ఘనంగా అంతర్జాతీయ కస్టమ్స్‌ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అంతర్జాతీయ కస్టమ్స్‌ దినోత్సవం

Published Sun, Feb 16 2025 1:29 AM | Last Updated on Sun, Feb 16 2025 1:27 AM

ఘనంగా అంతర్జాతీయ కస్టమ్స్‌ దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ కస్టమ్స్‌ దినోత్సవం

భవానీపురం(విజయవాడపశ్చిమ): అంతర్జాతీయ కస్టమ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ (ప్రివెంటీస్‌) ఆధ్వర్యాన శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వేడుకలు జరిగాయి. కస్టమ్స్‌ ఆర్థిక భద్రత, గ్లోబల్‌ వాణిజ్య సులభతపై అవలంబించాల్సిన ముఖ్య పాత్రను సూచించింది. ఈ ఏడాది థీమ్‌ అయిన ‘కస్టమ్స్‌ – సమర్థత– భద్రత – శ్రేయస్సు’ ను అమలు చేయాలని పేర్కొన్నారు. కస్టమ్స్‌ కమిషనర్‌ సాదు నరసింహారెడ్డి నేతృత్వం వహించగా ముఖ్యఅతిథిగా చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కం ట్యాక్స్‌ వరిందర్‌ మెహత, అతిథిగా డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ నరేంద్ర ఎ పాటిల్‌ హాజరయ్యారు. సాదు నరసింహారెడ్డి మాట్లాడుతూ 2024–25లో (జనవరి 2025 వరకు) విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ (ప్రివెంటీస్‌) ద్వారా రూ.11,480 కోట్లు ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 36 మంది ఉద్యోగులు అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసినందుకు సత్కరించారు. కస్టమ్స్‌ అదనపు కమిషనర్‌ ప్రశాంత్‌ కుమార్‌ ప్రసంగించగా అసిస్టెంట్‌ కమిషనర్‌ అబ్దుల్‌ అజీమ్‌ అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement