
సాక్షి, విజయవాడ: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేష్పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే.