Capital Amaravathi
-
కిలోమీటర్కు రూ.53.88 కోట్లు!
మీరు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుంటుంటే ఏం చేస్తారు? సిమెంటు దగ్గర నుంచి స్టీలు, కిటికీ తలుపుల వరకు నాణ్యమైన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. బేరమాడి తక్కువ ధరకే ఇంటి నిర్మాణ పనులకు అంగీకరించిన మేస్త్రీకే వాటిని అప్పగిస్తారు. ఎందుకంటే అప్పు తీసుకుని ఇంటిని నిర్మిస్తున్నారు కాబట్టి. తీసుకున్న అప్పులో ఒక్క రూపాయి వృథా అయినా అది భారంగా మారుతుంది కాబట్టి. ఎవరైనా సరే ఇలానే చేస్తారు. కానీ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. అప్పుగా తెచ్చిన సొమ్ములోంచి.. ‘మీకింత.. మాకింత’ అంటూ కమీషన్లు దండుకునేందుకు రాజధాని రహదారుల పనుల్లో బరితెగించి అంచనాలు పెంచడం విస్తుగొలుపుతోంది. సాక్షి, అమరావతి: దేశంలో ఒక కిలోమీటర్ పొడవున ఆరు లేన్ (ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు) జాతీయ రహదారిని సగటున రూ.20–22 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తోంది. అదీ.. అన్ని రకాల పన్నులు అంటే జీఎస్టీ, నాక్ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీతో కలిపి. కానీ.. రాజధాని అమరావతిలో అదే ఆరు లేన్లతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలి పోయిన పనులకు కిలోమీటర్కు గరిష్టంగా రూ.53.88 కోట్లు.. కనిష్టంగా రూ.24.88 కోట్లను కాంట్రాక్టు విలువగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజీ పన్నులను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. వీటిని పరిశీలిస్తే ప్రధాన రహదారుల పనులను.. అదీ మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని కిలోమీటర్కు గరిష్టంగా రూ.31.88 కోట్లు, కనిష్టంగా రూ.24.88 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. రాజధాని ప్రాంతంలో చేపట్టిన 11 ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.3,405.57 కోట్ల వ్యయంతో వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలకే పనులు దక్కేలా ఆ నోటిఫికేషన్లో నిబంధనలు పెట్టారని కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో.. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే సగటున 4 నుంచి 5 శాతం అధిక ధరలకు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించి.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకున్న రుణం నుంచి కాంట్రాక్టు విలువలో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి, వాటినే కమీషన్ల రూపంలో వసూలు చేసుకోవడానికి ముఖ్య నేతలు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకున్న రుణాన్ని కాంట్రాక్టు సంస్థలతో కలిసి దోచుకుంటుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు, అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంచనాల్లో గోల్మాల్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి ప్రభుత్వం రూ.15 వేల కోట్లు రుణంగా తీసుకుంది. రాజధాని అమరావతిలో 11 ప్రధాన రహదారుల పనులను ఏడీసీఎల్ చేపట్టింది. ప్రధాన రహదారుల్లో మిగిలిపోయిన పనులకు ఈ నెల 4, 9న టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు ఖరారు చేసి, పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించనుంది. ఆరు లేన్లు.. ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు(ఒక్క ఈ–3 రహదారి మాత్రమే ఒక్కో వైపు 60 మీటర్లు వెడల్పు)తో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులకు అంచనా వ్యయాలను ఖరారు చేయడంలో భారీ ఎత్తున గోల్మాల్ జరిగినట్లు ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రధాన రహదారులతోపాటు వరద నీటిని ఒడిసి పట్టడానికి, తాగునీటి సరఫరాకు, మురుగు నీటిని తరలించడానికి, భూగర్భ విద్యుత్ సరఫరా.. పంపిణీ, ఆర్సీసీ డక్ట్.. 220/33 కేవీ, 415 కేవీ విద్యుత్ తీగల ఏర్పాటుకు హెచ్డీపీఈ పైపు లైన్, ఆఫ్టికల్ పైబర్ కేబుల్కు, హెచ్డీపీ పైపు లైన్, సైకిల్ ట్రాక్, రహదారికి ఇరు వైపులా చెట్లు నాటడం తదితర పనుల్లో ఒక్క విద్యుత్ సరఫరా మినహా తక్కినవన్నీ ఇదే రీతిలో చేపడుతోంది.వాస్తవానికి ఎన్హెచ్ఏఐ.. జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి అన్ని రకాల పన్నులతో కలిపి ఆరు లేన్ జాతీయ రహదారి (సరీ్వసు రోడ్లతో కలిపి) నిర్మాణానికి కిలోమీటరుకు సగటున రూ.20–22 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ లెక్కన.. రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ వ్యయం అంతకన్నా పెరగడానికి వీల్లేదు. ఎందుకంటే జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి పన్నులను అదనంగా కాంట్రాక్టు సంస్థకు రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ నిబంధన పెట్టింది కాబట్టి. ఆ పన్నుల విలువతో భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థ, సైకిల్ ట్రాక్ తదితరాలను నిరి్మంచవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కానీ గరిష్టంగా రూ.53.88 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంస్థలకే పనులు! ప్రధాన రహదారుల్లో మిగిలి పోయిన పనులకు సంబంధించి అంచనాల దశలోనే పలు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ముఖ్య నేతలు బేరసారాలు జరిపారనే చర్చ అప్పట్లో సాగింది. నాలుగు సంస్థలు అడిగిన మేరకు కమీషన్లు ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఏడీసీఎల్ అధికార వర్గాలకు ముఖ్య నేతలు నిర్దేశించినట్లు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు 11 రహదారుల పనుల టెండర్లలో ఒక్కో టెండర్లో నాలుగింటిలో మూడు సంస్థలు షెడ్యూలు దాఖలు చేసేలా.. కనిష్టంగా 4 నుంచి 5 శాతం అధిక ధరకు కోట్ చేసేలా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. షెడ్యూలు దాఖలుకు తుది గడువు ముగిశాక, ఆరి్థక బిడ్ను తెరిచి కనిష్టంగా కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకే పనులు అప్పగించడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. -
స్కామ్ల పరం.. అమరావతి పురం!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం ముసుగులో అమరావతిని కూటమి ప్రభుత్వం కుంభకోణాల మయంగా మార్చేస్తోంది. అడుగడుగునా కమీషన్ల దందాతో ఖజానాకు చిల్లు పెడుతూ అమరావతిని అక్రమాల పురంగా తీర్చిదిద్దుతోంది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచేసిన ప్రభుత్వం ఆ భారాన్ని ఇప్పటికే అడ్వాన్సు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారిపై మోపితే వ్యతిరేకత వస్తుందని పసిగట్టి దాన్ని రాష్ట్ర ఖజానా నుంచే సర్దుబాటు చేస్తోంది. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టి, వాటినే కమీషన్లు రూపంలో వసూలు చేసుకునేందుకు ‘ముఖ్య’నేత చక్రం తిప్పినట్లు స్పష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారం ఎత్తి చేపట్టిన హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు టెండర్లలో భారీ ఎత్తున జరిగిన అక్రమాలను గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు బహిర్గతం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ రెండింటి డిజైన్లు, నిర్మాణ రీతి, సౌకర్యాలు ఒకటే అయినా హ్యాపీ నెస్ట్ నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.2,500కిపైగా అదనంగా ఉండటమే అక్రమాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు.షెడ్యూళ్లకు 8వ తేదీ తుది గడువుఅమరావతిలో 2018లో నాటి టీడీపీ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. నేలపాడు వద్ద 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తుల్లో 1,200 ప్లాట్లతో హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నారైలు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజల నుంచి అడ్వాన్సులు సేకరించింది. హ్యాపీ నెస్ట్ పనులను అప్పట్లో రూ.658 కోట్లకు సీఆర్డీఏ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. అయితే అది ముందుకు కదల్లేదు. ఇప్పుడు అదే ప్రాజెక్టును టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టింది. గత టెండర్ను రద్దు చేసింది. తాజాగా రూ.818.03 కోట్ల వ్యయంతో 24 నెలల్లో పూర్తి చేయాలని గడువు నిర్దేశించింది. మూడేళ్ల పాటు నిర్వహించాలనే నిబంధనతో ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో టెండర్లు పిలిచింది. టెండర్ల షెడ్యూళ్ల దాఖలుకు ఈనెల 8వ తేదీని తుది గడువుగా పేర్కొంది. అదే రోజు టెక్నికల్ బిడ్ తెరుస్తారు. ఆర్థిక బిడ్లను పదో తేదిన తెరిచి తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించే దిశగా సీఆర్డీఏ అడుగులు వేస్తోంది. జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ లాంటి పన్నులు రూ.153.05 కోట్లు రీయింబర్స్మెంట్ చేస్తామని పేర్కొంది. షీర్ వాల్ టెక్నాలజీతో అల్యూమినియం ప్రేమ్వర్క్, పోడియం, ఆర్కిటెక్చరల్ ఫినిషెస్.. బయట, లోపల విద్యుదీకరణ, ఎల్పీజీ లాంటి సౌకర్యాలతో హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లను నిర్మించాలని టెండర్లలో పేర్కొంది. తగ్గిన ధరలు.. అంచనాల్లో వంచనహ్యాపి నెస్ట్ ప్రాజెక్టుకు 2018లో తెరతీసిన ప్రభుత్వం.. అప్పట్లో పనులను కాంట్రాక్టర్కు రూ.658 కోట్లకు అప్పగించింది. కానీ.. ఆ ప్రాజెక్టు అప్పట్లో ముందుకు కదల్లేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. భవన నిర్మాణాల్లో వినియోగించే స్టీల్, సిమెంట్, కంకర తదితరాలతోపాటు విద్యుత్, శానిటరీ ఉపకరణాల దగ్గర నుంచి లిఫ్ట్ల వరకూ గతంతో పోలిస్తే ధరలలో పెద్దగా వ్యత్యాసం లేదు. నిజానికి 2018తో పోలిస్తే కొన్నిటి ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. ఇక ఇసుక పూర్తి ఉచితమని ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి ఆస్కారమే ఉండదని ప్రముఖ బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. అలాంటిది హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.818.03 కోట్లుగా నిర్ణయించి తాజాగా సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, రూ.153.05 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్మెంట్ చేస్తామని పేర్కొనడంపై బిల్డర్లు విస్తుపోతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.971.08 కోట్లకు చేరుతోంది. ప్రాజెక్టులో మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చ.అ. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణానికి రూ.4,511.76 చొప్పున వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన డిజైన్ కంటే మరిన్ని అధునాతన సదుపాయాలతో నిర్మాణం చేపట్టినా చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపినా రూ.1,800 నుంచి రూ.2వేల లోపే నిర్మాణ వ్యయం అవుతుందని బిల్డర్లు చెబుతున్నారు. ప్రాజెక్టు అంచనాల్లో భారీగా అక్రమాలు జరిగాయని పేర్కొంటున్నారు.అక్రమాలు ఇలా బహిర్గతం..హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ రీతిలోనే.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో గెజిటెడ్ ఆఫీసర్లకు టైప్–1, టైప్–2 విధానంలో జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.492.04 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు మొత్తం నిర్మిత ప్రాంతం 27,24,080 చ.అ. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1,806.29 అవుతుంది. ఇక సీనరేజీ, ఎన్ఏసీ, జీఎస్టీ పన్నుల రూపంలో రూ.93.2 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. ఇవన్నీ కలిపినా గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.2,148.45 దాటదు. దీన్ని బట్టి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు సీఆర్డీఏ పిలిచిన టెండర్ల సాక్షిగా బట్టబయలైందని బిల్డర్లు చెబుతున్నారు.సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో అక్రమాలు⇒ రాజధాని అమరావతిలో గెజిటెడ్ ఆఫీసర్ల కోసం జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.492.04 కోట్లతో సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1,806.29 మాత్రమే. ఇక హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ మాత్రం నిర్మాణ వ్యయం ఏకంగా చ.అ.కు రూ.4,511.76 చొప్పున నిర్దేశించారు. నిజానికి అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గాల్సింది పోయి ఇక్కడ అమాంతం పెరిగిపోయింది. హ్యాపీ నెస్ట్.. గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు.. ఇవి రెండూ షీర్ వాల్ టెక్నాలజీతోనే నిర్మాణాలు చేపడతారు. వాటి డిజైన్లు, నిర్మాణ రీతి, సౌకర్యాలు ఒకటే. కానీ నిర్మాణ వ్యయం మాత్రం వేర్వేరు.⇒ అధునాతన సదుపాయాలు, నాణ్యమైన నిర్మాణ సామగ్రి వినియోగించి కట్టే బహుళ అంతస్తుల భవనాల్లోనూ (టవర్స్) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని (జీఎస్టీ, సీనరేజీ లాంటి అన్ని పన్నులతో కలిపి) విజయవాడ–గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన పేరు మోసిన బిల్డర్లు చెబుతున్నారు. కానీ.. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి రాజధాని అమరావతిలో చేపట్టిన హ్యాపి నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులో మాత్రం చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఏకంగా రూ.4,511.76 ఉంది. దీన్ని బట్టి ఒక్కో చ.అడుగుకు రూ.2,500కిపైగా అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు.⇒ రెండు మూడు సంస్థలు జాయింట్ వెంచర్(జేవీ)గా ఏర్పడి షెడ్యూలు దాఖలు చేయడానికి వీల్లేదని హ్యాపీనెస్ట్ టెండర్ నోటిఫికేషన్లో సీఆర్డీఏ నిబంధన విధించింది. కానీ ఆ ప్రాజెక్టు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 25 శాతం పనులను సబ్ కాంట్రాక్టు కింద అప్పగించే వెసులుబాటు కల్పించింది. దీన్ని బట్టి ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్టు సంస్థకు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును అధిక ధరలకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునే వ్యూహంతో ‘ముఖ్య’నేత చక్రం తిప్పినట్లు వెల్లడవుతోంది. -
నీటిలో తేలియాడే రాజధానా?
వెనుకబడిన ప్రాంతాల ఆకాంక్షలు నెరవేరినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్లు. అలా కాకుంటే ప్రాంతాల మధ్య అసమా నతలు పెరిగిపోతాయి. అంటే పేదరికం, నిరుద్యోగం ప్రబలడం, పెత్తందారులు, బలవంతులు పేట్రేగిపోవడంజరుగు తుంది. దాని ఫలితంగా తీవ్రవాదం వైపు పీడితులు ఆకర్షితులు అవుతారు. అత్యంత వెనుకబడిన 1.59 కోట్ల జనాభా కలిగిన రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇచ్చి సమా నాభివృద్ధి సాధించామని శాసనసభలో చెప్పడం సరికాదు. విభజన చట్టంలో పొందుపరచిన ఎయిమ్స్, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ,బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, హార్టికల్చర్ హబ్, హైకోర్టు, లా యూనివర్సిటీ, లా అకాడమీ, కియా లాంటి పరిశ్రమల ఏర్పాటుతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం వల్లనే రాయ లసీమ అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం తదితర చర్యల ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికీ కృషి చేయాలి.అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఉమ్మడి సంప దను అన్ని ప్రాంతాలవారికీ సమానంగా పంచడం. అది భిక్ష కాదు. అభివృద్ధి ఫలాలు పొందడం ప్రతి పౌరుని హక్కు. ఇప్పటికే ఏడాదికి మూడు పంటలు పండుతూ అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన అమరావతి నిర్మాణానికి ఐదేళ్లలో 50 వేల కోట్లు ఖర్చు పెట్ట పూను కోవడం ఏ పాటి వికేంద్రీకరణో, ఎటువంటి న్యాయమో పాలకులే చెప్పాలి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని మేధావులు చెప్పినా వినకుండా ఒక వర్గం, కేవలం 29 గ్రామాల ప్రాంత ప్రయో జనాల కోసమే లక్ష కోట్లు ఖర్చు పెడతామని టీడీపీ ప్రభుత్వం అనడం సమంజసమేనా? 2014 నుండి 2019 వరకు 5,000 కోట్లు తాత్కాలిక నిర్మా ణాల కోసం చేసిన ఖర్చు నీటిపాలు అయ్యింది. నేడు మరలా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల నుంచి 15 వేల కోట్లు, హడ్కో నుంచి 12 వేల కోట్లు, ఇతర సంస్థల నుండి రుణాలు, బాండ్ల ద్వారా 23 వేల కోట్లు... మొత్తం 50 వేల కోట్లు అప్పులు చేసి, ఐదేళ్లలో ఖర్చు పెట్టాలని ప్రభుత్వం పూనుకుంది. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు అనగా ఐదు నెలల కాలంలోనే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి బడ్జెట్లో నిధులు కేటా యించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ష్యూరిటీతో ఏడీబీ ద్వారా తీసుకుంటున్న 15 వేల కోట్ల రూపాయలలో కేవలం అమరావతి రక్షణ చర్య లకే... అంటే కొండవీటి వాగు, బుడమేరు వంక నీటి మళ్లింపు కాలువలు; కృష్ణా నది కరకట్ట, వివిధ రిజర్వాయర్ల నిర్మాణం, డైవర్షన్, డ్రైనేజీ కెనాల్స్, లిఫ్ట్ స్కీములకే రూ. 8000 కోట్లు ఖర్చు చేయాలని... అప్పు ఇచ్చే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిర్మాణ ప్రాంతాన్ని పడవలలో ప్రయాణం చేసి తనిఖీ చేసిన తర్వాత నిర్ణయించడాన్ని బట్టి అది ‘నేల మీద నిర్మించే రాజధాని కాదు, నీటి మీద నిర్మించే తేలియాడే (ఫ్లోటింగ్) రాజధాని’ అని అర్థమయిపోతుంది. రాష్ట్రంలో సువిశా లమైన భూములు ఉండి కూడా తేలి యాడే రాజధాని నగరాన్ని నిర్మించడం వెర్రితనం.కాబట్టి టెక్నాలజీకి మేమే ఆదిగురువులమని చెప్పుకునే కూటమి నాయకులు శాస్త్రీయ పద్ధతులలో ఆలో చన చేసి అమరావతిలో శాసనసభ,సచి వాలయం నిర్మాణాలకు పరిమిత మైతే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ఉండే విశాఖపట్నం, తిరుపతి, కర్నూల్, అనంతపురం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్ది, ఆదాయ వనరులుగా మార్చుకోవాలి. అప్పుడే సంపద సృష్టికి వీలుంటుంది. లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు చెబుతున్న 2047 విజన్ సాకారం కాక పోగా, రాష్ట్రం అప్పులపాలై తాకట్టు పెట్టే పరిస్థి తులు తప్పవు, తస్మాత్ జాగ్రత్త!– కె.వి. రమణ ‘ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
ఏపీ కూటమి: ఉత్తరాంధ్రలో ఒకలా.. బెజవాడలో మరోలా!
సాక్షి, అమరావతి: ఏ ఎండకు ఆ గొడుగు!.. ఏ రోటికాడ ఆ రోటి పాట! ఏరు దాటాక తెప్ప తగలేయడమే తన ఆనవాయితీ అని టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మరోసారి విస్పష్టంగా చెప్పింది! ప్రజాక్షేత్రంలో మరోసారి ఘోర పరాజయం ఖాయమని నిర్ధారణకు రావడంతో ఉనికి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కో డ్రామాలాడుతోంది. రాజధానిపై బుధవారం దినపత్రికల్లో కూటమి ఇచ్చిన ప్రకటనలే ఇందుకు తార్కాణం. ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందేందుకు రాజధానిపై ప్రాంతాల వారీగా రెండు రకాల ప్రకటనలు ఇచ్చే స్థాయికి దిగజారింది. సాధ్యం కాదన్న బాలయ్య అల్లుడువిశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్ ఓట్ల కోసం విశాఖే రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కాదని స్పష్టం చేస్తూ.. అమరావతిని అభివృద్ధి చేయాలంటే చాలా పెట్టుబడి అవసరమని ఓ ప్రైవేట్ చానల్కు ఇచ్చిన ఇండర్వ్యూలో భరత్ తేల్చి చెప్పారు. అన్ని డబ్బులు వెచ్చించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. అదే విశాఖ అయితే వేగంగా అభివృద్ధి చెందుతుందని, గ్రోత్ ఇంజన్ ఏమిటనేది చూడాలని వ్యాఖ్యానించారు. గ్రోత్ ఇంజన్ విశాఖతో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందంటూ ఓట్ల కోసం రెండు నాలుకల ధోరణితో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రూ.వేల కోట్లు పెట్టుబడి పెట్టే స్థితిలో లేదని భరత్ చెప్పారు. అమరావతి అనేది 20 సంవత్సరాల తరువాత మాట అని, అదే విశాఖ మనకు వెంటనే గ్రోత్ ఇంజన్ లాంటిదని బాలకృష్ణ అల్లుడు భరత్ తెలిపారు. టీడీపీతో పాటు బీజేపీ, పవన్ అమరావతే రాజధాని అని చెబుతుండగా విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్ మాత్రం విశాఖ రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొనటాన్ని బట్టి కూటమి లక్ష్యం ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందడమేనని స్పష్టమవుతోంది. రెండు ప్రాంతాలు.. రెండు నాలుకలు!తాజాగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా విజయవాడ, విశాఖ ఎడిషన్లలో ఆయా ప్రాంతాల ప్రజలను మభ్యపుచ్చేలా కూటమి వేర్వేరు ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఈమేరకు విజయవాడ, విశాఖలో ఈనాడు, హిందూ దినపత్రికల తొలి పేజీల్లో కూటమి ప్రచార ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ప్రధాని మోదీతో పాటు బాబు, పవన్ ఫొటోలున్నాయి. విజయవాడ ఎడిషన్లో మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి అంటూ పత్రికల్లో ప్రకటన ఇవ్వగా విశాఖలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికాసం కోసం అంటూ ముగ్గురి ఫొటోలతో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఓ విధానం లేకుండా..జాతీయస్థాయిలో ఎనీడీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న పార్టీలు రాజధాని విషయంలో ఒక విధానం లేకుండా ప్రాంతానికో రకంగా వ్యవహరించడం అంటే ఓటర్లను మోసం చేయడమేనని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓటమి భయంతోనే ప్రాంతాలవారీగా మభ్యపెడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతిని రాజధాని చేయాలంటే రూ.లక్షల కోట్లు అవసరమని, అంత ఖర్చు చేసినా చాలా ఏళ్లు పడుతుందని తొలి నుంచీ వైఎస్సార్సీపీ వాస్తవిక దృక్పథంతో చెబుతోంది. అదే విషయాన్ని ఇప్పుడు ఓట్ల కోసం భరత్ వల్లె వేయడం గమనార్హం. రాజధాని అమరావతి సాధ్యం కాదని పేర్కొనడం విశేషం. రాష్ట్రంలో విజయవాడ భాగమైనప్పటికీ ఉత్తరాంధ్ర ఎడిషన్లలో మాత్రం అమరావతి ప్రస్తావన లేకుండా ప్రచార ప్రకటనలు జారీ చేయటాన్ని బట్టి ఇదంతా ఓట్ల రాజకీయమేనని స్పష్టమవుతోంది. -
గ్రాఫిక్స్తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా?: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రానికి మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేడని మాజి మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.. రాజధాని రైతులు ఏ త్యాగం చేశారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో సీఎం జగన్కు తెలుసు. ఏ రాజధానిలోనైనా 150 ఎకరాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలుంటాయి. మిగిలిన 99 శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి. 33 వేల ఎకరాలు తీసుకున్న బాబు.. పిట్టలదొర కబుర్లు చేబుతున్నాడు. గ్రాఫిక్స్తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా? అని మండిపడ్డారు. దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.. ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి. రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప. మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్కత్తా ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా?. రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా?. దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా?. ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు. 25 లక్షల జనాభా, పోర్టు, అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే మహానగరంగా అయ్యి తీరుతుంది. ... వైజాగ్ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే, వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు. సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు, 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు. కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం. నేనైతే సంపద సృష్టించే వాడిని, సీఎం జగన్కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు. సీఎం జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా.. ఓ సక్సెస్ఫుల్ బిజినెస్మాన్. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్’అని కొడాలి అన్నారు. -
అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పు కేసు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులో అక్రమాల కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి నారాయణ సహకరించపోతే బెయిల్ రద్దు చేయాలని తమను ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ముందస్తు బెయిల్ తీర్పుతో దర్యాప్తుపై ప్రభావం పడకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. మాస్టర్ ప్లాన్ మార్పు కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ కేసుపై జస్టిస్, గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం విచారణ జరిపింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మౌఖిక ఆదేశాలతో మార్చారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. నారాయణ తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారన్నారు. తీవ్రమైన ఆర్థిక నేర కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. చదవండి: రామోజీరావుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు -
Amaravati: ఇదీ.. అమరావతి రాజధాని అసలు కథ
సాక్షి, విజయవాడ: ఈ ఫోటోలు చూశారా? అమరావతికి అన్యాయమంటూ చంద్రబాబు చెప్పినప్పుడు గానీ, ఆయన అనుకూల మీడియా గానీ ఇలాంటి ఫోటోలు ఎప్పుడూ ప్రచురించవు. ఇప్పటిదాకా అక్కడ నిర్మించిన హైకోర్టు భవనమో, సచివాలయ, అసెంబ్లీ భవనాలనో మాత్రమే చూపిస్తాయి. కానీ ఇక్కడి ప్లాను గానీ, కట్టడాలు గానీ ఎంత దారుణమో తొలి చినుకుకే చిల్లులు పడ్డ అసెంబ్లీ భవనం, పైకప్పు నుంచి నీళ్లు కారే సచివాలయ ఛాంబర్లు చెప్పేశాయి. ఇక అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో వర్షం పడ్డ ప్రతిసారీ కళ్లకు కడుతూనే ఉంటుంది. తాజాగా మూడు రోజుల కిందటి వరకూ వర్షాలు పడ్డాయి. అప్పట్లో అక్కడికి వెళ్లే పరిస్థితే లేదు. మూడు రోజుల తరవాత మంగళవారం అక్కడి పరిస్థితికి అద్దం పట్టే చిత్రాలివిగో... ఇది చెరువు కాదు. పొలమూ కాదు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్లే 100 అడుగుల రోడ్డు.. వర్షం పడ్డ మూడు రోజుల తరవాత కూడా నడుంలోతు నీళ్లలో మునిగే స్థితిలో ఉందీ రోడ్డు. వాహనాల సంగతి సరే. కనీసం నడిచి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇది రాజధాని కోర్ ఏరియాలోని నీరుకొండ గ్రామం. రోడ్డుకు అటూ ఇటూ ఉన్నవి ప్రస్తుతానికి పొలాలు. వివిధ నిర్మాణాలు రావాల్సిన స్థలాలవి. కానీ అవి చెరువుల్ని మించిపోయాయి. ఆ రోడ్డుపై వెళ్లటమే దుస్సాధ్యంగా మారిందిప్పుడు. నీరు కొండ గ్రామంలో అటూ ఇటూ ఉన్నవారు మెయిన్ రోడ్డుకు చేరుకునే ప్రాంతం మొత్తం చెరువును మించిపోయింది. దాంతో రోడ్డుమీదకు రావటానికి ఇలా పాట్లు పడక తప్పటం లేదు. (క్లిక్ చేయండి: అమరావతి యాత్రలో.. ప్రాణం కాపాడిన పోలీస్) -
‘చందాలు దండుకునేందుకే అమరావతి పేరుతో యాత్రలు’
తాడికొండ: అమరావతి పేరుతో చందాలు దండుకునేందుకు కులవాదులు యాత్రలు చేయడం సిగ్గుచేటని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 689వ రోజు రిలే నిరాహార దీక్షలకు బుధవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అవినీతిని కప్పిపెట్టి, ప్రజలను మభ్యపెట్టేందుకే రాష్ట్రంలోని ఓ సామాజికవర్గం ఈ పాదయాత్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు రాష్ట్రమంతా తిరిగి చందాలు వసూలు చేసుకుంటూ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉంటూ వీరు చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పేదల సమస్యలను పక్కన పెట్టిన రాజకీయ పార్టీలు అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతూ చంద్రబాబు అవినీతిని కాపాడేందుకు పాట్లు పడుతుండటాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఎల్లో మీడియాలో తమ ఉద్యమాన్ని చూపనప్పటికీ.. బహుజన హక్కుల కోసం పోరాడుతున్న తమకు, మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, బేతపూడి సాంబయ్య, బొలిమేర శ్యామ్యూల్, ఇంటూరి రాజు పలువురు దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: అమరావతిపై ‘డబ్బుల్’ గేమ్! -
రాజధానిపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
-
పెత్తందారీ పొలికేక
అన్నిభాషల్లో కూడా కొన్ని పదాలకు ఒక క్యారెక్టర్ స్థిర పడిపోయి ఉంటుంది. కొన్ని పదాల్లో హీరోయిజం కన బడుతుంది. కొన్ని పదాలు విలనిజాన్ని ప్రదర్శిస్తాయి. మరికొన్ని మాటల్లో శక్తిమంతుడైన ఒక సాఫ్ట్ విలన్ కనిపిస్తాడు. ఇంగ్లీష్ మాట ‘హెజెమొనీ’ (Hegemony) దీనికి మంచి ఉదాహరణ. తెలుగులో దీనికి సమానార్థకంగా ‘ఆధిపత్యం’ అనే మాటను ఉపయోగిస్తున్నాం. ఆధిపత్యం శ్రుతిమించినపుడు కొండొకచో... పెత్తందారీతనం అనే మాటను కూడా ఆశ్రయిస్తున్నాం. అనేక దేశాలున్న ప్రపంచంలో కొన్ని దేశాల ఆధిపత్యం, భిన్న వర్గాలతో కూడిన సమాజంలో ఒకటి, రెండు వర్గాల ఆధిపత్యం సమ్మతమేనా? అటువంటి సమ్మతి స్వచ్ఛందంగా వస్తుందా? లేక కండబలంతో, కత్తులు కటార్లతో, తుపాకీ తూటాలతో సాధిస్తారా? ఆదియందు కండబలంతోనే ఆధిపత్యాన్ని ప్రోది చేసుకున్నప్పటికీ కాలక్రమంలో బుద్ధిబలం ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని తొలుత గుర్తించి సిద్ధాంతీకరించిన వ్యక్తి ఇటాలియన్ తత్త్వవేత్త ఆంటోనియో గ్రామ్సీ. యథేచ్ఛగా కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నప్పటికీ పశ్చిమ యూరప్ దేశాల్లో పెట్టుబడిదారీ విధానం స్థిరపడి పోవడానికి కారణాలను ఆయన అన్వేషించారు. ఆధిపత్య వర్గాలు ప్రవేశపెట్టిన నీతినియమాలు, సాంఘిక కట్టుబాట్లు, కథలూ, సామెతలు, సంప్రదాయాలన్నీ కలిసి ఒక ఆధిపత్య భావజాలం ఏర్పడుతుందని ఆయన గుర్తించారు. మనదేశంలో కర్మ సిద్ధాంతం ఈ భావజాలాన్ని బలంగా నిలబెట్టింది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ (కాపీరైట్: చంద్రబాబు) అనే వాక్యంలో ఎంత మహిళా విద్వేషం దాగి ఉన్నప్పటికీ చలామణి కావడానికి కారణం ఆధిపత్య భావజాల ప్రభావమే! ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ (కాపీరైట్: చంద్రబాబు) అనే వాక్యం సామాజిక ఉన్మాదంలోంచి దూసుకొచ్చింది. సమాజంలో ఉన్న ఆధిపత్య భావజాలం కారణంగా ఇటువంటి అమానుష వ్యాఖ్యానాలన్నీ నిర్లజ్జగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా ముందు కొచ్చిన కమ్యూనిస్టు, సోషలిస్టులు కూడా ఈ ఆధిపత్య భావజాలాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఆధిపత్య భావజాలం వల్ల అణచివేతకు గురవుతున్న వర్గాలు, ప్రాంతాల్లో ఒక చైతన్యం ప్రారంభమైంది. ఈ చైతన్యం అస్తిత్వ పోరాటాల రూపాన్ని, సాధికారత సాధన ఉద్యమాల రూపాన్ని తీసుకుంటున్నది. ఈ పరిణామాన్ని మనం ప్రపంచమంతటా చూడగలుగుతున్నాం. ఒకప్పటి మన ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పరిణామానికి అతీతం కాదు. తెలుగువారి ఆధునిక చరిత్రను రెండున్నర కోస్తా జిల్లాల ఆధిపత్య వర్గ ప్రయోజనం, దాని భావజాలం చాలాకాలంగా ప్రభావితం చేస్తున్నది. పత్రికలు, పుస్తకాల ప్రచురణ, సినిమాలతో మొదలైన సాంస్కృతిక ఆధిపత్యం మొత్తం మీడియాను గుప్పెట్లోకి తీసుకునే దాకా నిరాటంకంగా సాగిపోయింది, సాగుతూనే ఉన్నది. ఆ రెండున్నర జిల్లాల తెలుగు యాసనే వారు ప్రామాణిక భాషగా స్థిరపరిచారు. మిగిలిన ఇరవై జిల్లాల వారు అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి సమస్త గ్రంథాలు, పత్రికల ప్రచురణ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నది. సినిమాల్లో, నవలల్లో... పనివాళ్లకూ, కమెడియన్లకూ మాత్రమే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర యాస ఉండేది. వారితో మాట్లాడించి రెండున్నర జిల్లాల నాయికానాయకులు పడిపడి నవ్వేవారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర, హైదరాబాద్ పాతబస్తీలో, విశాఖ షిప్యార్డ్ సమీపంలో ఉండే దుర్మార్గులు, దుష్టులైన విలన్లకు రెండున్నర జిల్లాల కథానాయకులు తాట తీసే సన్నివేశాలను ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఒక వర్గపు ఆధిపత్య భావజాలం తెలుగునాట గజ్జెకట్టి నర్తించిన వైనాన్ని మొత్తంగా రాస్తే రామాయణ మంత! చెబితే భారతమంత!! అస్తిత్వ పోరాటాల యుగం ఇది. అణచివేతకు గురైనవారు సాధికారత శంఖం పూరిస్తున్న కాలం ఇది. ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా మొదలైన అస్తిత్వ పోరాటానికి రాజకీయ వేదిక తోడవటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం 1953–56 మధ్యకాలం నాటిది. ఈ సమయంలో రాష్ట్రానికి కర్నూలు రాజధాని. హైకోర్టు గుంటూరులో ఉండేది. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు అన్ని ప్రాంతాల నేతల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటైంది. ‘విశాలాంధ్ర’ అనే ఉమ్మడి ప్రయోజనం కోసం 1956లో రాజధాని హోదాను కర్నూలు త్యాగం చేసింది. ఇప్పుడు విశాలాంధ్ర రద్దయిన నేపథ్యంలో పూర్వపు ఆంధ్రరాష్ట్రం పునరుత్థానమైంది. తాను గతంలో త్యాగం చేసిన హోదాను ఇప్పుడు కర్నూలు డిమాండ్ చేస్తే తప్పెట్లా అవుతుంది? ఆధిపత్య భావజాలం ఇప్పుడు అమరావతి రూపంతో అస్తిత్వ పోరాటాలకు, సాధికారత ఉద్యమాలకు ఒక సవాల్ను విసురుతున్నది. న్యాయబద్ధంగా పూర్వపు రాజధాని హోదా దక్కవలసిన కర్నూలుకు న్యాయరాజధాని హోదాను కూడా ఇవ్వడానికి వీలులేదని వాదిస్తున్నది. ఎందుకు వీల్లేదో హేతుబద్ధంగా వివరించడానికి అది నిరాకరిస్తున్నది. రాయలసీమ ప్రాంత అస్తిత్వ గౌరవాన్నీ, ఆత్మగౌరవ ఆకాంక్షనూ అది తృణీకరిస్తున్నది. రాజధాని మొత్తం ఒకేచోట... అదీ అమరావతిలోనే ఉండాలనే వితండవాదాన్ని ముందుకు తెచ్చింది. ఈ ఆధిపత్య భావజాలం రాష్ట్రంలోని అన్ని జెండాలనూ ఏకం చేసింది. ఆధిపత్య వర్గాలకు జెండాలు ఎన్ని ఉన్నా ఎజెండా ఒక్కటేనని నిన్నటి తిరుపతి సభ నిర్ద్వంద్వంగా నిరూపించింది. కమ్యూనిస్టు నారాయణుడు, కాషాయ లక్ష్మీనారాయణుడూ చేతులు కలిపి భుజం, భుజం కలిపి నిలబడిన దృశ్యం భేష్. ఈ రాష్ట్రంలో అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, సాధికారత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది కష్టజీవుల కళ్లలో ఈ దృశ్యం ముద్రితమైంది. వారిక తుది నిర్ణయం తీసుకుంటారు. చిరకాలంగా మన మెదళ్లను ఆధిపత్య భావజాలం నియంత్రిస్తున్న కారణంగా, తన ప్రచార–ప్రసార సాధనాల ద్వారా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్న కారణంగా రాజధాని విషయంలో తటస్థ మేధావుల ‘సమ్మతి’ని తనకు అనుకూలంగా ‘ఉత్పత్తి’ చేసే కార్యక్రమాన్ని ఆధిపత్య వర్గాలు చేపట్టాయి. ‘మ్యాన్యుఫ్యాక్చరింగ్ కన్సెంట్– ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది మాస్ మీడియా’ పేరుతో సుప్రసిద్ధ అమెరికన్ మేధావి నోమ్ చోమ్స్కీ ఒక పుస్తకాన్నే రాశారు. ఇక్కడ మాస్ మీడియా ఉండేది... ఆధిపత్య వర్గం చేతుల్లోనే. తమకు అనుకూలమైన విధంగా ప్రజాభిప్రాయాన్ని మాస్ మీడియా ద్వారా ఎలా ఉత్పత్తి చేస్తారో చోమ్స్కీ ఈ పుస్తకంలో వివరించారు. ఆధిపత్య భావజాలాన్ని ప్రచారం చేసే మన మీడియా చోమ్స్కీ చెప్పిన పద్ధతులకు మరిన్ని ‘మెరుగులు’ దిద్ది, అధిక ‘ఉత్పత్తి’ని ఇప్పటికే సాధించింది. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి కదా! మూడు చోట్ల ఎందుకు? ఒక్కచోటనే ఉంచి ఒక మహానగరాన్ని నిర్మించి నట్లయితే రాష్ట్రానికి ప్రయోజనం కదా? చంద్రబాబుకు హైదరాబాద్ను అభివృద్ధి చేసిన అనుభవం ఉన్నది కదా? ఆ అనుభవంతో ఇక్కడా అటువంటి నగరాన్ని నిర్మించలేరా? ఇటువంటి అభిప్రాయాలను ఉత్పత్తి చేసి ప్రజల మెదళ్ళలో జొప్పించడానికి ఆధిపత్య వర్గాలు శాయశక్తులా ప్రయ త్నిస్తున్నాయి. తటస్థులూ, బుద్ధిజీవులు, ఉద్యోగ–వ్యాపార, మధ్యతరగతి ప్రజలందరూ ఇక్కడొక రెండు విషయాలను గమనంలోకి తీసుకోవాలి. మొదటిది కర్నూలులో న్యాయరాజధాని సంగతి. ఇది అస్తిత్వ పోరాటాల యుగమని ముందుగానే చెప్పుకున్నాం. వెనకబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతం తరఫున కర్నూలు పోటీలో నిలబడింది. గతంలో రాజధానిని త్యాగం చేసిన అనుభవంతో అర్హతల రీత్యా మొదటిస్థానంలో నిలబడి ఉన్నది. అటువంటి నగరానికి న్యాయ రాజధానినైనా కేటాయించకపోతే ఆ ప్రాంతంలో అసంతృప్తి రేకెత్తకుండా ఉంటుందా? ప్రాంతీయ ఆకాంక్షలను గుర్తించకుండా ఇప్పటికే భారీ మూల్యం చెల్లించిన సంగతిని విస్మరించడం సరైనదేనా? కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసినట్లయితే ఈ రాష్ట్రానికి వచ్చే నష్టమేమిటో సహేతుకంగా ఎవరైనా చెప్పగలరా? హైకోర్టును ఏర్పాటు చేయవచ్చును గానీ, న్యాయ రాజధానిగా చెప్పడానికి వీల్లేదని బీజేపీ మరొక వింత వాదన లేవదీసింది. అలా అనడం ఆ ప్రాంత ఆత్మగౌరవాన్ని కించపరచడం కాదా? ఇక రెండో విషయం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు గురించి! ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా అస్తిత్వ సమస్య వెన్నాడుతున్నది. తరతరాలుగా వివక్షకు గురవుతన్నామన్న ఆవేదన ఈ ప్రాంతానికి ఉన్నది. పైగా ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ. వివిధ భాషలు, సంస్కృతులు, మతాల ప్రజలు కలిసి జీవించే కాస్మోపాలిటన్ నగరం. అమరావతి ప్రాంతంలో ఉన్నట్టుగా ఇల్లు అద్దెకు కావాలని వచ్చేవారిని కులం అడిగే సంప్రదాయం ఇక్కడ లేదు. అన్ని వర్గాల ప్రజలనూ అక్కున చేర్చుకునే స్వభావం. కొంత రాజకీయ సంకల్పం తోడైతే చాలు, తూర్పుతీరంలో ఒక మహానగరంగా అవతరించడానికి అనేక భౌగోళిక అనుకూలతలు ఉన్న నగరం. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి కొంత ఫోకస్ పెడితే రెండు మూడేళ్ళలోనే రాష్ట్ర ఆర్థిక రంగానికి ఆలంబనగా నిలబడగల అభివృద్ధి ఇంజన్గా విశాఖ అవతరించగలదు. విశాఖతో పోలిస్తే ఆర్థికంగా అందుబాటులోకి రాగల అవకాశాలు అమరావతిలో మృగ్యం. రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మాణం కాలేదన్న నానుడిని గమనంలో ఉంచుకోవాలి. హైదరాబాద్ నగరానికి పునాది వేసినప్పుడు ఖులీ ఖుతుబ్షా, అల్లాను వేడుకున్నాడు. నీళ్లలో చేపల్ని కలిపినట్టు నగరం జన సమ్మర్దంతో నిండేలా చూసే భారాన్ని ఆయన అల్లా దయకే వదిలేశారు. భవనాలు నిర్మించినంత మాత్రాన జరిగేది ఏముండదనీ, జనం నివసించాలంటే అక్కడ ఉపాధి అవకాశాలు లభించే, ఆర్థిక కార్యక్రమాలు పెరగాలనే విచక్షణ గలవాడు కనుకనే ఖులీ... అల్లాను ప్రార్థించాడు. మలేషియాలో కొత్త రాజధానిగా పుత్రజయను నిర్మించినప్పటికీ ఆర్థిక భారాన్ని మోస్తున్నది ఇప్పటికీ కౌలాలంపూరే! హైకోర్టు ఒక చోట, అసెంబ్లీ మరోచోట ఉన్న రాష్ట్రాలు మనదేశంలోనే అరడజన్ దాకా ఉన్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. అస్తిత్వ సమస్యను పరిష్కరించడానికీ, ఆర్థిక చోదకశక్తిని తయారుచేసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత మూడు రాజధానులు అత్యావశ్యకం. హైదరాబాద్ను అభివృద్ధి చేసినట్టుగా చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తారనేది కూడా ఒక బోగస్ ప్రచారం. హైదరాబాద్ అభివృద్ధిని చంద్రబాబు ఖాతాలో వేయడం కూడా ఆధిపత్య వర్గాలు ‘ఉత్పత్తి’ చేసిన అభిప్రాయమే. హైదరాబాద్ వయసు 430 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచీ ఇది రాజధాని నగరమే. ప్రపంచంలోనే విలువైన వజ్రాలకూ, మేలి ముత్యాలకూ కేరాఫ్ అడ్రస్. కోహినూర్, జాకబ్ వజ్రాలను సానబట్టిన నగరం. దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినవాడు – హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందే డజన్కు పైగా భారీ ప్రభుత్వరంగ పరిశ్రమలు వెలసిన నగరం. మరో డజన్ రక్షణ, పరిశోధనా సంస్థలకు ఆవాసం. ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల కూడలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసింది కూడా వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో! ఔటర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ ఖరారు, భూసేకరణ, నిర్మాణం వైఎస్సార్ హయంలోనే జరిగాయి. అలైన్మెంట్ ఖరారు సమయంలోనే కదా ఎల్లోమీడియా మొఘల్ రాజశేఖర్ రెడ్డిపై కత్తి కట్టింది?. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్రోడ్డునూ, ఎయిర్పోర్టునూ చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జనాన్ని పిచ్చివాళ్ళను చేయగల సామర్థ్యం ఆధిపత్య భావజాలానికి ఉన్నదని వారి గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే వారు అమరావతి రూపంలో ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఇతర ప్రాంతాల అస్తిత్వ ఆకాంక్షలను అవహేళన చేస్తున్నారు. ఆ నమ్మకంతోనే నిరుపేదలకు, సామాన్యులకు, అమరావతిలో నివాసయోగ్యత లేదని న్యాయస్థానం దాకా వెళ్ళి అడ్డు కున్నారు. ఇప్పుడు ఆధిపత్య వర్గాల జెండాలన్నింటినీ ఏకం చేసి సామాన్య ప్రజల మీద వారి ఆకాంక్షల మీద యుద్ధాన్ని ప్రకటించారు. పెత్తందార్లంతా ఒక్కటై తిరుపతిలో పొలికేక పెట్టారు. సామాన్య ప్రజల సాధికార పోరాటశక్తిని వారు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక సామాన్య మహిళ కణ్ణగి శపిస్తేనే మదురై నగరం దగ్ధమైందని ప్రాచీన తమిళ కావ్యం ‘శిలప్పదికారం’ మనకు బోధిస్తున్నది. అరడజన్ జెండాలు చూసి మురిసిపోతే భంగపాటు తప్పదు. అటువైపు ఐదుకోట్ల జనం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘రాజకీయ లబ్ధికోసమే కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు’
గుంటూరు: అసమానతలు తలెత్తకూడదనే అభివృద్ధి వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు అభివృద్ధి ఫలాలు లభించాలనే లక్ష్యంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా విశాఖ, అమరావతి,కర్నూలు సహా.. రాష్ట్రంలోని అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మేకతోటి సుచరిత తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి -
అమరావతికి ఎంత ఖర్చుచేశారు?
సాక్షి, అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాల కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చుచేశారు.. నిర్మాణాలన్నింటినీ ఆపేయడం వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టం ఎంత.. తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టంచేసింది. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతోపాటు పలు ఇతర అభ్యర్థనలతో గతంలో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన త్రిసభ్య ధర్మాసనం, వాటిపై గురువారం మరోసారి విచారణ జరిపింది. నిర్మాణాలపై చేసిన వ్యయం ప్రజల డబ్బు అని.. అది దుర్వినియోగమైతే చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించింది. ఖజానాకు వాటిల్లిన నష్టానికి బాధ్యులెవరు.. దానిని ఎలా రాబట్టాలన్న విషయాలను తదుపరి విచారణల్లో తేలుస్తామని తేల్చిచెప్పి తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. రాజధాని తరలింపు వ్యవహారానికి సంబంధించిన అన్ని వ్యాజ్యాలను కూడా 14న విచారణకు రానున్న వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం.. వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై గతంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలూ విచారణకు రాగా, బిల్లులు చట్టాలుగా మారాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు నిరర్థకమని అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి తెలిపారు. అయితే, ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని 14న రానున్న వ్యాజ్యాలకు జతచేసింది. ఇలా మిగిలిన అన్ని వ్యాజ్యాలను కూడా 14వ తేదీ వ్యాజ్యాలకు జతచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే, నవరత్నాల ఇళ్ల పట్టాల వ్యాజ్యాలను మాత్రం వాటితో జతచేయలేదు. -
9వ రోజు రిలే దీక్షలు
-
రాజాధానిలో ధనవంతులు మాత్రమే ఉండాలా?
-
ఏపీ నష్టపోవాలన్నదే ఆయన ఆలోచన..!
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం కంటే పెన్షన్లు అదనంగానే ఇచ్చామని..7 లక్షల పింఛన్లు తొలగించామని టీడీపీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆరు లక్షలకు పైగా కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేశామని.. అనర్హుల జాబితా మరోసారి పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు ఇస్తామని వివరించారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. ఆయన కుతంత్రాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. ఏపీ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు కియా పరిశ్రమ తరలిపోతుందనే టీడీపీ నేతల దుష్ప్రచారం పై మంత్రి బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు కొత్త డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రోడ్డు మీద వెళ్లే వాళ్లకు సూటు,బూటు వేసి సమ్మిట్లు నిర్వహించారని.. రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా నష్టపోవాలన్నదే చంద్రబాబు ఆలోచన అని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఆయన దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టకూడదని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు అలా చెప్పటం దారుణం.. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అబద్ధాలు చెప్పటం దారుణమని.. మిలీనియం టవర్స్లో ఉన్న కంపెనీలను ఖాళీ చేయమని తాము నోటిసులు ఇవ్వలేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఎప్పుడైతే అసెంబ్లీ లో పెట్టామో... అప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. తదుపరి కార్యక్రమాలన్నీ అడ్మినిస్ట్రేషన్ లో అంతర భాగాలేనని వివరించారు. రాజ్యాంగ పరంగానే జీవో లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులను గౌరవిస్తూనే కార్యక్రమాలు చేపడుతున్నామని.. ఉద్యోగులకు సమస్యలు ఉంటే తమతో చర్చిస్తారని వెల్లడించారు. ప్రజలు అదే కోరుకుంటున్నారు.. ‘ప్రజలందరూ రాజధాని త్వరగా తరలించాలని కోరుకుంటున్నారు. కార్యాలయం ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వం ఇష్టం. గత ప్రభుత్వం నోటి మాట తో ముందుకు వెళ్ళింది. విజిలెన్స్ కార్యాలయం విజయవాడలో ఉండాలని చట్టం లో ఉందా?.. పరిపాలన సౌలభ్యం కోసమే విజిలెన్స్ కార్యాలయం తరలిస్తున్నామని’ బొత్స పేర్కొన్నారు. బలవంతపు భూ సేకరణ చేసిన భూములు వెనక్కి ఇవ్వమని రైతులు కోరారని.. రోడ్లు కింద పోయే భూములు వేరేచోట ఇవ్వమని రైతులు అడిగారని తెలిపారు. దీన్ని పరిశీలించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారని మంత్రి బొత్స వెల్లడించారు. (చదవండి: కియాపై మాయాజాలం) -
పగటి వేషగాడు చంద్రబాబు: కొడాలి నాని
సాక్షి, గుడివాడ: రాజధాని పేరిట రైతుల నుంచి భూములను లాక్కునేందుకు చంద్రబాబు తన ప్రభుత్వంలో పగటి వేషగాడిలా సొల్లు మాటలను చెబుతూ వచ్చారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) విమర్శించారు. ఆదివారం ఆయన డోకిపర్రులోని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కనుమూరి రామిరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు సాధ్యమైనంత వరకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి రాజధానిని నిర్మించే విషయంలో దొంగల లాగా బాబు ప్రవర్తించారని పేర్కొన్నారు. 33వేల ఎకరాలను రైతుల నుంచి కొల్లగొట్టేందుకే మాయ మాటలు చెప్పారన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా విధానం ఉందని కొడాలి నాని అన్నారు. షిప్ యార్డ్, రైలు, విమాన సౌకర్యాలు ఉన్న వైజాగ్ను ముంబాయిలా త్వరలో చూడనున్నామని అభిప్రాయపడ్డారు. రాయలసీమలో కోర్టులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. జీఎన్ రావు, బోస్టెన్ కమిటీలు ఇచ్చిన నివేదికలను బోగీ మంటల్లో వేయమని బాబు వ్యాఖ్యానించటం తగదన్నారు. ఆయన పాలనా విధానాలు నచ్చక రాష్ట్ర ప్రజలు బాబుకు బుద్ధి చెప్పిన మార్పు రాలేదని చెప్పారు. 74ఏళ్ల చరిత్ర కలిగిన బోస్టన్ కంపెనీ నివేదికను తప్పు బట్టే చంద్రబాబు ఎందుకు సింగపూర్ కంపెనీతో రూ.800కోట్లకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. కరెన్సీ నోట్లు మారినపుడు ఆ కంపెనీ నివేదికకు బాబు ఎందుకు తలొగ్గారని అడిగారు. చదవండి: బాబు చూపిన రాజధాని గ్రాఫిక్స్ సాధ్యం కాదు : కొడాలి నాని ఇప్పటికైనా పిట్టల దొరలా రాజధాని రైతులకు దొంగ మాటలు చెప్పవద్దని హితవు పలికారు. రాజధాని రైతులు తమ కోర్కెలతో తమ ప్రభుత్వాన్ని కలిస్తే జగన్ మేలు చేకూరుస్తారని చెప్పారు. అంతేగాని బాబు మాటలు నమ్మి ఇంకా మోస పోవద్దన్నారు. టీడీపీకి చెందిన సుజనా చౌదరి బ్యాంకులను లూటీ చేయటంతో ఎక్కడ జైల్లో వేస్తారోనని బీజేపీలోకి వెళ్లాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మెయిల్ డైరెక్టర్ పురిటిపాటి వీరారెడ్డి, కేడీసీసీబీ జిల్లా డైరెక్టర్ పడమటి సుజాత, వైఎస్సార్ సీపీ నేతలు కోగంటి ధనుంజయ, కనుమూరి రామిరెడ్డి, దుగ్గిరాల శేషుబాబు, అల్లూరి ఆంజనేయులు, కోటప్రోలు నాగు, శాయన రవి, బలుసు జితేంద్ర పాల్గొన్నారు. -
బాహుబలి కట్టడాలు కాదు..
సాక్షి, ఒంగోలు: రాష్ట్రానికి 30 ఏళ్లపాటు జగన్మోహన్రెడ్డే సీఎంగా ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్వీబీసీ చైర్మన్ బి.పృథ్వీరాజ్ అన్నారు. ఆదివారం ఒంగోలులో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి పరిస్థితులను కళ్లారా చూస్తే అక్కడ 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారో అర్థం అవుతుందన్నారు. సీఎం కాన్వాయ్ వెళుతుంటే దారి పొడవునా ఉండే పోలీసులకు కనీసం అత్యవసరం అయితే టాయిలెట్కు వెళ్లేందుకు కూడా సౌకర్యాలు లేవన్నారు. బాహుబలి కట్టడాలంటూ సింగపూర్ను తలపిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు కనీసం కార్లు పెట్టుకునేందుకు స్టాండ్లు సైతం లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చదవండి: పగటి వేషగాడు చంద్రబాబు: కొడాలి నాని రేకుల షెడ్లు నిర్మించి ఇంధ్రభవనాలను కట్టినట్లు ధర్నాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇప్పటివరకు కనీసం ఎలాంటి రాజకీయ సభలలోను పాల్గొనని భువనేశ్వరిని సైతం తీసుకువచ్చి ధర్నా చేపించడంతోపాటు చివరకు రెండు ప్లాటినం గాజులు అమరావతికి దానం చేసినట్లుగా పేర్కొనడం చూస్తుంటే రెండు గాజుల కథను తలపిస్తుందన్నారు. తాను తిరుపతి అలిపిరివద్ద రాష్ట్రవ్యాప్తంగా దర్శనానికి వచ్చే రైతులను పలకరిస్తే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భూమి పులకించిందని, మళ్లీ నేడు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు అండ్కోకు మాత్రం ఉక్రోషం, కడుపుమంట పెరిగిపోతున్నాయన్నారు. వేలాది ఎకరాలను ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేసి పేద రైతులను నిలువునా దగా చేసి నేడు రైతుల కోసం అంటూ ఉద్యమించడం దారుణం అన్నారు. అమరావతిలో ధర్నా చేస్తున్న వారిని చూస్తే ఆడి కార్లలో, ఖద్దరు దుస్తులు ధరించి చేతులకు బంగారు గాజులు ధరించి వస్తుంటే కార్పొరేట్ మాయాజాలం కాక, నిజమైన రైతులు చేస్తున్న ఉద్యమమేనా అని ప్రశ్నించారు. నిజంగా అమరావతి రాజధాని కావాలంటే దేశానికి రెండో రాజధాని కోసం కేంద్రం ఎదురుచూస్తుందని, అందుకు సంసిద్ధత వ్యక్తం చేయాలన్నారు. ఇందుకు అవసరమైతే తాను ఢిల్లీ వరకు పాదయాత్ర చేసేందుకు సైతం సిద్ధమన్నారు. కేవలం సామాజికవర్గ సామ్రాజ్యస్థాపన కోసం భూములు కొన్నారని, దేశ రెండో రాజధానికి సిద్ధపడితే బినామీల భూములకు నష్టం వాటిల్లుతుందనే భయమే వెనుకడుగుకు కారణం అంటూ విమర్శించారు. చెడు ప్రక్షాళన చేయడమే వైఎస్సార్ సీపీ లక్ష్యమన్నారు. గత ఐదేళ్లలో జనసేన ఎందుకు ప్రశ్నించలేదు? రైతుల మీద అంత ప్రేమే ఉంటే గత ఐదేళ్లలో రైతులను ఎందుకు పట్టించుకోలేదని జనసేన ఎందుకు ప్రశ్నించలేదని పృథ్వీ ప్రశ్నించారు. రైతులంటే అంత ప్రేమ ఉంటే కరకట్టమీద నివాసం ఉంటూ రోడ్లకోసం పచ్చనిపొలాలను నాశనం చేస్తున్నారంటూ రైతులు గగ్గోలు పెట్టినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. గగ్గోలు పెట్టడం తెలుగుదేశం, జనసేన నైజంగా మారిందని, మసిపూసి మారేడు కాయ చేయడం చంద్రబాబు సహజలక్షణం అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు అని, అంతే తప్ప లక్షకోట్లు ఒకేచోట పెడితే మిగితా ప్రాంతాల అభివృద్ధి మాటేంటన్నారు. లక్షకోట్లు ఖర్చుపెట్టాలనడమే తప్ప ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా ఎందుకు చేశారో ప్రజలు నిలదీయాలన్నారు. ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తారని, అంతే కాకుండా నాలుగైదు రోజుల్లో ప్రతి జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలు కూడా వెల్లడిచేస్తారన్నారు. ప్రకాశం ప్రగతి పథంలోకి తీసుకువెళ్లడానికి తీసుకుంటున్న చర్యలు కూడా ప్రకటిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్తోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను పర్యటిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, గోవర్ధన్రెడ్డి, దాట్ల యశ్వంత్వర్మ, తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి నుంచి రాజధాని మార్చనివ్వం
సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్/ మంగళగిరి: అమరావతి నుంచి రాజధానిని మార్వనివ్వబోమని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి మండలం యర్రబాలెం, తుళ్లూరు మండలం మందడంలో చేస్తున్న నిరసన ప్రదర్శనలకు చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి బుధవారం హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజధానిని మార్చాలని చూస్తే కాలి భస్మమవుతారని వ్యాఖ్యానించారు. రాజధాని వస్తుందంటే ప్రశాంత వాతావరణానికి ఎక్కడ భంగం వాటిల్లుతుందోనని విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. కులం పేరుతో రాజధాని మార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత తనదేనని, ఇక్కడ అలాంటి అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం వద్ద మొత్తం 55 వేల ఎకరాలున్నాయని, అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాత 10 వేల ఎకరాలు మిగులుతుందని పేర్కొన్నారు. వాటిని విక్రయించి ఆ డబ్బులతో రాజధానిని అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. నాతోనే సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనతోనే మైండ్ గేమ్ ఆడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని కోరారు. పాలన వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను తప్పుబట్టారు. జీఎన్ రావుకు ఏమీ తెలియదని, అలాంటి వ్యక్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా పాలనను వికేంద్రీకరించాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. తాను నిర్మించిన అసెంబ్లీలో జగన్ కూర్చొని తననే దూషిస్తున్నారన్నారు. సీఎంగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. జగన్ పాలనను చూసి పారిశ్రామికవేత్తలు భయపెడి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోతున్నారని చెప్పారు. విశాఖలో ఆదాన్ గ్రూప్, ప్రకాశం జిల్లాలో పేపరు పరిశ్రమ, తిరుపతిలో రిలయన్స్ పరిశ్రమలు ఇప్పటికే వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రాజధానిలో పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చే సమయంలో రోడ్లపై ఎవరూ ఉండకూడదా అని ప్రశ్నించారు. రైతులు గట్టిగా నిలబడితే జగన్ పులివెందులకు పారిపోతారన్నారు. రైతుల తరఫున ఎంతవరకైనా పోరాడతానని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. పోలీసులపై అక్కసు ‘పోలీసు అధికారులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. మీరు ఉద్యోగం వదిలి వెళ్లినా నా నుంచి తప్పించుకోలేర’ని చంద్రబాబు బెదిరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ కావాలనే తనను టార్గెట్ చేశారని, ఆయనను వదలమని హెచ్చరించారు. విరాళాలిచ్చి మరీ.. రాజధానిలో రైతులు చేస్తున్న పోరాటాలకు టీడీపీ తరఫున రూ.లక్ష విరాళం ఇస్తున్నట్లు మందడంలో ప్రకటించిన చంద్రబాబు.. యర్రబాలెంలో వ్యక్తిగతంగా రూ.50 వేల విరాళం ప్రకటించి తక్షణమే అందజేశారు. కృష్ణాయపాలెంలో మరో రూ.50 వేలను ఓ నాయకుడి తరపున ఇస్తున్నట్లు ప్రకటించారు. ముందెన్నడూ లేనివిధంగా ధర్నాలు, ఆందోళనలు చేయడానికి చంద్రబాబు విరాళాలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆందోళనల్ని ఉధృతం చేయాలని, దానికోసం ఎంత ఖర్చయినా పార్టీ నాయకులు భరిస్తారని చంద్రబాబు ప్రకటించడం స్థానికులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సందర్భంలో ఆయన సతీమణి భువనేశ్వరి సైతం తన వంతుగా బంగారు గాజులను విరాళంగా అందజేసి.. రాజధాని అమరావతి తరలిపోకుండా మరింత ధర్నాలు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. -
రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు. – జీవీఎల్ నరసింహారావు సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది. దీనికే కట్టుబడి ఉన్నాం. నేను అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా? పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్కల్యాణ్లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్పీఆర్ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
రాజధాని గ్రామాల్లో బంద్ ప్రశాంతం
సాక్షి, అమరావతి బ్యూరో: అభివృద్ధి వికేంద్రీకరణ దృష్ట్యా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొనడంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళన మొదలైంది. సీఎం తన ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల పరిధిలోని 29 గ్రామాల ప్రజలు గురువారం బంద్ నిర్వహించారు. ఉదయాన్నే రోడ్లమీదకు వచ్చి పాఠశాలలు, వ్యాపార సంస్థలు, బ్యాంకులను మూసివేయించారు. సచివాలయం, హైకోర్టుకు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. తుళ్లూరు, మందడంలో రైతులు రోడ్లపై బైఠాయించారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. బంద్ పాక్షికం రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో బంద్కు పిలుపునిచ్చినా, కొన్ని గ్రామాల్లో ప్రజలు బంద్కు మద్దతునివ్వలేదు. తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో బంద్ ప్రభావం కనిపించలేదు. మంగళగిరి పరిధిలోని యర్రబాలెం, నవలూరులోనూ బంద్ పాక్షికంగానే కొనసాగింది. తుళ్లూరు మండల పరిధిలోని వెంకటపాలెం, మందడం, తుళ్లూరులో మాత్రమే బంద్ సంపూర్ణంగా సాగింది. పాలన వికేంద్రీకరణపై రైతుల్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అమరావతిలో రాజధానిని టీడీపీ నాయకులు స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు తప్పితే సామాన్యులెవరూ లబ్ధి పొందలేదని వారు పేర్కొంటున్నారు. రాజధాని గ్రామాల్లో బంద్ నేపథ్యంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ను అమలు చేశారు. -
విమర్శలు ఆపి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి
-
ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్ క్యాపిటల్), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్ క్యాపిటల్) ఏర్పాటు చేసేందుకు వీలుందన్నారు. రాజధానిపై ప్రతిష్టాత్మక సంస్థలతో వేసిన కమిటీ నివేదిక రాగానే ఈ అంశాలపై చర్చించి పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధానిపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం ఈ మేరకు వివరించారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. రాజధాని ముసుగులో అంతా అవినీతే.. ‘గత ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలు, మోసాలు, కుట్రలను మంత్రులు, సభ్యులు వివరించారు. స్కామ్ల గురించి ఆర్థిక మంత్రి బుగ్గన స్లయిడ్స్ కూడా చూపించారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు కేవలం ఆరు నెలల కాలంలో 4,070 ఎకరాలను అప్పటి పాలకుల బినామీలు, బంధువులు ఏరకంగా తక్కువ రేటుకు కొన్నారు? ఎవరెవరు కొన్నారు? అనే అంశాలను పేర్లతో సహా ప్రదర్శించారు. రాజధాని పేరుతో జరిగిన స్కామ్లు, అన్యాయాలు, చట్టాల ఉల్లంఘనలను సభ్యులు ధర్మాన, గుడివాడ అమర్నాథ్, మంత్రులు బొత్స, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు ఆధారాలతో సహా వివరించారు. చంద్రబాబు.. రాజధాని అని ఒక ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అక్కడ ముందుగానే బినామీ పేర్లతో తక్కువ ధరతో భూములు కొన్నారు. తర్వాత అక్కడ రాజధాని అని ప్రకటించారు. ఆ తర్వాత ఆ భూముల రేట్లు పెంచుకునేందుకు ఏం చేశారో కూడా సభ్యులు వివరించారు. చదవండి: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలకు తావుండదు సాగు, తాగునీరు అందించడం ముఖ్యం కదా? ‘బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి.. తద్వారా రాయలసీమలోని బనకచర్లకు గోదావరి నీటిని తెచ్చే భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రూ.55 వేల నుంచి రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనాతో ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. ఈ ఏడాది భారీ వర్షాలు పడ్డా, వరదలు వచ్చినా రాయలసీమలో ప్రాజెక్టులు నిండలేదు. నీరు తీసుకెళ్లే కాలువల సామర్థ్యం సరిపోవడం లేదు. సహాయ పునరావాస ప్యాకేజీలు అమలు చేయలేదు. రాయలసీమలో ప్రాజెక్టుల కోసం రూ.23 వేల కోట్లు కావాలి. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరివ్వాలి. రాష్ట్రంలో తాగడానికి స్వచ్ఛమైన మంచినీరు లేని పరిస్థితి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా వల్ల నీరు కలుషితమైంది. బోర్లు వేస్తే ఉప్పు నీరు వస్తోంది. పోలవరం, ధవళేశ్వరం నుంచి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి, ప్రతి ఊరికి పైప్లైన్లు వేసి.. తాగు నీటిని తీసుకు రావాలంటే.. ఒక్కో జిల్లాకు రూ.4 వేల కోట్లు చొప్పున ఉభయ గోదావరి జిల్లాలకు రూ.8 వేల కోట్లు కావాలి. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా తాగు నీటి కోసం రూ.40 వేల కోట్లు కావాలి. స్కూళ్లు, ఆసుపత్రుల మాటేంటి? మరోవైపు నాడు–నేడు కార్యక్రమం కింద శిథిలావస్థలో ఉన్న స్కూళ్లు, ఆసుపత్రులు అభివృద్ధి చేస్తున్నాం. స్కూళ్లలో నీళ్లు, కరెంటు, ఫ్యాన్లు, ఫర్నీచర్ తదితర కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఆసుపత్రుల్లో సెల్ఫోన్ల లైట్లలో ఆపరేషన్లు చేస్తున్నారు. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయిన దుస్థితి. ఈ పరిస్థితిలో స్కూళ్ల బాగు కోసం రూ.14 వేల కోట్లు, ఆస్పత్రుల బాగు కోసం రూ.16 వేల కోట్లు కలిపి ‘నాడు – నేడు’కు రూ.30 వేల కోట్లు కావాలి. ఇన్ని కార్యక్రమాలకు మన దగ్గర డబ్బులున్నాయా? ఇవన్నీ కాదని రాజధాని కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయగలమా అని ఆలోచించాలి. ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి ఈ పరిస్థితుల్లో వేసే ప్రతి అడుగూ ఆలోచించి, ఆచితూచి వేయాల్సిన అవసరం ఉంది. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయి. మనమూ మారాలి. సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టు వికేంద్రీకరణ అనేది ఉత్తమ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ కు బహుశా మూడు క్యాపిటల్స్ వస్తాయేమో. ఇలా రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి ఆలోచనలు చేయడానికే పేరెన్నికగన్న నిపుణులతో, ప్రఖ్యాతి గాంచిన బీసీజీతో పాటు మరో కన్సల్టెన్సీని నియమించాం. ఈ సంస్థలు సుదీర్ఘంగా అన్ని విధాలా పరిశీలించి, పరిశోధించి నివేదిక వారం పది రోజుల్లో నివేదిక ఇవ్వనున్నాయి. అధికార వికేంద్రీకరణ దిశగా పలు సూచనలు, సలహాలు చేయనున్నాయి. నివేదిక ఫలానా విధంగా ఉండాలని మేమైతే చెప్పలేదు. ఈ నివేదికలు రాగానే పరిశీలించి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ అంశంలో స్పష్టత ఇచ్చినట్లే భావిస్తున్నా. ఇంత కంటే మంచి సలహా ఉంటే.. ఇస్తే తప్పకుండా తీసుకుంటాం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? రాజధానిలో కేవలం 20 కిలోమీటర్ల పరిధిలో కనీస మౌలిక సదుపాయాలకు రూ.1.09 లక్షల కోట్లు అవుతుందన్నది బాబు లెక్క. ఇలా నిర్మిస్తూ పోతే వడ్డీతో కలిపి ఇది రూ.3 లక్షల కోట్లో.. 4 లక్షల కోట్లో ఖర్చయ్యే పరిస్థితి ఉంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అయిదేళ్లలో రూ.5,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇందులో రాజధాని బాండ్ల పేరుతో 10.35 శాతం వడ్డీకి కూడా అప్పు తెచ్చారు. ఈ అప్పులకు ఏటా రూ.700 కోట్లు వడ్డీ చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు ఇన్నిన్ని వేల కోట్లు కావాలని లెక్కలున్నాయి. పలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో రాజధాని నిర్మాణం కోసం అంటూ లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎక్కడి నుంచి తేవాలి? ఈ పరిస్థితిలో రాజధానిలో కేవలం 20 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు, కరంటు లాంటి పనుల కోసం రూ.లక్ష ఖర్చు పెట్టడం అవసరమా? ►గత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని డిసైడ్ చేశారు. ఆయన (చంద్రబాబు)లెక్క ప్రకారం 53 వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే.. ఎకరాకు కనీస మౌలిక సదుపాయాల కోసం రూ.2 కోట్ల లెక్కన రూ.లక్షా ఆరు వేల కోట్లవుతుందని తేల్చారు. ఇది కనీస మౌలిక వసతుల ఏర్పాటుకు మాత్రమే. రాష్ట్రంలో ఇతరత్రా అభివృద్ధి పనులు, ఖర్చుల మాటేమిటి? ►రాజధాని కోసం లక్ష కోట్లకు పైగా ఎక్కడ నుంచి తేవాలి? అప్పు తెస్తే దానికి వడ్డీ ఎంత అవుతుంది? వడ్డీ అయినా కట్టే పరిస్థితిలో రాష్ట్రం ఉందా? నాకు కూడా రాజధాని కట్టాలనే ఉంది. కానీ లక్ష కోట్లు ఎక్కడ నుంచి తేవాలి? ఒకవేళ రూ. లక్ష కోట్లు తెచ్చినా దానిని ఎక్కడ ఖర్చు పెట్టాలని కూడా ఆలోచించాలి. ►ఈ పరిస్థితిలో వికేంద్రీకరణే మేలు. పెద్దగా ఖర్చు పెట్టకుండానే రాజధాని సమస్యలు కొలిక్కి వస్తాయి. విశాఖపట్నం ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన నగరం. అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా సరిపోతుంది. రోడ్లు కాస్త వెడల్పు చేసి, ఒక మెట్రో రైలు తీసుకొస్తే చాలు. అటు కర్నూల్లో జ్యుడిషియల్ క్యాపిటల్ ఉంటుంది. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే (అమరావతి) ఉంటుంది. – సీఎం వైఎస్ జగన్ చదవండి: పరిపాలనా రాజధానిగా విశాఖ సరైన నిర్ణయం -
ఏపీ రాజధానిలో మరో భూ కుంభకోణం
-
కాపిటల్ స్కామ్!
-
అర్థవంతమైన చర్చతోనే అసలైన రాజధాని
ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్లే వరద కన్నా పై నుంచి వచ్చే వరద ఎక్కువగా ఉన్నప్పుడు నీటి మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడం సహజం. ఈనాడు అదే జరిగి రాజధానిలో పల్లపు ప్రాంతాలు మునిగిపోయాయి. స్థల అనుకూలతను పరిగణలోకి తీసుకోకుండా అమరావతికి స్థల ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలు ఈ నిర్ణయం మోసపూరితంగా తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని గట్టిగా నమ్మారు. రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదు. ఆంగ్లో సాకసన్ దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికాలాంటి దేశాలలో రాజధాని ఏర్పాటు భిన్న వర్గాల మధ్య సర్దుబాటు రాజీ ఫలితంగా ఏర్పడింది. చివరకు నిర్ణయం ఏ రకంగా ఉన్నా, ఈ అంశంపై ఒక అర్థవంతమైన చర్చ అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈమధ్య కృష్ణానదిలో వచ్చిన వరదల తర్వాత రాజధాని ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలం సరి అయినదా కాదా అనే అంశంపై చర్చ మొదలైంది. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంతకన్నా పెద్ద వరద రాదనే నమ్మకం ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న భూ స్వభావాన్ని పట్టి ఇక్కడ నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ మధ్య వచ్చిన వరదలలో అధికంగా 9 లక్షల క్యూసెక్కుల దాకా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వదిలారు. 2009లో దాదాపు 11 లక్షల క్యూసెక్కుల దాకా ప్రవహించింది. ఇక మొన్నటి దాకా టీడీపీలో ఉన్న ఒక ముఖ్య నాయకుడు, ప్రస్తు్తతం బీజేపీ నాయకుడు అయిన టీజీ వెంకటేష్ రాష్ట్రానికి నాలుగు రాజధానులను నాలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేయటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వెంకటేష్ రాయలసీమకు చెందిన ఒక ముఖ్య నాయకుడు. సాధారణంగా రాయలసీమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడుతుంటారు. రాజధాని స్థల ఎంపికను గురించి నా పుస్తకం ‘ఎవరి రాజధాని అమరావతి‘ లో విపులంగా చర్చించా. అందులో ఒక అంశాన్ని ఉటంకిస్తున్నాను. ‘ముందుగా అనుకూలతను అధ్యయనం చేయకుండానే సర్వే చేయకుండానే రాజధాని స్థలాన్ని నిర్ధారణ చేసిన ఏకైక ప్రాంతంగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది‘. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ ఒక మహా నగర నిర్మాణ ప్రయత్నం ఆత్మహత్యా సదృశం అవుతుందని, అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెపుతూ రాజధాని వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన మార్గమని సూచించింది. ఈ సిఫార్సులను పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు ఆరంభించింది. ఆనాటి పురపాలక శాఖామాత్యులు నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల కమిటీ ఎటువంటి సిఫార్సులు ఇవ్వలేదు. ఈ రకంగా స్థల అనుకూలతను పరిగణనలోకి తీసుకోకుండా అమరావతికి స్థల ఎంపిక చేయడం జరిగింది. ఆనాటి పాకిస్తాన్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ దేశ రాజధానిని తన స్వస్థలమైన అబ్బోత్తాబాద్లో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. స్థల నిర్ధారణ సమయంలో ఆ ప్రాంతం భూకంపాల ప్రభావిత ప్రాంతంగా గుర్తించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించి ఇస్లామాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఎంపికకు కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగి వివిధ ప్రాంతాల మధ్య రాజీ మార్గంగా ఏకాభిప్రాయంతో ఆనాడు రాజధానిని కర్నూలులో, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి చర్చ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం లేకుండా వ్యూహాత్మకంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో రాజధాని నిర్మాణానికి అసెంబ్లీ ఆమోదం తీసుకొని ముందు అనుకున్న విధంగా కృష్ణా నది తీర ప్రాంతంలో బాబు గారు రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలు తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని గట్టిగా నమ్మారు. అందుకనే 52మంది ఎమ్మెల్యేలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు రాజధాని ఎంపికలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు అని గట్టిగా భావించారు కాబట్టే అటువంటి ఫలితాలు రావడం జరిగింది. ఇదేరకమైన భావన ఉత్తరకోస్తా ప్రాంతాల్లో కూడా లేకపోలేదు. రాజధానులు వాటి నిర్మాణం గురించి కూలంకషంగా అధ్యయనం చేసి వాదిం రాస్మన్ ‘క్యాపిటల్ సిటీస్ వెరైటీస్ అండ్ పేట్రన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీ లొకేషన్ ‘అనే పుస్తకం రాశారు. దానిలో ఆయన రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకు రాజధానిలో సరైన ప్రాతినిధ్యం ఉందా? రాజధానిలో తమకు ఉనికి ఉందని వారు భావిస్తున్నారా? రాజధాని నుంచి వచ్చే ప్రయోజనాలు అన్ని ప్రాంతాలకు లభిస్తున్నాయా? అనేవి ముఖ్యమైన అంశాలని ఈ నిష్పాక్షికత అందరినీ కలుపుకుపోవడం అన్నదే ప్రభుత్వానికి న్యాయసమ్మతం ఇస్తుందని ఆయన పేర్కొన్నాడు. పైఅంశాలలో వేటినీ అమరావతి స్థల సమీకరణలో పాటించలేదనేది తేటతెల్లమవుతుంది. విజయవంతంగా నిర్వహించబడుతున్న రాజధానుల విషయంలో స్థల ఎంపిక విషయంలో ఎటువంటి ప్రక్రియను అనుసరించారో పరిశీలిద్దాం. ఆంగ్లో సాకసన్ దేశాలైన ఆస్ట్రే లియా, అమెరికాలాంటి దేశాలలో రాజధాని ఏర్పాటు భిన్న వర్గాల మధ్య సర్దుబాటు రాజీ ఫలితంగా ఏర్పడింది. ఈ దేశాలలో ఏర్పడిన రాజధానులు కేవలం పరిపాలన రాజధానులుగానే ఉన్నాయి. ఆ దేశాలలో ఆర్థిక కేంద్రాలుగా మహానగరాలుగా ఇతర నగరాలు అభివృద్ధి చెందాయి. రాజధానులుగా ఈ పట్టణాలు విజయవంతంగా నడవటానికి కారణం వీటి ఏర్పాటు వివిధ వర్గాలు ప్రాంతాల మధ్య సర్దుబాటు ఫలితంగా ఏర్పడటమే. ఇటువంటి విశాల విధానాన్ని అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినప్పుడు అనుసరించలేదు. అటువంటప్పుడు ఈ అంశాన్ని పునఃపరిశీలించి అర్థవంతమైన చర్చ అనంతరం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చారిత్రకంగా జరిగిపోయింది కాబట్టి ఈ అంశాన్ని తిరగతోడడం సరికాదు అనేవాళ్ళు వినిపించే వాదనలు వేరే ఉన్నాయి. భూ సమీకరణ ద్వారా రైతుల భూములను తీసుకున్నారని, నిర్ణయంలో మార్పు వల్ల వాళ్లకు నష్టం జరుగుతుందని ఒక వాదన. ప్రభుత్వ ధనాన్ని చాలా ఖర్చు చేయడం జరిగిందని ఇప్పుడు ఈ అంశాన్ని పునః పరిశీలించటం సరికాకపోవచ్చని రెండవ వాదన. ఈ రెండు వాదనలు ఇక్కడ పరిశీలిద్దాం. భూ సమీకరణ కేవలం స్వచ్ఛందంగానే ఇవ్వలేదని చాలా వరకు ప్రభుత్వం బలవంతం చేయడం ద్వారా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం ద్వారా, మభ్యపెట్టడం ద్వారా భూ సమీకరణ పూర్తి చేసిందని ఆ రోజుల్లోనే ఈ అంశాన్ని పరిశీలించిన కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. తీసుకున్న భూమిలో ప్రభుత్వానికి రిజిస్టర్ అయినది ఎంత, రైతుల చేతిలోనే ఉన్న భూమి ఎంత, ప్రభుత్వ అవసరాలకు కానీ, వివిధ సంస్థలకుగాని కేటాయించిన భూములు ఎంత, పనులు మొదలు పెట్టిన భూములు ఎంత అనే వివరాలు వెల్లడిస్తే ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజధాని స్థల ఎంపికకు ముందు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కనుక ఆ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలి. ఇక రెండో అంశం పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు ఇక్కడ ఇప్పటికే వెచ్చించడం జరిగింది కాబట్టి ఈ సమయంలో రాజధాని తరలింపు చర్చ అర్థరహితం అనేది కొందరి వాదన. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో నమూనాల పరిశీలన, నిర్ధారణ లోనే పుణ్యకాలం అంతా వెచ్చించింది. పెద్ద స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు కేవలం ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే జరిగాయి. ఈ అంశంపై కూడా ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత స్థాయి లో ప్రభుత్వ నిధులు ఇప్పటికే వినియోగం అయినాయి. దానికి అను గుణంగా పూర్తయిన భవనాలు ఎన్ని? ఈ సమాచారం ఆధారంగా ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరిపే అవకాశం ఉంటుంది. చివరకు నిర్ణయం ఏ రకంగా ఉన్నా, ఈ అంశంపై ఒక అర్థవంతమైన చర్చ అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆనాడు రాజధానికి స్థల సేకరణ సమయంలో ఈ అర్థవంతమైన చర్చ పూర్తిగా లోపిం చింది. అటువంటి చర్చ జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే అవకాశం ఎంతైనా ఉంది. ఈనాడు రాజధానిని మార్చాలి అనే ప్రతిపాదన తుగ్లక్ ప్రతిపాదనగా వర్ణించే వారికి నా సమాధానం ఒక్కటే. తుగ్లక్ కొన్ని శతాబ్దాలుగా దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీని మార్చటానికి ప్రయత్నించాడు. ఈనాడు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏకపక్షంగా రాజధాని ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని. దీనిని తుగ్లక్ చర్యతో పోల్చటం భావ్యం కాదు. పోల్చాలి అనుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించిన చర్యతో పోల్చవచ్చు. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
రాజధాని భూములను ఎక్కడ తాకట్టు పెట్టారు?
సాక్షి, మంగళగిరి : రాజధాని పేరుతో ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసిన చంద్రబాబు వ్యవస్థలతో పాటు మీడియానూ మేనేజ్ చేసి నిజాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. రాజధాని కోసం తీసుకున్న భూములను ఎక్కడ తాకట్టు పెట్టారో? ఎంత వడ్డీకి ఎన్ని కోట్లు తీసుకున్నారో అన్ని లెక్కలూ తేలాల్సి ఉందన్నారు. మంగళగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని పేరుతో తీసుకున్న భూములకు చట్టపరంగా ఇస్తామని చెప్పిన అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు రైతులతో పాటు ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు, తీసుకున్న 33 వేల ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణాలు చేశారో చెప్పాలని సవాల్ చేశారు. కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమకట్టడాల మీద ఇప్పటికే న్యాయ స్థానం 60 మంది నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసిందని, వారంతా న్యాయస్థానానికి సమాధానం చెప్పిన అనంతరం న్యాయస్థానం ఇచ్చే తీర్పు ప్రకారం అక్రమకట్టడాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
రాజధానికి భూములిచ్చి మోసపోయాం: రైతులు
-
రాజధాని నిర్మాణానికి 1,09,023 కోట్లు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణానికి ప్రాథమికంగా రూ.1,09,023 కోట్ల వ్యయమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ట్రంక్–1, ట్రంక్–2 మౌలిక వసతులతో పాటు ప్రభుత్వ కాంప్లెక్స్ ఇతర సదుపాయాల కల్పనకు ప్రాథమికంగా ఈ మొత్తం అవసరమని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వానికి రూ.39,937 కోట్లతో సవివరమైన ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమర్పించింది. రాజధానికి వచ్చే మూడేళ్లలో రూ.39,937 కోట్లు అవసరమని ఆ నివేదికలో పేర్కొంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల బంగ్లాలు.. సచివాలయం, ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయాలకు ఈ మొత్తం అవసరమవుతుందని అంచనా వేసినట్లు డీపీఆర్లో పేర్కొంది. వచ్చే మూడేళ్లకు సంబంధించి.. తొలి ఏడాదిలో రూ.10,610 కోట్లు, రెండో ఏడాదిలో రూ.22,578 కోట్లు, మూడో ఏడాదిలో రూ.6,749 కోట్లు అవసరమని నివేదికలో తెలిపింది. -
ఎడ్యుకేషన్ హబ్గా అమరావతి
సాక్షి,అమరావతిబ్యూరో/అమరావతి: రానున్న కాలంలో రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దటమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని, రాజధాని ప్రాంతంలోనే 15 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో బుధవారం జరిగిన గురుపూజోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందని, తల్లిదండ్రుల తర్వాత గురువులనే గుర్తు పెట్టుకోవాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ను స్ఫూర్తిగా తీసుకుని టీచర్లు ముందుకు సాగాలన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏడాది రూ. 23 వేల కోట్లు కేటాయించినట్లు సీఎం వెల్లడించారు. సింధుపై పొగడ్తల వర్షం: ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన సింధును ఎలా గౌరవించాలో కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తామని చంద్రబాబు అన్నారు. కార్యక్రమానికి హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సీఎం చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. తన హయాంలోనే గోపీచంద్ ఏర్పాటు చేసిన అకాడమీకి సహకరించానని, దానివల్లే సి«ంధులాంటి గొప్ప క్రీడాకారిణి రాష్ట్రానికి దక్కిందన్నారు. కాగా, బ్యాడ్మింటన్లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తెస్తానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. బోధనాసిబ్బంది వేతనం పెంపు: మంత్రి నక్కా గురుపూజోత్సవం సందర్భంగా గురుకులాల్లో పార్ట్టైం స్కేల్పై పనిచేస్తున్న లెక్చరర్లు, టీచర్ల జీతాలు పెంతున్నట్లు మంత్రి నక్కా ఆనంద్బాబు ప్రకటించారు. సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూనియర్ లెక్చరర్ జీతం రూ. 8500 నుంచి రూ. 18000, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ జీతం రూ. 7500నుంచి రూ. 16,100, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ జీతం రూ. 7,500నుంచి రూ. 14,800, పీఈటీ జీతం రూ. 6,500నుంచి రూ. 10,900, స్టాఫ్ నర్స్ జీతం రూ. 6,500 నుంచి రూ. 12,900లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అవార్డుల ప్రదానంలో గందరగోళం రాష్ట్రంలోని వివిధ కేటగిరీల్లో ఉత్తమ ఉపాధ్యాయులు, అ«ధ్యాపకులు, ప్రొఫెసర్లుగా ఎంపికైన 158 మందికి సీఎం చంద్రబాబు అవార్డులు ప్రదానం చేశారు. ముందుగా కొద్ది మందికే అవార్డులు ప్రదానం చేసి సీఎం ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు స్టేజీ దిగుతుండగా.. పలువురు ఉపాధ్యాయులు అందరికీ అవార్డులు ప్రదానం చేయాలంటూ గట్టిగా కేకలు వేయడంతో అందరికీ అవార్డులు ప్రదానం చేయాల్సి వచ్చింది. అవార్డుల ప్రదానంలో గందరగోళం మధ్య ఎవరికి వారు స్టేజీ పైకి వెళ్లి అవార్డులు తీసుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుతో పాటు ట్యాబ్ పంపిణీ చేయడంతో పలువురు ఉపాధ్యాయులు రెండు, మూడు పర్యాయాలు స్టేజీ పైకి వెళ్లి ట్యాబ్లు తీసుకోవడం గందరగోళం సృష్టించింది. చాలా మందికి ట్యాబ్లు లేకపోవడంతో అధికారులు ట్యాబ్లు తీసుకున్న వారి చేతిలోనుంచి తీసుకొని అవార్డులు పొందేవారికి ఇప్పించడం విమర్శలకు తావిచ్చింది. చివరిదశలో ట్యాబ్లు చాలకపోవడంతో పలువురికి ఇవ్వలేకపోవడం గమనార్హం. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్ , ఎమ్మెల్సీలు ఎఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వరదలో రాజధాని.. నేడూ వర్షాలు
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి/నెట్వర్క్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో శనివారం నుంచి కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. డ్రైనేజీ పొంగిపొర్లడంతో ఇళ్లలోకి మురుగు నీరు చేరింది. తాడేపల్లిలో 14 సెం.మీ, తుళ్లూరులో 12, తాడికొండలో 9.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. పాలవాగు, కొండవీటి వాగు, కోటెళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులను తలపిస్తున్న ఎక్స్ప్రెస్ రోడ్లు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మాణంలో ఉన్న రాజధాని ఎక్స్ప్రెస్ రోడ్లు నీట మునిగాయి. డ్రైనేజీ, కేబుళ్ల కోసం తీసిన గుంతల్లో ఏడడుగుల మేర నీరు నిలిచింది. అలాగే, సీడ్ యాక్సెస్ రోడ్డులో నిర్మించనున్న బ్రిడ్జిల కోసం తవ్విన గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. ఇక రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాలవాగు, కొండవీటి వాగు, కోటెళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో తుళ్లూరు–గుంటూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దపరిమి వద్ద కోటెళ్ల వాగు కూడా అదే స్థాయిలో ప్రవహిస్తోంది. తాడికొండ మండల పరిధిలో సుమారు మూడు వేల ఎకరాల పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. తాడేపల్లి పరిధిలో మరో వెయ్యి ఎకరాల్లో నీరు నిలిచి ఉంది. నాలుగేళ్లుగా ఏటా ఇంతే.. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ సీఎం పదేపదే గొప్పలు చెబుతున్నారు తప్పితే రాజధాని పరిధిలోని గ్రామాల్లో నాలుగేళ్లల్లో సరైన రోడ్లు, డ్రైనేజీ నిర్మించలేకపోయారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇంతవరకు కనీస మౌలిక వసతులు లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితని వాపోతున్నారు. మరోవైపు, రాజధానిలో అనేక చెరువులను పూడ్చివేయడంతో వర్షపు నీరు వెళ్లే మార్గంలేక ఆ నీరంతా గ్రామాల్లోకి వెళ్తోంది. ఉప్పొంగుతున్న వాగులు, వంకలు ఎగువ ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతరూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇటు గోదావరి, అటు శబరి నదులు పొంగి పొర్లడంతో ఏజెన్సీలో భయాందోళనలు నెలకొన్నాయి. విలీన మండలాల్లో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉధృతి కారణంగా కాటన్ బ్యారేజి, రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయగా.. సాయంత్రం నుంచి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి నుంచి అనుమతిచ్చారు. చింతూరు మండలం చట్టి–చిడుమూరు మధ్య విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తడంతో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలో 30 గ్రామాలకు వాహనాలపై రాకపోకలు నిలిచిపోయాయి. పడవల మీద ప్రయాణాలను రద్దు చేశారు. కోనసీమపై కూడా వరద ప్రభావం అధికంగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయపాళెంతోపాటు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ముంపునకు గురైన 22 మండలాల్లోని 28 గ్రామాల్లో సుమారు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆరు రాష్ట్ర విపత్తు సహాయక బృందాలకు చెందిన 220 మంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఇక విజయనగరం జిల్లాలోని గంట్యాడ, బాడంగి, జామి, మెంటాడ, గజపతినగరం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. పట్టణంలో పెద్ద చెరువు కింద, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖ నగరంలో ఆదివారం రాత్రి కుంభవృష్టి కురిసింది. మరోవైపు.. కోస్తాంధ్రలోనూ వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. తమ్మిలేరు ఉప్పొంగడంతో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు, పరిసర గ్రామాలు నీటి మడుగులా మారాయి. పశ్చిమ గోదావరిలో రికార్డుస్థాయి వర్షం గత 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లా కోయిడాలో 38.8 సెం.మీల రికార్డు స్థాయి వర్షం కురిసింది. ఇదే జిల్లాలోని కుకునూరులో 29.1, వేలేరుపాడులో 28.1, కృష్ణా జిల్లాలోని తిరువూరులో 19.1, తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపూర్లో 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నీట మునిగిన పొలాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పత్తి, మిరప, బీర, టమోటా, కాలిఫ్లవర్, బెండ, వంగ తదితర కూరగాయల తోటల్లో నీరు నిలిచాయి. అనేక ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగడంతో గుంటూరు జిల్లాలోని బాపట్ల, పిట్టలవానిపాలెం, భట్టిప్రోలు మండలాల్లో దాదాపు 700 ఎకరాల్లో వెద పద్ధతిలో సాగు చేసిన వరి చేలు దెబ్బతిన్నాయి. పంట పొలాల నుంచి నీరు బయటకు వెళ్లకపోవడంతో మొలక చనిపోయింది. జిల్లాలోని పశ్చిమ డెల్టా ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. ఈ జిల్లాలో 3 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగవుతుండగా వర్షాలకు పూత రాలిపోతోంది. వర్షాలు కొనసాగితే తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 94,011 ఎకరాల్లో వరి చేలు, 1,572 ఎకరాల్లో పత్తి నీట మునిగింది. విశాఖ జిల్లా పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో దాదాపు 50 ఎకరాల్లోని వరిపంట నీట మునిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జల్లేరు, ఎర్రకాల్వ, తమ్మిలేరు జలాశయాలకు భారీఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తివేయడంతో దిగువునున్న వేలాది ఎకరాల పంట నీటమునిగింది. పడవ బోల్తా.. యువకుడి గల్లంతు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని గౌతమీ గోదావరి పాయలో 15మంది రైతులున్న నాటు పడవ బోల్తా పడిన సంఘటనలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మిగిలిన 14మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరోవైపు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం తెల్లవారుజామున మహాగణపతి విగ్రహం వద్ద క్యూలైన్పై కొండ రాళ్లు జారిపడ్డాయిద్దా సమయంలో క్యూలైన్లో భక్తుల రద్దీ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అలాగే, నగరంలోని వన్టౌన్ ప్రాంతంలోని కొండ ప్రాంతాల్లో తెల్లవారుజామున రెండు చోట్ల రిటైనింగ్ వాల్ జారి సమీపంలోని నివాసాల మీద పడటంతో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లాలో తిరువూరు మండలం టేకులపల్లి వద్ద వాగులో చిక్కుకున్న రామకృష్ణ అనే రైతును, వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామంలో వరదల్లో చిక్కుకున్న మామిడి తోట కాపలాదారులు నలుగుర్ని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద గల వందేళ్ల నాటి బైనేరు బ్రిడ్జి వరద ఉధృతికి సోమవారం కుప్పకూలింది. దీంతో జంగారెడ్డిగూడెం వైపు నుంచి రాజమండ్రి వైపు రహదారి తెగిపోయింది. ప్రమాదం సమయంలో బ్రిడ్జిపై ఇద్దరు ద్విచక్ర వాహన చోదకులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాగా, ఈ జిల్లాలో ఆదివారం రాత్రి గుబ్బల మంగమ్మ దర్శనానికి వెళ్ళి అనుకోకుండా వరదల తాకిడికి అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయిన సుమారు ఏడు వందల మందిని సోమవారం ఉదయం రెస్క్యూ టీములు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. విశాఖ జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏజెన్సీలో మూడు పెంకుటిళ్లు నేలకూలాయి. మొరాయించిన గేట్లు కర్నూలు జిల్లా తుంగభద్రలో వరద పోటెత్తడంతో గేట్లు తెరిచి దిగువకు వరదను వదిలేందుకు అధికారులు ప్రయత్నించగా 11 గేట్లు మొరాయించాయి. చేసేదిలేక స్కావర్ వెంట్లను తెరిచి వరదను దిగువకు విడుదల చేశారు. అలాగే, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఆదివారం రాత్రి ఎర్రకాలువ ఉప్పొంగింది. వరదను దిగువకు విడుదల చేసేందుకు ప్రాజెక్టుకు చెందిన నాలుగో గేటును తెరిచేందుకు అధికారులు యత్నించారు. కానీ అది తెరుచుకోలేదు. వరద ఉధృతికి కరకట్ట ఎడమ వైపున దెబ్బతింది. ఈ రెండు ఉదంతాలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నాయి. క్రస్ట్ గేట్లు, రివర్ స్లూయిస్లు, స్కావర్ వెంట్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయకపోవడం, ఏటా ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకపోవడంవల్ల ఇవి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుంకేసుల బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులను 2017లో నీరు–చెట్టు కింద టీడీపీ నేతలకు అప్పగించారు. రూ.8 కోట్ల బిల్లులు మింగేశారు గానీ.. మరమ్మతులు సక్రమంగా చేయకపోవడంవల్లే గేట్లు మొరాయించినట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే, 2009లో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదతో శ్రీశైలం జలాశయం ఫ్లంజ్పూల్లో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యిని పూడ్చాలని ఎప్పటికప్పుడు నిపుణులు హెచ్చరిస్తున్నా ఇప్పటివరకూ పట్టించుకోకపోవడం ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వానికున్న శ్రద్ధ తెలియజేస్తోంది. ఎర్ర కాలువ గేట్లదీ ఇదే పరిస్థితి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పలు మధ్య తరహా ప్రాజెక్టుల గేట్లదీ ఇదే దుస్థితి కావడం గమనార్హం. -
పరాకాష్టకు చేరిన విలువల పతనం
గత 35 ఏళ్ల ప్రభుత్వ పాలనతో పోలిస్తే నాలుగేళ్ల చంద్రబాబు పాలన అతి చెత్త పాలనగా మిగిలిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజల ప్రయోజనాలకు సంరక్షణ కర్తలుగా ఉండాలి అనే భావననే క్షీణింపజేస్తూ, వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ వచ్చారని ఆరోపించారు. పాలకులు చెడుమార్గం పట్టినప్పుడు పౌర సమాజమే తగు నిర్ణయం తీసుకోవాలంటున్న అజయ్ కల్లం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీరు రాసిన ‘మేలుకొలుపు’ లక్ష్యం ఏమిటి? వేకప్ కాల్ అనే ఇంగ్లిష్ పదానికి తెలుగు అర్థం మేలుకొలుపు. 1980లనాటి రాజకీయ నేతల్లో కాస్త నిజాయితీ ఉండేది. ఆ తరం నేతలు నిజాయితీపరులైన అధికారులను ఇబ్బంది పెట్టేవారు కాదు. సమాజం కోసం, రాష్ట్రం కోసం ఎవరైనా మంచి సలహా ఇస్తే ‘అవును.. మనం అలా చేద్దాం’ అంటూ ప్రోత్సహిం చేవారు. ఆ విధంగానే మనకు ఐటీడీఎ వంటి గొప్ప సంస్థలు ఏర్పడ్డాయి. కానీ 1980ల చివరికి వచ్చేసరికి మా కళ్లముందే వ్యవస్థలన్ని ధ్వంసం అయిపోవడం, క్షీణించిపోవడం చూశాం. వ్యవస్థలు విఫలమవటం, ఆనాటివరకు కొద్ది స్థాయిలో ఉండే అవినీతి తర్వాత భరించలేని స్థాయికి చేరడం, విలువలు పూర్తిగా పక్కకుపోవడం, సమర్థత ప్రాతిపదికన కాకుండా మనకు పనికొచ్చేవాడు ఎవరు అంటూ ఉన్న ఆఫీసర్లలో వెతుక్కోవడం మొదలైంది. మనప్రాంతం వాడా, మన కులంవాడా, మనం అడిగిన పని చేసిపెడతాడా లేదా అనేవి పదవులకు కొలమానాలుగా మారాయి. బ్యూరోక్రాట్లకు ప్రజా ప్రయోజనాలతో ఏమాత్రం పనిలేదనే వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజల ప్రయోజనాలకు సంరక్షణ కర్తలుగా ఉండాలి తప్ప రాజకీయ ప్రయోజనాలకోసం కాదు. ఆ భావననే క్షీణింపజేస్తూ, వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ వచ్చారు. ఇదే నా ‘మేలుకొలుపు’ లక్ష్యం. ప్రభువులు మీపట్ల చాలా ఆగ్రహంతో ఉన్నట్లున్నారే? ప్రశ్నించే అలవాటు సమాజంనుంచి పోవడం వల్లే వాళ్లాస్థాయికి వచ్చారు. ప్రశ్నిస్తే ఆగ్రహించడమా? నాయీ బ్రాహ్మణులను సచివాలయంలోకి ఎందుకు రానిచ్చారు అని సీఎం అరిస్తే ఎలా? నాయకులు బ్యాలెన్స్ తప్పినప్పడే ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరూ మమ్మల్ని ప్రశ్నించకూడదు, మేం మాత్రం అందరిమీదా పెత్తనం చెలాయిస్తాం అంటే మీరు అక్కడ ఉండే పరిస్థితే ఉండదు. ఇద్దరు సీనియర్ అధికారులు ప్రభుత్వ విధానాలను వరుసగా తూర్పారబట్టడం ఇదే ప్రథమం కదా? గతంలో మన వ్యవస్థలో ఎప్పటికప్పుడు కొద్దో గొప్పో సానుకూలంగా ఆలోచించేవాళ్లం. విచిత్రం ఏమిటంటే, పోయినవాళ్లే మంచివాళ్లు అని పెద్దలు చెబుతుంటారు కదా. గత 35 ఏళ్లుగా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా పరిస్థితులు మెరుగవుతాయనే ఆశ ఎక్కువగా ఉండేది. కానీ దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ వస్తోంది. పాలనకు సంబంధించి ఏ అయిదేళ్ల కాలాన్ని తీసుకున్నా, అంతకుముందు అయిదేళ్ల పాలనే ఉత్తమంగా ఉండేదన్న ప్రతిస్పందన ఆటోమేటిక్గా వస్తోంది. పరిస్థితి మెరుగుపడటానికి బదులు మరింతగా దిగజారుతూండటాన్నే చూస్తున్నాం. అయితే పార్టీలే తమ ఎజెండాను తీసుకెళ్లి ప్రజ లకు ఇవి చేస్తాం, అవి ఇస్తాం అంటూ చెబుతూ వస్తున్నాయి కానీ ప్రజలు మాకు ఇది కావాలి. ఇది వద్దు అని తమ సొంత ఎజెండాను రూపొందించుకుని డిమాండ్చేసే పరి స్థితి ఏర్పడాలన్న ఆలోచన మాత్రం మా ఇద్దరికీ వచ్చింది. ఒక్కటి మాత్రం నిజం. ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వ పాలన గత 35 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలన్నింటి కంటే చెత్త పాలన అని మాత్రం చెప్పాలి. కారణం ఏమంటే ప్రభుత్వ పాలనా సంస్థలు పూర్తిగా బలహీనమైపోయాయి. కానీ మండల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లారని ప్రశంస కూడా వచ్చింది కదా? ఉన్న వ్యవస్థలను పనికిమాలినవిగా తయారు చేసి, ప్రజల వద్దకు పాలన అంటే ఉపయోగం ఏమిటి? పైగా మండల వ్యవస్థ నాటి నుంచి నేటి వరకుకూడా ఒక వ్యవస్థగా బలోపేతం కాలేదు. గతంలోని గ్రామీణ సమితులకు అది ప్రత్యామ్నాయం కాలేదు. మెంటే పద్మనాభంగారితో నాకున్న చనువుతో నేను ఆయన్ని ప్రశ్నించాను. ఇదేంటండీ తగిన ప్రత్యామ్నాయం ఏదీ తీసుకురాకుండానే మీరు ఉన్న వ్యవస్థలన్నింటినీ దునుమాడుతున్నారు. (ఆరోజునుంచి ఈరోజు వరకు గ్రామీణ రికార్డులు బాగుపడలేదు.) వ్యవస్థలను నాశనం చేస్తే మీకేంటండీ లాభం? ప్రజ లకు సరఫరా దెబ్బతింటుంది. దాంతో మీకు చెడ్డపేరు వస్తుంది కదా అని ఆయన్ని అడిగాను. దానికాయన అభిమానంతోటే ఒక విషయం చెప్పారు. అజయ్ మీరంతా యువకులు. మీరు ఆదర్శవాదంతోనే ఆలోచిస్తుంటారు. వ్యవస్థలన్నీ చక్కగా పనిచేసిపెడితే ఇక మాదగ్గరకు ఎవడొస్తాడయ్యా.. వ్యవస్థలు పాడైపోతేనే మా పాత్ర, మా ప్రాధాన్యం ప్రజల్లో పెరుగుతుంది అని చెప్పారాయన. ఆ విధంగా అప్పటినుంచి క్రమక్రమంగా ఒక్కో వ్యవస్థనూ నాశనం చేసుకుంటూ పోయారు. పైగా ఈరోజు ప్రభుత్వంలో ఏ కలెక్టర్కి, ఏ విభాగాధిపతికి స్వేచ్ఛ ఉంది? నాయకులు మొత్తం అధికారాలను తమ సొంతం చేసుకుం టున్నారు. కేంద్రీకరించుకుంటున్నారు. సింగపూర్ కంపెనీకి భూములు కట్టబెట్టడంపై మీరు అభ్యంతరం వ్యక్తం చేయలేదా? ఎందుకు లేదు? సింగపూర్ కంపెనీకి 1600 ఎకరాలు కట్టబెట్టడం అనేది ఏకపక్ష ఒప్పందం. దీంట్లో ప్రజా ప్రయోజ నాన్ని బలి తీసుకుంటున్నారు. ప్రభుత్వం అవతలివాళ్లకు లాభం కలిగేలా చేస్తోంది అని చాలా క్లియర్గా మా వాదనపై ఆరు పాయింట్లు నిర్దిష్టంగా రాసి అందించాం. దాన్ని కేబి నెట్ భేటీలో స్వయంగా నేను లేవనెత్తినా ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. మహారాష్ట్రలో దబోల్ విద్యుత్ ప్రాజెక్టు కేసు మీకు గుర్తుందా? దానికీ దీనికీ పెద్దగా తేడా లేదండీ అని చెప్పాను. అవునవును. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. కానీ మా నిర్ణయం మేము తీసుకుంటాము అని స్పష్టం చేశారు. ఈ అంశంపై నా విధి నేను చేశాను. కాబట్టి పశ్చాత్తాపపడాల్సిన పనిలేదు. మీరు కాదన్నా కేబినెట్ ఓకే చేసింది కదా? పౌరసమాజమే దీనికి సమాధానమివ్వాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం పౌర సమాజానిదే కదా. రాజధాని చుట్టూ పరిణామాలపై మీకేమనిపిస్తోంది? నిజం చెప్పాలంటే రాజధాని వ్యవహారాల్లో మేమెన్నడూ జోక్యం చేసుకోలేదు. దాంట్లో మా పాత్ర ఏమీ లేదు. కానీ ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశంలో కూడా రాజధానికి ఇంత ప్రాధాన్యమిచ్చిన చరిత్ర ఎక్కడా లేదు. ఇంత హైప్ చేసింది లేదు కూడా. మన దేశ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదైన కాలిఫోర్నియా నగరంలో ప్రభుత్వ శాఖలు ఎక్కడో ఒక మూలన పడేసినట్లుంటాయి. నెదర్లాండ్స్లో ప్రభుత్వ శాఖలన్నీ హేగ్ వంటి చిన్న నగరంలో ఉంటున్నాయి తప్ప రాజధాని ఆమ్స్టర్డామ్లో లేవు. ఆస్ట్రేలియాలో కీలక శాఖలన్నీ కాన్ బెర్రా అనే 3 లక్షల జనాభా ఉన్న అటవీ ప్రాంత పట్టణంలో ఉంటున్నాయి. రాజధాని అంటే పరిపాలనా శాఖ లతో కూడిన నిర్మాణం. దాన్ని ఒక పెద్ద మెగాసిటీగా, గ్రేటర్ సిటీగా పెంచాల్సిన అవసరం లేదు. అందులోనూ చేతిలో డబ్బులు లేని దాసరికి అవసరమే లేదు. రెండుమూడు ప్రభుత్వ భవనాలు, రెండువేల కోట్ల ఖర్చు, కావలసిన డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్లు, మౌలిక వసతులు తప్పితే అంతకు మించిన పెట్టుబడి అవసరమే లేదు. అక్కడున్న అవకాశాలను బట్టే రాజధాని చుట్టూ సహజ సిద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఈమాత్రం దానికి రాజధానిని పూర్తిగా కేంద్రీకృతం చేయాల్సిన అవసరం లేదు. పాలన ఎంత వికేంద్రీకరణకు గురైతే అంత సమర్థంగా ఉంటుంది. నిజంగా సచివాలయం అనేది గ్రామంలో ఉండాలి. గ్రామ వ్యవహారాలను నిత్యం చూసే సెక్రటేరియట్ అది. నేటికీ చాలా దేశాల్లో సెక్రటేరియట్ అనే భావనే లేదు. దేశరాజధాని ఢిల్లీలో సెక్రటేరియట్ ఉందా? వివిధ శాఖలు మాత్రం ఉన్నాయి. వాటì æపని అవి చేసుకుంటున్నాయి. ఆన్లైన్ వ్యవస్థ వచ్చింతర్వాత అన్నీ ఒకేచోట కేంద్రీకరించడం ఎందుకు? అవును. ఆన్లైన్ వ్యవస్థతో పనులు సమర్థంగా జరుగుతాయి. అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు వీలిచ్చే ఈ వైఖరిని మొత్తం ప్రపంచమంతా ప్రస్తుతం పాటిస్తోంది. ప్రభుత్వాఫీసులన్నీ ఒకే చోట ఎందుకు పెట్టాలి? నాలుగు డిపార్ట్మెంట్లు తిరుపతిలో, మరో నాలుగు విశాఖలో పెట్టండి. కొన్ని విభాగాలను కర్నూలులో పెట్టండి. దానివల్ల నష్టం ఏమిటి? ఏ డిపార్ట్మెంట్తో ఎవరికి పనిబడితే వారు మాత్రమే అక్కడికి వెళతారు. అంతేగానీ అన్ని పనులకూ రాజ ధానికే ఎందుకు రావాలి? రాజధానిలో ఉండటం వల్ల ఎవరికీ లాభం లేదు. కేవలం ప్రభుత్వోద్యోగులకు అక్కడికక్కడే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి తప్ప ఇతరులకు లాభం ఏమిటి? రెండోది ఎమ్మెల్యేలు పైరవీలు చేసుకోవడానికి కూడా రాజధాని ఉపయోగపడుతుంది. అంతే తప్ప సాధారణ ప్రజలకు అన్నీ ఒకేచోట ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు. -
ప్రజలు డబ్బులు ఇస్తే.. మీరేం చేస్తారు?
సాక్షి, కాకినాడ : రాజధాని అమరావతి కోసం రైతులు భూములు ఇచ్చిందే కాకుండా అప్పులు కూడా ఇవ్వాలా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మట్టి నుంచి బూడిద వరకు దోచుకున్న టీడీపీ నాయకులను, లంచాలు నొక్కుతున్న జన్మభూమి కమిటీలను రాజధాని కోసం డబ్బులు అడగండని సీఏం చంద్రబాబునాయుడుకు సూచించారు. నాలుగేళ్లలో లక్షా ఇరవై వేల కోట్లు అప్పు చేశారని అందులో పది వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేపట్టలేరా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు తాత్కాలిక భవనాలే కట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అని చెప్పారని, కానీ ఈ రాష్ట్రంలో లోకేశ్కు తప్ప ఎవరికి ఉద్యోగం రాలేదని కన్నబాబు ఎద్దేవ చేశారు. చిత్త శుద్ధి ఉంటే రాజీనామాలు చేయండి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణంపై చంద్రబాబు వ్యవహరిస్తున్న ద్వంద వైఖరిపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిని అక్రమంగా అరెస్టులు చేయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ప్రత్యేక హోదాపై చిత్త శుద్ధి ఉంటే వెంటనే ఎంపీలతో రాజీనామా చేయించాలని ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించినప్పుడు అవసరంలేని అఖిలపక్షం ఇప్పుడు అవసరం వచ్చిందా అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పై చంద్రబాబు డ్రామాలు ఆపి తమ పార్టీతో కలిసి రావాలని కన్నబాబు హితవు పలికారు. -
రాజధాని తొలి దశకు రూ.45 వేల కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి దశలో రూ.45 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం తేల్చింది. ఇంతమొత్తం విలువైన పనులను ఇప్పటికే చేపట్టినట్లు తెలిపింది. గతంలో పలుమార్లు రకరకాల అంచనాలు రూపొందించగా, తాజాగా వచ్చే నెలలో నిర్వహించే హ్యాపీ సిటీస్ సదస్సు కోసం ప్రత్యేకంగా ఒక నివేదిక తయారు చేసింది. అందులో మొదటి దశలో రాజధాని నిర్మాణానికి రూ.45,253 కోట్ల విలువైన పనులు ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ నిధుల్ని రకరకాల మార్గాల్లో సమీకరిస్తున్నట్లు వివరించింది. గతంలో రాజధాని నిర్మాణానికి రూ.58 వేల కోట్లు అవసరమని అందులో రూ.29,676 కోట్లు తొలి మూడేళ్లలోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని పలు నివేదికల్లో సీఆర్డీఏ స్పష్టం చేసింది. -
‘అమరావతి’కి మెట్రో వేస్ట్
♦ తగినంత జనం లేకుండా రాజధానికి మెట్రో’ను విస్తరించడం అనవసరం ♦ సాధ్యాసాధ్యాల నివేదికలో తేల్చిచెప్పిన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించడం అనవసరమని శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డీఎంఆర్సీ) తేల్చేసింది. జనం లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తే పెట్టుబడులు తిరిగి రావని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సలహాదారుగా ఉన్న ఢిల్లీ మెట్రో రూపకర్త శ్రీధరన్ రాజధానికి మెట్రో విస్తరణకు సంబంధించి రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నట్టు సమాచారం. రూ.పదివేల కోట్ల ఖర్చవుతుందని అంచనా.. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొనసాగింపుగా రెండో దశలో రాజధానికి మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాజధానికి మెట్రో రైలును విస్తరించాలంటే సుమారు రూ.పది వేల కోట్లు ఖర్చవుతుందని డీఎంఆర్సీ అంచనా వేసింది. ప్రయాణికులేరి? కారిడార్ నిర్మించే ప్రాంతంలో కనీసం 20 లక్షల జనాభా అయినా ఉండాలి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు మొదట్లో జనాభా సమస్య వస్తే శివారు ప్రాంతాలన్నింటినీ కలపి 20 లక్షల జనాభాను చూపించారు. ఇప్పుడు రాజధానిలో అంత జనాభాను ఎక్కడినుంచి తీసుకొస్తారనేది డీఎంఆర్సీ మొదటి ప్రశ్న. మెట్రో ప్రాజెక్టుపై ఖర్చుపెట్టిన డబ్బు తిరిగి రావాలంటే ప్రతిరోజూ 2.5 లక్షలనుంచి 3 లక్షల మంది ప్రయాణికులు అందులో ఎక్కాలి. ప్రస్తుతం రాజధాని గ్రామాల జనాభా 98 వేలు. అన్నీ అనుకున్నట్లు జూన్లో తాత్కాలిక సచివాలయం ప్రారంభమైతే నాలుగు వేలమంది ఉద్యోగులు, ఇతరులు ఒక వెయ్యిమంది అక్కడికొచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో మెట్రో ఎక్కేవారి సంఖ్య వందల్లోనే ఉంటుందని డీఎంఆర్సీ వాదన. గుంటూరుకు మెట్రో విస్తరణా అసాధ్యం! సీడ్ రాజధాని నుంచి గుంటూరుకు మెట్రో విస్తరణ కూడా సాధ్యమయ్యే పనికాదని డీఎంఆర్సీ తేల్చింది. గుంటూరు జనాభా ఆరు లక్షలు దాటలేదని, ఈ నేపథ్యంలో అక్కడికి ప్రాజెక్టును విస్తరించడం ఏ కోణంలోనూ సరికాదని స్పష్టం చేసింది.