ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో దొంగతనం | - | Sakshi
Sakshi News home page

ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో దొంగతనం

Published Wed, Apr 2 2025 12:18 AM | Last Updated on Wed, Apr 2 2025 12:19 AM

ఒకే ర

ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో దొంగతనం

దర్శి: మండలంలో ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో చోరీలు జరిగాయి. ఈ సంఘటనలు మండలంలోని లంకోజనపల్లి, వెంకటాపురం గ్రామాల్లో మంగళవారం రాత్రి జరిగాయి. లంకోజనపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ పగులగొట్టి సుమారు రూ.25 వేల నగదు తీసుకెళ్లారు. తూర్పు వెంకటాపురంలో పోలేరమ్మ, అంకాలమ్మ, శివాలయం, బాలాపుర పోలేరమ్మ ఆలయాల్లో తాళాలు పగులగొట్టి హుండీల్లో ఉన్న సుమారు రూ.20 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. పోలేరమ్మ ఆలయంలో వెండి హారం, కిరీటం ఉండగా కిరీటాన్ని వదిలేసి వెండి హారం, హుండీని ఎత్తుకెళ్లారు. మిగిలిన మూడు ఆలయాల్లో హుండీలు ఎత్తుకెళ్లి పగులగొట్టి నగదు దోచుకున్నారు. ఒకే రోజు వరుస దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ముండ్లమూరు మండలంలో కూడా ఇదే విధంగా ఒకే రాత్రి మూడు దొంగతనాలు జరిగాయి.

ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో దొంగతనం 1
1/1

ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో దొంగతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement