ఏపీ కూటమి: ఉత్తరాంధ్రలో ఒకలా.. బెజవాడలో మరోలా! | The alliance is making two regional announcements on the capital | Sakshi
Sakshi News home page

ఏపీ కూటమి: ఉత్తరాంధ్రలో ఒకలా.. బెజవాడలో మరోలా!

Published Thu, May 9 2024 5:14 AM | Last Updated on Thu, May 9 2024 7:20 AM

The alliance is making two regional announcements on the capital

అక్కడో మాట.. ఇక్కడో మాట

రాజధానిపై కూటమి ద్విపాత్రాభినయం

ప్రాంతాల వారీగా మభ్య పెట్టే ప్రకటనలు

అమరావతి అనేది 20 ఏళ్ల తర్వాతి మాట

టీడీపీ పాలనలో అప్పులు రూ.3.5 లక్షల కోట్లు

విశాఖే రాజధాని గ్రోత్‌ ఇంజన్‌ అని కూటమి ఎంపీ భరత్‌ అభ్యర్థి వ్యాఖ్యలు 

సాక్షి, అమరావతి: ఏ ఎండకు ఆ గొడుగు!.. ఏ రోటికాడ ఆ రోటి పాట! ఏరు దాటాక తెప్ప తగలేయడమే తన ఆనవాయితీ అని టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మరో­సారి విస్పష్టంగా చెప్పింది! ప్రజాక్షేత్రంలో మరోసారి ఘోర పరాజయం ఖాయమని నిర్ధారణకు రావడంతో ఉనికి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కో డ్రామాలాడుతోంది. రాజ­ధానిపై బుధవారం దినపత్రికల్లో కూట­మి ఇచ్చిన ప్రకటనలే ఇందుకు తార్కా­ణం. ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందేందుకు రాజ­ధానిపై ప్రాంతాల వారీగా రెండు రకా­ల ప్రకటనలు ఇచ్చే స్థాయికి దిగజారింది. 

సాధ్యం కాదన్న బాలయ్య అల్లుడు
విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్‌ ఓట్ల కోసం విశాఖే రాజధాని గ్రోత్‌ ఇంజన్‌ అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కాదని స్పష్టం చేస్తూ.. అమరా­వ­తిని అభివృద్ధి చేయాలంటే చాలా పెట్టు­బడి అవసరమని ఓ ప్రైవేట్‌ చానల్‌కు ఇచ్చిన ఇండర్వ్యూలో భరత్‌ తేల్చి చెప్పారు. 

అన్ని డబ్బులు వెచ్చించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభు­త్వం లేదన్నారు. అదే విశాఖ అయితే వేగంగా అభివృద్ధి చెందుతుందని, గ్రోత్‌ ఇంజన్‌ ఏమిటనేది చూడాలని వ్యాఖ్యానించారు. గ్రోత్‌ ఇంజన్‌ విశాఖతో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందంటూ ఓట్ల కోసం రెండు నాలుకల ధోరణితో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు మూడున్నర లక్షల కోట్ల రూపాయ­లకు చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వం అమరావ­తిలో రూ.వేల కోట్లు పెట్టుబడి పెట్టే స్థితిలో లేదని భరత్‌ చెప్పారు. 

అమరావతి అనేది 20 సంవత్సరాల తరువాత మాట అని, అదే విశాఖ మనకు వెంటనే గ్రోత్‌ ఇంజన్‌ లాంటిదని బాలకృష్ణ అల్లుడు భరత్‌ తెలిపారు. టీడీపీతో పాటు బీజేపీ, పవన్‌ అమరావతే రాజధాని అని చెబుతుండగా విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్‌ మాత్రం విశాఖ రాజధాని గ్రోత్‌ ఇంజన్‌ అని పేర్కొనటాన్ని బట్టి కూటమి లక్ష్యం ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందడమేనని స్పష్టమవుతోంది. 

రెండు ప్రాంతాలు.. రెండు నాలుకలు!
తాజాగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సంద­ర్భంగా విజయ­వాడ, విశాఖ ఎడిష­న్లలో ఆయా ప్రాంతాల ప్రజలను మభ్యపు­చ్చేలా కూటమి వేర్వేరు ప్రకటనలు ఇవ్వడం గమ­నార్హం. ఈమేరకు విజయవాడ, విశాఖ­లో ఈనాడు, హిందూ దినపత్రికల తొలి పేజీల్లో కూటమి ప్రచార ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ప్రధాని మోదీతో పాటు బాబు, పవన్‌ ఫొటోలు­న్నాయి. విజయవాడ ఎడి­షన్‌లో మన కలల రాజధాని అమరావ­తిని కాపాడు­కో­వడానికి అంటూ పత్రికల్లో ప్రక­టన ఇవ్వ­గా విశాఖ­లో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వికాసం కోసం అంటూ ముగ్గురి ఫొటోలతో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 

ఓ విధానం లేకుండా..
జాతీయస్థాయిలో ఎనీడీఏ కూటమిగా ఏర్ప­డి పోటీ చేస్తున్న పార్టీలు రాజధాని విష­యంలో ఒక విధానం లేకుండా ప్రాంతానికో రక­ంగా వ్యవహరించడం అంటే ఓటర్లను మోసం చేయ­డమేనని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓటమి భయంతోనే ప్రాంతాల­వారీగా మభ్య­­పెడుతున్నట్లు రాజకీయ పరిశీ­ల­కులు విశ్లే­షిస్తు­న్నారు. అమరావతిని రాజ­ధాని చేయా­లంటే రూ.లక్షల కోట్లు అవసర­మని, అంత ఖర్చు చేసినా చాలా ఏళ్లు  పడుతుందని తొలి నుంచీ వైఎస్సార్‌­సీపీ వాస్తవిక దృక్ప­థంతో చెబుతోంది.

 అదే విషయాన్ని ఇప్పు­డు ఓట్ల కోసం భరత్‌ వల్లె వేయడం గమ­నా­ర్హం. రాజధాని అమరావతి సాధ్యం కా­దని పే­ర్కొ­నడం విశేషం. రాష్ట్రంలో విజయ­వాడ భాగ­మై­నప్పటికీ ఉత్తరాంధ్ర ఎడిషన్లలో మా­త్రం అమరావతి ప్రస్తావన లేకుండా ప్రచా­ర ప్రకటనలు జారీ చేయటా­న్ని బట్టి ఇదంతా ఓట్ల రాజకీయమేనని స్పష్టమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement