భారత్‌ 1 మొరాకో 1  | Davis Cup World Group2 Tennis Tournament | Sakshi
Sakshi News home page

భారత్‌ 1 మొరాకో 1 

Sep 17 2023 1:44 AM | Updated on Sep 17 2023 1:44 AM

Davis Cup World Group2 Tennis Tournament - Sakshi

లక్నో: డేవిస్‌కప్‌ వరల్డ్‌ గ్రూప్‌–2 టెన్నిస్‌ పోటీలో తొలి రోజు భారత్, మొరాకో క్రీడాకారులు ఒక్కో మ్యాచ్‌లో గెలిచారు. దాంతో స్కోరు 1–1తో సమంగా నిలిచింది. తొలి సింగిల్స్‌లో శశికుమార్‌ ముకుంద్‌ 7–6 (7/4), 5–7, 1–4తో యాసిన్‌ దిల్మీ చేతిలో ఓడిపోయాడు.

రెండో సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ 6–3, 6–3తో ఆడమ్‌ మౌన్‌డిర్‌పై గెలుపొందాడు. దిల్మీతో జరిగిన మ్యాచ్‌లో ముకుంద్‌ నిర్ణాయక మూడో సెట్‌లో 1–4తో వెనుకబడిన దశలో కాలి కండరాలు పట్టేయడంతో వైదొలిగాడు. నేడు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్స్‌ మ్యాచ్‌లో రోహన్‌ బోపన్న–యూకీ బాంబ్రీ జోడీ బెన్‌చిట్రి–లారూసి జంటతో ఆడుతుంది. రివర్స్‌ సింగిల్స్‌లో దిల్మీతో సుమిత్‌ నగాల్, ఆడమ్‌తో శశికుమార్‌ తలపడతారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement