పరువు నష్టం దావా నోటీసులు పంపిన పెద్దిరెడ్డి | YSRCP Peddireddy Sent Defamation Suit Notices To TDP Media Houses In Madanapalle Files Burning Case | Sakshi
Sakshi News home page

మదనపల్లి ఫైల్స్‌ దగ్ధంపై విష ప్రచారం.. పరువు నష్టం దావా నోటీసులు పంపిన పెద్దిరెడ్డి

Aug 20 2024 11:52 AM | Updated on Aug 20 2024 3:25 PM

YSRCP Peddireddy sent defamation suit notices to TDP Media Houses

తిరుపతి, సాక్షి: మదనపల్లి ఫైల్స్‌ దగ్ధం కేసులో తనపై జరిగిన విష ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ ప్రచారం చేసిన పత్రికలు, మీడియా సంస్థలకు పరువు నష్టం నోటీసులు పంపించారు. 

ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్ కు పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు పంపించినట్లు సమాచారం, ఇందులో ఈనాడు, ఈటీవీ 50 కోట్ల రూపాయలు, మహా న్యూస్ కు 50 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తనపై నిరాధరంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికి న్యాయ పరంగా బుద్ధి చెప్తానని ఇదివరకే ఆయన ప్రకటించారు. ఇప్పుడు నోటీసులు పంపగా.. అతి త్వరలో ఆయన కేసు వేస్తారని ఆయన తరఫు న్యాయవాదులు అంటున్నారు.

ఈనాడు, ఈ టీవీ, మహా న్యూస్ కు 100 కోట్ల పరువు నష్టం దావా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement