స్వచ్ఛ సర్వేక్షణ్పై అవగాహన
నిజామాబాద్ సిటీ: నగరంలోని కంఠేశ్వర్లోగల మెప్మా కార్యాలయంలో ఆర్పీలకు, డ్వాక్రా సంఘాల సభ్యులకు శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్పై మున్సిపల్ ప్రాజెక్టు అధికారి చిదుర రమేష్ అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా సిటీజన్ ఫీడ్బ్యాక్ నమోదుతోపాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మొబైల్ యాప్లో ప్రశ్నావళిని పూరించే విధానం గురించి వివరించారు. నగరంలోని ప్రతి పౌరుడు ఈ ప్రశ్నావళిని పూర్తిచేయాలని, దీంతో నగరానికి ర్యాంక్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నగరవాసులు తమకు అందుతున్న సేవలను యాప్లో ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment