Somireddy Chandramohan Reddy
-
ఆ దమ్ము సోమిరెడ్డికి ఉందా?.. కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామదాసు కండ్రిగలోని పేదల దగ్గర భూములు తక్కువకు కొనుగోలు చేసాడని.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని కొట్టేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎల్లో మీడియాపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ భూములపై సీబీసీఐడీ అధికారులు చేత విచారణ జరిపించే దమ్ము సోమిరెడ్డికి ఉందా? నాఫై సోమిరెడ్డి 17 విజిలెన్స్ ఎంక్వరీ చేయించాడు.. తప్పుడు కేసులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిభో పరిశ్రమ వెళ్లిపోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే కారణం...కమిషన్ల కోసం సోమిరెడ్డి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఉద్యోగుల బదిలీల్లో కూడా సోమిరెడ్డి లక్షల రూపాయలు దండుకుంటున్నాడు. టీడీపీ హయాంలోనే రామదాస్ కండ్రిగ భూముల్లో అవినీతి జరిగింది.. దానిపై విచారణ జరిపే దమ్ము సీఎం చంద్రబాబుకి కూడా లేదు. కుటుంబాల్లో కలతలు వచ్చేలా ఎల్లో మీడియా వార్తలు రాస్తోంది. ఈ భూముల విలువల్లో 10 శాతం ఇప్పించగలిగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’’ అని కాకాణి సవాల్ విసిరారు. -
YSRCP నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు: కాకాణి
-
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి మండిపడ్డారు.
-
సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వాన్నం: కాకాణి
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కాకాణి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తున్నాం. ఇరిగేషన్లో అవినీతి ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వాన్నంగా ఉంది. తూ.తూ మంత్రంగా పనులు ముగించి నీళ్ళు వదిలితే ఆ పనుల్లో నాణ్యత ఎలా ఉంటుంది. టెండర్ల కంటే ముందే పనులు ముగించిన అవినీతి ఘనత సోమిరెడ్డిది. పూడికతీత పనులు ఎంత నాణ్యతగా ఉన్నాయో ఇవే సాక్ష్యాలు (ఫోటో ప్రూఫ్).నవంబర్ ఏడో తేదీన నీళ్ళు వదిలిన ఘనతను దినపత్రికలే సాక్షిగా చెబుతున్నాయి. నీకు అనుకూలంగా వున్న కొద్ది మంది రైతుల దగ్గర పనులు జరగలేదని చెప్పించడం కాదు. మొత్తం కనుపూరు కాలువ మీద 30 కోట్ల అవినీతి జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదు. సోమిరెడ్డి చేస్తున్న పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. విచారణలో అవకతవకలు జరిగినట్లు తేలితే దాని మీద మళ్ళీ విచారణ చేయిస్తాం.పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. స్టేట్మెంట్తో మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్లు కాలేరు. చిత్తశుద్ధితో పని చేయాలి. మద్యం షాపుల్లో ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ విక్రయిస్తే జరిమానాలు అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేశామని రెండు కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై క్యాష్ కొట్టు.. షాప్ పట్టు అని ఇప్పుడు కూడా చెబుతున్నాను. మీ అవినీతిని ఎప్పటికప్పుడు బయటకు చెబుతూనే ఉంటాం’ అని హెచ్చరించారు. -
సోమిరెడ్డి పై కాకాని ఫైర్
-
కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
-
పోర్టు సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
సాక్షి ప్రతినిధి నెల్లూరు/ముత్తుకూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దాడికి తెగబడిన వైనం కలకలం రేపింది. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునద్ధరణ పనులపై యాజమాన్యంతో చర్చించేందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి సోమవారం తన అనుచరులతో వెళ్లారు. పోర్టు ప్రధానద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ డీజీఎం ఎమ్మెల్యే కారుతోపాటు కొన్ని వాహనాలను లోనికి అనుమతించారు. మిగిలిన వాహనాలను తనిఖీచేయాలని నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన సోమిరెడ్డి కారునుంచి దిగివచ్చి కోపంతో ఊగిపోతూ అసభ్య పదజాలంతో తిట్లదండకం అందుకున్నారు. సెక్యూరిటీ డీజీఎంపై దాడికి తెగబడి ఆయన్ని వెనక్కి నెట్టివేశారు. తనకు జరిగిన అవమానాన్ని పోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసకువెళ్లే క్రమంలో పోలీసులు, నాయకులు డీజీఎంను వారించారు. ఇదే అంశంపై పోర్టు అడ్మిన్ భవనం వద్ద కూడా సోమిరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.సీఈఓతోనూ దురుసు ప్రవర్తనఎన్నికలముందు పోర్టు కంటైనర్ టెర్మినల్ సేవలను పునరుద్ధరిస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటివరకు పోర్టు యాజమాన్యంతో చర్చలు జరపకపోవడం, కార్యాచరణ చేపట్టకపోవడంతో సీఐటీయూ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి అఖిలపక్షం పేరుతో పోర్టు అధికారులతో మాట్లాడేందుకు సోమవారం వెళ్లిన సోమిరెడ్డి పోర్టు కార్యాలయంలోకి వెళ్లి సీఈఓతోనూ వాగ్వాదానికి దిగారు. ఆయనతో దురుసుగా ప్రవర్తిస్తూ కేకలు వేశారు. ఖండించిన కాకాణి కృష్ణపట్నం పోర్టులో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేయిచేసుకోవడాన్ని మాజీమంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమిరెడ్డి అఖిలపక్షం పేరిట డ్రామాలు ఆడుతూ, కూటమి పార్టీల నేతలను పోర్టుకు తీసుకెళ్లడం ఏమిటని నిలదీశారు. అత్యంత భద్రత ఉండే ప్రధానమైన పోర్టులో తనిఖీచేసి వాహనాలను అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినకుండా దాడి చేశారన్నారు. పోర్టు కార్యాలయంలోనూ సోమిరెడ్డి కేకలు వేసి సీఈఓతో దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. ఎమ్మెల్యే వీధిరౌడీలా మారి నేరుగా దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు. -
వీడియో: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దౌర్జన్యం..
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెచ్చిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సోమిరెడ్డి ప్రతీ చోటా దుసురుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సోమిరెడ్డి కృష్ణ పోర్టు వద్ద ఓవరాక్షన్ చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి కొట్టేందుకు ప్రయత్నించారు.వివరాల ప్రకారం.. కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. సోమవారం పోర్టు వద్దకు వెళ్లిన సోమిరెడ్డి.. తనతో వచ్చిన ఓ కారును అనుమతించకపోవడంతో ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో, వెంటనే కారు దిగి.. సెక్యూరిటీపై తన ఆధిపత్యం చూపించారు. సెక్యూరిటీని నెట్టేసి.. అతడికి కొట్టబోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రౌడియిజంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. అదాని పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి అక్కడి సెక్యూరిటీపై దౌర్జన్యం చేయడం సిగ్గుచేటు. రౌడీయిజం చేసి పరిశ్రమలను వెళ్లగొట్టాలని సోమిరెడ్డి కుట్రలు చేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలను బెదరగొట్టి సోమిరెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారు. గత పది ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. రౌడీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
సోమిరెడ్డి పై కాకాణి సెటైర్లు ..
-
కరప్షన్కి సోమిరెడ్డి బ్రాండ్ అంబాసిడర్: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: ఏపీ సర్కార్ లిక్కర్ పాలసీపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ నేతల పేరుతో ఒక్కో లిక్కర్ షాపుకి ఐదు లక్షల చొప్పున వసూలు చేశారని ఆయన మండిపడ్డారు. 30 శాతం వాటా కార్యకర్తల పేరిట వసూళ్లు చేశారని.. బెల్ట్ షాపుల వేలం సోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని కాకాణి ధ్వజమెత్తారు.నియోజకవర్గంలో 300 బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చారు. నెలకు ఒక్కో షాప్కు పదిహేను వేలు వసూలు చేస్తున్నారు. కూల్ డ్రింక్ షాపుల వాళ్లు నెలకు రూ.30 వేలు ఇవ్వాలని ఫిక్స్ చేశారు. కరప్షన్కి సోమిరెడ్డి బ్రాండ్ అంబాసిడర్’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు.బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులపై ఉన్న ధ్యాస, సోమిరెడ్డికి ప్రజల మీద లేదు. నా ఆరోపణలపై దమ్ముంటే సోమిరెడ్డి విచారణకు సిద్ధమా..?’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. -
సీబీఐ విచారణ కోరే దమ్ముందా: కాకాణి సవాల్
సాక్షి,నెల్లూరు:సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించే ధైర్యం సోమిరెడ్డికి ఉందా అని కాకాణి ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్5) ఈ విషయమై కాకాణి మీడియాతో మాట్లాడారు.‘తాను చెప్పిన పనులు అధికారులు చెయ్యడం లేదనే ఫ్రస్టేషన్లో సోమిరెడ్డి ఉన్నారు.తాను చెప్పిన వారిని కేసుల్లో ఇరికించడం లేదని సోమిరెడ్డి బాధపడుతున్నారు.సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.కేసులు,అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచిన తర్వాత మంచంలో పడుకుని ఉన్నాలాక్కొస్తాం. నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలలో ఒక్క దానినైనా రుజువు చెయ్యగలవా?నీకు దమ్ము దైర్యం ఉంటే నేను అవినీతి చేసినట్టు నిరూపించు. సూరాయి పాలేం ఇసుక రీచ్లో జరుగుతున్న తవ్వకాల మీద గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తున్నాం. నీరు చెట్టులో జరిగిన అవినీతి మీద విచారణకి అదేశిస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయని మానవత్వంతో వెనక్కి తగ్గాను. మైనింగ్ కాంట్రాక్టర్లతో చంద్రబాబు వద్దకు సోమిరెడ్డి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.సోమిరెడ్డి అవినీతి మీద విచారణ వేయాలి.ఆయన చేసిన అవినీతి బయటడుతుంది’అని కాకాణి అన్నారు. ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ -
సోమిరెడ్డి నీ చిలక్కొట్టుడు ఆపేయ్... కాకాణి మాస్ ర్యాగింగ్
-
సోమిరెడ్డికి YSRCP నేతలు వార్నింగ్
-
MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి బట్టబయలు
-
సోమిరెడ్డి అవినీతి బట్టబయలు.. రూ.100 కోట్ల దోపిడీకి స్కెచ్!
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి బట్టబయలైంది. రీచ్ టు రిచ్కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగానే ప్లాన్ వేశారని స్పష్టమవుతోంది. ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ.వందల కోట్లు సంపాదించాలని టార్గెట్గా పెట్టుకున్న ఆయన మనుషులు సూరాయపాళెం ఇసుక రీచ్లో సాగించిన హెచ్చరికలు, దూషణల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక వెలికి తీసేందుకు వచ్చిన గుంటూరుకు చెందిన శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోర్డ్ వర్కర్స్ అండ్ అదర్ వర్క్స్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాంట్రాక్టర్లను సోమిరెడ్డి మనుషులు బెదిరించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సోమిరెడ్డి తన మనుషులను రీచ్ వద్దకు పంపి డ్రెడ్జింగ్ వినియోగించే పడవలను వెనుక్కు పంపే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు కలెక్టర్నే తూలనాడారు. స్థానిక శాసన సభ్యుడిని కాదని మీరు ఏమి చేయలేరని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు.చంద్రబాబునాయుడు స్థానిక ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పా రు. మధ్యలో కలెక్టర్ ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ బూతుపురాణం అందుకున్నాడు. కలెక్టర్ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పద్ధతి ప్రకారం డ్రెడ్జింగ్ చేసేందుకు వచ్చారు. అయితే సోమిరెడ్డి అనుచరులు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను వెలికి తీస్తే ఎలాంటి ఆదాయం ఉండదని, మధ్యలో ఇసుక దిబ్బలను ఎత్తాలని సూచించారు.ఇదీ చదవండి: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడిఇందు కోసం తాము 300 ట్రిప్పుల గ్రావెల్ తోలి రీచ్కు దారులు ఏర్పాటు చేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. ఆయన (సోమిరెడ్డి) ఇంత చేస్తుంటే.. మీరు ఆయనకు తెలియకుండా ఏమైనా చేసినట్లు తెలిస్తే చాలా గొడవలు అవుతాయంటూ కంఠస్వరం పెంచుతూ మాట్లాడారు. ఈ మాటలను బట్టి చూస్తే ఉచిత ఇసుక పాలసీ డొల్లతనం ఇట్టే అర్థం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, తమ్ముళ్లు ఇసుక ద్వారా సొమ్ము చేసుకోవాలని ఎంతగా పరితపిస్తున్నారో తెలుస్తోంది. ఓ పక్కన రైతులు ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని, పర్యావరణకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమ సంపాదనకు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని వెనుక్కు తగ్గడమే లేదు. -
హైకోర్టు తీర్పు.. సోమిరెడ్డికి చెంపపెట్టు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కనుపూరు గ్రామానికి చెందిన జ్యోతి న్యాయ పోరాటం ఫలించింది. జ్యోతినే కనుపూరు ఉన్నత పాఠశాలలో వంట, సహాయకురాలిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి చెంప పెట్టుగా మారింది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం చిరు ఉద్యోగుల పొట్టకొట్టే చర్యలకు సిద్ధపడింది. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఏళ్ల తరబడి వివిధ వ్యవస్థల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులను ఎడాపెడా తీసిపడేసి.. ఆయా స్థానాల్లో తమకు కావాల్సిన వారిని నియమించే విధంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఓఏలు, పాఠశాలల్లో వంట, సహాయకురాళ్లుగా పనిచేసే వారిని నిబంధనలకు విరుద్ధంగా తొలగించి, ఆయా పోస్టుల్లో కొత్త వారిని నియమించి ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోస్టును బట్టి లక్షలాది రూపాయలు డిమాండ్ చేసి మరీ వసూళ్లకు పాల్పడినట్లు ఇటీవల బీజేపీ నేత బహిరంగంగా ఆరోపించిన విషయం విదితమే. ఈ క్రమంలో కనుపూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వంట సహాయకురాలిగా పని చేస్తున్న జ్యోతిని విధుల నుంచి స్వచ్ఛందంగా మానుకోవాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లను జ్యోతి లెక్క చేయకపోవడంతో ఆ పోస్టు నుంచి జ్యోతిని తొలగించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఒక లేఖ ఇచ్చారు. దాని ఆధారంగా అధికారులు ఆమెను విధుల నుంచి తొలగించారు. తనకు జరిగిన అన్యాయంపై జ్యోతి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి లేఖతో వంట సహాయకురాలిగా తొలగించడం అన్యాయమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జ్యోతి వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్యే లేఖతో జ్యోతిని తొలగించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ, జ్యోతిని తిరిగి యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ పరిణామం సోమిరెడ్డికి చెంపపెట్టులాందటని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలతోనైనా సోమిరెడ్డి కనువిప్పుతో వ్యవహరించాలని సర్వేపల్లి నియోజవర్గ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
సోమిరెడ్డి అక్రమాలపై విచారించండి
నెల్లూరు (బారకాసు): సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి, ఆక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. సోమిరెడ్డి అవినీతి, అక్రమాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమ వారం మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో సోమిరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై తాను త్వరలోనే నివేదిక విడుదల చేస్తానని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.3 లక్షలు ఇవ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారని బీజేపీ వెంకటాచల మండల ప్రధాన కార్యదర్శి పిల్లిపోకుల పెంచలయ్య ఇటీవల వెల్లడించారని గుర్తు చేశారు.ఆ విషయాలతో కాని, అతనితో కాని తనMý ు ఎటువంటి సంబంధం లేదన్నారు. కానీ.. ఆయనతో తానే మాట్లాడించినట్టు సోమిరెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశి్నంచారు. ‘అధికారం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి పెంచలయ్య మాతో మాట్లాడినట్లుగా నిరూపించాలి. అందుకోసం విచారణ కూడా చేయించుకోవాలి’ అని కాకాణి సూచించారు. తనపై కేసులు పెడితే భయపడేది లేదని, పోలీసులు, కేసులు, జైళ్లకు తాము భయపడేవాళ్లం కాదని అన్నారు. పోస్టులు అమ్మకునే బుద్ధి ఆయనకు గతంలోనే ఉందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు, వీఓఏ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదన్నారు. -
సోమిరెడ్డి అవినీతిపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
కట్టాల్సిందే ‘ఎస్’ ట్యాక్స్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సర్వేపల్లి నియోజకవర్గానికి ‘ఎస్’ ట్యాక్స్ గుదిబండగా మారింది. దినసరి కూలీల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి కప్పం కట్టాల్సిందే. లేదంటే భౌతిక దాడులతో ఆయన దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఇక ఆయన తనయుడు (షాడో ఎమ్మెల్యే).. కాదేదీ కమీషన్లకు అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఆయన కప్పాలు కట్టలేక పారిశ్రామికుల నుంచి లేబర్ ఏజెన్సీల వరకు తలలు పట్టుకుంటున్నారు. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టులో విడుదలయ్యే బూడిదను కూడా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ప్లాంట్లో విడుదలయ్యే ఫ్లయాష్లో 20 శాతం ఉచితంగా సిమెంట్ కంపెనీలకు ఇవ్వాలి. మరో 80 శాతం విక్రయించవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకున్న షాడో ఎమ్మెల్యే ఉచితంగా ఇచ్చే 20 శాతం బూడిదను తనకే ఇవ్వాలని పట్టుబట్టి చేజిక్కించుకున్నాడు. దానిని సిమెంట్ కంపెనీలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రతి నెలా రూ. 32 లక్షల ఆర్జించే ప్లాన్ ఇది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తోటపల్లి గూడూరు మండలం అనంతపురంలో రొయ్యల ఫీడ్తో పాటు మేత తయారు చేసే వాటర్బేస్ లిమిటెడ్ కంపెనీలో 150 మంది వరకు రోజువారీ లేబర్గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ లేబర్ కాంట్రాక్టుపై టీడీపీ నేతల కన్నుపడింది. తమకే ఆ కాంట్రాక్టు ఇవ్వాలని ఆ కంపెనీ ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగారు. దీనితో భయపడ్డ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా జంకింది. లేబర్ కాంట్రాక్ట్ను వెంటనే టీడీపీ నేతలకు అప్పగించింది. వెంకటాచలం మండలం కాకర్లవారిపాళెం ప్రాంతంలోని బేవరేజస్ పరిశ్రమలో పనిచేసే కార్మికులను తొలగించి టీడీపీ కార్యకర్తల్ని పెట్టుకోమని డిమాండ్ పెట్టారు. అలాగే ఆ పరిశ్రమల్లో మెస్ నిర్వహణ కూడా తన అనుచరుడికే ఇవ్వాలని పట్టుబట్టి యాజమాన్యాన్ని వేధిస్తున్నారు.కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పాటయిన ఫ్యాక్టరీలలో తయారయ్యే పామాయిల్ను తరలించే ట్యాంకర్ల నుంచి ‘ఎస్’ ట్యాక్స్ వసూళ్లకు తెరలేపారు. గత కొన్నేళ్లుగా పామాయిల్ ట్యాంకర్ల యజమానులు అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ అసోసియేషన్ నిర్వహణ కోసం ప్రతి లోడ్ ట్యాంకర్ నుంచి రూ. 300 వంతున వసూళ్లు చేసుకొనేవారు. షాడో ఎమ్మెల్యే కన్ను ఆయిల్ ట్యాంకర్లపై పడింది. ఆ అసోసియేషన్ పాలకవర్గాన్ని మార్చేసి వెంటనే తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రతి ఆయిల్ ట్యాంకర్ నుంచి అదనంగా రూ. 800 వంతున వసూళ్లు చేసుకునేలా ప్లానింగ్ చేసుకున్నాడు. దీంతో ప్రతిరోజు దాదాపు 150 వరకు ట్యాంకర్లు రూ. 1.2 లక్షలు వరకు ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. బయట రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాంకర్ల వద్ద అదనంగా రూ.4 వేలు వంతున వసూళ్లు చేస్తున్నారు. -
ఇసుక దోపిడీలో సోమిరెడ్డిదే ఫస్ట్ ర్యాంక్..
-
సోమిరెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
ఆధారాలు ఇస్తాం విచారణ చేసే దమ్ముందా ప్రభుత్వానికి
-
ఏ విచారణకైనా సిద్ధం.. సోమిరెడ్డికి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లే అవుట్లు వేశారు. సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారని.. అక్రమ అక్రమ లే అవుట్లపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారని కాకాణి తెలిపారు.‘‘40 లే అవుట్లు ఉన్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారు. 25 లే అవుట్లకు ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయలేదని వెల్లడించారు. టీడీపీ హయాంలోనే విజిలెన్స్ విచారణ చేసి రూ.6.5 కోట్లు జరిమానా విధించారు. కానీ అప్పట్లో సోమిరెడ్డి జోక్యం చేసుకుని డబ్బు కట్టకుండా చేశారు. ఈ వ్యవహారమంతా టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని’’ కాకాణి వివరించారు.‘‘నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దమ్ముంటే విచారణ చేయండి. పొదలకూరులోని లేఅవుట్ దారులతో నెల రోజుల నుంచి సోమిరెడ్డి లావాదేవీలు జరుపుతున్నారు. అది కుదరకపోవడంతో నుడా అధికారుల వద్ద పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నేను ఏ విచారణకైనా సిద్ధం. సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు ఇస్తాం.. విచారణ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. -
నీకు నిజంగా దమ్ముంటే.. సోమిరెడ్డికి కాకాని సవాల్
-
సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
సోమిరెడ్డిపై కేసు నమోదు
పొదలకూరు: ఎన్నికల వేళ ప్రచారంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మహిళలకు నగదు పంపిణీ చేసిన వ్యవహారంపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డి అప్పట్లోనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా.. మానవతా దృక్పథంతో సాయం చేశారంటూ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి తోసిపుచ్చారు. వీడియో విజువల్స్లో స్పష్టంగా సోమిరెడ్డి మహిళలకు నోట్లు ఇవ్వడం కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు.దీనిపై కాకాణి పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మూడు రోజుల క్రితం కాకాణి మీడియా సమావేశం నిర్వహించి సోమిరెడ్డి ప్రలోభాల పర్వంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా సర్వేపల్లి రిటర్నింగ్ అధికారి చినఓబులేసు పొదలకూరు పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.ఏప్రిల్ 12వ తేదీన శుక్రవారం సోమిరెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్రెడ్డి పొదలకూరు మండలం చెర్లోపల్లి గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు పంపిణీ చేశారు. సోమిరెడ్డి అనుచరులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పట్లో ఎన్నికల అధికారులు దీనిపై మండలస్థాయి అధికారులతో విచారణ జరిపించి.. మానవతా దృక్పథంతో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు అందజేసినట్టు నివేదిక సమర్పించి మమ అనిపించారు. ఎట్టకేలకు కాకాణి హెచ్చరికలతో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై ఐపీసీ 173–ఈ, ఆర్పీ యాక్ట్ 123 క్లాజ్–1 సెక్షన్ల కింద పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. -
టీడీపీ సోమిరెడ్డి వీడియో లైవ్ లో బయటపెట్టిన మంత్రి కాకాణి
-
బ్లడ్ శాంపిలా?.. ప్రమాణమా?
నెల్లూరు (దర్గామిట్ట): జూదం, మద్యంతో పాటు అన్ని అవ లక్షణాలు కలిగిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తనను అప్రతిష్ట పాల్జేసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ‘బెంగళూరు రేవ్ పార్టితో నాకు సంబంధముందని నిరూపిస్తావా? బ్లడ్ శాంపిల్ ఇస్తావా? లేక ప్రమాణం చేస్తావా?’ అంటూ ఆయన సోమిరెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం మంత్రి కాకాణి విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు తన స్టిక్కర్ ఉందనే ప్రచారంతో సోమిరెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ జరిగిందని, తన పాస్ పోర్ట్ దొరికిందని, గోపాల్ రెడ్డి తనకు సన్నిహితుడని చెత్త ఆరోపణలు చేశారని చెప్పారు.ఈ విషయంపై తాను సోమిరెడ్డికి మరోసారి సవాల్ విసురుతున్నానన్నారు. కారులో నా పాస్పోర్టు దొరికిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాస్పోర్ట్ తన దగ్గరే ఉందని చెబుతూ... కాకాణి దాన్ని మీడియాకు చూపించారు. ఆ కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని, ఆ కారుకు తన స్టిక్కర్ ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. గోపాల్రెడ్డితో తనకు పరిచయమున్నట్టు ఏ ఆధారమున్నా సోమిరెడ్డి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గోపాల్రెడ్డికి – రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక పోలీసులే స్పష్టం చేశారని, సోమిరెడ్డి మాత్రం రేవ్ పార్టీని తనకు అంట కడుతున్నారన్నారు.క్లబ్కు వెళ్లడం, పేకాటాడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. సోమిరెడ్డి వ్యక్తిత్వంపై గతంలో స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయని, వాటిని ఎప్పుడూ ఆయన ఖండించలేదన్నారు. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోమిరెడ్డిపై తాను చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనన్నారు. గతంలో కోర్టులో చోరీ ఉదంతంపై తనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. తన సచ్చిలతను నిరూపించుకునేందుకు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, మరి సోమిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు. -
‘సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి’
నెల్లూరు, సాక్షి: బెంగళూరు రేవ్ పార్టీకి, ఆ కేసు నిందితులకు.. తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపణలు చేయడంతో తాజాగా కాకాణి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. సోమిరెడ్డిది నీచమైన చరిత్ర. అలాంటి చరిత్ర నాకైతే లేదు. రిసార్ట్ ఓనర్ గోపాల్రెడ్డితో నాకు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి అంటున్నారు. దానికి ఒక్క ఆధారమైనా చూపించగలరా?. రాజకీయంగా ఎదుర్కొనేలేకే ఈ చౌకబారు ఆరోపణలు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి. పురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లారు. నేను చేస్తున్నవి ఆరోపణలు కావు.. పచ్చి నిజాలు. సోమిరెడ్డి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్ ఇవ్వడానికి నేను రెడీ. సోమిరెడ్డికి దమ్ముంటే నా ఛాలెంజ్ను స్వీకరిస్తారా?. నా పాస్ పోర్ట్ నా దగ్గరేదే ఉంది. ఇదివరకే మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని చెప్పా. అయినా ఆయన పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు. రేవ్ పార్టీతోగానీ, ఆ కేసు నిందితులకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నా కారు స్టిక్కర్ వాడకంపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం అని కాకాణి మరోసారి స్పష్టత ఇచ్చారు. -
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
-
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
నెల్లూరు: బెంగళూరు రేవ్ పార్టీ అంశానికి సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ‘పచ్చమంద’కు మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి వాతలు పెట్టారు. తనకు సంబంధాలు ఉన్నా, తనకు సంబంధించిన వారు ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చన్నారు కాకాణి. ఎవరో అనామకుడు తన కారు స్టిక్కర్ను జిరాక్స్ తీసి వాడుకుంటే అందులో తాను ఉన్నానంటూ పచ్చ మంద రాద్దాంతం చేస్తుందని కాకాణి ధ్వజమెత్తారు.‘నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా?’‘బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?, నెల్లూరులో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తా. ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుంది. ఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలి. బెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నా. బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ? , రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది.బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదు.రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు పాసు పోర్ట్ నా దగ్గరే ఉంది.కుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరాను.రోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.సో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్’ అంటూ మండిపడ్డారు.‘రేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. సోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయి. నాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు. యూత్ మినిస్టర్గా ఉండి క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిది. నా పాస్ పోర్ట్ నెల్లూరులో ఉంది. కారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని కాకాణి తెలిపారు. -
సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: సోమిరెడ్డి నీతిమాలిన మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద చల్లుతున్నాడని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని.. అందుకే మాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ చేర్చిన ఎఫ్ఐఆర్లో మా పేరు ఉందని నిరూపించగలరా..?. గవర్నర్ పాలనలో కేసులు బుక్ అయ్యిందా.. లేక టీడీపీ వచ్చిన తర్వాత కేసు బుక్ అయ్యిందా..? చెప్పే దమ్ము నీకు ఉందా?. మద్యం దొరికిన రైస్మిల్ ఓనర్కి, నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా..?’’ అంటూ మంత్రి కాకాణి సవాల్ విసిరారు.‘‘ఓటమిని ముందుగానే అంగీకరించిన సోమిరెడ్డి నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతున్నాడు. పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5 వేల మంది వచ్చారని నిరూపిస్తే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా.. సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.. ఓటర్లకి డబ్బులు పంచుతున్న సోమిరెడ్డిని డీస్ క్వాలిఫై చెయ్యమని సీఈసీకి ఫిర్యాదు చేశాను. సోమిరెడ్డి సంస్కారంగా బతకడం నేర్చుకోవాలి..ఎక్కడో మద్యం దొరికితే డాన్ని కూడా నాకు ఆపాదిస్తారా..?. మా ఎలక్షన్ కూడా సోమిరెడ్డే చేస్తున్నాడు.. నేను ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెబుతున్నాడు’’ అంటూ మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. -
ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి నాపై బురద జల్లుతున్నాడు
-
నీకు నిజంగా సిగ్గు ఉంటే.. టీడీపీ సోమిరెడ్డికి కాకాని స్ట్రాంగ్ కౌంటర్
-
పట్టపగలే ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన సోమిరెడ్డి
-
పచ్చ ప్రలోభాలు.. పట్టపగలే టీడీపీ నేత సోమిరెడ్డి బరితెగింపు
సాక్షి, నెల్లూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో ఉన్న పచ్చపార్టీ నేతలు పట్టపగలే ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీడీపీ నేత ప్రచారంలో భాగంగా రోడ్డుపైనే ఓటర్లులకు డబ్బులు పంచారు. నెల్లూరు జిల్లాలోని సర్వేసల్లి నియజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి బరితెగించారు. అక్కడ ఉన్న ఓటర్లకు డబ్బులు పంచారు. సోమిరెడ్డి పట్టపగలే మహిళా ఓటర్లుకు డబ్బుల, చీరలు పంచుతూ అడ్డంగా దొరికి పోయారు. -
సర్వేపల్లి బరిలో మళ్లీ వారే..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: జిల్లాలో సర్వేపల్లి నియోజకర్గానికి అనేక ప్రత్యేకతలున్నాయి. విస్తారంగా సముద్ర తీరం ఉంది. వేలామందికి ఉపాధి కల్పిస్తున్న కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు మండలంలో ఉంది. దాని ఆధారంగా అనేక పరిశ్రమలున్నాయి. సర్వేపల్లిలో రాజకీయాలు హాట్హాట్గా ఉంటాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఉంటారని ఎప్పుడో నిర్ణయమైంది. అయితే టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారోనని కొద్దిరోజులు ఉత్కంఠ నెలకొంది. దీనికి చంద్రబాబు నాయుడు తెరదించారు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికే అవకాశం కల్పించారు. మూడోసారి పాత ప్రత్యర్థులైన మంత్రి కాకాణి, సోమిరెడ్డిల మధ్య మూడో పర్యాయం పోటీ నెలకొంది. జిల్లాలో చూస్తే పాతకాపుల మధ్య పోటీ సర్వేపల్లిలోనే నెలకొనడం విశేషం. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కాకాణి, టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి తలపడ్డారు. కానీ కాకాణి విజయం సాధించారు. 14లో 5,500 ఓట్లు, 19లో 14 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడినా సోమిరెడ్డిని చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన పదవిని అడ్డు పెట్టుకుని 2019 ఎన్నికల్లో సర్వేపల్లి బరిలో నిలబడి అస్త్రశస్త్రాలు ప్రయోగించి మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. అదే బలం కాకాణి సొంత మండలం పొదలకూరు ఆయనకు కంచుకోట. దీనిపై సోమిరెడ్డి మంత్రి హోదాలో ఫోకస్ పెట్టి ఎన్నో రాజకీయ విన్యాసాలు చేశారు. కాకాణి స్వగ్రామం తోడేరులో ఒకరిద్దరిని ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకున్నా తర్వాత వారు సొంత గూటికే చేరుకున్నారు. 2019లో ఎన్ని కుయుక్తులు పన్నినా ఒక్క పొదలకూరు నుంచి కాకాణి సోమిరెడ్డిపై 4,700 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పుడు కూడా సోమిరెడ్డి పొదలకూరు మండలంపైనే తన దృష్టిని నిలిపి గోవర్ధన్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. క్యూ కట్టి.. సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి వలసలు పెరిగాయి. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగూడూరు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టి మరీ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. వారిని సోమిరెడ్డి నిరోధించలేకపోతున్నారు. దీంతో తమ పార్టీకి చెందిన వారికే కండువాలు కప్పి వైఎస్సార్సీపీ నుంచి వలసలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేగంగా అభివృద్ధి అధికార పార్టీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్రెడ్డి సర్వేపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా చేశారు. పల్లెల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం జరిగింది. మౌలిక వసతులు కల్పించారు. పంటలకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భూపట్టాల పంపిణీ, చుక్కల భూముల సమస్యల పరిష్కారం, పరిశ్రమల స్థాపన, నాన్ఫిషన్మెన్ ప్యాకేజీ తదితర పనులను పూర్తి చేశారు. దశాబ్దాల నాటి సమస్యలకు గడప గడపకు మనప్రభుత్వంలో మంత్రి పరిష్కారం చూపారు. దీంతో సర్వేపల్లిలో మరోసారి కాకాణి విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్నికల ప్రచారంలో టీడీపీ సోమిరెడ్డి మంత్రి కాకాని అదిరిపోయే సెటైర్లు
-
నీకు టికెట్ ఇచ్చినందుకు నేను ఫుల్ హ్యాపీ..
-
సోమిరెడ్డిపై మంత్రి కాకాని సెటైర్లు
-
కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి హైడ్రామా
నెల్లూరు: అదాని కృష్ణపట్నంపోర్టులో ఆదివారం అధికారులు ఎవరూ ఉండరు. పోలీసు సిబ్బంది మొత్తం మేదరమెట్ల సిద్ధం సభ విధులకు వెళ్లారు. ఇదే అదనుగా రాజకీయ మైలేజీ సాధించవచ్చని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తలపెట్టిన కుట్ర భగ్నమైంది. కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ సాకుతో చేసిన హైడ్రామా నవ్వులపాలైంది. కృష్ణపట్నంపోర్టు కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ పేరుతో సోమిరెడ్డి ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకుని పోర్టు వద్దకు ప్రదర్శనగా వచ్చారు. కొంతమందిని ముందుంచి గోపాలపురం వద్దకు చేరుకున్నారు. పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోర్టులో ఉన్నతాధికారులు ఎవ్వరూ లేరని, ముందస్తు సమాచారం లేకుండా, వారి అనుమతి లేకుండా లోపలకు వెళ్లనిచ్చేది లేదని సెక్యూరిటీ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో సోమిరెడ్డి వర్గీయులు రెచ్చిపోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు పోర్టు సెక్యూరిటీపై విరుచుకుపడడంతో తోపులాట జరిగింది. కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సెలవు రోజు ఆందోళన చేయడం ఏమిటంటూ సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తూ వారి హైడ్రామాను భగ్నం చేశారు. దీంతో సోమిరెడ్డి చేసేది లేక పోర్టు సీఈఓ జీజే రావుకు ఫోన్ చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం కంటైనర్ టెర్మినల్ను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే కంటైనర్ టెర్మినల్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ఆదివారం కనుక తనతో పాటు అధికారులు ఎవరూ ఉండరని, పరిశీలనకు మరో మారు రావాలని సీఈఓ బదులు ఇచ్చారు. దీంతో ఎటూ పాలుపోని సోమిరెడ్డి తన కార్యకర్తలతో కొద్ది దూరం నడిచి, మీడియా ఎదుట అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేసి వెనుదిరిగారు. -
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి ఫైర్
-
సోమిరెడ్డి పిచ్చికుక్క కరిచినట్టు మాట్లాడుతున్నారు
-
సోమిరెడ్డికి బిగ్ షాక్?!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు దేశం పార్టీలో సీనియర్లకు వరుస ఝలక్లు తగులుతున్నాయి. ఈ బాటలోనే జిల్లా నడుస్తోంది. నెల్లూరులో టీడీపీ పరిస్థితి కరి మింగిన వెలగపండులా తయారైంది. ఓ వైపు అధిష్టానం అభ్యర్థిత్వాలపై ఎటూ తేల్చలేకపోతుండడం, మరో వైపు పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు వెరసి అంతర్గత విభేదాలను తారాస్థాయికి చేరుస్తున్నాయి. ఫలితంగా క్యాడర్ డోలాయమానంలో కొట్టుమిట్టాడుతోంది. వెంకటగిరిలో ఈనెల 19న చంద్రబాబు నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభ సాక్షిగా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పార్టీకి అవసరాలకు తగ్గట్లుగా పని చేయకపోతే.. దూరంగా ఉండాలంటూ సోమిరెడ్డికి చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే.. స్థానిక ఎమ్మెల్యే (వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత) ఆనం రామనారాయణరెడ్డిని సభకు సోమిరెడ్డి ఆహ్వానించలేదు. దీంతో ఆనం అలకబూనారు. ఈ విషయంపై చంద్రబాబుకు సమాచారం పంపారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆనం రామనారాయణరెడ్డిని చివరి నిమిషంలో సభకు పిలిపించుకున్నారు. సభలో ఆనం ప్రసంగిస్తున్నప్పుడూ ఓ పథకం ప్రకారమే కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు అడ్డుతగిలారు. దీంతో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని బస్సులోకి పిలిపించుకుని చర్చలు జరిపారు. నమ్మి వస్తే అవమానిస్తారా..! నమ్మి పార్టీ లోకి వస్తే తమకు సరైన గుణపాఠం చెప్పారని ఆనం, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ లోకి వస్తే జిల్లాపై పెత్తనంతోపాటు కోరుకున్న సీటు ఇస్తానని మాటిచ్చిన విషయాన్ని ఆనం బాబుకు గుర్తు చేశారట. ఆత్మకూరులో పరిస్థితి బాగాలేదని, వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని ఆనం కోరగా బాబు వారించి ఆత్మకూరు నుంచే పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పి పంపారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బీద రవిచంద్రల తీరుపై బాబుకు ఆనం, కోటంరెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ పెద్దలు చేసుకున్న లోపాయికారీ ఒప్పందాల నుంచి ఇటీవల చేసిన మైనింగ్ అక్రమాల వరకు అన్నింటిపైనా ఆధారాలతో సహా బాబుకు వివరించారని తెలిసింది. నెల్లూరు రూరల్ను జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆ సీటు తనకే ప్రకటించాలని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరగా, అలాగే.. అంటూ చంద్రబాబు మాట దాటేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం సోమిరెడ్డి, బీద రవిచంద్రలను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు చివాట్లు పెట్టారని తెలుస్తోంది. చిన్నబుచ్చుకున్న సోమిరెడ్డి! కడప జిల్లాలో జరిగే సభకు చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సోమిరెడ్డి హెలిప్యాడ్ వద్దకు చేరుకోగా బాబు వారించి ‘నీ అవసరం లేదులే’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో సోమిరెడ్డి చిన్నబుచ్చుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
కదలి..రావట్లేదు
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బహిర్గతమవుతున్నాయి. నియోజకవర్గ బాధ్యులకు అధినేత చంద్రబాబు పర్యటన శిరోభారంగా మారింది. ఈనెల 19న రా...కదలిరా కార్యక్రమం కమలాపురంలో నిర్వహించ తలపెట్టారు. ఏర్పాట్ల కోసం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, పొలిట్బ్యూరో సభ్యుడితో సహా నలుగురు ఇన్చార్జిలు డుమ్మా కొట్టారు. పొరుగు జిల్లాలకు చెందిన సమన్వయ నేతల ఎదుట కమలాపురం ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ఇక్కడ రద్దు చేసి కడపలో పెట్టుకోండంటూ నేతల మధ్య ఉన్న అనైక్యతను బాహాటపర్చారు. ► కమలాపురం టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రా...కదలిరా కార్యక్రమం కడప పార్లమెంట్ పరిధిలో ఏర్పాట్ల బాధ్యతను మాజీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డికి అప్పగించారు. సమన్వయకర్తలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (నెల్లూరు), ఏరాసు ప్రతాపరెడ్డి (కర్నూల్) ఉన్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం కోసం చర్చించేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్చార్జిలు హాజరు కావాలని ముందస్తుగా సమాచారం ఉంది. మైదుకూరు, కమలాపురం, బద్వేల్ ఇన్చార్జిలు పుట్టా సుధాకర్, పుత్తా నరసింహారెడ్డి, రితేష్రెడ్డి హాజరయ్యారు. కాగా, నలుగురు గైర్హాజర్ కావడం విశేషం. చంద్రబాబు పర్యటన అంటేనే నేతలకు శిరోభారంగా మారింది. జిల్లాలో ప్రజలను సమీకరించడం టీడీపీ నేతలకు బహుకష్టంగా మారింది. దీంతో బాధ్యతలు భుజస్కందాలపై వేసుకునేందుకు ఆయా నేతలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జ్వరం సాకు చూపెట్టిన నేతలు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితోపాటు ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, పులివెందుల ఇన్చార్జిలు వరుసగా ప్రవీణ్కుమార్రెడ్డి, మాధవీరెడ్డి, భూపేష్రెడ్డి, బీటెక్ రవిలు హాజరు కాలేదు. అనంతపురం, కర్నూలు, నెల్లూరు నుంచి సమన్వయకర్తలుగా ఉన్న నేతలు హాజరైనా జిల్లాకు చెందిన వారు గైర్హాజరయ్యారు. ఫోన్లో వాకబు చేస్తే జ్వరం కారణంగా హాజరు కాలేదన్న సమాధానం ఆయా నేతల నుంచి వచ్చినట్లు సమాచారం. అందరికీ ఒక్కసారిగా జ్వరం వస్తుందా...కావాలనే హాజరు కాలేదని, ప్రోగ్రామ్ విఫలం చేయాలని ఉన్నారని కమలాపురం ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి ఆయా నేతలపై ఆరోపణలకు దిగినట్లు తెలుస్తోంది. ఒకదశలో చంద్రబాబు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రమైన కడపలో పెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆయా ఇన్చార్జిలతో పర్సనల్గా మాట్లాడుతామని పుత్తాను శాంతింపజేస్తూనే, చంద్రబాబు కార్యక్రమం విజయవంతం చేసేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, దేవగుడి శివనాథరెడ్డి, మైనార్టీ నేతలు అమీర్బాబు, ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి ఆనం షాక్.. అయోమయ స్థితిలో కోటంరెడ్డి
వైఎస్సార్సీపీ కంచుకోటగా పేరొందిన నెల్లూరు జిల్లాలో పాగా వేయడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆది నుంచి బెడిసి కొడుతున్నాయి. పార్టీ సీనియర్లకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని, కొత్త వారికి ఇద్దామంటే అభ్యర్థులు దొరకడం లేదని అధిష్టానం తలలు పట్టుకుంటోంది. నెల్లూరు ఎంపీతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల నియామకం ఒక సమస్య అయితే జనసేనతో పొత్తు పచ్చనేతల్లో వర్గపోరుకు దారితీస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ నుంచి అసెంబ్లీ స్థానం వరకు ఎవరూ బరిలో దిగేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంట్ స్థానానికి కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషణ చేస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి చెందారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండడంతో నెల్లూరు పార్లమెంట్ సీటుకు టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదనేది భయంతో పలాయనం చిత్తగిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో పలు నియోజకవర్గాల నుంచి కొత్త ముఖాలను బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీ నేతలు నెల్లూరు సిటీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్యాకేజీ ఇచ్చి రూరల్ నియోజకవర్గం వైపు మళ్లించే ప్రయత్నాలు చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో నెల్లూరు రూరల్ తనకే అని అనుకుంటున్న వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. టికెట్ ఇస్తే టీడీపీ తరఫున... లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని శ్రీధర్రెడ్డి నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ► సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ వరుసగా ఐదుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి కొత్త వ్యక్తిని నిలబెట్టాలని టీడీపీ భావిస్తోంది. అందుకే ఇప్పటి వరకు సోమిరెడ్డి అభ్యర్థిత్వంపై స్పష్టత లేదని సమాచారం. ► కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ దఫా ఆయన కుమారుడు దినేష్రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీకి ఉన్న బలంతో పాటు పోలంరెడ్డిపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇక్కడ కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ► కావలిలో ఇప్పటికే నలుగురు నేతలు టికెట్ అడుగుతున్నప్పటికీ వీరందరూ మండలస్థాయి నాయకులే. కొత్తగా మైనింగ్ మాఫియా డాన్ డి.వెంకటకృష్ణారెడ్డికి సీటు ఇవ్వాలనుకున్నా ఓటమి తప్పదని సర్వేల్లో తేలింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తేలకుండా ఉంది. ► ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని, ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ టికెట్ మాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పనిలో పనిగా వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నాడు. ఇక బీసీ మార్కుతో చెంచలబాబు యాదవ్ సీటు ఆశిస్తున్నాడు. మరి చంద్రబాబు బ్యాగ్ బరువున్న వ్యక్తుల వైపే చూస్తాడా? సామాజిక న్యాయం వైపు చూస్తాడా అనేది తేలాల్సి ఉంది. ► ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని దింపాలని యోచిస్తున్న టీడీపీకి ఆయన బిగ్షాక్ ఇచ్చినట్లు తెలిసింది. ఆత్మకూరు నుంచి పోటీలో ఉండబోనని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవల వరుసగా రెండు దఫాలు ఆయన సొంతంగా సర్వే నిర్వహిస్తే ప్రజాదరణ తక్కువగా ఉన్నట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆనం సైతం ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. ► కందుకూరు నుంచి ఇంటూరి బ్రదర్స్ మధ్య పోటీ ఉంది. ఇందులో ఇంటూరు నాగేశ్వరరావుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే వైఎస్సార్సీపీ బలంగా ఉన్న కందుకూరులో టీడీపీ ఓటమి తప్పదని, దీంతో కొత్త వారికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురు పెట్టుబడికి సిద్ధంగా అధిష్టానం మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉండడంతో ఆ పార్టీ అధినేత తల పట్టుకున్నట్లు సమాచారం. సీట్ల కోసం డబ్బు మూటలతో వస్తారని ఆశించిన చంద్రబాబుకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు కావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అయితే సర్వేపల్లి, కోవూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నప్పటికీ కనీసం అధికార పార్టీకి ఏ మాత్రం పోటీ ఇచ్చే స్థాయి నేతలు కాకపోవడంతో వీరి స్థానంలో కొత్త వారిని రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత యోచన. ఇందుకు బడాబాబులను ఆహ్వానిస్తున్నప్పటికీ పోటీకి వారు కూడా సిద్ధంగా లేకపోవడంతో కొంచెం పెట్టుబడి మీరు పెట్టండి.. మిగతాది పార్టీ చూసుకుంటుందని హామీ ఇస్తున్నారంట. కొత్త వారు దొరక్కపోతే కోవూరు, కందుకూరు, ఉదయగిరిలో పాత వారికే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. సర్వేపల్లి, కావలి, ఆత్మకూరులో కచ్చితంగా కొత్త అభ్యర్థులు వస్తారని తెలుస్తోంది. -
AP: నెల్లూరులో టీడీపీకి షాక్.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు
సాక్షి,నెల్లూరు: మరి కొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ముత్తుకూరు మండల కేంద్రంలో 200 మంది యువకులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. యువకులందరికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ రెండు నెలల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కనుమరుగై పోతాడని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు శుభం కార్డ్ అయితే సోమిరెడ్డికి ఎండ్ కార్డు పడుతుందని కాకాణి అన్నారు. ఇదీచదవండి.. ఓం ప్రథమం.. ఎదురైంది దుశ్శకునం -
టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి వార్నింగ్
-
మహిళా ఉద్యోగినిపై నోరుపారేసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి
-
సోమిరెడ్డిని హీరోగా RGV సినిమా తీస్తే సూపర్ హిట్టు .. మంత్రి కాకాణి సెటైర్లు
-
Fact Check: నిబంధనలు పాటించినా ఏడుపే!?
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టుల కేటాయింపు, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కాంట్రాక్టు నిర్ధారణతో సహా అన్ని విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అత్యంత పారదర్శకతో వ్యవహరించాయి. అన్ని అంశాల్లో అత్యంత పకడ్బందీగా నిబంధలను పాటించినప్పటికీ ఈనాడుతో సహా కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వం, ఇంధన సంస్థలపై పదేపదే అసత్య ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించినట్లు శుక్రవారం వార్తలు ప్రచురించాయి. అయితే, సోమిరెడ్డి మాటల్లో నిజంలేదని, ఈనాడు, ఇతర పచ్చపత్రికల్లో రాతలన్నీ పచ్చి అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పద్మజనార్ధనరెడ్డి స్పష్టంచేశారు. ఆరోపణ : ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల పేరుతో జగన్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది.. వాస్తవం : కేంద్ర ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్, ఏపీ ప్ర భుత్వ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. దేశంలో అర్హత గల ప్రతి గుత్తేదారు (కాంట్రాక్టరు) పాల్గొనే అవకాశం కల్పించారు. రివర్స్ టెండరింగ్ జరిపిన తర్వాతే ఏపీఎస్పీడీసీఎల్ పరికరాలను కొనుగోలు చేస్తోంది. అన్ని నిబంధనలు పరిశీలించిన తరువాత, ఈ ప్రక్రియలో పాల్గొన్న అందరిలో ఎల్–1గా ఉన్న గుత్తేదారుని ఎంపిక జరుగుతుంది. నామినేషన్ పద్ధతిలో ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేయడమనేది అసలు వీలుపడదు. ఆరోపణ : ఎలాంటి అనుభవంలేని సంస్థకు ప్రభుత్వం వేల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టింది.. వాస్తవం : షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనేది చిన్న సంస్థ ఏమీకాదు. ఈ సంస్థకు 25 ఏళ్లుగా విద్యుత్ ట్రా న్స్ఫార్మర్ల తయారీలో అనుభవం ఉంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లే బొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపుతో ఆసియాలోనే అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు వచ్చిన విషయం బహుశా సోమిరెడ్డికి తెలియదేమో. ఆరోపణ : ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 611.40 కోట్ల విలువైన పనులకుగానూ రూ.380 కోట్ల విలువైన పనులకు షిరిడీ సాయికే కట్టబెట్టింది.. వాస్తవం : తక్కువ ధరకు కోట్చేసిన సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ కెపాసిటీల కు సంబంధించి 53,003 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లను షిరిడిసాయి సంస్థ దక్కించుకుంది. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 35,911 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లనూ పొందింది. గత ప్రభుత్వంలోనే హెచ్వీడీఎస్, వివిధ సబ్–స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించి రూ.2,799.38 కోట్ల విలువైన పనులను షిరిడిసాయి సంస్థ కైవసం చేసుకుంది. నిజంగా ఇది సీఎం జగన్మోహన్రెడ్డికి కావాల్సిన వారి సంస్థ అయితే గత ప్రభుత్వ హయాంలో ఎందుకు టెండర్లు కట్టబెట్టారు? ఆరోపణ : రామాయపట్నం పోర్టు దగ్గర రూ.42 వేల కోట్ల ప్రాజెక్టు షిరిడీ సాయికి ఇచ్చింది.. వాస్తవం : రామాయపట్నం పోర్టు దగ్గర సోలార్ ప్యానల్ తయారీ పార్కు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు. దీని కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంలేదు. దీనిబట్టే ఈ కంపెనీ అన్ని అర్హతలున్న పెద్ద సంస్థ అని, దిగ్గజ సంస్థలను కాదని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు దక్కించుకుందని అర్థమవుతోంది. రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులన్నీ పూర్తి చట్టబద్ధంగా జరిగాయి. ఆరోపణ : పక్కపక్క రాష్ట్రాలు కొన్న ట్రాన్స్ఫార్మర్ల ధరల్లో వ్యత్యాసం ఉందంటే దోపిడీ జరిగినట్లే కదా.. వాస్తవం : ట్రాన్స్ఫార్మర్ ధర దానిలో ఉపయోగించే వైండింగ్ వైర్ డయామీటర్, కాయిల్స్ డయామీటర్, ఇన్సులేషన్, క్లియరెన్స్, ట్యాంక్ డైమెన్షన్, ట్రాన్స్ఫార్మర్, ఆయిల్ క్వాంటిటీ, కోర్ సైజు వంటి నాణ్యతలను బట్టి ఉంటుంది. టెండర్లు వేసిన సమయంలో కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధంవల్ల ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే పరికరాల ధరలు అధికంగా ఉండేవి. ఏపీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేసిన నియంత్రికల్లో నష్టాలు ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్) కన్నా చాలా తక్కువ. వివిధ కంపెనీల ట్రాన్స్ఫార్మర్లను బెంగుళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఎస్ఐ) టెస్ట్చేసి షిరిడిసాయి, తోషిబా నియంత్రికల్లో నష్టాలు ఐఎస్ ప్రకారం వున్నాయని ధృవీకరించడం విశేషం. ఇతర కంపెనీల ఉత్పత్తిదారుల ట్రాన్స్ఫార్మర్లు ఈ టెస్టులో ఫెయిలయ్యాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నిర్ధేశించిన విధంగా మన డిస్కంలు ప్రస్తుతం ఫైవ్స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు బాగా తగ్గాయి. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా సమస్యలు తగ్గుముఖం పట్టాయి. కానీ, సోమిరెడ్డి మాత్రం టూ–స్టార్తో ఫైవ్స్టార్ ధరను సరిపోల్చారు. తెలంగాణ డిస్కంలు టూ స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశాయి. ఆరోపణ : కడప కంపెనీదే హవా.. వాస్తవం : ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు టెండరు పొందింది షిరిడిసాయి సంస్థ ఒక్కటే కాదు.. దీనితోపాటు హైపవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, కన్యకాపరమేశ్వరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (మెదక్ జిల్లా), బీఎస్సార్ పవర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (తెనాలి), సాయిబాబా ఫ్లేమ్ ఫ్రూఫ్ స్విచ్గేర్, ట్రాన్స్కాన్ ఇండస్ట్రీస్, తోషిబా ట్రాన్స్విుషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రినిటీ క్లీన్టెక్(హైదరాబాద్), ఎస్వీఆర్ ఎలక్ట్రికల్స్, విజయ్ ట్రాన్స్ఫార్మర్స్ (గుంటూరు) సంస్థలు కూడా కాంట్రాక్టు పొందిన వాటిలో ఉన్నాయి. ఆరోపణ : వ్యవసాయ మీటర్లకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు అమర్చుతామని చెబుతున్న ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేస్తోంది.. వాస్తవం : దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర ఇంధన శాఖ నిబంధనల మేరకే స్మార్ట్మీటర్ల ఏర్పాటుకు టెండరు నిబంధనావళి తయారైంది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్మీటర్లు ఉచితమే. ఇక ఏపీఈఆర్సీ నిర్ణయించిన దాని ప్రకారమే ట్రూఅప్ వంటి విద్యుత్ చార్జీలు ఉంటాయి. -
టీడీపీ హయాంలోనే అక్రమ తవ్వకాలు
రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఓవైపు అసత్య ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ‘ఈనాడు’ తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విషం చిమ్ముతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించగా.. రోడ్ల అభివృద్ధిపై ‘ఈనాడు’ తప్పుడు కథనం ప్రచురించింది. వాస్తవాలను పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డే గ్రావెల్ మాఫియాను ప్రోత్సహించారని వెల్లండైంది. అలాగే గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ‘ఈనాడు’ తప్పుడు కథనం ప్రచురించిందని స్పష్టమైంది. నెల్లూరు: గత టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అండతో వెంకటాచలం మండలంలో గ్రావెల్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోయింది. గ్రామాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. టీడీపీ నాయకులు తవ్వి న గ్రావెల్ గుంతలు వేసవిలో చిన్నారులను బలి తీసుకుంటున్నాయి. తాను చేసిన పాపాలను సోమిరెడ్డి ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ప్రజల ముందు నవ్వులపాలయ్యాడు. ఇలాంటి ఘటన తాజాగా వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామంలో వెలుగుచూసింది. అడ్డూఅదుపూ లేకుండా.. గత ప్రభుత్వంలో వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్, కనుపూరు చెరువులతోపాటు గ్రామాల్లోని అన్ని చెరువుల్లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. దీనిపై అప్పట్లో రైతులు, గ్రామస్తులు పలు దఫాలు ఆందోళనలు చేసినా సోమిరెడ్డి అండతో గ్రావెల్ అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా నిర్వి రామంగా సాగింది. వర్షాకాలంలో చెరువుల్లో నిండుగా నీరు చేరడంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను సైతం వదలకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. టీడీపీ నాయకుల ధనదాహం కారణంగా గ్రామానికి అనుకుని ఉన్న చెరువులు, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాల్లో 10 నుంచి 20 అడుగుల లోతుకు పైగా టీడీపీ నాయకులు తవ్విన గ్రావెల్ గుంతలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. సోమిరెడ్డి ధనదాహానికి విద్యార్థుల బలి 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన సోమిరెడ్డి దొడ్డిదారిన మంత్రి పదవి దక్కించుకుని అవినీతి, అక్రమ సంపాదనపై దృష్టి సారించారు. అందులో భాగంగానే వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రిజర్వాయర్, కసుమూరు, ఈదగాలి, తిక్కవరప్పాడు, కంటేపల్లి, కనుపూరు రిజర్వాయర్, సర్వేపల్లి గ్రామాల నుంచి రేయింబవళ్లు అక్రమంగా గ్రావెల్ తరలించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. సోమిరెడ్డి తవ్వించిన భారీ గ్రావెల్ గుంతలు గత నెలలో అనికేపల్లిలో ఒక విద్యార్థిని, మూడు రోజుల క్రితం గొలగమూడిలో మరొక విద్యార్థిని బలి తీసుకున్నాయి. అనికేపల్లి గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి తురకా వెంకయ్య తోటి విద్యార్థులతో కలిసి గ్రామానికి అనుకుని ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ వద్దకు ఈతకు వెళ్లి గ్రావెల్ గుంతలో పడి మృతిచెందాడు. ఇది సోమిరెడ్డి హయాంలో తవ్విన గ్రావెల్ గుంతే. కానీ ఈ మరకను సోమిరెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టే కుట్ర చేసి విఫలమయ్యాడు. గొలగమూడిలో టీడీపీ నాయకులు చాకలి చెరువులో తవ్విన గ్రావెల్ గుంతలో పడి మూడు రోజుల క్రితం 2వ తరగతి విద్యార్థి హిమాయితుల్లా మృతిచెందడంతో తన పాపాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ఆ గ్రామానికి వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులు తవ్విన గోతులని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు కొందరు అవి ఇప్పుడు తవ్విన గుంతలు కాదని, 2016–17లో తవ్వి న గుంతలని చెప్పడంతో అందరి ముందు నవ్వులపాలయ్యాడు. ఒకే పంచాయతీలోని అనికేపల్లి, గొలగమూడి గ్రామాల్లో సోమిరెడ్డి ధనదాహానికి ఇద్దరు చిన్నారులు బలయ్యారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డే కారణం గొలగమూడి, అనికేపల్లి గ్రామాల్లో ఇద్దరు చిన్నారులు గ్రావెల్ గుంతల్లో పడి చనిపోవడానికి సోమిరెడ్డే కారణం. టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి అండతో గ్రావెల్ తవ్వకాలు అడ్డూఅదుపూ లేకుండా సాగాయి. అప్పట్లో తవ్విన గ్రావెల్ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన విషయం వాస్తవం. కానీ సోమిరెడ్డి దిగజారి ఆ పాపాన్ని వైఎస్సార్సీపీపై వేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. – ఉడతా శ్రీనివాసులు, గొలగమూడి గత టీడీపీ ప్రభుత్వంలో గొలగమూడి గ్రామంలో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. సోమిరెడ్డి అండతో నాగులవరం, గొలగమూడి గ్రామాల చుట్టూ గ్రావెల్ అక్రమంగా తరలించడంతో ఎక్కడ చూసినా భారీ గుంతలు ఏర్పడ్డాయి. సోమిరెడ్డి హయాంలో తవ్విన చాకలి చెరువు గుంతలో పడి హిమాయితుల్లా మృతిచెందితే దానిని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడం సరికాదు. – అన్నపరెడ్డి శీనయ్య, గొలగమూడి -
సోమిరెడ్డి, టీడీపీ పై మంత్రి కాకాని సెటైర్లు మామూలుగా లేవు..
-
సోమిరెడ్డి.. ఇలా అయిపోయావేంటి?.. అభిమానులను అద్దెకు తీసుకొచ్చి..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులపై పార్టీ బలం పెంచాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు బలవంతంగా ఆ పార్టీ కండువాలు వేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉన్న క్రమంలో ఆ పార్టీ కార్యక్రమాలకు నలుగురిని పిలిచినా వచ్చే పరిస్థితి లేదు. అంతకంటే ముందు ఆ నియోజకవర్గ ఇన్చార్జి సోమిరెడ్డి గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ఇప్పటికే ఆ పార్టీ నేత చినబాబు ‘వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వాళ్లకు ఈ దఫా టికెట్ లేదని’ ప్రకటించడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ రావడంపై అనుమానాలు ఉండగా సరికొత్త డ్రామాకు తెర తీశాడు. ఇప్పటికే మండలస్థాయిలోని ద్వితీయ శ్రేణి నాయకులపై రోజు పక్క పార్టీల నుంచి జనం టీడీపీలో చేరుతున్నట్లు చేయాలని ఒత్తిడి పెంచారు. వెంకటాచలంలో మండలం టీడీపీ నాయకుల మధ్య అంతర్గతపోరు కొనసాగుతోంది. ఆ పార్టీ నాయకులు సోమిరెడ్డి వద్ద మెప్పు పొందేందుకు బయట నియోజకవర్గాల నుంచి అభిమానులను అద్దెకు తీసుకువచ్చి వెంకటాచలం మండలానికి సంబంధించిన వ్యక్తులుగా పరిచయం చేసి కండువాలు కప్పి టీడీపీలో చేరినట్లు చెప్పుకుంటున్నారు. గత ఏప్రిల్లో వెంకటాచలం వడ్డిపాళేనికి చెందిన రాజేంద్ర ఆధ్వర్యంలో వెంకటాచలంలో కార్యక్రమం నిర్వహించి నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు వందల మంది టీడీపీలో చేరినట్లుగా సోమిరెడ్డి ప్రకటించి నవ్వుల పాలయ్యారు. తాజాగా వెంకటాచలం మండలం కాకుటూరులో కొందరికి బలవంతంగా పార్టీ కండువాలు కప్పి వారంతా టీడీపీలో చేరినట్లు ప్రకటించుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. వెంటనే వారంతా వైఎస్సార్సీపీ నేత వెంకటశేషయ్య వద్దకు వెళ్లి తాము వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని, సోమిరెడ్డి బలవంతంగా కండువాలు వేశాడని తెలిపారు. ఇలా మరోసారి సోమిరెడ్డి నవ్వుల పాలయ్యాడు. -
టీడీపీ నేత దౌర్జన్యం.. ఛానల్ రిపోర్టర్పై దాడి!
సాక్షి, నెల్లూరు: వెంకటాచలంలో టీడీపీ నేత రాజేంద్ర దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలు కడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. వివరాల ప్రకారం.. వడ్డిపాలెంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్త రాజేంద్ర అనే వ్యక్తి వారికి అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం, ఇది కవర్ చేయడానికి వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్ వెళ్లడంతో అతడిపై రాజేంద్ర కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో రాజేంద్రను వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, రాజేంద్ర దొరక్కపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, టీడీపీ నేత సోమిరెడ్డి ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
టీడీపీపై ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం !
-
టీడీపీ వాళ్ళకి ఇది కొత్త ఏం కాదు
-
ఉద్యోగుల గురించి ABN రాధాకృష్ణ చంద్రబాబు..దారుణ పదజాలం
-
టీడీపీ సర్పంచ్ చేతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సజీవ దహనం
చంద్రగిరి (తిరుపతి జిల్లా): టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ నేతలు మరోసారి బరితెగించారు. ఇటీవల కుప్పం, పుంగనూరు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులపై టీడీపీ మూకల దాడులను మరిచిపోకముందే మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. అన్నెంపున్నెం ఎరుగని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్పై పెట్రోల్ పోసి అతడి కారుతో సహా సజీవ దహనం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు చాణక్య ప్రతాప్, రుపంజయ తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సొంత అల్లుడు సంజీవ్కు స్వయానా బాబాయి కుమారులే కావడం గమనార్హం. అంతేకాకుండా టీడీపీ సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల శ్రీరామ్లతోనూ నిందితులకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ చౌదరితోనూ పరిచయాలు ఉన్నాయి. రాజీ పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పిలిపించి అతడిని టీడీపీ అధినేత చంద్రబాబు అనుచరుడు చాణక్య ప్రతాప్ సజీవ దహనం చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జయరామయ్య, చెంచెమ్మ దంపతులకు నాగరాజు, పురుషోత్తం కుమారులు. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.ఈ క్రమంలో బ్రాహ్మణపల్లి టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్ తమ్ముడు రుపంజయ భార్యతో పురుషోత్తం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రుపంజయ ఎలాగైనా పురుషోత్తంను మట్టుపెట్టాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు తన తమ్ముడు పురుషోత్తంను బెంగళూరుకు పంపించేశాడు. హతమార్చడానికి పలుమార్లు ప్రయత్నం టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్, అతడి తమ్ముడు రుపంజయ.. నాగరాజు కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. నాగరాజు తన పొలం వద్ద ఏర్పాటు చేసిన పైపులను పగలకొట్టడం, చెట్లు నరికివేయడం, మోటార్లను కాల్చివేయడం వంటివి చేసి టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నాగరాజు తమ్ముడు పురుషోత్తంను హతమార్చాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో వివాదాన్ని పరిష్కరించుకుందామని తిరుపతి అవిలాలలో నివాసం ఉంటూ వర్క్ఫ్రమ్ హోం చేసుకుంటున్న నాగరాజును గోపి అనే వ్యక్తితో పిలిపించారు. దీంతో శనివారం సాయంత్రం నాగరాజు తన కారులో స్వగ్రామం బ్రాహ్మణపల్లి వెళ్లాడు. అక్కడ టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్, రుపంజయ, వారి అనుచరులు గోపి, సుబ్బయ్యతోపాటు మరికొంతమంది నాగరాజుతో మాట్లాడారు. ఆ తర్వాత శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో గంగుడుపల్లి సమీపంలోని కురవకణం మలుపు వద్దకు తీసుకెళ్లి నాగరాజు కారులోనే అతడిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ ఉదంతం తెలుసుకున్న ఏఎస్పీ వెంకటరావు, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, సీఐ ఓబులేసు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య మధుమతి ఫిర్యాదు మేరకు చాణక్య ప్రతాప్, రుపంజయ, గోపి, సుబ్రహ్మణ్యంతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు రుపంజయను పోలీసులు అదుపులోకి తీసుకుని, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు టీడీపీ నేతల హస్తం! కాగా నాగరాజు హత్యలో రామచంద్రాపురం మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో ఒకరు మాజీ మంత్రి, టీడీపీ నేత గల్లా అరుణకుమారికి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. హత్యకు పాల్పడిన చాణక్య ప్రతాప్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఆ ఇద్దరు నేతలు హత్యకు సంపూర్ణ సహకారం అందించినట్లు సమాచారం. -
టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫ్రస్టేషన్తో మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నిన్నటి వరకు ప్రభుత్వంపై ఫ్రస్టేషన్ చూపించారు. ఉద్యోగులపై సోమిరెడ్డి వాడిన భాష మంచిది కాదు. సోమిరెడ్డి చెప్పినట్టు అధికారులు వినలేదనే వారిపై నోరు పారేసుకున్నారు. నీతి, నిజాయితీతో పనిచేసే అధికారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అని కాకాణి అన్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నామని, తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు -
ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరుజిల్లా: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నామని, తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఆ.. నా కొడుకులకు జీతాలివ్వడానికా పన్నులు వసూలు చేసేది? కాగా, ఉద్యోగులపై గతంలో చంద్రబాబు, తోకపత్రిక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎంప్లాయీస్ గుర్తుచేసుకుంటున్నారు. వారి మధ్య సంభాషణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాన్ని ఒకసారి చూస్తే.. చంద్రబాబు-రాధాకృష్ణ సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించిన ఉద్యోగుల డిమాండ్ ప్రస్తావనకు రాగానే రాధాకృష్ణ బూతు పురాణం లంకించుకున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చిద్విలాసంగా ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ‘ఆ .. నా కొడుకులు’ అని రాధాకృష్ణ దుర్భాషలాడినా.. అలా అనడం తప్పని చంద్రబాబు అనకపోవడం గమనార్హం. అధికారం లేకపోతే మనమేమీ చేయలేమని, అధికారం కోసం కొన్ని హామీలు ఇవ్వాలని సీఎం చెప్పుకొచ్చారు. మొదట్లో కొంత ఉదారంగా ఉంటే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చని అన్నారు. రుణమాఫీ హామీ కూడా అధికారం కోసమే ఇచ్చామంటూ మనసులో మాట చెప్పేశారు. చదవండి: మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే: బాలినేని -
ప్యాకేజీ మింగేశారు.. 1.22 కోట్ల పేదల సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి!
పోర్టు నిర్మాణంతో బతుకుదెరువు కోల్పోయి నిరాశ్రయులైన పేదలకు అందాల్సిన నిధులను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆయన అనుచరులు స్వాహా చేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్లు ఇదిగో.. అదిగో అంటూ ఊరించి కాలయాపన చేసింది. ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలంలో ఓట్ల కోసం హడావుడిగా నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ నిధులను సోమిరెడ్డి మంజూరు చేయించారు. ఆ నిధులను ఆయన, అనుచరులే బొక్కేశారు. రికార్డుల్లో మాత్రం లబ్దిదారులకు అందినట్లు చూపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని అవినీతిగా ప్రచారం చేస్తూ నిత్యం ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ఉండే సోమిరెడ్డి తన అవినీతి నిర్వాకానికి మాత్రం సమాధానం చెప్పరు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రానికే తలమానికంగా కృష్ణపట్నం పోర్టును 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అప్పట్లో పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూ సేకరణ చేశారు. దీంతో ఉపాధి కోల్పోయిన నిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించారు. మత్స్యకార కుటుంబాల తరలింపునకు, కొంత కాలం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున రూ.32 కోట్లు అందించారు. వీరితో పాటు మత్స్యకారేతరులను గుర్తించి వారికి ప్యాకేజీ అందించాలని వైఎస్సార్ నిర్ణయించారు. అయితే, వైఎస్సార్ అకాల మరణం నాన్ ఫిషర్మెన్ కుటుంబాల పాలిట శాపంగా మారింది. ఆ తర్వాత పాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజీని బుట్టదాఖలు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.43 వేలకుపైగా ప్యాకేజీ అందిస్తామని కొంత కాలం మభ్యపెట్టింది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మూడు విడతల్లో ఇస్తానని చెప్పడంతో అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకమైన మత్స్యకారేతర కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాసంకల్పయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారేతర కుటుంబాల సమస్యను విన్నారు. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ విషయంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు వరకూ తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి మత్స్యకారేతర కుటుంబానికి ప్యాకేజీ అందిస్తానని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు హడావుడిగా.. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీని పట్టించుకోని అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎన్నికల సమయంలో వారి ఓట్ల కోసం కేవలం ఎస్సీ, ఎస్టీలకే అంటూ ప్రత్యేకంగా రూ.4.09కోట్లు మంజూరు చేయించారు. హడావుడి గా 3,550 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10,500 వంతున రూ.3.87 కోట్లు పంపిణీ చేయించారు. ఇంకా రూ.1.22 కోట్లు పంపిణీ చేయకుండా అప్పట్లో ఆ నగదు పంపిణీలో సోమిరెడ్డి, ఆయన అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. చెక్కుల రూపంలో పంపిణీ జరగడంతో రెవెన్యూ అధికారులు మాత్రం లబి్ధదారులకు పంపిణీ జరిగినట్లు చూపించారు. కానీ లబి్ధదారుల పేరుతో టీడీపీ నేతలే బ్యాంకు కెళ్లి డ్రా చేసుకుని ఆరగించారు. మండలంలోని పంటపాళెం, పైనాపురం, నేలటూరు, ముత్తుకూరు, దొరవులపాళెం గ్రామాల్లో దాదాపు 300 మందికి సంబంధించిన నగదును టీడీపీ నేతలే దిగమింగారు. నాకు ప్యాకేజీ ఇవ్వకుండానే.. నాకు నాన్ఫిషర్మెన్ ప్యాకేజీ కింద డబ్బులు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. నాకు మాత్రం అందలేదు. నా పేరు మీద చెక్కురాసి తీసేసుకున్నారు. టీడీపీ నేతలే ఈ పని చేశారు. మా కడుపులు కొట్టి ఇలా ప్రవర్తించడం వాళ్లకే చెల్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్యాకేజీ మంజూరు చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాత్రం ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చూశారు. – కర్లపూడి సుబ్రహ్మణ్యం, ముత్తుకూరు ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజీ కాకాణి గోవర్ధన్రెడ్డి ఎన్నికల ముందు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి మా సమస్యను తీసుకెళ్లారు. అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారమే మాకు నిధులు పంపిణీ చేయించారు. టీడీపీ హయాంలో ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో మాకు నిధులు ఇస్తున్నట్లు చెప్పి మా పేర్లతో టీడీపీ నేతలు తినేశారు. – సుబ్బరాయుడు, దొరవులపాళెం కాకాణి చొరవతో 16,337 కుటుంబాలకు లబ్ధి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా 16,337 కుటుంబాలను లబ్ధిదారులను గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున రూ.35.75 కోట్లు కేటాయించి, లబి్ధదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయించారు. టీడీపీ హయాంలో రూ.10,500 మాత్రమే లబ్ధి పొందిన వారికి సైతం మిగతా రూ.14,500 వంతున ప్యాకేజీ అందించారు. -
సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్
సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు వేయడం సహజం. అయితే ఇది ప్రత్యర్థుల మధ్య ఉంటుంది. సింహపురి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం అనేక తిప్పలు పడుతున్నారు. అందులో భాగంగా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. స్వపక్షంలో పైచేయి సాధించాలనే తపనతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అటు అధిష్టానం మెప్పు, ఇటు జిల్లాలో పార్టీపై ఆధిపత్యం రెండు దక్కించుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కంటే ముందుగా జిల్లాలో పాదయాత్ర చేసేందుకు సోమిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకరి తర్వాత ఒకరు ప్రజా మద్దతు కంటే ముందు అధిష్టానం వద్ద పరపతి పెంచుకోవాలనే తపన టీడీపీ నేతల్లో మెండుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. అదే ఒరవడి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగింది. జిల్లాలో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. అటు జిల్లా పరిషత్, ఇటు కార్పొరేషన్లో తెలుగుదేశం కండువా కనుమరుగైంది. ఒక్కరంటే ఒక్క ఎంపీపీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ ఆ పార్టీకి లేరు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం అధిష్టానం మెప్పు పొందాలనే దిశగా జిల్లాలో టీడీపీ నేతల అడుగులు పడుతున్నాయి. ఒకరి తర్వాత ఇంకొకరు వివాదస్పద వ్యాఖ్యలతో తెరపైకి వస్తుండడం విశేషం. చదవండి: (Chandrababu Naidu: ఇదేం ఖర్మరా 'బాబూ') ఆధిపత్యం కోసం ఆరాటం జిల్లాలో పార్టీపై ఆధిపత్యం కోసం సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరాటపడుతున్నట్లు తెలిసింది. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు లోకేష్ ఓ సందర్భంలో మంగళగిరిలో ప్రకటించారు. టీడీపీ దానికి కట్టుబడి ఉంటే వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి టికెట్ దక్కదు. ఈ పరిస్థితిని అంచనా వేసిన సోమిరెడ్డి జిల్లాలో పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. క్రైమ్ రేట్ పెరిగిందని బూచిగా చూపిస్తూ జిల్లా వ్యాప్తంగా పర్యటించాలని, ఆ దిశగా అనుచరగణంతో సమాలోచనలు చేసినట్లు తెలిసింది. ఈనెలలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా జవనరి నుంచి నారా లోకేష్ పాదయాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఈలోపు జిల్లాలో సోమిరెడ్డి పాదయాత్ర చేయాలనే యోచిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సోమిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశమే లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. గెలుపు మాట దేవుడెరుగు కనీసం పార్టీ టికెట్ అయినా దక్కించుకోకుంటే భవిష్యత్లో రాజకీయ పరిస్థితులు ఊహించుకోలేమని పాదయాత్ర ఆలోచనలో ఉన్నారని తెలిసింది. -
నెల్లూరు కోర్టులో కేసు ఫైళ్ల దొంగతనంపై సీబీఐ దర్యాప్తు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దాఖలు చేసిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు నెల్లూరు జిల్లా కోర్టు నుంచి దొంగతనానికి గురైన వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మంత్రి కాకాణి చెప్పడంతో హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమర్థమైన అధికారి సరైన రీతిలో దర్యాప్తు జరిపి వీలైనంత త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. దొంగతనంపై నమోదైన కేసుకు సంబంధించిన ఫైళ్లను, కేసు డైరీని సీబీఐకి అప్పగించాలని నెల్లూరు చిన్నబజార్ పోలీసులను ఆదేశించింది. సీబీఐకి సహకరించాలని నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. సీబీఐకి ఇస్తే అభ్యంతరం లేదన్న ప్రభుత్వం, కాకాణి మంత్రి కాకాణిపై సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దాఖలు చేసిన కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి మాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి (పీడీజే) సి.యామిని పంపిన నివేదికను పరిశీలించిన హైకోర్టు ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరపాలని నిర్ణయించింది. ఆ నివేదికను సుమోటో పిటిషన్గా మలిచింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీబీఐ డీజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్), నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితోపాటు మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. విచారణ çసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఈ దొంగతనం కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి సైతం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే తమకూ ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కోర్టు ఆదేశాలిస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ తెలిపింది. దీంతో గతంలో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించిన సీజే ధర్మాసనం.. ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని తెలిపింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంతోపాటు ఆ కేసుల విచారణను శీఘ్రగతిన పూర్తిచేయాలని, ఆ విచారణను హైకోర్టు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తుచేసింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు సుప్రీంకోర్టు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో.. నెల్లూరు కోర్టు, యంత్రాంగం, పోలీసులు కేసు ఫైళ్లను భద్రపరిచే విషయంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నేరారోపణలను రుజువుచేసే ఆధారాలను కోర్టు ముందుంచనిపక్షంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసు వీగిపోయే ప్రమాదం ఉందంది. నిందితులను చట్టంముందు నిలబట్టే విషయంలో సమయానుగుణ, సరైన చర్యలు చేపట్టని పక్షంలో ప్రజలు న్యాయప్రక్రియపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రస్తుత కేసులో పలుకుబడి కలిగిన వ్యక్తులు నిందితులుగా ఉన్న నేపథ్యంలో.. కేసు ఫైళ్ల దొంగనతం వెనుక ఎవరున్నారన్న మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధర్మాసనం పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫైళ్ల దొంగతనం కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలిపింది. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: కాకాణి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. నెల్లూరు కోర్టులో దొంగతనం కేసు విచారణ సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పాం..’ అని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, టీడీపీ నేతల నోళ్లు మూతపడతాయని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు సత్యంగా ఉండాలని, అందుకే సీబీఐ విచారణకు అభ్యంతరం తెలపలేదని చెప్పారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయనపై వచ్చిన ఆరోపణల మీద సీబీఐ విచారణ కోరాలని సవాల్ చేశారు. సీబీఐ విచారణ అంటే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న నీచ సంస్కృతి చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. -
రాబిన్శర్మ టీమ్ సర్వే: ఈ సారి వారికి టికెట్టు కూడా డౌటే!
టీడీపీ అధినేత నిర్ణయంతో తమ్ముళ్లకు టికెట్ ఫీవర్ పట్టుకుంది. పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజాదరణలేదు. అధికార పార్టీ పై పైచేయి సాధించే సత్తా కొరవడిన నేపథ్యంలో సర్వే రిపోర్ట్ ఆధారంగా రాబోయే ఎన్నికల్లో ధన బలం, అంగబలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని అధినేత భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త టీమ్ క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. అంతర్గత రహస్య సర్వేలో ఏ నియోజకవర్గంలోనూ టీడీపీ మాజీలకు సానుకూల పరిస్థితులు లేనట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని టెన్షన్ పడుతున్నారు. సాక్షి, నెల్లూరు: టీడీపీలో చక్రం తిప్పిన, క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీలకు రాబోయే ఎన్నికల్లో మొండి చేయి తప్పేటట్లు లేదు. క్షేత్రస్థాయిలో అధికార వైఎస్సార్సీపీ బలంగా ఉండడం, ప్రజాదరణ స్థిరంగా ఉండడం, టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలత లేకపోవడంతో ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికల బరిలోకి ‘కొత్త ముఖాలు’ వ్యూహానికి తెర తీయాలని ఆలోచనలో ఉన్నారు. ఇందు కోసం తమ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా రాబిన్ శర్మను నియమించుకున్నారు. ఆయన టీమ్ ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా సర్వే ప్రారంభించింది. ఆ పార్టీ సీటింగ్ మాజీల పట్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన టీమ్ అధినేతకు సమాచారమిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సర్వే ఆధారంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో ఇన్నాళ్లు రాబోయే ఎన్నికల్లో టికెట్ తమదేనని అనుకుంటున్న సీటింగ్ మాజీలతో పాటు ఆశావహులు సైతం అంతర్మథనంలో పడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డామనే భ్రమ మినహా అందలం ఎక్కే ఛాన్సు కోల్పోతున్నామనే బెంగ పట్టుకుంది. వరుస ఓటమి చెందిన నేతలకు ఈ దఫా టికెట్ లేదనే ఇప్పటికే స్పష్టం చేయడంతో జిల్లాలో చాలా మంది టీడీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. సోమిరెడ్డి పరిస్థితి అంతే.. వరుసగా మూడు పర్యాయాలు ఒకే నియోజకవర్గంలో ఓటమి చెందిన నాయకులను ఈదఫా ప్రత్యక్ష ఎన్నికల్లో దూరంగా పెట్టాలనే దిశగా టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. టీడీపీ మహనాడులోనే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇదే విషయాన్ని బాహాటంగా వెల్లడించారు. ఈ కేటగిరీలో జిల్లాలో మొదటి స్థానంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఓటమి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఉంటారు. ఈ దఫా ఆయనకు టికెట్ రావడం కష్టమేనని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ నాటికే నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికకు తుది రూపు తీసుకురావాలనే సంకల్పంతో టీడీపీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్శర్మ టీమ్ సర్వేలో సామాన్య ప్రజానీకంలో అధికార పార్టీ పట్ల ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదు. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్చార్జిలతో నిమిత్తం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యక్తిగత ఇమేజ్కు ధీటైన వారినే అభ్యర్థులుగా ప్రతిపాదించే అవకాశాలు అధికంగా ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చదవండి: (పదే పదే క్లీన్బౌల్డ్.. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహమేంటి?) ఆ ఇద్దరి భవిష్యత్ ప్రశ్నార్థకమే.. తెలుగుదేశం పార్టీలో ఎదురులేదని భావిస్తూ వచ్చిన నాయకులకు ఈ దఫా టికెట్ విషయంలో భంగపాటు తప్పేటట్లు లేదు. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో నేరుగా సమీక్షించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఆశావహుల వారీగా సర్వే చేయిస్తున్నారు. పార్టీ పరంగా, ఆశావహుల వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల ఇన్చార్జిలు ఇద్దరికీ ఈ దఫా పార్టీ టికెట్ ఎంపిక ప్రశ్నార్థకంగా మారనుంది. ఇద్దరికి కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిబంధకంగా మారాయి. అధికార పక్షం ఎమ్మెల్యేల వ్యక్తిగత ఇమేజ్ ముందు ఆ ఇద్దరు చాలా వెనుకబడినట్లు సమాచారం. ఇదే పరిస్థితి సర్వేపల్లి, కందుకూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కనిపిస్తున్నట్లు టీడీపీ సర్వే టీమ్ అధినేతకు నివేదిక అందించినట్లు తెలిసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతల కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు జిల్లాకు చెందిన వివిధ ప్రాంతాల్లో వ్యాపారాల్లో స్థిరపడిన వారి కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. -
మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు : నారా లోకేష్
‘టీడీపీలో దీర్ఘకాలిక పదవుల విధానం రద్దు. వరుసగా మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు. ఇది నా నుంచే అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం.’ – మీడియా ప్రతినిధులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: లోకేష్ ఝలక్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఇదే వాస్తవమైతే ఆ జాబితాలో ముందు వరుసలో జిల్లాకు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నిలవనున్నట్లు ఆ పార్టీ నేతలే అంటున్నారు. అయితే సోమిరెడ్డి పరిస్థితి ఏమిటీ? రాబోయే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ దక్కే అవకాశం లేదా? అని జిల్లా ప్రజానీకంతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుందీ సోమిరెడ్డి పరిస్థితి. ‘మహానాడు’ ఆయన రాజకీయ జీవితానికి సమాధి కానున్న పరిస్థితి ఏర్పడింది. జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు సోమిరెడ్డి. వరుస ఓటముల పాలైనా సోమిరెడ్డికి టీడీపీ అగ్రనేత చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ పొలిట్బ్యూరోలో ఆయనకు స్థానం కల్పించారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని కూడా చేశారు. అయితే తాజాగా మహానాడు వేదికగా నారా లోకేష్ ప్రకటన జిల్లా టీడీపీ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జిల్లాలో వరుస ఓటముల చరిత్రలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. టీడీపీ సీనియర్ నేతగా జిల్లా నేతలకు పెద్ద దిక్కుగా, పొరుగు జిల్లాల ఇన్చార్జి బాధ్యులుగా ఉన్న ఆయన 1994, 99 ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించారు. 2004, 2009, 2012 (కోవూరు ఉప ఎన్నిక), 2014, 2019ల్లో వరుసగా టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందిన చరిత్ర జిల్లాలో సోమిరెడ్డిదే. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, 2012 కోవూరు ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. వరుసగా అత్యధిక సార్లు ఓడిపోయిన నేతల జాబితాలో సోమిరెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నారు. నారా లోకేష్ నిర్ణయానికి ఆ పార్టీ కట్టుబడితే సోమిరెడ్డికి పార్టీ టికెట్ దక్కడం దుర్లభమే. రాష్ట్ర స్థాయి నేతగా చెప్పుకునే సోమిరెడ్డికి నారా లోకేష్ ఝలక్ ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. యూటర్న్లు తీసుకోవడంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటు, అదే వారసత్వం నారా లోకేష్కు కూడా వస్తే తప్పా, సోమిరెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం లేదు. లోకేష్ ప్రకటన తర్వాత నెటిజన్లు, తెలుగుతమ్ముళ్లు అయ్యో.. సోమిరెడ్డా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఏం ఒరగబెట్టారు?
పొదలకూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేయబోయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి సోమవారం ఓ రైతు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వివరాల్లోకెళ్తే.. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నేదురుమల్లిలోని రైతుభరోసా కేంద్రం వద్దకు వెళ్లారు. వైఎస్సార్సీపీకి చెందినవారికి మాత్రమే ఎరువులు అందిస్తున్నారంటూ గందరగోళం సృష్టించాలని చూశారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన పతకమూరి నాగయ్యనాయుడు అనే రైతు సోమిరెడ్డి వద్దకు వచ్చి ‘మీ ప్రభుత్వంలో రైతులకు ఏమి ఒరగబెట్టారని ఇప్పుడు ఎరువుల పంపిణీపై ఆందోళన చేయడానికి వచ్చారు? టీడీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికి అర్హత ఉన్నా ఇవ్వకుండా క్షోభకు గురి చేశారు. గ్రామంలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి చివర వరకు నాకు పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. జగన్ ప్రభుత్వం రైతుల ఇళ్ల వద్దే ఎరువులను అందిస్తుంటే అడ్డుకోవడానికి వచ్చారా? పార్టీలకతీతంగా రైతులకు ఆర్బీకేల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలకు చెడ్డపేరు తేవాలనే మీరు ఇక్కడకు వచ్చారు’ అంటూ సోమిరెడ్డిపై ధ్వజమెత్తారు. దీంతో అక్కడే ఉంటే ఇంకా అభాసుపాలవుతామని గ్రహించిన సోమిరెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
‘సోమిరెడ్డి ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది’
సాక్షి, నెల్లూరు జిల్లా: కంటెపల్లిలో గ్రావెల్ తవ్వకాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి మంగళవారం పరిశీలించారు. అటవీ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే టీడీపీ ఆరోపణలపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి నిజ నిర్థారణ చేపట్టారు. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకాగా, టీడీపీ నేతలు ముఖం చాటేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందన్నారు. పంచ భూతాలను దోచేసిన ఘనులు టీడీపీ నేతలంటూ ఎమ్మెల్యే కాకాణి మండిపడ్డారు. -
టీడీపీ నేత సోమిరెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు : కాకాణి
-
చిత్తూరు జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు
మదనపల్లె (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పర్యటనలో బహిర్గతమైంది. మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధిపత్యాన్ని సహించేది లేదని మరోవర్గం ప్రకటించింది. ఆదివారం సోమిరెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి మదనపల్లెకి వచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య సర్కిల్లోని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తన గెస్ట్హౌస్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ గెస్ట్హౌస్ మాజీ సైనికుల నుంచి కబ్జా చేసిన స్థలం అని దీనిపై కోర్టులో కేసు నడుస్తోందని, అలాంటి చోట సమావేశాలు నిర్వహిస్తే తాము రాలేమని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్చినబాబు అధినాయకులకు చెప్పారు. సమావేశాన్ని అక్కడ కాకుండా వేరెక్కడైనా ఏర్పాటు చేస్తే పాల్గొంటామని తెలిపారు. అయితే తన ప్రత్యర్థి వర్గం వాదనలకు విలువివ్వకుండా తన గెస్ట్హౌస్లోనే రమేష్ సమావేశం ఏర్పాటు చేయడంతో శ్రీరామ్చినబాబు, బాబురెడ్డి, టౌన్బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, మైనారిటీ నేతలు మస్తాన్, పఠాన్ఖాదర్ ఖాన్, దొరస్వామినాయుడు తదితరులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో సోమిరెడ్డి హడావుడిగా సమావేశాన్ని ముగించి ప్రత్యర్థి వర్గంతో బుజ్జగింపులు మొదలుపెట్టారు. అవి ఫలించకపోవడంతో ఆయన వెనుదిరిగారు. -
సోమిరెడ్డి మా డేటా చోరీ చేశారు: నర్మదారెడ్డి
-
టీడీపీ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఆయనపై కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సోమిరెడ్డి మా డేటా చోరీ చేశారు: నర్మదారెడ్డి ఫిర్యాదు అనంతరం శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ సంస్థపై సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ ప్రాజెక్ట్పై తప్పుడు ఆరోపణలు చేసిన సోమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. సోమిరెడ్డి తమ డేటా చోరీ చేశారని తెలిపారు. కాకాణికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నర్మదారెడ్డి స్పష్టం చేశారు. చదవండి: అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది బాలిక కిడ్నాప్ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. -
ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాలని చూస్తున్నాయి: కాకాణి
-
ఏ విచారణకైనా రెడీ
నెల్లూరు సెంట్రల్: ఆనందయ్య ఇస్తున్న కరోనా నివారణ మందు విషయంలో తనపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి, లేదా విశ్రాంత న్యాయమూర్తితో ఏ విచారణకైనా తాను సిద్ధమని వైఎస్సార్సీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. నెల్లూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయలేదని.. కలెక్టర్ నిలిపివేసిన విషయం గుర్తులేదా సోమిరెడ్డి అని ప్రశ్నించారు. మందు విక్రయానికి సంబంధించిన వెబ్సైట్లో తాను డైరెక్టర్నని అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సదరు వెబ్సైట్కు తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు. తాను తప్పుచేసినట్లు రుజువు చేస్తే బహిరంగంగా ఉరేసుకుంటానన్నారు. అలాగే.. నకీలీ ఎరువులు తయారుచేసి రైతులను మోసం చేయలేదని.. మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని రైతులను దగా చేయలేదని.. క్రికెట్ కిట్లు,, సైకిళ్లు పంపిణీలో అవినీతి చేయలేదని.. పేకాటలో ఎవరికీ అప్పు లేనని నువ్వు, నీ కొడుకు ప్రమాణం చేయడానికి సిద్ధమా సోమిరెడ్డి అని కాకాణి సవాల్ చేశారు. సోమిరెడ్డి ఆరోపణలపై శేశ్రిత టెక్నాలజీ అధినేత నర్మద్రెడ్డి స్పందిస్తూ.. సోమిరెడ్డి అన్నీ అవాస్తవాలు మాట్లాడారన్నారు. కనీసం తనను సంప్రదించి ఉంటే వాస్తవాలు చెప్పే వాళ్లమని.. దీనిపై అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఆనందయ్య మందుతో వ్యాపారం: సోమిరెడ్డి నెల్లూరు టౌన్: ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి భారీ కుట్ర పన్నినట్లు టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందు అమ్మకం పేరుతో వెబ్సైట్ను రూపొందించింది నెల్లూరుకు చెందిన శేశ్రిత కంపెనీ అన్నారు. ఈ నెల 2న చిల్డీల్ వెబ్సైట్ను ఇంటర్నెట్లో పెట్టిందన్నారు. దీనిపై ఆరోపణలు రావడంతో మరుసటి రోజే వెబ్సైట్ను తొలగించారన్నారు. కాగా, మందు ప్యాకెట్ ధర రూ.15గా.. జీఎస్టీ, కొరియర్ చార్జీలతో కలిపి రూ.167 పెట్టారన్నారు. ప్రజల నుంచి వందల కోట్లు సొమ్ము చేసుకోవాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే కాకాణికి, మా వెబ్సైట్కు సంబంధం లేదు
నెల్లూరు: తమ వెబ్సైట్ గురించి సోమిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి. సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఎండీ స్పందించారు. ‘‘ఈ వెబ్సైట్ వెనుక ఎలాంటీ దోపిడీ ఉండదు, అంతా పారదర్శకం. టెస్టింగ్ చేసే క్రమంలోనే వెబ్సైట్లో రేట్లు పెట్టుకున్నాం.. అవి ఫైనల్ కాదు. ఈ అంశాన్ని సోమిరెడ్డి ఇలా రాజకీయం చేయడం దుర్మార్గం. ఎమ్మెల్యే కాకాణికి, మా వెబ్సైట్కు ఎలాంటి సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు. మందు పంపిణీ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదు: కాకాణి ఆనందయ్య మందు విషయంలో వ్యక్తిగత విమర్శలు చేసి.. ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాలని చూస్తున్నాయి అన్నారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆనందయ్య మందుకు అనుమతులు వచ్చేవరకే ప్రయత్నం చేశా. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో.. పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని కాకాణి స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. ‘‘సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దిగజారి విమర్శలు చేస్తున్నారు. సోమిరెడ్డి ఒక్క రూపాయైనా అవినీతి జరిగిందని నిరూపించలగలవా. వ్యక్తిగత విమర్శలతో సోమిరెడ్డి బురదజల్లాలని చూస్తున్నాడు. సోమిరెడ్డికి నన్ను విమర్శించే హక్కు లేదు. ఎక్కువగా మాట్లాడితే సోమిరెడ్డి అప్పుల చిట్టా విప్పుతా. సోమిరెడ్డి పేకాటలో ఎంతమందికి అప్పులు ఉన్నాడో చెప్పాలి’’ అని కాకాణి డిమాండ్ చేశారు. ‘‘సోమిరెడ్డికి ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో బయటపెట్టాలి. సోమిరెడ్డి ఆధారాలతో వస్తే విచారణకు సిద్ధం. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలి. ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. సోమిరెడ్డి నీతి మాటలు కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలి’’ అంటూ కాకాణి తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: ఆనందయ్య మందు: ఆరోపణలొద్దు.. అనుమానాలు రేపొద్దు -
సోమిరెడ్డి.. ఓడగొడతావేంటి!
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీని అభద్రతా భావం వెంటాడుతోంది. ఆ పార్టీ నేతలు వేసే ప్రతి అడుగూ బెడిసికొడుతోంది. ఒక వ్యూహం పన్నితే అది కాస్తా బూమరాంగ్ అవుతోంది. ఒకరిని ఇన్చార్జిగా నియమిస్తే శ్రేణులే వేలెత్తి చూపే పరిస్థితి ఏర్పడుతోంది. నియోజవకవర్గాల్లో ప్రచారానికి వెళితే కార్యకర్తలే నిలదీస్తుండడంతో నాయకుల్లో ఆత్మస్థైర్యం దిగజారిపోతోంది. తమ్ముళ్ల వైఖరి ఆ పార్టీ అగ్రనేతలను సైతం డైలమాలో పడేస్తోంది. సాక్షి, తిరుపతి: టీడీపీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఇవి ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. కార్యకర్తల్లో అంతర్గతంగా జీర్ణించుకుపోయిన అంశాలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నేతలను అవి నిగ్గదీసి కడిగేస్తున్నాయి. పనబాక.. పట్టించుకోబాక! తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాకలక్ష్మి పేరును ఆ పార్టీ అధిష్టానం మూడు నెలలు ముందు ప్రకటించింది. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఎవరికీ చెప్పలేదు. కనీసం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల నేతలకు, ఇన్చార్జిలకు తెలియజేయ లేదు. ఆమె బీజేపీలో చేరిపోతారనే అభద్రతా భావంతో టీడీపీ నేత చంద్రబాబునాయుడు ముందే ప్రకటించేశారు. ఆ ప్రకటన తర్వాత ఆమె ఇంతవరకు ప్రజల మధ్యకు రాలేదు. పంచాయతీ, పుర ఎన్నికల్లోనూ ఎక్కడా కనిపించలేదు. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎక్కడా ప్రచారం చేయలేదు. ఇప్పుడు ఉప పోరుకు నోటిఫికేషన్ వెలువడడంతో తాజాగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఒకడుగు ముందుకువేస్తే, మూడడుగులు వెనక్కి పడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. నిలదీత.. అంతా రోత పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇటీవల టీడీపీ నేతలు ప్రచారాలు మొదలుపెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీయడం మొదలుపెట్టారు. మండల, నియోజకవర్గాలకు ముందు ఇన్చార్జీల విషయం తేల్చాలని భీష్మించుకుంటున్నారు. ఇలాంటిదే సత్యవేడు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత వర్గీయుల మధ్య వివాదం బహిర్గతమైంది. వారిని సర్దిచెప్పేందుకు టీడీపీ సీనియర్ నేతలకు తల ప్రాణం తోకకు వచ్చినట్టయ్యింది. తిరుపతిలో తెలుగు యువత అధ్యక్షుడుగా రవినాయుడు నియామకంపై కొందరు పెదవి విరిచారు. ఎంతో కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకొని వస్తున్న నేతలను పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో టీడీపీ ఉనికి నామరూపాల్లేకుండా పోతోంది. అక్కడ ఆ పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేరనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. సోమిరెడ్డి..ఓడగొడతావేంటి! తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల బాధ్యుడిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిని నియమించడంపై టీడీపీ అభ్యర్థి పన బాకలక్ష్మితో సహా ఆయా నియోజకవర్గాల కేడర్ కినుకు వహించినట్లు సమాచారం. 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు పర్యాయాలు సర్వేపల్లె నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. ప్రజల మెప్పు పొందడంలో విఫలమయ్యారు. అలాంటి నాయకుడ్ని తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఎలా నమ్ముతారని పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమా చారం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల మొత్తంగా పరిశీలిస్తే టీడీపీ ప్రతిచర్య భూమ్రాంగ్ అవుతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చదవండి: బరిలో ఉమ్మడి అభ్యర్థి -
ఆ ఊరేగింపు సోమిరెడ్డికే చెల్లింది: కాకాణి
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమిరెడ్డిని అవినీతి సామ్రాట్గా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి విమర్శలను ఆయన తప్పుబట్టారు. ‘‘సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే జిల్లాలో పసుపు కుంభకోణం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నపుడు రైతుల ప్రయోజనాలను విస్మరించి మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకున్నారు. నీరు-చెట్టు అవినీతి విషయంలో విచారణను అడ్డుకున్నది సోమిరెడ్డి కాదా’’ అని కాకాణి ప్రశ్నించారు.(చదవండి: ‘వారికి ప్రజలే బుద్ధి చెబుతారు’) 2014లో అధికారంలోకి రాగానే పేదల ఇళ్లు కూల్చి వేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కాగానే సర్వేపల్లిలో స్కూల్ భవనం కూలగొట్టించింది వాస్తవం కాదా అని దుయ్యబట్టారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నపుడు గ్రామస్తులు అడ్డుకోవడానికి వస్తే పోలీసుల సాయంతో బయటపడ్డాడని, ఆయన అవినీతిపై ఫ్లెక్సీలు గ్రామాల్లో ఊరేగింపు సోమిరెడ్డికే చెల్లిందని కాకాణి గోవర్ధన్రెడ్డి ఎద్దేవా చేశారు. -
సోమిరెడ్డివి దుర్మార్గపు రాజకీయాలు
నెల్లూరు, పొదలకూరు: కరోనా విపత్తుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా వారి సంక్షేమం కోసం తాను పాటుపడుతుంటే టీడీపీ నాయకుడు సోమిరెడ్డి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాడని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలంలోని నరసింహకండ్రిక, గురవాయపాళెం, కనుపర్తి, ఆల్తుర్తి, మొగళ్లూరు, ఆర్వైపాళెం గ్రామాల్లో ఆదివారం సర్వేపల్లి రైతన్న కానుక కింద బియ్యం, వంటనూనెను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కరోనాకు భయపడి తాను ఇంట్లో కూర్చుంటే పేదలను ఎవరు ఆదుకుంటారన్నారు. రూ.3.50 కోట్ల విలువ చేసే బియ్యం, నూనెలను సమీకరించడాన్ని అభినందించాల్సిపోయి తన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు సైతం పేదలకు సాయం అందిస్తే అభినందిస్తానన్నారు. నాయకుడన్న వాడు పేదలకు ఒక్కరికైనా సాయం అందించినా ఆహ్వానించాలని తన కార్యకర్తలకు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదంతా పక్కన పెట్టి సోమిరెడ్డి తాను పర్యటిస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని రకరకాలుగా రైతన్న కానుకను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నడం దురదృష్టకరమన్నారు. ధాన్యం సేకరించినంత మాత్రాన బియ్యం రావని, కార్యకర్తలు ఎంతో ఓర్పుతో మిల్లర్ల వద్దకు వెళ్లి ఆడించి ప్యాకింగ్ చేయిస్తున్నారని తెలిపారు. పేదలను ఆదుకునే కార్యక్రమానికి కూడా రాజకీయాలు ఆపాదిస్తే పుట్టగతులుండవన్నారు. రైతులు ఇచ్చిన ధాన్యాన్ని బలవంతంగా వసూలు చేశానని ఆరోపించడం వారిని అవమానించడమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, తెనాలి నిర్మలమ్మ, నువ్వుల మంజుల, తహసీల్దార్ స్వాతి, ఎంపీడీఓ సుజాత, ఈఓపీఆర్డీ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘దమ్ము.. ధైర్యం.. నిజాయితీ ఉంటే’; కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు : స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. నామినేషన్ వేయనీయకుంటే వేలాది మంది టీడీపీ అభ్యర్థులు ఎలా నామినేషన్లు వేశారని ప్రశ్నించారు. శనివారం ఆయన జిల్లాలో మాట్లాడుతూ.. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడిందో దానికి తనే ప్రత్యక్ష సాక్షి అని పేర్కొన్నారు. అప్పట్లో అదనపు డీజీ వెంకటేశ్వరరావు దగ్గర ఉంటూ వైఎస్సార్సీపీ నేతలను పలు రకాలుగా హింసించి, తప్పుడు కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద దాడి చేశారని అన్నారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడ్డుకోలేదా అని, అప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. (టీడీపీకి సవాలు విసిరిన ఎమ్మెల్యే కాకాణి) అలాగే ‘‘జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో సాక్షాత్తూ కలెక్టర్పై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి దాడి చేస్తే దిక్కు లేదు. అప్పుడు ఎందుకు చంద్రబాబు మాట్లాడలేదు.నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి.. వాస్తవాలు విస్మరించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పొదలకూరులో పంట కాలువను ఆక్రమించి ఇల్లు కడుతుంటే పంచాయతీ అధికారులు అడ్డుకోవడం తప్పా.. గత ఏడాది అధిక వర్షాలు పడినప్పుడు ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు రావడంతో దానిని రాజకీయం చేస్తున్నారు. ఆక్రమణలు ఏ పార్టీ వారివైనా తొలగించాలని కోరుతున్నాం. టీడీపీ తరపున పోటీచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారు. దమ్ము.. ధైర్యం.. నిజాయితీ.. ఉంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి. నా తప్పు ఉంటే రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నా’’నని ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డి సవాల్ విసిరారు. (ఆ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కుమార్తె చేయూత)