AP: నెల్లూరులో టీడీపీకి షాక్‌.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

నెల్లూరులో టీడీపీకి షాక్‌.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు

Published Sat, Dec 30 2023 8:52 PM

Shock To Tdp In Nellore  - Sakshi

సాక్షి,నెల్లూరు: మరి కొన్ని నెలల్లో  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా  నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్‌ తగిలింది. ముత్తుకూరు మండల కేంద్రంలో 200 మంది యువకులు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. యువకులందరికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి  కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ రెండు నెలల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కనుమరుగై పోతాడని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు శుభం కార్డ్ అయితే సోమిరెడ్డికి ఎండ్ కార్డు పడుతుందని కాకాణి అన్నారు. 

ఇదీచదవండి.. ఓం ప్రథమం.. ఎదురైంది దుశ్శకునం

Advertisement
Advertisement