార్పులు. అందుకు గల కారణాలు ఏమిటో, కారకులు ఎవరో నాకు తెలియదు గానీ.. ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆటగాళ్లు ఆ ఫ్రాంఛైజీకి ఆడేందుకు విముఖత చూపడం ఆరంభించారు’’ అని అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ.. సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. నబీతో పాటు అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఐపీఎల్-2016 విజేత సన్రైజర్స్ తరఫున గతంలో ఆడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఇద్దరికీ ఎస్ఆర్హెచ్తో బంధం లేదు. తరచూ మార్పులు కాగా 2016లో జట్టుకు ట్రోఫీ అందించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ను 2021లో కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్రైజర్స్ తర్వాత అతడిని రిలీజ్ చేసింది. అదే విధంగా.. జట్టులో కీలక సభ్యుడైన రషీద్ ఖాన్ను ఐపీఎల్-2022 వేలానికి ముందు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రషీద్ను సొంతం చేసుకున్న కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్గా నియమించుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ బౌలర్... ట్రోఫీ గెలవడంలో సహాయపడ్డాడు. మరోవైపు.. సన్రైజర్స్ మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ -2023 మినీ వేలానికి ముందు తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను కూడా ఎస్ఆర్హెచ్ వదులుకున్న విషయం తెలిసిందే. దీంతో తరచూ జట్టులో మార్పులు చేస్తున్న సన్రైజర్స్ తీరుపై విశ్లేషకులు పెదవి విరిచారు. నాశనం చేయకండి అంటూ ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ యారీతో మాట్లాడిన ఆ జట్టు మాజీ ప్లేయర్ మహ్మద్ నబీ.. ఇకనైనా తీరు మార్చుకోవాలని ఎస్ఆర్హెచ్కు హితవు పలికాడు. ‘‘జట్టును నాశనం చేయడానికి బదులు.. పటిష్టం చేసేందుకు ప్రయత్నించండి. పేరున్న ఫ్రాంఛైజీగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని అదే. తరచూ మార్పులు చేయకుండా మెరుగైన జట్టు నిర్మాణానికి పాటు పడాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక రషీద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఐదేళ్ల పాటు వాళ్ల జట్టుకు బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న రషీద్ ఖాన్.. వాళ్లను వదిలివెళ్లేలా చేసుకున్నారు. రషీద్ ఒక్కడే కాదు ఎంతో మంది టాప్ ప్లేయర్ల పట్ల కూడా ఇదే వైఖరి. సన్రైజర్స్ ఇలా చేయకుండా ఉండాల్సింది. అసలు వాళ్లకేం కావాలో వాళ్లకైనా అర్థమవుతోందా?’’ అని ఈ ఆల్రౌండర్.. ఎస్ఆర్హెచ్ విధానాల పట్ల విమర్శలు సంధించాడు. కాగా 2021లో మహ్మద్ నబీకి సన్రైజర్స్తో బంధం తెగిపోయింది. ఇక గతేడాది 14 మ్యాచ్లకు గానూ 6 గెలిచిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం! Aus Vs SA 2nd Test: ఎదురులేని ఆసీస్.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక.. -
ఐపీఎల్-2023 మినీ వేలానికి కౌంట్డౌన్ షురూ.. బరిలో 405 మంది ఆటగాళ్లు
IPL 2023 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మినీ వేలం రేపు (డిసెంబర్ 23) మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్గటీ ఐలాండ్లో గల గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభంకానుంది. ఈ వేలం కోసం స్వదేశ, విదేశాలకు చెందిన మొత్తం 991 ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా 405 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. లీగ్లోని 10 ఫ్రాంచైజీలు ఇదివరకే 163 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకోగా.. అవకాశం ఉన్న 87 స్థానాల కోసం వేలం జరుగనుంది. ఇందులో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడినవి కాగా.. మిగతా 57 స్థానాల కోసం స్వదేశీ ప్లేయర్స్ పోటీ పడతారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను 5 సెట్లుగా విభజించారు. తొలి సెట్లో బ్యాటర్లు, రెండో సెట్లో ఆల్రౌండర్లు, మూడో సెట్లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్లో స్పిన్నర్లను ఉన్నారు. వేలం ప్రక్రియ మొత్తం సెట్ల వారీగా జరుగనుంది. రెండో సెట్లో ఉన్న ఆల్రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఈ సెట్లో ఉన్న విదేశీ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, సామ్ కర్రన్, షకీబ్ అల్ హసన్, జేసన్ హోల్డర్, సికిందర్ రజా, ఓడియన్ స్మిత్ భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. తొలి సెట్లో ఉన్న బ్యాటర్లలో రిలీ రోస్సో, హ్యారీ బ్రూక్ జాక్పాట్ కొట్టే ఛాన్స్ ఉండగా.. నికోలస్ పూరన్, ఆదిల్ రషీద్, దేశీయ సంచలనం, తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ కూడా భారీ ధర పలకవచ్చు. పర్స్ వాల్యూ విషయానికొస్తే.. లీగ్లో పాల్గొనే 10 జట్లు ఇదివరకే రీటైన్ చేసుకున్న ఆటగాళ్లపై రూ.743.5 కోట్లు ఖర్చు చేయగా.. ఫ్రాంచైజీల వద్ద ఇంకా రూ.206.5 కోట్ల నిధులు ఉన్నాయి. వేలంలో పాల్గొనే ఫ్రాంఛైజీల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వద్ద అత్యధికంగా 42.25 కోట్లు ఉండగా, కోల్కతా నైట్రైడర్స్ వద్ద అత్యల్పంగా 7.05 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఆయా ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్ బ్యాలెన్స్ వివరాలు.. సన్రైజర్స్ హైదరాబాద్: రూ. 42.25 కోట్లు పంజాబ్ కింగ్స్: రూ. 32.2 కోట్లు లక్నో సూపర్జెయింట్స్: రూ. 23.35 కోట్లు ముంబై ఇండియన్స్: రూ. 20.55 కోట్లు చెన్నై సూపర్కింగ్స్: రూ. 20.45 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్: రూ. 19.25 కోట్లు రాజస్తాన్ రాయల్స్: రూ. 13.2 కోట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రూ. 8.75 కోట్లు కోల్కతా నైట్రైడర్స్: రూ. 7.05 కోట్లు బేస్ ప్రైజ్ ఆధారంగా విభజింపబడ్డ ప్రముఖ ప్లేయర్ల వివరాలు.. రూ.2 కోట్ల లిస్ట్లో ప్లేయర్స్: కౌల్టర్ నైల్, కామెరున్ గ్రీన్, ట్రెవిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమాల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్న్, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వెండెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్. రూ.1.5 కోట్ల లిస్ట్లోని ప్లేయర్స్: సీన్ అబాట్, రైలీ మెరెడిత్, జై రిచర్డసన్, ఆడమ్ జంపా, షకీబుల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జేసన్ రాయ్, షెర్ఫానె రూథర్ఫర్డ్ రూ.కోటి లిస్ట్లోని ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్, మోయిసిస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షంసీ, కుశాల్ పెరీరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్వాల్, షెయ్ హోప్, అకీల్ హొస్సేన్, డేవిడ్ వీస్ ఆయా ప్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరోన్. రన్నరప్ రాజస్తాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: ఆండ్రూ టై, అంకిత్ రాజ్పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తఫిజర్ రెహ్మన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్. కోల్కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తైడే, అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్మర్ సిరాజ్, జోష్ హేజిల్వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్. సన్రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్ హక్ ఫరూఖీ. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్ధర్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. -
వుమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల కనీస ధర ఎంతంటే?
ఐపీఎల్ మరో లెవల్కు చేరనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ మెగా లీగ్ మహిళల కోసం కూడా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐదు టీమ్స్తో తొలి మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ ఐదు ఫ్రాంఛైజీలను త్వరలోనే బీసీసీఐ వేలం నిర్వహించనుంది. దీనికోసం కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించారు. 2008లో తొలి ఐపీఎల్ జరిగినప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచిన ముంబై ఇండియన్స్ ధర రూ. 446 కోట్లను ఆధారంగా చేసుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు మార్కెట్లో ఉన్న డిమాండ్, ఆసక్తిపై కాస్త అధ్యయనం చేసిన బీసీసీఐ కనీస ధరను నిర్ణయించినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ఒక్కో ఫ్రాంఛైజీ రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది. టెండర్ డాక్యుమెంట్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే కచ్చితంగా ఓ ఫ్రాంఛైజీకి ఎంతొస్తుందన్నదానిపై ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. వేలంలో బిడ్ గెలిచిన ఫ్రాంఛైజీ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలను అమ్మడం ద్వారా బీసీసీఐ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకూ రాబట్టాలని చూస్తోంది. -
IPL 2023: వచ్చే నెల 23న ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం కార్యక్రమానికి కేరళలోని కొచ్చి నగరం వేదిక కానుంది. డిసెంబర్ 23న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈసారి మెగా వేలం కాకుండా మినీ వేలం ఉంటుందని, ఈనెల 15వ తేదీలోపు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను కోరినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంతోపాటు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావించింది. చివరకు కొచ్చి నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. -
MS Dhoni: తమిళ, తెలుగు ప్రేక్షకుల కోసం ధోని! లేడీ సూపర్స్టార్ నయన్తోనే..
MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తమిళనాడుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు సారథిగా వ్యవహరిస్తున్న ధోనిని తలా అంటూ అక్కున చేర్చుకున్నారు తమిళ ప్రజలు. అందుకు ప్రతిఫలంగా క్రికెట్తో పాటు తమిళ ప్రేక్షకులకు సినిమాలతోనూ వినోదం అందించేందుకు సిద్ధమయ్యాడట ఈ జార్ఖండ్ డైనమైట్. తమిళం, తెలుగుతో పాటు.. ఇప్పటికే పలు వ్యాపారాల్లో రాణిస్తున్న ధోని.. తాజాగా ‘ధోని ఎంటరైన్మెంట్’ పేరిట సినీ నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు సమాచారం. ఈ కంపెనీ ద్వారా తమిళంలో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలోనూ చిత్రాలు ప్రొడ్యూస్ చేసేందుకు ధోని సిద్ధమయ్యాడని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లెట్స్సినిమా సహా క్రీడా విశేషాలు పంచుకునే ముఫద్దల్ వోహ్రా అనే ట్విటర్ యూజర్ ట్వీట్ల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సౌత్ ఆడియన్స్ లక్ష్యంగా.. కాగా ఇప్పటికే ధోని, ఆయన భార్య సాక్షి ఓ ప్రొడక్షన్ హౌజ్ స్థాపించిన విషయం తెలిసిందే. రోర్ ఆఫ్ ది లయన్(సీఎస్కేపై నిషేధం- రీఎంట్రీ నేపథ్యంలో), బ్లేజ్ టూ గ్లోరీ(2011 వరల్డ్కప్ నేపథ్యంగా డాక్యుమెంటరీ) తదితర చిన్న సినిమాలు నిర్మించారు. ఇప్పుడు సౌత్ సినిమాపై దృష్టి సారించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అంతేకాదు ధోని ఎంటరైన్మెంట్ వ్యవహారాలు చూసుకునేందుకు.. సూపర్స్టార్ రజనీకాంత్కు సన్నిహితుడైన ఓ వ్యక్తిని ధోని నియమించినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇక ఈ ప్రొడక్షన్ కంపెనీలో మొదటగా తీసే సినిమాలో లేడీ సూపర్స్టార్ నయనతార కీలక పాత్ర పోషించనున్నారంటూ గతంలోనూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే, వీటిలో ఎంతవరకు నిజం ఉందన్న విషయం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్కు సంబంధించిన స్పెషల్ వీడియో రూపకల్పనలో నయన్ భర్త విఘ్నేష్ శివన్.. ధోనితో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. కాగా నయన్- విఘ్నేష్ దంపతులు తాము కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. #LetsCinema EXCLUSIVE: Dhoni is launching his film production company in south ‘Dhoni Entertainment’ to produce films in Tamil, Telugu and Malayalam. pic.twitter.com/zgTxzdSynT — LetsCinema (@letscinema) October 9, 2022 MS Dhoni launching his film production company named 'Dhoni Entertainment' to produce films in Tamil, Telugu and Malayalam. — Mufaddal Vohra (@mufaddal_vohra) October 9, 2022 -
రైనా రిటైర్మెంట్పై స్పందించిన చెన్నై యాజమాన్యం
Suresh Raina Retirement: మిస్టర్ ఐపీఎల్, చిన్న తలా సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటనపై అతని తాజా మాజీ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్పందించింది. చరిత్ర మరువని విజయాలు సాధించినప్పుడు తమతో ఉన్నవాడు, ఆ విజయాలు సాధించేందుకు తోడ్పడిన వాడు చిన్న తలా..! థ్యాంక్యూ మిస్టర్ ఐపీఎల్ అంటూ రైనా ఫోటోను పోస్ట్ చేసి ట్విటర్లో భావోద్వేగ సందేశం పంపింది. సీఎస్కే సందేశంలో రైనాపై వారికున్న ఆప్యాయత స్పష్టంగా కనబడింది. ఆఖరి సీజన్లో వారు రైనాను కాదనుకున్నప్పటికీ అతనిపై ఇంత గౌరవం ఉండటాన్ని రైనా అభిమానులు మెచ్చుకుంటున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఎల్లో ఆర్మీతో, ఐపీఎల్తో బంధాన్ని తెంచుకోవడాన్ని చిన్న తలా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. The one who was there when glory was etched in history! The one who made it happen! Thank You for everything, Chinna Thala! 💛#Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/9Olro0z0Bn — Chennai Super Kings (@ChennaiIPL) September 6, 2022 కాగా, రైనాకు అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవమున్నా, ఐపీఎల్తోనే గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. రైనాకు చెన్నై జట్టుతో ఏర్పడిన విడదీయలేని బంధం అతన్ని మిస్టర్ ఐపీఎల్గా నిలబెట్టింది. 2020, 2022 సీజన్లు మినహాయించి రైనా ప్రతి ఐపీఎల్లో ఆడాడు. 2016, 17 సీజన్లలో సీఎస్కేపై నిషేధం ఉండటంతో గుజరాత్ లయన్స్కు ప్రాతినిధ్యం వహించిన అతను.. 11 సీజన్ల పాటు ఎల్లో ఆర్మీలో కొనసాగాడు. చెన్నై టైటిల్ గెలిచిన నాలుగు సార్లూ రైనా జట్టుతోనే ఉన్నాడు. ఐపీఎల్లో మొత్తం 205 మ్యాచ్లు ఆడిన రైనా సెంచరీ, 39 అర్ధసెంచరీల సాయంతో 5528 పరుగులు సాధించాడు. వయసు పైబడటంతో పాటు ఫామ్లో లేకపోవడంతో సీఎస్కే యాజమాన్యం రైనాను 2022 సీజన్కు ముందు రీటైన్ చేసుకోలేదు. ఇదే కారణం చేత ఆ తర్వాత జరిగిన మెగా వేలంలోనే కొనుగోలు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్ వీడాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ (సెప్టెంబర్ 6) భారత క్రికెట్తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. రైనా తీసుకున్న నిర్ణయంతో అతను ఐపీఎల్తో పాటు బీసీసీఐతో అనుబంధం ఉన్న ఏ ఇతర టోర్నీల్లోనూ పాల్గొన్నలేడు. వాస్తవానికి రైనా రెండేళ్ల క్రితమే ధోనీతో కలిసి ఒకే సారి (ఆగస్ట్ 15) అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. -
చెన్నై సూపర్ కింగ్స్కు సంబంధించి బిగ్ అప్డేట్.. కెప్టెన్ ఎవరంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్లో జట్టు కెప్టెన్ ఎవరనే విషయమై ఫ్రాంచైజీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. వచ్చే సీజన్లో కెప్టెన్గా ఎంఎస్ ధోనినే కొనసాగుతాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఆదివారం మరోసారి స్పష్టం చేశాడు. సీఎస్కేను నాలుగు సార్లు ఛాంపియన్గా నిలిపిన ధోనిపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతని సారధ్యంలోనే సీఎస్కే మరోసారి బరిలో నిలువనుందని కాశీ విశ్వనాథ్ వెల్లడించాడు. కాగా, 2022 ఐపీఎల్ సీజన్కు ముందు సీఎస్కే తొలిసారి కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. ధోని ఇష్టపూర్వకంగా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్సీ వరించింది. అయితే జడ్డూ కెప్టెన్సీ భారాన్ని హ్యాండిల్ చేయలేకపోవడంతో యాజమాన్యం తిరిగి ధోనినే జట్టు భారం మోయవలసిందిగా కోరింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధోని మరోసారి సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అప్పటికే గత సీజన్లో సీఎస్కేకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి మ్యాచ్ల్లో ధోని కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ.. సీఎస్కే తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, కెప్టెన్గా సీఎస్కే యాజమాన్యం ధోనినే ప్రకటించినప్పటికీ.. వయసు పైబడిన రిత్యా అతను లీగ్కు అందుబాటులో ఉంటాడో లేదో అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. గత రెండు సీజన్లుగా ఈ విషయమై ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంది. ధోనికి ఇష్టం లేకపోయిన బలవంతంగా అతనిపై కెప్టెన్సీ భారాన్ని మోపుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ధోని ఐదోసారి జట్టును ఛాంపియన్గా నిలిపి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్పుల్ కెప్టెన్గా కెరీర్ ముగించాలని భావిస్తున్నాడని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయమై ధోని క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: పాక్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. యువ పేసర్కు అనారోగ్యం -
IPL: కెప్టెన్పై వేటు.. స్పందించిన పంజాబ్ ఫ్రాంఛైజీ! ఇంతకీ ఏం చెప్పినట్టు?
తమ జట్టు కెప్టెన్సీ అంశంపై వ్యాప్తి చెందుతున్న వదంతులపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ స్పందించింది. ఈ విషయం గురించి కొన్ని స్పోర్ట్స్ వెబ్సైట్లలో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కెప్టెన్సీ విషయానికి సంబంధించి తమ ఫ్రాంఛైజీకి చెందిన ఏ ఒక్క అధికారి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ట్వీట్ చేసింది. కెప్టెన్గా.. బ్యాటర్గా విఫలం కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ను వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో కెప్టెన్గా మయాంక్ అగర్వాల్ను నియమించింది యాజమాన్యం. మయాంక్ సారథ్యంలో పంజాబ్ పద్నాలుగింట 7 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది. జట్టు పరిస్థితి ఇలా ఉంటే.. బ్యాటర్గానూ మయాంక్ అగర్వాల్ విఫలమయ్యాడు. ఆడిన 12 ఇన్నింగ్స్లో అతడు చేసిన పరుగులు మొత్తం 196. అత్యధిక స్కోరు 52. ఇదిలా ఉంటే.. శుభ్మన్ గిల్, పృథ్వీ షా వంటి యువ ఆటగాళ్లు సంప్రదాయ క్రికెట్లోనూ రాణిస్తున్న తరుణంలో టీమిండియాలోనూ మయాంక్కు చోటు కష్టంగానే మారింది. మా వాళ్లు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు! ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి మయాంక్ అగర్వాల్ను తొలగించబోతున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే విధంగా కోచింగ్ విషయంలో ట్రెవర్ బెయిలిస్తోనూ ఫ్రాంఛైజీ సంప్రదింపులు జరుపుతోందంటూ రూమర్లు వ్యాపించాయి. ఈ విషయంపై బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన పంజాబ్ యాజమాన్యం.. సదరు వార్తలు రాసిన సైట్ల తీరును విమర్శించింది. ‘‘గత కొన్ని రోజులుగా స్పోర్ట్స్ న్యూస్ వెబ్సైట్లలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్సీ విషయం గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం గురించి మా అధికారి ఎవరూ కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నాం’’ అని పేర్కొంది. అయితే, ఆ వార్తల్ని మాత్రం ఖండిస్తున్నట్లు పేర్కొనకపోవడంతో మయాంక్ అగర్వాల్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కెప్టెన్సీ ఉంటుందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. కాగా పంజాబ్ ఇంతవరకు ఒక్కసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. ఇక పంజాబ్ను వీడిన రాహుల్.. కొత్త లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఆరంభ సీజన్లోనే లక్నోను ప్లే ఆఫ్స్కు చేర్చి సత్తా చాటాడు. చదవండి: Mayank Agarwal: శతకంతో చెలరేగినా టీమిండియాలోకి రావడం కష్టమే! KL Rahul Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్ ఏంటంటే! News reports published by a certain sports News website pertaining to captaincy of the Punjab Kings franchise has been making the rounds in the last few days. We would like to state that no official of the team has issued any statement on the same. — Punjab Kings (@PunjabKingsIPL) August 24, 2022 -
కొత్త కోచ్గా రంజీ దిగ్గజం.. కేకేఆర్ దశ మారనుందా!
రెండుసార్లు ఐపీఎల్ విజేత అయిన కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) తమ కొత్త కోచ్గా దిగ్గజ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ను ఎంపిక చేసింది. ఈ మేరకు నైట్రైడర్స్ యాజమాన్యం బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటన చేసింది. కేకేఆర్ రెగ్యులర్ కోచ్గా ఉన్న బ్రెండన్ మెక్కల్లమ్.. ఈ ఏడాది ఇంగ్లండ్ హెడ్ కోచ్గా వెళ్లిపోవడంతో అప్పటినుంచి నిఖార్సైన కోచ్ గురించి వెతుకులాటలో ఉంది కేకేఆర్. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోపీలో మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ విజేతగా అవతరించడంలో కోచ్గా చంద్రకాంత్ పండిట్ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు రంజీ క్రికెట్లో అత్యంత సూపర్ సక్సెస్ కోచ్గా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుత తరుణంలో హెడ్కోచ్గా చంద్రకాంత్ పండిట్ సరైనవాడని కేకేఆర్ అభిప్రాయపడుతోంది. అందుకే చంద్రకాంత్ పండిట్ను ఏరికోరి కేకేఆర్ కోచ్గా తీసుకొచ్చింది. ఇదే విషయమై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. '' దేశవాలీ దిగ్గజ కోచ్ చంద్రకాంత్ కేకేఆర్ ఫ్యామిలీలోకి రావడం మమ్మల్ని ఉత్సాహపరిచింది. కోచ్ పాత్రలో మా జట్టును విజయవంతంగా నడిపించాలని.. జర్నీ సాఫీగా సాగిపోవాలని కోరకుంటున్నా. ఆట పట్ల అతనికున్న అంకితభావం, నిబద్ధత.. మరెవరికి లేదు. అందుకే దేశవాలి క్రికెట్లో దిగ్గజ కోచ్గా అవతరించాడు. మా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు విలువైన సలహాలు ఇస్తూ ఐపీఎల్ టైటిల్ అందించాలని కోరుతున్నా అంటూ తెలిపాడు. ఇక చంద్రకాంత్ పండిట్ టీమిండియా తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున చంద్రకాంత్ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్ కాలేకపోయిన చంద్రకాంత్ పండిట్ రంజీ కోచ్గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చంద్రకాంత్ రంజీ కోచ్గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మధ్యప్రదేశ్ను తొలిసారి రంజీ విజేతగా నిలిపి చంద్రకాంత్ దిగ్గజ కోచ్గా అవతరించాడు. ఇక గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో చాంపియన్గా నిలిచిన కేకేఆర్.. మరోసారి కప్ కొట్టడంలో విఫలమైంది. అయితే 2021లో ఇయాన్ మోర్గాన్ సారధ్యంలో ఫైనల్ చేరినప్పటికి.. సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్ చేరడంలో విఫలమైన కేకేఆర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 🚨 We have a new HEAD COACH! Welcome to the Knight Riders Family, Chandrakant Pandit 💜👏🏻 pic.twitter.com/Eofkz1zk6a — KolkataKnightRiders (@KKRiders) August 17, 2022 చదవండి: Ranji Trophy 2022 Final: కెప్టెన్గా సాధించలేనిది కోచ్ పాత్రలో.. అందుకే ఆ కన్నీళ్లు -
మహిళల ఐపీఎల్కు రంగం సిద్ధం
ముంబై: మహిళల క్రికెట్ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక అడుగు ముందుకు వేసింది. 2023లో సీజన్లో తొలిసారి మహిళల ఐపీఎల్ను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. గతంలోనూ పలుమార్లు మహిళల లీగ్ నిర్వహణకు సంబంధించి బోర్డు పెద్దలు ఎన్నో వ్యాఖ్యలు, ప్రకటనలు చేసినా వాస్తవానికి వచ్చేసరికి అవి అమల్లోకి రాలేదు. ఈసారి మాత్రం ఐపీఎల్ కోసం ‘ప్రత్యేక విండో’ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మహిళల దేశవాళీ మ్యాచ్ల షెడ్యూల్లో బోర్డు మార్పులు చేసింది. సాధారణంగా భారత్ మహిళల దేశవాళీ మ్యాచ్ల షెడ్యూల్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. అయితే తాజాగా ప్రకటించిన షెడ్యూల్లో దీనికి ఒక నెల రోజులు ముందుకు జరిపారు. 2022–23 సీజన్ అక్టోబర్ 11న ప్రారంభమై ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే మార్చి నెలలో పూర్తి స్థాయి ఐపీఎల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. టి20 చాలెంజ్ టోర్నీ తర్వాత... సాధారణ దేశవాళీ మ్యాచ్లకు భిన్నంగా లీగ్ రూపంలో 2018 నుంచి బీసీసీఐ ‘టి20 చాలెంజ్’ టోర్నీ నిర్వహిస్తోంది. మొదటి ఏడాది కేవలం రెండు జట్ల మధ్య ఒకే ఒక మ్యాచ్ జరగ్గా, ఆ తర్వాత దానిని మూడు జట్లకు పెంచారు. కరోనా కారణంగా 2021లో మినహా నాలుగుసార్లు నిర్వహించారు. ఇందులో విదేశీ క్రికెటర్లు కూడా భాగమయ్యారు. అయితే మరింత ఆకర్షణీయంగా మారుస్తూ పూర్తి స్థాయిలో ఐపీఎల్ తరహాలో లీగ్ జరపాలనే డిమాండ్ ఇటీవల చాలా పెరిగిపోయింది. టి20 ఫార్మాట్లో గత కొంత కాలంగా మన అమ్మాయిల మెరుగైన ప్రదర్శన కూడా అందుకు కారణం. కామన్వెల్త్ క్రీడల్లో మన జట్టు రజతం సాధించగా... బిగ్బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్లలో కూడా భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. గత మే నెలలో బోర్డు కార్యదర్శి జై షా చెప్పినదాని ప్రకారం లీగ్లో గరిష్టంగా ఆరు జట్ల వరకు ఉండే అవకాశం ఉంది. మహిళల టీమ్లను కూడా సొంతం చేసుకునేందుకు ప్రస్తుత ఐపీఎల్ టీమ్ల యాజమాన్యాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఫ్రాంచైజీల వరకు జట్లను కేటాయిస్తే మొదటి ప్రాధాన్యత ఐపీఎల్ టీమ్లకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం వచ్చే సెప్టెంబరులో జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకుంటారు. చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్పై కన్నేశారు -
ఇండియన్ ప్లేయర్లను ఫారిన్ లీగ్ల్లో ఆడనివ్వండి..!
భారత క్రికెటర్లు విదేశీ లీగ్ల్లో ఆడకపోవడం అనే అంశంపై లెజెండరీ వికెట్కీపర్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ స్పందించాడు. ఈ విషయంలో బీసీసీఐ కాస్త పట్టువీడాలని సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా భారత ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వారిని విదేశీ టీ20ల లీగ్ల్లో ఆడనివ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. భారత క్రికెటర్లు బిగ్బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫారిన్ లీగ్స్లో పాల్గొనడం వల్ల ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ పెరగడంతో పాటు బీసీసీఐకి విశ్వవ్యాప్త గుర్తింపు వస్తుందని అన్నాడు. భారత క్రికెటర్లు విదేశాల్లో (టీ20 లీగ్ల్లో) ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తే, అది క్రికెట్ వ్యాప్తికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు. విదేశీ లీగ్ల్లో భారత క్రికెటర్లు ఆడితే అద్భుతంగా ఉంటుందని, ఐపీఎల్ ఆరు సీజన్లు ఆడిన అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని తెలిపాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే టాప్ టీ20 లీగ్ అని, దాన్ని నడిపిస్తున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్కు పెద్దన్నయ్య లాంటిదని ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్పై ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆధిపత్యం ఎక్కువైందని సంచలన వ్యాఖ్యలు చేసిన మరునాడే గిల్లీ బీసీసీఐకి ఈ రకమైన సూచన చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: బిగ్బాష్ లీగ్ లో ఆడనున్న భారత ఆల్ రౌండర్..! -
ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్గా ఉండకూడదా? పుట్టుకతోనే సంపన్నుడిని.. నన్నే అంటారా?
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి క్రీడా, సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారాడు. సుస్మితను తన భాగస్వామి అని పేర్కొంటూ ఆయన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు లలిత్ మోదీపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్ఫ్రెండ్తో ఉన్నానంటూ ఫొటోలు షేర్ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో సుస్మితతో తన రిలేషన్షిప్పై స్పందించిన లలిత్ మోదీ ఆదివారం ట్విటర్ వేదికగా విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా తన భార్య మినాల్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డాడు. మధ్య యుగ కాలంలో ఉన్నామా? ఈ సందర్భంగా సుస్మితా సేన్, తన దివంగత భార్య మినాల్ మోదీ, కూతురు అలియా మోదీలతో పాటు నెల్సన్ మండేలా, దలైలామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి.. ఇతరులను కూడా వాళ్ల బతుకు వారిని బతకనివ్వండి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకుని వార్తలు రాయండి.. డొనాల్డ్ ట్రంప్ లాగా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకండి’’ అంటూ మీడియాపై కూడా విరుచుకుపడ్డాడు. ఇక తన భార్య మినాల్ మోదీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రియమైన నా భార్య, దివంగత మినాల్ మోదీ.. మా పెళ్లి కంటే 12 ఏళ్ల ముందు నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్.. అందరూ అనుకుంటున్నట్లుగా తను మా అమ్మ స్నేహితురాలు కాదు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు. మెదడు తక్కువ పనులు చేయొద్దు. ఎవరైనా ఓ వ్యక్తి తన దేశం కోసం.. లేదంటే వ్యక్తిగత జీవితంలో ఏదైనా సాధిస్తే ఎంజాయ్ చేయండి. మీ అందరి కంటే నేను బెటర్.. మీకంటే గొప్పగా తలెత్తుకుని తిరిగే అర్హత నాకుంది’’ అంటూ లలిత్ మోదీ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. అదే విధంగా తనను ఆర్థిక నేరగాడు అని పిలిస్తే పట్టించుకోనన్న లలిత్ మోదీ.. తాను డైమండ్స్పూన్తో పుట్టానని.. పుట్టుకతోనే సంపన్నుడినని పేర్కొన్నాడు. తన వల్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుట్టుకొచ్చిందని.. దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్నాడు. ఇక సుస్మిత సేన్తో మాల్దీవుల్లో లలిత్ ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అనడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాము ప్రేమలో ఉన్నామే తప్ప పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. కాగా సుస్మిత సైతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికపుడు తన అప్డేట్లు పంచుకుంటుందన్న సంగతి తెలిసిందే. చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్! చివరికి ఇలా! Too long to write so I put it on a picture slide. For those who don’t have instagram 🙏🏾 pic.twitter.com/v2sXCvyacn — Lalit Kumar Modi (@LalitKModi) July 17, 2022 View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
జై షా చెప్పిందే నిజమైంది.. ఐపీఎల్పై ఐసీసీ కీలక నిర్ణయం
ఐపీఎల్కు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పిందే అక్షరాల నిజమైంది. నివేదికల ప్రకారం.. ఐసీసీ 2023-27 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్టీపీ)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సింహ భాగాన్ని దక్కించుకుంది. తదుపరి ఎఫ్టీపీలో ఐపీఎల్ను రెండున్నర నెలల పాటు నిర్వహించుకునేందుకు ఐసీసీ పచ్చజెండా ఊపింది. ఐపీఎల్తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్లు కూడా ఎఫ్టీపీలో తమ బెర్తులను పొడిగించుకున్నాయి. ఈ మేరకు ఐసీసీ ఎఫ్టీపీని రూపొందిచినట్లు తెలుస్తోంది. తాజా సవరణలతో ఐపీఎల్ మార్చి చివరి వారంలో ప్రారంభమైన జూన్ మొదటి వారంలో (రెండున్నర నెలలు) ముగుస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లు ఎంటర్ కావడంతో మ్యాచ్ల సంఖ్య 60 నుంచి 74కు పొడిగించబడగా.. ఈ సంఖ్య 2023, 2024 సీజన్లలో ఆలాగే కొనసాగి.. 2025, 2026 ఎడిషన్లలో 84కు, 2027 సీజన్లో 94కు చేరుతుంది. ఐపీఎల్ విండో పొడిగించబడినప్పటికీ.. ఇప్పట్లో ఫ్రాంచైజీల సంఖ్య పెంచే ఆలోచన లేదని బీసీసీఐ తెలపడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, ఐసీసీ 2023-27 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాంలో ఐసీసీ విండో పొడిగింపుపై జై షా గత నెలలోనే ట్వీట్ చేశాడు. షా చెప్పినట్లుగానే ఐసీసీ తమ ఎఫ్టీపీలో ఐపీఎల్కు అగ్రతాంబూలం అందించింది. చదవండి: అందుకే బీసీసీఐ కోహ్లిని తప్పించే సాహసం చేయలేకపోతుంది..! -
తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్.. ఇప్పుడు ఇలా!
Lalit Modi Love Story With Minal: లలిత్ కుమార్ మోదీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి క్యాష్ రిచ్ లీగ్ను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్లు ఉన్నా ఐపీఎల్ విజయవంతం కావడంలో లలిత్ మోదీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన లలిత్ మోదీ.. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించడం విశేషం. అయితే, ఎంత వేగంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నాడో అదే తరహాలో పాతాళానికి దిగజారిపోయాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్లో తలదాచుకుంటున్నాడు. మాజీ విశ్వసుందరితో ప్రేమాయణం! ఇక ఇన్నాళ్లూ పెద్దగా లైమ్లైట్లో లేని 58 ఏళ్ల లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్తో డేటింగ్ అంటూ ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అంటూ చర్చకు తెరలేపాడు. PC: lalit modi Instagram ఈ క్రమంలో వీళ్లిద్దరి పెళ్లి అయి పోయిందని నెటిజన్లు ఫిక్సైపోగా అలాంటిదేమీ లేదని సుస్మిత, లలిత్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నామని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా 46 ఏళ్ల సుస్మితాసేన్ ఇప్పటికే ఎంతో మందితో డేటింగ్ చేసింది. సుస్మిత రూటు సెపరేటు! స్థాయి.. వయసుతో సంబంధం లేకుండా తన కంటే చిన్నవాళ్లూ, పెద్దవాళ్లతోనూ ప్రణయ బంధం కొనసాగించింది సుస్మిత. కానీ ఎవ్వరికీ తనను వివాహం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛాయుత జీవనం గడపడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం లలిత్తో ప్రేమ వ్యవహారం కూడా అలాంటిదేనా.. లేదంటే పెళ్లిదాకా వెళ్తారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. PC: lalit modi Instagram కాగా సుస్మిత ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇక లలిత్తో సుస్మిత పరిచయం ఈనాటిది కాదు. లలిత్ మోదీ దివంగత భార్య మినాల్ మోదీకి కూడా ఆమె ఫ్రెండ్ కావడం విశేషం. వీళ్లు ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించేవారట. ఇంతకీ మినాల్ ఎవరు? మినాల్ సంగ్రాణి నైజీరియాకు చెందిన సింధీ హిందూ వ్యాపారవేత్త పెసూ అస్వాని కుమార్తె. లలిత్ మోదీతో స్నేహానికి కంటే ముందే ఆమెకు వివాహమైంది. వ్యాపారవేత్త జాక్ సాంగ్రాణిని ఆమె పెళ్లాడింది. వారికి కూతురు సంతానం. అయితే, జాక్ ఓ స్కామ్లో ఇరుక్కోవడంతో జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. PC: lalit modi Instagram లలిత్ కంటే తొమ్మిదేళ్లు పెద్ద! భర్తకు విడాకులిచ్చిన మినాల్తో ప్రేమలో పడ్డ లలిత్ మోదీ ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అయితే, మోదీ కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. ఆమె డివోర్సీ కావడం ఒక అభ్యంతరమైతే.. లలిత్ కంటే మినాల్ వయసులో దాదాపు తొమ్మిదేళ్లు పెద్దది కావడం మరో కారణం. కుటుంబాన్ని ఎదిరించి! అయినా, అతడు ఆమె చేయిని వీడలేదు. కుటుంబంతో విభేదించాడు. 1991లో మినాల్ను పెళ్లిచేసుకున్నాడు. దీంతో తన ఫ్యామిలీకి దూరమయ్యాడు. తమను అందరూ దూరం పెట్టడంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే లలిత్- మినాల్లకు ఇద్దరు సంతానం. PC: lalit modi Instagram కొడుకు రుచిర్, కూతురు అలియా ఉంది. వీరితో పాటు మినాల్ మొదటి కూతురు కరిమా సంగ్రాణిని కూడా చేరదీశాడని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాన్సర్ బారిన పడ్డ మినాల్ ఆఖరి వరకు వ్యాధితో పోరాడి 64 ఏళ్ల వయస్సులో 2018లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ సుస్మితతో ప్రేమాయణంతో అటు క్రీడా, ఇటు సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారాడు. చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్ను వణికించారు! వరుస సెంచరీలతో.. Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్సెట్ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే.. -
BBL 2022-23: మరో మహా సంగ్రామం ఎప్పటి నుంచి అంటే..?
Big Bash League 2022-23: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సక్సెస్ అయిన మరో క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహా సంగ్రామానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. 2022-23 సీజన్ పురుషుల వెర్షన్ ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి ప్రారంభంకానుండగా.. మహిళల బీబీఎల్ అంతకంటే రెండు నెలల ముందు అక్టోబర్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. Our heroes are returning home! For the first time in three years, every Club is playing at home and we couldn't be more pumped 🤩 Full #WBBL08 schedule deets: https://t.co/oUaicm0FOH pic.twitter.com/oXPyYwRr71 — Weber Women's Big Bash League (@WBBL) July 6, 2022 సిడ్నీ థండర్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్తో పురుషుల బీబీఎల్ మొదలుకానుండగా.. బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్ మధ్య మ్యాచ్తో మహిళల టోర్నీ ప్రారంభంకానుంది. మహిళల టోర్నీ అక్టోబర్ 13న మొదలై నవంబర్ 27 వరకు జరుగనుండగా.. పురుషుల లీగ్ డిసెంబర్ 13 నుంచి వచ్చే ఏడాది (2023) జనవరి 25 వరకు జరుగుతుంది. ఈ రెండు లీగ్లకు సంబంధించిన ఫిక్షర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.. 🗓 #BBL12 SCHEDULE 🗓 The 12th instalment of the Big Bash is coming your way this summer! pic.twitter.com/npDQAd7U7c — KFC Big Bash League (@BBL) July 14, 2022 చదవండి: BBL: మరోసారి రెనెగేడ్స్తో జట్టు కట్టిన భారత కెప్టెన్! -
పొలమే గ్రౌండ్, కూలీలే క్రికెటర్లు.. గుజరాత్లో బయటపడ్డ ఫేక్ ఐపీఎల్ బండారం
గ్రౌండ్లో ఐపీఎల్ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఓ వైపు బ్యాట్స్మన్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. మరో వైపు బౌలర్లు వికెట్లు పడగొట్టేస్తున్నారు.. లైవ్లో ప్రేక్షకులు ఊపిరిబిగపట్టుకుని చూస్తున్నారు. అటు మ్యాచ్లో ఏ ఓవర్లో ఎన్ని రన్స్ రావొచ్చన్న దాని నుంచి ఫోర్లు, సిక్సర్లు, ఔట్లు, ఎవరెంత స్కోర్ చేస్తారనే దాకా బెట్టింగ్ల మీద బెట్టింగ్లు సాగుతున్నాయి. క్రికెట్ అన్నాక ఇదంతా కామనే అంటారు కదా.. ఇందులో చివరన చెప్పిన బెట్టింగులు మాత్రమే నిజం. మిగతా అంతా ఉత్త ఫేక్! విదేశీయులతో బెట్టింగ్లు కాయించి డబ్బులు దండుకోవడానికి ఓ ముఠా ఏకంగా ఫేక్ ఐపీఎల్నే నడిపించింది. ఇటీవలే గుజరాత్ పోలీసులు ఈ ఫేక్ ఐపీఎల్ మ్యాచులు, బెట్టింగ్ దందాను బయటపెట్టారు. అచ్చం ఐపీఎల్ మ్యాచ్లను తలపించేలా.. కొందరు గుజరాత్లోని మెహ్సానా పట్టణానికి కాస్త దూరంలోని మోలిపూర్ గ్రామంలో శ్మశానం పక్కన ఓ పొలాన్ని నెలవారీ అద్దెకు తీసుకున్నారు. దాన్ని చదును చేసి.. మధ్యలో పిచ్ను, ఇతర గుర్తులను సిద్ధం చేసి ఓ క్రికెట్ గ్రౌండ్లా మార్చారు. స్థానికంగా ఉన్న 25 మంది రైతులు, కూలీలకు రోజుకు రూ. నాలుగైదు వందలు ఇస్తామని చెప్పి క్రికెట్ ఆటగాళ్లుగా పెట్టుకున్నారు. అచ్చం ఐపీఎల్ టోర్నీలో వివిధ జట్లను పోలిన డ్రెస్లను వేయించి.. ఆయా జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతున్న ట్టుగా హడావుడి చేశారు. అంపైర్లను పెట్టి, వారికి వాకీటాకీలు ఇచ్చి.. నిజమైన మ్యాచ్ను తలపించేలా చేశారు. దీనంతటినీ అధునాతన కెమెరాలతో చిత్రీకరిస్తూ.. ‘ఐపీఎల్’ పేరిట క్రియేట్ చేసిన యూట్యూబ్లో చానల్లో లైవ్ ప్రసారం చేశారు. నిజమైన మ్యాచ్ల తరహాలో స్కోర్, బాల్స్, ఇతర గ్రాఫిక్స్ను పెట్టి.. నిజంగానే ఏదో పెద్ద ఆటగాళ్ల లైవ్ మ్యాచ్ అనిపించేలా జాగ్రత్త తీసుకున్నారు. ప్రేక్షకుల గోల, ఈలలు, చప్పట్లు వినిపించేలా సౌండ్ను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని లైవ్కు యాడ్ చేశారు. ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్ ‘హర్ష భోగ్లే’ వాయిస్ను పోలినట్టుగా ఓ వ్యక్తితో కామెంట్ కూడా చెప్పించారు. ఇదంతా ఎందుకోసం..? ముందే చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లు, ఆటగాళ్లు అంతా ఫేక్ అయినా.. ఇదంతా చేసింది మాత్రం బెట్టింగ్ కోసం. మన దేశం వాళ్లయితే ఆటగాళ్లను, మ్యాచ్ను ఇట్టే గుర్తుపట్టేస్తారు కాబట్టి.. రష్యాలో బెట్టింగ్లు నిర్వహించారు. దీనికి ప్లాన్ వేసింది కూడా రష్యాలోని పబ్లు, బార్లలో బెట్టింగ్లు నిర్వహించే ఆసిఫ్ మొహమ్మద్ అనే వ్యక్తి, ఆ పబ్లలో పనిచేసి తిరిగి వచ్చిన షోయబ్ దావ్డా అనే గుజరాతీ వ్యక్తి. వాళ్లు ఇక్కడ ఫేక్ ఐపీఎల్ నిర్వహిస్తూ.. నిజమైన మ్యాచ్ల్లా కలరింగ్ ఇస్తూ పందాలు కాశారు. వచ్చిన బెట్టింగ్లకు అనుగుణంగా.. మ్యాచ్లో ఫోర్లు, సిక్సర్లు కొట్టిస్తూ.. ఔట్ చేయిస్తూ.. కావాల్సిన టీమ్ను గెలిపించుకుంటూ.. డబ్బులు దండుకున్నారు. చిత్రమేంటంటే మొత్తం ఉన్నది 25 మందే. కానీ చాలా టీమ్లు ఆడినట్టుగా... వారికే వేర్వేరు టీమ్ల డ్రెస్లు వేయిస్తూ, మార్చుతూ ఆడుతున్నట్టుగా నటింపజేశారు. ఎలా బయటపడింది? తమ ఊరిలో పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లు జరుగుతు న్నాయని మోలిపూర్ వాసులు చర్చించుకోవడం.. ఆ నోటా ఈ నోటా ఈ విషయం మెహ్సానా పోలీసులకు చేరడం జరిగిపోయింది. ఓ పల్లెటూరిలో, అదీ తమకు తెలియకుండా మ్యాచ్లు ఏమిటని పోలీసులు ఆరా తీయడంతో.. ఫేక్ ఐపీఎల్, బెట్టింగ్ దందా గుట్టు బయటపడింది. ఈ వ్యవహారంలో పోలీసులు షోయబ్ దావ్డా సహా నలుగురిని అరెస్టు చేసి కేసు పెట్టారు. ఇంతా చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్న క్రికెట్ కిట్లు, జనరేటర్లు, ఐదు వీడియో కెమెరాలు, లైట్లు, టీవీలు, ల్యాప్టాప్లు, మైక్రోఫోన్లు, వాకీటాకీలన్నీ కలిపి విలువ అంతా నాలుగు లక్షలలోపే కావడం గమనార్హం. -
ఆ ఐపీఎల్లో ఆటగాళ్ల రెమ్యునరేషన్ రూ. 400 మాత్రమే..!
ఐపీఎల్ పేరిట నకిలీ మ్యాచ్లు నిర్వహిస్తూ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు గుజరాత్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని మెహ్సాన జిల్లా మోలిపూర్ గ్రామంలోని ఓ ముఠా ఐపీఎల్ పేరిట ఫేక్ మ్యాచ్లు నిర్వహిస్తూ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. సాంకేతికత ద్వారా అచ్చం ఐపీఎల్ మ్యాచ్ల్లా చిత్రీకరించిన ఈ మ్యాచ్ల ద్వారా సదరు ముఠా రష్యాలోని బెట్టింగ్ రాయుళ్లకు గాలం వేస్తోంది. ఈ ఫేక్ ఐపీఎల్లో వ్యవసాయ కూలీలే ఆటగాళ్లు. ఒక్కో మ్యాచ్లో ఆటగాడిగా నటించినందుకు గాను వీరికి లభించే రెమ్యునరేషన్ రూ.400. వీరు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జెర్సీలు ధరించి నిజమైన ఆటగాళ్లలా బిల్డప్ ఇస్తుంటారు. ఈ మ్యాచ్లకు అంపైర్లుగా వ్యవహరించే వారు బొమ్మ వాకీ టాకీలు పట్టుకుని నిజమైన అంపైర్ల కంటే ఎక్కువ ఫోజులు కొడుతుంటారు. హర్ష భోగ్లే స్వరాన్ని ఇమిటేట్ చేస్తూ కామెంటరీ చేయడం ఈ ఫేక్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్. ఈ మ్యాచ్లను హెచ్డీ కెమెరాలతో రికార్డు చేసి ఐపీఎల్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తుంటారు. ఈ నకిలీ ఐపీఎల్ ఇప్పటికే క్వార్టర్ ఫైనల్కు చేరుకోవడం మరో విశేషం. రష్యాలోని త్వెర్, వోరోనెజ్, మాస్కో తదితర ప్రాంతాల నుంచి పంటర్లు (పందెం కాసేవాళ్లు) బెట్టింగ్లు పాల్పడుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయంశంగా మారింది. నిజమైన ఐపీఎల్ను తలపించే ఈ ఫేక్ ఐపీఎల్ గురించి తెలిసి క్రికెట్ ఫాలోవర్స్ నివ్వెరపోతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫేక్ ఐపీఎల్ నిర్వహణకు సూత్రధారి షోయబ్ దవ్దా రష్యాలోని ప్రముఖ బెట్టింగ్ కేంద్రంలో గతంలో పని చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: వరల్డ్ ఎలెవెన్తో టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే..? -
ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఇకపై రెండున్నర నెలలు క్రికెట్ పండుగ
IPL: ఐపీఎల్ ఫ్యాన్స్కు బీసీసీఐ సెక్రెటరీ జై షా శుభవార్త తెలిపాడు. రానున్న సీజన్ల నుంచి ఐపీఎల్ పండుగను రెండున్నర నెలలకు పెంచబోతున్నట్లు స్పష్టం చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ను 10 వారాల పాటు నిర్వహించేందుకు ఐసీసీ కూడా అంగీకరించిందని వెల్లడించాడు. మంగళవారం ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన షా.. రానున్న సీజన్లలో క్రికెట్ పండుగ కాలవ్యవధి మరింత పెరుగనుందని కన్ఫర్మ్ చేశాడు. అయితే కొత్త ఫ్రాంచైజీలను ఇప్పట్లో తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని, ఉన్న జట్లతోనే మ్యాచ్ల సంఖ్యను, ఆటగాళ్ల సంఖ్యను మరింత పెంచదలచుకున్నామని వివరించాడు. 2024-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్పై చర్చించేందుకు ఐసీసీ వచ్చే వారం సమావేశం కానుందని, ఈ సమావేశాల్లో ఐపీఎల్ విండోపై పూర్తి క్లారిటీ వస్తుందని పేర్కొన్నాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీల సంఖ్య ఎనిమిది నుంచి పదికి పెరగడంతో క్యాష్ రిచ్ లీగ్ రెండు నెలల పాటు సాగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022లో మ్యాచ్ల సంఖ్య 74కు పెరగగా.. రానున్న సీజన్లలో ఈ సంఖ్య 94కు పెరిగే అవకాశం ఉంది. చదవండి: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్ -
గంగూలీ పిలిచినా వెళ్లలేదు.. ఐపీఎల్ నేపథ్యంలో పీసీబీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు చూసేందుకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ గతంలో తనను రెండుసార్లు (2021, 2022) ఆహ్వానించాడని, అయినా తాను గంగూలీ ఆహ్వానాన్ని తిరస్కరించానని పేర్కొన్నాడు. ఐపీఎల్ మీడియా హక్కులు భారీ మొత్తంలో అమ్ముడుపోయిన అంశంపై పాక్ మీడియా అడిగిన ప్రశ్నల సందర్భంగా రమీజ్ ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా రమీజ్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు బీసీసీఐ బాస్ తనను ఆహ్వానించాడని, అయినా తాను వెళ్లలేకపోయానని అన్నాడు. గంగూలీ నుంచి ఆహ్వానం అందాక వెళ్లాలా..? వద్దా..? అని చాలా రోజుల పాటు ఆలోచించానని, ఒకవేళ ఐపీఎల్ ఫైనల్స్ను వీక్షించేందుకు తాను వెళ్లుంటే పాక్ అభిమానులు నన్ను ఎప్పటికీ క్షమించేవారు కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ల మైత్రిపరమైన సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్కు వెళ్లే సాహసం చేయలేకపోయానని వ్యాఖ్యానించాడు. క్రికెట్ను ఓ క్రీడలా చూస్తే తాను గంగూలీ ఆహ్వానం మేరకు వెళ్లాల్సిందని, అయితే దాయది దేశాల్లో ఆ పరిస్థితులు లేవని తెలిపాడు. ఇదే సందర్భంగా రమీజ్ పీసీబీ ప్రతిపాదించిన నాలుగు దేశాల (భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) టీ20 సిరీస్పై కూడా స్పందించాడు. పీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడాన్ని ఆయన తప్పుబట్టాడు. నాలుగు దేశాల టీ20 సిరీస్పై గంగూలీతో డిస్కస్ చేశానని అన్నాడు. ఈ సిరీస్ సాధ్యాసాధ్యలపై దాదా త్వరలో ఓ ప్రకటన చేస్తానని హామీ ఇచ్చాడని తెలిపాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్లు అదృష్టవంతులు.. కానీ పాక్లో అలా కాదు! అయినా! -
'ఐపీఎల్ అంటేనే బిజినెస్'.. విషం చిమ్మిన పాక్ మాజీ క్రికెటర్
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అన్ని క్రికెట్ లీగ్ల్లోకెళ్లా అత్యధిక సంపాదన అర్జిస్తుంది. దీనికి అనుబంధగా ఉన్న బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా ఏటా కాసుల పంట కురుస్తుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మీడియా రైట్స్ ఈ వేలం బోర్డుకు కనివినీ ఎరుగని రీతిలో కనకవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 2023-2027 మధ్య ఐదేళ్ల కాలానికి గానూ రూ.48, 390 కోట్ల రికార్డు ధరకు ఐపీఎల్ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం. ఈ వేలం ప్రక్రియలో డిస్సీ స్టార్ రూ.23,575 కోట్లు వెచ్చించి ఐపిఎల్ టీవీ హక్కులు సొంతం చేసుకోగా.. ముఖేష్ అంబానికి చెందిన వయాకామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్ రూ. 24,815 కోట్లకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్నాయి. దీంతో ప్రపంచంలో ఐపీఎల్ ప్రస్తుతం బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్గా అవతరించింది. అంతేకాదు అంతర్జాతీయంగా నేషనల్ ఫుట్బాల్ లీగ్(యూఎస్ఏ), నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్(యూఎస్ఏ), ఇంగ్లీష్ ప్రమీయర్ లీగ్(ఇంగ్లండ్) సరసన ఐపీఎల్ కూడా చోటు దక్కించుకుంది. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ విలువ ధర కూడా భారీగా పెరిగిపోయింది. గతంలో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54.5 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.114 కోట్లకు చేరుకోవడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంపాదన కలిగిన లీగ్గా ఐపీఎల్ దూసుకెళ్తుంటే కొంతమంది మాత్రం పనిగట్టుకొని విషం చిమ్ముతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఐపీఎల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ అంతా బిజినెస్ అని.. ఎవరి స్వలాభం వారు చూసుకుంటున్నారని తెలిపాడు. లతీఫ్ మాట్లాడుతూ..''ఐపీఎల్ గురించి మాట్లాడితే క్రికెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐపీఎల్ అంతా బిజినెస్. ఎవరి స్వలాభం వారు చూసుకుంటున్నారు..డబ్బులే ముఖ్యమనుకుంటే అదే దారిలో చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.. వారిని కూడా జత చేసుకోండి. ఐపీఎల్లో బిజినెస్ ఎక్కువయ్యి క్వాలిటి తగ్గిపోయింది. అంతా కమర్షియల్ అయిపోవడంతో ప్రస్తుతం ఐపీఎల్ చూసేవారి సంఖ్య తగ్గిపోతుంది.ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఒక భారతీయుడిని పిలిచి మీరు ఎన్ని గంటలు మ్యాచ్ చూస్తున్నారని అడగండి.. సమాధానం మీకే తెలుస్తుంది. అందుకే అంటాను ఐపీఎల్ ఒక బిజినెస్ అని.. నా మాటకు కట్టుబడి ఉంటా'' అంటూ పేర్కొన్నాడు. -
ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్ప అన్న వారు ఈ లెక్కలు చూస్తే ఖంగుతినాల్సిందే..!
IPL VS PSL: ఇటీవలి కాలంలో పాకిస్థాన్కు చెందిన కొందరు క్రికెటర్లు తమ దేశంలో జరిగే పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కంటే తోపు అని జెబ్బలు చరుచుకున్న విషయం విధితమే. అయితే వారు వాపును చూసి బలుపు అన్న భ్రమలో ఉన్నారని తాజాగా జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బహిర్గతమైంది. 2023-27 సీజన్కు గాను ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ కనీవినీ ఎరుగని రీతిలో రూ. 48,390 కోట్లు అర్జించడంతో క్యాష్ రిచ్ లీగ్పై అవాక్కులు చవాక్కులు పేలిన పాక్ ప్రస్తుత, మాజీలు ముక్కున వేలేసుకున్నారు. ఈ స్థాయిలో ఐపీఎల్ మీడియా హక్కులు అమ్ముడుపోవడంతో వారంతా నీళ్లునములుతున్నారు. ఐపీఎల్ మీడియా హక్కులు ఈ రేంజ్లో అమ్ముడుపోవడంతో చేసేదేమీలేక ఐసీసీకి చాడీలు చెప్పడం ద్వారా తమ అక్కసుకు వెళ్లగక్కుతున్నారు. ఐపీఎల్ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతమైన స్పోర్ట్స్ లీగ్గా అవతరించడాన్ని ఆ దేశ అభిమానులతో పాటు అక్కడి రాజకీయ నాయకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ వర్సెస్ పీఎస్ఎల్.. ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కులు రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోగా.. 2022-2023 సీజన్కు గాను పీఎస్ఎల్ మీడియా హక్కులు కేవలం రూ. 166 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయాయి. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 118 కోట్లు (టీవీ, డిజిటల్, ఇతర రైట్స్ అన్నీ కలిపి) ఉండగా.. పీఎస్ఎల్లో కేవలం రూ. 2.76 కోట్లు మాత్రమే. ఐపీఎల్లో ఒక్కో ఓవర్ విలువ రూ. 2.95 కోట్లు కానుండగా.. పీఎస్ఎల్లో మ్యాచ్ మొత్తం విలువ మన ఒక్క ఓవర్ విలువ కంటే తక్కువే. ఐపీఎల్లో రాబోయే సీజన్ల నుంచి ఒక్కో బాల్ విలువ దాదాపు రూ. 50 లక్షలుగా ఉంటే.. పీఎస్ఎల్లో వేసే ఒక్కో బంతి విలువ లక్ష కంటే తక్కువగా ఉంది. పీఎస్ఎల్ మొత్తం మీడియా హక్కుల విలువ (రూ. 166 కోట్లు) ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ విలువతో (రూ. 118 కోట్లు) పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పీఎస్ఎల్ కంటే 50 రెట్లు అధికంగా ఉంది. 2017-2022 సీజన్కు గాను ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 16,347.50 కోట్లుకు అమ్ముడుపోగా.. 2023-27 సీజన్కు ఈ లెక్క దాదాపు మూడింతలవ్వడం విశేషం. చదవండి: IPL 2023: కోట్లు ఇచ్చారు... కోట్లు తెచ్చుకునేదెలా? -
ముగిసిన ఐపీఎల్ వేలం.. 'స్టార్' చేతికి టీవీ ప్రసార హక్కులు
గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మంగళవారంతో ముగిసింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్వర్క్తో రసవత్తరంగా సాగిన పోటీలో స్టార్ నెట్వర్క్ పైచేయి సాధించింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకు టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ చెందిన ‘వయాకామ్–18’, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకోగా.. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ మరోసారి చేజిక్కించుకుంది. 2018-22 సీజన్లో స్టార్ నెట్వర్క్ తొలిసారి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను దక్కించుకుంది. మొత్తంగా ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి 48,390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జరిగిన బిడ్డింగ్లో వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమెజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడగా స్టార్ నెట్వర్క్ భారీ మొత్తం చెల్లించి మీడియా హక్కులను సొంతం చేసుకుంది. చదవండి: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు కొట్టిన ఐపీఎల్ -
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు కొట్టిన ఐపీఎల్
క్రీడా ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సంచలనాలకు కేంద్ర బింధువుగా మారింది. 15 ఏళ్ల కాలంలో ప్రపంచంలో మేటి లీగ్లకు ధీటుగా నిలిచి అత్యంత ప్రజాధరణ పొందిన లీగ్గా అవతరించిన క్యాష్ రిచ్ లీగ్.. తాజాగా మీడియా హక్కుల పరంగా మరో రికార్డును బద్దలు కొట్టింది. విశ్వవ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ కలిగిన ప్రముఖ ఫుట్బాల్ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను వెనక్కునెట్టిన ఐపీఎల్.. విలువ పరంగా ప్రపంచంలో టాప్-2 లీగ్గా నిలిచింది. ఒక్కో మ్యాచ్ విలువ విషయంలో ఐపీఎల్ ఈపీఎల్ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది. ఈపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు (11 యూఎస్ మిలియన్ డాలర్లు) కాగా, ఐపీఎల్లో అది రూ. 107.5 కోట్లకు (13.4 యూఎస్ మిలియన్ డాలర్లు) చేరుకుంది. గతంలో ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉండేది. తాజాగా జరిగిన మీడియా హక్కుల వేలం ద్వారా ఐపీఎల్ విలువ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. టీవీ ప్రసారాలు (రూ. 57.5 కోట్లు), డిజిటల్ (రూ. 50 కోట్లు) హక్కుల ద్వారా ఐపీఎల్ ఒక్కో మ్యాచ్ విలువ రూ. 107.5 కోట్లకు చేరింది. ప్రస్తుతం మ్యాచ్ విలువ పరంగా అమెరికన్ ఫుట్బాల్ లీగ్ అయిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) ఐపీఎల్ కంటే ముందుంది. ఎన్ఎఫ్ఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 133 కోట్లు (17 యూఎస్ మిలియన్ డాలర్లు)గా ఉంది. ఇదిలా ఉంటే, గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ ఖజానాలో రూ. 44,075 కోట్లు చేరాయి. లీగ్ ప్రసారహక్కుల కోసం నాలుగు ప్యాకేజీలు ప్రకటిస్తే రెండు ప్యాకేజీలకే (ఏ, బీ) ఇప్పటి వరకు ఇంత ఆదాయం సమకూరింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్కు సంబంధించి టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ (రూ.23,575 కోట్లు) దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.23,773 కోట్లకు సొంతం చేసుకుంది. చదవండి: IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, వయాకామ్–18..! -
రికార్డులు బద్దలు కొడుతున్న ఐపీఎల్ మీడియా రైట్స్..
ఐపీఎల్ మీడియా హక్కులకు సంబంధించిన ఈ-వేలం జోరుగా సాగుతుంది. 2023-2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ముంబై లో ఇ-వేల ప్రారంభమైంది. నాలుగు ప్యాకేజీలుగా విభజించి వేలాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ ఇప్పటికే రూ. 40 వేల కోట్లు దాటిందని తెలుస్తున్నది. ముందుగా ఉపఖండంలో టీవీ హక్కులు.. ఆ తర్వాత డిజిటల్ హక్కుల విభాగాలకు వేర్వేరుగా వేలం నిర్వహిస్తున్నారు. టీవీ ప్రసారం హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీవీ ప్రసార హక్కుల వేలం రూ. 24 వేల కోట్లు చేరిందని.. డిజిటల్ హక్కులు రూ. 19 వేల కోట్లు దాటాయని తెలుస్తున్నది. మొత్తానికి ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కుల విలువ రూ. 43 వేల కోట్లు దాటిందని సమాచారం. ఈ అంకె ప్రతి అరగంటకూ పెరుగుతున్నది. ఈ-వేలం సోమవారం కూడా కొనసాగనుంది. దీనిని బట్టి చూస్తే బీసీసీఐ పెట్టుకున్న టార్గెట్ (రూ. 50వేల కోట్లు) చేరుకోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్ లు పోటీలో ఉన్నాయి. 2017-2022 కాలానికి గాను (డిస్నీ స్టార్) మీడియా హక్కుల ప్రారంభ ధర రూ. 16 వేల కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా డబుల్ (రూ. 32 వేల కోట్లు) అయింది. పోటీ నుంచి అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తప్పుకున్నా పోటీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే బీసీసీఐ.. రూ. 60 వేల కోట్లు అర్జించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చదవండి: ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్ రిప్లై Bidding for IPL TV, digital rights goes past Rs 42,000 cr Read @ANI Story | https://t.co/Ah5MWfeuKv#IPL #IPLMediaRights #BCCI pic.twitter.com/z87ATGtUiX — ANI Digital (@ani_digital) June 12, 2022 -
IPL: అమెజాన్ అవుట్
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే... మరోకటి జరిగింది. ఈ రేసు నుంచి ఓటీటీ సంస్థ అమెజాన్ తప్పుకుంది. దీంతో రిలయన్స్కు చెందిన ‘వయాకామ్ 18’ మిగతా మూడు సంస్థలతో రేసులో నిలిచింది. అమెజాన్ సహా డిస్నీ స్టార్, వయాకామ్–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వైదొలగడంతో ఇప్పుడు టీవీ, డిజిటల్ హక్కుల పోటీ ప్రధానంగా నాలుగు సంస్థల మధ్యే నెలకొనే అవకాశముంది. నిజానికి అపర కుబేరుడికి చెందిన అమెజాన్ పోటీలో ఉన్నంతసేపూ ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా రూ. 70 వేల కోట్ల మొత్తం రావొచ్చని బ్రాడ్కాస్టింగ్ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశముంది. ‘అవును అమెజాన్ ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల ప్రక్రియ నుంచి వైదొలగింది. బిడ్ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ శుక్రవారం కీలకమైన సాంకేతిక బిడ్డింగ్లో వాటిని దరఖాస్తు చేయలేదు. గూగుల్కు చెందిన యుట్యూబ్ వాళ్లు కూడా డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. కానీ వారు కూడా దరఖాస్తు సమర్పించలేదు. అయితే నాలుగు ప్రధాన టెలివిజన్, స్ట్రీమింగ్కు చెందిన మొత్తం 10 సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే ఇ–వేలం రెండు రోజులపాటు జరిగే అవకాశ ముంది.’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిజమా... రూ. 45 వేల కోట్లా? అమెజాన్ వైదొలగినప్పటికీ... పోటీలో ఉన్న సంస్థలన్నీ పెద్ద మొత్తం చెల్లించేందుకు సై అంటున్నాయి. ఐదారేళ్ల క్రితంతో పోల్చుకుంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఇప్పుడు అందరి ‘అరచేతి’ లో ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్ ప్రారంభ ధరే రూ. 32 వేల కోట్లు ఖాయమంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇదే జరిగితే పోటాపోటీలో అక్షరాలా 45 వేల కోట్ల రూపాయాలు ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రావొచ్చని అంచనా. అంటే గత మొత్తం రూ. 16,347.50 కోట్లకు రెండున్నర రెట్లు అధిక మొత్తం ఈసారి గ్యారంటీ! ఇ–వేలం సంగతేంటి? బీసీసీఐ టెండర్ల ప్రక్రియతో గత హక్కు లు కట్టబెట్టింది. ఇప్పుడు ఇ–ఆక్షన్ (ఎలక్ట్రానిక్ వేలం) నిర్వహించనుంది. ఆదివారం మొదలయ్యే ఈ ఇ–ఆక్షన్లో పోటీదారులంతా ఆన్లైన్ పోర్టల్లో బిడ్లు వేస్తారు. స్క్రీన్లో ఎక్కువ మొత్తం పెరుగుతున్న కొద్దీ పోటీలో ఉన్న సంస్థలు తప్పుకుంటాయి. చివరకు మిగిలిన సంస్థ విజేతగా నిలుస్తుంది. అయితే ఎంత మొత్తమో కనబడుతుంది కానీ ఎవరు వేసింది అనేది స్క్రీన్లో కనపడదు. ఎందుకంటే పలా నా సంస్థ వేసిందంటే దానికి ధీటుగా వేయా లని ఇతర సంస్థలు నిర్ణయించుకుంటాయి. నాలుగు ‘ప్యాకేజీ’లు నాలుగు ప్యాకేజీల్లో ఎ, బి, సి పూర్తిగా భారత ఉపఖండానికి సంబంధించినవి. ‘ఎ’ టీవీ హక్కులు, ‘బి’ డిజిటల్ రైట్స్. ‘సి’ ప్లే–ఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్లకు సంబంధించిన డిజిటల్ రైట్స్. ఇక ‘డి’ ఉపఖండం మినహా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్ రైట్స్. కొత్తగా ‘ప్రత్యేక’ హక్కులేంటంటే... సీజన్లో ఒక్కోసారి మ్యాచ్లు పెరిగితే దానికి సంబంధించిన ప్యాకేజీ అన్నమాట. ఒక సీజన్లో 74 ఉండొచ్చు. ఇవి మరో సీజన్లలో 84 లేదంటే 94కు పెరగొచ్చు. ఇవీ ప్రారంభ ధరలు... ‘ఎ’ టీవీ ప్యాకేజి కోసం ఒక్కో మ్యాచ్కు రూ. 49 కోట్లు ప్రారంభ బిడ్డింగ్ ధర కాగా... ‘బి’ డిజిటల్ కోసం మ్యాచ్కు రూ. 33 కోట్లు, ‘సి’లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు, ‘డి’లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక సంస్థ ఒకదానికే పరిమితమన్న నిబంధన లేదు. నాలుగు ప్యాకేజీలకూ ఒకే సంస్థ పోటీ పడొచ్చు. అయితే గతంలో ఏక మొత్తంలో ఒకే సంస్థకు కట్టబెట్టినట్లుగా కాకుండా ఈసారి ప్రతీ ప్యాకేజీలో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వాళ్లకే హక్కులిస్తారు. గతంలో టీవీ హక్కులకు భారీ మొత్తం కోట్ చేసిన స్టార్ నెట్వర్క్ డిజిటల్కు తక్కువ కోట్ చేసింది. ఫేస్బుక్ డిజిటల్ కోసం రూ.3,900 కోట్లు కోట్ చేసినా... ఓవరాల్గా గరిష్ట మొత్తాన్ని పరిగణించి స్టార్కు హక్కులిచ్చారు. ఈసారి డిజిటల్ విభాగంలో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ఆసియా, డ్రీమ్11, ఫ్యాన్కోడ్... ఉపఖండం ఆవల హక్కుల కోసం స్కై స్పోర్ట్స్ (ఇంగ్లండ్), సూపర్స్పోర్ట్ (దక్షిణాఫ్రికా) కూడా బరిలో ఉన్నాయి. -
IPL 2022: టైటాన్స్ విజయారంభం
ముంబై: కొత్త ఐపీఎల్ జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. దీపక్ హుడా (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్లు), ఆయుశ్ బదోని (41 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. షమీ 3 వికెట్లు తీశాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ తెవాటియా (24 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మిల్లర్ (21 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్లు) దంచేశారు. షమీ నిప్పులు ఆట ఆరంభమైన క్షణాన్నే షమీ... లక్నో నెత్తిన పిడుగు వేశాడు. కెప్టెన్ లోకేశ్ రాహుల్ (0)ను తొలి బంతికే డకౌట్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ డికాక్ (7)ను క్లీన్బౌల్డ్ చేశాడు. ఇది చాలదన్నట్లు వన్డౌన్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ (10)ను శుబ్మన్ గిల్ సూపర్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. బౌలర్ వరుణ్ ఆరోన్ అయినప్పటికీ ఈ వికెట్ పతనంలో కచ్చితంగా క్రెడిట్ గిల్కే దక్కుతుంది. బౌన్సర్ను లూయిస్ పుల్ షాట్ ఆడగా బ్యాట్ అంచును తాకిన బంతి స్క్వేర్లెగ్ దిశగా గాల్లోకి లేచింది. సర్కిల్ లోపలి నుంచి ఏకంగా 25 గజాల దూరం పరుగెత్తిన గిల్ డైవ్చేసి క్యాచ్ అందుకున్నాడు. మళ్లీ షమీ తన వరుస ఓవర్లో మనీశ్ పాండే (6)ను బౌల్డ్ చేశాడు. ఐదు ఓవర్లయినా పూర్తవకముందే లక్నో 29 పరుగులకు 4 వికెట్లను కోల్పోయింది. ఆదుకున్న హుడా, బదోని షమీ (3–0–10–3) అద్భుతమైన స్పెల్కు కుదేలైన లక్నోను దీపక్ హుడా, ఆయుశ్ బదోని ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 87 పరుగులు జోడించడంతో సూపర్ జెయింట్స్ కోలుకుంది. ఈ క్రమంలో హుడా (36 బంతుల్లో) 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తయ్యింది. స్కోరు వేగం పుంజుకుంటున్న తరుణంలో హుడాను రషీద్ ఖాన్ ఎల్బీగా పంపాడు. తర్వాత కృనాల్ పాండ్యా (13 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) అండతో బదోని (38 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ శతకం సాధించాడు. ఆరోన్ ఆఖరి ఓవర్లో భారీషాట్కు యత్నించి హార్దిక్ పాండ్యా చేతికి చిక్కాడు. తెవాటియా, మిల్లర్ ధనాధన్ టైటాన్స్ ఇన్నింగ్స్ కూడా కష్టాలతోనే ఆరంభమైంది. చమీర దెబ్బకు గిల్ (0) డకౌట్గా వెనుదిరిగాడు. తన మరుసటి ఓవర్లో విజయ్ శంకర్ (4) నూ చమీర పెవిలియన్ చేర్చడంతో లక్నో శిబిరం లో ఒక్కసారిగా ఎక్కడలేని ఆనందం! ఈ దశలో ఓపెనర్ వేడ్ (30; 4 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (33; 5 ఫోర్లు, 1 సిక్స్) స్కోరు బోర్డును కదిలించారు. 10 ఓవర్లలో 72/2తో మెరుగ్గా కనిపించిన గుజరాత్ వరుస ఓవర్లలో పాండ్యా, వేడ్ వికెట్లను కోల్పోయి ఓటమికి దగ్గరైంది. ఈ దశలో డేవిడ్ మిల్లర్, తెవాటియా జట్టుకు ఆపద్భాంధవులయ్యారు. ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు చేయాల్సి ఉండగా... దీపక్ హుడా వేసిన 16వ ఓవర్లో తెవాటియా 6, 4 కొడితే మిల్లర్ కూడా 4, 6 బాదేశాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఇదే జోరుతో తెవాటియా... రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్నూ ఆడుకున్నాడు. ఒక సిక్స్, 2 ఫోర్లతో ఆ ఓవర్లో కూడా 17 పరుగులు రావడంతో విజయసమీకరణం 18 బంతుల్లో 29 పరుగులుగా మారిపోయింది. 18వ ఓవర్లో మిల్లర్ను అవేశ్ అవుట్ చేయగా... అభినవ్ మనోహర్ క్రీజులోకి వచ్చాడు. ఆఖరి 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా... 19వ ఓవర్లో చమీర 9 పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో మనోహర్ రెండు బౌండరీలు, తెవాటియా ఫోర్తో టైటాన్స్ విజయం సాధించింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) వేడ్ (బి) షమీ 0; డికాక్ (బి) షమీ 7; లూయిస్ (సి) గిల్ (బి) ఆరోన్ 10; పాండే (బి) షమీ 6; హుడా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 55; బదోని (సి) హార్దిక్ (బి) ఆరోన్ 54; కృనాల్ పాండ్యా (నాటౌట్) 21; చమీర (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–20, 4–29, 5–116, 6–156. బౌలింగ్: షమీ 4–0–25–3, ఆరోన్ 4–0–45–2, ఫెర్గూసన్ 4–0– 24–0, హార్దిక్ 4–0–37–0, రషీద్ ఖాన్ 4–0–27–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) హుడా (బి) చమీర 0; వేడ్ (బి) హుడా 30; శంకర్ (బి) చమీర 4; హార్దిక్ (సి) పాండే (బి) కృనాల్ 33; మిల్లర్ (సి) రాహుల్ (బి) అవేశ్ 30; తెవాటియా (నాటౌట్) 40; అభినవ్ (నాటౌట్) 15; ఎక్స్ ట్రా లు 9; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–4, 2–15, 3–72, 4–78, 5– 138. బౌలింగ్: చమీర 3–0–22–2, అవేశ్ 3.4–0– 33–1, మోసిన్ 2–0–18–0, బిష్ణోయ్ 4–0–34– 0, కృనాల్ 4–0–17–1, హుడా 3–0– 31–1. -
రెండు గ్రూప్లు... జట్లకు సీడింగ్లు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో రెండు కొత్త జట్ల రాకతో 2022 సీజన్ మొత్తం 74 మ్యాచ్లతో కొత్తగా కనిపించనుంది. ఇప్పటి వరకు ప్రతీ జట్టు మిగతా 7 టీమ్లతో రెండు సార్లు తలపడి లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడేది. ఇప్పుడు కూడా ఒక్కో జట్టు గరిష్టంగా 14 మ్యాచ్లే ఆడనుండగా, ఫార్మాట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేరుకు హోం, అవే మ్యాచ్లు అని చెబుతున్నా... టోర్నీని నాలుగు వేదికలకే పరిమితం చేయడం తో ‘సొంత మైదానం’ అనే ప్రభావం కూడా ఉండకపోవచ్చు. మొత్తం లీగ్ మ్యాచ్ల సంఖ్య 70 కాగా, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లుంటాయి. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ నిర్వహిస్తారు. ఎలా ఆడతారు? ప్రతీ జట్టు తమ గ్రూప్లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు, మరో గ్రూప్లోని ఒక జట్టుతో (గ్రూప్లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్లు అవుతాయి. మరో గ్రూప్లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ ‘ఎ’ గ్రూప్లోని నాలుగు టీమ్లతో పాటు గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్తో రెండు మ్యాచ్లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కడ ఎన్ని మ్యాచ్లు? 70 లీగ్ మ్యాచ్లలో 20 మ్యాచ్లు ముంబై వాంఖెడే స్టేడియంలో, 20 మ్యాచ్లు ముంబై డీవై పాటిల్ స్టేడియంలో, 15 మ్యాచ్లు ముంబై బ్రబోర్న్ స్టేడియంలో, 15 మ్యాచ్లు పుణే స్టేడి యంలో నిర్వహిస్తారు. నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు అహ్మదాబాద్లో జరిగే అవకాశం ఉంది. ఏ గ్రూప్లో ఎవరు? ఐపీఎల్లో ఆయా జట్ల రికార్డును బట్టి ఒక్కో జట్టుకు సీడింగ్ కేటాయించారు. సాధించిన టైటిల్స్, ఫైనల్ చేరిన సంఖ్యను బట్టి దీనిని రూపొందించారు. దాని ప్రకారమే 1వ సీడ్ టీమ్ గ్రూప్ ‘ఎ’లో, రెండో సీడ్ గ్రూప్ ‘బి’లో... ఇలా పది టీమ్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్ (సీడింగ్–1), కోల్కతా నైట్రైడర్స్(3), రాజస్తాన్ రాయల్స్ (5), ఢిల్లీ క్యాపిటల్స్ (7), లక్నో సూపర్ జెయింట్స్ (9). గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్ (2), సన్రైజర్స్ హైదరాబాద్ (4), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6), పంజాబ్ కింగ్స్ (8), గుజరాత్ టైటాన్స్ (10). -
IPL 2022 Auction: అక్షరాలా రూ. 551 కోట్ల 70 లక్షలు
ఐపీఎల్కు ఆర్థిక మాంద్యం ఉండదని మరోసారి రుజువైంది. రెండు రోజుల పాటు సాగిన లీగ్ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్ నుంచి 137 మంది ఉండగా... విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. 2022 సీజన్ వేలం కోసం అన్ని టీమ్లు కలిపి రూ. 551 కోట్ల 70 లక్షలు ఖర్చు చేయడం విశేషం. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా... మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించకపోవడంతో మరికొందరు పెద్ద క్రికెటర్లు కూడా నిరాశగా చూస్తుండిపోవడం కూడా సహజ పరిణామంలా కనిపించింది. రెండో రోజు ఆదివారం సాగిన వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్స్టోన్ను అత్యధికంగా రూ. 11 కోట్ల 50 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఓవరాల్గా నలుగురు హైదరాబాద్ క్రికెటర్లు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ, సీవీ మిలింద్, భగత్ వర్మ, రాహుల్ బుద్ధిలకు... ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు అంబటి రాయుడు, కేఎస్ భరత్, అశ్విన్ హెబర్లను వివిధ ఫ్రాంచైజీలు వేలంలో ఎంచుకున్నాయి. వేలానికే ముందే సిరాజ్ను బెంగళూరు ఎంచుకోగా... ఆశ్చర్యకరంగా టెస్టు క్రికెటర్ హనుమ విహారి పేరు కూడా వేలంలో వినిపించలేదు. వేలంతో క్రికెటర్ల విలువపై ఒక అంచనా ఏర్పడగా ఏప్రిల్–మేలో జరిగే టోర్నీలో ఆటగాళ్ల అసలు సత్తా ఏమిటో బయటపడుతుంది. బెంగళూరు: దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్తో వేలం మొదలైంది. రూ. 1 కోటి బేస్ప్రైస్ కాగా, ముంబైతో పోటీ పడి చివరకు సన్రైజర్స్ దక్కించుకుంది. భారత ఆటగాడు అజింక్య రహానే కోసం ఎవరూ పోటీ పడకపోగా, కనీస ధర రూ.1 కోటితోనే కోల్కతా సొంతం చేసుకుంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో ఐదో స్థానంలో ఉన్న మలాన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు లబుషేన్, ఫించ్, భారత టెస్టు బ్యాటర్ పుజారా కోసం ఎవరూ ఆసక్తి చూపించకపోగా...గత సీజన్ వరకు కోల్కతాకు కెప్టెన్గా ఉన్న ఇయాన్ మోర్గాన్ కోసం కూడా ఏ జట్టూ ముందుకు రాలేదు. ► ధాటిగా ఆడగల విండీస్ బ్యాటర్ ఒడెన్ స్మిత్ కోసం పోటీ బాగా సాగింది. రూ. 5.75 కోట్ల వరకు వచ్చి సన్రైజర్స్ తప్పుకోగా, రూ. 6 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. ఇటీవల సొంతగడ్డపై భారత్ను ఇబ్బంది పెట్టిన దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాన్సెన్ కోసం అతని తొలి ఐపీఎల్ జట్టు ముంబై రూ. 4 కోట్ల వరకు బాగా ఆసక్తి చూపిం చింది. అయితే మరో 20 లక్షలు జోడించి హైదరాబాద్ అతడిని తీసుకుంది. గత సీజన్లో రూ. 9.25 కోట్లకు అమ్ముడుపోయిన కృష్ణప్ప గౌతమ్కు ఈ సారి రూ. 90 లక్షలు దక్కడం గమనార్హం. ► అండర్–19 ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్ యష్ ధుల్ను అతని సొంత నగరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 50 లక్షలకు ఎంచుకుంది. ప్రపంచకప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అంగద్ రాజ్ బావాను పంజాబ్ సొంతం చేసుకుంది. ► ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోసం భారీ పోటీ సాగింది. గాయంతో అతను 2022లో ఆడే అవకాశం లేకపోయినా వచ్చే సీజన్లను దృష్టిలో పెట్టుకొని టీమ్లు పోటీ పడ్డాయి. రాజస్తాన్, హైదరాబాద్లతో పోటీ పడి చివరకు ముంబై రూ. 8 కోట్లకు దక్కించుకుంది. ► జమ్ము కశ్మీర్కు చెందిన 21 ఏళ్ల రసిఖ్ సలామ్ను రూ. 20 లక్షల బేస్ప్రైస్కు కోల్కతా ఎంచుకుంది. 2019లో ముంబై ఇండియన్స్ తరఫున అతను ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అయితే ఆ తర్వాత వయసు తప్పుగా చూపించాడంటూ బీసీసీఐ అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది. ముంబై ఇండియన్స్ రెండేళ్ల పాటు అతని బాధ్యత తీసుకొని రసిఖ్ను ముంబైకి రప్పించింది. అన్ని సౌకర్యాలూ కల్పించి ప్రాక్టీస్కు అవకాశం ఇస్తూ స్థానిక మ్యాచ్లు కూడా ఆడించింది. అయితే వేలంలో అతని పేరు వచ్చినప్పుడు మాత్రం ముంబై అసలు స్పందించనే లేదు! లివింగ్స్టోన్కు రూ. 11 కోట్ల 50 లక్షలు విధ్వంసక బ్యాటింగ్తో పాటు అటు ఆఫ్స్పిన్, ఇటు లెగ్స్పిన్ బౌలింగ్ వేయగల నైపుణ్యం లివింగ్స్టోన్ సొంతం. 165 టి20 మ్యాచ్లలో 144.29 స్ట్రయిక్రేట్ కాగా 2 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. బౌలింగ్లోనూ మెరుగైన 7.86 ఎకానమీని అతను నమోదు చేశాడు. గత ఐపీఎల్లో రూ. 75 లక్షలకు రాజస్తాన్ తరఫున ఆడిన అతను 5 మ్యాచ్లలో 42 పరుగులే చేశాడు. అయితే ఏడాది కాలంగా అతని ఆటతీరు అద్భుతంగా మారిపోయింది. 2021లో టి20ల్లో 86 సిక్స్లు బాదిన అతను పాకిస్తాన్పై 43 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. ఓపెనింగ్ నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు. లివింగ్స్టోన్ ఆట గురించి బాగా తెలిసిన పంజాబ్ కింగ్స్ అనలిస్ట్ డాన్ వెస్టన్ కూడా అతడిని సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. రూ. 1 కోటి కనీస ధరతో మొదలైన లివింగ్స్టోన్ బిడ్డింగ్ ఆ తర్వాత దూసుకుపోయింది. వేలంలో ఒకరిని మించి మరొకరు మొత్తం ఐదు జట్లు అతని కోసం పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ రూ. 11 కోట్ల 50 లక్షలకు లివింగ్స్టోన్ను గెలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలో స్టోక్స్ (రూ. 14 కోట్ల 50 లక్షలు), స్టోక్స్ (రూ. 12 కోట్ల 50 లక్షలు), టైమల్ మిల్స్ (రూ. 12 కోట్లు) తర్వాత అత్యధిక మొత్తం పలికిన ఇంగ్లండ్ ఆటగాళ్ల జాబితాలో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 85 మ్యాచ్ల టి20 కెరీర్లో 159.39 స్ట్రయిక్రేట్తో పరుగులు చేసిన డేవిడ్ గత ఏడాది బెంగళూరు టీమ్తో ఉన్నాడు. రూ.40 లక్షలతో ఢిల్లీ బిడ్ మొదలు పెట్టగా మరో నాలుగు జట్లు బరిలో నిలిచాయి. చివరకు అతడిని ముంబై ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇచ్చిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. అతను ఐదు లేదా ఆరో స్థానంలో ఆడతాడని ఓనర్ అంబానీ ప్రకటించాడు. టిమ్ డేవిడ్ తండ్రి రోడరిగ్ డేవిడ్ది ఆస్ట్రేలియా కాగా, ఉద్యోగరీత్యా అతను సింగపూర్కు వలస వచ్చాడు. రోడరిక్ కూడా సింగపూర్ జాతీయ జట్టు తరఫున ఆడాడు. సారీ రైనా..! 205 మ్యాచ్లు... 5,528 పరుగులు... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం... అద్భుత ప్రదర్శనలతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర... ‘చిన్న తలా’ సురేశ్ రైనా సూపర్ కెరీర్ ముగిసినట్లే. వేలంలో రైనాను తీసుకోవడానికి చెన్నై సహా ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఇన్నేళ్లలో చెన్నైపై నిషేధం ఉన్న రెండేళ్లు మినహా (అప్పుడు గుజరాత్కు) మరే ఫ్రాంచైజీకి అతను ఆడలేదు. అతను రెగ్యులర్గా మ్యాచ్లు ఆడకపోవడం కూడా ప్రధాన కారణం. కనీసం బేస్ప్రైస్ వద్ద కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈ సీజన్ వేలంలో అమ్ముడుపోని కీలక ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఇషాంత్ శర్మ, షమ్సీ, కేదార్ జాదవ్, గ్రాండ్హోమ్, గప్టిల్, కార్లోస్ బ్రాత్వైట్, పుజారా, హనుమ విహారి తదితరులు ఉన్నారు. -
మెగా వేలంలో అపశ్రుతి: కుప్పకూలిన వేలంపాటదారు.. చారు శర్మ ఎంట్రీ
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ మెగా వేలంలో తొలి రోజు చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు వచ్చిన ప్రముఖ వేలంపాటదారు హ్యూజ్ ఎడ్మీడ్స్ వేలం జరుగుతుండగానే కుప్పకూలారు. ఉన్నపళంగా లో బీపీ (అల్ప రక్తపోటు)కి గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించడంతో పాటు... ప్రక్రియకు ఆటంకం కలుగకుండా వెంటనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేలంపాట బాధ్యతల్ని సుప్రసిద్ధ క్రీడా వ్యాఖ్యాత చారు శర్మకు అప్పగిం చింది. శనివారం శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ పేరు వేలానికి పిలిచిన సమయంలో 60 ఏళ్ల హ్యూజ్ ఎడ్మీడ్స్ రక్తపోటు ఉన్నపళంగా పడిపోయింది. నిల్చున్న చోటే కుప్పకూలిన ఆయన్ని సత్వరం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ఎడ్మీడ్స్ ప్రపంచ వ్యాప్తంగా 2700 పైచిలుకు వేలం పాటలు నిర్వహించారు. -
IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. కాగా ఫిబ్రవరి 12న బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ను సొంతం చేసుకుంది. రిటెన్షన్లో అతడిని వదిలేసిన ముంబై వేలంలో 15.25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం. కాగా ఇషాన్ కనీస ధర 2 కోట్లు కాగా ముంబై, హైదరాబాద్ పోటీ పడ్డాయి. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఇషాన్ కిషన్... ‘‘అందరికి నమస్కారం. ముంబై ఇండియన్స్తో మళ్లీ చేరడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. జట్టులోని ప్రతి ఒక్కరు నన్ను తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. నిజంగా నా జట్టుతో తిరిగి కలవడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ ఉత్సాహంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ట్విటర్లో షేర్ చేసింది. కాగా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ముందు వరుసలో ఉన్నాడు. (చదవండి: అప్పుడు రూ.20 లక్షలు.. ఇప్పుడు ఏకంగా రూ.10.75 కోట్లు.. వారెవ్వా హర్షల్!) 2008లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిని 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు రికార్డు ధర పలికిన ఇషాన్ యువీ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. మరో టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ను 12.25 కోట్లు పెట్టి కోల్కతా కొనుగోలు చేసింది. ఇక విదేశీ ఆటగాళ్లలో క్రిస్ మోరిస్(16 కోట్లు), ప్యాట్ కమిన్స్(15.5 కోట్లు), కైలీ జెమీషన్(15 కోట్లు) తదితరులు గతంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. 𝐓𝐡𝐞 𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐃𝐲𝐧𝐚𝐦𝐨 shares a message for the Paltan after coming ℍ𝕆𝕄𝔼 💙#AalaRe #MumbaiIndians #AalaRe #IPLAuction @ishankishan51 pic.twitter.com/Q9QcTQ34gL — Mumbai Indians (@mipaltan) February 12, 2022 -
ఐపీఎల్-2022 గెలుపు గుర్రాలకోసం ఫ్రాంఛైజీ వేట షురూ
-
IPL 2022 Auction: 10 జట్లు... చేతిలో రూ. 561.50 కోట్లు... బాక్స్లు బద్దలు కానున్నాయి
IPL 2022 Mega Auction: 10 జట్లు... చేతిలో రూ. 561.50 కోట్లు... అదృష్టం పరీక్షించుకోనున్న 600 మంది... క్రికెట్ అభిమానుల పండగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అసలు ఆటకు ముందు ‘నోట్లాట’కు రంగం సిద్ధమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు అందుబాటులోకి వస్తూ మెగా వేలం జరగనుంది. అబ్బో అనిపించే ఆశ్చర్యాలు, అయ్యో అనిపించే నిరాశలు, ఆహా అనిపించే ఎంపికలు, అంతేనా అనిపించే సర్దుబాట్లు... ఎప్ప టిలాగే ఇలా అన్ని భావోద్వేగాలు అభిమానుల నుంచి కనిపించవచ్చు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తన పేరు రాగానే ఆటగాళ్ల లబ్డబ్ చప్పుళ్ల వేగం గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క సీజన్ వరకే కాకుండా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుంటూ ఫ్రాంచైజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వేలంలో ఎవరు ఎంత ధరతో రికార్డులు బద్దలు కొడతారనేది ఆసక్తికరం! వేలం వేదిక: బెంగళూరు వేలం తేదీలు: ఫిబ్రవరి 12, 13 మొత్తం జట్లు: ఇప్పటికే ఉన్న 8 టీమ్లతో పాటు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా వచ్చాయి. ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య: 33 వేలం బరిలో ఉన్నవారు: 600 మంది (377 మంది భారతీయులు, 223 విదేశీ ఆటగాళ్లు) వేలంలో ఎంపికయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లు: 227 (గరిష్టంగా) ఒక్కో టీమ్లో ఎంత మంది: కనిష్టంగా 18, గరిష్టంగా 25 (ఇందులో 8 మంది విదేశీయులు) ఒక్కో జట్టు ఖర్చు చేయాల్సిన సొమ్ము: గరిష్టంగా ప్రతీ జట్టుకు రూ. 90 కోట్ల వరకు ఖర్చు చేసే అనుమతి ఉండగా...ఆటగాళ్లను ఎంచుకునేందుకు కనిష్టంగా 67.5 కోట్లయినా వాడాలి. తొలి రోజు ఎంత మంది: శనివారం వేలంలో 161 మంది క్రికెటర్లు మాత్రమే అందుబాటులోకి వస్తారు. మిగిలిన ఆటగాళ్ల కోసం ఆదివారం కూడా వేలం ‘యాక్సెలరేటెట్ ప్రాసెస్’ ద్వారా కొనసాగుతుంది. అంటే 161 పోగా, మిగిలిన 439 మందిని ఆదివారం వేలంలోకి తీసుకురారు. తొలి రోజు ముగిసిన తర్వాత పది ఫ్రాంచైజీలు ఇంకా ఎవరెవరు వేలంలో ఉంటే బాగుంటుందని తమ సూచనలు ఇస్తాయి. ఆ ఆటగాళ్లు పేర్లు మాత్రమే రెండో రోజు వేలంలో వినపడతాయి. -
త్వరలోనే ‘మహిళల ఐపీఎల్’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మహిళల కోసం పూర్తి స్థాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ను నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. ఈ ఏడాదికి మాత్రం ఎప్పటిలాగే మూడు జట్లతో మహిళల టి20 చాలెంజ్ మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించలేదు. ‘మహిళల క్రికెట్కు సంబంధించి కూడా త్వరలోనే పరిస్థితులు మారతాయి. ఐపీఎల్ తరహాలో మహిళల టోర్నీ కూడా నిర్వహించాలనే ఆలోచనకు బీసీసీఐ కట్టుబడి ఉంది. అందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళల టి20 చాలెంజ్ టోర్నీకి అభిమానులు, ఆటగాళ్ల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే త్వరలోనే ఐపీఎల్ సాధ్యమమవుతుందని అనిపిస్తోంది’ అని జై షా అన్నారు. 2022లో ఐపీఎల్ను పూర్తిగా భారత్లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఒక అంచనాకు వస్తామని ఆయన చెప్పారు. మరోవైపు నాలుగు పెద్ద జట్లతో టి20 టోర్నీ నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా చేసిన ప్రతిపాదనపై కూడా జై షా స్పందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టే అలాంటి వాణిజ్యపరమైన ఆలోచనకంటే క్రికెట్ను అభివృద్ధి చేయడం ముఖ్యం. ఐపీఎల్ విస్తృతమవడంతో పాటు ప్రతీ ఏడాది ఐసీసీ టోర్నీలు ఉంటున్నాయి. పైగా టెస్టులపై దృష్టి పెడుతూ ద్వైపాక్షిక సిరీస్లు కూడా ముఖ్యం. ఇలాంటి సమయంలో తాత్కాలిక ప్రయోజనాలకంటే ఆటకు ప్రాచుర్యం కల్పించడమే కీలకం’ అని షా అభిప్రాయపడ్డారు.