Nandigam Suresh
-
చంద్రబాబుకు నందిగం సురేష్ అదిరిపోయే కౌంటర్
-
జగన్ మాస్ లీడర్.. చిల్లర రాజకీయాలు మానుకోవాలి
-
Big Question: మేమే కార్య కర్తలం.. మేమే సేవకులం.. పోలీసులు లేకపోతే భయపడతారనుకున్నారు కానీ
-
Nandigam Suresh: కూటమి ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టదు
-
ప్రజల వ్యతిరేకతను జీర్ణించుకోలేక జగన్ పై కూటమి కుట్ర
-
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: మాజీ ఎంపీ నందిగం సురేష్
-
జైలు నుండి విడుదల తర్వాత నందిగం సురేష్ ఫస్ట్ రియాక్షన్
-
జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్
-
మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్
సాక్షి, గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే మాజీ ఎంపీ నందిగం సురేష్ను కూడా అరెస్టు చేశారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్ జైలులో ఉన్నారు. ఆధారాలు లేకుండా సురేష్పై కేసులు పెట్టారంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
మా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు: నందిగం సురేష్ సతీమణి
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎదుగుదల ఇష్టం లేకనే ఆయనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని సురేష్ సతీమణి బేబి లత ఆరోపించారు. ఈ విషయమై ఆమె మంగళవారం(జనవరి14) మీడియాతో మాట్లాడారు. ‘అర్ధరాత్రి మా ఇంటి చుట్టూ ఇద్దరు వ్యక్తులు బైక్పై తిరిగారు. ఒక వ్యక్తి బైక్ నడుపుతుంటే మరొక వ్యక్తి మా ఇంటి ఫోటోలు తీస్తున్నారు.దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నందిగం సురేష్ అనుచరులపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి నా భర్తను 134 రోజులు జైల్లో ఉంచారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాల్సిన కేసుల్లో కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు’అని బేబి లత ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు గతంలో జైలులో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. సురేష్కు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఆయన సుదీర్ఘ కాలం పాటు జైలులోనే ఉండాల్సి వస్తోందని ఆయన భార్య బేబిలత పలు సందర్భాల్లో వాపోయారు. సురేష్ బెయిల్ విషయమై సుప్రీం కోర్టులో కూడా ఆమె పిటిషన్ వేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కహానీలు చెబితే కడుపు నిండుతుందా..? -
‘‘గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు’’
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపి నందిగాం సురేష్(Nandigam Suresh) అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్పై కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) అన్నారు. మంగళవారం(డిసెంబర్ 24) గుంటూరు జైలులో సురేష్ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.‘ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ను ఎలా ఉంచాలి?అనేది చెబుతున్నారు... ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైఎస్సార్సీపిని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి.కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారు. గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్సార్సీపీకి ఉంది. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు’అని సజ్జల హెచ్చరించారు. -
నందిగం సురేష్ కేసు.. పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.మాజీ ఎంపీ సురేష్ బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నందిగం సురేష్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ..‘ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేరు. దర్యాప్తు అధికారి ఫేవర్ చేశారని స్థానిక జడ్జి ఎలా చెబుతారు. 2020లో రాయి తగిలి మృతిచెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడుగా చేర్చి సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం సురేష్పై కేసులు బనాయిస్తోంది. ఇతర కేసులు పెట్టి మాజీ ఎంపీని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాదనల అనంతరం, ధర్మాసనం పోలీసులకు నోటీసులు ఇచ్చింది.మరోవైపు.. సురేష్ బార్య బీబీ లత మాట్లాడుతూ..‘టీడీపీ ప్రభుత్వం మాపైన అక్రమ కేసులు బనాయిస్తోంది. దళితుడు ఎదగడాన్ని ఓర్చలేక అసూయతో కేసులు పెడుతున్నారు. నాలుగేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపోరాటంలో మేము గెలుస్తాం. దేవుడు, మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మాకు అండగా ఉన్నారని అన్నారు. -
నేడు సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ
-
నందిగం సురేష్ పై మరో అక్రమ కేసు..
-
ఒకే ఘటన.. రెండు కేసులు.. ఇది బాబు నీతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురి చేయడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం న్యాయ సూత్రాలను, చట్టాలను కూడా ఉల్లంఘిస్తోంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప మరేదీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్పై ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కేసులు పెడుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై ఒకే కేసుకు సంబంధించి, ఒకే వ్యక్తి ఇచ్చిన రెండు ఫిర్యాదుల ఆధారంగా రెండు కేసులు నమోదు చేసి చట్టాలను సైతం బేఖాతరు చేసింది. 2023లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై అప్పట్లోనే సురేష్పై తుళ్లూరు పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అదే ఘటనపై అదే వ్యక్తి మళ్లీ ఫిర్యాదు చేస్తే.. ఏడాదిన్నర తర్వాత శుక్రవారం మరో కేసు నమోదు చేయడం కూటమి సర్కారు కక్ష సాధింపులకు పరాకాష్టే. ఇక్కడే చట్టాలను, రెజ్యూడికాటాను సర్కారు ఉల్లంఘించింది.2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని రైతులు, పేదలను, వారికి అండగా నిలిచిన సురేష్ను అక్రమ కేసులతో వేధించింది. ఆ తర్వాత బాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ తమపై దాడి చేశాడంటూ 2023 మార్చి 31న విజయవాడకు చెందిన పనతల సురేష్ అనే వ్యక్తి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరోజు అమరావతి రాజధాని పర్యటనకు వచ్చిన తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన చేసిన ఫిర్యాదుపై అదే రోజున తుళ్లూరు పోలీసులు ఐపీసీ 294, 323, 427 రెడ్ విత్ 34 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మళ్లీ అదే పనతల సురేష్ అదే ఘటనపై ఏడాదిన్నర తర్వాత ఈ నెల 25న ఫిర్యాదు చేయగా.., నందిగం సురేష్పై ఐపీసీ 341, 143, 147, 307, 427 రెడ్విత్ 149 సెక్షన్లతో మరోసారి కేసు నమోదు చేశారు. ఇలా ఒకే ఘటనపై రెండు కేసులు (ఎఫ్ఐఆర్లు) నమోదు చేయడం ఒక తప్పు అయితే.. ఏకంగా హత్యా నేరం సెక్షన్లు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపులకు నిదర్శనం. ఇప్పటికే తనకు ఏ మాత్రం సంబంధం లేని రెండు కేసుల్లో నందిగం సురేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఓ పాత ఘటనలో మరోసారి కేసు పెట్టడమే కాకుండా, హత్యాయత్నం కేసు పెట్టడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల బలమైన ఆదేశాలే కారణమన్నది జగమెరిగిన సత్యం.రెజ్యూడికాటాను ఉల్లంఘించడమా..!వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులకు ప్రభుత్వం, పోలీసులు రెజ్యూడికాటాను ఉల్లంఘించడంపై న్యాయ నిపుణులు సైతం విస్తుపోతున్నారు. సహజ న్యాయ సూత్రాల్లో రెజ్యూడికాటా (లాటిన్ పదం) గురించి స్పష్టంగా విశదీకరిస్తున్నారు. ఒకే ఘటన, ఒకే వ్యక్తి ఫిర్యాదుపై ఒకటికి మించి కేసులు నమోదు చేయకుండా నిలువరించడమే రెజ్యూడికాటా. ఇలాంటి కేసులు సహజన్యాయానికి కూడా విరుద్ధమని ఇది స్పష్టం చేస్తుంది. ఒకే వివాదం లేదా ఒకే ఘటనలో అదే పార్టీల మధ్య వ్యాజ్యాలను పదే పదే విచారించడం వల్ల న్యాయ వ్యవస్థ సమయం కూడా వృథా అవుతుందనే దీనిని పరిగణనలోకి తెచ్చారు. ఏదైనా కేసులో తుది తీర్పు వెలువడకుండా అదే కోర్టులో అదే కేసుపై మరో వివాదాన్ని లేవనెత్తితే దాని పునఃపరిశీలనను తిరస్కరించేందుకు న్యాయస్థానం సైతం దీన్ని ఉపయోగిస్తుంది. ఈ రెజ్యూడికాటా క్రిమినల్ చట్టంలో డబుల్ జియోపార్డీ, నాన్ బిస్ అనే భావనను పోలి ఉంటుంది. క్రిమినల్ ప్రాసిక్యూషన్లో ఒకే నేరానికి ఒకే విధమైన ప్రాసిక్యూషన్ను మాత్రమే ఉండేలా చేయడంతోపాటు రెండో విచారణకు సంబంధించిన చర్యలను నిరోధిస్తుందని న్యాయ నిపుణులు విశదీకరిస్తున్నారు. -
నందిగం సురేష్కు వైద్య పరీక్షలు
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. -
నందిగం సురేష్ అరెస్ట్ప ఏపీ ప్రభుత్వానికి SC కమిషన్ నోటీసులు
-
నందిగం సురేష్కు బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేష్పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. -
విషపు కోరల్లో ఏపీ.. చంద్రబాబు కపట నాటకం అంబటి రాంబాబు ఫైర్
-
వంగలపూడి అనితకు గూబ పగిలే కౌంటర్
-
మా సునామీని తట్టుకోలేవు వైఎస్ జగన్ వార్నింగ్
-
వంగలపూడి అనితకు నందిగం సురేష్ భార్య వార్నింగ్
-
హోంమంత్రి అనితకు మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య సవాల్
సాక్షి, గుంటూరు: తన భర్తపై తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపారని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబిలత మండిపడ్డారు. ‘‘టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఒక్క ఆధారం చూపాలి. హోంమంత్రి అనిత తన పదవి కాపాడుకోవడం కోసం నా భర్తపై ఆరోపణలు చేస్తోంది’’ అని బేబిలత ధ్వజమెత్తారు.‘‘కృష్ణా నదికి వరద నా భర్తే తెచ్చాడా?. కృష్ణా నదిలొ కొట్టుకొచ్చిన బోట్లపై నా భర్త పేరు ఉందా?. అనిత తన బిడ్డలతో వస్తే.. నేను నా ఇద్దరు బిడ్డలతో వస్తా. తన బిడ్డల పై ప్రమాణం చేసి హోం మంత్రి అనిత నా భర్త పై చేసిన ఆరోపణలు నిరూపించాలి’’ అంటూ బేబీ లత సవాల్ విసిరారు. ఈ సవాల్ కి హోంమంత్రి అనిత సిద్ధమేనా?. మాజీ ఎంపీని వాడు వీడు అంటూ అనిత దిగజారి మాట్లాడుతుందంటూ బేబిలత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'! చంద్రబాబు సర్కార్ కుతంత్రం..కాగా, ఓ వైపు విజయవాడలో 7 లక్షల మందికిపైగా వరదలో చిక్కుకుని అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ మాత్రం వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ‘బోట్ల’ కుట్రకు తెరలేపింది. వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేశ్, తలశిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. -
రేపు నందిగం సురేష్ ను పరామర్శించనున్న YS జగన్
-
11న గుంటూరుకు వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి(సెప్టెంబర్ 11న) గుంటూరు వెళ్లనున్నారు. గుంటూరు జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ కార్యాలయం దాడి కేసు తిరగదోడి మరీ.. చంద్రబాబు ప్రభుత్వం సురేష్పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తోంది. ఈ క్రమంలో చట్టాన్ని, న్యాయస్థానాలను కూడా ఉల్లంఘిస్తోంది. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే.. నందిగం సురేష్ను కూడా అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ కేడరే కూటమి టార్గెట్మూడేళ్ల క్రితం(2021) నాటి సీఎం వైఎస్ జగన్పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషణలు చేశారు. దీంతో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘర్షణలకు సంబంధించిన కేసును అధికారంలోకి రాగానే.. చంద్రబాబు ప్రభుత్వం తిరిగి తెరిచింది. ఉద్దేశపూర్వకంగా.. కొంతమంది దగ్గరి నుంచి సాక్ష్యం పేరుతో స్టేట్మెంట్లు తీసుకుంది. ఆపై కొందరు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది. నేరం జరిగిన తర్వాత 60 –70 రోజులు దాటాక సాక్షిని విచారిస్తే చెల్లదు.. అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దాన్ని ఉల్లంఘించి మరీ నిందితుల జాబితాను పోలీసులు ఈ కేసులో సిద్ధం చేయడం గమనార్హం. ఈ కేసులో సురేష్ పేరును 80వ నిందితుడిగా చేర్చింది. -
వైఎస్సార్సీపీ కేడరే కూటమి టార్గెట్
నగరంపాలెం(గుంటూరు): టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అంటూ గుంటూరు, కృష్ణా జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో అక్రమంగా అరెస్టయి, గుంటూరుజిల్లా కారాగారంలో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పేర్ని నాని, ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేల్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, గుంటూరు ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్, నందిగం సురేష్ కుటుంబ సభ్యులు శుక్రవారం ములాఖత్లో విడివిడిగా కలిశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకి పంపిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలతో దొంగ సాక్ష్యాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం బాత్రూంలు, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీటీవీల ఫుటేజీ పోలీసుల వద్ద ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారని, ఆ పుటేజీల్లో ఎక్కడా లేని మాజీ ఎంపీ నందిగం సురే‹Ù, శ్రీనివాసరెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. ఈ కేసులో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న 171 మందిని తీసుకువచ్చారని, వారెవరూ సీసీ టీవీ ఫుటేజీల్లో లేరని తెలిపారు. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కుంగదీయాలనే కూటమి పెద్దలు ఇలా చేస్తున్నారని, వారి ఆశలు నెరవేరవని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేసినా తమ పార్టీకి ఏమీ కాదని, వారంతా తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. ఓవైపు వరదలతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా, అనేక మంది మృత్యువాత పడుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడంలేదని అన్నారు. కేవలం వైఎస్సార్సీపీ వారిపై కక్ష సాధించాలన్న తపనే ప్రభుత్వంలో కనపడుతోందన్నారు. ప్రభుత్వ పెద్దల తప్పుడు చర్యలే వరదలకు, భారీ నష్టానికి కారణమన్నారు. వరద బాధితులను కాపాడేందుకు, వారికి ఆహారాన్ని అందించేందుకు పోలీసులను పంపడంలేదని, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమే‹Ùను పట్టుకునేందుకు ఓ వంద మంది, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆచూకీ కోసం మరో 200 మంది పోలీసులను పంపించడం కూటమి ప్రభుత్వ నీచత్వానికి పరాకాష్ట అని అన్నారు. -
నందిగం సురేష్ అరెస్ట్ పై పేర్నినాని రియాక్షన్
-
YSRCP నేతల అరెస్ట్.. వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
మాజీ ఎంపీ సురేష్ కు 14రోజుల రిమాండ్
సాక్షి, అమరావతి/మంగళగిరి : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను బుధవారం అర్థరాత్రి దాటాక హైదరాబాద్లో అరెస్టుచేసిన పోలీసులు ఆయనను గురువారం ఉ.8.30 గంటలకు మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుచేసిన పోలీసులు స్టేషన్లో ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈయనతోపాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసులరెడ్డిని కూడా అరెస్టుచేసిన మంగళగిరి రూరల్ పోలీసులు వీరిద్దరినీ మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం వీరిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో తమను అడ్డుకోలేరని, 2029లో చంద్రబాబుకు బుద్ధిచెప్పి తీరుతామన్నారు. కక్షతోనే తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెడుతున్నారని.. ప్రజలు, దేవుడు చూస్తున్నారని చెబుతూ జై జగన్ అంటూ నినదించారు. అంతకుముందు.. స్టేషన్ వద్ద సురేష్ సతీమణి బేబీలత మాట్లాడుతూ.. తన భర్తపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టారన్నారు. కేసులతో తమను భయపెట్టలేరని, 2019కు ముందు పొలాల దగ్థం కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని అప్పట్లో తన భర్తపై టీడీపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా లొంగలేదని.. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడేదిలేదని స్పష్టంచేశారు. ఇక సురే‹Ùను అరెస్టుచేశారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్బాబు, వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల అమలు కమిటీ మాజీ చైర్మన్ నారాయణమూర్తి, గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాలవజ్ర బాబు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కమ్మూరి కనకారావు తదితరులతో పాటు కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకుని ఆయనకు మద్దతు పలికారు. -
బాబుకు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి వస్తుంది..
-
నందిగం సురేష్ అరెస్ట్ పై సుదాకర్ బాబు స్ట్రాంగ్ రియాక్షన్
-
‘నా భర్తకు ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత’
గుంటూరు, సాక్షి: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్పై నందిగం సురేష్ భార్య బేబీ లలిత మీడియాతో మాట్లాడారు.‘నా భర్త మీద అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబుదే బాధ్యత. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నా భర్తకు అభిమానం. అదే చంద్రబాబుకు నచ్చలేదు. ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేసేంత తప్పులు చేశారంటే అందులో మొదట ఉండేది చంద్ర బాబే. సింగ్ నగర్ సాక్షిగా చంద్ర బాబుని అరెస్ట్ చెయ్యాలి’ అని అన్నారు.అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ అంతకు ముందు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు హైదరబాద్లో నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. డీఎస్పీ మల్లికార్జున రావు నేతృత్వంలోని పోలీసుల బృందం.. సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరుల వద్ద ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకుని గుంటూరు మంగళగిరి రోడ్డు పోలీస్ స్టేషన్కు తరలించారు.స్టేషన్ గేట్లు మూసేసినందింగం సురేష్ తరలింపుపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నేతలు మంగళగిరి రోడ్డు పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. సురేష్ని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ సురేష్ను కలవనీయంగా పోలీసులు స్టేషన్గేట్లను మూసివేశారు. గేటువద్దే వారిని అడ్డుకున్నారు. -
చంద్రబాబుకి నందిగం సురేష్ భార్య వార్నింగ్
-
మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ అరెస్ట్
-
వరద విపత్తులో బాబు బురద రాజకీయం..
-
టీడీపీ అక్రమ కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
సాక్షి, అమరావతి: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ను ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లో అరెస్టు చేశారు. డీఎస్పీ మల్లికార్జునరావు నేతృత్వంలోని పోలీసుల బృందం.. నందిగం సురేశ్ మియాపూర్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరుల వద్ద ఉన్న ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. వారిని ఏపీకి తరలిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేశ్పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. ఓవైపు భారీ వర్షాలు, వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే.. వారిని గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘నా భర్తకు ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత’
గుంటూరు, సాక్షి: తన భర్తకు ఏమైనా హాని జరిగితే దానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని మాజీ వైఎస్సార్సీపీ ఎంపీ నందిగామ సురేష్ భార్య బేబీలతా అన్నారు. కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన దగ్గరనుంచి చంద్రబాబు నాయుడు నందిగామ సురేష్ టార్గెట్ చేశారని తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘నందిగామ సురేష్పై అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తున్నాం. విజయవాడలో వరద సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలమైంది.విజయవాడ వరద వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి నందిగాం సురేష్ను అరెస్టు చేయడానికి రెడీ అయ్యారు. కోర్టులో జడ్జీ ఆదేశాలు ఇవ్వక ముందే పోలీసులు మా ఇంటిపైన వచ్చిపడ్డారు’ అని అన్నారు. -
ఏపీకి రావాలంటే భయమేస్తుంది.. ఢిల్లీలో వినిపిస్తున్న మాటే..
-
ఓట్లకోసం అంబేద్కర్ ను వాడుకుని వదిలేసిన వ్యక్తి చంద్రబాబు
-
అంబేద్కర్ విగ్రహాన్ని కూటమి సర్కార్ కూల్చే అవకాశముంది: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ కామెంట్స్ చేశారు.కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘భావితరాలకు దికూచ్చిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారు. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టమంటే చంద్రబాబు కేసులు పెట్టారు. ఎక్కడైనా విగ్రహం పెట్టినప్పుడు చూడటానికి వెళ్లినా కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు విజయవాడలో అంబ్కేదర్ విగ్రహంపై దాడికి ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముంది. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే దాడి చేశారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ చేపట్టాలి. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.ఇదే సమయంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ..‘ప్రజల దృష్టిని మళ్లించడానికే అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా కమిటీలు వేస్తామని కథలు చెబుతున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.మరోవైపు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి. ప్రభుత్వమే ఈ దాడి చేయించిందనే అనుమానం కలుగుతోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారంటే వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయి అనేది అర్థం చేసుకోవచ్చు. విగ్రహం వద్ద వైఎస్ జగన్ పేరుని తొలగించవచ్చేమో కానీ ప్రజల గుండెల్లో ఆయన పేరును తొలగించలేరు. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు దగ్గరలోనే ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు?. సామాజిక న్యాయం కోసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. కూటమి నేతలకు సామాజిక న్యాయం అంటే పట్టదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇదే ఘటనపై తిరుపతిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం వద్ద దాడిని ఖండిస్తున్నాను. అన్ని జాతులకు ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆరాధ్యదైవంగా అంబేద్కర్ను భావిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. దేశానికే ఆదర్శంగా ఉండాలని వైఎస్ జగన్ విజయవాడ నడి బొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే చూస్తూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి అని కామెంట్స్ చేశారు. -
బాబు అరాచక పాలనపై నందిగం సురేష్ ఫైర్
-
కొలికపూడిపై నందిగం సురేష్ ఫైర్
-
ఎంపీ నందిగం సురేష్పై టీడీపీ దాడి
యద్దనపూడి: ప్రచారం నిమిత్తం వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై పర్చూరు నియోజకవర్గ పరిధిలోని యద్దనపూడి మండలం చింతపల్లిపాడు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం దాడికి తెగబడ్డారు. ఎంపీ ప్రయాణిస్తున్న కారును అడ్డగించి చెప్పులు విసిరారు. ఎంపీపైనా, వైఎస్సార్సీపీ శ్రేణులపైనా పిడిగుద్దులతో దాడికి దిగారు. సుమారు గంటపాటు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మార్టూరు మండలం వలపర్ల ఎస్సీ కాలనీలో పర్యటన నిమిత్తం ఎంపీ నందిగం సురేష్ యద్దనపూడి నుంచి ర్యాలీగా మార్టూరు వైపు బయలుదేరారు. సాయంత్రం 3.45 సమయంలో చింతపల్లి చేరుకున్నారు. ఇంతలో టీడీపీ ఎన్నికల ప్రచార ర్యాలీ ఎదురుపడింది. దీంతో ఎంపీ తన వాహనంతో పాటు వెనుక వచ్చే వాహనాలను సైతం పక్కకు ఆపారు. ఎంపీ వాహనాన్ని గమనించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు సమీపానికి రాగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. చెప్పులు తీసి ఎంపీ కారు అద్దాలపై కొడుతూ కారులో ఉన్న ఎంపీని బూతులు తిట్టారు. నీ అంతు చూస్తామంటూ రాయడానికి వీలుపడని పదజాలంతో దూషించారు. టీడీపీ కార్యకర్తలు ఎంపీ కారుపైకిఎక్కి కాళ్లతో కారు పైభాగాన్ని తన్నుతూ వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటివరకు సంయమనం పాటించిన ఎంపీ సురేష్ కారు దిగి కారుపై ఉన్న వారిని కిందకు దిగాలని కోరారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు జెండా కర్రలతో ఆయనపైన, అనుచరులపైన దాడికి పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించిన ఎంపీ నందిగం సురేష్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకుని పంపించి వేశారు. దాడి నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి చింతపల్లిపాడు నుంచి యనమదల మీదగా యద్దనపూడి పోలీస్స్టేషన్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు. అనంతరం సీఐ సీతారామయ్య, ఎస్సై జీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదు మేరకు 15 మంది టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఎంపీపై దాడి విషయం తెలుసుకున్న వందలాది మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు స్టేషన్కు చేరుకున్నారు.ఓటమి భయంతోనే దాడులుపోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. తనపై జరిగిన దాడి ఘటనను వివరిస్తూ.. ‘ఎన్నికల ప్రచారం కోసం చింతపల్లిపాడు మీదుగా మార్టూరు మండలం వలపర్ల వెళ్తుండగా టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. చింతపల్లిపాడులో టీడీపీ ర్యాలీ జరుగుతుండటతో నా కారును పక్కన పెట్టుకుని ఉండగా.. కొంతమంది టీడీపీ నాయకులు నా కారును మోటార్ సైకిళ్లతో చుట్టుముట్టారు. కాళ్లతో నా కారును ఎగిరెగిరి తన్నటం ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు నా కారును చుట్టుముట్టి నానాబూతులు తిట్టడం మొదలెట్టారు. దీంతో నేను కారు దిగి కారును ఎందుకు గుద్దుతున్నారని ప్రశ్నించగా.. వారిలో ఓ వ్యక్తి సీఎం జగన్ను దూషించటమే కాకుండా వాడు పోటీ చేయించేవాడు, నువ్వు పోటీ చేసేటంత వాడివా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించటం ప్రారంభించాడు. మరో నెల రోజులు ఆగండి. మా అమరావతి పవర్ ఏమిటో చూపిస్తా’మంటూ బూతులు తిట్టారు. వివాదాలు దేనికని భావించి పక్కకు తొలగండని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా కర్రలతో దాడికి ప్రయత్నించారు. దీనిని చూసి అక్కడకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు రావటంతో కొంత వెనక్కి తగ్గారు. నేను ఇంకొల్లు సీఐకి సమాచారమిచ్చాను. ఈలోగా కొందరు మహిళలు నాకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని చెప్పారు. ‘టీడీపీ నాయకులు ఆడవాళ్లు అని కూడా చూడకుండా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై గతంలో కూడా ఎస్సీ కాలనీ వాసులు తమపై రోజురోజుకూ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ ఘటనతో టీడీపీ అరాచకాలను ప్రత్యక్షంగా చూశాను. ఇదేవిధంగా ఉంటే మమ్మల్ని ఓట్లు వేయినిస్తారా అని ఎస్సీలు చెప్పటం చూస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ద్వారా మాకు చాలా ప్రమాదం పొంచి ఉందని ప్రజలు చెబుతున్నారంటే ఇక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి’ అని ఎంపీ నందిగం వివరించారు. టీడీపీ నాయకులు ఎన్ని అవరోధాలు, అవాంతరాలు స్పష్టించినా 13న జరిగే ఎన్నికల పోలింగ్లో పర్చూరు ఎమ్మెల్యేగా యడం బాలాజీ, ఎంపీగా తాను, సీఎంగా జగన్మోహన్రెడ్డి గెలుపును అపటం ఎవరితరం కాదన్నారు. యడం బాలాజీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా భౌతిక దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇలా రెచ్చగొట్టేలా దూషించటం, దాడులకు పాల్పడటం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. -
వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
చేతకాని సన్నాసులు.. సీఎం జగన్పై దాడి.. నందిగామ సురేష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
దళితులు, డ్రైవర్లంటే అంత చిన్నచూపా చంద్రబాబూ?
సాక్షి, తాడేపల్లి: దళితులు వేలిముద్రగాళ్లని, డ్రైవర్లంటూ ఎగతాళి చేసిన చంద్రబాబుకు రాజకీయ సమాధి కడతామని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అహంకారానికి దళిత, బీసీ, మైనార్టీలు, డ్రైవర్లు తగిన బుద్ధి చెబుతారన్నారు. ‘‘చంద్రబాబు రక్తంలోనే కులపిచ్చి ఉంది. అందుకే, దళితుల్ని పదేపదే అవమానిస్తున్నాడు. దళితుల్లోఎవరైనా పుట్టాలని కోరుకుంటారా.? అని నాడు అవమానించాడు. సీఎం జగన్ నేడు ఎస్సీ వ్యక్తికి ఎమ్మెల్యే సీటిస్తే వేలిముద్రగాళ్లకూ సీట్లంటూ ఎగతాళి చేస్తున్నాడు. పేదోడి పట్ల ప్రేమ చూపే జగన్ మళ్లీ సీఎం అవుతారు’’ ఎంపీ సురేష్ అన్నారు. నందిగం సురేష్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. దళితుల పట్ల మరోసారి చంద్రబాబు అహంకారం: రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనుభవమున్న నాయకుడిగా చెప్పుకునే నారా చంద్రబాబు ఎస్సీల పట్ల తనకున్న భావాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఒక మీటింగ్లో ఒక ఎస్సీ నాయకుడి గురించి ఏం మాట్లాడారో అందరం చూశాం. అదే విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. (శింగనమల వైఎస్సార్సీపీ అభ్యర్థి గురించి చంద్రబాబు ఏమన్నారో.. ఆయన వ్యాఖ్యల వీడియోను ప్లే చేసి చూపారు) ఎస్సీలను ఉద్దేశించి ఇదే చంద్రబాబు గతంలో ఏమన్నారు..? ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారంటూ ఎస్సీలను తీవ్రంగా అవమానించా డు. ఇవాళేమో.. ఎడమచేత్తో వేలిముద్ర వేసేవాళ్లు టిప్పర్ డ్రైవర్లంటూ ఎస్సీ నాయకుడి గురించి ఎగతాళిగా మాట్లాడాడు. చంద్రబాబు అనే వ్యక్తి నీచ సంస్కృతి కలిగిన వాడనేందుకు ఇంతకన్నా వేరే నిదర్శనమేదీ లేదు. ఏంటి .. ఆయన అహంకారం..? ఎస్సీలు రాజకీయ నాయకులుగా ఎదగకూడదని ఆయన భావించడం చాలా బాధాకరం. బాబు రక్తంలోనే కులపిచ్చి: గతం నుంచి ఇప్పటిదాకా చూస్తే చంద్రబాబుకు కులపిచ్చి కొనసాగుతూనే ఉంది. అది ఇక ఎప్పటికీ ఆయన్నుంచి పోయేది కాదు. ఎందుకంటే, కుల పిచ్చి అనేది ఆయన రక్తంలోనే ఇమిడిపోయి ఉంది. సామాన్యుడైన ఒక దళితుడు టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తుంటే.. ఆ పేదవాడిని వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించి పిలిచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటిస్తే.. చంద్రబాబుకు మాత్రం ఆ దళితుడి పట్ల అంత చిన్నచూపా..? జగన్ గారి నిర్ణయం పట్ల మీకెందుకంత చులకన భావం..? అంటే, నీ దృష్టిలో దళితులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పనికిరారా..? నీ జీవితంలో ఎన్ని సార్లు దళితులను అదేపనిగా అవమానిస్తావు..? దళితులు.. డ్రైవర్లంటే అంత చిన్నచూపా..?: దళితులకు రాజకీయ పదవులొస్తే నీకెందుకు అంత కడుపుమంట? డ్రైవర్ల పట్ల మీకెందుకంత చిన్నచూపు..? టిప్పర్డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు దేనికీ పనికిరారనట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మరి, రాష్ట్రంలో ఆటోడ్రైవర్లుగా.. టిప్పర్ డ్రైవర్లుగా లక్షల మంది పనిచేస్తున్నారు. ఆఖరికి, చంద్రబాబుకు, లోకేశ్కు, ఆయన కోడలి కార్లు నడుపుతున్నవారంతా డ్రైవర్ల వ్యవస్థ నుంచి వచ్చినవారే కదా..? వాళ్లు లేకపోతే.. రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలకు ఒక్క పూట గడవదనే సంగతి అందరికీ తెలుసు. ఆర్టీసీ గానీ.. ఇతర ట్రాన్స్పోర్టు వ్యవస్థలైనా ప్రతీరోజూ డ్రైవర్ల మీద ఆధారపడే ముందుకు నడుస్తూ ఉన్నాయి. అంతటి గొప్పదిగా డ్రైవర్ల వ్యవస్థను మనమంతా గుర్తించాల్సిందే. అలాంటి గొప్ప డ్రైవర్లను పట్టుకుని.. అందునా ఒక దళిత నాయకుడ్ని ఎడమచేత్తో వేలిముద్ర వేసేవాళ్లంటూ చంద్రబాబు ఎగతాళి చేస్తున్నాడు. నీకులాగ వెన్నుపోట్లు, మోసాలు మాకు తెలియవు: చంద్రబాబు ఒక సంగతి గుర్తించాలి. నీకులాగా మోసాలు చేయడం, వెన్నుపోటు పొడవడమనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకో.. డ్రైవర్ల వ్యవస్థలో పనిచేసేవారికో ఎవరికీ తెలియదు. నీలాంటి నీచ సంస్కృతికి మేం ఆమడదూరంలో ఉంటాం. నీకులాగా తిరుపతిలో జేబులు కొట్టి బతకడం మావల్ల కాలేదు. నమ్మినోడిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకుని సొంత తమ్ముడ్ని ఇంట్లో కట్టేసి చిత్రహింసలు పెట్టే కిరాతకులం మేం కాదు. వెన్నుపోట్లు, మోసాలు నీ పేటెంట్ హక్కులని అందరికీ తెలుసు. నీ కులంలో పుట్టిన నీ తండ్రే గొప్పోడా..?: చంద్రబాబూ.. నిన్నొక ప్రశ్న అడుగుతున్నాను. నీ తండ్రి ఏం చేశాడు..? అమెరికాలో పెద్ద కార్పొరేట్ కంపెనీ వ్యవస్థ నడపలేదు కదా..? చిన్న రైతుగా వ్యవసాయం చేసినోడే కదా..? మరి, అతను వేలిముద్రతో పుట్టలేదా..? మరి, నీ కులంలో పుట్టినోడు గొప్పోడు ఎలా అయ్యాడు..? మా ఎస్సీల్లోనో.. ఎస్టీల్లోనే పుట్టినవాడు వేలిముద్ర వేసే వ్యక్తిగా ఎలా తక్కువయ్యాడో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. రెండెకరాలతో రాజకీయంలోకి వచ్చినోడివి ఇవాల్టికి రూ.6 లక్షల కోట్లు ఎలా సంపాదించావు...? నీ బతుకే 420 బతుకుని గూగుల్లో కొట్టినా తెలుస్తోంది. నీ కంచంలో కూడు లాక్కోలేదుగా? ఎవరో పెట్టిన రాజకీయ పార్టీని వెన్నుపోటుతో లాగేసుకోవడం.. ఎవరో డబ్బు పెడితే నీ కొడుకును విదేశాల్లో చదివించుకోవడం.. మోసాలు, దగాలు చేసి మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికార పీఠం ఎక్కడం.. వంటి నీచసంస్కృతి ఏనాడూ మా దళితుకు తెలియవు. మా రక్తంలో కూడా అలాంటి తప్పుడు ఆలోచనలు ఉండవు. మా జీవితాలను మొదట్నుంచి నువ్వు ఎక్కిరిస్తూనే ఉన్నావు. ఏనాడైనా.. చీమూనెత్తురు ఉన్నోడైతే, మాపట్ల గౌరవం మర్యాదగా మసలుకుంటాడని ఆశిస్తే.. అవేమీ లేనోడిగా బతుకుతున్న నీచపు కుక్క ఈ చంద్రబాబు. నీ కంచంలో కూడు మేం ఏమైనా లాక్కున్నామా..? టిప్పర్ డ్రైవర్గా పనిచేసినా.. వేలిముద్ర వేసేవాడైనా మా ఎస్సీ అభ్యర్థి తన కష్టంతో తన కూడు తాను తింటున్నాడు తప్ప.. నీకులాగా ఇతరుల కూడును లాక్కుని తినడం లేదు. నీ దగ్గర పనిచేసే కొండల్రెడ్డి అనే డ్రైవర్ ఎందుకు చనిపోయాడో.. ఎలా చనిపోయాడో సమాధానం అడిగితే చెప్పలేని వ్యక్తి ఈ చంద్రబాబు. మాకు తెలిసిందల్లా నీతిగా బతకడమే: రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులేసి నీకులాగా పదవుల్ని ఆక్రమించుకోవడం మాకు తెలియదు చంద్రబాబూ.. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తెలిసిందల్లా నీతిగా బతకడమే. కాయాకష్టం చేసుకుని పనిచేసే దగ్గర పని ఇచ్చిన వ్యక్తి దగ్గర నమ్మకంగా ఉండటమే మాకు తెలుసు. నీలాంటి నీచ సంస్కృతిని నీ కొడుకు లోకేశ్కు నేర్పుకున్నావేమో.. అతను కూడా నిన్నేం మించిపోడు. లోకేశ్ అనే వ్యక్తి ఒక హాఫ్నాలెడ్జ్ ఫెలో.. నువ్వు నేర్పిన బుద్ధులతోనే మాట్లాడుతాడు గానీ.. మా తల్లిదండ్రులు మాత్రం అలాంటి వాటిని మాకు నేర్పలేదు. నువ్వు కించపరిచినోళ్లే..నిన్ను నిలదీస్తారు చూడు: నందమూరి కుటుంబాన్ని చేతిలో బొమ్మల్లాగా ఆడిస్తూ తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుని ఇన్నాళ్లూ దళిత, బీసీ, మైనార్టీల సొమ్ముతో బాగుపడ్డావు. అధికారం తలకెక్కి నీ వాపును బలుపనుకుంటున్నావు. ఇన్నాళ్లకు నీకు దళితులు, డ్రైవర్లు వేలిముద్రగాళ్లుగా కనిపిస్తున్నారేమో.. రేపటికి.. అదే వేలిముద్రగాళ్లు నాయకులుగా అసెంబ్లీలోనో.. మరెక్కడ్నో.. నిన్ను నిలదీసే పరిస్థితి వస్తుంది చూసుకో.. ఇవాళ, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావో.. వాటన్నింటికీ, నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని రాసిపెట్టుకో చంద్రబాబు. పేదోడి పట్ల జగన్ ప్రేమ అది: ఇదే అమరావతి ప్రాంతంలో ఒక సామాన్య ఎస్సీ కార్యకర్తను నువ్వు కించపరిస్తే.. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు మాత్రం అదే వ్యక్తిని ఎంపీని చేశారు. ఆ వ్యక్తే నందిగం సురేష్ అనే నేను. పేదోడి పట్ల శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రేమ అది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేద కుటుంబాల్లో పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాల్లో నిలబెట్టాలని సంకల్పించి పనిచేస్తున్నారు మా నాయకుడు సీఎం జగన్ ఆయనకు కులాలు, మతాలతో సంబంధం లేదు. ఏనాడూ ఆయన మమ్మల్ని చులకనగా చూడలేదు. చిన్నబుచ్చినట్లు ఎక్కడా పల్లెతు మాటా అనలేదు. అలాంటి గొప్ప నేతల పక్కన దళితులు, బీసీలు, మైనార్టీలు ఉంటారు. నీ బతుక్కి నీ హయాంలో ఏనాడైనా పేదోడి పిల్లోడు ఐక్యరాజ్యసమితికి వెళ్లి ఆ వేదికపై మాట్లాడిన సందర్భం ఉందా..? అదే మా జగనన్న గడచిన నాలుగున్నరేళ్లల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని కాపాడారు. కాబట్టే.. ఆయన్ను జీవితాంతం మా వర్గాలు గుండెల్లో గుడి కట్టుకుని దేవుడిలా పూజిస్తాయి. రేపటి ఎన్నికల్లో మేమంతా ఆయన్నే మరోమారు సీఎంగా చూసుకుంటాం. ఇది తథ్యం. నీ రాజకీయ సమాధి మా చేతుల్లో ఖాయం: ఒకటికి పలుమార్లు మమ్మల్ని చులకన భావంతో మాట్లాడుతుంటే.. నీకు రాజకీయ సమాధి కట్టాలని దళితులంతా పూనుకుంటుంటే.. నీలో మా పట్ల రోజురోజుకూ అక్కసు పెరుగుతోంది. ఇది మేం గ్రహించాం. ఆయన అహంకారానికి భవిష్యత్తులో తప్పకుండా మేం సమాధానమిస్తాం. రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు శాశ్వత రాజకీయ సమాధి ఖాయమని చెబుతున్నాం. టీడీపీలో ఉన్న దళిత నాయకులు కూడా చంద్రబాబు అహంకార ధోరణిని గ్రహించి ఆయన్ను నిలదీయాలని కోరుతున్నాను. -
చంద్రబాబు,పవన్ ను ఏకిపారేసిన నందిగం సురేష్
-
ఇదే నాకు ఎక్కువ ఆనందాన్ని కలిగించింది : నందిగం సురేష్
-
నాతో అభ్యర్థుల ప్రకటన..కన్నీళ్లు పెట్టుకున్న నందిగాం సురేష్
-
చంద్రబాబుకు మాస్ సవాళ్లు విసిరిన నందిగామ సురేష్, అనిల్ కుమార్ యాదవ్
-
బాబు, పవన్ కు కొడాలి, నందిగాం సురేష్ కౌంటర్
-
పవన్ కళ్యాణ్ బండారం బయటపెట్టిన నందిగం సురేష్
-
చంద్రబాబు, పవన్, లోకేష్ పై ఎంపీ నందిగం సురేష్ ఫైర్
-
‘రాజధాని’పై చర్చకు రండి.. టీడీపీ నేతలకు ఎంపీ సురేష్ సవాల్
సాక్షి, తాడేపల్లి: వయసు పెరిగేకొద్దీ చంద్రబాబుకు అసహనం పెరుగుతోందని, రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వీరుడు, శూరుడైతే పవన్ చంక ఎందుకు ఎక్కారంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడావో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నావ్? అంటూ సురేష్ నిలదీశారు. ‘‘రాజధానిలో పచ్చటి పొలాలను సర్వనాశనం చేసింది చంద్రబాబే. బలవంతంగా భూ సేకరణ చేయలేదని మనవడిపై ఒట్టేసి చెప్పాలి. హైదరాబాద్ని అభివృద్ధి చేసిన మగోడివైతే మరి ఏపీని ఎందుకు అభివృద్ధి చేయలేదు?. అబద్దాల బతుకు ఇంకెంతకాలం?. కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచే చంద్రబాబు పర్చూరు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఉన్న చెత్త చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా అధినేతలే’’ అంటూ ఎంపీ సురేష్ దుయ్యబట్టారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలిచినట్టు చంకలు కొట్టుకుంటున్నారు. రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా తీసి ఆత్మవంచన చేసుకున్నారు. రాజధానిని కుల రాజధానిగా మార్చారు. జగన్ని చూసి చంద్రబాబు భయపడుతున్నారు. పంటపొలాలను ఎవరు కాల్చారో నార్కో టెస్టులతో తేల్చుకుందామా?. నాలుగు వందలు చొప్పున జనానికి ఇచ్చి సభకు తెచ్చుకునే దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎస్సీలను దొంగల్లాగా చిత్రీకరించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎస్సీలు, బీసీలతో పెట్టుకునే 2019లో ఓడిపోయాడు. ఒళ్లంతా రోగాలని చెప్పుకుని బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ ఎంపీ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజలకు భవిష్యత్తు ఇవ్వటమేంటి?. రాజధానిపై చర్చకు 24 గంటల సమయం ఇస్తున్నా. దమ్ముంటే ఎవరైనా సరే చర్చకు రావాలంటూ ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. ఇదీ చదవండి: రాజధాని ‘ఫెయిల్స్’.. బాబు ‘భ్రమరావతి’ -
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదు: ఎంపీ సురేశ్
-
‘పవన్ దమ్ము చాలదని బీజేపీ కాళ్ళా వెళ్ళా పడుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని తిట్టిన చంద్రబాబు మళ్లీ బీజేపీ నేతల గుమ్మం దగ్గర నిలబడడం సిగ్గు చేటు అని వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మండ్డిపడ్డారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రజలకు చేసిందేమిటో చెప్పకుండా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. తన మీద తనకు నమ్మకం లేక పొత్తుల కోసం తాపత్రయపడుతున్నారు. ..పవన్ కల్యాణ్ దమ్ము చాలదని, బీజేపీ కాళ్లా వెళ్ళా పడుతున్నాడు. చంద్రబాబు 14 ఏళ్ళల్లో దోచుకున్నాడు. తన జీవితంలో చంద్రబాబు ఏనాడూ సొంతంగా పోటీ చేసి గెలవలేదు. ఒక్కడుగా ఎదుర్కొనే ధైర్యం లేక.. పవన్, బీజేపీ, కాంగ్రెస్తో చంద్రబాబు జత కట్టాడు. భయంతో చంద్రబాబు రేపు కేఏ.పాల్తో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. చంద్రబాబు జిమ్మిక్కులతో సర్వేలు చేయించాడు’ అని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. తన పాలనలో మంచి జరిగితేనే ఓటు వేయాలని అడిగే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని అన్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. పేదల ఖాతాల్లో ఉందని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. చదవండి: నేరుగా వెళ్లి పులిబోనులో పడ్డట్లుగా.. జనసేన రాజకీయ వైనం! -
జగన్ ను ఓడించాలంటే అటువైపు కూడా జగనే ఉండాలి
-
కేఏ పాల్ కు ఉన్న దమ్ము కూడా షర్మిలకు లేదు
-
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: నందిగం సురేష్
సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్దేనని అన్నారు. సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే -
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర
-
AP: మళ్లీ జగనే సీఎం: బస్సు యాత్రలో ఎంపీ నందిగాం
అన్నమయ్య, సాక్షి: రైల్వేకోడూరు ప్రజల అనందం చూస్తుంటే ఎమ్మెల్యేగా శ్రీనివాసులు, మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించడం ఖాయంగా కనిపిస్తోందని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. రైల్వేకోడూరులో బుధవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ నందిగాం సురేష్బాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని కోరారు. ‘నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనకు పద్నాలుగున్నర నెలల చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉంది. చంద్రబాబు పాలనలో కుళ్లు కుతంత్రాలు తప్ప చేసిందేమీ లేదు. బినామీలకు దోచిపెట్టారు. బాబు ఎవరికీ చేసిందేమీ లేదు. ఏమి చేశారంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెన్నుపోటు గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు. అదే వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి కృషి చేశారు. ఎంత మంది ఏకమై వచ్చినా ఊడేదేమి లేదు. రాష్టానికి మేలు చేసే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఏపీకి దశ దిశ చూపే వ్యక్తి సీఎం జగన్. కోడూరు అభివృద్దికి జగన్ అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి శ్రీనివాసులు. మీరు మళ్లీ అవకాశమిస్తే మళ్లీ మంత్రి అవుతారు’అని ఎంపీ సురేష్ అన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నవ్వులోనే ఎవరికి ఏ కష్టమోచ్చినా అండగా నేను ఉన్నానన్న నమ్మకం కలుగుతుంది. యాదవులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ రాజకీయ సమానత్వం తీసుకువచ్చారు. చంద్రబాబు మాత్రం బడుగు బలహీన వర్గాల వారిని అవమానపరిచారు. ఇలాంటి సీఎంను, ఎమ్మెల్యే శ్రీనివాసులును మళ్లీ భారీ మోజార్టీతొ గెలిపించాలి’ అని రమేష్ యాదవ్ అన్నారు. ఇదీచదవండి.. కేశినేని నాని వర్సెస్ చిన్ని -
సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరిస్తున్న YSRCP నేతలు
-
ఎంపీ నందిగం సురేశ్ కారును ఢీకొట్టే ప్రయత్నం
తాడేపల్లి రూరల్: దళిత ఎంపీ నందిగం సురేష్ కారును మరో కారుతో ఢీకొట్టేందుకు మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. బాపట్ల ఎంపీ సురేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. అమరావతి కరకట్ట వెంబడి ఇస్కాన్ టెంపుల్ సమీపంలో బిబి1 మధ్య జరిగిన ఈ సంఘటనలో ఎంపీ కారును ఢీకొట్టబోయిన కారులో ఉన్నవారు బొటనవేలు, చిటికెనవేలు చూపిస్తూ, చూపుడు వేలుతో వార్నింగ్ ఇచ్చి ప్రకాశం బ్యారేజ్ వైపు పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఎంపీ సురేష్ పీఎస్వో బషీర్ తెలిపిన వివరాల మేరకు.. సురేష్ కాన్వాయ్ కరకట్ట మీదుగా వెళుతున్న సమయంలో ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఉద్దేశపూర్వకంగా ఏపీ16 జెఎఫ్ 0828 గల కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఆపి ఉన్న కారు ఒక్కసారిగా రోడ్డు మీదుగా వచ్చి ఎస్కార్ట్ వాహనాన్ని, సురేష్ కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. డ్రైవర్ అప్రమత్తమై కారును కంట్రోల్ చేశారు. లేకపోతే కారు కరకట్ట మీద నుంచి 30 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయేది. ఏపీ16 జెఎఫ్ 0828 కారులో డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి కారు అద్దాలు దించి చూపుడువేలుతో వార్నింగ్ ఇస్తూ, టీడీపీ సింబల్ అయిన విక్టరీ సింబల్ చూపిస్తూ నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇస్తున్నట్లు సైగలు చేశాడు. వెళ్లిపోబోతున్న కారును ఆపడంతో అందులో ఉన్న వ్యక్తి కిందకు దిగి వేళ్లు చూపిస్తూ ఎంపీ అయితే ఏమిటి.. త్వరలోనే మీ సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. కారుకు అడ్డుగా నిలిచిన బషీర్ను ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. ఎంపీ సురేష్ వచ్చి కారులో డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న వ్యక్తిని నువ్వెవరని ప్రశ్నించగా.. నీకు చెప్పేది ఏమిట్రా అంటూ కారు ఎక్కుతూ మరోసారి చేతివేళ్లు ఊపుతూ నీ సంగతి తేలుస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కారులో డ్రైవర్తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ ఘటనపై తుళ్ళూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి కారు నంబరు ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని బషీర్ తెలిపారు. -
లోకేష్, పవన్ పై నందిగామ సురేష్ సెటైర్లు
-
మోడీ పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఏమ్మన్నారంటే..!
-
సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తున్న నేతలు
-
నందిగాం సురేష్: చంద్రబాబు దోచుకోవడం తప్పిస్తే ఏం చేశారు
-
గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మోసం చేసింది
-
చంద్రబాబు కొంతమంది దొంగల కోసం పనిచేశారు: నందిగం
-
సామాజిక న్యాయంలో చరిత్ర సృష్టించిన జగన్
పామర్రు: సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే చరిత్ర సృష్టించారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని, అనేక కార్యక్రమాలతో ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రీ ఈ ఘనత సాధించలేదన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేబినెట్ సహా అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారని, మహిళలకు 50 శాతం పదవులిచ్చారని అన్నారు. ఇది ఓ చరిత్రగా నిలిచిపోతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఊపిరిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ని ప్రజా క్షేత్రంలో ఎవరూ ఓడించలేరని, పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం, చంద్రబాబు, లోకేశ్, రామోజీ, రాధాకృష్ణతో కలిసి ఎన్ని వ్యూహాలు పన్నినా జగన్ ముందు పనిచేయవన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకొన్నారని, సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించి చరిత్ర సృష్టించారని చెప్పారు. రాజ్యసభ సీటిస్తానని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అదే సీటును వంద కోట్లకు కనకమేడల రవీంద్రకుమార్కు అమ్ముకున్నారని తెలిపారు. ఇలా అడుగడుగునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించిన చంద్రబాబును మరోసారి చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ అక్కున చేర్చుకున్న సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఉన్నత స్థితికి బడుగు వర్గాలు: మంత్రి నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే, జగజ్జీవన్రామ్, సాహూ మహరాజ్, అబ్దుల్ కలామ్ వంటి మహానుభావుల ఆలోచనా విధానాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థితికి చేరుస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా, రూపాయి లంచం లేకుండా పేదవారి చెంతకు సంక్షేమ పథకాలను చేరుస్తున్నారని అన్నారు. 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలిచ్చి వారి కుటుంబాలకు గూడు కల్పించిన సీఎంగా దేశంలోనే రికార్డు సృష్టించారన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను, అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని పేదవారికి అందిస్తున్న ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. 2014లో 648 వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. పైగా, రుణాలు మాఫీ చేస్తానని రైతులు, మహిళలను మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎందుకూ పనికిరారని అవహేళన చేశారని తెలిపారు. మన విలువలు కాపాడుకోవడానికి 2024లో తిరిగి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బాబును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పటికీ క్షమించరు : ఎంపీ సురేష్ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సోమరిపోతులవుతారన్న చంద్రబాబును ఈ వర్గాలు ఎప్పటికీ క్షమించబోవని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆరు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన చంద్రబాబు సోమరిపోతు కాదా అని ప్రశ్నించారు. రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెబితే వారు కూడా కోటీశ్వరులు అవుతారని అన్నారు. రూ.370 కోట్లు అవినీతికి పాల్పడిన చంద్రబాబు జైలుకు వెళితే టీడీపీ ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. నిజం గెలవాలి అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెబుతున్నారని, నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని అన్నారు. బడుగులను అందలమెక్కిస్తున్న సీఎం జగన్: ఎంపీ మోపిదేవి అనేక పథకాలతో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను సీఎం జగన్ అందలమెక్కిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ మాట్లాడుతూ గతంలో పెన్షన్ కావాలంటే నాయకులకు దండాలు పెడితేనో, టీడీపీ కండువాలు కప్పుకుంటేనే మంజూరయ్యేదన్నారు. సెంటర్లో కనబడి దండం పెట్టకపోతే పెన్షన్ రద్దయ్యేదని చెప్పారు. సీఎం జగన్ పాలనలో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పధకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, సింహాద్రి రమేష్ బాబు, పేర్ని నాని, ముస్తాఫా, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్దే: నందిగం సురేష్
-
పేదల పక్షపాతి సీఎం వైఎస్ జగన్
-
మన బిడ్డల భవిష్యత్ కోసం జగన్ కావాలి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇన్నేళ్లూ ప్రభుత్వాలన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశాయి. వాడుకుని వదిలేశాయి. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక మన బిడ్డలకు ఇంగ్లిష్ చదువులు చెబుతున్నారు. వారి రక్షణకు భరోసా కల్పిస్తున్నారు, అక్కచెల్లెమ్మలకు చేయూతనిస్తున్నారు. అవ్వా తాతలను మనవడిలా వెంట ఉండి నడిపిస్తున్నాడు. మన బిడ్డల ఉన్నత చదువులకు, వారి భవిష్యత్కు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పలువురు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం భారీ జన సందోహంమధ్య పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం 5 గంటలకు బుక్కరాయసముద్రం సభా వేదిక వద్దకు చేరుకుంది. సాధికారత అంటే ఏంటో చేసి చూపించారు: మంత్రి ఉషశ్రీ సామాజిక సాధికారత అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. మహిళా సాధికారత కోసం రూ.25 వేల కోట్లు వెచ్చించారని తెలిపారు. జనరంజక పాలన అందించారని, ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన పేరు చెప్పుకుని గర్విస్తున్నామన్నారు. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు: అంజాద్ బాషా సీట్లు, ఓట్లతో పాటు మంత్రి పదవులు, ఇతర పదవుల్లోనూ సామాజిక న్యాయం కల్పించిన సీఎం జగన్ అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. జగన్ హయాంలో 11 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు మంత్రులయ్యారన్నారు. 2024లో పేదలకు–పెత్తందార్లకు మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందని, పేదల పక్షాన మనందరం జగన్కు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పారు. స్వాతంత్య్రం ఇప్పుడే వచ్చింది: మంత్రి జయరాం భారత స్వాతంత్య్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఇప్పుడే అసలు సిసలు స్వాతంత్య్రం వచ్చిందని కార్మిక శాఖ మంత్రి జి.జయరాం చెప్పారు. పదవుల్లో, ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల లబ్ధిలో అన్నింటా స్వేచ్ఛ వచ్చిందన్నారు. పల్లెల్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రీ జగన్ను కొడుకుగా భావిస్తున్నారని, చదువుకునే చిన్నారులతో మేనమామగా పిలిపించుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఎస్సీలకు మేలు జరగకుండా బాబు అడ్డుకున్నారు: ఎంపీ సురేష్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే మురికివాడ అవుతుందని చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకొన్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత వైఎస్ జగన్దేనని అన్నారు. 14 ఏళ్ల సీఎం అనుభవం నలభై ఏళ్ల కుర్రాడి ముందు వెలవెల పోయిందని అన్నారు. శింగనమల సెంటిమెంటు పనిచేస్తుంది: జొన్నలగడ్డ శింగనమల నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, మీరందరూ ఇక్కడ మళ్లీ వైఎస్సార్సీపీకి ఓటేసి జగన్ను సీఎం చెయ్యాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. నియోజకవర్గంలో 40 చెరువులను లోకలైజ్ చేసి రైతులకు జగన్ అండగా నిలిచారని, ఈ నియోజకవర్గంపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. జగన్ అన్నట్టు 175కు 175 సీట్లు సాధ్యమే అని తెలిపారు. ఈ యాత్రలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, సిద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, బీసీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పర్మినెంట్ జైలుకే..!
-
సామాజిక సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
-
చంద్రబాబుపై నందిగం సురేష్ ఫైర్..
-
మళ్ళీ జగనన్ననే గెలిపించుకుందాం..చంద్రబాబు సీఎం అయితే ఏపీ ఆగమవుతుంది..
-
లోకేష్ భయపడ్డాడు కాబట్టే ఢిల్లీ వెళ్లి దాక్కున్నాడు: ఎంపి నందిగం సురేశ్
-
తండ్రి జైల్లో ఉంటే.. లోకేష్ ఢిల్లీకి ఎందుకు పారిపోయారు?: ఎంపీ సురేష్
సాక్షి, అమరావతి: జగన్కు భయం అంటే ఏంటో చూపిస్తానన్న లోకేష్ ఢిల్లీ పారిపోయారని, రఘురామకృష్ణం రాజు గెస్ట్ హౌస్లో రెస్టు తీసుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తండ్రి జైల్లో ఉంటే ఎవరైనా ఢిల్లీ వెళ్లి ఇలా చేస్తారా?. స్కాంలో దొరికిపోయి జైల్లో కూర్చున్నారు. పవన్ నమ్ముకుని టీడీపీ నడుస్తోంది. రేపు లైట్లు ఆర్పి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఇలా పిలుపు ఇవ్వటానికి సిగ్గు ఉండాలి’’ అని ఎంపీ సురేష్ మండిపడ్డారు. ‘‘రాజధానిలో రైతుల జీవితాల్లో వెలుతురు లేకుండా చేశారు. ఆ పాపం ఊరికే పోతుందా?. చంద్రబాబు అరెస్ట్తో పవన్ తప్ప ఎవరూ ఫీలవటం లేదు. టీడీపీ, జనసేన జెండాలు చూసి ఇతర పార్టీలు భయపడటం అనేది వారి భ్రమ. ఈ రాష్ట్రంలో జగన్ అవసరం ఇంకో పాతికేళ్లు ఉందని జనం అనుకుంటున్నారు. చంద్రబాబు అవసరం లేదని జనానికి క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముసలి రక్తం ఎక్కించుకున్నారు. పవన్ కి భయం అంటే ఏంటో వచ్చే ఎన్నికల్లో గెలుపు రూపంలో మళ్లీ మేము చూపిస్తాం’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. ‘‘జగన్ భయపడే మనిషి కాదు కాబట్టే సింగిల్గా వస్తానంటున్నారు. ప్రజలకి ఏం చేస్తారో చెప్పకుండా పవన్ జనాన్ని రెచ్చగొట్టటం ఏంటి?. లోకేష్ తండ్రి సంపాదనతో కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబు తప్పు చేశారని కోర్టులు కూడా నమ్మాయి. అందుకే జైల్లో ఉన్నారు. సోషల్ మీడియా, ఎల్లోమీడియాలో ఎంత రచ్చ చేసినా చంద్రబాబును నమ్మేవారు లేరు. పాపాలు చేసిన వారికి ప్రజల సానుభూతి ఎప్పుడూ ఉండదు. రెండు ఎకరాల నుండి ఆరు లక్షల కోట్లు సంపాదించటం అంటే మామూలు విషయమా?. ఇలాంటి అవినీతి పరులను ప్రజలు క్షమించాలా?. చెదలు పట్టిన చంద్రబాబును వీరుడు, శూరుడు అనటం సిగ్గుచేటు’’ అంటూ సురేష్ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబును నమ్మి బాగు పడినవారు లేరు. వైఎస్సార్ ఫ్యామిలీని నమ్మి నష్టపోయిన వారు లేరు. తప్పుడు పనులు చేసి జైలుకు పోయిన వ్యక్తికి సపోర్ట్ ఎవరూ ఇవ్వరు. కంచాలు వాయించండి, మంచాలు వాయించండి అంటే ఎవరూ పట్టించుకోరు. చంద్రబాబు చీకటిలో సోనియా, చిదంబరం కాళ్లు పట్టుకున్నారు. జగన్ పై అక్రమ కేసులు పెట్టించారు. జగన్ మీద మచ్చ వేయాలంటే అది ఎప్పటికీ కుదరదని టీడీపీ గుర్తించాలి’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. చదవండి: టీడీపీకి.. స్కిల్ కార్పొరేషన్కు ఒక్కరే అడిటర్ -
బాబు దోమలకే భయపడ్డాడా..