Somireddy Chandramohan Reddy
-
ఇసుక దోపిడీతో వంద కోట్లకు సోమిరెడ్డి స్కెచ్: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో వంద కోట్ల మేర ఇసుక దోపిడీకి సోమిరెడ్డి స్కెచ్ వేశారని తెలిపారు. రీచ్లకు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి కాకాణి తాజాగా నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి పాలన అంతా దోపిడీమయమే. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దోపిడీకి స్కెచ్ వేశారు. ఇటీవల జిల్లా మైనింగ్ అధికారి ఇరువూరు వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ, టిప్పర్లను పట్టుకున్నారు. ఈ రీచ్కు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారు. వాహనాలను పట్టుకున్న అధికారులను సోమిరెడ్డి బెదిరించారు. రీచ్లో ఇసుకను తీసుకెళ్లే దారులను తెగ్గొట్టారు.టీడీపీ నేతలు సూచించిన దారుల్లోనే వెళ్లాలని చెబుతున్నారు. ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. అధికారులను బెదిరించి మరీ సోమిరెడ్డి దోచుకుంటున్నారు. పూడికలు తీయకుండానే బిల్లులు చేసుకున్నారు. దీనివల్ల నీరు చివరకు చేరక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సర్వేపల్లిలో అనధికార బార్లను నిర్వహిస్తున్నారు. ఇసుక, నీటి పారుదల, గ్రావెల్లలో అక్రమాలతో పాటు అనధికారికంగా బెల్ట్ దుకాణాలు.. బార్లను కొనసాగిస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. జిల్లాకు కలెక్టర్, ఎస్సీలు ఉన్నా.. వారు లేనట్టుగానే ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. -
సోమిరెడ్డి సొల్లు..ఇసుక దందా ఫుల్లు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నిత్యం నీతి కబుర్లు చెబుతూ జనాన్ని మాయ చేసే సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అసలు రంగు బయటపడింది. సొంత నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతూ ఆయన మనుషులు అడ్డంగా దొరికిపోయారు. ఈ దందాను చూసి గనుల శాఖాధికారులే నివ్వెరపోయారు. అనుమతి లేని పెన్నా నది ఇసుక రీచుల్లో అంత భారీ స్థాయిలో తవ్వకాలు, రవాణా జరుపుతున్నారంటే ఏ స్థాయి అవినీతి జరుగుతుందోనని బెంబేలెత్తిపోయారు. ఈ అక్రమ తవ్వకాల విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా సర్వేç³ల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం విరువూరు, సూరాయపాళెం రీచుల్లో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ఈ రీచుల్లో ఇసుకను యంత్రాలతో తోడేస్తున్నారు. 16 టైర్ల లారీలు, టిప్పర్లలో యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముతున్నారు. ఈ క్రమంలో సాధారణ తనిఖీల్లో భాగంగా నెల్లూరు జిల్లా గనుల శాఖ ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ తన సిబ్బందితో రోడ్డుపై వెళుతున్న కొన్ని లారీలను ఆపి చూసి ఆశ్చర్యపోయారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిపోతున్నట్లు గుర్తించారు. అయితే సోమిరెడ్డివని చెబుతూ చాలా లారీలు ఆగకుండానే వెళ్లిపోయాయి. వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా, వారిని బెదిరించి బలవంతంగా ఆ వాహనాలను తరలించుకుపోయారు. ఈ లారీలు విరువూరు, సూరాయపాళెం రీచుల నుంచి వస్తున్నాయని తెలుసుకుని అధికారులు అక్కడికి బయలుదేరారు. అక్రమార్కులు ఈ విషయం తెలుసుకుని లోడైన వందలాది లారీలను ఇతర మార్గాల్లో మళ్లించారు.పై నుంచి ఒత్తిడి.. చేతులెత్తేసిన అధికారులుతనిఖీలు చేస్తున్న అధికారులకు ఫోన్లలో పైనుంచి ఒత్తిడి పెరగడంతో మిగిలిన అక్రమ ఇసుక లారీలను పట్టుకోకుండా వదిలేసినట్లు తెలిసింది. తాను చెప్పినట్లు వినకపోతే బదిలీ చేయిస్తానని సోమిరెడ్డి హెచ్చరించడంతోనే అధికారులు మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఇంత భారీ అక్రమ రవాణాను అడ్డుకుని ఏమీ పట్టుకోకపోతే తమకు ఇబ్బంది వస్తుందని బతిమిలాడడంతో కేవలం రెండు లారీలు, ఒక టిప్పర్, రెండు హిటాచి ఎక్సవేటర్లను వారికి అప్పగించారు. నిజానికి రెండు లారీలు, ఒక టిప్పర్ కోసం రెండు భారీ హిటాచి ఎస్కవేటర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ వందలాది లారీల్లో ఇసుక తరలి పోతున్నట్లు తేలింది. నిజానికి పక్కన పొదల్లోనే మరో 4 హిటాచీ ఎస్కవేటర్లను దాచినట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం ఆరు ఎస్కవేటర్లతో పెన్నా నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి నిత్యం వందల లారీలు, టిప్పర్లలో తరలించి అమ్ముకుంటున్నారు. ఈ విషయం తెలిసినా ఎమ్మెల్యే సోమిరెడ్డి బెదిరింపులతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దొరికిన యంత్రాలు, టిప్పర్లలోనూ కొన్నింటిని వదిలేసి వెళ్లిపోవడంతో అధికారుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఎమ్మెల్యే ఫోన్.. మాట్లాడండి..ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఆనంద్కు వివరిస్తున్న సమయంలో స్థానిక టీడీపీ నేత ఒకరు.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫోన్ చేస్తున్నాడని అధికారికి ఇవ్వబోగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘నేను జిల్లా కలెక్టర్తో మాట్లాడుతుంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నారంటూ ఎలా ఇస్తావ్.. ఇకపై ఇల్లీగల్ బిజినెస్ చేస్తే ఒప్పుకోం’ అంటూ టీడీపీ నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. విరువూరు రీచ్ వద్ద భారీగా ఆగి ఉన్న లారీలను ఆపేందుకు పోలీసుల సహాయం కోరినా వారి నుంచి కనీస స్పందన కూడా లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా విరువూరు, సూరాయపాళెంలో రీచ్ల్లో 16 టైర్ల లారీ లోడింగ్కు టీడీపీ నేతలు రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా వందలాది వాహనాల నుంచి దండుకుంటున్నారు. పెన్నా బ్యారేజ్కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రైతులు లబోదిబోమంటున్నా పట్టించుకోవడం లేదు. అనుమతి లేని రీచ్ల్లో తవ్వకాలు ఆకస్మికంగా ఇసుక రీచ్లను తనిఖీ చేయడం కోసం పోతిరెడ్డిపాడు, సంగం, సూరాయపాలెంలో ఉన్న ఇసుక రీచ్లు, డంప్ యార్డులను చూసి తిరిగి నెల్లూరు వెళుతుండగా కొన్ని లారీలు. విరువూరు రీచ్ నుంచి వస్తున్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లాం. అక్కడ రీచ్పై కోర్టు స్టే ఉంది. అయినా ఇక్కడి నుంచి ఇసుక అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని గమనించాం. రెండు టాటా హిటాచీలు, రెండు లారీలు, ఒక టిప్పర్ను స్వాధీనం చేసుకుని పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చాం. – బాలాజీ నాయక్, ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్, గనుల శాఖ, నెల్లూరు సోమిరెడ్డి టార్గెట్ రూ.100 కోట్లు ఇసుక రీచ్ల ద్వారా ఎమ్మెల్యే సోమిరెడ్డి టార్కెట్ రూ.100 కోట్లు పైనే అని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. అధికారుల కళ్ల ముందే ఇసుక లారీలు వెళుతున్నా పట్టించుకోవడం లేదు. సోమిరెడ్డి కనుసన్నల్లో దందా జరుగుతుండటం వల్లే ఇలా బరితెగించారు. గనుల అధికారి సూరాయపాళెం, విరువూరు రీచ్ల వద్దకు వెళుతున్నారని వందలాది లారీలను అక్కడి నుంచి పంపించేశారు. ఇదీ సోమిరెడ్డి నీతి, నిజాయితీ. ఇసుకను అక్రమంగా తప్వుకోమని సీఎం చంద్రబాబు సోమిరెడ్డికి అనుమతి ఇచ్చినట్టుంది.– కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి -
ఆ దమ్ము సోమిరెడ్డికి ఉందా?.. కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామదాసు కండ్రిగలోని పేదల దగ్గర భూములు తక్కువకు కొనుగోలు చేసాడని.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని కొట్టేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎల్లో మీడియాపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ భూములపై సీబీసీఐడీ అధికారులు చేత విచారణ జరిపించే దమ్ము సోమిరెడ్డికి ఉందా? నాఫై సోమిరెడ్డి 17 విజిలెన్స్ ఎంక్వరీ చేయించాడు.. తప్పుడు కేసులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిభో పరిశ్రమ వెళ్లిపోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే కారణం...కమిషన్ల కోసం సోమిరెడ్డి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఉద్యోగుల బదిలీల్లో కూడా సోమిరెడ్డి లక్షల రూపాయలు దండుకుంటున్నాడు. టీడీపీ హయాంలోనే రామదాస్ కండ్రిగ భూముల్లో అవినీతి జరిగింది.. దానిపై విచారణ జరిపే దమ్ము సీఎం చంద్రబాబుకి కూడా లేదు. కుటుంబాల్లో కలతలు వచ్చేలా ఎల్లో మీడియా వార్తలు రాస్తోంది. ఈ భూముల విలువల్లో 10 శాతం ఇప్పించగలిగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’’ అని కాకాణి సవాల్ విసిరారు. -
YSRCP నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు: కాకాణి
-
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి మండిపడ్డారు.
-
సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వాన్నం: కాకాణి
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కాకాణి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తున్నాం. ఇరిగేషన్లో అవినీతి ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వాన్నంగా ఉంది. తూ.తూ మంత్రంగా పనులు ముగించి నీళ్ళు వదిలితే ఆ పనుల్లో నాణ్యత ఎలా ఉంటుంది. టెండర్ల కంటే ముందే పనులు ముగించిన అవినీతి ఘనత సోమిరెడ్డిది. పూడికతీత పనులు ఎంత నాణ్యతగా ఉన్నాయో ఇవే సాక్ష్యాలు (ఫోటో ప్రూఫ్).నవంబర్ ఏడో తేదీన నీళ్ళు వదిలిన ఘనతను దినపత్రికలే సాక్షిగా చెబుతున్నాయి. నీకు అనుకూలంగా వున్న కొద్ది మంది రైతుల దగ్గర పనులు జరగలేదని చెప్పించడం కాదు. మొత్తం కనుపూరు కాలువ మీద 30 కోట్ల అవినీతి జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదు. సోమిరెడ్డి చేస్తున్న పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. విచారణలో అవకతవకలు జరిగినట్లు తేలితే దాని మీద మళ్ళీ విచారణ చేయిస్తాం.పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. స్టేట్మెంట్తో మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్లు కాలేరు. చిత్తశుద్ధితో పని చేయాలి. మద్యం షాపుల్లో ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ విక్రయిస్తే జరిమానాలు అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేశామని రెండు కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై క్యాష్ కొట్టు.. షాప్ పట్టు అని ఇప్పుడు కూడా చెబుతున్నాను. మీ అవినీతిని ఎప్పటికప్పుడు బయటకు చెబుతూనే ఉంటాం’ అని హెచ్చరించారు. -
సోమిరెడ్డి పై కాకాని ఫైర్
-
కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
-
పోర్టు సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
సాక్షి ప్రతినిధి నెల్లూరు/ముత్తుకూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దాడికి తెగబడిన వైనం కలకలం రేపింది. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునద్ధరణ పనులపై యాజమాన్యంతో చర్చించేందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి సోమవారం తన అనుచరులతో వెళ్లారు. పోర్టు ప్రధానద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ డీజీఎం ఎమ్మెల్యే కారుతోపాటు కొన్ని వాహనాలను లోనికి అనుమతించారు. మిగిలిన వాహనాలను తనిఖీచేయాలని నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన సోమిరెడ్డి కారునుంచి దిగివచ్చి కోపంతో ఊగిపోతూ అసభ్య పదజాలంతో తిట్లదండకం అందుకున్నారు. సెక్యూరిటీ డీజీఎంపై దాడికి తెగబడి ఆయన్ని వెనక్కి నెట్టివేశారు. తనకు జరిగిన అవమానాన్ని పోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసకువెళ్లే క్రమంలో పోలీసులు, నాయకులు డీజీఎంను వారించారు. ఇదే అంశంపై పోర్టు అడ్మిన్ భవనం వద్ద కూడా సోమిరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.సీఈఓతోనూ దురుసు ప్రవర్తనఎన్నికలముందు పోర్టు కంటైనర్ టెర్మినల్ సేవలను పునరుద్ధరిస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటివరకు పోర్టు యాజమాన్యంతో చర్చలు జరపకపోవడం, కార్యాచరణ చేపట్టకపోవడంతో సీఐటీయూ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి అఖిలపక్షం పేరుతో పోర్టు అధికారులతో మాట్లాడేందుకు సోమవారం వెళ్లిన సోమిరెడ్డి పోర్టు కార్యాలయంలోకి వెళ్లి సీఈఓతోనూ వాగ్వాదానికి దిగారు. ఆయనతో దురుసుగా ప్రవర్తిస్తూ కేకలు వేశారు. ఖండించిన కాకాణి కృష్ణపట్నం పోర్టులో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేయిచేసుకోవడాన్ని మాజీమంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమిరెడ్డి అఖిలపక్షం పేరిట డ్రామాలు ఆడుతూ, కూటమి పార్టీల నేతలను పోర్టుకు తీసుకెళ్లడం ఏమిటని నిలదీశారు. అత్యంత భద్రత ఉండే ప్రధానమైన పోర్టులో తనిఖీచేసి వాహనాలను అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినకుండా దాడి చేశారన్నారు. పోర్టు కార్యాలయంలోనూ సోమిరెడ్డి కేకలు వేసి సీఈఓతో దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. ఎమ్మెల్యే వీధిరౌడీలా మారి నేరుగా దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు. -
వీడియో: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దౌర్జన్యం..
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెచ్చిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సోమిరెడ్డి ప్రతీ చోటా దుసురుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సోమిరెడ్డి కృష్ణ పోర్టు వద్ద ఓవరాక్షన్ చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి కొట్టేందుకు ప్రయత్నించారు.వివరాల ప్రకారం.. కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. సోమవారం పోర్టు వద్దకు వెళ్లిన సోమిరెడ్డి.. తనతో వచ్చిన ఓ కారును అనుమతించకపోవడంతో ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో, వెంటనే కారు దిగి.. సెక్యూరిటీపై తన ఆధిపత్యం చూపించారు. సెక్యూరిటీని నెట్టేసి.. అతడికి కొట్టబోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రౌడియిజంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. అదాని పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి అక్కడి సెక్యూరిటీపై దౌర్జన్యం చేయడం సిగ్గుచేటు. రౌడీయిజం చేసి పరిశ్రమలను వెళ్లగొట్టాలని సోమిరెడ్డి కుట్రలు చేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలను బెదరగొట్టి సోమిరెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారు. గత పది ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. రౌడీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
సోమిరెడ్డి పై కాకాణి సెటైర్లు ..
-
కరప్షన్కి సోమిరెడ్డి బ్రాండ్ అంబాసిడర్: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: ఏపీ సర్కార్ లిక్కర్ పాలసీపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ నేతల పేరుతో ఒక్కో లిక్కర్ షాపుకి ఐదు లక్షల చొప్పున వసూలు చేశారని ఆయన మండిపడ్డారు. 30 శాతం వాటా కార్యకర్తల పేరిట వసూళ్లు చేశారని.. బెల్ట్ షాపుల వేలం సోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని కాకాణి ధ్వజమెత్తారు.నియోజకవర్గంలో 300 బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చారు. నెలకు ఒక్కో షాప్కు పదిహేను వేలు వసూలు చేస్తున్నారు. కూల్ డ్రింక్ షాపుల వాళ్లు నెలకు రూ.30 వేలు ఇవ్వాలని ఫిక్స్ చేశారు. కరప్షన్కి సోమిరెడ్డి బ్రాండ్ అంబాసిడర్’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు.బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులపై ఉన్న ధ్యాస, సోమిరెడ్డికి ప్రజల మీద లేదు. నా ఆరోపణలపై దమ్ముంటే సోమిరెడ్డి విచారణకు సిద్ధమా..?’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. -
సీబీఐ విచారణ కోరే దమ్ముందా: కాకాణి సవాల్
సాక్షి,నెల్లూరు:సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించే ధైర్యం సోమిరెడ్డికి ఉందా అని కాకాణి ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్5) ఈ విషయమై కాకాణి మీడియాతో మాట్లాడారు.‘తాను చెప్పిన పనులు అధికారులు చెయ్యడం లేదనే ఫ్రస్టేషన్లో సోమిరెడ్డి ఉన్నారు.తాను చెప్పిన వారిని కేసుల్లో ఇరికించడం లేదని సోమిరెడ్డి బాధపడుతున్నారు.సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.కేసులు,అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచిన తర్వాత మంచంలో పడుకుని ఉన్నాలాక్కొస్తాం. నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలలో ఒక్క దానినైనా రుజువు చెయ్యగలవా?నీకు దమ్ము దైర్యం ఉంటే నేను అవినీతి చేసినట్టు నిరూపించు. సూరాయి పాలేం ఇసుక రీచ్లో జరుగుతున్న తవ్వకాల మీద గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తున్నాం. నీరు చెట్టులో జరిగిన అవినీతి మీద విచారణకి అదేశిస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయని మానవత్వంతో వెనక్కి తగ్గాను. మైనింగ్ కాంట్రాక్టర్లతో చంద్రబాబు వద్దకు సోమిరెడ్డి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.సోమిరెడ్డి అవినీతి మీద విచారణ వేయాలి.ఆయన చేసిన అవినీతి బయటడుతుంది’అని కాకాణి అన్నారు. ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ -
సోమిరెడ్డి నీ చిలక్కొట్టుడు ఆపేయ్... కాకాణి మాస్ ర్యాగింగ్
-
సోమిరెడ్డికి YSRCP నేతలు వార్నింగ్
-
MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి బట్టబయలు
-
సోమిరెడ్డి అవినీతి బట్టబయలు.. రూ.100 కోట్ల దోపిడీకి స్కెచ్!
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి బట్టబయలైంది. రీచ్ టు రిచ్కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగానే ప్లాన్ వేశారని స్పష్టమవుతోంది. ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ.వందల కోట్లు సంపాదించాలని టార్గెట్గా పెట్టుకున్న ఆయన మనుషులు సూరాయపాళెం ఇసుక రీచ్లో సాగించిన హెచ్చరికలు, దూషణల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక వెలికి తీసేందుకు వచ్చిన గుంటూరుకు చెందిన శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోర్డ్ వర్కర్స్ అండ్ అదర్ వర్క్స్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాంట్రాక్టర్లను సోమిరెడ్డి మనుషులు బెదిరించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సోమిరెడ్డి తన మనుషులను రీచ్ వద్దకు పంపి డ్రెడ్జింగ్ వినియోగించే పడవలను వెనుక్కు పంపే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు కలెక్టర్నే తూలనాడారు. స్థానిక శాసన సభ్యుడిని కాదని మీరు ఏమి చేయలేరని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు.చంద్రబాబునాయుడు స్థానిక ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పా రు. మధ్యలో కలెక్టర్ ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ బూతుపురాణం అందుకున్నాడు. కలెక్టర్ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పద్ధతి ప్రకారం డ్రెడ్జింగ్ చేసేందుకు వచ్చారు. అయితే సోమిరెడ్డి అనుచరులు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను వెలికి తీస్తే ఎలాంటి ఆదాయం ఉండదని, మధ్యలో ఇసుక దిబ్బలను ఎత్తాలని సూచించారు.ఇదీ చదవండి: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడిఇందు కోసం తాము 300 ట్రిప్పుల గ్రావెల్ తోలి రీచ్కు దారులు ఏర్పాటు చేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. ఆయన (సోమిరెడ్డి) ఇంత చేస్తుంటే.. మీరు ఆయనకు తెలియకుండా ఏమైనా చేసినట్లు తెలిస్తే చాలా గొడవలు అవుతాయంటూ కంఠస్వరం పెంచుతూ మాట్లాడారు. ఈ మాటలను బట్టి చూస్తే ఉచిత ఇసుక పాలసీ డొల్లతనం ఇట్టే అర్థం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, తమ్ముళ్లు ఇసుక ద్వారా సొమ్ము చేసుకోవాలని ఎంతగా పరితపిస్తున్నారో తెలుస్తోంది. ఓ పక్కన రైతులు ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని, పర్యావరణకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమ సంపాదనకు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని వెనుక్కు తగ్గడమే లేదు. -
హైకోర్టు తీర్పు.. సోమిరెడ్డికి చెంపపెట్టు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కనుపూరు గ్రామానికి చెందిన జ్యోతి న్యాయ పోరాటం ఫలించింది. జ్యోతినే కనుపూరు ఉన్నత పాఠశాలలో వంట, సహాయకురాలిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి చెంప పెట్టుగా మారింది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం చిరు ఉద్యోగుల పొట్టకొట్టే చర్యలకు సిద్ధపడింది. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఏళ్ల తరబడి వివిధ వ్యవస్థల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులను ఎడాపెడా తీసిపడేసి.. ఆయా స్థానాల్లో తమకు కావాల్సిన వారిని నియమించే విధంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఓఏలు, పాఠశాలల్లో వంట, సహాయకురాళ్లుగా పనిచేసే వారిని నిబంధనలకు విరుద్ధంగా తొలగించి, ఆయా పోస్టుల్లో కొత్త వారిని నియమించి ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోస్టును బట్టి లక్షలాది రూపాయలు డిమాండ్ చేసి మరీ వసూళ్లకు పాల్పడినట్లు ఇటీవల బీజేపీ నేత బహిరంగంగా ఆరోపించిన విషయం విదితమే. ఈ క్రమంలో కనుపూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వంట సహాయకురాలిగా పని చేస్తున్న జ్యోతిని విధుల నుంచి స్వచ్ఛందంగా మానుకోవాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లను జ్యోతి లెక్క చేయకపోవడంతో ఆ పోస్టు నుంచి జ్యోతిని తొలగించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఒక లేఖ ఇచ్చారు. దాని ఆధారంగా అధికారులు ఆమెను విధుల నుంచి తొలగించారు. తనకు జరిగిన అన్యాయంపై జ్యోతి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి లేఖతో వంట సహాయకురాలిగా తొలగించడం అన్యాయమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జ్యోతి వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్యే లేఖతో జ్యోతిని తొలగించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ, జ్యోతిని తిరిగి యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ పరిణామం సోమిరెడ్డికి చెంపపెట్టులాందటని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలతోనైనా సోమిరెడ్డి కనువిప్పుతో వ్యవహరించాలని సర్వేపల్లి నియోజవర్గ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
సోమిరెడ్డి అక్రమాలపై విచారించండి
నెల్లూరు (బారకాసు): సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి, ఆక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. సోమిరెడ్డి అవినీతి, అక్రమాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమ వారం మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో సోమిరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై తాను త్వరలోనే నివేదిక విడుదల చేస్తానని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.3 లక్షలు ఇవ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారని బీజేపీ వెంకటాచల మండల ప్రధాన కార్యదర్శి పిల్లిపోకుల పెంచలయ్య ఇటీవల వెల్లడించారని గుర్తు చేశారు.ఆ విషయాలతో కాని, అతనితో కాని తనMý ు ఎటువంటి సంబంధం లేదన్నారు. కానీ.. ఆయనతో తానే మాట్లాడించినట్టు సోమిరెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశి్నంచారు. ‘అధికారం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి పెంచలయ్య మాతో మాట్లాడినట్లుగా నిరూపించాలి. అందుకోసం విచారణ కూడా చేయించుకోవాలి’ అని కాకాణి సూచించారు. తనపై కేసులు పెడితే భయపడేది లేదని, పోలీసులు, కేసులు, జైళ్లకు తాము భయపడేవాళ్లం కాదని అన్నారు. పోస్టులు అమ్మకునే బుద్ధి ఆయనకు గతంలోనే ఉందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు, వీఓఏ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదన్నారు. -
సోమిరెడ్డి అవినీతిపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
కట్టాల్సిందే ‘ఎస్’ ట్యాక్స్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సర్వేపల్లి నియోజకవర్గానికి ‘ఎస్’ ట్యాక్స్ గుదిబండగా మారింది. దినసరి కూలీల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి కప్పం కట్టాల్సిందే. లేదంటే భౌతిక దాడులతో ఆయన దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఇక ఆయన తనయుడు (షాడో ఎమ్మెల్యే).. కాదేదీ కమీషన్లకు అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఆయన కప్పాలు కట్టలేక పారిశ్రామికుల నుంచి లేబర్ ఏజెన్సీల వరకు తలలు పట్టుకుంటున్నారు. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టులో విడుదలయ్యే బూడిదను కూడా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ప్లాంట్లో విడుదలయ్యే ఫ్లయాష్లో 20 శాతం ఉచితంగా సిమెంట్ కంపెనీలకు ఇవ్వాలి. మరో 80 శాతం విక్రయించవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకున్న షాడో ఎమ్మెల్యే ఉచితంగా ఇచ్చే 20 శాతం బూడిదను తనకే ఇవ్వాలని పట్టుబట్టి చేజిక్కించుకున్నాడు. దానిని సిమెంట్ కంపెనీలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రతి నెలా రూ. 32 లక్షల ఆర్జించే ప్లాన్ ఇది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తోటపల్లి గూడూరు మండలం అనంతపురంలో రొయ్యల ఫీడ్తో పాటు మేత తయారు చేసే వాటర్బేస్ లిమిటెడ్ కంపెనీలో 150 మంది వరకు రోజువారీ లేబర్గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ లేబర్ కాంట్రాక్టుపై టీడీపీ నేతల కన్నుపడింది. తమకే ఆ కాంట్రాక్టు ఇవ్వాలని ఆ కంపెనీ ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగారు. దీనితో భయపడ్డ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా జంకింది. లేబర్ కాంట్రాక్ట్ను వెంటనే టీడీపీ నేతలకు అప్పగించింది. వెంకటాచలం మండలం కాకర్లవారిపాళెం ప్రాంతంలోని బేవరేజస్ పరిశ్రమలో పనిచేసే కార్మికులను తొలగించి టీడీపీ కార్యకర్తల్ని పెట్టుకోమని డిమాండ్ పెట్టారు. అలాగే ఆ పరిశ్రమల్లో మెస్ నిర్వహణ కూడా తన అనుచరుడికే ఇవ్వాలని పట్టుబట్టి యాజమాన్యాన్ని వేధిస్తున్నారు.కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పాటయిన ఫ్యాక్టరీలలో తయారయ్యే పామాయిల్ను తరలించే ట్యాంకర్ల నుంచి ‘ఎస్’ ట్యాక్స్ వసూళ్లకు తెరలేపారు. గత కొన్నేళ్లుగా పామాయిల్ ట్యాంకర్ల యజమానులు అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ అసోసియేషన్ నిర్వహణ కోసం ప్రతి లోడ్ ట్యాంకర్ నుంచి రూ. 300 వంతున వసూళ్లు చేసుకొనేవారు. షాడో ఎమ్మెల్యే కన్ను ఆయిల్ ట్యాంకర్లపై పడింది. ఆ అసోసియేషన్ పాలకవర్గాన్ని మార్చేసి వెంటనే తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రతి ఆయిల్ ట్యాంకర్ నుంచి అదనంగా రూ. 800 వంతున వసూళ్లు చేసుకునేలా ప్లానింగ్ చేసుకున్నాడు. దీంతో ప్రతిరోజు దాదాపు 150 వరకు ట్యాంకర్లు రూ. 1.2 లక్షలు వరకు ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. బయట రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాంకర్ల వద్ద అదనంగా రూ.4 వేలు వంతున వసూళ్లు చేస్తున్నారు. -
ఇసుక దోపిడీలో సోమిరెడ్డిదే ఫస్ట్ ర్యాంక్..
-
సోమిరెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
ఆధారాలు ఇస్తాం విచారణ చేసే దమ్ముందా ప్రభుత్వానికి
-
ఏ విచారణకైనా సిద్ధం.. సోమిరెడ్డికి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లే అవుట్లు వేశారు. సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారని.. అక్రమ అక్రమ లే అవుట్లపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారని కాకాణి తెలిపారు.‘‘40 లే అవుట్లు ఉన్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారు. 25 లే అవుట్లకు ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయలేదని వెల్లడించారు. టీడీపీ హయాంలోనే విజిలెన్స్ విచారణ చేసి రూ.6.5 కోట్లు జరిమానా విధించారు. కానీ అప్పట్లో సోమిరెడ్డి జోక్యం చేసుకుని డబ్బు కట్టకుండా చేశారు. ఈ వ్యవహారమంతా టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని’’ కాకాణి వివరించారు.‘‘నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దమ్ముంటే విచారణ చేయండి. పొదలకూరులోని లేఅవుట్ దారులతో నెల రోజుల నుంచి సోమిరెడ్డి లావాదేవీలు జరుపుతున్నారు. అది కుదరకపోవడంతో నుడా అధికారుల వద్ద పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నేను ఏ విచారణకైనా సిద్ధం. సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు ఇస్తాం.. విచారణ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. -
నీకు నిజంగా దమ్ముంటే.. సోమిరెడ్డికి కాకాని సవాల్
-
సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
సోమిరెడ్డిపై కేసు నమోదు
పొదలకూరు: ఎన్నికల వేళ ప్రచారంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మహిళలకు నగదు పంపిణీ చేసిన వ్యవహారంపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డి అప్పట్లోనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా.. మానవతా దృక్పథంతో సాయం చేశారంటూ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి తోసిపుచ్చారు. వీడియో విజువల్స్లో స్పష్టంగా సోమిరెడ్డి మహిళలకు నోట్లు ఇవ్వడం కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు.దీనిపై కాకాణి పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మూడు రోజుల క్రితం కాకాణి మీడియా సమావేశం నిర్వహించి సోమిరెడ్డి ప్రలోభాల పర్వంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా సర్వేపల్లి రిటర్నింగ్ అధికారి చినఓబులేసు పొదలకూరు పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.ఏప్రిల్ 12వ తేదీన శుక్రవారం సోమిరెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్రెడ్డి పొదలకూరు మండలం చెర్లోపల్లి గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు పంపిణీ చేశారు. సోమిరెడ్డి అనుచరులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పట్లో ఎన్నికల అధికారులు దీనిపై మండలస్థాయి అధికారులతో విచారణ జరిపించి.. మానవతా దృక్పథంతో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు అందజేసినట్టు నివేదిక సమర్పించి మమ అనిపించారు. ఎట్టకేలకు కాకాణి హెచ్చరికలతో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై ఐపీసీ 173–ఈ, ఆర్పీ యాక్ట్ 123 క్లాజ్–1 సెక్షన్ల కింద పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. -
టీడీపీ సోమిరెడ్డి వీడియో లైవ్ లో బయటపెట్టిన మంత్రి కాకాణి
-
బ్లడ్ శాంపిలా?.. ప్రమాణమా?
నెల్లూరు (దర్గామిట్ట): జూదం, మద్యంతో పాటు అన్ని అవ లక్షణాలు కలిగిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తనను అప్రతిష్ట పాల్జేసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ‘బెంగళూరు రేవ్ పార్టితో నాకు సంబంధముందని నిరూపిస్తావా? బ్లడ్ శాంపిల్ ఇస్తావా? లేక ప్రమాణం చేస్తావా?’ అంటూ ఆయన సోమిరెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం మంత్రి కాకాణి విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు తన స్టిక్కర్ ఉందనే ప్రచారంతో సోమిరెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ జరిగిందని, తన పాస్ పోర్ట్ దొరికిందని, గోపాల్ రెడ్డి తనకు సన్నిహితుడని చెత్త ఆరోపణలు చేశారని చెప్పారు.ఈ విషయంపై తాను సోమిరెడ్డికి మరోసారి సవాల్ విసురుతున్నానన్నారు. కారులో నా పాస్పోర్టు దొరికిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాస్పోర్ట్ తన దగ్గరే ఉందని చెబుతూ... కాకాణి దాన్ని మీడియాకు చూపించారు. ఆ కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని, ఆ కారుకు తన స్టిక్కర్ ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. గోపాల్రెడ్డితో తనకు పరిచయమున్నట్టు ఏ ఆధారమున్నా సోమిరెడ్డి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గోపాల్రెడ్డికి – రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక పోలీసులే స్పష్టం చేశారని, సోమిరెడ్డి మాత్రం రేవ్ పార్టీని తనకు అంట కడుతున్నారన్నారు.క్లబ్కు వెళ్లడం, పేకాటాడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. సోమిరెడ్డి వ్యక్తిత్వంపై గతంలో స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయని, వాటిని ఎప్పుడూ ఆయన ఖండించలేదన్నారు. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోమిరెడ్డిపై తాను చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనన్నారు. గతంలో కోర్టులో చోరీ ఉదంతంపై తనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. తన సచ్చిలతను నిరూపించుకునేందుకు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, మరి సోమిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు. -
‘సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి’
నెల్లూరు, సాక్షి: బెంగళూరు రేవ్ పార్టీకి, ఆ కేసు నిందితులకు.. తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపణలు చేయడంతో తాజాగా కాకాణి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. సోమిరెడ్డిది నీచమైన చరిత్ర. అలాంటి చరిత్ర నాకైతే లేదు. రిసార్ట్ ఓనర్ గోపాల్రెడ్డితో నాకు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి అంటున్నారు. దానికి ఒక్క ఆధారమైనా చూపించగలరా?. రాజకీయంగా ఎదుర్కొనేలేకే ఈ చౌకబారు ఆరోపణలు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి. పురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లారు. నేను చేస్తున్నవి ఆరోపణలు కావు.. పచ్చి నిజాలు. సోమిరెడ్డి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్ ఇవ్వడానికి నేను రెడీ. సోమిరెడ్డికి దమ్ముంటే నా ఛాలెంజ్ను స్వీకరిస్తారా?. నా పాస్ పోర్ట్ నా దగ్గరేదే ఉంది. ఇదివరకే మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని చెప్పా. అయినా ఆయన పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు. రేవ్ పార్టీతోగానీ, ఆ కేసు నిందితులకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నా కారు స్టిక్కర్ వాడకంపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం అని కాకాణి మరోసారి స్పష్టత ఇచ్చారు. -
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
-
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
నెల్లూరు: బెంగళూరు రేవ్ పార్టీ అంశానికి సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ‘పచ్చమంద’కు మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి వాతలు పెట్టారు. తనకు సంబంధాలు ఉన్నా, తనకు సంబంధించిన వారు ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చన్నారు కాకాణి. ఎవరో అనామకుడు తన కారు స్టిక్కర్ను జిరాక్స్ తీసి వాడుకుంటే అందులో తాను ఉన్నానంటూ పచ్చ మంద రాద్దాంతం చేస్తుందని కాకాణి ధ్వజమెత్తారు.‘నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా?’‘బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?, నెల్లూరులో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తా. ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుంది. ఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలి. బెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నా. బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ? , రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది.బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదు.రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు పాసు పోర్ట్ నా దగ్గరే ఉంది.కుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరాను.రోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.సో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్’ అంటూ మండిపడ్డారు.‘రేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. సోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయి. నాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు. యూత్ మినిస్టర్గా ఉండి క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిది. నా పాస్ పోర్ట్ నెల్లూరులో ఉంది. కారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని కాకాణి తెలిపారు. -
సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: సోమిరెడ్డి నీతిమాలిన మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద చల్లుతున్నాడని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని.. అందుకే మాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ చేర్చిన ఎఫ్ఐఆర్లో మా పేరు ఉందని నిరూపించగలరా..?. గవర్నర్ పాలనలో కేసులు బుక్ అయ్యిందా.. లేక టీడీపీ వచ్చిన తర్వాత కేసు బుక్ అయ్యిందా..? చెప్పే దమ్ము నీకు ఉందా?. మద్యం దొరికిన రైస్మిల్ ఓనర్కి, నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా..?’’ అంటూ మంత్రి కాకాణి సవాల్ విసిరారు.‘‘ఓటమిని ముందుగానే అంగీకరించిన సోమిరెడ్డి నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతున్నాడు. పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5 వేల మంది వచ్చారని నిరూపిస్తే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా.. సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.. ఓటర్లకి డబ్బులు పంచుతున్న సోమిరెడ్డిని డీస్ క్వాలిఫై చెయ్యమని సీఈసీకి ఫిర్యాదు చేశాను. సోమిరెడ్డి సంస్కారంగా బతకడం నేర్చుకోవాలి..ఎక్కడో మద్యం దొరికితే డాన్ని కూడా నాకు ఆపాదిస్తారా..?. మా ఎలక్షన్ కూడా సోమిరెడ్డే చేస్తున్నాడు.. నేను ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెబుతున్నాడు’’ అంటూ మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. -
ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి నాపై బురద జల్లుతున్నాడు
-
నీకు నిజంగా సిగ్గు ఉంటే.. టీడీపీ సోమిరెడ్డికి కాకాని స్ట్రాంగ్ కౌంటర్
-
పట్టపగలే ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన సోమిరెడ్డి
-
పచ్చ ప్రలోభాలు.. పట్టపగలే టీడీపీ నేత సోమిరెడ్డి బరితెగింపు
సాక్షి, నెల్లూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో ఉన్న పచ్చపార్టీ నేతలు పట్టపగలే ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీడీపీ నేత ప్రచారంలో భాగంగా రోడ్డుపైనే ఓటర్లులకు డబ్బులు పంచారు. నెల్లూరు జిల్లాలోని సర్వేసల్లి నియజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి బరితెగించారు. అక్కడ ఉన్న ఓటర్లకు డబ్బులు పంచారు. సోమిరెడ్డి పట్టపగలే మహిళా ఓటర్లుకు డబ్బుల, చీరలు పంచుతూ అడ్డంగా దొరికి పోయారు. -
సర్వేపల్లి బరిలో మళ్లీ వారే..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: జిల్లాలో సర్వేపల్లి నియోజకర్గానికి అనేక ప్రత్యేకతలున్నాయి. విస్తారంగా సముద్ర తీరం ఉంది. వేలామందికి ఉపాధి కల్పిస్తున్న కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు మండలంలో ఉంది. దాని ఆధారంగా అనేక పరిశ్రమలున్నాయి. సర్వేపల్లిలో రాజకీయాలు హాట్హాట్గా ఉంటాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఉంటారని ఎప్పుడో నిర్ణయమైంది. అయితే టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారోనని కొద్దిరోజులు ఉత్కంఠ నెలకొంది. దీనికి చంద్రబాబు నాయుడు తెరదించారు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికే అవకాశం కల్పించారు. మూడోసారి పాత ప్రత్యర్థులైన మంత్రి కాకాణి, సోమిరెడ్డిల మధ్య మూడో పర్యాయం పోటీ నెలకొంది. జిల్లాలో చూస్తే పాతకాపుల మధ్య పోటీ సర్వేపల్లిలోనే నెలకొనడం విశేషం. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కాకాణి, టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి తలపడ్డారు. కానీ కాకాణి విజయం సాధించారు. 14లో 5,500 ఓట్లు, 19లో 14 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడినా సోమిరెడ్డిని చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన పదవిని అడ్డు పెట్టుకుని 2019 ఎన్నికల్లో సర్వేపల్లి బరిలో నిలబడి అస్త్రశస్త్రాలు ప్రయోగించి మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. అదే బలం కాకాణి సొంత మండలం పొదలకూరు ఆయనకు కంచుకోట. దీనిపై సోమిరెడ్డి మంత్రి హోదాలో ఫోకస్ పెట్టి ఎన్నో రాజకీయ విన్యాసాలు చేశారు. కాకాణి స్వగ్రామం తోడేరులో ఒకరిద్దరిని ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకున్నా తర్వాత వారు సొంత గూటికే చేరుకున్నారు. 2019లో ఎన్ని కుయుక్తులు పన్నినా ఒక్క పొదలకూరు నుంచి కాకాణి సోమిరెడ్డిపై 4,700 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పుడు కూడా సోమిరెడ్డి పొదలకూరు మండలంపైనే తన దృష్టిని నిలిపి గోవర్ధన్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. క్యూ కట్టి.. సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి వలసలు పెరిగాయి. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగూడూరు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టి మరీ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. వారిని సోమిరెడ్డి నిరోధించలేకపోతున్నారు. దీంతో తమ పార్టీకి చెందిన వారికే కండువాలు కప్పి వైఎస్సార్సీపీ నుంచి వలసలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేగంగా అభివృద్ధి అధికార పార్టీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్రెడ్డి సర్వేపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా చేశారు. పల్లెల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం జరిగింది. మౌలిక వసతులు కల్పించారు. పంటలకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భూపట్టాల పంపిణీ, చుక్కల భూముల సమస్యల పరిష్కారం, పరిశ్రమల స్థాపన, నాన్ఫిషన్మెన్ ప్యాకేజీ తదితర పనులను పూర్తి చేశారు. దశాబ్దాల నాటి సమస్యలకు గడప గడపకు మనప్రభుత్వంలో మంత్రి పరిష్కారం చూపారు. దీంతో సర్వేపల్లిలో మరోసారి కాకాణి విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్నికల ప్రచారంలో టీడీపీ సోమిరెడ్డి మంత్రి కాకాని అదిరిపోయే సెటైర్లు
-
నీకు టికెట్ ఇచ్చినందుకు నేను ఫుల్ హ్యాపీ..
-
సోమిరెడ్డిపై మంత్రి కాకాని సెటైర్లు
-
కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి హైడ్రామా
నెల్లూరు: అదాని కృష్ణపట్నంపోర్టులో ఆదివారం అధికారులు ఎవరూ ఉండరు. పోలీసు సిబ్బంది మొత్తం మేదరమెట్ల సిద్ధం సభ విధులకు వెళ్లారు. ఇదే అదనుగా రాజకీయ మైలేజీ సాధించవచ్చని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తలపెట్టిన కుట్ర భగ్నమైంది. కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ సాకుతో చేసిన హైడ్రామా నవ్వులపాలైంది. కృష్ణపట్నంపోర్టు కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ పేరుతో సోమిరెడ్డి ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకుని పోర్టు వద్దకు ప్రదర్శనగా వచ్చారు. కొంతమందిని ముందుంచి గోపాలపురం వద్దకు చేరుకున్నారు. పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోర్టులో ఉన్నతాధికారులు ఎవ్వరూ లేరని, ముందస్తు సమాచారం లేకుండా, వారి అనుమతి లేకుండా లోపలకు వెళ్లనిచ్చేది లేదని సెక్యూరిటీ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో సోమిరెడ్డి వర్గీయులు రెచ్చిపోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు పోర్టు సెక్యూరిటీపై విరుచుకుపడడంతో తోపులాట జరిగింది. కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సెలవు రోజు ఆందోళన చేయడం ఏమిటంటూ సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తూ వారి హైడ్రామాను భగ్నం చేశారు. దీంతో సోమిరెడ్డి చేసేది లేక పోర్టు సీఈఓ జీజే రావుకు ఫోన్ చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం కంటైనర్ టెర్మినల్ను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే కంటైనర్ టెర్మినల్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ఆదివారం కనుక తనతో పాటు అధికారులు ఎవరూ ఉండరని, పరిశీలనకు మరో మారు రావాలని సీఈఓ బదులు ఇచ్చారు. దీంతో ఎటూ పాలుపోని సోమిరెడ్డి తన కార్యకర్తలతో కొద్ది దూరం నడిచి, మీడియా ఎదుట అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేసి వెనుదిరిగారు. -
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి ఫైర్
-
సోమిరెడ్డి పిచ్చికుక్క కరిచినట్టు మాట్లాడుతున్నారు
-
సోమిరెడ్డికి బిగ్ షాక్?!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు దేశం పార్టీలో సీనియర్లకు వరుస ఝలక్లు తగులుతున్నాయి. ఈ బాటలోనే జిల్లా నడుస్తోంది. నెల్లూరులో టీడీపీ పరిస్థితి కరి మింగిన వెలగపండులా తయారైంది. ఓ వైపు అధిష్టానం అభ్యర్థిత్వాలపై ఎటూ తేల్చలేకపోతుండడం, మరో వైపు పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు వెరసి అంతర్గత విభేదాలను తారాస్థాయికి చేరుస్తున్నాయి. ఫలితంగా క్యాడర్ డోలాయమానంలో కొట్టుమిట్టాడుతోంది. వెంకటగిరిలో ఈనెల 19న చంద్రబాబు నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభ సాక్షిగా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పార్టీకి అవసరాలకు తగ్గట్లుగా పని చేయకపోతే.. దూరంగా ఉండాలంటూ సోమిరెడ్డికి చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే.. స్థానిక ఎమ్మెల్యే (వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత) ఆనం రామనారాయణరెడ్డిని సభకు సోమిరెడ్డి ఆహ్వానించలేదు. దీంతో ఆనం అలకబూనారు. ఈ విషయంపై చంద్రబాబుకు సమాచారం పంపారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆనం రామనారాయణరెడ్డిని చివరి నిమిషంలో సభకు పిలిపించుకున్నారు. సభలో ఆనం ప్రసంగిస్తున్నప్పుడూ ఓ పథకం ప్రకారమే కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు అడ్డుతగిలారు. దీంతో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని బస్సులోకి పిలిపించుకుని చర్చలు జరిపారు. నమ్మి వస్తే అవమానిస్తారా..! నమ్మి పార్టీ లోకి వస్తే తమకు సరైన గుణపాఠం చెప్పారని ఆనం, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ లోకి వస్తే జిల్లాపై పెత్తనంతోపాటు కోరుకున్న సీటు ఇస్తానని మాటిచ్చిన విషయాన్ని ఆనం బాబుకు గుర్తు చేశారట. ఆత్మకూరులో పరిస్థితి బాగాలేదని, వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని ఆనం కోరగా బాబు వారించి ఆత్మకూరు నుంచే పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పి పంపారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బీద రవిచంద్రల తీరుపై బాబుకు ఆనం, కోటంరెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ పెద్దలు చేసుకున్న లోపాయికారీ ఒప్పందాల నుంచి ఇటీవల చేసిన మైనింగ్ అక్రమాల వరకు అన్నింటిపైనా ఆధారాలతో సహా బాబుకు వివరించారని తెలిసింది. నెల్లూరు రూరల్ను జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆ సీటు తనకే ప్రకటించాలని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరగా, అలాగే.. అంటూ చంద్రబాబు మాట దాటేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం సోమిరెడ్డి, బీద రవిచంద్రలను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు చివాట్లు పెట్టారని తెలుస్తోంది. చిన్నబుచ్చుకున్న సోమిరెడ్డి! కడప జిల్లాలో జరిగే సభకు చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సోమిరెడ్డి హెలిప్యాడ్ వద్దకు చేరుకోగా బాబు వారించి ‘నీ అవసరం లేదులే’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో సోమిరెడ్డి చిన్నబుచ్చుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
కదలి..రావట్లేదు
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బహిర్గతమవుతున్నాయి. నియోజకవర్గ బాధ్యులకు అధినేత చంద్రబాబు పర్యటన శిరోభారంగా మారింది. ఈనెల 19న రా...కదలిరా కార్యక్రమం కమలాపురంలో నిర్వహించ తలపెట్టారు. ఏర్పాట్ల కోసం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, పొలిట్బ్యూరో సభ్యుడితో సహా నలుగురు ఇన్చార్జిలు డుమ్మా కొట్టారు. పొరుగు జిల్లాలకు చెందిన సమన్వయ నేతల ఎదుట కమలాపురం ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ఇక్కడ రద్దు చేసి కడపలో పెట్టుకోండంటూ నేతల మధ్య ఉన్న అనైక్యతను బాహాటపర్చారు. ► కమలాపురం టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రా...కదలిరా కార్యక్రమం కడప పార్లమెంట్ పరిధిలో ఏర్పాట్ల బాధ్యతను మాజీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డికి అప్పగించారు. సమన్వయకర్తలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (నెల్లూరు), ఏరాసు ప్రతాపరెడ్డి (కర్నూల్) ఉన్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం కోసం చర్చించేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్చార్జిలు హాజరు కావాలని ముందస్తుగా సమాచారం ఉంది. మైదుకూరు, కమలాపురం, బద్వేల్ ఇన్చార్జిలు పుట్టా సుధాకర్, పుత్తా నరసింహారెడ్డి, రితేష్రెడ్డి హాజరయ్యారు. కాగా, నలుగురు గైర్హాజర్ కావడం విశేషం. చంద్రబాబు పర్యటన అంటేనే నేతలకు శిరోభారంగా మారింది. జిల్లాలో ప్రజలను సమీకరించడం టీడీపీ నేతలకు బహుకష్టంగా మారింది. దీంతో బాధ్యతలు భుజస్కందాలపై వేసుకునేందుకు ఆయా నేతలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జ్వరం సాకు చూపెట్టిన నేతలు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితోపాటు ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, పులివెందుల ఇన్చార్జిలు వరుసగా ప్రవీణ్కుమార్రెడ్డి, మాధవీరెడ్డి, భూపేష్రెడ్డి, బీటెక్ రవిలు హాజరు కాలేదు. అనంతపురం, కర్నూలు, నెల్లూరు నుంచి సమన్వయకర్తలుగా ఉన్న నేతలు హాజరైనా జిల్లాకు చెందిన వారు గైర్హాజరయ్యారు. ఫోన్లో వాకబు చేస్తే జ్వరం కారణంగా హాజరు కాలేదన్న సమాధానం ఆయా నేతల నుంచి వచ్చినట్లు సమాచారం. అందరికీ ఒక్కసారిగా జ్వరం వస్తుందా...కావాలనే హాజరు కాలేదని, ప్రోగ్రామ్ విఫలం చేయాలని ఉన్నారని కమలాపురం ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి ఆయా నేతలపై ఆరోపణలకు దిగినట్లు తెలుస్తోంది. ఒకదశలో చంద్రబాబు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రమైన కడపలో పెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆయా ఇన్చార్జిలతో పర్సనల్గా మాట్లాడుతామని పుత్తాను శాంతింపజేస్తూనే, చంద్రబాబు కార్యక్రమం విజయవంతం చేసేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, దేవగుడి శివనాథరెడ్డి, మైనార్టీ నేతలు అమీర్బాబు, ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి ఆనం షాక్.. అయోమయ స్థితిలో కోటంరెడ్డి
వైఎస్సార్సీపీ కంచుకోటగా పేరొందిన నెల్లూరు జిల్లాలో పాగా వేయడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆది నుంచి బెడిసి కొడుతున్నాయి. పార్టీ సీనియర్లకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని, కొత్త వారికి ఇద్దామంటే అభ్యర్థులు దొరకడం లేదని అధిష్టానం తలలు పట్టుకుంటోంది. నెల్లూరు ఎంపీతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల నియామకం ఒక సమస్య అయితే జనసేనతో పొత్తు పచ్చనేతల్లో వర్గపోరుకు దారితీస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ నుంచి అసెంబ్లీ స్థానం వరకు ఎవరూ బరిలో దిగేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంట్ స్థానానికి కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషణ చేస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి చెందారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండడంతో నెల్లూరు పార్లమెంట్ సీటుకు టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదనేది భయంతో పలాయనం చిత్తగిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో పలు నియోజకవర్గాల నుంచి కొత్త ముఖాలను బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీ నేతలు నెల్లూరు సిటీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్యాకేజీ ఇచ్చి రూరల్ నియోజకవర్గం వైపు మళ్లించే ప్రయత్నాలు చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో నెల్లూరు రూరల్ తనకే అని అనుకుంటున్న వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. టికెట్ ఇస్తే టీడీపీ తరఫున... లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని శ్రీధర్రెడ్డి నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ► సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ వరుసగా ఐదుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి కొత్త వ్యక్తిని నిలబెట్టాలని టీడీపీ భావిస్తోంది. అందుకే ఇప్పటి వరకు సోమిరెడ్డి అభ్యర్థిత్వంపై స్పష్టత లేదని సమాచారం. ► కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ దఫా ఆయన కుమారుడు దినేష్రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీకి ఉన్న బలంతో పాటు పోలంరెడ్డిపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇక్కడ కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ► కావలిలో ఇప్పటికే నలుగురు నేతలు టికెట్ అడుగుతున్నప్పటికీ వీరందరూ మండలస్థాయి నాయకులే. కొత్తగా మైనింగ్ మాఫియా డాన్ డి.వెంకటకృష్ణారెడ్డికి సీటు ఇవ్వాలనుకున్నా ఓటమి తప్పదని సర్వేల్లో తేలింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తేలకుండా ఉంది. ► ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని, ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ టికెట్ మాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పనిలో పనిగా వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నాడు. ఇక బీసీ మార్కుతో చెంచలబాబు యాదవ్ సీటు ఆశిస్తున్నాడు. మరి చంద్రబాబు బ్యాగ్ బరువున్న వ్యక్తుల వైపే చూస్తాడా? సామాజిక న్యాయం వైపు చూస్తాడా అనేది తేలాల్సి ఉంది. ► ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని దింపాలని యోచిస్తున్న టీడీపీకి ఆయన బిగ్షాక్ ఇచ్చినట్లు తెలిసింది. ఆత్మకూరు నుంచి పోటీలో ఉండబోనని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవల వరుసగా రెండు దఫాలు ఆయన సొంతంగా సర్వే నిర్వహిస్తే ప్రజాదరణ తక్కువగా ఉన్నట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆనం సైతం ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. ► కందుకూరు నుంచి ఇంటూరి బ్రదర్స్ మధ్య పోటీ ఉంది. ఇందులో ఇంటూరు నాగేశ్వరరావుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే వైఎస్సార్సీపీ బలంగా ఉన్న కందుకూరులో టీడీపీ ఓటమి తప్పదని, దీంతో కొత్త వారికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురు పెట్టుబడికి సిద్ధంగా అధిష్టానం మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉండడంతో ఆ పార్టీ అధినేత తల పట్టుకున్నట్లు సమాచారం. సీట్ల కోసం డబ్బు మూటలతో వస్తారని ఆశించిన చంద్రబాబుకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు కావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అయితే సర్వేపల్లి, కోవూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నప్పటికీ కనీసం అధికార పార్టీకి ఏ మాత్రం పోటీ ఇచ్చే స్థాయి నేతలు కాకపోవడంతో వీరి స్థానంలో కొత్త వారిని రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత యోచన. ఇందుకు బడాబాబులను ఆహ్వానిస్తున్నప్పటికీ పోటీకి వారు కూడా సిద్ధంగా లేకపోవడంతో కొంచెం పెట్టుబడి మీరు పెట్టండి.. మిగతాది పార్టీ చూసుకుంటుందని హామీ ఇస్తున్నారంట. కొత్త వారు దొరక్కపోతే కోవూరు, కందుకూరు, ఉదయగిరిలో పాత వారికే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. సర్వేపల్లి, కావలి, ఆత్మకూరులో కచ్చితంగా కొత్త అభ్యర్థులు వస్తారని తెలుస్తోంది. -
AP: నెల్లూరులో టీడీపీకి షాక్.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు
సాక్షి,నెల్లూరు: మరి కొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ముత్తుకూరు మండల కేంద్రంలో 200 మంది యువకులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. యువకులందరికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ రెండు నెలల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కనుమరుగై పోతాడని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు శుభం కార్డ్ అయితే సోమిరెడ్డికి ఎండ్ కార్డు పడుతుందని కాకాణి అన్నారు. ఇదీచదవండి.. ఓం ప్రథమం.. ఎదురైంది దుశ్శకునం -
టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి వార్నింగ్
-
మహిళా ఉద్యోగినిపై నోరుపారేసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి
-
సోమిరెడ్డిని హీరోగా RGV సినిమా తీస్తే సూపర్ హిట్టు .. మంత్రి కాకాణి సెటైర్లు
-
Fact Check: నిబంధనలు పాటించినా ఏడుపే!?
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టుల కేటాయింపు, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కాంట్రాక్టు నిర్ధారణతో సహా అన్ని విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అత్యంత పారదర్శకతో వ్యవహరించాయి. అన్ని అంశాల్లో అత్యంత పకడ్బందీగా నిబంధలను పాటించినప్పటికీ ఈనాడుతో సహా కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వం, ఇంధన సంస్థలపై పదేపదే అసత్య ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించినట్లు శుక్రవారం వార్తలు ప్రచురించాయి. అయితే, సోమిరెడ్డి మాటల్లో నిజంలేదని, ఈనాడు, ఇతర పచ్చపత్రికల్లో రాతలన్నీ పచ్చి అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పద్మజనార్ధనరెడ్డి స్పష్టంచేశారు. ఆరోపణ : ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల పేరుతో జగన్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది.. వాస్తవం : కేంద్ర ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్, ఏపీ ప్ర భుత్వ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. దేశంలో అర్హత గల ప్రతి గుత్తేదారు (కాంట్రాక్టరు) పాల్గొనే అవకాశం కల్పించారు. రివర్స్ టెండరింగ్ జరిపిన తర్వాతే ఏపీఎస్పీడీసీఎల్ పరికరాలను కొనుగోలు చేస్తోంది. అన్ని నిబంధనలు పరిశీలించిన తరువాత, ఈ ప్రక్రియలో పాల్గొన్న అందరిలో ఎల్–1గా ఉన్న గుత్తేదారుని ఎంపిక జరుగుతుంది. నామినేషన్ పద్ధతిలో ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేయడమనేది అసలు వీలుపడదు. ఆరోపణ : ఎలాంటి అనుభవంలేని సంస్థకు ప్రభుత్వం వేల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టింది.. వాస్తవం : షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనేది చిన్న సంస్థ ఏమీకాదు. ఈ సంస్థకు 25 ఏళ్లుగా విద్యుత్ ట్రా న్స్ఫార్మర్ల తయారీలో అనుభవం ఉంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లే బొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపుతో ఆసియాలోనే అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు వచ్చిన విషయం బహుశా సోమిరెడ్డికి తెలియదేమో. ఆరోపణ : ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 611.40 కోట్ల విలువైన పనులకుగానూ రూ.380 కోట్ల విలువైన పనులకు షిరిడీ సాయికే కట్టబెట్టింది.. వాస్తవం : తక్కువ ధరకు కోట్చేసిన సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ కెపాసిటీల కు సంబంధించి 53,003 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లను షిరిడిసాయి సంస్థ దక్కించుకుంది. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 35,911 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లనూ పొందింది. గత ప్రభుత్వంలోనే హెచ్వీడీఎస్, వివిధ సబ్–స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించి రూ.2,799.38 కోట్ల విలువైన పనులను షిరిడిసాయి సంస్థ కైవసం చేసుకుంది. నిజంగా ఇది సీఎం జగన్మోహన్రెడ్డికి కావాల్సిన వారి సంస్థ అయితే గత ప్రభుత్వ హయాంలో ఎందుకు టెండర్లు కట్టబెట్టారు? ఆరోపణ : రామాయపట్నం పోర్టు దగ్గర రూ.42 వేల కోట్ల ప్రాజెక్టు షిరిడీ సాయికి ఇచ్చింది.. వాస్తవం : రామాయపట్నం పోర్టు దగ్గర సోలార్ ప్యానల్ తయారీ పార్కు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు. దీని కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంలేదు. దీనిబట్టే ఈ కంపెనీ అన్ని అర్హతలున్న పెద్ద సంస్థ అని, దిగ్గజ సంస్థలను కాదని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు దక్కించుకుందని అర్థమవుతోంది. రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులన్నీ పూర్తి చట్టబద్ధంగా జరిగాయి. ఆరోపణ : పక్కపక్క రాష్ట్రాలు కొన్న ట్రాన్స్ఫార్మర్ల ధరల్లో వ్యత్యాసం ఉందంటే దోపిడీ జరిగినట్లే కదా.. వాస్తవం : ట్రాన్స్ఫార్మర్ ధర దానిలో ఉపయోగించే వైండింగ్ వైర్ డయామీటర్, కాయిల్స్ డయామీటర్, ఇన్సులేషన్, క్లియరెన్స్, ట్యాంక్ డైమెన్షన్, ట్రాన్స్ఫార్మర్, ఆయిల్ క్వాంటిటీ, కోర్ సైజు వంటి నాణ్యతలను బట్టి ఉంటుంది. టెండర్లు వేసిన సమయంలో కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధంవల్ల ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే పరికరాల ధరలు అధికంగా ఉండేవి. ఏపీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేసిన నియంత్రికల్లో నష్టాలు ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్) కన్నా చాలా తక్కువ. వివిధ కంపెనీల ట్రాన్స్ఫార్మర్లను బెంగుళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఎస్ఐ) టెస్ట్చేసి షిరిడిసాయి, తోషిబా నియంత్రికల్లో నష్టాలు ఐఎస్ ప్రకారం వున్నాయని ధృవీకరించడం విశేషం. ఇతర కంపెనీల ఉత్పత్తిదారుల ట్రాన్స్ఫార్మర్లు ఈ టెస్టులో ఫెయిలయ్యాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నిర్ధేశించిన విధంగా మన డిస్కంలు ప్రస్తుతం ఫైవ్స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు బాగా తగ్గాయి. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా సమస్యలు తగ్గుముఖం పట్టాయి. కానీ, సోమిరెడ్డి మాత్రం టూ–స్టార్తో ఫైవ్స్టార్ ధరను సరిపోల్చారు. తెలంగాణ డిస్కంలు టూ స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశాయి. ఆరోపణ : కడప కంపెనీదే హవా.. వాస్తవం : ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు టెండరు పొందింది షిరిడిసాయి సంస్థ ఒక్కటే కాదు.. దీనితోపాటు హైపవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, కన్యకాపరమేశ్వరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (మెదక్ జిల్లా), బీఎస్సార్ పవర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (తెనాలి), సాయిబాబా ఫ్లేమ్ ఫ్రూఫ్ స్విచ్గేర్, ట్రాన్స్కాన్ ఇండస్ట్రీస్, తోషిబా ట్రాన్స్విుషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రినిటీ క్లీన్టెక్(హైదరాబాద్), ఎస్వీఆర్ ఎలక్ట్రికల్స్, విజయ్ ట్రాన్స్ఫార్మర్స్ (గుంటూరు) సంస్థలు కూడా కాంట్రాక్టు పొందిన వాటిలో ఉన్నాయి. ఆరోపణ : వ్యవసాయ మీటర్లకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు అమర్చుతామని చెబుతున్న ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేస్తోంది.. వాస్తవం : దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర ఇంధన శాఖ నిబంధనల మేరకే స్మార్ట్మీటర్ల ఏర్పాటుకు టెండరు నిబంధనావళి తయారైంది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్మీటర్లు ఉచితమే. ఇక ఏపీఈఆర్సీ నిర్ణయించిన దాని ప్రకారమే ట్రూఅప్ వంటి విద్యుత్ చార్జీలు ఉంటాయి. -
టీడీపీ హయాంలోనే అక్రమ తవ్వకాలు
రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఓవైపు అసత్య ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ‘ఈనాడు’ తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విషం చిమ్ముతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించగా.. రోడ్ల అభివృద్ధిపై ‘ఈనాడు’ తప్పుడు కథనం ప్రచురించింది. వాస్తవాలను పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డే గ్రావెల్ మాఫియాను ప్రోత్సహించారని వెల్లండైంది. అలాగే గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ‘ఈనాడు’ తప్పుడు కథనం ప్రచురించిందని స్పష్టమైంది. నెల్లూరు: గత టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అండతో వెంకటాచలం మండలంలో గ్రావెల్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోయింది. గ్రామాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. టీడీపీ నాయకులు తవ్వి న గ్రావెల్ గుంతలు వేసవిలో చిన్నారులను బలి తీసుకుంటున్నాయి. తాను చేసిన పాపాలను సోమిరెడ్డి ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ప్రజల ముందు నవ్వులపాలయ్యాడు. ఇలాంటి ఘటన తాజాగా వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామంలో వెలుగుచూసింది. అడ్డూఅదుపూ లేకుండా.. గత ప్రభుత్వంలో వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్, కనుపూరు చెరువులతోపాటు గ్రామాల్లోని అన్ని చెరువుల్లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. దీనిపై అప్పట్లో రైతులు, గ్రామస్తులు పలు దఫాలు ఆందోళనలు చేసినా సోమిరెడ్డి అండతో గ్రావెల్ అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా నిర్వి రామంగా సాగింది. వర్షాకాలంలో చెరువుల్లో నిండుగా నీరు చేరడంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను సైతం వదలకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. టీడీపీ నాయకుల ధనదాహం కారణంగా గ్రామానికి అనుకుని ఉన్న చెరువులు, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాల్లో 10 నుంచి 20 అడుగుల లోతుకు పైగా టీడీపీ నాయకులు తవ్విన గ్రావెల్ గుంతలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. సోమిరెడ్డి ధనదాహానికి విద్యార్థుల బలి 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన సోమిరెడ్డి దొడ్డిదారిన మంత్రి పదవి దక్కించుకుని అవినీతి, అక్రమ సంపాదనపై దృష్టి సారించారు. అందులో భాగంగానే వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రిజర్వాయర్, కసుమూరు, ఈదగాలి, తిక్కవరప్పాడు, కంటేపల్లి, కనుపూరు రిజర్వాయర్, సర్వేపల్లి గ్రామాల నుంచి రేయింబవళ్లు అక్రమంగా గ్రావెల్ తరలించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. సోమిరెడ్డి తవ్వించిన భారీ గ్రావెల్ గుంతలు గత నెలలో అనికేపల్లిలో ఒక విద్యార్థిని, మూడు రోజుల క్రితం గొలగమూడిలో మరొక విద్యార్థిని బలి తీసుకున్నాయి. అనికేపల్లి గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి తురకా వెంకయ్య తోటి విద్యార్థులతో కలిసి గ్రామానికి అనుకుని ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ వద్దకు ఈతకు వెళ్లి గ్రావెల్ గుంతలో పడి మృతిచెందాడు. ఇది సోమిరెడ్డి హయాంలో తవ్విన గ్రావెల్ గుంతే. కానీ ఈ మరకను సోమిరెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టే కుట్ర చేసి విఫలమయ్యాడు. గొలగమూడిలో టీడీపీ నాయకులు చాకలి చెరువులో తవ్విన గ్రావెల్ గుంతలో పడి మూడు రోజుల క్రితం 2వ తరగతి విద్యార్థి హిమాయితుల్లా మృతిచెందడంతో తన పాపాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ఆ గ్రామానికి వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులు తవ్విన గోతులని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు కొందరు అవి ఇప్పుడు తవ్విన గుంతలు కాదని, 2016–17లో తవ్వి న గుంతలని చెప్పడంతో అందరి ముందు నవ్వులపాలయ్యాడు. ఒకే పంచాయతీలోని అనికేపల్లి, గొలగమూడి గ్రామాల్లో సోమిరెడ్డి ధనదాహానికి ఇద్దరు చిన్నారులు బలయ్యారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డే కారణం గొలగమూడి, అనికేపల్లి గ్రామాల్లో ఇద్దరు చిన్నారులు గ్రావెల్ గుంతల్లో పడి చనిపోవడానికి సోమిరెడ్డే కారణం. టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి అండతో గ్రావెల్ తవ్వకాలు అడ్డూఅదుపూ లేకుండా సాగాయి. అప్పట్లో తవ్విన గ్రావెల్ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన విషయం వాస్తవం. కానీ సోమిరెడ్డి దిగజారి ఆ పాపాన్ని వైఎస్సార్సీపీపై వేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. – ఉడతా శ్రీనివాసులు, గొలగమూడి గత టీడీపీ ప్రభుత్వంలో గొలగమూడి గ్రామంలో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. సోమిరెడ్డి అండతో నాగులవరం, గొలగమూడి గ్రామాల చుట్టూ గ్రావెల్ అక్రమంగా తరలించడంతో ఎక్కడ చూసినా భారీ గుంతలు ఏర్పడ్డాయి. సోమిరెడ్డి హయాంలో తవ్విన చాకలి చెరువు గుంతలో పడి హిమాయితుల్లా మృతిచెందితే దానిని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడం సరికాదు. – అన్నపరెడ్డి శీనయ్య, గొలగమూడి -
సోమిరెడ్డి, టీడీపీ పై మంత్రి కాకాని సెటైర్లు మామూలుగా లేవు..
-
సోమిరెడ్డి.. ఇలా అయిపోయావేంటి?.. అభిమానులను అద్దెకు తీసుకొచ్చి..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులపై పార్టీ బలం పెంచాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు బలవంతంగా ఆ పార్టీ కండువాలు వేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉన్న క్రమంలో ఆ పార్టీ కార్యక్రమాలకు నలుగురిని పిలిచినా వచ్చే పరిస్థితి లేదు. అంతకంటే ముందు ఆ నియోజకవర్గ ఇన్చార్జి సోమిరెడ్డి గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ఇప్పటికే ఆ పార్టీ నేత చినబాబు ‘వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వాళ్లకు ఈ దఫా టికెట్ లేదని’ ప్రకటించడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ రావడంపై అనుమానాలు ఉండగా సరికొత్త డ్రామాకు తెర తీశాడు. ఇప్పటికే మండలస్థాయిలోని ద్వితీయ శ్రేణి నాయకులపై రోజు పక్క పార్టీల నుంచి జనం టీడీపీలో చేరుతున్నట్లు చేయాలని ఒత్తిడి పెంచారు. వెంకటాచలంలో మండలం టీడీపీ నాయకుల మధ్య అంతర్గతపోరు కొనసాగుతోంది. ఆ పార్టీ నాయకులు సోమిరెడ్డి వద్ద మెప్పు పొందేందుకు బయట నియోజకవర్గాల నుంచి అభిమానులను అద్దెకు తీసుకువచ్చి వెంకటాచలం మండలానికి సంబంధించిన వ్యక్తులుగా పరిచయం చేసి కండువాలు కప్పి టీడీపీలో చేరినట్లు చెప్పుకుంటున్నారు. గత ఏప్రిల్లో వెంకటాచలం వడ్డిపాళేనికి చెందిన రాజేంద్ర ఆధ్వర్యంలో వెంకటాచలంలో కార్యక్రమం నిర్వహించి నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు వందల మంది టీడీపీలో చేరినట్లుగా సోమిరెడ్డి ప్రకటించి నవ్వుల పాలయ్యారు. తాజాగా వెంకటాచలం మండలం కాకుటూరులో కొందరికి బలవంతంగా పార్టీ కండువాలు కప్పి వారంతా టీడీపీలో చేరినట్లు ప్రకటించుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. వెంటనే వారంతా వైఎస్సార్సీపీ నేత వెంకటశేషయ్య వద్దకు వెళ్లి తాము వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని, సోమిరెడ్డి బలవంతంగా కండువాలు వేశాడని తెలిపారు. ఇలా మరోసారి సోమిరెడ్డి నవ్వుల పాలయ్యాడు. -
టీడీపీ నేత దౌర్జన్యం.. ఛానల్ రిపోర్టర్పై దాడి!
సాక్షి, నెల్లూరు: వెంకటాచలంలో టీడీపీ నేత రాజేంద్ర దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలు కడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. వివరాల ప్రకారం.. వడ్డిపాలెంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్త రాజేంద్ర అనే వ్యక్తి వారికి అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం, ఇది కవర్ చేయడానికి వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్ వెళ్లడంతో అతడిపై రాజేంద్ర కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో రాజేంద్రను వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, రాజేంద్ర దొరక్కపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, టీడీపీ నేత సోమిరెడ్డి ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
టీడీపీపై ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం !
-
టీడీపీ వాళ్ళకి ఇది కొత్త ఏం కాదు
-
ఉద్యోగుల గురించి ABN రాధాకృష్ణ చంద్రబాబు..దారుణ పదజాలం
-
టీడీపీ సర్పంచ్ చేతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సజీవ దహనం
చంద్రగిరి (తిరుపతి జిల్లా): టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ నేతలు మరోసారి బరితెగించారు. ఇటీవల కుప్పం, పుంగనూరు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులపై టీడీపీ మూకల దాడులను మరిచిపోకముందే మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. అన్నెంపున్నెం ఎరుగని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్పై పెట్రోల్ పోసి అతడి కారుతో సహా సజీవ దహనం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు చాణక్య ప్రతాప్, రుపంజయ తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సొంత అల్లుడు సంజీవ్కు స్వయానా బాబాయి కుమారులే కావడం గమనార్హం. అంతేకాకుండా టీడీపీ సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల శ్రీరామ్లతోనూ నిందితులకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ చౌదరితోనూ పరిచయాలు ఉన్నాయి. రాజీ పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పిలిపించి అతడిని టీడీపీ అధినేత చంద్రబాబు అనుచరుడు చాణక్య ప్రతాప్ సజీవ దహనం చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జయరామయ్య, చెంచెమ్మ దంపతులకు నాగరాజు, పురుషోత్తం కుమారులు. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.ఈ క్రమంలో బ్రాహ్మణపల్లి టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్ తమ్ముడు రుపంజయ భార్యతో పురుషోత్తం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రుపంజయ ఎలాగైనా పురుషోత్తంను మట్టుపెట్టాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు తన తమ్ముడు పురుషోత్తంను బెంగళూరుకు పంపించేశాడు. హతమార్చడానికి పలుమార్లు ప్రయత్నం టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్, అతడి తమ్ముడు రుపంజయ.. నాగరాజు కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. నాగరాజు తన పొలం వద్ద ఏర్పాటు చేసిన పైపులను పగలకొట్టడం, చెట్లు నరికివేయడం, మోటార్లను కాల్చివేయడం వంటివి చేసి టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నాగరాజు తమ్ముడు పురుషోత్తంను హతమార్చాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో వివాదాన్ని పరిష్కరించుకుందామని తిరుపతి అవిలాలలో నివాసం ఉంటూ వర్క్ఫ్రమ్ హోం చేసుకుంటున్న నాగరాజును గోపి అనే వ్యక్తితో పిలిపించారు. దీంతో శనివారం సాయంత్రం నాగరాజు తన కారులో స్వగ్రామం బ్రాహ్మణపల్లి వెళ్లాడు. అక్కడ టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్, రుపంజయ, వారి అనుచరులు గోపి, సుబ్బయ్యతోపాటు మరికొంతమంది నాగరాజుతో మాట్లాడారు. ఆ తర్వాత శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో గంగుడుపల్లి సమీపంలోని కురవకణం మలుపు వద్దకు తీసుకెళ్లి నాగరాజు కారులోనే అతడిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ ఉదంతం తెలుసుకున్న ఏఎస్పీ వెంకటరావు, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, సీఐ ఓబులేసు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య మధుమతి ఫిర్యాదు మేరకు చాణక్య ప్రతాప్, రుపంజయ, గోపి, సుబ్రహ్మణ్యంతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు రుపంజయను పోలీసులు అదుపులోకి తీసుకుని, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు టీడీపీ నేతల హస్తం! కాగా నాగరాజు హత్యలో రామచంద్రాపురం మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో ఒకరు మాజీ మంత్రి, టీడీపీ నేత గల్లా అరుణకుమారికి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. హత్యకు పాల్పడిన చాణక్య ప్రతాప్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఆ ఇద్దరు నేతలు హత్యకు సంపూర్ణ సహకారం అందించినట్లు సమాచారం. -
టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫ్రస్టేషన్తో మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నిన్నటి వరకు ప్రభుత్వంపై ఫ్రస్టేషన్ చూపించారు. ఉద్యోగులపై సోమిరెడ్డి వాడిన భాష మంచిది కాదు. సోమిరెడ్డి చెప్పినట్టు అధికారులు వినలేదనే వారిపై నోరు పారేసుకున్నారు. నీతి, నిజాయితీతో పనిచేసే అధికారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అని కాకాణి అన్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నామని, తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు -
ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరుజిల్లా: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నామని, తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఆ.. నా కొడుకులకు జీతాలివ్వడానికా పన్నులు వసూలు చేసేది? కాగా, ఉద్యోగులపై గతంలో చంద్రబాబు, తోకపత్రిక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎంప్లాయీస్ గుర్తుచేసుకుంటున్నారు. వారి మధ్య సంభాషణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాన్ని ఒకసారి చూస్తే.. చంద్రబాబు-రాధాకృష్ణ సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించిన ఉద్యోగుల డిమాండ్ ప్రస్తావనకు రాగానే రాధాకృష్ణ బూతు పురాణం లంకించుకున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చిద్విలాసంగా ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ‘ఆ .. నా కొడుకులు’ అని రాధాకృష్ణ దుర్భాషలాడినా.. అలా అనడం తప్పని చంద్రబాబు అనకపోవడం గమనార్హం. అధికారం లేకపోతే మనమేమీ చేయలేమని, అధికారం కోసం కొన్ని హామీలు ఇవ్వాలని సీఎం చెప్పుకొచ్చారు. మొదట్లో కొంత ఉదారంగా ఉంటే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చని అన్నారు. రుణమాఫీ హామీ కూడా అధికారం కోసమే ఇచ్చామంటూ మనసులో మాట చెప్పేశారు. చదవండి: మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే: బాలినేని -
ప్యాకేజీ మింగేశారు.. 1.22 కోట్ల పేదల సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి!
పోర్టు నిర్మాణంతో బతుకుదెరువు కోల్పోయి నిరాశ్రయులైన పేదలకు అందాల్సిన నిధులను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆయన అనుచరులు స్వాహా చేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్లు ఇదిగో.. అదిగో అంటూ ఊరించి కాలయాపన చేసింది. ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలంలో ఓట్ల కోసం హడావుడిగా నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ నిధులను సోమిరెడ్డి మంజూరు చేయించారు. ఆ నిధులను ఆయన, అనుచరులే బొక్కేశారు. రికార్డుల్లో మాత్రం లబ్దిదారులకు అందినట్లు చూపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని అవినీతిగా ప్రచారం చేస్తూ నిత్యం ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ఉండే సోమిరెడ్డి తన అవినీతి నిర్వాకానికి మాత్రం సమాధానం చెప్పరు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రానికే తలమానికంగా కృష్ణపట్నం పోర్టును 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అప్పట్లో పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూ సేకరణ చేశారు. దీంతో ఉపాధి కోల్పోయిన నిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించారు. మత్స్యకార కుటుంబాల తరలింపునకు, కొంత కాలం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున రూ.32 కోట్లు అందించారు. వీరితో పాటు మత్స్యకారేతరులను గుర్తించి వారికి ప్యాకేజీ అందించాలని వైఎస్సార్ నిర్ణయించారు. అయితే, వైఎస్సార్ అకాల మరణం నాన్ ఫిషర్మెన్ కుటుంబాల పాలిట శాపంగా మారింది. ఆ తర్వాత పాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజీని బుట్టదాఖలు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.43 వేలకుపైగా ప్యాకేజీ అందిస్తామని కొంత కాలం మభ్యపెట్టింది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మూడు విడతల్లో ఇస్తానని చెప్పడంతో అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకమైన మత్స్యకారేతర కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాసంకల్పయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారేతర కుటుంబాల సమస్యను విన్నారు. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ విషయంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు వరకూ తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి మత్స్యకారేతర కుటుంబానికి ప్యాకేజీ అందిస్తానని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు హడావుడిగా.. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీని పట్టించుకోని అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎన్నికల సమయంలో వారి ఓట్ల కోసం కేవలం ఎస్సీ, ఎస్టీలకే అంటూ ప్రత్యేకంగా రూ.4.09కోట్లు మంజూరు చేయించారు. హడావుడి గా 3,550 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10,500 వంతున రూ.3.87 కోట్లు పంపిణీ చేయించారు. ఇంకా రూ.1.22 కోట్లు పంపిణీ చేయకుండా అప్పట్లో ఆ నగదు పంపిణీలో సోమిరెడ్డి, ఆయన అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. చెక్కుల రూపంలో పంపిణీ జరగడంతో రెవెన్యూ అధికారులు మాత్రం లబి్ధదారులకు పంపిణీ జరిగినట్లు చూపించారు. కానీ లబి్ధదారుల పేరుతో టీడీపీ నేతలే బ్యాంకు కెళ్లి డ్రా చేసుకుని ఆరగించారు. మండలంలోని పంటపాళెం, పైనాపురం, నేలటూరు, ముత్తుకూరు, దొరవులపాళెం గ్రామాల్లో దాదాపు 300 మందికి సంబంధించిన నగదును టీడీపీ నేతలే దిగమింగారు. నాకు ప్యాకేజీ ఇవ్వకుండానే.. నాకు నాన్ఫిషర్మెన్ ప్యాకేజీ కింద డబ్బులు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. నాకు మాత్రం అందలేదు. నా పేరు మీద చెక్కురాసి తీసేసుకున్నారు. టీడీపీ నేతలే ఈ పని చేశారు. మా కడుపులు కొట్టి ఇలా ప్రవర్తించడం వాళ్లకే చెల్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్యాకేజీ మంజూరు చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాత్రం ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చూశారు. – కర్లపూడి సుబ్రహ్మణ్యం, ముత్తుకూరు ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజీ కాకాణి గోవర్ధన్రెడ్డి ఎన్నికల ముందు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి మా సమస్యను తీసుకెళ్లారు. అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారమే మాకు నిధులు పంపిణీ చేయించారు. టీడీపీ హయాంలో ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో మాకు నిధులు ఇస్తున్నట్లు చెప్పి మా పేర్లతో టీడీపీ నేతలు తినేశారు. – సుబ్బరాయుడు, దొరవులపాళెం కాకాణి చొరవతో 16,337 కుటుంబాలకు లబ్ధి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా 16,337 కుటుంబాలను లబ్ధిదారులను గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున రూ.35.75 కోట్లు కేటాయించి, లబి్ధదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయించారు. టీడీపీ హయాంలో రూ.10,500 మాత్రమే లబ్ధి పొందిన వారికి సైతం మిగతా రూ.14,500 వంతున ప్యాకేజీ అందించారు. -
సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్
సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు వేయడం సహజం. అయితే ఇది ప్రత్యర్థుల మధ్య ఉంటుంది. సింహపురి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం అనేక తిప్పలు పడుతున్నారు. అందులో భాగంగా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. స్వపక్షంలో పైచేయి సాధించాలనే తపనతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అటు అధిష్టానం మెప్పు, ఇటు జిల్లాలో పార్టీపై ఆధిపత్యం రెండు దక్కించుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కంటే ముందుగా జిల్లాలో పాదయాత్ర చేసేందుకు సోమిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకరి తర్వాత ఒకరు ప్రజా మద్దతు కంటే ముందు అధిష్టానం వద్ద పరపతి పెంచుకోవాలనే తపన టీడీపీ నేతల్లో మెండుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. అదే ఒరవడి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగింది. జిల్లాలో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. అటు జిల్లా పరిషత్, ఇటు కార్పొరేషన్లో తెలుగుదేశం కండువా కనుమరుగైంది. ఒక్కరంటే ఒక్క ఎంపీపీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ ఆ పార్టీకి లేరు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం అధిష్టానం మెప్పు పొందాలనే దిశగా జిల్లాలో టీడీపీ నేతల అడుగులు పడుతున్నాయి. ఒకరి తర్వాత ఇంకొకరు వివాదస్పద వ్యాఖ్యలతో తెరపైకి వస్తుండడం విశేషం. చదవండి: (Chandrababu Naidu: ఇదేం ఖర్మరా 'బాబూ') ఆధిపత్యం కోసం ఆరాటం జిల్లాలో పార్టీపై ఆధిపత్యం కోసం సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరాటపడుతున్నట్లు తెలిసింది. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు లోకేష్ ఓ సందర్భంలో మంగళగిరిలో ప్రకటించారు. టీడీపీ దానికి కట్టుబడి ఉంటే వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి టికెట్ దక్కదు. ఈ పరిస్థితిని అంచనా వేసిన సోమిరెడ్డి జిల్లాలో పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. క్రైమ్ రేట్ పెరిగిందని బూచిగా చూపిస్తూ జిల్లా వ్యాప్తంగా పర్యటించాలని, ఆ దిశగా అనుచరగణంతో సమాలోచనలు చేసినట్లు తెలిసింది. ఈనెలలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా జవనరి నుంచి నారా లోకేష్ పాదయాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఈలోపు జిల్లాలో సోమిరెడ్డి పాదయాత్ర చేయాలనే యోచిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సోమిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశమే లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. గెలుపు మాట దేవుడెరుగు కనీసం పార్టీ టికెట్ అయినా దక్కించుకోకుంటే భవిష్యత్లో రాజకీయ పరిస్థితులు ఊహించుకోలేమని పాదయాత్ర ఆలోచనలో ఉన్నారని తెలిసింది. -
నెల్లూరు కోర్టులో కేసు ఫైళ్ల దొంగతనంపై సీబీఐ దర్యాప్తు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దాఖలు చేసిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు నెల్లూరు జిల్లా కోర్టు నుంచి దొంగతనానికి గురైన వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మంత్రి కాకాణి చెప్పడంతో హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమర్థమైన అధికారి సరైన రీతిలో దర్యాప్తు జరిపి వీలైనంత త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. దొంగతనంపై నమోదైన కేసుకు సంబంధించిన ఫైళ్లను, కేసు డైరీని సీబీఐకి అప్పగించాలని నెల్లూరు చిన్నబజార్ పోలీసులను ఆదేశించింది. సీబీఐకి సహకరించాలని నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. సీబీఐకి ఇస్తే అభ్యంతరం లేదన్న ప్రభుత్వం, కాకాణి మంత్రి కాకాణిపై సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దాఖలు చేసిన కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి మాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి (పీడీజే) సి.యామిని పంపిన నివేదికను పరిశీలించిన హైకోర్టు ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరపాలని నిర్ణయించింది. ఆ నివేదికను సుమోటో పిటిషన్గా మలిచింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీబీఐ డీజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్), నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితోపాటు మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. విచారణ çసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఈ దొంగతనం కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి సైతం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే తమకూ ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కోర్టు ఆదేశాలిస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ తెలిపింది. దీంతో గతంలో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించిన సీజే ధర్మాసనం.. ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని తెలిపింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంతోపాటు ఆ కేసుల విచారణను శీఘ్రగతిన పూర్తిచేయాలని, ఆ విచారణను హైకోర్టు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తుచేసింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు సుప్రీంకోర్టు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో.. నెల్లూరు కోర్టు, యంత్రాంగం, పోలీసులు కేసు ఫైళ్లను భద్రపరిచే విషయంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నేరారోపణలను రుజువుచేసే ఆధారాలను కోర్టు ముందుంచనిపక్షంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసు వీగిపోయే ప్రమాదం ఉందంది. నిందితులను చట్టంముందు నిలబట్టే విషయంలో సమయానుగుణ, సరైన చర్యలు చేపట్టని పక్షంలో ప్రజలు న్యాయప్రక్రియపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రస్తుత కేసులో పలుకుబడి కలిగిన వ్యక్తులు నిందితులుగా ఉన్న నేపథ్యంలో.. కేసు ఫైళ్ల దొంగనతం వెనుక ఎవరున్నారన్న మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధర్మాసనం పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫైళ్ల దొంగతనం కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలిపింది. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: కాకాణి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. నెల్లూరు కోర్టులో దొంగతనం కేసు విచారణ సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పాం..’ అని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, టీడీపీ నేతల నోళ్లు మూతపడతాయని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు సత్యంగా ఉండాలని, అందుకే సీబీఐ విచారణకు అభ్యంతరం తెలపలేదని చెప్పారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయనపై వచ్చిన ఆరోపణల మీద సీబీఐ విచారణ కోరాలని సవాల్ చేశారు. సీబీఐ విచారణ అంటే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న నీచ సంస్కృతి చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. -
రాబిన్శర్మ టీమ్ సర్వే: ఈ సారి వారికి టికెట్టు కూడా డౌటే!
టీడీపీ అధినేత నిర్ణయంతో తమ్ముళ్లకు టికెట్ ఫీవర్ పట్టుకుంది. పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజాదరణలేదు. అధికార పార్టీ పై పైచేయి సాధించే సత్తా కొరవడిన నేపథ్యంలో సర్వే రిపోర్ట్ ఆధారంగా రాబోయే ఎన్నికల్లో ధన బలం, అంగబలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని అధినేత భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త టీమ్ క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. అంతర్గత రహస్య సర్వేలో ఏ నియోజకవర్గంలోనూ టీడీపీ మాజీలకు సానుకూల పరిస్థితులు లేనట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని టెన్షన్ పడుతున్నారు. సాక్షి, నెల్లూరు: టీడీపీలో చక్రం తిప్పిన, క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీలకు రాబోయే ఎన్నికల్లో మొండి చేయి తప్పేటట్లు లేదు. క్షేత్రస్థాయిలో అధికార వైఎస్సార్సీపీ బలంగా ఉండడం, ప్రజాదరణ స్థిరంగా ఉండడం, టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలత లేకపోవడంతో ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికల బరిలోకి ‘కొత్త ముఖాలు’ వ్యూహానికి తెర తీయాలని ఆలోచనలో ఉన్నారు. ఇందు కోసం తమ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా రాబిన్ శర్మను నియమించుకున్నారు. ఆయన టీమ్ ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా సర్వే ప్రారంభించింది. ఆ పార్టీ సీటింగ్ మాజీల పట్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన టీమ్ అధినేతకు సమాచారమిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సర్వే ఆధారంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో ఇన్నాళ్లు రాబోయే ఎన్నికల్లో టికెట్ తమదేనని అనుకుంటున్న సీటింగ్ మాజీలతో పాటు ఆశావహులు సైతం అంతర్మథనంలో పడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డామనే భ్రమ మినహా అందలం ఎక్కే ఛాన్సు కోల్పోతున్నామనే బెంగ పట్టుకుంది. వరుస ఓటమి చెందిన నేతలకు ఈ దఫా టికెట్ లేదనే ఇప్పటికే స్పష్టం చేయడంతో జిల్లాలో చాలా మంది టీడీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. సోమిరెడ్డి పరిస్థితి అంతే.. వరుసగా మూడు పర్యాయాలు ఒకే నియోజకవర్గంలో ఓటమి చెందిన నాయకులను ఈదఫా ప్రత్యక్ష ఎన్నికల్లో దూరంగా పెట్టాలనే దిశగా టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. టీడీపీ మహనాడులోనే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇదే విషయాన్ని బాహాటంగా వెల్లడించారు. ఈ కేటగిరీలో జిల్లాలో మొదటి స్థానంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఓటమి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఉంటారు. ఈ దఫా ఆయనకు టికెట్ రావడం కష్టమేనని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ నాటికే నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికకు తుది రూపు తీసుకురావాలనే సంకల్పంతో టీడీపీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్శర్మ టీమ్ సర్వేలో సామాన్య ప్రజానీకంలో అధికార పార్టీ పట్ల ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదు. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్చార్జిలతో నిమిత్తం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యక్తిగత ఇమేజ్కు ధీటైన వారినే అభ్యర్థులుగా ప్రతిపాదించే అవకాశాలు అధికంగా ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చదవండి: (పదే పదే క్లీన్బౌల్డ్.. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహమేంటి?) ఆ ఇద్దరి భవిష్యత్ ప్రశ్నార్థకమే.. తెలుగుదేశం పార్టీలో ఎదురులేదని భావిస్తూ వచ్చిన నాయకులకు ఈ దఫా టికెట్ విషయంలో భంగపాటు తప్పేటట్లు లేదు. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో నేరుగా సమీక్షించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఆశావహుల వారీగా సర్వే చేయిస్తున్నారు. పార్టీ పరంగా, ఆశావహుల వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల ఇన్చార్జిలు ఇద్దరికీ ఈ దఫా పార్టీ టికెట్ ఎంపిక ప్రశ్నార్థకంగా మారనుంది. ఇద్దరికి కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిబంధకంగా మారాయి. అధికార పక్షం ఎమ్మెల్యేల వ్యక్తిగత ఇమేజ్ ముందు ఆ ఇద్దరు చాలా వెనుకబడినట్లు సమాచారం. ఇదే పరిస్థితి సర్వేపల్లి, కందుకూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కనిపిస్తున్నట్లు టీడీపీ సర్వే టీమ్ అధినేతకు నివేదిక అందించినట్లు తెలిసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతల కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు జిల్లాకు చెందిన వివిధ ప్రాంతాల్లో వ్యాపారాల్లో స్థిరపడిన వారి కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. -
మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు : నారా లోకేష్
‘టీడీపీలో దీర్ఘకాలిక పదవుల విధానం రద్దు. వరుసగా మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు. ఇది నా నుంచే అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం.’ – మీడియా ప్రతినిధులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: లోకేష్ ఝలక్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఇదే వాస్తవమైతే ఆ జాబితాలో ముందు వరుసలో జిల్లాకు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నిలవనున్నట్లు ఆ పార్టీ నేతలే అంటున్నారు. అయితే సోమిరెడ్డి పరిస్థితి ఏమిటీ? రాబోయే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ దక్కే అవకాశం లేదా? అని జిల్లా ప్రజానీకంతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుందీ సోమిరెడ్డి పరిస్థితి. ‘మహానాడు’ ఆయన రాజకీయ జీవితానికి సమాధి కానున్న పరిస్థితి ఏర్పడింది. జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు సోమిరెడ్డి. వరుస ఓటముల పాలైనా సోమిరెడ్డికి టీడీపీ అగ్రనేత చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ పొలిట్బ్యూరోలో ఆయనకు స్థానం కల్పించారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని కూడా చేశారు. అయితే తాజాగా మహానాడు వేదికగా నారా లోకేష్ ప్రకటన జిల్లా టీడీపీ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జిల్లాలో వరుస ఓటముల చరిత్రలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. టీడీపీ సీనియర్ నేతగా జిల్లా నేతలకు పెద్ద దిక్కుగా, పొరుగు జిల్లాల ఇన్చార్జి బాధ్యులుగా ఉన్న ఆయన 1994, 99 ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించారు. 2004, 2009, 2012 (కోవూరు ఉప ఎన్నిక), 2014, 2019ల్లో వరుసగా టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందిన చరిత్ర జిల్లాలో సోమిరెడ్డిదే. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, 2012 కోవూరు ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. వరుసగా అత్యధిక సార్లు ఓడిపోయిన నేతల జాబితాలో సోమిరెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నారు. నారా లోకేష్ నిర్ణయానికి ఆ పార్టీ కట్టుబడితే సోమిరెడ్డికి పార్టీ టికెట్ దక్కడం దుర్లభమే. రాష్ట్ర స్థాయి నేతగా చెప్పుకునే సోమిరెడ్డికి నారా లోకేష్ ఝలక్ ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. యూటర్న్లు తీసుకోవడంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటు, అదే వారసత్వం నారా లోకేష్కు కూడా వస్తే తప్పా, సోమిరెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం లేదు. లోకేష్ ప్రకటన తర్వాత నెటిజన్లు, తెలుగుతమ్ముళ్లు అయ్యో.. సోమిరెడ్డా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఏం ఒరగబెట్టారు?
పొదలకూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేయబోయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి సోమవారం ఓ రైతు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వివరాల్లోకెళ్తే.. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నేదురుమల్లిలోని రైతుభరోసా కేంద్రం వద్దకు వెళ్లారు. వైఎస్సార్సీపీకి చెందినవారికి మాత్రమే ఎరువులు అందిస్తున్నారంటూ గందరగోళం సృష్టించాలని చూశారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన పతకమూరి నాగయ్యనాయుడు అనే రైతు సోమిరెడ్డి వద్దకు వచ్చి ‘మీ ప్రభుత్వంలో రైతులకు ఏమి ఒరగబెట్టారని ఇప్పుడు ఎరువుల పంపిణీపై ఆందోళన చేయడానికి వచ్చారు? టీడీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికి అర్హత ఉన్నా ఇవ్వకుండా క్షోభకు గురి చేశారు. గ్రామంలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి చివర వరకు నాకు పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. జగన్ ప్రభుత్వం రైతుల ఇళ్ల వద్దే ఎరువులను అందిస్తుంటే అడ్డుకోవడానికి వచ్చారా? పార్టీలకతీతంగా రైతులకు ఆర్బీకేల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలకు చెడ్డపేరు తేవాలనే మీరు ఇక్కడకు వచ్చారు’ అంటూ సోమిరెడ్డిపై ధ్వజమెత్తారు. దీంతో అక్కడే ఉంటే ఇంకా అభాసుపాలవుతామని గ్రహించిన సోమిరెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
‘సోమిరెడ్డి ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది’
సాక్షి, నెల్లూరు జిల్లా: కంటెపల్లిలో గ్రావెల్ తవ్వకాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి మంగళవారం పరిశీలించారు. అటవీ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే టీడీపీ ఆరోపణలపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి నిజ నిర్థారణ చేపట్టారు. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకాగా, టీడీపీ నేతలు ముఖం చాటేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందన్నారు. పంచ భూతాలను దోచేసిన ఘనులు టీడీపీ నేతలంటూ ఎమ్మెల్యే కాకాణి మండిపడ్డారు. -
టీడీపీ నేత సోమిరెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు : కాకాణి
-
చిత్తూరు జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు
మదనపల్లె (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పర్యటనలో బహిర్గతమైంది. మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధిపత్యాన్ని సహించేది లేదని మరోవర్గం ప్రకటించింది. ఆదివారం సోమిరెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి మదనపల్లెకి వచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య సర్కిల్లోని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తన గెస్ట్హౌస్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ గెస్ట్హౌస్ మాజీ సైనికుల నుంచి కబ్జా చేసిన స్థలం అని దీనిపై కోర్టులో కేసు నడుస్తోందని, అలాంటి చోట సమావేశాలు నిర్వహిస్తే తాము రాలేమని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్చినబాబు అధినాయకులకు చెప్పారు. సమావేశాన్ని అక్కడ కాకుండా వేరెక్కడైనా ఏర్పాటు చేస్తే పాల్గొంటామని తెలిపారు. అయితే తన ప్రత్యర్థి వర్గం వాదనలకు విలువివ్వకుండా తన గెస్ట్హౌస్లోనే రమేష్ సమావేశం ఏర్పాటు చేయడంతో శ్రీరామ్చినబాబు, బాబురెడ్డి, టౌన్బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, మైనారిటీ నేతలు మస్తాన్, పఠాన్ఖాదర్ ఖాన్, దొరస్వామినాయుడు తదితరులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో సోమిరెడ్డి హడావుడిగా సమావేశాన్ని ముగించి ప్రత్యర్థి వర్గంతో బుజ్జగింపులు మొదలుపెట్టారు. అవి ఫలించకపోవడంతో ఆయన వెనుదిరిగారు. -
సోమిరెడ్డి మా డేటా చోరీ చేశారు: నర్మదారెడ్డి
-
టీడీపీ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఆయనపై కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సోమిరెడ్డి మా డేటా చోరీ చేశారు: నర్మదారెడ్డి ఫిర్యాదు అనంతరం శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ సంస్థపై సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ ప్రాజెక్ట్పై తప్పుడు ఆరోపణలు చేసిన సోమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. సోమిరెడ్డి తమ డేటా చోరీ చేశారని తెలిపారు. కాకాణికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నర్మదారెడ్డి స్పష్టం చేశారు. చదవండి: అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది బాలిక కిడ్నాప్ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. -
ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాలని చూస్తున్నాయి: కాకాణి
-
ఏ విచారణకైనా రెడీ
నెల్లూరు సెంట్రల్: ఆనందయ్య ఇస్తున్న కరోనా నివారణ మందు విషయంలో తనపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి, లేదా విశ్రాంత న్యాయమూర్తితో ఏ విచారణకైనా తాను సిద్ధమని వైఎస్సార్సీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. నెల్లూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయలేదని.. కలెక్టర్ నిలిపివేసిన విషయం గుర్తులేదా సోమిరెడ్డి అని ప్రశ్నించారు. మందు విక్రయానికి సంబంధించిన వెబ్సైట్లో తాను డైరెక్టర్నని అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సదరు వెబ్సైట్కు తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు. తాను తప్పుచేసినట్లు రుజువు చేస్తే బహిరంగంగా ఉరేసుకుంటానన్నారు. అలాగే.. నకీలీ ఎరువులు తయారుచేసి రైతులను మోసం చేయలేదని.. మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని రైతులను దగా చేయలేదని.. క్రికెట్ కిట్లు,, సైకిళ్లు పంపిణీలో అవినీతి చేయలేదని.. పేకాటలో ఎవరికీ అప్పు లేనని నువ్వు, నీ కొడుకు ప్రమాణం చేయడానికి సిద్ధమా సోమిరెడ్డి అని కాకాణి సవాల్ చేశారు. సోమిరెడ్డి ఆరోపణలపై శేశ్రిత టెక్నాలజీ అధినేత నర్మద్రెడ్డి స్పందిస్తూ.. సోమిరెడ్డి అన్నీ అవాస్తవాలు మాట్లాడారన్నారు. కనీసం తనను సంప్రదించి ఉంటే వాస్తవాలు చెప్పే వాళ్లమని.. దీనిపై అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఆనందయ్య మందుతో వ్యాపారం: సోమిరెడ్డి నెల్లూరు టౌన్: ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి భారీ కుట్ర పన్నినట్లు టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందు అమ్మకం పేరుతో వెబ్సైట్ను రూపొందించింది నెల్లూరుకు చెందిన శేశ్రిత కంపెనీ అన్నారు. ఈ నెల 2న చిల్డీల్ వెబ్సైట్ను ఇంటర్నెట్లో పెట్టిందన్నారు. దీనిపై ఆరోపణలు రావడంతో మరుసటి రోజే వెబ్సైట్ను తొలగించారన్నారు. కాగా, మందు ప్యాకెట్ ధర రూ.15గా.. జీఎస్టీ, కొరియర్ చార్జీలతో కలిపి రూ.167 పెట్టారన్నారు. ప్రజల నుంచి వందల కోట్లు సొమ్ము చేసుకోవాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే కాకాణికి, మా వెబ్సైట్కు సంబంధం లేదు
నెల్లూరు: తమ వెబ్సైట్ గురించి సోమిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి. సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఎండీ స్పందించారు. ‘‘ఈ వెబ్సైట్ వెనుక ఎలాంటీ దోపిడీ ఉండదు, అంతా పారదర్శకం. టెస్టింగ్ చేసే క్రమంలోనే వెబ్సైట్లో రేట్లు పెట్టుకున్నాం.. అవి ఫైనల్ కాదు. ఈ అంశాన్ని సోమిరెడ్డి ఇలా రాజకీయం చేయడం దుర్మార్గం. ఎమ్మెల్యే కాకాణికి, మా వెబ్సైట్కు ఎలాంటి సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు. మందు పంపిణీ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదు: కాకాణి ఆనందయ్య మందు విషయంలో వ్యక్తిగత విమర్శలు చేసి.. ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాలని చూస్తున్నాయి అన్నారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆనందయ్య మందుకు అనుమతులు వచ్చేవరకే ప్రయత్నం చేశా. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో.. పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని కాకాణి స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. ‘‘సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దిగజారి విమర్శలు చేస్తున్నారు. సోమిరెడ్డి ఒక్క రూపాయైనా అవినీతి జరిగిందని నిరూపించలగలవా. వ్యక్తిగత విమర్శలతో సోమిరెడ్డి బురదజల్లాలని చూస్తున్నాడు. సోమిరెడ్డికి నన్ను విమర్శించే హక్కు లేదు. ఎక్కువగా మాట్లాడితే సోమిరెడ్డి అప్పుల చిట్టా విప్పుతా. సోమిరెడ్డి పేకాటలో ఎంతమందికి అప్పులు ఉన్నాడో చెప్పాలి’’ అని కాకాణి డిమాండ్ చేశారు. ‘‘సోమిరెడ్డికి ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో బయటపెట్టాలి. సోమిరెడ్డి ఆధారాలతో వస్తే విచారణకు సిద్ధం. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలి. ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. సోమిరెడ్డి నీతి మాటలు కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలి’’ అంటూ కాకాణి తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: ఆనందయ్య మందు: ఆరోపణలొద్దు.. అనుమానాలు రేపొద్దు -
సోమిరెడ్డి.. ఓడగొడతావేంటి!
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీని అభద్రతా భావం వెంటాడుతోంది. ఆ పార్టీ నేతలు వేసే ప్రతి అడుగూ బెడిసికొడుతోంది. ఒక వ్యూహం పన్నితే అది కాస్తా బూమరాంగ్ అవుతోంది. ఒకరిని ఇన్చార్జిగా నియమిస్తే శ్రేణులే వేలెత్తి చూపే పరిస్థితి ఏర్పడుతోంది. నియోజవకవర్గాల్లో ప్రచారానికి వెళితే కార్యకర్తలే నిలదీస్తుండడంతో నాయకుల్లో ఆత్మస్థైర్యం దిగజారిపోతోంది. తమ్ముళ్ల వైఖరి ఆ పార్టీ అగ్రనేతలను సైతం డైలమాలో పడేస్తోంది. సాక్షి, తిరుపతి: టీడీపీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఇవి ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. కార్యకర్తల్లో అంతర్గతంగా జీర్ణించుకుపోయిన అంశాలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నేతలను అవి నిగ్గదీసి కడిగేస్తున్నాయి. పనబాక.. పట్టించుకోబాక! తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాకలక్ష్మి పేరును ఆ పార్టీ అధిష్టానం మూడు నెలలు ముందు ప్రకటించింది. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఎవరికీ చెప్పలేదు. కనీసం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల నేతలకు, ఇన్చార్జిలకు తెలియజేయ లేదు. ఆమె బీజేపీలో చేరిపోతారనే అభద్రతా భావంతో టీడీపీ నేత చంద్రబాబునాయుడు ముందే ప్రకటించేశారు. ఆ ప్రకటన తర్వాత ఆమె ఇంతవరకు ప్రజల మధ్యకు రాలేదు. పంచాయతీ, పుర ఎన్నికల్లోనూ ఎక్కడా కనిపించలేదు. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎక్కడా ప్రచారం చేయలేదు. ఇప్పుడు ఉప పోరుకు నోటిఫికేషన్ వెలువడడంతో తాజాగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఒకడుగు ముందుకువేస్తే, మూడడుగులు వెనక్కి పడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. నిలదీత.. అంతా రోత పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇటీవల టీడీపీ నేతలు ప్రచారాలు మొదలుపెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీయడం మొదలుపెట్టారు. మండల, నియోజకవర్గాలకు ముందు ఇన్చార్జీల విషయం తేల్చాలని భీష్మించుకుంటున్నారు. ఇలాంటిదే సత్యవేడు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత వర్గీయుల మధ్య వివాదం బహిర్గతమైంది. వారిని సర్దిచెప్పేందుకు టీడీపీ సీనియర్ నేతలకు తల ప్రాణం తోకకు వచ్చినట్టయ్యింది. తిరుపతిలో తెలుగు యువత అధ్యక్షుడుగా రవినాయుడు నియామకంపై కొందరు పెదవి విరిచారు. ఎంతో కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకొని వస్తున్న నేతలను పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో టీడీపీ ఉనికి నామరూపాల్లేకుండా పోతోంది. అక్కడ ఆ పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేరనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. సోమిరెడ్డి..ఓడగొడతావేంటి! తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల బాధ్యుడిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిని నియమించడంపై టీడీపీ అభ్యర్థి పన బాకలక్ష్మితో సహా ఆయా నియోజకవర్గాల కేడర్ కినుకు వహించినట్లు సమాచారం. 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు పర్యాయాలు సర్వేపల్లె నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. ప్రజల మెప్పు పొందడంలో విఫలమయ్యారు. అలాంటి నాయకుడ్ని తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఎలా నమ్ముతారని పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమా చారం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల మొత్తంగా పరిశీలిస్తే టీడీపీ ప్రతిచర్య భూమ్రాంగ్ అవుతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చదవండి: బరిలో ఉమ్మడి అభ్యర్థి -
ఆ ఊరేగింపు సోమిరెడ్డికే చెల్లింది: కాకాణి
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమిరెడ్డిని అవినీతి సామ్రాట్గా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి విమర్శలను ఆయన తప్పుబట్టారు. ‘‘సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే జిల్లాలో పసుపు కుంభకోణం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నపుడు రైతుల ప్రయోజనాలను విస్మరించి మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకున్నారు. నీరు-చెట్టు అవినీతి విషయంలో విచారణను అడ్డుకున్నది సోమిరెడ్డి కాదా’’ అని కాకాణి ప్రశ్నించారు.(చదవండి: ‘వారికి ప్రజలే బుద్ధి చెబుతారు’) 2014లో అధికారంలోకి రాగానే పేదల ఇళ్లు కూల్చి వేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కాగానే సర్వేపల్లిలో స్కూల్ భవనం కూలగొట్టించింది వాస్తవం కాదా అని దుయ్యబట్టారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నపుడు గ్రామస్తులు అడ్డుకోవడానికి వస్తే పోలీసుల సాయంతో బయటపడ్డాడని, ఆయన అవినీతిపై ఫ్లెక్సీలు గ్రామాల్లో ఊరేగింపు సోమిరెడ్డికే చెల్లిందని కాకాణి గోవర్ధన్రెడ్డి ఎద్దేవా చేశారు. -
సోమిరెడ్డివి దుర్మార్గపు రాజకీయాలు
నెల్లూరు, పొదలకూరు: కరోనా విపత్తుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా వారి సంక్షేమం కోసం తాను పాటుపడుతుంటే టీడీపీ నాయకుడు సోమిరెడ్డి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాడని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలంలోని నరసింహకండ్రిక, గురవాయపాళెం, కనుపర్తి, ఆల్తుర్తి, మొగళ్లూరు, ఆర్వైపాళెం గ్రామాల్లో ఆదివారం సర్వేపల్లి రైతన్న కానుక కింద బియ్యం, వంటనూనెను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కరోనాకు భయపడి తాను ఇంట్లో కూర్చుంటే పేదలను ఎవరు ఆదుకుంటారన్నారు. రూ.3.50 కోట్ల విలువ చేసే బియ్యం, నూనెలను సమీకరించడాన్ని అభినందించాల్సిపోయి తన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు సైతం పేదలకు సాయం అందిస్తే అభినందిస్తానన్నారు. నాయకుడన్న వాడు పేదలకు ఒక్కరికైనా సాయం అందించినా ఆహ్వానించాలని తన కార్యకర్తలకు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదంతా పక్కన పెట్టి సోమిరెడ్డి తాను పర్యటిస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని రకరకాలుగా రైతన్న కానుకను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నడం దురదృష్టకరమన్నారు. ధాన్యం సేకరించినంత మాత్రాన బియ్యం రావని, కార్యకర్తలు ఎంతో ఓర్పుతో మిల్లర్ల వద్దకు వెళ్లి ఆడించి ప్యాకింగ్ చేయిస్తున్నారని తెలిపారు. పేదలను ఆదుకునే కార్యక్రమానికి కూడా రాజకీయాలు ఆపాదిస్తే పుట్టగతులుండవన్నారు. రైతులు ఇచ్చిన ధాన్యాన్ని బలవంతంగా వసూలు చేశానని ఆరోపించడం వారిని అవమానించడమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, తెనాలి నిర్మలమ్మ, నువ్వుల మంజుల, తహసీల్దార్ స్వాతి, ఎంపీడీఓ సుజాత, ఈఓపీఆర్డీ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘దమ్ము.. ధైర్యం.. నిజాయితీ ఉంటే’; కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు : స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. నామినేషన్ వేయనీయకుంటే వేలాది మంది టీడీపీ అభ్యర్థులు ఎలా నామినేషన్లు వేశారని ప్రశ్నించారు. శనివారం ఆయన జిల్లాలో మాట్లాడుతూ.. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడిందో దానికి తనే ప్రత్యక్ష సాక్షి అని పేర్కొన్నారు. అప్పట్లో అదనపు డీజీ వెంకటేశ్వరరావు దగ్గర ఉంటూ వైఎస్సార్సీపీ నేతలను పలు రకాలుగా హింసించి, తప్పుడు కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద దాడి చేశారని అన్నారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడ్డుకోలేదా అని, అప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. (టీడీపీకి సవాలు విసిరిన ఎమ్మెల్యే కాకాణి) అలాగే ‘‘జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో సాక్షాత్తూ కలెక్టర్పై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి దాడి చేస్తే దిక్కు లేదు. అప్పుడు ఎందుకు చంద్రబాబు మాట్లాడలేదు.నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి.. వాస్తవాలు విస్మరించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పొదలకూరులో పంట కాలువను ఆక్రమించి ఇల్లు కడుతుంటే పంచాయతీ అధికారులు అడ్డుకోవడం తప్పా.. గత ఏడాది అధిక వర్షాలు పడినప్పుడు ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు రావడంతో దానిని రాజకీయం చేస్తున్నారు. ఆక్రమణలు ఏ పార్టీ వారివైనా తొలగించాలని కోరుతున్నాం. టీడీపీ తరపున పోటీచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారు. దమ్ము.. ధైర్యం.. నిజాయితీ.. ఉంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి. నా తప్పు ఉంటే రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నా’’నని ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డి సవాల్ విసిరారు. (ఆ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కుమార్తె చేయూత) -
సోమిరెడ్డి.. నీవు చాలదన్నట్లు లోకేష్ను తీసుకొచ్చావా?
సాక్షి, నెల్లూరు: సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వాస్తవాలు కప్పిపుచ్చి వైఎస్సార్సీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయనకు తాను అడిగే ఏ ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందాని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్లోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. ఇటీవల సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ నాలుగు విషయాలను ప్రస్తావించి, వాటిని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలుగా ఆరోపించారన్నారు. వాస్తవాలు ఇవే సోమిరెడ్డి కూరపాటి విజయరాజును ప్రభుత్వం రౌడీషీట్ ఓపెన్ చేస్తుందని తాము బెదిరిస్తున్నట్లుగా చంద్రమోహన్రెడ్డి ఆరోపించారన్నారు. కానీ వాస్తవంగా విజయరాజుపై గతంలో ఎనిమిది కేసులు ఉండడంతో ఈ ఏడాది జనవరిలోనే పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారని తెలిపారు. జనవరిలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న విషయాన్ని సోమిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. గతేడాది అక్టోబరు 26న అసైన్మెంటు కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా చెన్నారెడ్డిపల్లికి చెందిన ఎస్టీ సగుటూరు శీనయ్యకు సంబంధించిన పొలానికి పట్టా ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. కానీ సోమిరెడ్డి మాత్రం అధికారికంగా చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టి, ఎస్టీ అని కూడా చూడకుండా వేరొకరికి పట్టా ఇవ్వాలని ఆదేశించారన్నారు. ప్రస్తుతం ఈ విషయమై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అట్రాసిటీ కేసులు ఎన్నడూ చూడలేదన్న చంద్రమోహన్రెడ్డి వాస్తవం తెలుసుకోవాలన్నారు. బిరదవోలుకు చెందిని బుజ్జిరెడ్డిపై గత ఏడాది నవంబరులో అట్రాసిటీ కేసు పెట్టించగా, కోర్టు తప్పుడు కేసు అని కొట్టివేసిన విషయాన్ని గుర్తుతెచ్చుకోవాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పెట్టించిన తప్పుడు అట్రాసిటీ కేసులపై ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తోడేరుకు చెందిన ఓ వ్యక్తి ట్రాలీలో ఆవులను తీసుకుపోతుంటే పోలీసులు అమానుషంగా కొట్టారని సోమిరెడ్డి మరో అసత్య అరోపణ చేశారన్నారు. ట్రాలీలో ఆవులను తీసుకువెళ్తున్న సమయంలో కలెక్టర్ అటువైపుగా వెళుతూ గమనించి పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు పిలిపించి ఆవుల విక్రయాలు చేయెద్దని చెప్పి పంపారన్నారు. ఈ విషయాన్ని ఎవరైనా పోలీసులను అడిగి తెలుసుకోవచ్చన్నారు. సోమిరెడ్డి అసత్య అరోపణలు చేస్తూ వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ అరోపణలన్నీ గత ప్రభుత్వంలోనే జరిగిన విషయాలేనని గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. ఈ విషయాలపై సోమిరెడ్డికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు సిద్ధమా? సోమిరెడ్డి నీవు చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి పోలీస్స్టేషన్కు వెళ్లి వచ్చారన్నారు. తప్పుచేస్తే ఎవరైనా ఒక్క టేనని, తప్పుచేసిన వారిని ఎవరైనా వదలేది లేదన్నారు. సోమిరెడ్డిలాగా దిగజారుడు మాటలు, పనులు చేసే సమయం తమకు లేదన్నారు. తమకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలకే సమయం సరిపోవడంలేదన్నారు. నీవు చాలదన్నట్లు లోకేష్ను తీసుకొచ్చావా సోమిరెడ్డి తాను చేసే ఆరోపణలు, అసత్య ప్రకటనలు చాలవన్నట్లు లోకేష్ను నెల్లూరుకు తీసుకొచ్చారన్నారు. దగదర్తిలో కుటుంబ కలహాలతో వ్యక్తి చనిపోతే వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చూడడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో గత ప్రభుత్వంలో నీరు–చెట్టులో ఏ మేర అవినీతి జరిగింది..అందులో తనకు ఎంత వాటా రావాలి..ఎంత ఇచ్చారో లోకేష్ సమీక్ష చేసి అడిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. శవాలకు డబ్బులు ఇచ్చి శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితువు పలికారు. -
కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి
-
‘మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ‘కోడెల మెడపై గాట్టు ఉన్నాయి కాబట్టి.. ఉరేసుకున్నారని డాక్టర్ల అభిప్రాయం. అక్కడ ఇంట్లో చూసిన విషయాలను బట్టి ఆ విధంగా తెలుస్తోంది’ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏది ఏమైనప్పటికి ఆయన ఇక లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి వైద్యులు ఎంత శ్రమించినప్పటికి ఆయనను కాపాడలేకపోయారని, ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే ఆయన మరణించారని చెప్పారు. శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారని, మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అన్నారు. చదవండి: కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
పోలీస్స్టేషన్లో సోమిరెడ్డి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వెంకటాచలం: మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి శుక్రవారం వెంకటాచలం పోలీస్స్టేషన్కు వచ్చారు. భూ వివాదం కేసులో ఏ–1 నిందితుడిగా సమన్లు తీసుకుని, వారం నుంచి హాజరుకాకుండా అదృశ్యమైన సోమిరెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడి శుక్రవారం సీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమిరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజగోపాలరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఇతర పార్టీ నేతలతో కలిసి స్టేషన్కు వచ్చారు. ఇడిమేపల్లి భూ వివాదంపై కోర్టు ఆదేశాలతో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై వెంకటాచలం పోలీసులు గత నెల 27వ తేదీన కేసు నమోదు చేశారు. ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లోని 2.41 ఎకరాల ప్రైవేట్ భూమికి సోమి రెడ్డి తన రాజకీయ ప్రాబల్యంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తొలుత తన పేరుతో మార్చుకుని ఆ తర్వాత ఇతరులకు అమ్మేశాడని భూమి యజమాని బాధితుడు ఏలూరు రంగారెడ్డి కోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం పలు దఫాలు వెంకటాచలం పోలీసులు సోమిరెడ్డికి సమన్లు ఇచ్చినా, వస్తానని విచారణకు గైర్హాజరయ్యారు. విచారణకు సహకరించకుండానే బెయిల్ కోసం కోర్టులో సోమిరెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశిం చింది. ఆ మేరకు గురువారం రాత్రి నెల్లూరు రూ రల్ సీఐ రామకృష్ణ అల్లీపురంలోని సోమిరెడ్డి నివా సానికి వెళ్లి విచారణకు హాజరుకావాలని మరో సారి నోటీసులు జారీ చేశారు. దీంతో సోమిరెడ్డి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని విచారణాధికారి సీఐ రామకృష్ణ వద్ద హాజరయ్యారు. సోమిరెడ్డితో పాటుగా న్యాయవాది వడ్డే శ్రీనివాసరావు వచ్చారు. భూ వివాదానికి సంబంధించి పలు డాక్యుమెంట్లు చూ పించారు. ఈ కేసు విచారణను నాలుగు గంటల పాటు కొనసాగింది. సోమిరెడ్డిని అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీస్స్టేషన్ వద్దకు వచ్చిన టీడీపీ నాయకులే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే 2.30 గంటల సమయంలో ఆయన బయటకు వచ్చారు తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎవరెన్ని కుట్రలు చేసినా తాను భయపడనని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
సోమిరెడ్డి ఆచూకీ కోసం పోలీసుల అన్వేషణ
సాక్షి, వెంకటాచలం (నెల్లూరు): వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో భూవివాదం కేసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. ఇడిమేపల్లిలో సర్వే నంబర్ 58 – 3లో 2.41 ఎకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో సోమిరెడ్డి ఇతరులకు విక్రయించిన వ్యవహారంలో వెంకటాచలం పోలీస్స్టేషన్లో కేసు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో విచారణాధికారి వద్దకు హాజరుకావాలని, భూవివాదానికి సంబంధించి ఏమి డాక్యుమెంట్లు ఉన్నాయో సమర్పించాలని రెండు సమన్లను వెంకటాచలం ఎస్సై కరిముల్లా ఈ నెల ఆరున సోమిరెడ్డికి అందజేశారు. ఈ నెల తొమ్మిదిన వస్తానని చెప్పిన సోమిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి తన తరఫున న్యాయవాదులను పంపడం, జిరాక్స్ పత్రాలను న్యాయవాదులు ఇవ్వడంతో రూరల్ సీఐ వాటిని తీసుకునేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో సోమిరెడ్డి బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులను జారీ చేయాలని ఆదేశించింది. వెంకటాచలం పోలీసులు బుధవారం హైదరాబాద్ వెళ్లగా సోమిరెడ్డి లేకపోవడంతో ఆయన నివాసానికి నోటీస్ను అంటించి వచ్చారు. కేసుకు సంబంధించి పోలీసులు అప్పట్లో సర్వేయర్గా పనిచేసిన సుబ్బరాయుడుతో పాటు సోమిరెడ్డి ఇద్దరు గన్మెన్లను గురువారం విచారించారు. సోమిరెడ్డి గుంటూరులో చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు అన్వేషణను ముమ్మరం చేశారు. -
పరారీలో ఏ1 నిందితుడు మాజీమంత్రి సోమిరెడ్డి
ఎప్పుడూ ఎదుటి వారికి నీతి సూత్రాలు వల్లించే మాజీమంత్రి సోమిరెడ్డి భూ వివాదంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. పోలీసుల విచారణకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులతో భూవివాదం కేసులో వెంకటాచలం పోలీసులు మొదటి నిందితుడిగా చేర్చి ప్రైవేట్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జారీ చేసిన విచారణ నోటీసులను తీసుకున్న సోమిరెడ్డి అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు నిబంధనల మేరకు సోమిరెడ్డి జాడ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా పోలీసులు బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా సోమిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసును అంటించి వచ్చారు. మొత్తం మీద సోమిరెడ్డి అజ్ఞాత వాసిగా మారడంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, నెల్లూరు: వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని బాధితుడు ఏలూరు రంగారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోమిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చి విచారించాల్సిందిగా వెంకటాచలం పోలీసులను ఆదేశించింది. దీంతో వెంకటాచలం పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ సీఆర్పీసీ 160, 91 కింద నోటీసులు జారీ చేశారు. మొదటి సారి పోలీసులు నోటీసులతో అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లగా సోమిరెడ్డి లేకపోవడంతో వెనుదిరిగారు. రెండో పర్యాయం సోమిరెడ్డి నోటీసులు తీసుకొని ఈ నెల 9న వెంకటచాలం పోలీసుస్టేషన్లో విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే 9న విచాణకు ఆయన గైర్హాజరయ్యారు. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్లిపోయి విచారణకు ఆయన తరఫున న్యాయవాదులను పంపించి పోలీసులకు డాక్యుమెంట్లు చూపించారు. అయితే ఈ కేసులో నేరుగా సోమిరెడ్డినే విచారించాల్సి ఉండడంతో పోలీసులు అన్వేషణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్కు వెళ్లారు. సోమిరెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో కోర్టు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో వెంకటాచలం పోలీసులు నోటీసులు సిద్ధం చేసి హైదరాబాద్లో సోమిరెడ్డి నివాసానికి వెళ్లగా అక్కడ కూడాలేకపోవడంతో ఇంటికి నోటీసు అతికించారు. సోమిరెడ్డి బెయిల్ పిటిషన్పై ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 9న విచారణకు హాజరవుతానని నోటీసులు తీసుకొని గైర్హాజరయ్యాడని, ఈ క్రమంలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విచారించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని విన్నవించారు. కోర్టు 41ఏ నోటీసు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. దీంతో సోమిరెడ్డి పార్టీ క్యాడర్కు కనీసం ఫోన్లో కూడా ఆందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
సోమిరెడ్డి అజ్ఞాతం!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భూ దందా కేసును ఎదుర్కొంటున్న మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పోలీసు విచారణకు హాజరుకాకుండా ఆఖరి క్షణంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో పోలీసుల ఎదుట హాజరై అన్ని వివరాలు చెబుతానని నోటీసులు అందుకున్న సోమిరెడ్డి తన తరఫున న్యాయవాదులను పంపించి, విచారణకు డుమ్మా కొట్టారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేరే వారి భూమిని తన భూమిగా చూపించి ఇతరులకు విక్రయించారు. ఈ క్రమంలో భూ యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పోలీసులను కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా సోమిరెడ్డికి సమన్లు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. రెండు సమన్లు అందుకుని.. వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58–3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని బాధితుడు ఏలూరు రంగారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సోమిరెడ్డిపై వెంకటాచలం పోలీస్స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణాధికారి వద్దకు హాజరు కావాలని ఒక సమను, ఆ భూమికి సంబంధించి మీ వద్దనున్న డాక్యుమెంట్లు సమర్పించాలని మరో సమనును ఈ నెల 6వ తేదీన వెంకటాచలం ఎస్సైషేక్ కరీముల్లా అల్లీపురంలోని ఆయన నివాసంలో సోమిరెడ్డికి అందజేశారు. ఇప్పటికిప్పుడు విచారణకు హాజరుకాలేనని డాక్యుమెంట్లు అన్నీ తీసుకుని సోమవారం విచారణకు విచారణకు హాజరై అన్ని విషయాలు వెల్లడిస్తానని సోమిరెడ్డి పోలీసులకు చెప్పి నోటీసులు తీసుకున్నారు. ఆఖరి క్షణంలో హైడ్రామా ఈ క్రమంలో సోమవారం సోమిరెడ్డి విచారణకు హాజరు అవుతారని టీడీపీ శ్రేణులు భారీ ప్రచారం చేసి, ఆయకు మద్దతుగా జన సమీకరణ చేయాలని భావించారు. భూ వివాదం కేసుకు సంబంధించి విచారణధికారి నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ వద్దకు సోమిరెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సోమిరెడ్డి వెంకటాచలం పోలీస్స్టేషన్కు చేరుకుని సీఐ వద్దకు హాజరై అన్నీ డాక్యుమెంట్లు సమర్పిస్తారని ప్రచారం చేశారు. సోమిరెడ్డి హాజరైతే ఏం జరుగుతుందోనని ముందుగానే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వెంకటాచలం పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుంది. మరో గంటలో వస్తారని ప్రచారం చేశారు. ఇంతలో సోమిరెడ్డి విచారణకు హాజరు కాకుండా వేరే ఊరెళ్లి పోవడం తీవ్ర చర్చగా మారింది. చివరకు 6 గంటల సమయంలో సోమిరెడ్డి తరఫున ఇద్దరు న్యాయవాదులు వడ్డే శ్రీనివాసరావు, చలపతి సీఐ రామకృష్ణ వద్దకు హాజరై పలు డాక్యుమెంట్లను అందజేశారు. రాత్రి 8 గంటల వరకు సీఐతో చర్చించారు. డాక్యుమెంట్లు ఇచ్చినట్లు రసీదు ఇవ్వమని న్యాయవాదులు కోరడంతో ఇచ్చేందుకు వీలుకాదని సీఐ రామకృష్ణ చెప్పడంతో ఇచ్చిన డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. సోమిరెడ్డి ఎక్కడ భూదందా కేసును ఎదుర్కొంటున్న సోమిరెడ్డి ఆఖరి క్షణంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, తన న్యాయవాదులను పోలీసుల వద్దకు పంపడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే ఆయన ముందుస్తు బెయిల్ కోసం కోర్టును సైతం ఆశ్రయించడం, విచారణకు డుమ్మా కొట్టడం చూస్తే ఆయన వద్ద ఆధారాలు లేకపోవడంతోనే అదృశ్యమైపోయారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి. -
సోమిరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, నెల్లూరు: భూదందా కేసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించుకుపోతుంది. టీడీపీ ఐదేళ్ల పాలనలో సోమిరెడ్డి తనకున్న రాజకీయ పరపతిని అడ్డుపెట్టుకుని ఎన్నో అరాచకాలకు పాల్పడ్డాడు. ప్రతిపక్షపార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించాడు. సహజవనరులను దోచుకుని రూ.కోట్లకు పడగలెత్తాడు. ఆయన అరాచకాలను ప్రశ్నించిన అప్పటి ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయించి ఇబ్బందిపడేలా చేశాడు. ఐదేళ్ల కాలంలో వైఎస్సార్సీపీని టార్గెట్ చేసి నేతలను, కార్యకర్తలను పోలీస్ కేసులతో భయపెట్టి నరకం చూపించిన సోమిరెడ్డిపై ఎట్టకేలకు భూ దందా కేసు నమోదైంది. ఆయన చేసిన దందాపై గత పాలనలో పోలీసులు ఫిర్యాదు కూడా స్వీకరించేందుకు వెనకాడారు. బాధితులు కోర్టును ఆశ్రయించి కేసు నమోదుకు ఆదేశాలు ఇప్పించడంతో మాజీ మంత్రిపై కేసు నమోదైంది. గత నెల 27వ తేదీన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు విచారణ నిమిత్తం సోమవారం విచారణాధికారి ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. అధికారం అడ్డుపెట్టుకుని అరాచకాలు 2014లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓటమి పాలుచేసినా టీడీపీ గద్దెనెక్కడంతో తన పరపతితో ఏకంగా సోమిరెడ్డి మంత్రి పదవి చేజిక్కించుకున్నాడు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డాడు.. ప్రతిపక్షపార్టీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి పోలీసులు చేత భయపెట్టి వారికి చుక్కలు చూపించాడు. ఆయన మంత్రి కావడంతో అటు అధికార యంత్రాంగం కూడా తప్పులు చేసేందుకు కూడా వెనకాడలేదు. సోమిరెడ్డి చెప్పిందే వేదం అన్నట్లుగా అధికార దుర్వినియోగం జరిగింది. అందులో భాగంగా వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో పామర్రు పిచ్చిరెడ్డికి సర్వే నంబర్ 58–1లో 8.89 ఎకరాలు, 58–3 లో 4.41 ఎకరాలు మొత్తం కలిపి 13.71 ఎకరాలు భూమి ఉంది. ఇందులో 10.94 ఎకరాలు పంపకాల విషయంలో వివాదం జరిగి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమెహన్రెడ్డి వద్దకు పంచాయతీకి వెళ్లింది. దీంతో సోమిరెడ్డి వారి పంచాయతీ తీర్చకపోగా విలువైన ఆ భూమిని కాజేసేందుకు కుట్రపన్నాడు. వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి లేని రికార్డులను సృష్టించి సర్వే నంబర్ 58–3లో 2.36 ఎకరాల భూమిని తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ భూమిని చెన్నై నగరానికి చెందిన మేఘనాథన్, ఏఎంజయంతిలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు ఏలూరు రంగారెడ్డి అప్పట్లొనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఎట్టకేలకు భూ దందాకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో వెంకటాచలం పోలీసులు గత నెల్లో మాజీ మంత్రి సోమిరెడ్డితో పాటు వీఆర్ మేఘనాథన్, ఏఎం జయంతి, సర్వేయర్ సుబ్బరాయుడుపై 471,468,447,427,397 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు పోలీసులు ముందు హాజరు మాజీ మంత్రి సోమిరెడ్డి భూదందాపై కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సోమిరెడ్డికి సహకరించిన పలువురు అధికారులను ఇప్పటికే విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఆ విచారణలో కూడా సోమిరెడ్డి ఒత్తిడితోనే రికార్డులు మార్పిడి చేయాల్సి వచ్చిందని వారు తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి సోమిరెడ్డికి కూడా పోలీసులు రెండు సమన్లు జారీ చేశారు. ఆ భూమి నీకెలా వచ్చింది. అందుకు సంబంధించిన పూర్తి రికార్డులు తీసుకురావాలని, అలాగే సోమవారం విచారణాధికారి ముందు హాజరయిపూర్తి ఆధారాలు చూపించాలంటూ పోలీసులు సమన్లు ఇవ్వడంతో సోమవారం మధ్యాహ్నం పోలీసులు ముందు మాజీ మంత్రి సోమిరెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో పోలీసులు సైతం మాజీ మంత్రి చీటింగ్పై పక్కా ఆధారాలు సేకరించి ఉచ్చు బిగించేలా చేస్తుండడంతో మాజీ మంత్రి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఈ కేసును టీడీపీ పెద్దలు రాజకీయం చేయడం గమనార్హం. -
భూవివాదం కేసులో సోమిరెడ్డికి సమన్లు
సాక్షి, వెంకటాచలం(నెల్లూరు): వెంకటాచలం మండలంలో భూవివాదం కేసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి వెంకటాచలం ఎస్సై షేక్ కరీముల్లా శుక్రవారం సాయంత్రం సమన్లు అందజేశారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 58–3లోని 2.41ఎకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇతరులకు అమ్మేసిన విషయంపై కోర్టు ఆదేశాలతో ఏ1 ముద్దాయిగా సోమిరెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన ఇతరుల భూమిని అమ్మేసిన కేసుకు సంబంధించి గత నెల 31వ తేదీన వెంకటాచలం పోలీసులు ఇడిమేపల్లికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ నెల మూడో తేదీన నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ సోమిరెడ్డికి సమన్లు జారీ చేసేందుకు అల్లీపురంలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన లేక పోవడంతో వెనక్కు వచ్చేశారు. అయితే శుక్రవారం సాయంత్రం వెంకటాచలం ఎస్సై షేక్ కరీముల్లా అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రెండు సమన్లు జారీ చేశారు. ఇడిమేపల్లి భూవివాదం కేసుకు సంబంధించి విచారణాధికారి సీఐ రామకృష్ణ వద్దకు హాజరుకావాలని ఒక సమను, భూవిదాదం కేసులో మీవద్ద ఉన్న డాక్యుమెంట్లను అందజేయాలని మరో సమను అందజేసినట్లు ఎస్సై తెలిపారు. అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లడంతో సోమిరెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోలీసులు సమన్లు జారీ చేయడంతో ఎప్పడు ఏం జరుగుతుందోనని జిల్లాలో చర్చానీయాంశమైంది. ఇది చదవండి : నమ్మితే నట్టేట ముంచారు -
మాజీ మంత్రి నట్టేట ముంచారు..
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): తెలుగుదేశం పార్టీలో గతంలో నమ్మకంగా ఉంటూ మాజీ మంత్రి సోమిరెడ్డికి అండగా ఉంటే తనను సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నట్టేట ముంచారని వెంకటాచలం మండలం ఇడిమేపల్లికి చెందిన ఏలూరు రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి రూరల్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్సీ రాఘవరెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని, సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబర్ 58/3 లో 2.41 ఎకరాల పొలం తనకు ఉందని, ఈ పొలం తనకు తమ పూర్వీకుల నుంచి వచ్చిందని తెలిపారు. కానీ సోమిరెడ్డి అప్పట్లో తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన పొలానికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి ఇతరులకు విక్రయాలు చేశారన్నారు. ఈ విషయంపై అప్పట్లో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదన్నారు. అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, తన వద్ద అన్ని పత్రాలు ఉండడంతో సోమిరెడ్డిని ఏ–1 ముద్దాయిగా చేర్చి కేసు నమోదు చేయాలని న్యాయం స్థానం ద్వారా ఆదేశాలు కూడా వచ్చి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కానీ సోమిరెడ్డికి ఉచ్చు బిగుస్తుండడంతో ఈ విషయాన్ని వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం సాగిస్తుండడం సిగ్గుచేటుగా ఉందన్నారు. తనకు చెందిన పొలంలో తమ పూర్వీకుల సమాధులను కూడా అప్పట్లో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి ధ్వంసం చేయించారన్నారు. తన పొలానికి సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. తనపై టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. -
ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి ఏ1
తెలుగుదేశం పార్టీలో ఆయనో కీలక నేత. పార్టీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా ఆయన మంత్రి అయిపోయారు. జిల్లా పార్టీలో విభేదాలు తలెత్తినప్పుడు ట్రబుల్ షూటర్గా పనిచేస్తున్నట్టు హడావుడి చేస్తారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిగా జిల్లాలో చక్రం తిప్పిన నేత. ప్రతిపక్ష పార్టీపై అడ్డగోలుగా విరుచుకుపడడం ఆయన నైజం. ఆ బడా నేత ఎవరో కాదు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి. ఆయన ఇప్పుడు ఫోర్జరీ కేసులో ఏ–1గా మారారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రోడ్డు వెంబడి స్థలం కోసం రికార్డులు తారుమారు చేసి ఇతరుల భూమిని తన భూమిగా చూపించే యత్నంలో కోర్టు ఆదేశాలతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. సాక్షి, నెల్లూరు : సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సోమిరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లోనూ కాకాణి చేతిలో మరో సారి సోమిరెడ్డి ఓడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా, తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న ఆ సమయంలో జిల్లాలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. సర్వేపల్లిలోని వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లిలో ఉన్న భూమిపై సోమిరెడ్డి కన్నుపడింది. ఇక్కడి నుంచే చిక్కులు మొదలయ్యాయి. తనది కాని భూమిని తన భూమిగా రికార్డులు మార్పులు చేయించి చెన్నైకు చెందిన వారికి విక్రయించారు. దీంతో ఆ భూమి వారసులు తెరపైకి వచ్చి భూమి తమదని రికార్డులతో సహా గతేడాది నుంచి చూపుతున్నారు. ఎన్నికలకు ముందు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో మంత్రిగా అప్పట్లో సోమిరెడ్డి హవా కొనసాగింది. దీంతో బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆ భూమికి సంబంధించిన వ్యక్తులు కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో న్యాయస్థానం ఆదేశాలతో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. సోమిరెడ్డి భూ అక్రమాలు వెంటాచలం మండలంలోని ఇడిమేపల్లి గ్రామంలో పామర్రు పిచ్చిరెడ్డికి సంబంధించి సర్వే నంబర్ 58లో 13.71 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి పిచ్చిరెడ్డి వారసుల మధ్య ఎలాంటి పంపకాలు జరగలేదు. ఆ భూమిలో వాటర్ బోర్డు భూసేకరణ, రహదారి విస్తరణకు పోను ఇంకా 10.94 ఎకరాల భూమి పిచ్చిరెడ్డి వారసుల ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆ భూమిపై దృష్టి సారించి భూమిలో కొంతభాగాన్ని తన వశం చేసుకోవడానికి పక్కాగా స్కెచ్ గీశారు. దీనికి అనుగుణంగా మీనమ్మ అనే మహిళ వద్ద 58/3 సబ్ డివిజన్లోని 2.36 ఎకరాల భూమిని ఆగమేఘాల మీద నేరుగా తన పేరుతో కొనుగోలు చేసినట్లు రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత దానిని చెన్నై నగరానికి చెందిన వీఆర్ మేఘనాథన్, ఏఎం జయంతిలకు విక్రయించారు. భూమిని కొనుగోలు చేసిన క్రమంలో లేని రికార్డులను సృష్టించడం, సబ్ డివిజన్ కాని భూమిని సబ్డివిజన్ చేయడం, వారసుల అనుమతి లేకుండా కొనుగోలు చేయడంతోపాటు విభజన కాని భూమిలో కొంతభాగం రోడ్డు వెంబడి ఉండే భూమిని కొనుగోలు చేసి రూ.50 లక్షలకు విక్రయించారు. అయితే అధీకృత సర్వేయర్ ద్వారా సర్వే చేయించి దానిలో వారసులకు వచ్చిన వాటాను యథాతథంగా కొనుగోలు చేయవచ్చు. కానీ ఇక్కడ సోమిరెడ్డి మాత్రం ఇవేమి పట్టించుకోకుండా మొత్తం భూమిలో తనకు కావాల్సిన, విక్రయానికి బాగా పనికి వచ్చే భూమిని మాత్రమే తీసుకున్నారు. విభజన కాని ఆస్తిలో ఒక భాగం కొనుగోలు చేయడం సాధ్యం కాదు. చట్టరీత్యా కూడా చెల్లుబాటు ఉండదు. అలాగే అంతటితో ఆగకుండా రెవెన్యూ రికార్డుల్లో కేవలం 2.36 ఎకరాల భూమి కోసం కాని సబ్ డివిజన్ను కూడా చేయడం గమనార్హం. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయ అధికారులు దీనికి పూర్తిగా సహకరించినట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో సోమిరెడ్డి మంతనాలు కోర్టు ఆదేశాలతో వెంకటాచలం పోలీసులు ఈ నెల 27న కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఈ నెల 24వ తేదీన ఆదేశాలు ఇవ్వడంతో 212/2019 నంబర్తో 120బి, 471, 468, 447, 427, 379, 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో కేసులో బెయిల్ కోసం సోమిరెడ్డి న్యాయవాదులతో మంతనాలు మొదలుపెట్టారు. -
ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి
-
సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు
సాక్షి, వెంకటాచలం: అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సాగించిన భూదందాపై కోర్టు ఆదేశాలతో మంగళవారం ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో పామర్రు పిచ్చిరెడ్డికి సర్వే నెంబరు 581 ప్రకారం 8.89ఎకరాలు, 583 ప్రకారం 4.42 ఎకరాలతో మొత్తం కలిపి 13.71ఎకరాల భూమి ఉంది. ఇందులో 10.94 ఎకరాలకు పంపకాలు సరిగా జరగలేదనే వివాదం ఉంది. దీంతో విషయం అప్పట్లో సోమిరెడ్డి దృష్టికి వెళ్లడంతో లేని రికార్డులను సృష్టించారు. సర్వే నంబరు 583 ప్రకారం ఉన్న 2.36 ఎకరాల భూమిని తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత భూమిని చెన్నై నగరానికి చెందిన మేఘనాథన్, ఏఎం జయంతిలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కాగా బాధితుడు ఏలూరు రంగారెడ్డిలో అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు మంగళవారం సోమిరెడ్డితోపాటు వీఆర్ మేఘనాథన్, ఏఎం జయంతి, సర్వేయర్ సుబ్బరాయుడులపై 471, 468, 447, 427, 397 సెక్షన్ల కింద పోలీసలు కేసు నమోదు చేశారు. -
సోమిరెడ్డి..నిజనిర్ధారణ కమిటీకి సిద్ధమా?
నెల్లూరు(సెంట్రల్): మీరు చేస్తున్న ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ వేస్తాం, అందుకు మీరు సిద్ధమాని వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి సవాల్ విసిరారు. మాగుంట లేఅవుట్లోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రభుత్వ అటవీ భూములను కబ్జా చేశారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను అనుచరులకు అప్పగించింది మీరు కాదాని ప్రశ్నించారు. టీడీపీ నేతల చెరలోని అటవీ భూములను ఆ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటే రాజకీయ రంగుపులమడం సిగ్గుచేటన్నారు. అవినీతి పరుల కబంధ హస్తాల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే అభినందించాల్సింది పోయి అనుచరులకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం సిగ్గుచేటన్నారు. నిడిగుంటపాళెంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి విచారణ జరిపించారన్నారు. కంటేపల్లిలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన సెల్టవర్ వ్యవహారంలో మీ పాత్ర లేదాని సోమిరెడ్డిని ప్రశ్నించారు. తమ వైపు తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని, మీరు సిద్ధమాని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు తరిమి కొట్టినా సిగ్గులేకుండా, ఏదో రకంగా వార్తల్లో ఉండాలని ఇటువంటి నీచ పనులు చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లలో సాగించిన దోపిడీ ఎక్కడ బయటపడుతుందోనని సోమిరెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందన్నారు. సర్వేపల్లి నియోజవర్గంలోని బీసీ నేతలంతా సోమిరెడ్డి బాధితులేనన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో బీసీ నేతలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాయకులను ఇబ్బంది పెట్టే సంస్కృతి సోమిరెడ్డిదేనన్నారు. ఐదేళ్ల పాలనలో సోమిరెడ్డి పంచభూతాలను, గుళ్లను సైతం దోచుకున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్న సోమ్మును కక్కిస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటశేషయ్య, చిరంజీవులుగౌడ్, నెల్లూరు శివప్రసాద్, భాస్కర్గౌడ్, ఉప్పల శంకరయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
సోమిరెడ్డి..ఓటమి యాత్ర !
సాక్షి, నెల్లూరు: ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీ నేతలపై నోరుపారేసుకునే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ప్రత్యక్ష ఎన్నికలు కలిసిరావడంలేదు. ప్రజాక్షేత్రంలో ఆయనకు విజయలక్ష్మి కరుణ కరువైంది. ఆయనకు ఎన్నికల్లో విజయం అందని ద్రాక్ష అయింది. గత ఎన్నికల్లో పరాజయం పాలైన సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవి చేపట్టి దొడ్డిదారిన మంత్రి అయ్యారు. నాలుగేళ్ల కాలంలో ఆయన జిల్లాకు చేసిందేమీలేదు. వ్యక్తిగతంగా మాత్రం లాభపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటర్లను, ప్రత్యర్థి పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేసినా ఆయనకు విజయం దక్కలేదు. వరుసగా ఐదోసారి ఎన్నికల రణరంగంలో ఓటమిపాలై సోమిరెడ్డి రికార్డు సృష్టించారు. ‘సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మారు.. నేను తప్పక ఎమ్మెల్యేగా విజయం సాధిస్తా.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా.. త్వరలో జరగబోయే ఎన్నికల్లోగెలిచి నా సత్తా చూపిస్తా’ అంటూ సోమిరెడ్డి బీరాలు పలికారు. సీన్ కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి ఓటర్లు మాత్రం ఆయనకు బైబై చెప్పేసి ఇంటిబాట పట్టేలా చేశారు. నెల్లూరు రాజకీయ చిత్రపటంలో ఇప్పటికే ఐదుసార్లు వరుస ఓటమిలతో డబుల్ హ్యాట్రిక్కు చేరువైన సోమిరెడ్డి ప్రజల మనస్సులు గెలుచుకోవడంలో వెనుకబడిపోయారు. ఉన్న ఎమ్మెల్సీ పదవిని వదులుకొని, ఎమ్మెల్యేగా ఓటమి పాలైన సోమిరెడ్డికి తీవ్రశృంగభంగమైంది. ఐదోసారీ.. నెల్లూరు టీడీపీలో కీలకనేతగా ఎదిగిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రాజకీయ చాణుక్యుడిగా గుర్తింపు పొందారు. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న నెల్లూరులో టీడీపీలోనే కొనసాగుతూనే వచ్చారు. గతంలో పార్టీకి గడ్డుకాలం ఎదురైన రోజుల్లో అన్నీతానై వ్యవహరిస్తూ వచ్చిన సోమిరెడ్డికి చంద్రబాబు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా అవకాశం కల్పించి కీలక బాధ్యతలు అప్పగించారు. కానీ మితిమీరిన అహంకారం ఆయనకు శాపంగా మారి ఆ పార్టీలోనే శత్రుత్వం పెరిగింది. ఆ అహంకారమే ప్రజల్లో చులకన చేసింది. దీంతో ఆయనకు వరుస ఓటములు తప్పలేదు. 1994లో సర్వేపల్లి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సీవీ శేషారెడ్డిపై విజయం సాధించారు. 1999లో కూడా అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీవీ శేషారెడ్డిపై విజయం సాధించి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి జిల్లా అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేక మార్కు వేయలేకపోయారు. ఆపై అతనిని వరుస ఓటములే వెంటాడాయి. 2004, 2009 ఎన్నికల్లో సర్వేపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డితో పోటీపడి ఓటమి చెందారు. అనంతరం వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో నెల్లూరు జిల్లా ఆ పార్టీకి అండగా నిలిచిన నేపథ్యంలో 2012లో జరిగిన కోవూరు ఉప ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థి కరువవ్వడంతో ఆయనే బరిలో నిలిచి తన సమీప బంధువు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆపై 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డిపై పోటీచేసి వరుస పరాజయాలను మూటకట్టుకున్నారు. మంత్రిగా అవినీతిముద్ర 2014 ఎన్నికల్లో ఓటమి చెందిన సోమిరెడ్డి పార్టీలో కూడా పట్టుకోల్పోయారు. బీద బ్రదర్స్ హవా కొనసాగుతుండడంతో ఆయనకు ఇబ్బందిగా మారింది. పార్టీ పొలిట్బ్యూరోలో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన పైరవీలు చేసుకోవాల్సివచ్చింది. అలాగే మంత్రి పదవికి కూడా తీవ్ర పోటీ ఉండడంతో బీజేపీ అగ్రనేతగా ఉన్న వెంకయ్యనాయుడు సిఫార్సుతో మంత్రి పదవి దక్కించుకొని జిల్లాలో అవినీతి మార్కు వేశారు. జిల్లాలో సహజ వనరుల దోపిడీ నుంచి రైతురథంలో కమీషన్లు, ఉపాధిలో దోపిడీ, ఇరిగేషన్ పనుల్లో అక్రమాలతో నిత్యం వార్తల్లో నిలిచారు. అధికారదర్పంతో సిట్టింగ్ ఎమ్మెల్యేను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినా ఆయన మాత్రం ఎదురొడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారికి భరోసా నిచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో అవినీతికి కేరాఫ్గా నిలచిన సోమిరెడ్డిని సర్వేపల్లి ఓటర్లు టాటా చెప్పి ఇంటికే పరిమితం చేశారు. -
సోమిరెడ్డికి కోలుకోలేని షాక్....
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి భంగపాటు ఎదురైంది. మంత్రి సోమిరెడ్డికి ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. వరుసగా అయిదోసారి ఆయన ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాగా మూడు ఎన్నికల్లో ఓటమి వచ్చినా, సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ సోమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలోనే అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. 1999 తరువాత ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయాన్ని నమోదు చేయలేకపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... ఐదోసారి కూడా సోమిరెడ్డికి నిరాశే మిగిలింది. సర్వేపల్లి నుంచి 2004, 2009, 2014లో పోటీ చేసి ఓడిన సోమిరెడ్డి, 2012 ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఓటమి చెందినప్పటికి సోమిరెడ్డి... బాబు వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని ఎమ్మెల్సీ తీసుకొని కేబినెట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి మరీ ఎన్నికలను సవాల్గా తీసుకున్న సోమిరెడ్డికి ఈసారి కూడా ఓటర్లు తమదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చారు. దీంతో ఇక సోమిరెడ్డి రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
సోమిరెడ్డి అత్యుత్సాహం..!
సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యుత్సాహానికి పోయారు. కేబినెట్ మీటింగ్పై ప్రెస్ మీట్ నిర్వహించి మరోసారి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయాలను, సీఎం ఆదేశాలను ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు. కోటి 40 లక్షల రూపాయల పరిహారం రైతులకు ఇవ్వాలని, తాగునీటి విషయంలో ఆర్థిక ఇబ్బందులను చూసుకోవద్దని సీఎం సూచించినట్టు తెలిపారు. కేంద్ర నుంచి రావాల్సిన నరేగా (జాతీయ ఉపాధి హామీ పథకం) నిదులపై అధికారులతో మాట్లాడాని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. ఫొని తుపాన్ వల్ల వ్యవసాయానికి 3 కోట్ల 39 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామని, ఉద్యానవన పంటలకు 2 కోట్ల 95 లక్షల రూపాయలు నష్ట పరిహారంగా ఇవ్వాలని అంచనా కట్టినట్టు వెల్లడించారు. అధికారులతో మాకెప్పుడూ సమస్య లేదని ఈ సందర్భంగా సోమిరెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు మంత్రులు మీడియాతో సమీక్షల వివరాలు చెప్పకూడదనే ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. ఇటీవలే సచివాలయం ఆరుబయట సోమిరెడ్డి ప్రెస్మీట్ నిర్వహించి ఎన్నికల కోడ్ను ఉల్లఘించిన సంగతి తెలిసిందే. ‘పొని’ తుపానుపై సమీక్ష నిర్వహించిన ఆయన అనంతరం ప్రెస్ మీట్ పెట్టారు. -
నిబంధనలు ఉల్లంఘించిన సోమిరెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించారు. సచివాలయం ఆరుబయట మంత్రి ప్రెస్మీట్ నిర్వహించి ఎన్నికల కోడ్ హద్దు మీరారు. ‘పొని’ తుపానుపై సమీక్ష నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో వ్యవసాయశాఖ అధికారులు మంత్రి సోమిరెడ్డిని కలిశారు. గతంలో రెండుసార్లు మంత్రి సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షకు అధికారులు గైర్హాజరైన సంగతి తెల్సిందే. తుపానుపై ఈసీ అనుమతితో ఈరోజు మంత్రికి అధికారులు బ్రీఫ్ చేశారు. మంత్రులు మీడియాతో సమీక్షల వివరాలు మాట్లాడకూడదని నిబంధనలు ఉన్నాయి.. అయినా సచివాలయంలోని గార్డెన్లో సమీక్షల వివరాలను మంత్రి ప్రకటించారు. ఈ విషయంపై ఓ విలేకరి మంత్రిని ప్రశ్నించారు. ఈసీ అనుమతితో సమీక్ష నిర్వహిస్తున్నారా అని ఓ విలేకరి, మంత్రి సోమిరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. దీనికి ఆయన పొంతలేని సమాధానాలు చెబుతూ సమాధానం దాటవేశారు. -
‘ఆయన సోమిరెడ్డి కాదు సోమరిరెడ్డి’
హైదరాబాద్ : మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యవసాయశాఖ సమీక్షలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటల కాలంలో రైతుల బాగుకోసం పనిచేయని మంత్రి అధికారం ముగిసిపోనున్న తరుణంలో సమీక్షలు చేయడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి చురకలంటించారు. వ్యవసాయ సీజన్ ఎప్పుడో కూడా చంద్రమోహన్రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. తుపాన్ పేరుతో డబ్బులు దొబ్బేయడానికే ఈ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘5 ఏళ్లుగా రైతులకు రుణభారాన్ని పెంచారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి ఏనాడూ వ్యవసాయం గురించి, రైతుల సమస్యల గురించి మాట్లాడలేదు. ఆయనొక అసమర్థ మంత్రిగా మిగిలారు. కిరాయి మంత్రిగా పనిచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడానికే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆయన సోమిరెడ్డి కాదు. సోమరిరెడ్డి. చివరి సంక్షోభాన్ని కూడా పిండుకోవడానికి సమీక్షలను అవకాశంగా మార్చుకుంటున్నారు. చివరి అవకాశం కాబట్టి సమీక్షల పేరిట చంద్రబాబు సచివాలయానికి వెళ్తున్నారు’అని గోవర్ధన్రెడ్డి విమర్శలు గుప్పించారు. -
రెండో రోజు కూడా ఝలక్ ఇచ్చారు
-
మంత్రి సోమిరెడ్డికి మరోసారి షాక్!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి వ్యవసాయ శాఖ అధికారులు రెండో రోజు కూడా ఝలక్ ఇచ్చారు. మంత్రి సమీక్షకు బుధవారం కూడా హాజరు కాకుండా ఆయనకు షాక్ ఇచ్చారు. మంత్రి సోమిరెడ్డి నిన్న ఉద్యానవన శాఖ సమీక్ష ఏర్పాటు చేశారు. అయితే ఆ సమీక్షకు వ్యవసాయ శాఖ అధికారులు ఏవరూ హాజరుకాకపోవటంతో ఖంగుతిన్నారాయన. చేసేదేమీ లేక సమీక్షను రద్దు చేసుకున్నారు. ఈ రోజైనా సమీక్ష నిర్వహించాలని భావించిన సోమిరెడ్డి! అధికారులు రావాలని ఆదేశించారు. కానీ నిన్నటి మాదిరిగానే వ్యవసాయ అధికారులు హాజరుకాకపోవటంతో భంగపడ్డ మంత్రి సమీక్ష రద్దు చేసుకున్నారు. నిన్న ఏం జరగింది : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించేందుకు ఆయన మంగళవారం సచివాలయానికి వచ్చారు. సమీక్షకు హాజరు కావాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ప్రత్యేక కమిషనర్ మురళీధర్రెడ్డితోపాటు ఇతర సిబ్బందికి ఆయన కార్యాలయం సమాచారం అందించింది. అయితే, ఎన్నికల కోడ్ ఉండటంతో సమీక్షకు హాజరయ్యే విషయంలో ఎన్నికల సంఘాన్ని అధికారులు స్పష్టత కోరారు. ఈ క్రమంలో మంత్రి సోమిరెడ్డి సమీక్షకు వారు దూరంగా ఉన్నారు. అధికారుల కోసం సచివాలయంలో ఉదయం నుంచి దాదాపు మూడు గంటలపాటు వేచి చూసిన మంత్రి సోమిరెడ్డి.. ఎంతకూ అధికారులు రాకపోవటంతో తిరిగి వెళ్లిపోయారు. తన సమీక్షను అడ్డుకుంటే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, తన సమీక్షకు అధికారులు రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని గతంలో సోమిరెడ్డి ప్రకటించారు. అయినా, సోమిరెడ్డి సమీక్షకు అధికారులు రాకపోవడం.. సమీక్ష జరగకపోవడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, కరువు పరిస్థితులపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని భావించారు. -
మంత్రి సోమిరెడ్డికు ఎదురుదెబ్బ ..
-
మంత్రి సోమిరెడ్డి భంగపాటు.. ఏం చేస్తారోనని ఆసక్తి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి భంగపాటు ఎదురైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించేందుకు ఆయన మంగళవారం సచివాలయానికి వచ్చారు. సమీక్షకు హాజరు కావాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ప్రత్యేక కమిషనర్ మురళీధర్రెడ్డితోపాటు ఇతర సిబ్బందికి ఆయన కార్యాలయం సమాచారం అందించింది. అయితే, ఎన్నికల కోడ్ ఉండటంతో సమీక్షకు హాజరయ్యే విషయంలో ఎన్నికల సంఘాన్ని అధికారులు స్పష్టత కోరారు. ఈ క్రమంలో మంత్రి సోమిరెడ్డి సమీక్షకు వారు దూరంగా ఉన్నారు. అధికారుల కోసం సచివాలయంలో ఉదయం నుంచి దాదాపు మూడు గంటలపాటు వేచి చూసిన మంత్రి సోమిరెడ్డి.. ఎంతకూ అధికారులు రాకపోవటంతో తిరిగి వెళ్లిపోయారు. తన సమీక్షను అడ్డుకుంటే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, తన సమీక్షకు అధికారులు రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని గతంలో సోమిరెడ్డి ప్రకటించారు. అయినా, సోమిరెడ్డి సమీక్షకు అధికారులు రాకపోవడం.. సమీక్ష జరగకపోవడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, కరువు పరిస్థితులపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని భావించారు. -
మీరే చేయించారా సోమిరెడ్డి : శ్రీధర్రెడ్డి
సాక్షి, నెల్లూరు : టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘తిరుమల నాయుడు అనేక పాఠశాలల మీద దాడులు చేశారు. అయితే రౌడీయిజాన్ని నేను సమ్మతించను. ప్రోత్సహించను. మరి వెంకటాచలం మండలంలో పోలింగ్ తర్వాత వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. అందులో మీ హస్తం ఉందా. అవి మీరే చేయించారా’ అని టీడీపీ నేత సోమిరెడ్డిని ప్రశ్నించారు. ‘కావలిలో అనేక దాడులు జరిగాయి. అవన్నీ బీద రవిచంద్ర చేయించాడా..? జనసేన అభ్యర్థి మనుక్రాంత్ రెడ్డికి మద్దతుగా సోమిరెడ్డి పనిచేశారు. రూరల్ టీడీపీ అభ్యర్థి అజీజ్పై సోమిరెడ్డి దొంగ ప్రేమ చూపిస్తున్నారు’ అని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి : ‘ఓటమి భయంతోనే టీడీపీ నేతల విష ప్రచారం’ -
రౌడీలెవరో చూడండి..
సాక్షి, అమరావతి : ఒక పార్టీ అధ్యక్షుడు... రాజకీయ ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణిస్తే ఏమవుతుంది? రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, సంఘ విద్రోహక శక్తులకే ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కుతుంది. అంతేనా? ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ అరాచక శక్తులనే బరిలో దించుతారు. వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేలా అన్ని అడ్డదారులు తొక్కుతారు. ఇక గెలిచాక ఆ అభివన రాక్షసులు జన ధన, మాన, ప్రాణాలు కాజేసే కిరాతకులుగా మారతారు. ఇక ఆ అరాచకానికి అంతుండదు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు జరిగింది ఇదే! తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన చింతమనేని దుశ్శాసనుడిని తలపిస్తే... దళిత మహిళను వివస్త్రను చేసి చితకబాదించిన బండారు సత్యన్నారాయణమూర్తి కాలకేయుడికి ప్రతిరూపంగా నిలిచారు. పోలీసులపైనే దాడులకు తెగబడి జేసీ బ్రదర్స్ శాంతిభద్రతలను అపహాస్యం చేస్తే, యథేచ్ఛగా హత్యలు చేయిస్తూ పోలీసులకే సవాల్ విసిరారు పరిటాల శ్రీరామ్.ఇలాంటి అరాచకవాదులు ఎందరో.. మరెందరో ఉన్న టీడీపీని సాగనంపుదాం.. వారిని ఓటు అనే అంకుశంతో పొడవాల్సిన రోజిదే. అభివన దుశ్శాసనుడు ..చింతమనేని ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ముసునూరు తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టి మరీ ఈడ్చేసిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినవ దుశ్శాసనుడితో పోలికకూ ఇంకాస్త ఎక్కువే. ఇలాంటివాడికి ప్రభుత్వ ‘విప్’గా పదోన్నతి కల్పించి ధృతరాష్ట్రుడికి తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇదే దన్నుగా చింతమనేని చెలరేగిపోయారు. ‘ఎస్సీలు మీకు ఎందుకురా రాజకీయాలు’ అంటూ ఆ సామాజికవర్గ ప్రజలను కించపరుస్తూ దుర్భాషలాడరు. పెదపాడు మండలంలో ఉద్యోగులను ‘నా కొడకల్లారా, మీ అంతు చూస్తా.. తేడా వస్తే కేసులు పెట్టి జైళ్లలో తోయిస్తా’ అని నోరు పారేసుకున్నారు. గతంలో మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత కుమార్పై దాడి చేసిన కేసు సహా తీవ్రమైన నేరారోపణలతో 26 కేసులున్న చింతమనేనికి కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. ఇప్పటికీ ఏలూరు మూడో పట్టణ ఠాణాలో ఇతడిపై రౌడీ షీట్ ఉంది. అలాంటివాడిని దూరం పెట్టాల్సింది పోయి.. ముద్దు చేశారు సీఎం చంద్రబాబు. మళ్లీ టికెట్ ఇవ్వడం ద్వారా నేరగాళ్లకే తాను వెన్నుదన్నుగా నిలుస్తానని చాటుకున్నారు. ...ఈ కౌరవ సంతతి వ్యక్తిని మళ్లీ పవిత్ర అసెంబ్లీకి పంపుదామా? ‘కాలకేయ’ వారసులు..జేసీ బ్రదర్స్ వారి నోరంతా దురుసుతనమే. వారి తీరంతా దుందుడుకే. వారే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి. తమకు లొంగనివారిని ఎంతగా వేధిస్తారో, భయభ్రాంతులకు గురిచేస్తారో తాడిపత్రిలోని ఆశ్రమ ఉదంతమే నిదర్శనం. ఆశ్రమ నిర్వాహకుడితో తలెత్తిన వివాదంలో తనకు సహకరించలేదంటూ దివాకర్రెడ్డి పోలీసులను దుర్భాషలాడుతూ దాడికీ తెగబడ్డారు. తన అనుచరులపై కేసు పెట్టారంటూ తాడిపత్రి ఠాణాకు తాళాలు వేసి పోలీసులపై వీరంగం వేశారు ప్రభాకర్రెడ్డి. సమాజాన్ని రక్షించే పోలీసులపైనే దాడులకు తెగబడ్డారంటే జేసీ సోదరులు సాధారణ ప్రజలను ఏ రీతిలో వేధిస్తారో అర్థం చేసుకోవచ్చు. తాడిపత్రికి తానే రౌడీనంటూ పలుమార్లు సొంత సర్టిఫికెట్ ఇచ్చుకున్న ఘనుడు ప్రభాకర్రెడ్డి. ఈ కాలకేయులకు అన్నివిధాల అండగా నిలిచిన చంద్రబాబు... దివాకర్రెడ్డి తనయుడు పవన్ను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా, ప్రభాకర్రెడ్డి తనయుడు అస్మిత్ను తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించారు. ...ఈ కాలకేయ వారసత్వాన్ని స్వాగతించి, దౌర్జన్యకాండకు మరో బీజం వేద్దామా? అసుర.. అసుర.. రావణ.. పరిటాల శ్రీరామ్ రాజకీయ అరంగేట్రానికి ముందే హత్యలు, హత్యాయత్నాల్లో ప్రధాన భూమిక పోషించడం ద్వారా పరిటాల శ్రీరామ్ తన తండ్రి పరిటాల రవిని మించినవాడినని నిరూపించుకున్నాడు. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ప్రసాద్రెడ్డి అనే వ్యక్తిని హత్య చేయడం, కందుకూరులో రైతు శివారెడ్డిని కిరాతకంగా తుదముట్టించడం, కామిరెడ్డిపల్లి సుధాకర్రెడ్డిపై హత్యాయత్నం కేసుల్లో శ్రీరామ్పై ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఇప్పుడు మంత్రి పరిటాల సునీతను పక్కనపెట్టి మరీ ఆమె కుమారుడు శ్రీరామ్ను రాప్తాడు నుంచి పోటీకి దించారు. తద్వారా వర్గ పోరాటాలకు దగ్గరుండి మరీ ఆజ్యం పోస్తున్నారు. ...ఇలాంటివారికి ఓటేసి రావణ రాజ్యానికి మనమే పునాది వేద్దామా? రాజకీయ విలన్... బాలకృష్ణ ఆయన తెరపైనే హీరో. నిజ జీవితంలో మాత్రం సాధారణ ప్రజలే కాదు... పార్టీ కార్యకర్తలన్నా లెక్క లేదు. ఎక్కడపడితే అక్కడ దాడులకు పాల్పడుతూ ప్రజా జీవితంలో విలన్లా వ్యవహరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సీఎం చంద్రబాబుకు బావమరిది, వియ్యంకుడు కూడా. మూడేళ్ల క్రితం మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తన నియోజకవర్గం హిందూపురానికి చుట్టపుచూపుగా వచ్చే ఈ నందమూరి వారసుడు.. పీఏలతో పాలన నడిపించి అభాసు పాలయ్యారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలోనూ విచ్చలవిడిగా దాడికి తెగబడ్డారు. అయినా ఆయన్ను మరోసారి పోటీకి దించారు చంద్రబాబు. ...రాజకీయాల్లో విలనిజాన్ని నమ్ముకుందామా? మంచివాడికి పట్టం కడదామా? విషపూరిత కోడె నాగు.. కోడెల పైకి ఒకలా కనిపిస్తూ, లోపల ఒకలా వ్యవహరించడం కోడెల శివప్రసాదరావు నైజం. 2004 వరకు నరసరావుపేట నియోజకవర్గంలో ఈయన చేయని దురాగతం లేదు. తన ఇంట్లో బాంబులు పేలిన వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందని భావించి... ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులను తీసుకెళ్తున్న వాహనంపై కిరాయి మూకలతో రాడ్లు, కత్తులతో దాడి చేయించారు. ఈ ఐదేళ్లలో స్పీకర్ హోదాలో కోడెల వ్యవహార శైలి, ఆయన సంతానం అవినీతి, ‘కె’ ట్యాక్స్ తీవ్ర విమర్శల పాలైంది. అయినా సత్తెనపల్లి నుంచి మరోసారి బరిలో దింపారు. ...ఈ ఆశ్రిత పక్షపాత, నిరంకుశ, అవినీతిని ఉపేక్షిద్దామా? ‘నరకా’సురుడు... వరదాపురం సూరి ‘ఎన్నికల్లో గెలిచాక ఆరు నెలలు మీకు స్వేచ్ఛనిస్తా. ప్రత్యర్థుల కాళ్లు విరుస్తారా? నరుకుతారా? మీ ఇష్టం!’ ఇవి ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) మాటలు. రాజకీయ ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి అడ్డు తొలగించుకోవడంలో ఈయన నరరూప రాక్షసుడు ఈ రౌడీ షీటర్. ఇటీవల కార్యకర్తల సమావేశంలో రక్తపాతానికి దారితీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాంటివాడినే ధర్మవరం నుంచి మళ్లీ బరిలోకి దింపారు చంద్రబాబు. ..తాళిబొట్లు తెంపే నర రూప రాక్షసులను మళ్లీ ఎన్నుకుందామా? పేరుమోసిన..కేశినేని నాని ప్రైవేటు ట్రాన్ప్పోర్టు సర్వీసుల వ్యవహారంలో రవాణా శాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యంను దుర్భాషలాడారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. అడ్డుకున్న కానిస్టేబుళ్లపై దాడికీ తెగబడ్డారు. అడ్డగోలు మాటలతో, అహంభావంతో ఊగిపోయారు. విజయవాడ లోక్సభ స్థానం నుంచి మళ్లీ బరిలో దిగారు. .. ఇలాంటి రాజకీయ వ్యాపారులను నమ్మి వారి ప్రయోజనాలకు పావులవుదామా? గూండా నంబర్ వన్ స్వాతంత్య్ర సమర యోధుడి భూమి కబ్జా, అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను ‘రేయ్’ అంటూ సంభోదన, మహిళ ఇంటిని కాజేసే కుట్ర, బ్రాహ్మణ వైద్యుడిపై దాడి... ఇవన్నీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా గూండాగిరీ నిదర్శనాలు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను దుర్భాషలాడిన వ్యవహారంలోనూ బొండా ఉమా పాత్రధారి. ఈ గూండా గిరీ నచ్చిందేమో... మళ్లీ పోటీకి పెట్టారు. ...సంస్కారం లేని ఇలాంటివారిని కొనసాగిద్దామా? అరాచకపతి... యరపతినేని రాజకీయ ప్రత్యర్థులతో పాటు, అడ్డొచ్చినవారిని అధికారం అండగా, పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేయడంలో గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుది ఘన చరిత్ర. గనుల అక్రమ తవ్వక వ్యవహారంపై హైకోర్టులో కేసు వేసిన గురువాచారి అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డారు. కోర్టులు ఎంత హెచ్చరించినా ఈయన అక్రమం ఆగలేదు. గతంలో హత్య కేసు నిందితుడైన యరపతినేని... ఫ్యాక్షన్ రాజకీయాలకూ పెట్టింది పేరు. ఈ అరాచక శక్తిని గురజాల నుంచి మరోసారి పోటీకి దించారు చంద్రబాబు. ..గనులను కొల్లగొట్టిన ఇలాంటి గజదొంగను గెలిపించి మన సహజ వనరులను మన చేతులతోనే నాశనం చేసుకుందామా? స్కాం మంత్రి.. ప్రత్తిపాటి రాజధాని భూములు, అగ్రి గోల్డ్, పత్తి కుంభకోణం ఇలా ఏ ప్రధాన స్కామ్ చూసినా కనిపించే పేరు ప్రత్తిపాటి పుల్లారావు. పత్తి స్కామ్లో లక్షలాది మంది రైతుల కడుపుకొట్టిన ఈ మంత్రి... మట్టి అక్రమ తరలింపులోనూ ముద్దాయే.ఈ వ్యవహారంలో విజిలెన్స్ నుంచి ఇబ్బందులు వస్తాయని వారిస్తే.. ‘విజిలెన్సా? బొచ్చా?’ అంటూ వ్యవస్థలను అపహాస్యం చేశారు. అగ్రిగోల్డ్ భూములను కాజేయడం ద్వారా తాను మంత్రి కాదు జగజ్జంత్రీనని చాటి చెప్పుకొన్నారు. చిలకలూరిపేటలో ఈయన సతీమణి వెంకాయమ్మ ట్యాక్స్ గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు. ..వ్యవస్థలను గౌరవించని ఇలాంటి కుసంస్కారులను ఉపేక్షిద్దామా? కబ్జా కోరు.. బండారు అందాల విశాఖను చెరబట్టిన రాక్షసుల్లో పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఒకరు. భూ కబ్జాల్లో ఈయన రూటే సపరేటు. ఒకనాడు గురువునే మోసం చేసి బీఫారం తెచ్చుకుని రాజకీయ జీవితం ప్రారంభించిన బండారు... ఈ ఐదేళ్లలో కుమారుడితో కలెక్షన్లు మొదలుపెట్టారు. తన రాజకీయానికి అడ్డొస్తే కేసులతో భయభ్రాంతులకు గురిచేశారు. ఎకరా రూ.కోటి విలువైన ముదపాక గ్రామ రైతుల అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ అడ్డుపెట్టుకుని రూ.పది లక్షలకే కాజేసే వ్యూహం పన్నారు. ఇటీవల భూ కబ్జాకు అడ్డొచ్చిన దళిత మహిళను అనుచరుల ద్వారా వివస్త్రను చేయించి చితకబాదించారు. అయినా, కించిత్ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. మళ్లీ పెందుర్తిలో పోటీకి దిగారు. .. పేద రైతుల పొట్ట కొట్టిన ఈ కామందులను నెత్తికెత్తుకుందామా? మద్యం మాఫియా మాయావి.. వెలగపూడి రామకృష్ణ సొంత ఊరిలో హత్యాకాండకు తెగబడి... అక్కడినుంచి పారిపోయి విశాఖపట్నం చేరారు స్థానిక తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. ఈయన పేరు చెబితే గుర్తుకొచ్చేది విజయవాడలో జరిగిన వంగవీటి రంగా దారుణ హత్య. ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో నిరాహార దీక్షలో ఉన్న రంగాను కిరాతకంగా హతమార్చిన బృందంలో వెలగపూడి నిందితుడు. రంగాపై కత్తులతో దాడి చేసినవారిలో ఈయనా ఉన్నారని పోలీసులు కేసు పెట్టడం గమనార్హం. ఆ కేసులో 27వ నిందితుడు వెలగపూడి. అనంతరం విశాఖ వెళ్లిపోయి మద్యం దందాలతో బలపడ్డారు. ప్రశాంత నగరంలో మద్యం మాఫియాకు ఈయనే బాస్. ఎమ్మెల్యే అయ్యాక ఈయన నేతృత్వంలో టీడీపీ వారు సాగించిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ..రక్తపు చేతులతో వచ్చి, రక్తమాంసాలను పీల్చే మద్యం ముఠా కట్టి జనం సొమ్ము కొల్లగొడుతున్న కుహనా నేతను ఇంకా సహిద్దామా? కన్నూమిన్ను కానని కూన రవికుమార్ శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగులు, అధికారులే కాదు... సామాన్యులూ హడలిపోయే పేరు కూన రవికుమార్. ఎన్నికైనది 2014లోనే అయినా... ఆగడాల్లో సీనియర్లను ఆదర్శంగా తీసుకున్నారు. ఎమ్మెల్యే గిరీ రాగానే ఇసుక మాఫియాకు బాస్గా మారారు. వంశధార నది నుంచి రోజూ వందల లారీల్లో విశాఖపట్నం తరలే ఇసుక అక్రమ రవాణాకు రవికుమారే సారథి. మాట వినని అధికారులు, ఉద్యోగులను ఇంటికి పిలిపించి మరీ తనదైన శైలిలో హెచ్చరించి పంపుతారు. ఈయన్నుంచి ఫోన్ వచ్చిందంటే అధికారులు హడలిపోవాల్సిందే. ఈ అక్రమాలను ప్రశ్నిస్తున్న ఎంతోమందిపై తన వర్గీయులతో దాడి చేయించారు. గంగిరెడ్ల శివ అనే యువకుడికి స్వయంగా ఫోన్ చేసి దుర్భాషలాడటమే కాక, ఏకంగా చంపేస్తానని బెదిరించడం జిల్లాలో సంచలనమైంది. ఈ తలబిరుసు, నోటి దురుసు కూనలకు గెలుపనే పాలు పోసి కాటేయించుకుందామా? అచ్చోసిన.. అచ్చెన్నాయుడు ప్రతిపక్షంపై పెద్ద నోరేసుకుని మాట్లాడే మంత్రి అచ్చెన్నాయుడు... నిజంగా ఈ ఐదేళ్లలో అచ్చోసినట్లే ప్రవర్తించారు. తన సమస్య చెప్పుకోవడానికి వచ్చిన మహిళా ఉద్యోగిపై దాడికి తెగబడ్డారు. ఈ వ్యవహారంపై ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈయన అఘాయిత్యాలకు జడిసి ఓ ఉన్నతాధికారి రాష్ట్రమే విడిచి వెళ్లిందంటారు. టెక్కలి నియోజకవర్గంలో పలువురు అధికారులను చాలా సందర్భాల్లో దుర్భాషలాడారు. బెదిరింపులకు పాల్పడ్డారు. చంద్రబాబు టెక్కలి నుంచి మరో సారి బరిలోకి దించారు. ..ఇలాంటి అచ్చోసిన నేతల ఆగడాలను భరిద్దామా? ఎందుకోయి... ఈ కేఈ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటూ, నియోజకవర్గంలో ప్రబల నాయకుడిగా ఎదుగుతున్న చెరుకులపాడు నారాయణరెడ్డిని అతి కిరాతకంగా చంపించాడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు. అతడిని ఈ కేసు నుంచి బయట పడేయడానికి స్వయంగా చంద్రబాబే తీవ్రంగా యత్నించారు. తండ్రి ప్రజాప్రతినిధి అయినా, నియోజకవర్గంలో అంతా తానే అయి నడిపించాడు శ్యాంబాబు. ప్రజలే కాదు.. సొంత పార్టీ కార్యకర్తలూ భయపడేలా వ్యవహరిస్తుంటారు. అలాంటి వాడిని ఏకంగా పత్తికొండ నుంచి బరిలో దించారు. ...తెరవెనుక ఉండే పీకలు కోసిన ఇలాంటివారిని రాజకీయ తెరపైకి ఆహ్వానిద్దామా? కర్కశుడు..కురుగుండ్ల రామకృష్ణ లక్షలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ముడిపడినందున సాధారణంగా రైల్వే శాఖ కాంట్రాక్టులు; వ్యవహారాలు క్రమ పద్ధతిలో సాగుతుంటాయి. అలాంటి చోట కూడా తన వాటా తనకు కావాలంటూ బెదిరింపులకు దిగారు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. శ్రీకాళహస్తి– నడికుడి రైలు మార్గం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వకపోవడంతో కిడ్నాప్ చేసి చితకబాదారు. ఆయన బెదిరింపులు ఏ స్థాయిలో ఉంటాయో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. నియోజకవర్గంలో తహసీల్దార్లు, ఇంజనీర్లపై పలు సందర్భాల్లో దాడులకు తెగబడ్డారు. అయినా మరోసారి బరిలో దించారు. ..బరితెగించిన ఇలాంటివారిని మళ్లీ చట్టసభ మెట్లెక్కిద్దామా? పొలిటికల్ రౌడీ సోమిరెడ్డి ‘మేం చంపాలనుకుంటే కత్తితో గుచ్చడం, గిల్లడం చేస్తామా? ఏకంగా ఏసేయడమే...’ విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందన ఇది. టీడీపీ అసలు స్వభావాన్ని కళ్లకు కట్టిన ఈయనను ఎమ్మెల్సీని చేసి దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే పలుసార్లు ఓడినా... సర్వేపల్లి నుంచి మరో సారి బరిలోకి దించారు. ...ప్రజా బలం లేని ఈ తరహా మూకను ప్రోత్సహిద్దామా? రాక్షస బల్లి.. బొల్లినేని రామారావు నీటి పారుదల ప్రాజెక్టుల పనులు చేయకుండానే భారీఎత్తున ప్రజాధనం కొల్లగొట్టిన వ్యవహారంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మహారాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇదే బొల్లినేని ఇటీవల రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి తహసీల్దార్, ఆర్డీవోలను దుర్భాషలాడుతూ దాడులకు తెగబడ్డారు. అయినా మరోసారి పోటీకి దించడం ద్వారా చంద్రబాబు తన వ్యవహార శైలిని చాటుకున్నారు. ...ఇలాంట మోసగాళ్లను భుజాలపై మోసి మన గౌరవం మనమే తగ్గించుకుందామా? అరాచకుడు... ఎస్వీఎస్ వర్మ అరాచకాలు.. దాష్టీకాలు.. దౌర్జన్యాలకు పేరుగాంచారు ఎస్వీఎస్ వర్మ. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులపైనే దాడికి తెగబడ్డారు. పలువురు ప్రభుత్వ అధికారులను బెదిరించారు. ఈ అరాచక శక్తిని అక్కున చేర్చుకున్న చంద్రబాబు పిఠాపురం నుంచి పోటీకి దించారు. ...అల్ప జీవుల కడుపుకొట్టే అహంకారి మనకు అవసరమా? -
దొంగ ఏడ్పులెందుకో సోమిరెడ్డి చెప్పాలి
తోటపల్లిగూడూరు: రాష్ట్ర మంత్రిగా నియోజకవర్గంలో నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రచారాల్లో దొంగ ఏడ్పులు ఎందుకో సోమిరెడ్డి సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ఆదివారం మండలంలోని వరకవిపూడి పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్రెడ్డి, మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్యగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమానికి స్థానిక పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి కాకాణికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కాకాణి మాట్లాడుతూ సర్వేపల్లిలో వరుసగా మూడుసార్లు వరుస ఓటమిలతో హాట్రిక్ కొట్టిన సోమిరెడ్డి అడ్డదారిలో మంత్రి పదవి పొంది రూ.వందల కోట్లను అక్రమంగా సంపాదించారన్నారు. సర్వేపల్లిలో తానేమి అభివృద్ధి చేశాడో చెప్పకుండా ప్రచారాల్లో దొంగ ఏడ్పులు ఏడుస్తూ గెలిపించి పరువు నిలపాలంటూ ఓటర్లను ప్రాథేయపడడం సోమిరెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసి అభివృద్ధిని విస్మరించిన సోమిరెడ్డిని నాల్గో దఫా కూడా సాగనంపడానికి సర్వేపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే ఐదేళ్లుగా అవినీతి అరాచకాలతో ప్రజలకు చుక్కలు చూపించిన టీడీపీ ప్రభుత్వానికి అవే చుక్కలు చూపించి ఓడించాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆదరించి సీఎంగా ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్రెడ్డి, మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్యగౌడ్, స్థానిక పార్టీ నాయకులు కూరపాక కృష్ణారెడ్డి, చిల్లకూరు శ్రీనివాసులురెడ్డి, కాపులూరు మహేష్రెడ్డి, సుమన్రెడ్డి, గోపాల్రెడ్డి, ధ్రువకుమార్రెడ్డి, ఉప్పల అమరేంద్ర, నిడుగుంట మల్లి పాల్గొన్నారు. -
నేనేమన్నా బ్యాంక్ మేనేజర్నా.. గుమాస్తానా!
-
ప్రతిపక్షంలో పోరాటం... అధికారంలో ఆరాటం...
ముత్తుకూరు మండలంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు తగదని, కాలుష్యం పెరిగిపోతుందంటూ అప్పట్లో వీరోచితంగా పోరాటాలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అధికారంలోకి రాగానే అన్నింటినీ మర్చిపోయారు. ప్రాజెక్టులకు అతి సన్నిహితులయ్యారు. ఎమ్మెల్సీ, వ్యవసాయశాఖ మంత్రి పదవి దక్కించుకొన్న తర్వాత చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలను కూడా అటకెక్కించారు. అవేవీ గుర్తులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. సోమిరెడ్డి రెండు నాల్కల ధోరణిపై ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. సాక్షి, ముత్తుకూరు: రాష్ట్రంలో విద్యుత్ కొరత తీర్చేందుకు, కోతలు నివారించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో విద్యుత్ ప్రాజెక్టులు మంజూరు చేశారు. ముత్తుకూరు మండలంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేశారు. బొగ్గు దిగుమతికి వీలుగా ఉన్న కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీడీపీకి రాని ఆలోచన వైఎస్కి వచ్చిందన్న అక్కసుతో నాడు ప్రతిపక్షంలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి థర్మల్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగించారు. బొగ్గు కాల్చడం వల్ల వచ్చే బూడిద, పొగ, ఇతర వాయువుల మోతాదును గణాంకాలతో వివరిస్తూ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. యాష్పాండ్ల ఏర్పాటుపై పోరాటం చేశారు. చంద్రబాబును తీసుకువచ్చి ముసునూరువారిపాళెంలో సభ పెట్టించారు. అయితే, విద్యుదుత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, పారిశ్రామికాభివృద్ధి కృషి చేయాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్సార్ థర్మల్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేశారు. అధికారంలోకి రాగానే.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎమ్మెల్సీ పదవి దక్కించుకొన్నారు. మంత్రి పదవి పొందారు. థర్మల్ ప్రాజెక్టుల పట్ల వైఖరి మార్చుకున్నారు. ప్రాజెక్టుల నుంచి వెలువడే కాలుష్యాన్ని పట్టించుకోవడం మానేశారు. కాలుష్యం వల్ల పంటలు, గ్రామాలు పాడైపోవడం విస్మరించారు. యాష్పాండ్పై పోరాటాలు చేసిన సోమిరెడ్డి రెండో యాష్పాండ్ నిర్మాణ కాంట్రాక్టును తన వాళ్లకు ఇప్పించుకోవడం కొసమెరుపు. సోమిరెడ్డి హామీలు హుష్కాకి ఏపీ జెన్కో ప్రాజెక్టులో పనిచేస్తున్న 750 మంది కాంట్రాక్టు కార్మికులు తమను పర్మినెంట్ చేయాలంటూ 2017 ఫిబ్రవరిలో వారం రోజులపాటు ధర్నా చేశారు. ఎమ్మెల్సీ హోదాలో ధర్నా వద్ద వెళ్లిన సోమిరెడ్డి 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయిస్తామంటూ హామీ ఇచ్చారు. నేటి వరకు ఈ హామీ నెరవేరలేదు. ఏపీ జెన్కో ప్రాజెక్టు రెండో యాష్పాండ్ నిర్మాణం వల్ల కాలుష్యానికి గురయ్యే దేవరదిబ్బ గిరిజనకాలనీ వాసులకు ప్యాకేజీ అందజేస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ప్యాకేజీ పంపిణీ జరగలేదు. యాష్పాండ్ నిర్మాణం మాత్రం పూర్తయింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నేలటూరు పంచాయతీని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటూ సోమిరెడ్డి హామీ ఇచ్చారు. మాదరాజుగూడూరు వద్ద కాలనీల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఇందుకోసం ప్రాజెక్టులు తమవంతు డిపాజిట్ సొమ్ము చెల్లించాయి. అయితే, ఏళ్లు గడిచినా భూముల ఎంపిక పూర్తిస్థాయిలో జరిపించలేకపోయారు. ఫలితంగా అభివృద్ధికి నోచుకోని నేలటూరు పంచాయతీ త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. గోపాలపురంలో సాధారణ ఉప్పు ఉత్పత్తి మానేసిన లైసెన్సీలకు పరిహారం ఇప్పిస్తామంటూ పలుమార్లు సోమిరెడ్డి హామీలు ఇచ్చారు. లైసెన్సీలను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. పలువురు లైసెన్సీలు కాలం చేస్తున్నప్పటికీ పరిహారం మాత్రం పంపిణీ జరగలేదు. నేలటూరు జెన్కో ప్రాజెక్టు జాతికి అంకితం చేసే సందర్భంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణపట్నం రిలయన్స్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటయ్యే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు ఒక పరిష్కారం చూపుతామని మంత్రి సోమిరెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, కృష్ణపట్నం పోర్టు, పామాయిల్ ఫ్యాక్టరీల్లో స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై టీడీపీ సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. రిలయన్స్ ప్రాజెక్టు మూతపడడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన కృష్ణపట్నం పంచాయతీ ప్రజల సమస్యపై దృష్టి పెట్టలేదు. సీఎస్సార్ నిధులు ఉన్నప్పటికీ కనీసం రిలయన్స్ కాలనీవాసులు కోరుకున్న ఆలయ నిర్మాణం జరగనేలేదు. ఎన్నికల ప్రచారంలో ఈ ప్రధాన అంశాలను చర్చించకుండా, సమస్యలను ప్రస్తావించకుండా ప్రత్యర్థులపై విమర్శలు సంధించేందుకే సోమిరెడ్డి పరిమితమయ్యారు. టీడీపీ వైఫల్యాలు ప్రజలకు గుర్తుకురాకుండా జాగ్రత్త పడుతున్నారు. -
నిజంగా ‘పరీక్షే’
సాక్షి, అమరావతి : ఎంకి పెళ్లి సుబ్బడి చావుకొచ్చిందన్న చందంగా ఎన్నికల సందడి విద్యార్థుల భవిష్యత్తుకు గండంగా మారింది. రాజకీయ నాయకులు నామినేషన్ల సమయంలో చేసే హడావుడితో పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. రాజకీయ నాయకులు తన అనుచరగణంతో పదుల కొద్ది వాహనాలు చేసే ర్యాలీల్లో హారన్ శబ్దాలతో చెవులు వాచిపోతున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అదే సమయంలో రాజకీయ నాయకుల పాదయాత్రలు, ర్యాలీలు మొదలవుతున్నాయి. ఆ సమయంలో రాజకీయ నాయకులు డప్పు వాయిద్యాలు, ఈలలు, కేకలతో మోతమోగిస్తున్నారు. ఈ ర్యాలీలు పదోతరగతి పరీక్షా కేంద్రాల నుంచి పోతున్నప్పుడు అందులో పరీక్ష రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మోతల మధ్య రాతలెలా రా దేవుడా...? అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఒకేసారి రెండు పరీక్షలు... మార్చి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరో పక్క అదే రోజు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఇలా ఒకేసారి విద్యార్థులకు, రాజకీయ నాయకులకు పరీక్షలు మొదలయ్యాయి. మంచి ముహూర్తాలు లేకపోవటమో లేక మరేదైనా కారణమో తెలియదు కాని మొదటి రెండు రోజులు పెద్దగా నామినేషన్ల హడావుడి కనిపించలేదు. బుధవారం నుంచి జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా బుధవారానికి 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నామినేషన్లు దాఖలయ్యాయి. గద్దె నామినేషన్తో ఇక్కట్లు.. విజయవాడ తూర్పు నియోజవకర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్రావు బుధవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఇందులో భాగంగా పటమట లంకలోని కృష్ణవేణి రోడ్డులో తన అనుచరులు చేసిన ర్యాలీతో ఆ రోడ్డులో ఉన్న మూడు పదోతరగతి పరీక్షా కేంద్రాల్లోని విద్యార్థులు తీవ్ర ఆటంకం కలిగింది. వల్లూరి సరోజని ఉన్నత పాఠశాల, సీతారామమ్మ బాలికల పాఠశాల, కృష్ణవేణి హైస్కూల్లు ఉన్నాయి. బుధవారం ఉదయం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి డప్పలు, వాయిద్యాలు, బ్యాండ్సెట్లతో పదుల సంఖ్యలో వాహనాలలో ర్యాలీ ప్రారంభించారు. వీరు చేసిన హడావుడితో పరీక్షా కేంద్రాలలో ఉన్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకనొక సమయంలో కేంద్రాల బయట ఉన్న తల్లిదండ్రులు తెలుగుదేశం నాయకులతో వాగ్వాదానికి దిగారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇలా ప్రవర్తించటం ఏంటంటూ నిలదీశారు. స్వీయ నియంత్రణ అవసరం... పదోతరగతి పరీక్షలు కోసం విద్యార్థులు ఏడాదంతా కష్టపడి చదువుతారు. ఈ పరీక్షలు వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో అడుకుంటూ ర్యాలీలతో ఇబ్బంది పెట్టడం సరైంది కాదని రాజకీయ నాయకలు గుర్తించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి వాటిని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం కన్నా నాయకులే స్వీయ నియంత్రణ పాటించటం ఉత్తమమని చెబుతున్నారు. పరీక్షా కేంద్రాల ఇరువైపులా వంద మీటర్ల మేర ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ముందుకుసాగి విద్యార్థులకు సహకరించాలని విన్నవిస్తున్నారు. -
ఐదేళ్లు..ఐదొందలకోట్లు.!
సాక్షి, నెల్లూరు: గూడూరు డివిజన్లోని సముద్రతీర ప్రాంతంలో చిల్లకూరు, కోట మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల వరకు సిలికా భూములు విస్తరించి ఉన్నాయి. ఆయా భూముల్లో ఉన్న సిలికాపై జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశిం సునీల్కుమార్ కన్నేసి ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మైనింగ్కు అనుమతులు ఉన్న యజమానుల వద్ద లీజుల పేరుతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. చిల్లకూరు మండలంలో సుమారు 60 మైన్లు, కోట మండలంలో సుమారు 11 మైన్లను లీజుకు తీసుకున్నారు. వీటిలో ఇప్పటికే కొన్నింటికి కాలపరిమితి మించిపోయి ఉండగా కొన్నింటికి ఇంకా పదేళ్ల వరకు తవ్వకాలు చేసుకునే వీలుంది. దీనిని ఆసరా చేసుకున్న అధికారపార్టీ నాయకులు లీజుదారులను ప్రలోభపెట్టి వారి మీదనే మైన్లు ఉండగా అగ్రిమెంట్లు మీద మైన్లు సొంత చేసుకున్నారు. రూ.500 కోట్ల దోపిడీ సిలికా మైన్స్ లీజు పేరుతో కొన్ని, కాలపరిమితి అయినపోయిన మరికొన్ని మైన్స్ యజమానులను అదిరించి, బెదిరించి సొంతం చేసుకున్న అధికారపార్టీ నేతలు ఐదేళ్లపాటు యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. మైన్లో పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో లోతైన గుంతలతోపాటు చెరువులను తలపించేలా భారీ యంత్రాలతో తవ్వేశారు. మొత్తం మీద 71 మైన్స్ ద్వారా సిలికాను తవ్వేసి నిత్యం 500 వాహనాలతో తరలించేవారు. చెన్నై, బెంగుళూరు, ముంబాయి, హైదరాబాద్, పూనే ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు తరలించేవారు. దీంతోపాటుç పక్క రాష్ట్రాల్లో పెద్ద భవంతుల నిర్మాణాలకు ఇసుక బదులుగా సిలికాను తరలించి సొమ్ము చేసుకున్నారు. సిలికా ఇసుకను పోలి ఉండడంతో దీనిని ఇసుకగా చూపి విక్రయించారు. దీంతో ఇక్కడ టన్ను రూ.600 వంతున దొరికే సిలికాను పక్క రాష్ట్రాల్లో టన్ను రూ.3 వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రోజుకు సుమారు 500 లారీల వరకు సిలికాను తరలించేవారు. ఇలా ఐదేళ్లపాటు సిలికా తరలింపు ద్వారా దాదాపు రూ.500 కోట్ల వరకు నేతల జేబుల్లోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కావడంతో గనులశాఖ అధికారులు సైతం సిలికా అక్రమ రవాణాకు రాచబాట వేసి వారిచ్చే నెలవారీ మామూళ్లతో సరిపెట్టుకున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలు తూట్లు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు తూట్లు పొడిచేలా సిలికా మైన్స్లో దోపిడీ సాగింది. అనుమతులు ఉన్న మైన్స్కు హద్దులు ఏర్పాటు చేసి 10 అడుగులకు మించి తవ్వకాలు చేపట్ట వద్దని గతంలో ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అధికారపార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కావడంతో వారు నిబంధనలు పాటించకున్నా అధికారులు పట్టించుకోలేదు. 10 అడుగులకు మించి గోతులు తీయకూడదనే నిబంధన ఉన్నా 40 అడుగుల తోతైన గుంతలు తవ్వేశారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పూర్తిగా పడిపోయింది. అంతేకాదు కాలుష్యం వెదజల్లి భూగర్భజలాలు కలుషితమయ్యాయి. సాగు, తాగునీటికి కటకట సిలికా గనుల నుంచి వచ్చే ఊట నీటితో సొనకాలువలు ఎప్పుడూ నీటితో నిండి ఉండేవి. టీడీపీ పెద్దలు గనులను లీజులు తీసుకున్న తరువాత మండలంలో పలు గ్రామాలకు తాగు, సాగు అందించే 13 సొన కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో దాదాపు ఆయా కాలువల ద్వారా సాగయ్యే 2 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన దుస్థితి నెలకొంది. ఐదేళ్లపాటు కాలువలు ఎండి ఆ ప్రాంత రైతుల భూముల్లో పంటలు సాగు చేసుకోలేకపోయారు. సాగునీరుతోపాటు తాగునీటికి అష్టకష్టాలు పడ్డారు. వేసవి వస్తుందంటే తాగునీటికి ఆయా గ్రామస్తుల ఇబ్బందులు అన్నీఇన్నీకావు. -
‘అంతు తేలుస్తా.. లోపలేయిస్తా’
పొదలకూరు: ‘మీకు ఎంత దమ్ము, ధైర్యం ఉంటే మా సీఎంకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడతారు. ఒక మంత్రి వస్తున్నాడన్న మర్యాద, భయం లేకుండా ప్రవర్తిస్తారా? మీ అంతు తేలుస్తా, ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి, లేదంటే లోపలేయిస్తా. మీ ఎమ్మెల్యే రౌడీషీటర్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు.’ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మండల పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై శివాలెత్తి చేసిన వ్యాఖ్యలివి. అంతటితో ఆగకుండా బిరదవోలు పంచాయతీ కల్యాణపురంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ద్వారా గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎప్పుడో ఏర్పాటుచేసిన ‘నిన్ను నమ్మం బాబు’ ఫ్లెక్సీలను తొలగించారు. ఎన్నికల నిబంధనలు త్వరలో అమలవుతున్న తరుణంలో మంత్రి మండలంలో బుధవారం సుడిగాలి పర్యటనలు చేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మరుపూరు, చాటగొట్ల, పొదలకూరు, అంకుపల్లి, పార్లపల్లి, బిరదవోలు, కల్యాణపురం, విరువూరు, సూరాయపాళెం గ్రామాల్లో సిమెంట్రోడ్లు, మంచినీటి పథకాలను ప్రారంభించారు. అయితే మంత్రి పర్యటనలో గ్రామాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూశారని నాయకులు తెలిపారు. కల్యాణపురంలో అనుచిత వ్యాఖ్యలు కల్యాణపురం వైఎస్సార్సీపీకి కంచుకోటగా తయారైంది. ఇక్కడ టీడీపీలో పాతికేళ్లపాటు ఉన్న అక్కెం బుజ్జిరెడ్డి గతేడాది వైఎస్సార్సీపీలో చేరి ఎమ్మెల్యే కాకాణితో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గ్రామానికి వెళ్లి పరోక్షంగా బుజ్జిరెడ్డిని ఉద్ధేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసులను దగ్గర పెట్టుకుని ఫ్లెక్సీలను తొలగించడంతోపాటు, ఎమ్మెల్యే రౌడీలను వెనకేసుకుని తిరుగుతున్నాడన్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రసంగించి వెళ్లారని గ్రామస్తులు వెల్లడించారు. తమ గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేయకున్నా ఎప్పుడో నీరు – చెట్టు పథకంలో చేసిన పనికి శిలాఫలం వేసుకుని వెళ్లారని తెలిపారు. సగం పూర్తయిన పనులకు శంకుస్థాపనలు పొదలకూరులో అన్న క్యాంటీన్ భవనం బేస్మట్టం పూర్తై పిల్లర్లు నిర్మాణంలో ఉండగా దానికి మంత్రి శంకుస్థాపన చేశారు. చాటగొట్లలో నాలుగేళ్ల క్రితం పూర్తయిన విద్యుత్ సబ్స్టేషన్ను తిరిగి ప్రారంభించారు. గతంలో సీఈ సబ్స్టేషన్ను ప్రారంభించినప్పటికీ. మంత్రి మళ్లీ ప్రారంభించడాన్ని చూసి అధికారులు, ప్రజలు ఆశ్చర్యపోయారు. అంకుపల్లి హరిజనవాడలో 60 శాతం పనులు పూర్తైన వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. బిరదవోలులో సీసీ రోడ్లకు శిలాఫలం నిర్మించకుండానే దిమ్మెకు ఆనించి ప్రారంభించడం విశేషం. ఎన్నికల కోడ్ వస్తుందని మంత్రి హైరానా పడుతూ శిలాఫలాలు వేసుకుంటూ వెళుతున్నారని ఆయా గ్రామాల్లో ప్రజలు చర్చించుకున్నారు. -
మంత్రి సోమిరెడ్డికి ఊహించని షాక్!
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీతో పాటు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి అవినీతి...అక్రమాలు సహించలేకే పలువురు టీడీపీని వీడుతున్నారని అన్నారు. కాగా ఇప్పటికే సోమిరెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. మరోవైపు జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో రామతీర్థం మాజీ శివాలయం చైర్మన్ శ్రీనివాసులు, కరుణాకర్, మురళితో పాటు పలువురు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. -
టీడీపీలో రాజకీయ డ్రామా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో ఎన్నికల హీట్ నెల్లూరును పూర్తిస్థాయిలో తాకింది. సీట్ల సర్దుబాట్లు, అసంతృప్తులకు బుజ్జగింపులు, అలకలు హడావుడి తారస్థాయికి చేరింది. పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు శుక్రవారం రాజకీయ డ్రామాకు తెర తీశారు. నగర మేయర్ అబ్ధుల్ అజీజ్ను ఎమ్మెల్సీ హామీతో టికెట్ రేస్ నుంచి చక్కగా తప్పించారు. సర్వేపల్లి నుంచి పోటీకి సిద్ధమవుతున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరో మంత్రి నారాయణ పదవీ కాలం కూడా కొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఆయన కూడా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసేందుకు దాదాపు ఖరారు కావడంతో ఈ రెండు ఎమ్మెల్సీ పదవులను ఒకటి అజీజ్, మరొకటి ఇంకో నేతకు ఇచ్చి అసంతృప్తులను శాంతింప చేసే అవకాశం ఉందనే ప్రచార బలంగా సాగుతోంది. మరో తిరుగుబాటు నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పార్టీ నేతలతో నిమిత్తం లేకుండా కోవూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పర్వం మొదలు పెట్టారు. మొత్తం మీద టీడీపీలో జిల్లా రాజకీయం పూర్తి స్థాయిలో వేడెక్కింది. రెండు రోజులుగా అధికార పార్టీలో కీలకంగా సాగుతున్న పరిణామాలు శుక్రవారం ఒక కొలిక్కి వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసమ్మతి నేతల్ని బుజ్జగించటమే లక్ష్యంగా పదవుల ఎర వేస్తున్నారు. రెండు రోజుల క్రితం కొందరు నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. కొందరు ద్వితీయశ్రేణి నేతలు తమ సంగతి ఏంటని పార్టీ ముఖ్యుల్ని నిలదీశారు. దీని కొనసాగింపులో భాగంగా శుక్రవారం అమరావతిలో నెల్లూరు రాజకీయ మంత్రాంగం బలంగా నడిచింది. మరో వైపు పదవీ కాలం రెండేళ్లు ఉన్న సర్వేపల్లి టికెట్కు పదవీ గండంగా మారుతుందనే యోచనతో మంత్రి సోమిరెడ్డి రాజీనామా చేశారు. అయితే జిల్లాలో మరి కొందరికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున సీఎం రాజీనామా చేయించారనే ప్రచారం బలంగా సాగుతోంది. రాజీనామా చేసిన తర్వాత సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన పదవి వేరే నేతలకు ఉపయోగపడితే మంచిది కదా అని వ్యాఖ్యానించటం గమనార్హం. మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ నగర మేయర్గా ఉన్న అబ్దుల్ అజీజ్ నగర ఎమ్మెల్యే టికెట్ హామీతో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయి మేయర్గా కొనసాగుతున్నారు. నగర టికెట్ మంత్రి నారాయణకు, రూరల్ టికెట్ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డికి కేటాయించిన క్రమంలో నగర మేయర్ అనుచరగణం, మైనార్టీ నేతలు నగరంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి టీడీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎంను కలవాల్సిందిగా నగర మేయర్కు పిలుపు వచ్చింది. సీఎంను కలిసినప్పుడు ఎన్నికల ముందే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనికి అనుగణంగా మంత్రి సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, మరో 20 రోజుల్లో మంత్రి నారాయణ పదవీ కాలం ముగియడంతో అజీజ్కు దక్కే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీగా అవకాశం రాగానే అజీజ్ నగర మేయర్ పదవికి రాజీనామా చేయాలి. మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై చర్చ మొదలైంది. ప్రచార పర్వంలో అసమ్మతి నేత మరో వైపు శుక్రవారం కోవూరు టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి విలేకరుల సమావేశ నిర్వహించి కోవూరు నుంచి పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఇక్కడ టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి తనకు మధ్య పార్టీ నేతలు చేసిన ఒప్పందం ప్రకారం అవకాశం ఇవ్వాలని రాని పక్షంలో అయినా తాను పోటీలో నిలుస్తానని ప్రకటించుకున్నారు. దీని కొనసాగింపుగా జొన్నవాడలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. దీంతో కోవూరు టీడీపీలో రాజకీయ గందరగోళం రేగింది. -
సాక్షి విలేకరిపై మంత్రి సోమిరెడ్డి చిందులు
సాక్షి, అమరావతి : సాక్షి టీవీ ప్రతినిధి సతీష్పై మంత్రి సోమిరెడ్డి చిందులు తొక్కారు. అన్ని ప్రశ్నలు మీరే ఎందుకు అడుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వేరే విలేకరులు కూడా ఉన్నారు కదా అంటూ చిర్రుబుర్రులాడారు. రైతు భరోసా కింద కేంద్రం ఇస్తున్న సాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని కలిపి మొదటి విడతగా రూ. ఐదువేలు చెక్కు ఒక్కో రైతుకు ఇస్తున్నట్లు మంత్రి చెప్పగానే.. విలేకరి జోక్యం చేసుకుంటూ రబీ పూర్తయింది, ఖరీఫ్ పంట వేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుంది. ఇప్పుడు ఎందుకు రైతులకు చెక్లు ఇస్తామంటున్నారని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నేనెందుకు సమాధానం చెప్పాలంటూ వేరే అంశంపై మాట్లాడారు. ఈ ఘటన బుధవారం సచివాలయంలోని రెండో బ్లాక్ వద్ద మీడియాతో మంత్రి మాట్లాడుతున్నప్పుడు జరిగింది. -
సాక్షి ప్రతినిధిపై మంత్రి సోమిరెడ్డి చిందులు
-
నా ఇష్టం.. మీకు సమాధానం చెప్పను
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం మీడియాపై చిందులు తొక్కారు. అన్నదాత సుఖీభవ పథకానికి వచ్చే ఏడాది బడ్జెట్లో కేటాయింపు జరపడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీకు సమాధానం చెప్పాల్సిన నాకు అవసరం లేదు. నాకు ఇష్టమైతేనే సమాధానం చెబుతా’ అంటూ మండిపడ్డారు. రైతులకు కేంద్రం ప్రకటించిన రూ.6వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రైతులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి, డబ్బులు మాత్రం ఏప్రిల్ తరువాతే ఇవ్వనుంది. ఈ విషయం గురించి విలేకరులు ప్రశ్నించగా సోమిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వచ్చే నెల బడ్జెట్కి ఇప్పుడు చెక్కులిస్తారా అన్న ప్రశ్నకు నీళ్లు నమిలారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయారు. రైతులను మభ్యపెట్టే యత్నం ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా కేబినెట్ సమావేశం పెట్టి చంద్రబాబు సర్కారు పలు నిర్ణయాలు తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకానికి ఆమోదం తెలిపి, పోస్ట్ డేటెడ్ చెక్కులతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలలోని రైతు భరోసాను కాపీ కొట్టి, వచ్చే ఏడాది పథకానికి కేబినెట్ ఇప్పుడు ఆమోదం తెలపడం గమనార్హం. పోస్ట్ డేటెడ్ చెక్కులతో ఇప్పటికే డ్వాక్రా మహిళలను ప్రభుత్వం మోసం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి మోసాలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి. -
ఆదాలకు కోపమొచ్చింది!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి మళ్లీ ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీరుపై మరో మంత్రి నారాయణ వద్ద మండిపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన తనకుతెలియకుండా నెల్లూరు రూరల్ సమావేశం ఎలా నిర్వహిస్తారని, అంత హడావుడిగా సమావేశం జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంగళవారం రాత్రి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి నివాసంలో మంతనాలు జరిపారు. ఈ నెల 9న నెల్లూరు నగరంలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించుకుంటున్నామని నేతలు చెబుతున్నప్పటికీ జిల్లాలో అధికారపార్టీ అభ్యర్థులు, టిక్కెట్ల వ్యవహారంపై మంతనాలు సాగిస్తుండడం గమనార్హం. మరోవైపు గతంలో తాను నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లిలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం బలంగా సాగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆదాల ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై సృష్టత లేదు. దీంతో మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రలు వరుసగా సోమ, మంగళవారాల్లో జరిగిన భేటీలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపైనే చర్చ సాగినట్లు సమాచారం. సోమిరెడ్డికి రూరల్లో ఏం పని? వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారు. దీనికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేత తాళ్లపాక అనురాధ హాజరయ్యారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కసరత్తు చేస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో ఏం పని ఉందంటూ మాజీ మంత్రి ఆదాల జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా రూరల్ నియోజకవర్గానికి ఇన్చార్జ్గా ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆయన సమావేశాలు నిర్వహించడం, హడావుడి చేయడం ఏంటని నిలదీశారు. వీటన్నింటిపై సీఎంతో మాట్లాడి ఆయన వద్దే తేల్చుకుంటానని చెప్పినట్లు సమాచారం. జిల్లాలో టిక్కెట్లు కూడా మంత్రి సోమిరెడ్డి, మరికొంత మంది ఇచ్చేట్లు మాట్లాడుతూ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని, రోజుకో నేత నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారని వారే ప్రచారం చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని సీఎం పర్యటన సమయంలో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించాలని కోరి అప్పుడే అన్నీ తేల్చుకుంటానని ఆదాల సృష్టం చేసినట్లు సమాచారం. -
సోమిరెడ్డికి కమీషన్ల మీదే ధ్యాస
నెల్లూరు , మనుబోలు: డేగపూడి–బండేపల్లి లింక్ కెనాల్ విషయంలో మంత్రి సోమిరెడ్డికి రైతుల శ్రేయస్సు కన్నా కమిషన్ల మీద ధ్యాస ఎక్కువగా కనిపిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్రాంచ్ కెనాల్ కింద 12,500 ఎకరాలు సాగవుతుందని, అది ఎండిపోయే పరిస్థితిలో ఉండడంతో వెంటనే నీళ్లందించి కాపాడాలంటే రూ.30 కోట్ల కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో మెగా కంపెనీకి ఇస్తే వారు వెంటనే పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తారని చీఫ్ ఇంజినీర్ చేత ప్రభుత్వానికి ఉత్తరం రాయించారని తెలిపారు. వాస్తవానికి ప్రస్తుతం బండేపల్లి బ్రాంచ్ కెనాల్ పరిధిలో సెంటు భూమిలో కూడా పంటలు సాగు చేయడం లేదని పేర్కొన్నారు. నామినేషన్పై పని ఇచ్చేందుకు ఒప్పుకోకుండా ప్రభుత్వం తిప్పి పంపిందన్నారు. అనుకూలమైన కాంట్రాక్టర్కు ఇచ్చేందుకు ఆన్లైన్లో బ్యాంక్ గ్యారెంటీ తీసుకోకుండా ఆ ఆప్షన్ను ఎత్తేశారని తెలిపారు. మొదట 28 తేదీకి టెండర్ పిలిస్తే అనుకూలమైన కాంట్రాక్టర్ దొరకకపోవడంతో దాన్ని రద్దు చేయించి రెండో తేదీకి మార్పించారని తెలిపారు. ఓ వైపు ఆలస్యమయిపోతుందంటూనే 28వ తేదీ నుంచి రెండో తేదీకి ఎందుకు మార్పించారని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు పూర్తయ్యాక ప్రారంభోత్సవం చేయాల్సిన సమయంలో శిలాఫలకాలు వేయడానికి సిగ్గుండాలన్నారు. రెండో తేదీ ఇరిగేషన్ ఎస్సీని కలిసి లింక్ కాలువ పనులు వెంటనే ప్రాంభించకుంటే దాని పర్యవసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతామన్నారు. మళ్లీ పనులు వాయిదా వేస్తే ఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామన్నారు. ఇప్పుడు చేయకపోతే తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు కాలువ పూర్తి చేసి సాగునీరు అందిస్తామని మరోమారు స్పష్టం చేశారు. ఆయన వెంట మండల ఉపాద్యక్షుడు తురిమెర్ల రఘురాంరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, చిట్టమూరు అజయ్రెడ్డి, మన్నెమాల సాయిమోహన్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, చేరెడ్డి రామిరెడ్డి, దాసరి భాస్కరగౌడ్, నారపరెడ్డి కిరణ్రెడ్డి, జట్టి సురేందర్రెడ్డి ఉన్నారు. -
వైఎస్సార్సీపీలో మంత్రి సోమిరెడ్డి బావ..
సాక్షి, హైదరాబాద్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి స్వయానా బావ అయిన కేతిరెడ్డి రామకోటారెడ్డి బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. రామకోటారెడ్డి తన అనుచరులతో కలసి బుధవారం హైదరాబాద్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలసి పార్టీలో చేరాలన్న అభీష్టాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కోటారెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులు శశిధర్రెడ్డి, కళాధర్రెడ్డికి కూడా జగన్ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. రామకోటారెడ్డి దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ కావలి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర నిర్వహించారు. కావలి పట్టణ టీడీపీ అధ్యక్షునిగానూ, సాగునీటి సంఘం చైర్మన్గానూ సేవలందించారు. జిల్లాలో బంధువర్గమున్న కోటారెడ్డి టీడీపీని వీడటం ఆ పార్టీకి దెబ్బేనని భావిస్తున్నారు. చేరిక కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం రామకోటారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల ప్రయోజనాలకోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం అభినందనీయమని, ఆయన ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తానే కాదు, ప్రజలంతా గట్టిగా విశ్వసిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన కాంగ్రెస్తో సీఎం చంద్రబాబు జతకట్టి రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని, అందువల్లనే తాను పార్టీలో చేరానని చెప్పారు. జగన్ ప్రకటించిన నవరత్నాల కార్యక్రమం పట్ల ఆకర్షితులమై తన తండ్రితోపాటు వైఎస్సార్సీపీలో చేరామని ఆయన తనయులు కేతిరెడ్డి కళాధర్రెడ్డి, శశిధర్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాల్ని చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఎన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో ఆయనకు భంగపాటు తప్పదన్నారు. ఏ పల్లెకు వెళ్లినా నిన్ను ‘నమ్మం బాబూ...’ అంటూ నినదిస్తున్నారన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన రామకోట సుబ్బారెడ్డి
-
ఏపీ మంత్రి సోమిరెడ్డికి షాక్..!
సాక్షి, హైదరాబాద్ : ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన సొంత బావ కేతిరెడ్డి రామకోటారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో రామకోటారెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ కేంద్రకార్యాలయం లోటస్పాండ్లో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. రామకోటారెడ్డితో పాటు ఆయన కుమారులు శశిధర్రెడ్డి, కళాధర్రెడ్డి కూడా పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామకోటారెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరి భర్త. -
కొండెక్కిన ధాన్యం కొనుగోళ్లు
ప్రభుత్వ ఆదేశాలు లేవంటున్నారు.. అయ్యా...మాది పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు. మా ఊళ్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు కొని 20 రోజులు దాటింది. ఎందుకు ఆపారో తెలియదు. అదేమంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం లేదంటున్నారు. పంట పండించినా, పండించక పోయినా కష్టాలు తప్పడం లేదు. మా గోడు వినేవారే లేరు. ఎక్కడ చావమంటారయ్యా? – శ్రీనివాస్ (కౌలు రైతు) తిప్పి పంపిస్తున్నారు.. తూర్పు గోదావరి జిల్లాలోని 16 మండలాల్లో 294 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఘనంగా ప్రకటించారు. ధాన్యాన్ని ఎప్పుడు తీసుకువెళ్లినా ఏదో ఒక వంకతో తిప్పి పంపిస్తూనే ఉన్నారు. – పి.ప్రసాద్ (రైతు, పిఠాపురం) సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి డెల్టాలో ఏ మూలకు వెళ్లినా ధాన్యం పండించే రైతుల గోడు ఇదీ. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలలు దాటినా అధికారిక లెక్కల ప్రకారమే సగానికి కూడా మించలేదు. ఖరీఫ్లో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్టు గత నవంబర్ 13న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి ప్రకటించగా ఆదివారం నాటికి 19.72 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నట్టు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇందులో సగానికిపైగా మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేసిందే ఉంది. మరోవైపు అక్టోబర్– నవంబర్ నాటికే 1,500 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 1,332 మాత్రమే ఏర్పాటయ్యాయి. బస్తాకు రూ.200 దాకా నష్టపోతున్న రైతులు.. నిబంధనల ప్రకారం మహిళా స్వయం సహాయక సంఘాలు (వెలుగు), పీఏసీఎస్, డీసీఎంఎస్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. ప్రతి కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉండాలి. ధాన్యం విక్రయించే రైతుల ఖాతాల్లోకి ఆన్లైన్లో నేరుగా డబ్బు జమ చేయాలి. రైతులకు రవాణా ఖర్చులు కూడా చెల్లించాలి. ఒకవేళ మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేస్తే కనీస మద్దతు ధర ఇవ్వాలి. మిల్లర్లు కూడా రైతులకు ఆన్లైన్ లేదా చెక్కుల రూపంలో చెల్లించాలి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు దారుణంగా ఉన్నాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం 75 కిలోల వడ్ల బస్తాకు గరిష్టంగా రూ.1,312 చొప్పున ధర పలకాల్సి ఉంటే రైతులకు దక్కింది వేయి, రూ.1,150 మధ్యే ఉండటం గమనార్హం. దీంతో రైతులు బస్తాకు కనీసం రూ.రెండు వందలు దాకా నష్టపోతున్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,790, సాధారణ రకాన్ని రూ.1,750 చొప్పున కొంటామని మంత్రి సోమిరెడ్డి గతంలో చెప్పారు. 20 రోజులుగా మూత... రైస్ మిల్లర్లతో సయోధ్య కొరవడడంతో గత 20 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. 2018–19 ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి 86.17 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 45 లక్షల టన్నులే కొనుగోలు చేయాలని నిర్ణయించడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ధాన్యం కేంద్రాలలో కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లర్లు మర ఆడించి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ధాన్యం కేంద్రాలలో క్రయ విక్రయాలు ఆగిపోవడంతో ఎక్కడి సరకు అక్కడ నిలిచిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కమీషన్ ఏజెంట్లు పెద్దఎత్తున ధాన్యాన్ని తక్కువ రేటుకు కల్లాల్లోనే కొంటూ లబ్ధి పొందుతున్నారు. రైతు సంఘాలు ఈ వ్యవహారాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) సక్రమంగా అందాలంటే విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఎంటీయూ 1010 రకం కొనరట! తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పండించే ఐఆర్ 64, ఎంటీయూ 1010, 1001 రకాలను కొనుగోలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా చెబుతోంది. ధాన్యం కేంద్రాలలో ఈ రకాన్ని కొనుగోలు చేయడం లేదు. ఈ రకం ధాన్యాన్ని రాష్ట్రంలో తినరని పేర్కొంటూ బహిరంగ మార్కెట్, ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవాలని సూచించడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దగాకు రుజువు... ’పెథాయ్ తుపానుతో తడిసిన ధాన్యాన్ని కొంటామని మంత్రులు మొదలు ముఖ్యమంత్రి వరకు అంతా చెప్పారు. కృష్ణా జిల్లాలోని ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం నుంచి మార్చిన నిబంధనలు రాలేదు. మేం ఏమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు. సర్కారు దగాకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?’ – పి.జమలయ్య (కౌలు రైతుల సంఘం నేత) -
రైతుల పేరుతో దోపిడీయే అభివృద్ధా
నెల్లూరు(సెంట్రల్): రైతుల పేరు చెప్పి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దోచుకోవడమే అభివృద్ధా? అంటూ వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండేపల్లి కాలువ అభివృద్ధి అనేది స్థానిక రైతుల కలని పేర్కొన్నారు. ఈ కాలువ అభివృద్ధికి తాను ప్రజాప్రతినిధిగా అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే రైతుల సమస్యలు పరిష్కరించకుండా, కాలువను అభివృద్ధి చేయకుండా ఆ వంకతో రూ.కోట్లు దోచుకోవాలని చూస్తే మాత్రం సహించనని హెచ్చరించారు. దివంగత మహానైత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల కోసం ఎంతో చేశారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతుల కోసం పాటుపడుతున్నారని వెల్లడించారు. హామీ ఏమైంది? మనుబోలు మండలం బండేపల్లి కాలువ కింద 12500 ఎకరాల వరకు సాగుచేసుకునేందుకు వీలుందని, అయితే కాలువలో నీటి వసతి లేక పోవడంతో రైతులు సాగును ఆపేశారన్నారు. బండేపల్లి కాలువను పూర్తి చేసి నీరు ఇచ్చిన తర్వాత రానున్న ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని, 2014 ఎన్నికల సమయంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న సోమిరెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లయినా ఇప్పటివరకూ పనులు చేయలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడిగా టెండర్లు వేసి పనులు చేస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లఘించి టెండర్లా? టెండర్లు వేయాలంటే నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు దాటితే టెండర్లు పిలవాలని, కానీ బండేపల్లి కాలువకు సంబంధించి రూ.31 కోట్ల పనులకు షార్ట్ టెండర్ల పేరుతో దోచుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. నిబంధనల ప్రకారం టెండర్లు వేస్తే రూ.12 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుందన్నారు. కాని సొంత కాంట్రాక్ట్ పనులు కోసం నిబంధనలు ఉల్లంగించడం ప్రజల సొమ్ముదోచుకోవడమేనని ఆరోపించారు. కుమారుడి కాంట్రాక్ట్ పనుల కోసం ఎవరినీ టెండర్లు వేయవద్దని మంత్రి సోమిరెడ్డి ఆదేశాలు జారీ చేయలేదనే విషయాన్ని కాణిపాకంలో ప్రమాణం చేసి చెప్పగలరా? అని గోవర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. ఆ లేఖ వెనుక ఎవరున్నారు? బండేపల్లి కాలువ కింద 12500 ఎకరాల సాగు చేసుకోవచ్చన్నారని, అయితే గత ఐఏబీ సమావేశంలో ఈ ప్రాంతానికి నీరు ఇవ్వలేమని బోర్డు సమావేశం నుంచి ఆ ప్రాంతాన్ని అధికారులు తొలగించిన విషయాన్ని కాకాణి గుర్తు చేశారు. కానీ మూడు నెలల్లో ఈ కాలువ పనులు పూర్తిచేస్తే 12500 ఎకరాలకు 2018 ఖరీఫ్కు నీరు ఇవ్వొచ్చని సాక్షాత్తు సంబంధిత చీఫ్ ఇంజినీర్ లేఖ రాయడం వెనుక ఎవరు ఉన్నారనే విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి ఒత్తిడితో ఈ విధంగా లేఖ రాశారని, ఒక సం స్థకు ఇస్తే మూడు నెలల్లో పూర్తి చేస్తారనే విషయం కూడా ఆ లేఖలో ఉందన్నారు. భూమి సేకరణ పూర్తి చేసి ఇస్తే పనులు చేస్తామని సంబంధిత కంపెనీ చెప్పిందన్నారు. దీన్ని బట్టి చూస్తే కనీసం ఇంతవరకు భూసేకరణ కూడా జరగలేదని, అలాంటిది మూడు నెలల్లో ఏవిధంగా కాలువ పనులు పూర్తిచేసి నీరు ఇస్తారని? ప్రశ్నించారు. బండేపల్లి కాలువ నీటి కోసం తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. కోర్టులు అభివృద్ధిని అడ్డుకుంటాయా? తాను అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తానని, అభివృద్ధిని ప్రశ్నించనని గోవర్ధన్రెడ్డి తెలిపారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలపై తాను కోర్టుకు పలు సందర్భాల్లో వెళ్లానన్నారు. అయితే గోవర్ధన్రెడ్డి కోర్టులకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి సోమిరెడ్డి అనడం చూస్తుంటే న్యాయస్థానాలపై మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకోవడం సిగ్గుచేటన్నారు. సోమిరెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బండేపల్లి కాలువ పనుల విషయంలో తాను మాట్లాడుతున్న దానిపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. సమావేశంలో మందల వెంకటశేషయ్య, నెల్లూరు శివప్రసాద్, మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, తలమంచి సురేంద్రబాబు పాల్గొన్నారు. -
రైతుల పేరు చెప్పి సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారు
-
ప్రోటోకాల్ రగడ
గుంటూరు రూరల్: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని వర్శిటీ కార్యక్రమాల్లో తనకు కనీసం ఆహ్వానం లేకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాల్లో తన పేరును సైతం ఏర్పాటు చేయడంలేదని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లాంఫాం వ్యవసాయ పరిశోధనా స్థానంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన విత్తన శుద్ధి గిడ్డంగి ప్రారంభోత్సవం, శాటిలైట్ పరిశోధనా స్థానం శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తనకు ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ వర్శిటీ వీసీ డాక్టర్ దామోదర్నాయుడుతో వాగ్వి వాదానికి దిగారు. తనకేమీ సంబంధంలేదని, జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ ప్రకారమే అందరికీ సమాచారం ఇచ్చామని, అదేవిధంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశామని వీసీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని ఇరువురికి సర్ధి చెప్పాడు. దీంతో వివాదం సద్దు మణిగింది. గుంటూరు రూరల్: రైతులకు అధునాతన పద్ధతుల ద్వారా వ్యవసాయంలో నైపుణ్యతలు పెంపొందించేందుకు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ కృషి చేస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. లాంఫాం వ్యవసాయ పరిశోధనా స్థానంలోని వర్శిటీ ప్రాంగణంలో నూతన పరిశోధనా భవనం సముదాయానికి శంకుస్థాపన, విత్తన శుద్ధి గిడ్డంగి ప్రారంభోత్సవం శుక్రవారం జరిగాయి. మంత్రి మాట్లాడుతూ రూ. 50 లక్షలతో అధునాతన పద్ధతిలో విత్తన శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా గంటకు రెండు టన్నుల వరకు విత్తనాలు, అపరాలు శుద్ధి చేయవచ్చని చెప్పారు. నూతనంగా నిర్మిస్తున్న శాటిలైట్ అగ్రికల్చర్ పరిశోధనా స్థానాన్ని రూ 1.75 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెంటర్ను రూ. 64 లక్షలతో ఏర్పాటు చేస్తున్నామని, అగ్రికల్చర్ మార్కెట్ ఇంటలిజెన్స్ సెంటర్ను రూ. కోటి ఐదు లక్షలతో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వర్శిటీ వీసీ డాక్టర్ వి. దామోదర్నాయుడు, వర్శిటీ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. -
పదవులు, నిధులు అన్నీ జమ్మలమడుగుకేనా?
కడప రూరల్ : అధికార పార్టీలో తమ్ముళ్ల మధ్య ఉన్న అసంతృప్తి సెగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుతిమెత్తగా వాడీవేడిగా సాగింది. ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జమ్మలమడుగు నియోజకవర్గం కంబాలదిన్నెలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారు. ఇది పార్టీ అధిష్టానానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ కార్యక్రమాన్ని ఎలా జయప్రదం చేద్దామని అన్నారు. దీంతో జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ నేతలు మినహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన ఇన్చార్జిలు మంత్రి సోమిరెడ్డి సూచనతో విభేదించారు. జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నట్లు కుండబద్ధలు కొట్టారు. అంతేగాక పదవులు, సంక్షేమ పథకాలు, కాంట్రాక్టు పనులు తదితర నిధులన్నీ జమ్మలమడుగు నియోజకవర్గానికేనా? అని నిలదీశారు. పార్టీలో మేము ప్రతినిధులం కాదా? మా నియోజకవర్గాల్లో ఉండేది ప్రజలు కాదా? అని నిలదీశారు. దీంతో సోమిరెడ్డి నిశ్చేష్టులయ్యారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కడప సమీపంలోని కొప్పర్తిలో స్థలం సిద్ధంగా ఉందన్నారు. అలాగే సమీపంలోనే రైల్వేస్టేషన్, విమానాశ్రయం ఉన్నాయన్నారు. నీటి సౌలభ్యం కూడా అందుబాటులో ఉందని వివరించారు. విశాఖలోని గాజువాకలో ఉక్కు కర్మాగారం నెలకొల్పడంతో విశాఖ ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందేనన్నారు. అదేవిధంగా కొప్పర్తిలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే కడప మహానగరంగా రూపొందుతుందన్నారు. కాదు కూడదని జమ్మలమడుగులో ఏర్పాటు చేయాలని చూస్తే అది ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి మాత్రమే దోహదపడుతుందన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో ఇప్పుడు మీరేచెప్పాలంటూ మంత్రి సోమిరెడ్డిని ఎదురు ప్రశ్నించారు. తామంతా కడప సమీపంలోనే ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నామని తెలిపారు. దీనికి స్పందించిన సోమిరెడ్డి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని వివరించారు. అంతేగాక ఈనెల 7న పార్టీ అధినేత చంద్రబాబును కలిసి విషయం వివరించాలని నాయకులు నిర్ణయించారు. జమ్మలమడుగు మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల పార్టీ నేతలు జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో 27న ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరుగుతుందా? లేదా? అనేది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మినహా మిగతా నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే పోలీసు కేసులే
నెల్లూరు, పొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గం రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఇక్కడ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లినా, మంత్రి సోమిరెడ్డిపై ఎదురు తిరిగి ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తున్నారనే వాదన బలంగా ఉంది. ఇందుకు పోలీసు అధికారులు సైతం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. పార్టీలు మారే హక్కు ఎవరికైనా ఉంటుంది. సిద్ధాంతాలు, పద్ధతులు నచ్చని నాయకులను హద్దులు మీరకుండా విమర్శలు చేయడం ఎక్కడైనా జరుగుతున్న వ్యవహారమే. అయితే మంత్రి సోమిరెడ్డి ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లినా, విమర్శించినా అదును చూసి పోలీసు కేసులు పెట్టిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తూ గ్రామ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ వర్గాలను పెంచిపోషిస్తున్నట్టు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. పొదలకూరు మండలం వైఎస్సార్ సీపీకి కంచుకోట కావడంతో ఇక్కడ మంత్రి తన హవాను కొనసాగించేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవకాశం దొరికితే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసు కేసులు బనాయిస్తున్నారనే అపవాదు మంత్రిపై ఉంది. గ్రామాల్లో సర్దుకుపోయే వ్యవహారాలను సైతం పోలీసు స్టేషన్ వరకు తీసుకు వెళ్లి గ్రామాల్లో రాజకీయాలను రావణకాష్టంలా తయారు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చట్టాల దుర్వినియోగం ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా, కార్యకర్త అయినా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కేసులను ఎదుర్కోవాలంటే చట్టానికి ఉన్న ప్రాధాన్యత వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చట్టాలను పరిరక్షించాల్సిన మంత్రే వాటిని దుర్వినియోగం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీ కల్యాణపురం, ముత్యాలపేటలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు అక్కెం బుజ్జిరెడ్డి, చేవూరు వెంకటకృష్ణయ్య బిరదవోలు గిరిజనకాలనీకి చెందిన శెనగల చెంచయ్యను కులంపేరుతో దూషించి, వెట్టిచాకిరి చేయించినట్టు వారిపై గతనెల 13న ఫిర్యాదు అందడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇందులో స్థానిక టీడీపీ నాయకుల సహకారంతో మంత్రే ఇద్దరిపై కేసును పెట్టించారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో చెంచయ్య రాజకీయ బలిపశువుగా మారి వాస్తవాలను గ్రహించి ఈనెల 9న నేరుగా హైకోర్టు జడ్జి వద్దకు వెళ్లి తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అంతేకాక తనను బుజ్జిరెడ్డి, వెంకటకృష్ణయ్య తిట్టలేదని, వేధించలేదని వాగ్మూలం ఇచ్చాడు. దీంతో జడ్జి బుజ్జిరెడ్డి, వెంకటకృష్ణయ్యలపై పెట్టిన కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పరిణామాలతో అధికార పార్టీ నాయకులు మంత్రి ప్రోద్బలంతో రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీల సంఘాల నాయకులు సైతం ఇలాంటి ఘటనలను ఖండిస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ కక్షలకు ఆజ్యం సాధారణంగా రాజకీయ నాయకులు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలను ఆకట్టుకుంటారు. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ కక్షలను ప్రోత్సహించి ఆజ్యం పోసి వర్గాలను ఏర్పాటు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇందుకు మంత్రి సోమిరెడ్డి కృషి చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసును ఎదుర్కొన్న కల్యాణపురం, ముత్యాలపేట గ్రామస్తులు ఇదేవిషయాన్ని విలేకర్ల సమక్షంలో వెల్లడించారు. అక్కెం బుజ్జిరెడ్డి మంత్రి వద్ద పాతికేళ్లకు పైగా ఉన్నారు. ఆయన అండదండలతో బిరదవోలు పంచాయతీలో రావుల అంకయ్యగౌడ్ను కూడా ఎదుర్కొని కేసు మోసిన సందర్భాలు ఉన్నాయి. అయితే బుజ్జిరెడ్డిని మంత్రి ఒక సందర్భంలో దుర్భాషలాడడంతో తీవ్రంగా మనస్తాపం చెంది వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం బుజ్జిరెడ్డి తనకు మంత్రి చేసిన అన్యాయాన్ని సభల్లో వెల్లడిస్తూ వచ్చారు. ఫలితంగానే బుజ్జిరెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కోవాల్సి వచ్చిందని పంచాయతీ ప్రజలు వెల్లడిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గ్రామాల్లో చాలానే ఉన్నాయని తెలుస్తోంది. సీనియర్లు సైతం అవమానాలు ఎదుర్కొంటున్నారని, సమయం చూసి దెబ్బకొడతామని బాహాటంగానే వెల్లడిస్తున్నారు. రోజురోజుకూ ఎన్నికల వేడి పెరుగుతున్నందున ఈ ఘటనలు ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించడం లేదని, అక్రమ కేసులు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఊహలు.. ఆశలు
వర్షాలు పడడం లేదు. ఏం చేయలేం. ఈ ఏడాదికి ఇంతే.. సోమశిలలో నీరు తక్కువగా ఉంది. ఉన్న దాంట్లో సర్దుకోండి. ఇది పాలక పక్షం తీరు. నీటి కేటాయింపులు మొదలుకొని సాగు విస్తీర్ణం వరకు అన్నీ ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయాయి. లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సిన అధికార గణం తక్కువ ఎకరాలకు నీటి కేటాయింపులు ప్రకటించారు. అదేమని సభలో ప్రశ్నిస్తే జిల్లాకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. వర్షం పడితే వాటితో ఈ ఏడాది గట్టెక్కేద్దామంటూ పాలకుల జవాబు. గురువారం జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం ఊహలు, ఆశలు, నామమాత్రపు కేటాయింపులతో ముగిసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రబీ సీజన్ రైతుల ఆశలకు అధికారులు పాలకులు గేట్లు వేశారు. రబీ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచిపోయింది. వానలు లేవు.. సోమశిలలో ఉన్న నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న రైతాంగాన్ని ఉస్సూరుమనిపించారు. జిల్లాలో గతేడాది 50.02 టీఎంసీల నీటిని సోమశిల నుంచి విడుదల చేసి 4.98 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా ఇందుకు భిన్నంగా ఉంది. సోమశిలలో నీటి నిల్వ తక్కువగా ఉందని 31 టీఎంసీల నీటిని 3.21 లక్షల ఎకరాలకు ఇస్తామని ప్రకటించారు. 2015 నుంచి కరువు కోరల్లో జిల్లా కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది అయితే జిల్లాలోని 46 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించారు. ఇలాంటి తరుణంలో రైతులు అందరు సోమశిల సాగునీటిపైనే ఆశలు పెంచుకున్నారు. మరో వైపు 63 శాతం లోటు వర్షపాతం నమోదు కావటంతో సోమశిల నీరే ఆధారంగా జిల్లాలో లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది. అయితే అధికారులు ముందు చూపు లేకపోవటం గతంలో సోమశిలకు వచ్చిన వరద నీటిని కండలేరుకు వదిలి అక్కడి నుంచి చెన్నై, చిత్తూరు జిల్లాలకు తాగునీటి అవసరాలకు తరలించడం వంటి పరిణామలతో ఈ ఏడాది సోమశిలలో నీటి లభ్యత తగ్గిపోయింది. ప్రతి ఏడాది రబీ సీజన్ ప్రారంభానికి ముందే సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి, నీటి కేటాయింపులు ప్రకటించగానే దానికి అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండేది. అక్టోబర్లో ముగించాల్సి ఉన్న సాగునీటి సమావేశాన్ని నవంబర్లో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటికే రబీ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. సోమశిల రిజర్వాయర్లో ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 42 టీఎంసీల నీరు ఉంది. డెడ్ స్టోరేజ్ లెవల్, తాగునీటి అవసరాలకు పోనూ 31 టీఎంసీల నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇందులో డెల్టాలో 1.91 లక్షల ఎకరాలకు ఉత్తర, దక్షిణ కనుపూరు, కావలి పరిధిలో ఉన్న ఆయకట్టులో 50 శాతం అయకట్టుకు మాత్రమే నీరిస్తామని ప్రకటించారు. కండలేరులో ఉన్న 13 టీఎంసీల నీటిని మనుబోలు, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలతో పాటు తిరుపతి, చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయిస్తామని ప్రకటించారు. మోటార్లు కట్టడి చేస్తేనే నీరు అక్రమ మోటార్ల ద్వారా జిల్లాలో నీటిని తోడేస్తుంటారు. ముఖ్యంగా కావలి కెనాల్ పరిధిలో 48 వేల అనధికార మోటార్లు, కనుపూరు కెనాల్ కింద 32 వేల అనధికార మోటార్ల ద్వారా నీటిని కొందరు తోడేస్తున్నారు. జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారులకు ప్రతి మో టారుకు 10 వేల చొప్పున వసూలు చేసి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో చివరి భూముల రైతులకు నీరు అందని పరిస్థితి. రైతు సంఘ నాయకులకుఅవకాశం కల్పించాలి నెల్లూరు(పొగతోట): జిల్లా సాగు నీటి సలహా మండలి (ఐఏబీ)లో రైతు సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఐఏబీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్.అమర్నాథ్రెడ్డికి విష్ణువర్ధన్రెడ్డి, రైతు సంఘాల నాయకుడు బెజవాడ గోవిందరెడ్డి, రైతు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఐఏబీ సమావేశంలో రైతు సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే క్షేత్రస్థాయిలో సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించగలిగితే రైతులకు మేలు చేసిన వారవుతారన్నారు. సాగునీరు అందక చివరి భూముల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా వీలైనంత నీటిని అధిక ఎకరాలకు కేటాయించాలన్నారు. నీటిని విడుదల చేయని ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మంచి నీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ జలాలు అభివృద్ధి చెందేలా చెరువులకు నీటిని విడుదల చేయాలని కోరారు. -
మా నేతపై అభాండాలు వేస్తే ఊరుకోం
నెల్లూరు(సెంట్రల్): వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని టీడీపీ నాయకులు నేరుగా తిట్టుకోవచ్చని, ఈ విషయంలో మా నేతపై అభాండాలు వేస్తే ఊరుకోమని వెంకటాచలం మండల జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య అన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమిరెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలపై కాకాణి ప్రశ్నిస్తున్నారని, అంతేతప్ప మంత్రిని ఆయన తిట్టారని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మంత్రిని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నేరుగా తిట్టకోవచ్చని చెప్పారు. మంత్రి, ఆయన కుమారుడు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో వెలుగులోకి వస్తున్నాయన్నారు. సోమిరెడ్డికి చెందిన సూట్కేస్ కంపెనీ బండారం కూడా బయటపడబోతోందన్నారు. నుడా చైర్మన్ నెల్లూరులో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లు చడవడం మాని సర్వేపల్లిలో విచారిస్తే తండ్రీకొడుకుల బాగోతం తెలుస్తుందన్నారు. మంత్రి అండతో గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేస్తున్న విషయం వాస్తవం కాదా?, మిల్లర్ల వద్ద రూ.50 కోట్లు తీసుకుని రైతులకు మద్దతు ధర లేకుండా చేసింది వాస్తవం కాదా?, నీరు – చెట్టు పథకంలో అవినీతికి పాల్పడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో తేల్చుకోవడానికి బహిరంగచర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో నెల్లూరు శివప్రసాద్, చిరంజీవులుగౌడ్, ఈపూరు రజనీకాంత్రెడ్డి, చీకుర్తి నర్సయ్య పాల్గొన్నారు. -
‘వారసత్వ రాజకీయాల గురించి పవన్ మాట్లాడటమా..’
విజయవాడ: తెలుగుదేశం పార్టీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మండిపడ్డారు. విజయవాడలో సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడే పవన్ కల్యాణ్, తన అన్న వారసత్వం నుంచి రాజకీయాల్లోకి, సినిమాల్లోకి రాలేదా అని సూటిగా ప్రశ్నించారు.రాష్ట్రంలో చాలా మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.. వాళ్ల కొడుకు ఎవరైనా సీఎం కావొచ్చు అని పరోక్షంగా పవన్ కల్యాణ్కు చురకలంటించారు.రెండు సార్లు అఖిలపక్షం పెట్టి ఆహ్వానిస్తే ఎందుకు రాలేదని సూటిగా అడిగారు. ఇప్పుడు మళ్లీ అఖిలపక్షం పెట్టమని పవన్ ఎలా అంటున్నారని ప్రశ్నించారు. యుద్ధ ప్రాతిపదికన తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం మొత్తం ఉంటే, పవన్ కవాతు చేస్తూ ఉన్నారని ఎద్దేవా చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ మీద పవన్ కవాతు ఎందుకు చేశాడో చెప్పాలని సూటిగా అడిగారు. కవాతుకు అన్ని కోట్ల రూపాయల డబ్బులు పవన్కు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కమెడియన్స్ వచ్చినా జనం తండోపతండాలుగా వస్తారని వ్యాక్యానించారు. ఇంకా మాట్లాడుతూ..‘ ప్రజలు తనను సినిమా హీరోగా చూస్తున్నారా లేక రాజకీయ నాయకుడిగా చూస్తున్నారా అనేది పవన్ ఆలోచించుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా లోకేష్ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎలా అవుతారంటూ పవన్ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. పవన్ లెక్క ప్రకారం బిల్ కలెక్టర్గా పని చేస్తేనే జిల్లా కలెక్టరుగా పని చేయాలేమో.ఎస్టీ నియోజకవర్గమైన పాడేరు నుంచి పోటీ చేస్తాననడంలోనే పవన్ రాజకీయ పరిణతి ఏంటో అర్ధం అవుతోంద’ని విమర్శించారు. ‘తోలు తీస్తా..తాట తీస్తా..గోదాట్లో కలిపేస్తా.. అంటూ ఈ తరహా భాష ఏ రాజకీయ పార్టీ ఉపయోగించదు. ఈ భాషనే పవన్ తన మేనిఫెస్టోలో పెడతారా..? మంచిని మంచి అనడం..తప్పులేమైనా ఉంటే చెప్పడం పవన్ అలవాటు చేసుకోవాలి. కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క సభ అయినా పవన్ నిర్వహించారా? వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కేంద్రం వెనక్కు తీసుకుంటే పవన్ మాట్లాడారా. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇప్పటి వరకు తాను చేసి కామెంట్లను పవన్ విశ్లేషించుకోవాలి. పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి కూడా కాంగ్రెస్కు దూరమయ్యారనే వార్తలు వస్తున్నాయ’ని సోమిరెడ్డి అన్నారు. -
గందరగోళంగా టీడీపీ సమన్వయ సమావేశం!
సాక్షి, వైఎస్సార్ జిల్లా : టీడీపీలో వర్గ విభేదాలపై ఏర్పాటు చేసిన సమావేశం గందరగోళంగా మారింది. ప్రొద్దుటూరులో టీడీపీ వర్గ విబేధాలపై ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్, జిల్లా మంత్రి ఆది నారాయణ రెడ్డి హాజరయ్యారు. కమిటీ సమావేశంలో వర్గ విబేధాలపై మంత్రులు నోరు మెదపలేదని సమాచారం. తాడో పేడో తేల్చుకోవాలని సమావేశానికి వచ్చిన నేతలు చివరకి ప్రొద్దుటూరు రగడపై ఎలాంటి ప్రకటన చేసే సాహసం చేయలేక వెనుదిరిగిపోయారు. ధర్మ పోరాట దీక్షపైనే సమీక్ష అన్నట్టుగా ప్రసంగించి.. పనిలో పనిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నాలుగు విమర్శలు చేసి సమావేశాన్ని ముగించారు. సమావేశం సారాంశం అర్థంకాక ప్రొద్దుటూరు టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. ఇంచార్జ్ పదవి పోయిందని ముక్తీయర్ వర్గం, ఉందంటూ వరద వర్గం పరస్పరం వాదోపవాదాలు చేసుకున్నారు. -
సోమిరెడ్డీ.. అధికారులంటే అంత చులకనా!
నెల్లూరు, తోటపల్లిగూడూరు: ‘లేడికి లేచిందే పరుగన్నట్లు’.. మంత్రి సోమిరెడ్డికి ఆదివారం పూట తీరిక దొరకడంతో అధికారులను పిలిపించి సమీక్ష నిర్వహించారు. ఇక్కడికీ సరే అనుకున్నా.. అధికారులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ కార్యకర్తలను కూర్చోబెట్టి, అధికారులను నిలబెట్టి వారిని అవమానించారు. సాధారణంగా ఎమ్మెల్యే, మంత్రి అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశమంటే ప్రజాప్రతినిధులతో పాటు మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొంటారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న ప్రభుత్వ ఫలాలు, పాలనా పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షిస్తారు. ఈ సమీక్ష సమావేశంలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు మినహా ఇతరులకు ఎవరికీ అవకాశం ఉండదు. అయితే ఆదివారం తోటపల్లిగూడూరు మండల పరిషత్ సమావేశం మందిరంలో రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశం పార్టీ కార్యక్రమంలా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సమావేశానికి ముందు రోజే ఆదివారం జరిగే సమావేశానికి రావాలని కార్యకర్తలకు టీడీపీ పార్టీ మండల కమిటీ పిలునివ్వడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మండల కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమీక్ష సమావేశంలో మంత్రి సోమిరెడ్డితో పాటు అర్హత లేని పలువురు టీడీపీ నాయకులు వేదికపై ఆసీనులయ్యారు. 150కు మించి సీట్లు పట్టని మండల పరిషత్ కార్యాలయంలో 130కు పైగా కుర్చీలను అధికార పార్టీ కార్యకర్తలే ఆక్రమించుకున్నారు. దాదాపు 50 మంది అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఉండగా అందులో కుర్చీలు 20 మందికే దొరికింది. మిగిలిన 30 మంది కొందరు మంత్రి సమావేశ వేదిక ముందు, మరి కొందరు పార్టీ కార్యకర్తల వెనుక నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికార సమావేశం మందిరంలో అధికార పార్టీ కార్యకర్తలు, ప్రైవేట్ వ్యక్తుల హల్చల్ చేస్తుంటే అధికారులు నిస్సాహాయ స్థితిలో ఉండిపోయారు. అవినీతి అక్రమాల్లో చేతులు కలపని అధికారులపై అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం సదరు అధికారులు జీర్ణించుకోలేకపోయారు. ఇది ఇలా ఉంటే ప్రొటోకాల్కు విరుద్ధంగా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశంలో ప్రైవేట్ వ్యక్తులు భారీ సంఖ్యలో కుర్చీల్లో ఆసీనులైనా ఆర్డీఓ కానీ, మండల అధికారులు ఎంపీడీఓ, తహసీల్దార్లు గాని మంత్రికి భయపడి నోరెత్తకపోవడం గమనార్హం. అయితే మంత్రి తీరుపై కొందరు అధికారులు, ప్రభుత్వ సిబ్బంది బాహటకంగానే విమర్శలు గుప్పించారు. -
మంత్రి సోమిరెడ్డిపై న్యాయవాదుల ఫిర్యాదు
నెల్లూరు లీగల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యంగ వ్యవస్థ అయిన కోర్టు ప్రాంగణంలో పత్రికా సమావేశం నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు చేయటం, రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డిపై విమర్శలు చేయటానికి కోర్టు ప్రాంగణాన్ని అనుమతి లేకుండా వినియోగించటం నిబంధనలకు పూర్తి విరుద్ధం అని పేర్కొంటూ న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ఫోలియో జడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావుకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదును పంపారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి కోర్టు నియమ నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. ఈ నెల 15న మంత్రి సోమిరెడ్డి కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన అనంతరం మంత్రి సోమిరెడ్డి కోర్టు ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అది కూడా పూర్తిగా వ్యక్తిగత రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రత్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డిపైనే మాట్లాడారు. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో రాజకీయపరమైన కార్యక్రమాలు, విలేకరుల సమావేశాలు నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కోర్టు ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించేలా వ్యవహరించటంతోపాటు కోర్టు విలువలను, నిబంధనలను పాటిం చకుండా ఉండటం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించటం అధికార దుర్వినియోగం అవుతుందని, దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ప్రాంగణంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్త పద్ధతికి తెరతీసి పవిత్ర న్యాయస్థానాలను అగౌరవ పరిచేలా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీతో పాటు విలేకరుల సమావేశానికి సంబం« దించిన వీడియోలు, ఫొటోలను అందజేశారు. బార్ అసోసియేషన్ న్యాయవాదులు కుడుముల రవికుమార్, మురళీధర్రెడ్డి, పత్తి రాజేష్తో పాటు పలువురు న్యాయవాదులు ఉన్నారు. -
సిఫార్సు ఉంటేనే!
జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి రాయితీలు కావాలన్నా, సబ్సిడీ పరికరాలు తీసుకోవాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఇన్చార్జుల సిఫార్సులు తప్పనిసరి అని అధికారులు చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. అర్హులైన రైతులను పక్కనపెట్టి అధికారపార్టీ నేతల బినామీలకు రైతురథం పేరుతో ట్రాక్టర్లను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు(సెంట్రల్): జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆదేశాలతో ఇష్టా నుసారంగా అధికారపార్టీ నేతల అనుచరులకు ట్రాక్టర్లను పంపిణీ చేయనుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోక పోవడం, ప్రభుత్వం ఇచ్చే రాయితీ ట్రాక్టర్లు తీసుకుందామన్నా టీడీపీ నేతల లేఖలు అధికారులు అడుగుతుండటంతో రైతులకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రైతురథం అనే కన్నా టీడీపీ రథం అని పేరుపెట్టుకుని నేరుగా వారికే ఇవ్వాలని ఎద్దేవా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.1.5 లక్షల సబ్సిడీ జిల్లాలో నెల్లూరు మినహా కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు 1,070 రైతు రథం ట్రాక్టర్లను పంపిణీ చేసే విధంగా గత ఏడాది టార్గెట్ విదించారు. వీటికి ఒక్కోదానికి రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. టీడీపీ నేతలు, జిల్లా ఇన్చార్జి మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే ట్రాక్టర్లు పంపిణీ చేశారు. 2018 సంవత్సరానికి కూడా ఇదే తరహాలో అధికార పార్టీ నేతల సిఫార్సు ఉంటేనే ఇస్తున్నారు. రథాల రాజకీయం గత ఏడాది జిల్లాకు 1,050 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. మొదట 700 ట్రాక్టర్లు మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ అధికారుల చేత జిల్లాకు చెందిన మంత్రి ప్రకటన చేయించారు. తరువాత తానే జిల్లాకు అవసరం అని ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు మంజూరు చేయించానని చెప్పుకునేదానికి తిరిగి 1,050 ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఏడాది జిల్లాకు 1,300 ట్రాక్టర్లు మంజూరైనట్లు సమాచారం. అయితే ప్రస్తుతం 550 ట్రాక్టర్లు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా 150 ట్రాక్టర్లకు అనుమతి జిల్లాలో రైతురథం ట్రాక్టర్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో, ఎక్కడ చేసుకోవాలో ఇంత వరకు అధికారులు ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి 150 ట్రాక్టర్లను మంజూరు చేసినట్లు తెలిసింది. వీటిని ఈ వారంలోనే పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లను ఈ విధంగా పంపిణీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి కనుసన్నల్లో జిల్లాకు చెందిన మంత్రి కనుసన్నల్లో టీడీపీ నేతలకు రైతురథం ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి సూచనలతో 150 ట్రాక్టర్లను పంపకానికి అధికారులు సిద్ధం చేశారు. మరొకొన్ని ట్రాక్టర్లను మంజూరు చేసే విధంగా అధికారులకు సిఫార్సు లేఖలు పంపిణినట్లు సమాచారం. ఈ విధంగా ఆ మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చేస్తున్నాం మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. కొన్ని ట్రాక్టర్లను ఇప్పటికే మంజూరు చేసిన మాట వాస్తవమే. ట్రాక్టర్లు మంజూరు చేయాలంటే ఇన్చార్జి మంత్రి లేదా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి సంతకంతో లెటర్ ఉండాలి. అన్నింటినీ పరిశీలించి ట్రాక్టర్లు మంజూరు చేస్తాం .–బి.చంద్రనాయక్, జేడీ, వ్యవసాయశాఖ అధికారపార్టీ వాళ్లకే ఇస్తున్నారు రైతురథం ట్రాక్టర్లు మొత్తం టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే గత ఏడాది ఇచ్చారు. ఈ ఏడాది ప్రస్తుతం ఎప్పుడు దరఖాస్తులు చేసుకోవాలే అనే విషయం కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నులో జరుగుతోంది. –ప్రభాకర్నాయుడు, యనమదల, చేజర్ల మండలం అర్హులకు అందడం లేదు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే రైతురైథం పథకంలో అర్హులైన వారికి ట్రాక్టర్లు ఇవ్వడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు చెప్పిన వారికి ఇస్తామంటే వ్యవసాయ శాఖ ద్వారా ఇస్తున్నాం అని చెప్పడం దేనికి, నేరుగా టీడీపీ కార్యాలయం నుంచే ఇస్తే సరిపోతుంది కదా. గత ఏడాది అర్హులకు అందలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితిగా ఉంది. –సంకటి రామకృష్ణారెడ్డి, చేజర్ల -
మైనార్టీ సదస్సు పట్టని నేతలు
అధికార పార్టీ నేతలు జనసమీకరణను తుస్ మనిపించారు. ‘నారా హమారా. టీడీపీ హమారా’ పేరుతో తెలుగుదేశం పార్టీ గుంటూరులో మంగళవారం నిర్వహించిన సభకు జిల్లా నుంచి జనసమీకరణ చేయటంలో ముఖ్య నేతలు పూర్తిగా విఫలమయ్యారు. పర్యావసానంగా వందల బస్సులు అని చెప్పి చివరకు పదుల సంఖ్యలో బస్సులు వెళ్లటం, దానిలో కూడా మైనార్టీలతో పాటు పార్టీ కార్యకర్తలు ఉండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మైనార్టీ సదస్సుకు జిల్లా నుంచి జనసమీకరణ, ఇతర బాధ్యతలు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో, మైనార్టీ ఓటింగ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పర్యటించి అక్కడ సభ పోస్టర్ ఆవిష్కరణలు, సమావేశాలు నిర్వహించి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు వారం నుంచి సభకు తరలిరావాలని పిలుపునివ్వటంతో పాటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. అయితే మంగళవారం మాత్రం ఆ మేరకు ఎక్కడా జనం కనిపించని పరిస్థితి. జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పి.నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, పార్టీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావుతో పాటు ఇతర ముఖ్య నేతలు అందరూ జనసమీకరణను పూర్తిగా గాలికొదిలేశారు. నెల్లూరు నగరం నుంచి మినహా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి బస్సులు రాకపోవటం గమనార్హం. ఇక జిల్లాలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాత్రం అట్టహసంగా నగరం నుంచే వందకు పైగా బస్సులు, జిల్లా నుంచి 235 బస్సులు ఏర్పాటు చేశామని ప్రకటించారు. తీరా జనాలు లేకపోవటంతో 50 బస్సులు కూడా పూర్తిగా వెళ్లని పరిస్థితి. జిల్లాలో మైనార్టీల ఓటింగ్ గణనీయంగా ఉంది. ప్రధానంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్లో అధికంగా ఉండగా మిగిలిన నియోజకవర్గాలోనూ అధికంగా ప్రభావితం చేసే స్థాయిలో మైనార్టీల ఓటింగ్ ఉంది. ఈ క్రమంలో జిల్లా నుంచి కనీసం 10 వేల మందికి తక్కువ కాకుండా సభకు తరలించాలని పార్టీ రాష్ట్ర నేతల ఆదేశం. అయితే ఈ మేరకు నేతలు ప్రకటనలు చేసి హడావుడి చేశారు కానీ మైనార్టీలను పూర్తిస్థాయిలో రప్పించలేకపోయారు. మంగళవారం ఉదయం నగరంలో వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో బస్సులను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఏర్పాటు చేశారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఆ సమయంలో సగం బస్సులు కూడా నిండని పరిస్థితి. దీంతో పదుల సంఖ్యలో బస్సులను డిపోలకు వెనక్కి పంపేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొన్ని బస్సులు కదలిని పరిస్థితి. మొత్తం మీద టీడీపీ మైనార్టీ సదస్సుకు జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటం గమనార్హం. -
హరికృష్ణ మృతిపట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
అమరావతి: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన హరికృష్ణ మృతి పార్టీకి తీరని లోటని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి, నందమూరి హరికృష్ణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినీ, రాజకీయ జీవితంలో హరికృష్ణ ప్రత్యేక ముద్రవేశారని చెప్పారు. వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ..నందమూరి హరికృష్ణ మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి కళా వెంకట్రావు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మీడియా ద్వారా తెలిపారు. హరికృష్ణ మృతి తనకు దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివని, హరికృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ రోజు జనసేన అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. -
టీడీపీని వీడని నేతల కయ్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి పరోక్షంగా విమర్శలు చేసి 24 గంటలు గడవక ముందే కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోలంరెడ్డికి, టీడీపీ సీనియర్ నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. బూత్ కమిటీల విషయంలో ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం మరింత ముదిరింది. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం గురువారం జరిగిన టీడీపీ సమావేశం ఇందుకు వేదికైంది. ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో నేతల మధ్య వివాదాలు కొంతకాలంగా సాగుతూనే ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నా నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. రెండు వారాలుగా ఈ విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆత్మకూరు ఇన్చార్జి విషయంలో ఆదాల, సోమిరెడ్డి మధ్య మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఆత్మకూరులో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రి సోమిరెడ్డి జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నాడంటూ ఆదాల పరోక్ష విమర్శలు చేశారు. బుధవారం నెల్లూరు రూరల్లో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రిపై మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. సోమిరెడ్డి వైఖరిపై అధిష్టానం వద్దేతేల్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇక కోవూరు నియోజకవర్గంలో ఆది నుంచి ఎమ్మెల్యే పోలంరెడ్డి వైఖరిని చేజర్ల వెంకటేశ్వరరెడ్డి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలో పాత బూత్ కమిటీ కన్వీనర్లను తొలగించి తన అనుచరులను నియమించుకున్నారని చేజర్ల వర్గం ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురువారం కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి పార్టీ సమావేశం నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు మండలాలకు సంబంధించి బూత్ కమిటీలకు తనకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. దీనిని చేజర్ల వ్యతిరేకించారు. పాత సభ్యులనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. చేజర్ల మాటలు లెక్కచేయకపోవడంతో ఎమ్మెల్యే పోలంరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని కోవూరు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. గతంలో బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాలకు సంబంధించి బూత్ కమిటీ సభ్యుల నియామకంలో గందరగోళం నెలకొంది. చేజర్ల వర్గం వారిని పూర్తిగా తొలగించి ఎమ్మెల్యే అనుకూలంగా ఉన్న వారిని నియమించారు. దీంతో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా జిల్లా పరిధిలోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. కోవూరు నియోజకవర్గ వివాదాన్ని పరిష్కరించేందుకు పరిశీలకులుగా ఎరిక్సన్బాబును అప్పట్లో నియమించారు. వివాదానికి తెరదించాలని జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రకు ఎరిక్సన్ బాబు సూచించారు. బీద ఇరువర్గాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పిలిపించి చర్చలు జరిపారు. వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది. గురువారం ఎమ్మెల్యే బూత్ కమిటీ కన్వీనర్లను తొలగించడంతో నేతల మధ్య పోరు మళ్లీ మొదటికొచ్చింది. తాను సీఎం వద్దే తేల్చుకుంటానని చేజర్ల వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేస్తున్నారు. -
పార్టీని నాశనం చేసిందెవరో?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో వర్గవిభేదాలు షరామామూలుగా మారాయి. వేదికలు మాత్రమే మారుతున్నాయి. ప్రతి వేదికపై ఒక వర్గం మరో వర్గంపై పైచేయి సాధించుకునే క్రమంలో ఘాటు విమర్శలకు దిగుతోంది. తాజాగా నెలన్నరగా అధికారపార్టీలో ఆత్మకూరు పంచాయితీ ముగింపు లేని రీతిలో కొనసాగుతోంది. జిల్లా టీడీపీలో ఉన్న గ్రూప్లన్నీ ఆత్మకూరులో ఉండడం, ప్రతి ఒక్కరూ అక్కడివారు కావడంతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం సంగం మండలంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి నిర్వహించిన పార్టీ సమావేశానికి మంత్రి సోమిరెడ్డి వర్గం పూర్తిగా గైర్హాజరైంది. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మంత్రి సోమిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు విమర్శలు చేయడం పార్టీలో మళ్లీ చర్చనీయాంశం అయింది. సోమవారం సంగం, ఆత్మకూరు మండలాల్లో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జ్ ఆదాల ప్రభాకరరెడ్డి సమావేశాలు నిర్వహించారు. దీనికి యథావిధిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అనుచరుడు, పార్టీ నేత కన్నబాబు, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు సన్నిహితంగా ఉండే డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్రెడ్డి గైర్హాజరయ్యారు. ఇక కొత్తగా రంగంలోకి రావాలనుకుంటున్న బొల్లినేని కృష్ణయ్య ప్రతినిధిగా అతని సమీప బంధువు తాళ్లూరి గిరినాయుడు హాజరయ్యారు. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ మంత్రి సోమిరెడ్డి పేరు చెప్పకుండా ఆయనపై ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తనని 2004 ఎన్నికల సమాయానికి పార్టీ నుంచి బయటకు పంపేశారని, మళ్లీ గత కొంతకాలంగా తనపై పార్టీలోని ఆయన సొంత మనుషుల ద్వారా విషప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. వీళ్లకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.. వాళ్లకి మంత్రి పదవి రావాలే తప్ప జిల్లాలో పార్టీ బాగుండాలని ఏమాత్రం లేదని, గోదావరి జిల్లాలో గెలిస్తే అధికారం వస్తుందనుకుంటున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. గత ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేకుండా చేసిన పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మరోవైపు ఆదాల వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. -
రైతులపై సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
కర్నూలు : కర్నూలులో మంత్రి సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెడ్పి మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ గ్రీవెన్స్ సెల్లో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను పారిశ్రామికవేత్తలతో పోల్చారు. కేవలం లక్ష రూపాయలు అప్పు ఉన్న రైతులు ఆత్మహత్యలు ఎందు చేసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అంటూ, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను చులకనగా చేసి మాట్లాడారు. రైతులకు ఆదర్శవంతంగా రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. రూ. 680 కోట్లతో రైతులకు కొంత రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీలో 9లక్షల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వాటిని పరిష్కరించి, అర్హులైన అందరు రైతులకు రుణమాఫీ అందజేస్తామని తెలిపారు. కాగా, సోమిరెడ్డికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి షాకిచ్చారు. జిల్లాలోని రైతాంగ సమస్యలను మంత్రి వద్ద ఎకరువు పెట్టారు. జిల్లాలో కరువు మండలాల గుర్తింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 53 మండలాలకు గాను కేవలం 37 మండలాలను కరువు మండలాలుగా ఎంపిక చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షపాతం లేని కారణంగా కర్నూలు జిల్లాను కరువు పీడిత జిల్లాగా ఎంపిక చేయాలన్నారు. తమ ప్రాంతంలో వర్ష పాతం తక్కువగా ఉన్నా తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నకిలీ విత్తనాల బెడద అధికంగా ఉందని కేఈ పేర్కొన్నారు. -
ఆత్మకూరులో మరో కృష్ణుడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీకి ఆత్మకూరు నియోజకవర్గంలో పరిస్థితి మింగుడుపడని విధంగా మారింది. జిల్లాలో మంత్రుల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాలకు ఇక్కడ యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి నేతలు గ్రూప్లుగా విడిపోయి స్థానికంగా మంత్రులు అండతో ఇన్చార్జి పదవి దానితో పాటు టికెట్ దక్కించుకోవటానికి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఆనం రామనారాయణరెడ్డి పార్టీకి దూరంగా వెళ్లిన క్రమంలో 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కన్నబాబు మళ్లీ తెరపైకి వచ్చారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సహకారంతో ఆత్మకూరు ఇన్చార్జిని దక్కించుకోవటానికి తీవ్రంగా కృషి చేశారు. పార్టీ పెద్దల్ని కలిసి కొద్ది రోజులు హడావుడి చేశారు. మరోవైపు డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టకూరు ధనుంజయ్రెడ్డి కూడా ఇన్చార్జి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ద్వారా పావులు కదిపారు. చివరికి ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో నేతలు చర్చించి ఇన్చార్జిని నియమించే వరకు ఆదాలనే పర్యవేక్షించాలని సూచించారు. దీంతో కన్నబాబు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షకు దిగడం తర్వాత పార్టీ ముఖ్యుల జోక్యంతో మంత్రి నారాయణ విరమింపజేశారు. ఈ పరిణమాల క్రమంలో గందరగోళంగా మారిన ఆత్మకూరు వ్యవహారంలో ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా కాంట్రాక్టర్ బొల్లినేని కృష్ణయ్య తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆదాలతో కలసి సీఎంను కలిసిన కృష్ణయ్య ఇన్చార్జి కోసం తీవ్రంగా యత్నిస్తున్న కన్నబాబు, ధనుంజయరెడ్డికి పోటీగా బొల్లినేనిని పార్టీలోకి తీసుకొచ్చేందకు ఆదాల యత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ నెల 16వ తేదీన సీఎం వద్దకు ఆదాల, బొల్లినేని వెళ్లి నియోజకవర్గ విషయాలను చర్చించారు. దీని కొనసాగింపుగా నియోజకవర్గంలో బొల్లినేని తన సొంత మనుషులతో చర్చలు మొదలుపెట్టారు. మరోవైపు రాజకీయంగా వైరం ఉన్న కొమ్మి లక్ష్మయ్యనాయుడుతో వేర్వేరు సందర్భాల్లో రెండు సార్లు కలిశారు. రాజకీయ ప్రత్యర్థులు అయి ఇరువురూ శనివారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిశారు కూడా. ఇక బొల్లినేని కూడా పార్టీలో చేరటానికి ఆసక్తి చూపుతూ రెండు రోజుల్లో ప్రకటన చేస్తానని ముఖ్యుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. మొత్తం మీద ఆత్మకూరులో మరో కృష్ణుడు రాకతో సరికొత్త వివాదాలకు తెర లేచినట్లయింది. -
డిష్యుం..డిష్యుం
అధికారపార్టీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో ఇప్పటికే మంత్రులు, మాజీ మంత్రుల మధ్య సాగుతున్న వార్ అన్ని నియోజకవర్గాలకు పాకింది. పర్యవసానంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ముఖ్యంగా కోవూరు, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో రగడ యథాతథంగా కొనసాగుతోంది. ఈక్రమంలో అన్నింటిని సమన్వయం చేసుకోవాల్సిన జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పూర్తిగా పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో సమస్య తీవ్రత పెరిగి అందరూ అధిష్టానం వద్ద తాడోపెడో తెల్చుకోవటానికి క్యూకడుతున్నారు. మొత్తం మీద జిల్లాలో అధికారపార్టీ గ్రూప్ వివాదాలు నేతలకు తలనొప్పిగా, ఆశావాహులకు కొత్త చికాకులు తెచ్చేలా ఉండడం గమనార్హం. ఇక ఇన్చార్జ్ మంత్రి కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డికి టిక్కెట్ నీదే అని భరోసా ఇవ్వడంతో అన్ని నియోజకవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా అధికారపార్టీలో రోజుకో కొత్త సమస్య ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే మంత్రులు సోమిరెడ్డి, నారాయణ మధ్య ఆధిపత్యపోరు సాగుతుండగా సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి మధ్య కూడా వార్ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో పలు నియోజకవర్గాల్లో సమస్యలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో పాత, కొత్త నేతల రగడ గత కొన్ని నెలలుగా సాగుతోంది. పార్టీ నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డి వర్గం తమకి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం లేదని, బూత్ కమిటీల్లో చోటు కల్పించలేదని, పూర్తిగా పార్టీలో కొత్తగా వచ్చిన వారినే నియమించారని సీఎం చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గత నెల రోజులుగా పార్టీలో కోవూరు చర్చ సాగుతూనే ఉంది. దీంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అమర్నాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఎమ్మెల్యే పోలంరెడ్డి నివాసానికి వెళ్లి టిక్కెట్ ఆయనకేనని ప్రకటించి బాగా పనిచేయాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జ్లు తమను కూడా ప్రకటించాలనే డిమాండ్ను తెరపైకి తీసుకురావడంతోపాటు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కర్నూలులో మంత్రి లోకేష్ ఇదే తరహాలో ప్రకటిస్తే అక్కడి నేతలు నేరుగా ప్రశ్నించిన తరుణంలో పార్టీ అధిష్టానాన్ని కాదని మంత్రి, ఎమ్మెల్సీ టిక్కెట్ ఎలా ప్రకటిస్తారనే చర్చ సాగుతోంది. దీనిపై పార్టీ ముఖ్య నేతలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వెంకటగిరిలో వార్ వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే చేనేత దినోత్సవం రోజున చేనేత మహిళ అయిన శారదను ఎమ్మెల్యే అవమానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే స్థానికంగా జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలుస్తోంది. ఇక ఆత్మకూరు వ్యవహారం కూడా గత కొంతకాలంగా అనేక మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా గతంలో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కన్నబాబు పార్టీ కార్యాలయంలోనే నిరసన దీక్ష నిర్వహించడంపై పార్టీ కొంత సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆత్మకూరు టిక్కెట్ను ఆశిస్తూ అక్కడ పార్టీ నేతలు మెట్టకూరు ధనుంజయ్రెడ్డి, కన్నబాబు, విజయరా>మిరెడ్డి, బొల్లినేని కృష్ణయ్య తదితర పేర్లు తెరపైకి వచ్చి ఎవరిస్థాయిలో వారు స్థానికంగా మంత్రుల సహకారంతో యత్నాలు సాగిస్తుండడంతో క్యాడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. బీద తీరుపై అసమ్మతి ఇదిలా ఉంటే నియోజకవర్గాల్లో సమస్యలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ బీద రవిచంద్రపై పార్టీ రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు నెలలుగా మూడు నియోజకవర్గాల్లో రగడ సాగి అధిష్టానం వరకు ఫిర్యాదులు వస్తున్నా స్థానికంగా స్పందిచడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మంత్రి అమర్నాథ్రెడ్డితో వెళ్లి కోవూరు వ్యవహారం చక్కదిద్దకుండా ఎమ్మెల్యేకు భోరోసా ఇవ్వడాన్ని పార్టీ అధిష్టానానికి కొందరు ఫిర్యాదులు చేశారు. దీంతో కొత్త పంచాయతీకి తెరలేచింది. -
ఎవరి కమీషన్ల కోసం తప్పుడు నివేదికలు
నెల్లూరు(అర్బన్): సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఒకరిపై ఒకరు వేలు చూపుతూ తీవ్ర విమర్శలకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత.. డోన్టాక్ అంటూ అరుచుకున్నారు. ఇదంతా మంగళవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధుల సాక్షిగా జరిగింది. విషయాన్ని పరిశీలిస్తే జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సభను నడిపిస్తూ సాగునీటి రంగం అజెండాను ముందుకుతెచ్చారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల శాఖ సెంట్రల్ ఈఈ కృష్ణమోహన్తో కనుపూరు కాలువ పనులు పూర్తిచేశారా అని అడిగారు. ఈఈ సమాధానమిస్తూ పనులు పూర్తి కాలేదని, ప్రస్తుతం జరుగుతున్నాయని తెలిపారు. అందుకు కాకాణి స్పందిస్తూ పనులు జరుగుతుంటే మాకిచ్చిన బుక్లో పనులు పూర్తయినట్టు ఎలా రాశారని ప్రశ్నించారు. దీనికి ఈఈ కృష్ణమోహన్ వివరణ ఇస్తూ పొరపాటున అలా జరిగింది సార్.. పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని తెలిపారు. అంటే తాము ప్రశ్నించకపోతే పనులు పూర్తయినట్టు చూపుతారు.. నిలదీస్తే మాత్రం పనులు జరుగుతున్నాయని చెబుతారా.. ఇదేనా మీ సమాధానం అంటూ కాకాణి నిలదీశారు. పనులు కూడా బిట్లు, బిట్లుగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కంటిన్యూగా చేస్తే టెండర్లు పిలవాల్సివస్తుందని, బిట్లు, బిట్లుగా చేస్తే మధ్యలో ఉన్న కాలువ పనులు ఎవరు పూర్తిచేస్తారని అన్నారు. ఎవరి కమీషన్ల కోసం మీరు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దశలో వేదికపై ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జోక్యం చేసుకున్నారు. తమ కాలంలో కనుపూరు చివరి ఆయకట్టు బండేపల్లి వరకు పూర్తిగా సాగునీరిచ్చామన్నారు. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చేశామన్నారు. రివర్స్ పద్ధతిలో పల్లపు ప్రాంతాల నుంచి 100 హార్స్పవర్ మోటార్తో నీటిని ఎత్తైన ప్రదేశాలకు పంప్ చేసి వరిపంటను కాపాడామన్నారు. దీంతో ఎమ్మెల్యే కాకాణి జోక్యం చేసుకుంటూ 60 హార్స్పవర్ మోటారు పెట్టి 100 అంటారా.. ఎక్కడ పెట్టారో ఈఈ చెప్పాలన్నారు. మళ్లీ మంత్రి జోక్యం చేసుకుంటూ శ్రీశైలం నుంచి నీరు తెచ్చి బండేపల్లి వరకు మొదటిసారిగా నీరిచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడమే కాకుండా ఆ విషయం చెప్పాలంటూ ఈఈకి సూచించారు. దీంతో ఆగ్రహించిన కాకాణి గోవర్ధన్రెడ్డి తాము అధికారి ఈఈని వివరణ అడుగుతున్నామని, ఈఈ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. మీరు మధ్యలో కలుగు చేసుకోవద్దన్నారు. అందుకు ఆగ్రహించిన సోమిరెడ్డి తాను మంత్రినంటూ మండిపడ్డారు. దీంతో కాకాణి బదులిస్తూ మంత్రి అయితే ఏంటీ? అధికారులను అడిగితే నీకెందుకు.. అధికారి సమాధానం చెప్పాలకదా అని ఆవేశంగా మాట్లాడారు. దీంతో మంత్రి డోన్టాక్ అనడంతో కాకాణి అసలు నీవెవరివి.. ఇరిగేషన్ అధికారులు పనులు చేయకుండా చేసినట్టు చూపడంపై సభా చైర్మన్ను అడుగుతానన్నారు. ఈ దశలో సభ అదుపు తప్పింది. నీవెంత అంటే నీవెంత అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో చైర్మన్ బొమ్మిరెడ్డి జోక్యం చేసుకుని వ్యక్తిగతంగా వెళ్లవద్దని చెప్పారు. గొడవ సద్దుమణగక పోవడంతో సభను అర్ధంతరంగా వాయిదా వేస్తున్నట్టు బొమ్మిరెడ్డి ప్రకటించారు. దీంతో సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు. తండ్రీ కొడుకులు అవినీతి పరులు : కాకాణి సభ అనంతరం కాకాణి గోవర్ధన్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో తండ్రీ కొడుకులు అవినీతి పరులంటూ మంత్రినుద్దేశించి మాట్లాడారు. కనుపూరు కాలువలో రూ.25 కోట్లకు దొంగబిల్లులు పెట్టేందుకు ప్రయత్నించారని, కాలువపై రివర్స్ గేర్ పేరుతో మోటార్లకు రూ.75 లక్షల బిల్లులు పెట్టాలని చూశారని అన్నారు. తాము వెళ్లి నిలదీస్తే వాటిని రూ.35 లక్షలకు తగ్గించారని గుర్తుచేశారు. అధికారులను ప్రశ్నిస్తే అవినీతి బండారం బయట పడుతుందని తమను సోమిరెడ్డి అడ్డుకున్నారన్నారు. మంత్రి పోయిన ప్రతి గ్రామంలో 4 ఇళ్లు తగుల బడుతాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పేద రైతుల భూములకు వచ్చే నష్టపరిహారాన్ని దిగమింగాలనుకున్నారని ఆరోపించారు. పొదలకూరు మండలంలో పంటలు నిలువునా ఎండిపోతున్నాయని, చిత్తశుద్ధి ఉంటే కాపాడాలని అన్నారు. మిల్లర్ల నుంచి రూ.50 కోట్లు దండుకున్నారని, నిన్ను సర్వేపల్లి ప్రజలు తిరస్కరించడంతో నాలుగుసార్లు ఓడిపోయావని ఎద్దేవా చేశారు. ఖర్మకాలి దొడ్డిదారిన శాసన సభలో అడుగు పెట్టావన్నారు. నీముఖం చూడలేక అసెంబ్లీకి కూడా రాలేదన్నారు. రానున్న రోజుల్లో నీవు విదేశాల్లో దోచుకున్న ధనాన్ని కక్కిస్తామన్నారు. నీఉడుత బెదిరింపులకు భయపడేది లేదన్నారు. సమాధానం చెప్పలేక జెడ్పీ నుంచి పలాయనం చిత్తగించావని దుయ్యబట్టారు. అభివృద్ధిని జీర్ణించుకోలేక విమర్శలు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాము రైతుల పక్షాన నిలిచి చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక కాకాణి గోవర్ధన్రెడ్డి తనను విమర్శిస్తున్నారని అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తైన చివరి ఆయకట్టు వరకు నీరిచ్చిన ఘనత తమదేనన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా పంట దిగుబడి సాధించిన జిల్లాగా నెల్లూరును తీర్చిదిద్దామన్నారు. ఈ సంవత్సరం కరువు చాయలున్నాయన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు దమ్ములేక అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. కాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై విమర్శల దాడి పెరిగినప్పుడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అక్కడే ఉండి మౌనం దాల్చ డంపై టీడీపీ వర్గాల్లోని అసమ్మతి బయటపడింది. -
వాడీవేడిగా..
నెల్లూరు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. మంగళవారం నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ప్రారంభంలో సాఫీగానే సాగింది. కరువు, తాగు, సాగునీరు, నుడాలో పంచాయతీల విలీనంపై జరుగుతున్న నష్టంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. మధ్యాహ్నం పలువురు సభ్యులు సమస్యలపై నిలదీశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి కాకాణి గోవర్ధన్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిల మధ్య మాటలు యుద్ధం జరగడంతో చైర్మన్ సమావేశాన్ని వాయిదా వేశారు. డ్వామాలో అవినీతి సభకు అధ్యక్షత వహించిన జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తొలుత వెంకటగిరి రాజా సతీమణి మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు. అందరూ రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పాలని బొమ్మిరెడ్డి కోరారు. వైఎస్సార్సీపీకి చెందిన కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు బులగాకుల అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ డ్వామాలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. కలువాయి మండలంలో జరిగిన రూ.17.56 కోట్ల పనులకు సంబందించి సోషల్ ఆడిట్ వారు రూ.11.89 కోట్లు అవినీతి జరిగిందని లెక్కలు తేల్చారన్నారు. అయితే డ్వామా అధికారులు కేవలం రూ.2.50 లక్షలు మాత్రమే రికవరీ వేశారన్నారు. దుత్తలూరు జెడ్పీటీసీ సభ్యుడు చీదెళ్ల మల్లికార్జున మాట్లాడుతూ సంవత్సరం క్రితం చేసిన పనులను సైతం ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడదానికి కారణం డ్వామా అధికారులేనని ఆరోపించారు. వెంకటాచలం జెడ్పీటీసీ వెంకటశేషయ్య మాట్లాడుతూ అధికారులు నాలుగు గోడల మధ్య కూర్చొని టీడీపీ నాయకుల సిఫార్సుల మేరకు రికవరీలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో సోషల్ ఆడిట్ అధికారులది తప్పా లేదా డ్వామా అధికారులది తప్పా అని ప్రశ్నించారు. దీంతో డ్వామా పీడీ బాపిరెడ్డి మాట్లాడుతూ సోషల్ ఆడిట్ అధికారులు పనిమొత్తాన్ని పరిగణనలోనికి తీసుకుంటారన్నారు. తర్వాత తాము రికార్డులు పరిశీలించి మొత్తం పనిలో ఎంతవరకు జరిగిందో చూస్తామన్నారు. అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ డ్వామా కార్యాలయంలో ఏపీడీ నాసర్రెడ్డి కనుసన్నల్లో పాలన జరుగుతోందని విమర్శించారు. దీంతో మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని అదే నిజమైతే విచారణ చేసి వారంరోజుల్లోగా నాసర్రెడ్డిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాగునీటి ఎద్దడిపై ఆందోళన కోవూరు జెడ్పీటీసీ సభ్యుడు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అనేక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల అవినీతి వల్ల సీపీడబ్ల్యూఎస్ నీటి పథకాలు సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపించారు. దొరవారిసత్రం జెడ్పీటీసీ సభ్యురాలు విజేత మాట్లాడుతూ తమ మండలంలోని తీర ప్రాంతాల్లోని 15 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీర్చాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. సర్వేపల్లిలో తాగునీటి పరిస్థితి దారుణం తన నియోజకవర్గం సర్వేపల్లిలో 63 ఆవాస ప్రాంతాలుండగా, 20 ప్రాంతాలకు మాత్రమే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటిని సరఫరా చేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. పొదలకూరు ప్రాంతంలో 14 గ్రామాల్లో, ఊచపల్లి తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉందని అధికారులు సమాధానం చెప్పాలని కోరారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాట్లాడుతూ సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సర్వేపల్లి ప్రాంతాలకు తాగునీరు ఇస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నామన్నారు. కాకాణి మాట్లాడుతూ సర్వేపల్లి కాలువలో నెల్లూరు డ్రెయినేజీ కలుస్తోందని ఆ నీటిని మీరు తాగగలరా అని నిలదీశారు. నియోజకవర్గానికి నీరిచ్చే ప్రత్యామ్నాయ పథకానికి గత సంవత్సరంలో రూ.80 లక్షల అంచనాలు రూపొందించారని, ఇప్పుడు ఏకంగా అంచనాలను రూ.8 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. స్పెషల్ ఆఫీసర్స్ కూడా తమకెందుకులే అని తప్పించుకుంటున్నారని విమర్శించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రహ్మణ్యం, వై.శ్రీనివాసులురెడ్డి, బీద రవిచంద్ర తదితరులు తాగునీటి ఎద్దడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్కుమార్ మాట్లాడుతూ తాగునీటి ట్యాంకర్ల రవాణాకు ఇచ్చే మొత్తాన్ని రూ.450 నుంచి 650కు పెంచాలని కోరారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాలు దొరికే చోట నుంచి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. నుడాపై దుమారం కొడవలూరు జెడ్పీటీసీ ఇందూరు శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ తమ మండలంలోని 15 పంచాయతీలను నుడాలో ఎవరి అనుమతి తీసుకుని కలిపారని నిలదీశారు. గతంలో ఇంటి అనుమతికి రూ.400 చెల్లిస్తే ఇప్పుడు రూ.69 వేలు చెల్లించాల్సి వస్తోందన్నారు. నుడా తమకు అవసరం లేదన్నారు. ఇదే అంశంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నుడా పరిధిని తీసేయాలన్నారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ దీనిపై త్వరలో నుడా, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. నీరు తెస్తాం ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు, వింజమూరు తదితర ప్రాంతాల్లోని కరువుపై ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో పాటు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ తాగునీటికి ప్రాధాన్యత నిస్తామన్నారు. సాగునీటికి శ్రీశైలం నీరు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. సాగునీటిపై చర్చ సాగుతున్న సందర్భంలో సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్రెడ్డి పలు అంశాలను లేవనెత్తారు. అంశాలకు అధికారులు సమాధానం చెప్పే సమయంలో మంత్రి సోమిరెడ్డి జోక్యం చేసుకోవడంతో సమావేశం అదుపుతప్పింది. ఓ దశలో విమర్శలపర్వం తీవ్రం కావడంతో అజెండాలోని ఇతర అంశాల జోలికెళ్లకుండానే చైర్మన్ రాఘవేంద్రరెడ్డి సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీషా, జేసీ వెట్రిసెల్వి, జెడ్పీ సీఈఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. రామిరెడ్డి వర్సెస్ బీద కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి మాట్లాడుతూ చట్టం ప్రకారం కావలి కాలువకు 1,000 క్యూసెక్కుల నీరు వదలాల్సి ఉందన్నారు. అయితే 400 క్యూసెక్కులు వదిలారని దీంతో కావలి రూరల్ మండలంలో పంటలు ఎండిపోయాయని తెలిపారు. కొందరి స్వార్థం కోసం సిరిపురం చెరువు మధ్యలో 15 అడుగుల లోతున ఇరిగేషన్ అధికారులు కిలోమీటర్ పొడవున కాలువ తవ్వారంటూ ఫొటోలు ప్రదర్శించారు. కింది ప్రాంతాల్లో ఒకరి కోసమే ఇదంతా చేశారని ఆరోపించారు. వెంటనే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ తమపై అనసరంగా నిందలు వేయడం తగదన్నారు. కింది ప్రాంతాల వారికి నీళ్లిచ్చేందుకు అధికారులు తాత్కాలికంగా కాలువ తవ్వారన్నారు. 40 ఏళ్ల చరిత్రలో కావలి కాలువకు 500 నుంచి 1,000 క్యూసెక్కులు నీరిచ్చేలా అనుమతులు తెచ్చింది తామేనన్నారు. దీంతో రామిరెడ్డి మాట్లాడుతూ అధికారులు ఇందుకు సమాధానం చెప్పాలని బీదను అడగలేదన్నారు. దీంతో వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంతలో కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డి డెల్టా నీటిని అక్రమంగా కావలి ప్రాంతాల వారు దోచుకుంటున్నారని ఆరోపించారు. అమృత్ పథకంపై విచారణ జరపాలి పబ్లిక్హెల్త్ అధికారుల అత్యుత్సాహం ఎందుకు? ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు(అర్బన్): కేంద్ర ప్రభుత్వ నిధులతో పబ్లిక్హెల్త్ అధికారులు చేపట్టిన అమృత్ పథకంపై విచారణ చేపట్టాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డిమాండ్ చేశారు. సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటిపారుదల శాఖకు చెందిన కాలువలను పబ్లిక్హెల్త్ అధికారులు పూడికతీసి గోడలు నిర్మించి రంగులు వేస్తున్నారన్నారు. రూ.83 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ఆరు కాలువలకు ఇప్పటికే రంగులు వేశారన్నారు. పనులు నాసిరకంగా జరుగుతున్నాయన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలియకుండా, కనీసం మాట కూడా చెప్పకుండా టాటా కన్సెల్టెన్సీతో సర్వే చేయించుకుని పబ్లిక్హెల్త్ అధికారులు పనులు చేయిస్తున్నారన్నారు. సింగిల్ టెండర్ ద్వారా పనులు కాంట్రాక్టర్కు అప్పగించడం సిగ్గుచేటన్నారు. దీని వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో అధికారులే చెప్పాలన్నారు. స్థానిక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఇక రాజ్యాంగ వ్యవస్థలు ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయమై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ‘మీకు తెలియదా’ అంటూ ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. తమకు తెలియదని అధికారులు సమాధానం చెప్పారు. దీంతో మంత్రి ఇరిగేషన్ స్థలాలను ఇంకో శాఖ ఆక్రమిస్తుంటే ఇక మీరెందుకని ప్రశ్నించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఈ పథకాన్ని కూడా నుడా పరిధిలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇసుక దిబ్బలు తొలగించి ప్రాణాలు కాపాడాలి ఇదే సందర్భంలో కోటంరెడ్డి మళ్లీ మాట్లాడుతూ పొట్టేపాళెం చెరువు కలుజు వద్ద ఆర్అండ్బీ రోడ్డుపై కుప్పలు, తెప్పలుగా ఇసుక దిబ్బలు ఉన్నాయన్నారు. ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గతంలో తాను సొంత నిధులతో ఇసుక దిబ్బలు తొలగించానన్నారు. వీటిని తొలగించి ప్రమాదాలు నివారించాలని భవిష్యత్లో ఇసుక దిబ్బలు పేరుకుపోకుండా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సోమిరెడ్డిని కోరారు. దీంతో ఇసుకమేటలను తొలగించి రోడ్డును క్లియర్ చేయాలని ఆర్అండ్బీ అధికారులను మంత్రి ఆదేశించారు. -
కరువు ప్రకటన కోసం ప్రతిపాదనలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని 51 మండలాలను కరువు కింద ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపిందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు పేర్కొన్నారు. కరువు పరిశీలనకు వచ్చిన మంత్రి సోమిరెడ్డి గురువారం ఇక్కడి ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడు జిల్లాలో వర్షపాత లోటు 64.02 శాతం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో సాధారణ సాగు లక్షా 34 వేల హెక్టార్లకు గాను కేవలం 17 వేల హెక్టార్లు అంటే 12 శాతం మాత్రమే సాగైందని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు రూ. 15.81 కోట్లు, పశుగ్రాసం కోసం రూ. 24.85 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయానికి ఇప్పుడిస్తున్న విద్యుత్ సరఫరా సరిపోవడం లేదంటే అదనంగా ఇచ్చే అధికారాన్ని కలెక్టర్కు ఇచ్చామని వెల్లడించారు. సీపీడబ్లు్యఎస్ స్కీమ్ సకాలంలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేరుస్తామని, ప్రభుత్వ శాఖల ద్వారానే ఆ పనులు చేయిస్తామని హెచ్చరించారు. ఉపాధి పనుల కల్పన కోసం నాలుగు నెలల్లో రూ. 200 కోట్లు ఖర్చు చేశామని, ఈ యేడు రూ. 480 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాల కోసం ప్రభుత్వం సహాయం అందిస్తోందన్నారు. కృషి కల్యాణ్ అభియాన్లో కడప మొదటి స్థానంలో ఉందన్నారు. సూక్ష్మ సేద్యంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే జిల్లా అందులో మొదటి స్థానంలో ఉందని వివరించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలో 18.88 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు 1వ తేది నుంచి జిల్లా ప్రాజెక్టులకు శ్రీశైలం నీరు ఇవ్వాలని ఇటీవల కర్నూలులో జరిగిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారని చెప్పారు. రెండు రోజుల్లో కేసీ కెనాల్కు సాగునీరు వస్తుందన్నారు. వామికొండ, సర్వరాయసాగర్ రిజర్వాయర్ల కింద చేయాల్సిన 700 ఎకరాల భూసేకరణను త్వరగా పూర్తి చేస్తామన్నారు. గండికోట ముంపునకు గురయ్యే కొండాపురం మండలం రామచంద్రనగర్లో కూడా భూసేకరణ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, రెండవ జేసీ బి.శివారెడ్డి పాల్గొన్నారు. -
మంత్రి సోమిరెడ్డిని నిలదీసిన రైతులు
సాక్షి, వైఎస్సార్ కడప : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రామాపురం గ్రామంలో మంత్రి రైతు ముఖాముఖిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన రైతులు, 2013లో తాము తీసుకున్న రుణం ఇంతవరకూ మాఫీ కాలేదని మంత్రిని నిలదీశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం వల్లే టీడీపీకి ఓట్లేశామన్నారు. దీంతో నష్టనివారణకు దిగిన మంత్రి వచ్చే ఎనిమిది నెలల్లో రుణమాఫీ 4, 5 విడతలు జరుగుతాయని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రైతులు ఉద్యాన పంటలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని, ఏడు గంటల నిరంతర విద్యుత్ అందించాలని మంత్రికి విన్నవించుకున్నారు. -
నెల్లూరు జిల్లా టీడీపీలో ముసలం
-
రచ్చకెక్కిన ఆత్మకూరు రాజకీయం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా వారం నుంచి అధికార పార్టీ ఆత్మకూరు రాజకీయం హాట్హాట్గా సాగుతోంది. జిల్లాలో మంత్రి సోమిరెడ్డి ఆయన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి మధ్య ఆత్మకూరు నియోజకవర్గం వేదికగా వర్గపోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ పరిణామాల క్రమంలో ఆది వారం పరిస్థితి తీవ్రమై గత ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కన్నబాబు పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్షకు అనుచరులతో కలిసి కూర్చోవటంతో హైడ్రామా తారాస్థాయికి చేరింది. మరోవైపు సోమవారం మంత్రి నారాయణ, ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జి ఆదాల ప్రభాకర్రెడ్డి నియోజకవర్గంలో పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కన్నబాబు దీక్షకు దిగటం, భవిష్యత్తు పరిణమాలు ఎలా ఉంటాయనే దానిపై పార్టీలో తీవ్రంగా చర్చ సాగుతుంది. అధికార పార్టీలో ఆత్మకూరు ఇన్చార్జి చిచ్చు రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అంతర్గతంగా సాగుతున్న విభేదాలు మరింత ముదిరి రచ్చకెక్కాయి. ఈ వ్యవహారంలో జిల్లాలో ఇద్దరు మంత్రలు రెండు గ్రూప్లుగా మారి రాజకీయం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆత్మకూరు ఇన్చార్జి నియామకంపై మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పి.నారాయణ, అమర్నా«నాథ్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్రెడ్డి చర్చించారు. అయితే మంత్రులు ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు ఆత్మకూరులో కొనసాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇన్చార్జి పదవి ఆశిస్తున్న మంత్రి సోమిరెడ్డి వర్గీయుడు కన్నబాబు తన అనుచరులతో సమావేశానికి వచ్చి ఒక్కరినే ఇన్చార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ నేత మెట్టుకూరు ధనుంజయ్రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో సమావేశానికి గైర్హాజరై నిరసన తెలపారు. ఈ క్రమంలో ఆత్మకూరు వ్యవహారాన్ని సీఎం నిర్ణయానికి వదిలేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీంతో పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న ఆదాలను తాత్కలిక ఇన్చార్జిగా నియమించాలని పార్టీ ఆదేశించింది. దీంతో మరుసటి రోజునే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన వర్గీయుడు కన్నబాబుతో కలిసి ఆత్మకూరులో పర్యటించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించి, చేజర్లలో బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజకీయంగా మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాలకు వైరం ఉన్న క్రమంలో సోమవారం ఆదాల ప్రభాకర్రెడ్డి తాత్కలిక ఇన్చార్జి హోదాలో సోమవారం మంత్రి నారాయణతో కలిసి ఆత్మకూరులో పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆత్మకూరు టీడీపీ నేతలు కొందరు ఆదాలను కలిసి అభినందించారు. దీనిని కన్నబాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనకు దిగింది. పార్టీ కార్యాలయంలో కన్నబాబు ఆమరణ దీక్ష ఈ క్రమంలో ఆదాల నియామకాన్ని వ్యతిరేకిస్తూ కన్నబాబు పార్టీ రాజీనామా చేస్తారని బలంగా ప్రచారం సాగింది. దీనికి అనుగుణంగా ఆత్మకూరు టీడీపీ నేతలు, కొందరు కార్యకర్తలతో కలిసి నగరంలో ఆయన మూడు గంటలకు పైగా సుదీర్ఘ మంతనాలు జరిపారు. చివరిగా పార్టీ కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం ముందు ఆమరణదీక్షను ఆదివారం రాత్రి 9.15 గంటలకు ప్రారంభించి సేవ్ టీడీపీ అంటూ నినాదాలు చేశారు. జిల్లాకు చెందిన పార్టీ మంత్రులు, జిల్లా అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర నేతలు ఎవరూ పట్టించుకోకపోవటంతో పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్ష నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కన్నబాబుతో చర్చలు ప్రారంభించారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు కన్నబాబుతో దీక్ష విరమించాలని కోరినా ఫలితం లేదు. -
ఇదేందయ్యా..సోమిరెడ్డీ..!
వెంకటాచలం మండలం తాటిపర్తిపాళెంలో పంచాయతీ కార్యాలయాన్ని..కమ్యూనిటీ భవనాన్ని ఆ గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. సరిగ్గా 24 గంటలు గడవలేదు. హంగూ..ఆర్భాటాలు..మందీ మార్బలంతో వచ్చి మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మళ్లీ వాటిని ప్రారంభించారు. ఇది చూసి జనం అవాక్కయ్యారు. ఇదేం విడ్డూరమంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటివి ఆయనకు పరిపాటే అంటున్నారు స్థానికులు. మత్స్యకారులకు వలలు ఇస్తామని ప్రలోభపెట్టి కండువాలు కప్పడం.. సైకిళ్ల పంపిణీ కోసం తీసుకెళ్లి పార్టీలో చేరినట్లు ప్రకటించుకోవడం టీడీపీ నాయకులకే చెల్లుతోందని గుసగుసలాడున్నారు. వెంకటాచలం: మండలంలోని తాటిపర్తిపాళెంలో గేట్వే కంపెనీ ఏర్పాటుకు పంచాయతీ సహకరించడంతో ఆ కంపెనీ యాజమాన్యం గ్రామంలో తమవంతు సహకారంగా గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు కమ్యూనిటీ హాల్, పాఠశాలకు ప్రహరీ ర్మాణాలను చేపట్టింది. ఈ నిర్మాణాలు పూర్తికావడంతో అధికారికంగా గురువారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు సమక్షంలో పంచాయతీ కార్యాలయాన్ని, కమ్యూనిటీ హాల్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ డేగా శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో టీడీపీ గ్రామంలో చాలా బలహీనంగా ఉందనే విషయం స్పష్టమైపోయింది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు పంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీ హాల్ను 24 గంటల వ్యవధిలో మంత్రి సోమిరెడ్డి చేతుల మీదుగా మళ్లీ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. గురువారం గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారనే విషయం తెలిసినా మంత్రి సోమిరెడ్డి అవేమీ తనకు పట్టవన్నట్లు మళ్లీ ప్రారంభించడాన్ని చూసి గ్రామస్తులు నవ్వుకున్నారు. సర్పంచ్ ప్రారంభించిన కార్యాలయాన్ని మంత్రి మళ్లీ ప్రారంభించడం ఏమిటని సొంత పార్టీ నాయకులే చెవులు కొరుక్కున్నారు. వెంకటాచలం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో దిక్కుతోచక తీసుకునే నిర్ణయాలతో టీడీపీ నవ్వులపాలవుతోందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.