చదువుల తల్లులు.. ఆ అక్కాచెల్లెళ్లు | - | Sakshi
Sakshi News home page

చదువుల తల్లులు.. ఆ అక్కాచెల్లెళ్లు

Published Sat, Mar 8 2025 7:56 AM | Last Updated on Sat, Mar 8 2025 7:55 AM

చదువుల తల్లులు.. ఆ అక్కాచెల్లెళ్లు

చదువుల తల్లులు.. ఆ అక్కాచెల్లెళ్లు

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండల కేంద్రమైన కౌడిపల్లికి చెందిన ఉడుత రాజు, నాగరాణి దంపతులకు వర్ష, శ్రేష్ట ఇద్దరు కూతుళ్లు. భార్యాభర్తలు పదవ తరగతి వరకు మాత్రమే చదువగా కూతుళ్లను మాత్రం ఉన్నత చదువులు చదివిస్తున్నారు. పెద్ద కూతురు ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించడంతో హైదరాబాద్‌ మహాత్మాగాంధీ ఐటీ కళాశాలలో బీటెక్‌ ఐటీ పూర్తి చేసింది. ఏడాదిన్నరగా హైదరాబాద్‌ ఏడీపీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. రెండో కూతురు శ్రేష్ట బీవీఆర్‌ఐటీ సీఎస్‌ఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇద్దరు ఆడపిల్లలకు స్కూటీ నడపడం నేర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement