kodali nani
-
ఇవన్నీ పకోడీ కేసులు.. బాబుపై కొడాలి నాని సెటైర్లు
-
దేవుడి దయతో గొప్ప విజయాన్ని చవిచూశాం: YS Jagan
-
కొడాలి నానిపై కేసు... అంబటి రాంబాబు రియాక్షన్
-
KSR Live Show: బాబుకు ఇంటూరి రవికిరణ్ అంటే ఎందుకంత భయం..
-
కొడాలి నానిపై కేసు
-
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా కూటమి నేతలు, పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగగా.. ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులు మొదలయ్యాయి.మాజీ మంత్రి కొడాలి నానిపై లా విద్యార్థినితో కూటమి నేతలు ఫిర్యాదు చేయించారు. కూటమి నేతలు మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా రాజకీయ కక్షలకు పావులుగా వాడుకుంటున్నారు. లా విద్యార్థిని ప్రియతో కూటమి నేతలు.. కొడాలి నానిపై త్రీటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేయించారు. చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో, పోలీసులు నానిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
కొడాలి నాని పుట్టిన రోజు.. ఫ్లెక్సీలను అడ్డుకున్న పోలీసులు
-
చంద్రబాబుకు వైఎస్ఆర్ సీపీ నేతల హెచ్చరిక..
-
చంద్రబాబు పాపాలు కడిగేందుకే పూజలు: పేర్నినాని
సాక్షి,తాడేపల్లి:రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదల్లేదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. పార్టీ నేతలు కొడాలినాని, వల్లభనేనివంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్25) పేర్నినాని మీడియాతో మాట్లాడారు.‘తిరుమలలో నెయ్యిని వెనక్కి పంపామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం అబద్ధాలు చెబుతున్నారు.లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు.లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు.అలాంటిదేమీ లేదని ఈవో శ్యామలరావు చెప్తుంటే చంద్రబాబు అడ్డమైన ఆరోపణలు చేశారు.లోకేష్ అయితే ఏకంగా పందికొవ్వు కలిసిందన్నారు.పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో ఆరోపణలు చేశారు.ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్సీపీ భావించింది. వారి పాపాలను క్షమించి వదిలేయమని శనివారం(సెప్టెంబర్28) రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తున్నాం.శరీరం, ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటే.అందుకే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇస్తే వాటికి పవన్ కూడా హామీ ఇచ్చారు.బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మకు రూ.18 వేలు.. ఇలా అనేక హామీలు ఇచ్చారుఅవేమీ అమలు చేయలేదు కాబట్టి వారంతా లోలోపల మదనపడుతున్నారు.అందుకే పాపపరిహార్ధం ప్రాయశ్చిత్త శిక్ష వేసుకున్నారు.తాను బాప్టిజం తీసుకున్నట్టు పవన్ చెప్పారు.జనం ఏదీ మర్చిపోరు.నెయ్యి వెయ్యి రూపాయలు ఉందని చంద్రబాబు అంటున్నారు.మరి ఆయన హయాంలో ఏనాడైనా వెయ్యి రూపాయలకు కొన్నారా?జగన్ ప్రభుత్వం కంటే తక్కువ ధరకే చంద్రబాబు హయాంలో కొనుగోలు చేశారు.హెరిటేజ్ లో ఆవునెయ్యి నాలుగు వందలకు ఎలా ఇస్తున్నారు’అని పేర్ని నాని ప్రశ్నించారు.చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా: కొడాలి నానిస్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారువైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు కల్తీ ట్యాంకర్లను వెనక్కు పంపాంప్రతి ట్యాంకర్ను నిబంధనలకు అనుగుణంగా టెస్టులు చేశాంవందల ఏళ్లుగా ఇలాంటి ఆనవాయితీ కొనసాగుతోందిజులై 17 న ఒక ట్యాంకర్లో నెయ్యి సరిగా లేదని వెనక్కి పంపారుఆ నెయ్యిని లడ్డూలో వాడలేదుకానీ చంద్రబాబు మాత్రం అడ్డమైన ఆరోపణలు చేశారుఅపవిత్రమైన లడ్డూలను భక్తులు తిన్నారని చంద్రబాబు అన్నారుజగన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేశారుచంద్రబాబుకు బుద్ది రావాలని వెంకటేశ్వర స్వామి ని కోరుకుంటున్నాంవెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబుఏ ల్యాబ్ కూడా కల్తీలు జరిగినట్టు రిపోర్టు ఇవ్వలేదుకల్తీ జరిగే అవకాశం ఉందని మాత్రమే చెప్పాయిదాన్ని పట్టుకుని చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారుచంద్రబాబు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడేనా?నిజమైన భక్తుడే ఐతే ఎన్నిసార్లు తలీలాలు అర్పించారో చెప్పాలిసుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా జగన్ లేఖ రాశారువిచారణ జరపాలని కోరాంసిట్ అంటే కూర్చునే, స్టాండ్ అంటే నిలపడే అధికారులతో సిట్ వేస్తే ఏం లాభం?టీడీపీ ఆఫీసులో లోకేష్ చెప్పినట్టు రిపోర్ట్ రాసే వారు ఇంకేం విచారణ చేస్తారు?చంద్రబాబు చేసిన పాపానికి ఆయనకే శిక్ష వేయాలిరాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజల కార్యక్రమానికి పిలుపునిస్తున్నాఇదీ చదవండి: తాము తీసుకున్న గోతిలోనే బాబు అండ్ కో -
ఏపీ హైకోర్టులో కొడాలి నానికి ఊరట
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసిన కేసుపై 41ఏ ప్రోసీజర్ పాటించాలని కోర్డు ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.కాగా, మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో కొడాలి నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో విచారణలో భాగంగా 41ఏ ప్రొసీజర్ను పోలీసులు పాటించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, విచారణలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల ప్రోత్బలంతో కొందరు వలంటీర్లు వైఎస్సార్సీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు కూడా అక్రమంగా కేసులు నమోదు చేశారు. -
దాడులు కాదు.. సూపర్ 6 అమలు ఎప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు ఆపి.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3 వేలు వెంటనే ఇవ్వాలన్నారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫర్నిచర్ విలువ చెబితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా, దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మాజీ మంత్రులు కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే సుధా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.కార్యకర్తలకు అండగా ఉంటాం టీడీపీ దాడులకు భయపడేది లేదు. ఎవరిని చంపుతారో చంపుకోమనండి. టీడీపీ దాడుల్లో గాయపడిన ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబం వద్దకు తాను వెళ్తానని, వాళ్లకు అండగా ఉంటానని వైఎస్ జగన్ చెప్పారు. ఎటువంటి రివ్యూ చేయకుండా వైఎస్ జగన్కు సెక్యూరిటీ తీసేయడం దారుణం. మమ్మల్ని ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదు. మేం ప్రజల మధ్య ఉంటాం. వారి సమస్యల కోసం పోరాటం చేస్తాం.రుషికొండపై భవనాలు ప్రభుత్వ ఆస్తి. అవి వైఎస్ జగన్వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే దానినీ రాద్ధాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే. రుషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాలి్న.. జగన్ నివాసంగా ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్లో ఉండాల్సిన అవసరం వైఎస్ జగన్కు లేదు. ఎక్కడైనా ఆయన సొంత ఇంటిలోనే ఉంటారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. – కొడాలి నాని, మాజీ మంత్రి టీడీపీ చేసిన మంచి ఒక్కటీ లేదు రుషికొండపై నిరి్మంచిన ప్రభుత్వ భవనాలు విశాఖకే తలమానికంగా ఉంటాయి. దీనిపై ఎల్లో మీడియా, కూటమి పార్టీలు వికృత రాజకీయం చేస్తున్నాయి. రూ.700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిరి్మంచింది టీడీపీ ప్రభుత్వం. రుషికొండలో రూ.400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రభుత్వ స్థలంలో నిరి్మంచిన ప్రభుత్వ భవనాలివి. శిథిలమైన హరిత రిసార్ట్స్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం.విశాఖ నుంచి పరిపాలనకు ఈ భవనాలు అనువైనవని అధికారుల కమిటీ తేలి్చంది. దీంతో సీఎం నివాసం, కార్యాలయానికి అనుకూలంగా కొన్ని మార్పులు చేస్తే అవి సొంత భవనాలంటూ టీడీపీ గగ్గోలు పెడుతోంది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. 2014 – 2019 మధ్య రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటి లేదు. అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రివైఎస్ జగన్ ఊరూరా తిరగమన్నారు వైఎస్ జగన్ మమ్మల్ని ఊరూరా తిరగమన్నారు. కూటమి పార్టీల దాడులు, ఆస్తుల విధ్వంసం సమయంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని సూచించారు. 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన మనం భయపడకూడదంటూ మనో ధైర్యం నింపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలెవరూ మరచిపోలేదు. ప్రతి ఇంట్లో జగన్ చేసిన మంచి కనిపిస్తోంది.ప్రతి ఇంటికీ మేం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య అపజయం సంభవించింది. బాబు మోసాలు ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై కోపం వస్తుంది. అప్పుడు వైఎస్సార్సీపీ పట్ల అభిమానమూ మళ్లీ రెట్టింపు అవుతుంది. మళ్లీ వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీతో గెలుస్తుంది. చంద్రబాబు చేతిలో ప్రతి రోజు మోసపోతున్న ప్రజలకు అండగా ఉంటాం. – వంగా గీత, మాజీ ఎంపీ అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలి. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్ స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిరి్మంచాం. మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు – నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా టీడీపీ నేతలు ఇలానే ప్రజలకు చూపించాలి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిరి్మంచాం.గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా? కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణలోనే నిర్మాణాలు చేపట్టాం. ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా ఉంటుందా? క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా? అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదం. 2029లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం. – ఆర్కే రోజా, మాజీ మంత్రి మా ఓట్లు ఏమయ్యాయి.. అంటున్నారుబద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 99 శాతం పైగా హామీలను అమలు చేయటంతో సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. మా ఓటు మీకే నమ్మా? మీ ఫ్యాన్ గుర్తుకే వేసి తీరుతాం అని ఓటర్లు భరోసా ఇచ్చారు. కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చనలేదా? ఎన్నికల ఫలితాలు చూసి ఓటర్లే ఆశ్చర్యపోతున్నారు.మేం జగన్కు వేసిన ఓట్లు ఏమయ్యాయి అని ప్రశి్నస్తున్నారు. అదే మన ప్రభుత్వం ఉండి ఉంటే ఈపాటికే విద్యా దీవెన ఇచ్చేవాళ్లం. రైతు భరోసా, అమ్మ ఒడి, మత్స్యకార భరోసా అన్నీ సమయానికి అందేవి. ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. ఏ పథకం ఏ నెలలో అమలవుతుందో క్యాలెండర్ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వైఎస్ జగన్ నగదు జమ చేసేవారు. ఇప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – దాసరి సుధా, బద్వేలు ఎమ్మెల్యే టీడీపీ కపట నాటకాన్ని ప్రజలు గమనించాలి ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవ్వాళ్టికీ మాకు ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వైఎస్ జగన్ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారు. ఇంత చేసినా ఎక్కడ మోసం జరిగింది అనేదే ప్రశ్న. ఇప్పుడు రుషికొండపై చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిరి్మంచారు.గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి.వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిరి్మంచారు. ప్రెసిడెన్షియల్ సూట్, సూట్ రూమ్, బాంక్వెట్ హాల్తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బాంక్వెట్ హాల్తో కళింగ బ్లాక్ నిరి్మంచారు. సూట్ రూమ్లు, కాన్ఫరెన్స్ హాల్తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్తో గజపతి బ్లాక్, ప్రైవేట్ సూట్ రూమ్లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్ట్రన్ గంగా బ్లాక్లని నిరి్మంచారు. ఈ ఏడు బ్లాక్లు ప్రభుత్వానివే. అయినప్పటికీ ఈ విష ప్రచారం టీడీపీ సంస్కృతికి నిదర్శనం. దాడులు, ఆస్తుల విధ్వంసం ఆపి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
ఇక తగ్గేదేలేదు.. కొడాలి నాని ఈజ్ బ్యాక్
-
ఎవడికి భయపడే ప్రసక్తే లేదు
-
టీడీపీ దాడులకు భయపడేది లేదు: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి కొడాలి నాని. అలాగే, విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.కాగా, కొడాలి నాని గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్-6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. నిరుద్యోగులకు ఇస్తామన్న మూడు వేలు ఇవ్వాలి. సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నీచర్పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకండి.చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. రుషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి.. వైఎస్ జగన్వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే రాద్దాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే. టీడీపీ దాడులకు భయపడేది లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సూపర్ 6.. చంద్రబాబుకు కొడాలి నాని డిమాండ్
-
టీడీపీపై కొడాలి నాని ఫైర్
-
ఇంత దారుణమా..
-
దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. శనివారం వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన రౌడీ మూకలు ఉద్దేశ పూర్వకంగా, అధికార మదంతో మారణహోమం సాగిస్తున్నా, విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు, జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. వారి కార్యకర్తలు చేస్తున్న దాడులపై ప్రేక్షకపాత్ర వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తుండటం విచారకరం అన్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లు ఆంధ్రప్రదేశ్లోనూ తీసుకొచ్చారని విమర్శించారు. రౌడీషీటర్లు స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఏరా.. ఉద్యోగం చేయాలని లేదా.. నువ్వు ఇక్కడే ఉంటావా.. లేక వీఆర్కు వెళతావా.. అని మాట్లాడుతున్నా పోలీసులు మిన్నకుండి పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలతో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. కళ్లెదుటే దాడులు.. అచేతనంగా పోలీసులు‘బందరు గొడుగుపేటలోని ఎంకులు బంకులు ఎదురుగా ఉన్న సందులో ఒక యాదవ కుటుంబం ఇంట్లో సామగ్రి, టీవీని ధ్వంసం చేస్తే, కేసు పెట్టినా ఇనుగుదురుపేట పోలీసులు పట్టించుకోలేదు. బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామగ్రి కొంటే ఇలాగే ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. స్థానిక చిలకలపూడి గోడౌన్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైఎస్సార్సీపీకి పని చేశారనే కారణంతో వారి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. అడ్డుపడిన వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ దంపతులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో 25కు పైగా కేసులు ఉన్న రౌడీషీటర్ నవీన్.. ఆసుపత్రికి వెళ్లి నెలల పిల్లాడిని ఎత్తుకున్న ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినా రౌడీ షీటర్పై కేసు పెట్టకపోగా, బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీలే డీఎస్పీలు, సీఐలుగా భావించేలా చంద్రబాబు తయారు చేశారు. మహేష్ అనే వ్యక్తి విచ్చలవిడిగా బరితెగించి కుర్చీలతో ఎస్ఐ పైనే దాడి చేశాడు. కార్లు ధ్వంసం చేశాడు. అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ స్పందించకపోవటం విచారకరం. మాజీ ఎమ్మెల్యేలు అందరం ఎస్పీని కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వల్లభనేని వంశీ, కైలే అనిల్కుమార్లను పోలీసులు రానివ్వకుండా నిర్బంధించారు. రేపో, ఎల్లుండో డీజీపీ, ఎస్పీలను కలిసి దాడుల ఘటనలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. ఈ దాడుల ఘటనలపై వీడియో ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం’ అని పేర్ని నాని తెలిపారు.మేం వస్తున్నాం.. ధైర్యంగా ఉండండి...మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగుతూ చేతులు, కాళ్లు విరగ్గొట్టడంతో పాటు గ్రామాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నారన్నారు. ఈ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ‘దాడులు జరుగుతుంటే పోలీసులు నిలబడి చూస్తూ ఎంజాయ్ చేస్తుండటం దారుణం.స్థానికంగా దాడులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించినా, స్పందించడం లేదు. వచ్చినా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ ఘటనలపై కేసులు కట్టడం లేదు. దాడులు చేస్తున్న వారే కాకుండా దాడులను చూస్తూ మిన్నకుండిపోయిన పోలీసులపై కూడా కేసులు వేస్తాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నాయకులందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతాం. ఇకనైనా దాడులు ఆగకుంటే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పైకి వస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురైతే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, మచిలీపట్నం, పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రమేష్ (రాము) పాల్గొన్నారు.పేర్ని కిట్టు, నాయకులను అడ్డుకున్న పోలీసులుటీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాబి దంపతులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బందరు పట్టణంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే బాబి దంపతులు వైఎస్సార్సీపీ పక్షాన నిలిచారనే నెపంతో కూటమి శ్రేణులు వారి నివాసంపై దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా శనివారం బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తన నివాసం నుంచి నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, కార్పొరేటర్లతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి పరామర్శకు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు.అదనపు బలగాలను రప్పించి దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరామర్శకు అనుమతి ఏమిటని పేర్ని కిట్టు, తదితరులు పోలీసులను దాటుకుని వెళ్లి బాబి దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, జోగి చిరంజీవి, ఐనం తాతారావు, మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, పర్ణం సతీష్, శ్రీరాం చిన్నా ఉన్నారు. -
పోలీసుల ప్రేక్షక పాత్ర కొడాలి నాని షాకింగ్ రియాక్షన్
-
కార్యకర్తల్ని కాపాడుకుంటాం: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రపతి, గవర్నర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కళ్లేదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ మరో బిహార్గా మారుతోందంటూ ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపైనా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. న్యాయపరంగా కోర్టులోనే తేల్చుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు నిర్ణయించారు.టీడీపీ దాడులపై మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు మా పై దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీపై జరుగుతున్న దాడుల పై హైకోర్టుకు వెళ్తాం. దాడులు చేసిన వారితో పాటు. చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తాం. రాబోయే రెండు రోజుల్లో కృష్ణాజిల్లాలో పర్యటిస్తాం. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతాం. కార్యకర్తలను కాపాడుకుంటాం. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తాం. శాంతిభద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని కొడాలి నాని చెప్పారు. -
ఆగని టీడీపీ దాడులు.. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్ల వద్ద ఉద్రిక్తత
కృష్ణా, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండ కొనసాగుతోంది. శుక్రవారం కూడా వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. ఆపై టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇంటిలోకి చొచ్చుకునిపోయే ప్రయత్నమూ చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్లు వాగ్వాదానికి దిగారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై దాడి..ఇంటి లోపలకి చొరబడే ప్రయత్నం చేసిన టీడీపీ గుండాలు.#TDPGoons pic.twitter.com/yDo1iT7yql— YSR Congress Party (@YSRCParty) June 7, 2024ఇక.. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడి జరిగింది. టీడీపీ గుండాలు వంశీ ఉండే అపార్ట్మెంట్ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టి.. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అయితే.. సీఆర్పీఎఫ్, పోలీస్ బలగాలు మోహరించినప్పటికీ.. టీడీపీ యువత మరోసారి వల్లభనేని వంశీ ఇంటి పైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా టీడీపీ గుండాలు దాడికి యత్నించారు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి టీడీపీ రౌడీలను చెదరగొట్టాయి. ఆపై వంశీ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.ఇక విజయవాడలోనే గత అర్ధరాత్రి రాజీవ్ నగర్లోని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటి పై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఇంటి బయట ఫర్నీచర్ను పూర్తిగా నాశనం చేశారు. ఆ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు.. భయంతో వణికిపోయారు. ఆపై శివారెడ్డిని చంపేస్తామంటూ బెదిరిస్తూ వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ ఉదయం టీడీపీ నేతల దాడిపై నున్న పోలీస్ స్టేషన్లో పెద్దిరెడ్డి శివారెడ్డి ఫిర్యాదు చేశారు.రాజమండ్రిలో టీడీపీ గూండాలు.. ఫ్లైఓవర్ శిలా ఫలకం ధ్వంసంతూర్పు గోదావరి: రాజమండ్రిలో టీడీపీ నేతలు అరాచకానికి దిగారు. మోరంపూడి ఫ్లై ఓవర్ శిలాఫలకం నాశనం చేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో.. ఇలాంటి ఘటనలు సరికాదని టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి హితవు పలికారాయన. అలజడులు సృష్టించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందని అన్నారాయన. -
గుడివాడ సీటు గెలుపుపై మేకపోతు గాంభీర్యం!
ఆ నియోజకవర్గంలో పోలింగ్ పూర్తవ్వగానే పసుపు పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పోలింగ్ సరళి తమకే అనుకూలమని డప్పు కొట్టుకున్నారు. కట్ చేస్తే.. తాజా లెక్కలు చూశాక వారిలో ఆందోళన మొదలైందట. ఏదో అనుకుంటే మరేదో జరిగేలా ఉందనుకుని కలవరపడుతున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగు తమ్ముళ్ల టెన్షన్కు కారణమేంటి?.. కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ టాప్ ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకున్న నియోజకవర్గం గుడివాడ. ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని శక్తిగా ఉన్న కొడాలి నానిని వైఎస్ఆర్సీపీ తరపున హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవకుండా అడ్డుకోవాలనేది టీడీపీ నాయకత్వం బలమైన కోరిక. ఇందుకోసం రెండేళ్లుగా చాలా ప్రయత్నాలు చేసింది. కొడాలి నానిపై పోటీకి పనికొచ్చే నాయకులు గుడివాడలో కనిపించక, చివరికి అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై వెనిగండ్ల రామును పోటీలో నిలిపింది. కొడాలి నానిని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేసిన వెనిగండ్ల రాము, టీడీపీ నేతలు పోలింగ్ సరళిని చూసి ఖంగుతిన్నారట. 13వ తేదీన జరిగిన పోలింగ్ లో గుడివాడ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. దీంతో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ శాతం పెరగడానికి మహిళా ఓటర్లలో చైతన్యం ఎక్కువగా కనిపించడమే ప్రధాన కారణం. మొత్తంగా.. గుడివాడ నియోజకవర్గం అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నందివాడ మండలంలో రెండు కేంద్రాలు, గుడివాడ పట్టణంలోని రెండు కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటన కూడా లేకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడంతో తొలిసారి రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఇదిలా ఉంటే పోలింగ్ సరళి..పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూ లైన్లను చూసి బోల్డంత ఊహించుకున్న టీడీపీ నేతల ఆశలపై వారే తయారుచేసుకున్న తాజా లెక్కలు నీళ్లు చల్లాయట. రికార్డ్ స్థాయిలో జరిగిన పోలింగ్ సైకిల్ పార్టీకి అనుకూలంగా లేదని వారిలో వారే చర్చించుకుంటున్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే భారీగా తరలి రావడం తమకే కలిసి వచ్చిందని టీడీపీ నేతలు సంబరపడినప్పటికీ, పోలింగ్ అనంతరం వేసుకున్న లెక్కలు వారిని కలవరపెడుతున్నాయని టాక్. భారీగా పెరిగిన పోలింగ్ శాతం.. మహిళల ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా కనిపిస్తున్నాయట. గడచిన మూడు దశాబ్ధాలుగా గుడివాడ నియోజకవర్గంలో జరగని చాలా అభివృద్ధి పనులు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని చేసి చూపించారు. పేదల సొంతింటి కల టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల రూపంలో ప్రజలకు అందజేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకున్న తరుణంలో మరోసారి గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.తాజా అంచనాలు భయపెడుతున్నా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు తమను కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెప్పుకుంటున్నారట టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము. లోలోన టెన్షన్ పడుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ ను చూసే మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గెలుపు లాంఛనమే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న చర్చ ప్రస్తుతం గుడివాడలో జోరుగా సాగుతోంది.ఇదీ చదవండి: ట్రెండ్ తెలియాలంటే నిరీక్షించాల్సిందే -
గుడివాడ గెలుపుపై కొడాలి నాని రియాక్షన్
-
నాగార్జున యాదవ్ ని మంత్రిని చేసి నన్ను పక్కన పెట్టిన పర్లేదు: కొడాలి నాని
-
ఆ ముసలోడికి ఏం రోగం..కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్..
-
బీసీలను ఆదరించడంలో సీఎం జగన్ ముందుంటారు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: బీసీ వర్గాలను ఆదరించడంలో ముఖ్యమంత్రి ఎప్పుడూ ముందే ఉంటారని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అన్ని రంగాల్లో తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురిచేసిన కులాల్లో యాదవ కులం ఒకటి అని నాని చెప్పుకొచ్చారు.కాగా, గుడివాడలో యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ‘కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల, జనరల్ స్థానాల్లో మేయర్లుగా జడ్పీ చైర్మన్లుగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. యాదవులను గుడివాడ మున్సిపల్ చైర్మన్గా చేస్తాం. గుడివాడ పురపాలక సంఘం పరిధిలోని రెండు ఎకరాల స్థలాన్ని యాదవ కళ్యాణ మండపానికి కేటాయించాలని మున్సిపాలిటీలో తీర్మానం చేయించాం.గుడివాడ నియోజకవర్గంలో ఏ కులానికి లేని విధంగా యాదవులకు అద్భుతమైన కళ్యాణ మండపం నిర్మితమవడంలో నా సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తాను. రాబోయే రోజుల్లో గుడివాడ నియోజకవర్గంలో యాదవులకు రాజకీయ ప్రాధాన్యం ఉంటుంది. గుడివాడలో యాదవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించాం.ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్ లో యాదవ సోదర సోదరీమణులందరూ మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని యాదవులకు సముచిత స్థానం కల్పించారు. అన్ని రంగాల్లో తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురిచేసిన కులాల్లో యాదవ కులం కూడా ఒకటి.గుడివాడ నియోజకవర్గంలోని యాదవ సోదరులతో నాకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యాదవ సోదరులు ముందుకు వస్తే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పిస్తుంది. తద్వారా సంఘం అభివృద్ధికి దోహద పడినవారు అవుతారు. అవకాశం ఉన్నచోట మీ పిల్లలను రాజకీయంగా ప్రోత్సహించండి. సీఎం జగన్ తిరిగి అధికారంలోకి వచ్చాక కేబినెట్లో నాలాంటి వారికి పెద్దగా అవకాశం ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తారు. నాకు, పేర్ని నానికు మంత్రి పదవులు ఇవ్వకపోయినా, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకపోయినా, విశ్వాసంతో సీఎం జగన్ వెంటే ఉంటాం’ అని కామెంట్స్ చేశారు. -
కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా
-
బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, కృష్ణా: చంద్రబాబుకు కావాల్సింది అధికారమే.. అందుకోసం గాడిద కాళ్లైనా పట్టుకుంటాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. మంగళగిరిలో నారా లోకేష్ గెలిచే సీన్ లేదు అంటూ కొడాలి నాని కామెంట్స్ చేశారు.కాగా, కొడాలి నాని గురువారం నందివాడ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేదల మద్దతు ఉంది. ఈ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం. సీఎం జగన్పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది.గతంలో టీడీపీ చేసిందేమీ లేదు. ఇప్పుడు చేస్తామన్నా టీడీపీ ఎవరూ నమ్మడం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అసెంబ్లీ టీడీపీ నేతలే మద్దతిచ్చారు. మంచి చట్టమని పయ్యావుల కేశవ్ చెప్పాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకాలకు డబ్బులు పడకుండా కూటమి అడ్డుకుంది. నిధుల కోసం ప్రభుత్వం కోర్టుకు వెళ్లి పోరాడాల్సిన పరిస్థితి తెచ్చాడు. చంద్రబాబు ఏం పోయేకాలమని వృద్ధులు, మహిళలు బూతులు తిట్టుకుంటున్నారు.చంద్రబాబుకి మాడు పగిలేలా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలు. పప్పు లోకేష్ మంగళగిరిలో కూడా గెలవడు. మతి భ్రమించి సీఎం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును ఈ రాష్ట్రం నుంచి సాగనంపడానికే ఈ ఎన్నికలు. చంద్రబాబుకి ప్రజలు చరమగీతం పాడటం ఖాయం’ అంటూ కామెంట్స్ చేశాడు. -
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
-
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అంటే తనకు, సీఎం జగన్కు అమితమైన ప్రేమ. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు.‘‘పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘అన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరు. పది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జండా పట్టుకొని టీడీపీ కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాం. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని.. లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదు. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ను తుంగలో తొక్కుతారు.. లోకేష్ను అందలం ఎక్కిస్తారు’’ అని కొడాలి పేర్కొన్నారు.‘‘పెద్ద ఎన్టీఆర్ను దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు. నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను. ఎన్టీఆర్.. వైఎస్సార్ నాకు రెండు కళ్లు. తెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించింది’’ అని కొడాలి నాని చెప్పారు.‘‘ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్కు.. నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి. జూ.ఎన్టీఆర్ను ఒక విఐపిగా గౌరవిస్తాం’’ అని కొడాలి పేర్కొన్నారు. -
కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు
-
గుడివాడలో దుమ్మురేపుతున్న కొడాలి నాని ఎన్నికల ప్రచారం
-
షర్మిల ప్రచారంలో జై జగన్ నినాదాలు
-
‘ప్రజల ప్రతీ అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం ఇది’
గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో స్కూల్కు వెళ్లేటువంటి పిల్లల దగ్గర్నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వా తాతల వరకూ వారికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని తీరుస్తూ వచ్చారని, అందుకే సీఎం జగన్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ రోజు(సోమవారం) గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడిన కొడాలి నాని.. మనందరి నమ్మకం మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. ముందుగా గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం జగన్కు స్వాగతం అంటూ కొడాలి నాని ప్రసంగం కొనసాగించారు. ఈ సిద్ధం సభ నిన్న జరగాల్సినటువంటి సభ ఒకరోజు వాయిదా పడింది అయినా కూడా ఇంత ఘనంగా సీఎం జగన్ దీవించడానికి, ఆశీర్వదించడానికి మీరందరూ రావడం ఆనందంగా ఉంది ఐదేళ్లపాటు స్కూల్ వెళ్లేటువంటి పిల్లల నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వాతాతల వరకూ వారికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని తీర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం. గ్రామగ్రామన, వార్డువార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందించాల్సిన ప్రతి సౌకర్యాన్ని నేరుగా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకే పాలన తీసుకొచ్చినటువంటి, గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్రెడ్డి. అదేవిధంగా స్కూల్ పిల్లలకు వాళ్లకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య, బట్టలు, పుస్తకాలు, తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి సీఎం జగన్. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ ఈరోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే అనేకమంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి ఆయనకు కనుక చూపించినట్లైతే దానికి ఎంత ఖర్చయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశతో ట్రీట్ మెంట్ జరుగుతున్నటువంటి పిల్లలను కూడా తీసుకువచ్చి రోడ్డు మీద ఆయనకు చూపించాలనే ఉద్దేశ్యంతో, అంత నమ్మకం పెట్టుకుని చూపిస్తున్నారంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న నమ్మకం. అదేవిధంగా సీఎం జగన్ను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఒక కూటమి కట్టాడు మాయా కూటమి. ఆయన వదిన పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశాడు, అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్త పుత్రుడ్ని ఓ పక్కన పెట్టుకున్నాడు. వీళ్లందర్నీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక, జగన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక చవటల్లాగా, దద్దమ్మల్లాగా వెనుక నుంచి జగన్ మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడ నుంచి తొలగించాలనే ఉద్దేశ్యంతో మొన్న అర్థరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. అన్నా మీరు నమ్మే ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీకు ఒక అంగుళం పక్కకు జరగలేదు, ఒక అంగుళం కిందకు జరగలేదు. మీకు బలమైనటువంటి నుదటిమీద తగిలినా ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ వెంట్రుక ముక్క కూడా పీకలేడు. మీ దమ్ము, మీ ధైర్యం మీకు ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు. మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూశాం. ఒక్క చిన్న అబద్ధం చెప్పండన్నా అని బ్రతిమాలినా కూడా ఆయనతో అబద్ధం చెప్పించలేం. ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర్రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వ్యక్తి వైఎస్ జగన్. జగనన్నకు ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు మీ రెండు ఓటులను ఫ్యాన్ గుర్తు మీద వేసి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి, దొంగైనటువంటి, 420 అయినటువంటి, ఛీటర్ అయినటువంటి వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్నా.. జగన్మోహన్రెడ్డి నీ కథ తేలుస్తానని అంటున్నాడు చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. జగన్ అంతు తేల్చాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి. దేవుడు, ప్రజల ఆశీస్సులు ఉన్నటువంటి సీఎం జగన్ను అందరూ దీవించాలని, మీ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడ్ని, శాసన సభ్యుడ్ని గెలిపించి.. జగనన్నకు మేమంతా ఉన్నాం.. మీ వెనుకే ఉన్నాం అనే మెసెజ్ ఇవ్వాలని ప్రజల్ని కోరుతున్నాను. -
జూ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు బాబుకు కౌంటర్ల పై కౌంటర్లు
-
కొడాలినాని కొడుకుని ఓడించడం కాదు.. నీ కొడుకుని గెలిపించుకో
-
గుడివాడలో ఓటు బ్యాంకు గురించి కొడాలి నాని
-
చంద్రబాబు ఎంతటి దరిద్రుడో కేశినేని నాని ని అడిగితే చెప్తాడు
-
సీఎం జగన్ దాడిపై కొడాలి నాని షాకింగ్ నిజాలు
-
సీఎం జగన్పై దాడి.. కొడాలి నాని సంచలన కామెంట్స్
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆయనపై దాడి చేశారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్పై దాడి జరిగింది. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు దాడులు జరిగాయని తెలిపారు. కాగా, కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు.. సీఎం జగన్ను రాళ్లతో కొట్టాలని చెప్పాడు. చంద్రబాబు మాటలు విని కులోన్మాదంతో దాడి చేశారు. చాలా పకడ్బంధీగా వ్యూహం ప్రకారం గురి చూసి గన్తో దాడి చేశారు. ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్నుకు తగిలింది. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్తో గాయంతో బయటపడ్డారు. దీన్ని ఖండించాల్సిన కొందరు వ్యక్తులు సంస్కారహీనంగా సీఎం జగనే తనపై దాడి చేయించుకున్నారని చెప్తున్నారు. ఎన్నికల సందర్బంగా గుర్తింపు పొందిన తొమ్మిది సంస్థల సర్వేల్లో వైఎస్సార్సీపీకి భారీ మోజార్టీలు వస్తాయని చెప్పాయి. దీంతో, సీఎం జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక.. కొందరు రాజకీయ నిరుద్యోగులు ఇలా చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిసి ఇలా దాడి చేశాయి. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయడానికే ప్రయత్నం జరిగిందంటే దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఎంతో పక్కగా దాడి చేయబట్టే సీఎం జగన్కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలింది. ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రోడ్ షోగా వెళ్లేటప్పుడు పగలైనా, రాత్రి సమయంలోనైనా కరెంట్ తీసేస్తారు?. ఈ విషయం సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా?. చంద్రబాబు బస్సుపై రోడ్ షోలు చేసేటప్పుడు కరెంట్ తీయలేదా?. సీఎం జగనే కరెంట్ తీయించారని టీడీపీ నేత పిచ్చివాగుడు వాగుతున్నారు. అధికారులపై యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు 420 వ్యాఖ్యలు చేస్తున్నాడు. సీఎం జగన్కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
జూన్ 4 న మాట్లాడుకుందాం ఎల్లో మీడియా పై కొడాలి నాని ఫైర్
-
నన్ను, సీఎం జగన్ను ఎవ్వరూ ఓడించలేరు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: ప్రజలు తనను నిలదీశారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని టీడీపీ నేతలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను నిలదీశారంటూ ఎల్లోమీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోనన్నారు. గుడివాడలో తనను, రాష్ట్రంలో సీఎం జగన్ను ఎవ్వరూ ఓడించలేరని తెలపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు. చంద్రబాబు, పవన్, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు. వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు, వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా, కార్యక్రమాలు నేను చేయడం లేదు. ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి. చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు. ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా. నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల ఇళ్ల సమస్యలు పరిష్కరించేలా.. 23 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 12వందల కోట్లతో ఇల్లు కట్టిస్తున్నాం. రూ. 320 కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. మంచినీటి అవసరాల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశాం. రూ. 200 కోట్లతో రోడ్లు వేశాం. ఎన్ని చేసినా ఎక్కడో ఒకచోట సమస్య అనేది ఉండటం సర్వసాధారణం. సమస్యలపై ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను అడుగుతారు. వారికి సమాధానం చెప్పుకుంటాం. మాకు మరో అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రజలకు చెబుతాం. ప్రజలు నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటుంటే నన్నేదో నిలదీశారంటూ ఎల్లో మీడియా హడావుడి చేస్తుంది’అని కొడాలి నాని అన్నారు. -
కొడాలి నాని కి బ్రహ్మరథం పడుతున్న గుడివాడ ప్రజలు
-
కొడాలి నాని ఎన్నికల ప్రచారం బ్రహ్మరధం పడుతున్న గుడివాడ ప్రజలు
-
ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను.. టీడీపీకి కొడాలి నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన దేశ చరిత్రలోనే ఒక రికార్డని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్ విసిరారు. అర్హత ఉండి ఇళ్ల స్థలం రాలేదని ఒక్కరితో చెప్పించిన ఎన్నికల్లో పోటీ చేయనని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో గుడివాడలో కనీసం ఒక్క ఎకరా కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు, ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. 20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాల అప్పును రూపాయి కట్టించుకొని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్ది అని పేర్కొన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రుణం రద్దుచేసి, పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు ‘సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తాం. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది. సీఎం జగన్ ది. జగన్ ప్రభుత్వ పాలన దేశ చరిత్రలోనే రికార్డు. స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: మోసాల బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి: సీఎం జగన్ -
నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా .. చంద్రబాబుకు మాస్ ఛాలెంజ్
-
జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు రాష్ట్రంలో ఉండదు
-
జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు రాష్ట్రంలో ఉండదు
-
జూన్ 4 తర్వాత బాబును తలుచుకునే వారెవరూ ఉండరు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైన పట్టుకుంటాడని మండిపడ్డారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు ఒంటరిగాపోటీ చేస్తే గెలవలేమని తెలిసి పవన్, బీజేపీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. జూన్ 4 తర్వాత చంద్రబాబును తలుచుకునే వారెవరూ ఉండరని అన్నారు. గుడివాడ ఒకటవ వార్డు నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నాగవరప్పాడులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుడివాడలో అయిదవసారి తానే గెలవబోతున్ననని తెలిపారు. ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంతమంది వచ్చినా వైఎస్సార్సీపీ తరపున హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా...గాడిద గుడ్డు.. అంటూ చంద్రబాబు సొల్లు చెబుతున్నాడని మండిపడ్డారు. ‘నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్కు ఇదే నా సవాల్. చంద్రబాబు, లోకేష్ గుడివాడలో తన పై పోటీ చేసి గెలవాలి. టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది. నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని...పూటకో వ్యక్తిని తెచ్చే బతుకులు టీడీపీవి. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు. వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు. చంద్రబాబు ఎంత 420నో చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనే. గుడివాడలో గెలిచేది నేనే. మళ్లీ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. మేం ప్రజల్లోకి వెళ్లి ఇదే చెబుతున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: Memantha Siddham Day-1: మేమంతా సిద్ధం డే-1 అప్డేట్స్ -
చంద్రబాబు, లోకేష్ దమ్ముంటే గుడివాడలో పోటీ చెయ్యండి: Kodali Nani
-
కేసులు పెడితే వెళ్లి YSR కాళ్ళు పట్టుకున్నాడు.. ఈ 420 అధికారం కోసం ఎవడి బూట్లు అయిన నాకుతాడు..
-
చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్
-
టీడీపీ పొత్తులపై కొడాలి నాని సెటైర్లు
-
అట్టర్ ప్లాప్ పొత్తులు..పొత్తులపై రెచ్చిపోయిన కొడాలి నాని
-
‘కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు..’
సాక్షి, కృష్ణా జిల్లా: కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్.. సీఎం జగన్ను ఏమీ చేయలేరన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్, షర్మిల, పురందేశ్వరి తీరును ఎండగట్టారు. మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా?. ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా?. పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా?. నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు’’ అని కొడాలి నాని గుర్తు చేశారు. రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయిందని మీరంతా కలిశారు. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?. పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?. రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు. సీఎం జగన్ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం. పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు. పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా?. ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు. జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు. షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు. ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు. కాంగ్రెస్లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది. మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్కు ఏం సంబంధం?. తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా?. పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా?. రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా?. బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు. నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా?’ అంటూ కొడాలి ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు?. తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు. చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు. ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు. ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆ పార్టీని హుస్సేన్ సాగర్లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్ని సాధించాలని చూస్తోంది. కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. .ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ. డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా..’’ అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: లోలోన కుమిలిపోతూనే.. పవర్ లెస్గా పవన్ కల్యాణ్ -
చంద్రబాబు పొత్తులు.. కొడాలి నాని నాన్ స్టాప్ కోటింగ్
-
సీఎం జగన్ వెంట్రుక ముక్క కూడా పీకలేరు: కొడాలి నాని
-
గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా..చంద్రబాబుకు మాస్ వార్నింగ్
-
లోకేష్ తుప్పు రాలింది
-
చంద్రబాబుపై కొడాలి నాని స్ట్రాంగ్ సెటైర్
-
ఒక్క తన్ను తంతే మళ్ళి కనపడడు
-
ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్ అభిమానులే టీడీపీని బతికించాలి
-
జూ.ఎన్టీఆర్పై కుట్ర?.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు ఎన్టీఆర్ను సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ను 2009 ఎన్నికలకు వాడుకుని వదిలేశారంటూ ధ్వజమెత్తారు. ‘‘ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్పై కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుని గొయ్యి తీసి పాతిపెట్టాలి. అప్పుడే టీడీపీ బతికి బట్టగడుతుందని కొడాలి నాని అన్నారు. ‘‘అంబేద్కర్ బాటలో నడుస్తున్న సీఎం జగన్కు అందరూ అండగా నిలవాలి. మంచి చేస్తేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్నారు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలి. మీ కోసం 120 సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం రెండు బటన్లు నొక్కండి. ఈ సారికి చంద్రముఖిని ఈవీఎంలలో బంధించండి. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందంటూ కొడాలి అన్నారు. -
పవన్ను ఓడించేది టీడీపీనే
సాక్షి, రాజమహేంద్రవరం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించేది టీడీపీ నేతలేనని, ఈ విషయంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ వంటి గుంటనక్కలతో పవన్ ప్రయాణం చేస్తున్నాడని చెప్పారు. ఎవరు ఎప్పుడు ఎలా పొడుస్తారో చెప్పలేని పరిస్థితి అని అన్నారు. పవన్ను కాపాడుకోవాల్సిన అవసరం జనసైనికులు, అభిమానులకు ఉందన్నారు. అది జరగాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పాతాళానికి తొక్కి, టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో సోమవారం ‘ఎన్నికలకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం సిద్ధం’ పేరిట స్థానిక ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో కొడాలి నాని మాట్లాడుతూ, పవన్ను ఓడించేందుకు సీఎం వైఎస్ జగన్ వ్యూహం పన్నుతున్నారంటూ బాబు, ఆయన అనుకూల మీడియా డప్పు కొడుతున్నారని.. రాష్ట్రంలోని 175 సీట్లలోనూ వైఎస్సార్ సీపీ గెలవాలన్నది సీఎం జగన్ ఉద్దేశమని, ఓడే వాళ్లలో బాబు, పవన్, లోకేశ్ కూడా ఉండవచ్చని అన్నారు. ఒక్కడే ఎన్నికల బరిలో వస్తే గెలవలేడని భావించిన చంద్రబాబు.. దత్తపుత్రుడు పవన్, డ్రామోజీ, టీవీ–5, పౌడర్ డబ్బా వంటి వారిని వెంట వేసుకుని వస్తున్నాడని ధ్వజమెత్తారు. 3 శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 30 స్థానాలిచ్చిన చంద్రబాబు.. 20 శాతం ఉన్న కాపులకు మాత్రం 24 సీట్లే ఇచ్చాడని దుయ్యబట్టారు. ఇవ్వడానికి చంద్రబాబుకు.. తీసుకునేందుకు పవన్కు సిగ్గుండాలని విమర్శించారు. వైఎస్సార్సీపీలోనే ప్రాధాన్యం: పేర్ని నాని రాజకీయ చరిత్రలో పార్టీ కార్యకర్తలకు అత్యంత విలువ, ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కార్యకర్తలు తమకు ఎమ్మెల్యే అభ్యర్థి వద్దంటే మార్చే పరిస్థితులు మరే పార్టీలోనైనా ఉంటాయా? అని ప్రశ్నించారు. టీడీపీలో డబ్బుంటేనే టికెట్ ఇస్తున్నారని ఆరోపించారు. సంక్షేమానికి డబ్బులు ఇస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని విమర్శిస్తున్న చంద్రబాబు.. ఆయన ప్రకటించిన పథకాలకు డబ్బులు ఏవిధంగా ఇస్తారని దుయ్యబట్టారు. బాబుకు బుద్ధి చెప్పాలి: భరత్రామ్ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటూ, ఏపీలో రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దగాకోరు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన నేతల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఒక మహిళా వలంటీర్ను ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుపై ఎంపీ భరత్తో పాటు మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆడపిల్లకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం మగతనం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్ కిశోర్ ఓ చిల్లర మనిషి గుడివాడ టౌన్: డబ్బులు తీసుకుని చిల్లర వాగుడు వాగే ప్రశాంత్ కిశోర్ వంటి వారిని పట్టించుకోవలసిన అవసరం లేదని కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంత్ కిశోర్ను ప్రస్తుతం ఏరాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలేదన్నారు. ఐప్యాక్ నుంచి తన్ని తరిమేసిన తర్వాత ఏపార్టీ అతన్ని చేరదీయక పోతే తీసేసిన తహసీల్దార్లాగా బిహార్లో సొంత పార్టీ పెట్టి ఫలితం లేక డిజాస్టర్ అయిపోయాడన్నారు. చంద్రబాబు లాంటి పనికి మాలిన వ్యక్తుల వద్ద ప్యాకేజ్ తీసుకుని జ్యోతిష్యం చెపుతున్నాడన్నారు. ఐప్యాక్ టీమ్ ఇప్పటికీ వైఎస్సార్సీపీకి పని చేస్తోందన్నారు. లగడపాటి రాజగోపాల్లాగా జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించిన పీకే చెపితే రెండు, మూడు శాతం ఓట్లు మారి తనకు పడతాయనేది చంద్రబాబు ఆశ అని అన్నారు. -
పవన్ కల్యాణ్ను ఓడించేది టీడీపీనే: కొడాలి నాని
-
అరేయ్ పీకే నీ పంచాంగం ఆపు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్ కల్యాణ్ను ఓడించేది టీడీపీనే: కొడాలి నాని
కృష్ణా: అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పవన్ కల్యాణ్ను రక్షంచుకోవాల్సిన అవసరం జనసైనికులు.. అభిమానులకు ఉందని తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన జన సైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘చంద్రబాబు ఓట్లు కావాలి... కానీ సీట్లు ఇవ్వరు. మేము రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని టార్గెట్గా పెట్టుకోలేదు...175 స్థానాల్లో గెలవడమే మా లక్ష్యం. కచ్చితంగా చెబుతున్నా పవన్ కల్యాణ్ను ఓడించేది టీడీపీనే. ఎన్నికల అనంతరం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ...వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు అయిన చంద్రబాబు, నాదెండ్లను పవన్ కల్యాణ్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. అధికారంలో ఉన్న ఎన్టీఆర్నే కూల్చిపడేసిన చంద్రబాబు, నాదెండ్ల వారికి పవన్ ఎంత?. 3 శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి.. 20 శాతం ఉన్న వర్గానికి 24 సీట్లిచ్చాడు. ... జనసేనకి ఇచ్చిన సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయి. ఇవ్వడానికి చంద్రబాబుకి.. తీసుకోవడానికి పవన్కు సిగ్గుండాలి. రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ ఫర్ అవ్వవు’ అని కొడాలి నాని అన్నారు. కృష్ణాజిల్లా: సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నాడని మండిపడ్డారు. ‘నేడు రాష్ట్ర అప్పులు రూ. 4లక్షల కోట్లు ఉంటే... రూ. 2.50లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే... చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా?. ప్రజలకు అవసరమైనప్పుడు... ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాల కోసం...ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది. చిల్లర రాజకీయ నాయకుడు.. చంద్రబాబు చేస్తేనే సంసారం’ అని కొడాలి నాని అన్నారు. -
బాబు, పవన్ కు కొడాలి, నందిగాం సురేష్ కౌంటర్
-
తుప్పు పట్టిన సైకిల్,పగిలిన గ్లాస్ చంద్రబాబు..కొడాలి నాని ఊర మాస్ స్పీచ్
-
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం
-
కొడాలి నాని పై పూలు చల్లిన పేర్ని నాని
-
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం
సాక్షి, కృష్ణా: సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డినే ప్రమాణస్వీకారం చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. ‘మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగేవారు రాష్ట్రంలో లేరు. చంద్రబాబు.. పవన్.. సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే. సీఎం జగన్ను అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. నవ్వుతూ జైలుకెళ్ళిన సీఎం జగన్. 16 నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చాడు. ...సీఎం జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదు. మాడు ముఖం, చించుకోవడం, ఫ్రస్టేషన్, గంతులు వేయడం ఇది ప్రతిపక్షాల తిరు. ఇలాంటి సైకోలందరూ కలిసి సీఎం జగన్ను వేధిస్తున్నారు. 58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తినా.. కరోనా ఇబ్బందులు వచ్చినా. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడు. అదే చంద్రబాబు అయితే ఇంట్లో పడుకొని.. కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడు’ అని కొడాలి నాని అన్నారు. -
గ్రాఫిక్స్తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా?: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రానికి మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేడని మాజి మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.. రాజధాని రైతులు ఏ త్యాగం చేశారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో సీఎం జగన్కు తెలుసు. ఏ రాజధానిలోనైనా 150 ఎకరాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలుంటాయి. మిగిలిన 99 శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి. 33 వేల ఎకరాలు తీసుకున్న బాబు.. పిట్టలదొర కబుర్లు చేబుతున్నాడు. గ్రాఫిక్స్తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా? అని మండిపడ్డారు. దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.. ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి. రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప. మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్కత్తా ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా?. రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా?. దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా?. ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు. 25 లక్షల జనాభా, పోర్టు, అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే మహానగరంగా అయ్యి తీరుతుంది. ... వైజాగ్ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే, వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు. సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు, 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు. కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం. నేనైతే సంపద సృష్టించే వాడిని, సీఎం జగన్కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు. సీఎం జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా.. ఓ సక్సెస్ఫుల్ బిజినెస్మాన్. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్’అని కొడాలి అన్నారు. -
పవన్ యుద్దం ఉమ్మెంట్స్ పై కొడాలి నాని కౌంటర్..!
-
మా ఫ్లెక్సీ పక్కన మీ ఫ్లెక్సీలు పెడితే యుద్ధం అవ్వదు... అది కామెడీ అవుతుంది కొడాలి నాని సెటైర్లు
-
పవన్ కళ్యాణ్ మేము సిద్ధమే..కొడాలి నాని కౌంటర్
-
ఫ్లెక్సీలేనా?.. అభ్యర్థులు లేరా?
సాక్షి, కృష్ణా: మేమూ సిద్ధం అంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్పై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. వైఎస్సార్సీపీపై అభ్యర్థుల్ని కూడా నిలబెట్టి అప్పుడు సిద్ధం అంటే బాగుంటుందంటూ చురకలంటించారాయన. మేం సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటున్నారు. ఎన్నికల కోసం జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటున్నారు. మరి మీరు దేనికి సిద్ధం?. మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా?. క్యాండిడేట్లను పెట్టరా? ఫ్లెక్సీలే పెడతారా?. మాపై మీ అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటే బాగుంటుంది అని పవన్కు సూచించారాయన. -
వాలంటీర్లపై చంద్రబాబు,పవన్ ఏడుపు: కొడాలి నాని
-
చంద్రబాబు, లోకేష్ పై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
-
సీఎం జగన్ ను ఎదుర్కోలేక బాబు పొత్తులు పెట్టుకుంటున్నారు..!