‘అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..’ | Minister Kodali Nani Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..’

Feb 11 2022 4:26 PM | Updated on Feb 11 2022 9:30 PM

Minister Kodali Nani Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: దొంగ సర్టిఫికెట్‌తో అశోక్‌బాబు ప్రమోషన్‌ పొందాడని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ పెట్టి ప్రమోషన్లు సంపాదించాడని మండిపడ్డారు.

చదవండి: ‘అశోక్‌బాబు దొరికిపోవడంతో టీడీపీలో ఉలికిపాటు’

అశోక్‌బాబుపై ఫిర్యాదు చేసింది.. వైఎస్సార్‌సీపీ కాదని.. సాటి ఉద్యోగే అశోక్‌బాబుపై ఫిర్యాదు చేశారన్నారు. ‘‘అశోక్‌బాబు అరెస్ట్‌పై టీడీపీ గగ్గొలు పెడుతోంది. అవినీతి పరుడు కోసం టీడీపీ తాపత్రయపడుతోంది. అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే.. దొంగలను వెనుకేసుకొస్తున్న ముఠా నాయకుడు చంద్రబాబు. అశోక్‌బాబు కేసును లోకాయుక్త సీఐడీకి అప్పగించింది. ఇంటర్‌ చదివి.. డిగ్రీ చదివినట్టు అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సృష్టించాడు. అశోక్‌బాబు ఏం తప్పు చేశాడని చంద్రబాబు నిస్సిగ్గుగా అడుగుతున్నారు. తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అరెస్ట్‌ చేసిందని’’ మంత్రి కొడాలి నాని అన్నారు.

మరోసారి బిల్లు పెడతాం..
‘‘రాజధానిపై మరోసారి బిల్లు పెడతాం. 3 రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేస్తాం. అమరావతి, విశాఖ, కర్నూలు 3 రాజధానులుగా ఉంటాయి. వచ్చే సమావేశాల్లోనే 3 రాజధానుల బిల్లు పెడతాం. ప్రజల ఆమోదంతో 3 రాజధానులను తీర్చిదిద్దుతామని’’ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement