Morocco
-
30 లక్షల కుక్కల హతం!
2030 ఫిఫా వరల్డ్ కప్కు స్పెయిన్, పోర్చుగల్తో కలిసి ఆతిథ్యం ఇవ్వనున్న మొరాకో ఆ లోపు దేశంలో వీధికుక్కల బెడదను వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఏకంగా 30 లక్షల కుక్కలను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం! విషం పెట్టడం మొదలుకుని నానారకాలుగా వాటి ఉసురు తీస్తోంది. రక్తపు మడుగులో నిస్సహాయ స్థితిలో ఉన్న కుక్కలను ట్రక్కుల్లోకి విసిరేస్తున్న హృదయ విదారక దృశ్యాలు షాక్కు గురి చేస్తున్నాయి. దీనిపై ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కోలిషన్ (ఐఏడబ్ల్యూపీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. ‘మొరాకోస్ అగ్లీ సీక్రెట్’ పేరుతో ప్రచారాన్నే ప్రారంభించింది. ఇంజక్షన్లు, ఆహారం ద్వారా విషమిచ్చి కుక్కలను అమానవీయంగా చంపుతున్నారని పేర్కొంది. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ ఫిఫాకు లేఖలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే ఫిఫా ప్రతిష్ట మసకబారుతుందని పర్యావరణ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. భయానకం... మొరాకో వీధుల్లో వీధి కుక్కలు నొప్పితో కేకలు వేస్తున్న వీడియోలు వైరలవుతున్నాయి. కుక్క పిల్లను తలకిందులుగా వేలాడదీసి, భయభ్రాంతులకు లోనై చూస్తున్న కుక్కల ట్రక్కులోకి విసిరేయడం కనిపించింది. మరో వీడియోలో రెండు కుక్కలు రక్తమోడుతూ నేలపై పడున్నాయి. ఇదంతా పిల్లల ముందే జరుగుతుండటంతో వారు తీవ్ర దిగ్భ్రాంకి లోనవుతున్నారని ఐఏడబ్ల్యూపీసీ తెలిపింది. దాంతో మొరాకోపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిర్మాతతో మొరాకో టూర్లో హీరోయిన్ త్రిష! (ఫొటోలు)
-
50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించింది. ఆగ్నేయ మొరాకోలోని ఎడారి ప్రాంతంలో వర్షం పడడమంటే చాలా అరుదైన ఘటన. మొరాకో ప్రభుత్వ సమాచారం మేరకు సెప్టెంబరులో రెండురోజుల పాటు కురిసిన వర్షం.. చాలా ప్రాంతాల్లో ఏడాది సగటును మించిపోయింది.ఇక్కడ ఏటా 250 మి.మీ. కంటే తక్కువగా సగటు వర్షపాతం నమోదవుతుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని రబత్కు 450 కి.మీ. దూరంలోని టాగౌనైట్ గ్రామంలో 24 గంటల్లోనే 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసిందని.. ఇది అత్యంత అరుదైన పరిణామమని పేర్కొన్నాయి. జాగోరా, టాటా మధ్య 50 ఏళ్లుగా పాటు పొడిగా ఉన్న ఇరికీ సరస్సు వరద కారణంగా తిరిగి నిండినట్లు నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడవుతోంది. గత 30 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వర్షాలు కురవడం ఇదే తొలిసారి అనిి మొరాకో వాతావరణ సంస్థ అధికారి హౌసీన్ యూబెబ్ పేర్కొన్నారు. కాగా గత నెలలో మొకరాలో సంభవించిన వరదలు 18 మందిని బలిగొన్నాయి.ఇక సహారా ఎడారి, ఉత్తర, మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా అంతటా 9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రమైన వాతావరణ వేడిని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ తరహా తుఫానులు మరింత తరచుగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
మొరాకోలో టాటా డిఫెన్స్ ఫ్యాక్టరీ.. విదేశాల్లో స్వదేశీ బ్రాండ్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మొదటిసారి విదేశాల్లో డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. మొరాకోలోని కాసాబ్లాంకాలో కంపెనీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే విదేశీ గడ్డపై అడుగుపెట్టిన మొట్టమొదటి స్వదేశీ రక్షణ కర్మాగారంగా టాటా రికార్డ్ క్రియేట్ చేయనుంది.ఫ్యాక్టరీ ప్రారంభమైన తరువాత కంపెనీ మొదట రాయల్ మొరాకో ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్లను (WhAP) ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. ఆ తరువాత ఆఫ్రికన్ మార్కెట్ కోసం ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీ ఏడాది లోపల ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ కర్మాగారంలో ప్రతి ఏటా 100 యుద్ధ వాహనాలను ఉత్పత్తి చేయనుంది.టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో WhAPని అభివృద్ధి చేసింది. సైన్యం కోసం వాహనాలను ఎంపికచేసి ముందు.. ఆఫ్రికా ఎడారుల్లోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించారు. ఆ తరువాత టాటా గ్రూప్ మొరాకోలో సాయుధ వాహనాలను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది.ఇదీ చదవండి: అక్టోబర్లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ప్రస్తుతం టాటా మోటార్స్ భారత సైన్యం కోసం వాహనాలను తయారు చేస్తోంది. వీటిని మన ఆర్మీ ఇప్పుడు వినియోగిస్తుంది కూడా. అయితే ఈ వాహనాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ తయారు చేసే వాహనాలు చాలా దృడంగా ఉంటాయి. -
అర్జెంటీనాకు షాక్
సెయింట్ ఎటిన్ (ఫ్రాన్స్): పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా శుక్రవారం మొదలు కావాల్సినా... ఫుట్బాల్, రగ్బీ సెవెన్స్ క్రీడాంశాల్లో బుధవారం పోటీలు ప్రారంభమయ్యాయి. పురుషుల ఫుట్బాల్ ఈవెంట్ సంచలనంతో ఆరంభమైంది. రెండుసార్లు స్వర్ణ పతక విజేత అర్జెంటీనా తొలి లీగ్ మ్యాచ్లో 1–2తో మొరాకో చేతిలో ఓడిపోయింది. ఇంజ్యూరీ టైమ్లో అర్జెంటీనా చేసిన గోల్ను ముందుగా రిఫరీ అనుమతించడంతో స్కోరు 2–2 తో సమమైంది. అయితే రిఫరీ నిర్ణయంతో ఆగ్రహించిన అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేశారు. దాంతో రెండు గంటలపాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఆటను కొనసాగించారు. అర్జెంటీనా రెండో గోల్ను టీవీ రీప్లేలో పరిశీలించి ఆఫ్ సైడ్గా పరిగణించి గోల్ ఇవ్వలేదు. దాంతో మొరాకో 2–1తో గెలిచింది. -
Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!
ప్రపంచంలో 2023లో భారీ స్థాయిలో భూకంపాలు సంభవించాయి. వీటివల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ప్రపంచంలో వచ్చిన కొన్ని ప్రధాన భూకంపాల గురించి తెలుసుకుందాం..! ఫిబ్రవరి 6: టర్కీ-సిరియా భూకంపం ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ, మధ్య ప్రాంతంలో భూమి రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో కంపించింది. సిరియాలో ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 7.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. భూమిలోపల 95 కిమీ లోపల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ విపత్తులో అపార ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపంలో 59,259 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 50,783 మంది కాగా.. సిరియాలో 8,476 మంది మృత్యువాతపడ్డారు. టర్కీ జనాభాలో 1.4 కోట్ల మంది ప్రభావితమయ్యారని అంచనా. సుమారు 1.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస అంచనా వేసింది. మార్చి 18: గుయాస్ భూకంపం, ఈక్వెడార్ దక్షిణ ఈక్వెడార్లో 2023 మార్చి 18న భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ఎల్ ఓరో, అజువే, గుయాస్ ప్రావిన్స్లలో భారీ నష్టాన్ని కలిగించింది. దాదాపు 446 మంది గాయపడ్డారు. 16 మంది మరణించారు. ఈక్వెడార్ జనాభాలో దాదాపు సగం మంది 8.41 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితులయ్యారు. దేశంలోని మొత్తం 24 ప్రావిన్సుల్లోని 13 ప్రావిన్సుల్లో భూమి కంపించింది. మార్చి 21: ఆఫ్ఘనిస్థాన్ భూకంపం 2023, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్లోని బదక్షన్ ప్రావిన్స్లో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 1000 కిలోమీటర్ల వైశాల్యంలో భూమి కంపించింది. ఆప్ఘనిస్థాన్లోని 9 ప్రావిన్స్లలో ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితమయ్యారు. కనీసం 10 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. 665 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, క్వెట్టా, పెషావర్లలో ప్రకంపనలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో కారకోరం హైవే మూసుకుపోయింది. బునెర్ జిల్లాలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయి 40 మంది గాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా జమ్ము కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. సెప్టెంబరు 8: మొరాకో భూకంపం 2023 సెప్టెంబరు 8న మొరాకోలోని మరకేష్-సఫీ ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8-6.9 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 2,960 మంది ప్రాణాలు కోల్పోయారు. మరకేష్లోని చరిత్రాత్మక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. స్పెయిన్, పోర్చుగల్, అల్జీరియాలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. మొరాకో చరిత్రలో నమోదు చేయబడిన అత్యంత బలమైన భూకంపాల్లో ఇది ప్రధానమైంది. 1960 అగాదిర్ భూకంపం తర్వాత దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. 2023లో టర్కీ-సిరియా భూకంపం తర్వాత ఇందులోనే అత్యంత ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. 1,00,000 మంది పిల్లలతో సహా మరకేష్, అట్లాస్ పర్వతాల పరిసర ప్రాంతాల్లో 2.8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అక్టోబర్ 7: హెరాత్ భూకంపం, ఆఫ్ఘనిస్తాన్ 2023 అక్టోబర్ 7న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. గంటల వ్యవధిలో వరుసగా నాలుగు సార్లు భూకంపం రావడం భారీ నష్టాన్ని కలిగించింది. మొదటి రెండు భూకంపాలు అక్టోబర్ 7న హెరాత్ నగరానికి సమీపంలో సంభవించాయి. అక్టోబర్ 11, 15 తేదీల్లో అదే ప్రాంతంలో మరో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయి. ఈ భూకంపాల్లో 1,482 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,100 మందికి గాయాలయ్యాయి. 43,400 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1,14,000 మందికి మానవతా సహాయం అవసరమైందని అంచనా. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉండటంతో సరైన ఆస్పత్రి సౌకర్యాలు అందలేదు. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నవంబర్ 3: నేపాల్ భూకంపం 2023 నవంబర్ 3న నేపాల్ కర్నాలీ ప్రావిన్స్లోని జాజర్కోట్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 375 మంది గాయపడ్డారు. పశ్చిమ నేపాల్, ఉత్తర భారతదేశం అంతటా భూప్రకంపనలు కనిపించాయి. 2015 నుంచి నేపాల్లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. మరణాల్లో జాజర్కోట్ జిల్లాలో 101 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారు. మరణించిన వారిలో 78 మంది పిల్లలు కూడా ఉన్నారు. నేపాల్లోని పదమూడు జిల్లాల్లో దాదాపు 62,039 ఇళ్లు ప్రభావితమయ్యాయి. వాటిలో 26,550 ఇళ్లు కుప్పకూలాయి. నవంబర్ 17: మిండనావో భూకంపం, ఫిలిప్పీన్స్ 2023 నవంబర్ 17న ఫిలిప్పీన్స్ మిండనావో ద్వీపంలోని సారంగని ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో 11 మంది మరణించారు. 730 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగున ఉన్న ఇండోనేషియాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. 644 ఇళ్లు కూలిపోగా.. 4,248 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదీ చదవండి: Year End 2023: అన్నీ మంచి శకునములే! -
అంతర్జాతీయ సవాళ్లపై సమాలోచనలు...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐఎంఎఫ్ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు, ఇంటర్–అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలాన్ గోల్డ్ఫాజ్్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్తో కలిసి పనిచేయాలన్న భారత్ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
నిర్మలా సీతారామన్ మొరాకో పర్యటన నేటి నుంచి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం మొరాకో బయలుదేరనున్నారు. ఆ దేశ ఆర్థిక రాజధాని మారకేచ్లో ఈ ఆరు రోజుల అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో ఆర్థికమంత్రి పాల్గొననున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితోపాటు ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్లతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలు అక్టోబర్ 11–15 తేదీల మధ్య మరకేచ్లో జరగనున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల కోసం వెళుతున్న భారత ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారులు ఈ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉంటారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఈ పర్యటనలో, సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాల్గవ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తారు.ఈ సమావేశంలో జీ20 దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 65 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగం కానున్నాయి. బహుళజాతి బ్యాంకుల పటిష్టతకు సంబంధించి నిపుణుల గ్రూప్ రూపొందించిన రెండవ వ్యాల్యూమ్ నివేదిక ఈ సమావేశాల్లో విడుదల కానుంది. మొదటి వ్యాల్యూమ్ నివేదిక గుజరాత్ గాం«దీనగర్లో జూలైలో జరిగిన మూడవ ఎఫ్ఎంసీబీజీ సమావేశాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. -
భారత్ 1 మొరాకో 1
లక్నో: డేవిస్కప్ వరల్డ్ గ్రూప్–2 టెన్నిస్ పోటీలో తొలి రోజు భారత్, మొరాకో క్రీడాకారులు ఒక్కో మ్యాచ్లో గెలిచారు. దాంతో స్కోరు 1–1తో సమంగా నిలిచింది. తొలి సింగిల్స్లో శశికుమార్ ముకుంద్ 7–6 (7/4), 5–7, 1–4తో యాసిన్ దిల్మీ చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్లో సుమిత్ నగాల్ 6–3, 6–3తో ఆడమ్ మౌన్డిర్పై గెలుపొందాడు. దిల్మీతో జరిగిన మ్యాచ్లో ముకుంద్ నిర్ణాయక మూడో సెట్లో 1–4తో వెనుకబడిన దశలో కాలి కండరాలు పట్టేయడంతో వైదొలిగాడు. నేడు మూడు మ్యాచ్లు జరుగుతాయి. డబుల్స్ మ్యాచ్లో రోహన్ బోపన్న–యూకీ బాంబ్రీ జోడీ బెన్చిట్రి–లారూసి జంటతో ఆడుతుంది. రివర్స్ సింగిల్స్లో దిల్మీతో సుమిత్ నగాల్, ఆడమ్తో శశికుమార్ తలపడతారు. -
నాలుగు రోజుల గ్యాప్లో 6వేల మంది మృతి!
రెండూ ఆఫ్రికన్ దేశాలే. కానీ, ప్రకృతి ప్రకోపానికి తీరని నష్టంతో తల్లడిల్లిపోతున్నాయి. కేవలం నాలుగే రోజుల వ్యవధిలో.. ఈ రెండు దేశాల్లో ఆరు వేలమంది ప్రాణాలు పోయాయి. ఒకవైపు మొరాకోలో సంభవించిన భూ విలయం.. మరోవైపు లిబియాలో పోటెత్తిన జల విలయం.. వేల మందిని బలిగొనడమే కాకుండా.. ఊహించని స్థాయిలో ఇరు దేశాలకు నష్టం కలగజేశాయి. ఆఫ్రికా దేశం లిబియాలోని దెర్నా నగరాన్ని వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. ఒక్క ఆ నగరంలో వరదల ధాటికి 2 వేల మందికిపైగా మృతి చెందారు. మిగతా అన్నిచోట్లా కలిపి మృతుల సంఖ్య వెయ్యికి పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మరణాలు కాకుండా.. కొన్ని వేల మంది గల్లంతయ్యారు. 48 గంటలు గడిచినా వాళ్ల జాడపై ఇంకా స్పష్టత రాలేదు. జాడ లేకుండా పోయిన వాళ్ల సంఖ్య పదివేలకు పైనే ఉండొచ్చని అధికారిక వర్గాల అంచనా. అంటే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని లిబియా ప్రధాని ఒసామా హమద్ చెబుతున్నారు. మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి వారం రోజులుగా ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దెర్నా సహా ప్రధాన నగరాలను డిజాస్టర్ జోన్గా ప్రకటించారు. ఒక్కసారిగా డ్యామ్లు తెగిపోయి ఉప్పెన.. ఊళ్లను ముంచెత్తింది. జనాలు ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దెర్నాలో అయితే వరద పెను విలయం సృష్టించింది. మరోవైపు విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తాగు నీరు, ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు అక్కడి వాతావరణ శాఖ ప్రకటించడంతో.. జనం బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు. మొరాకోలో మృత్యుఘోష శుక్రవారం రాత్రి మొరాకోలో సంభవించిన భూకంపం.. 3 వేల మందికిపైగా ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంది. సహయాక చర్యల్లో ఇంకా మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ప్రకృతి విలయం దాటిచ మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. భూకంపం వచ్చి నాలుగు రోజులు గడుస్తుండడంతో.. బాధితులు సజీవంగా బయటపడతారన్న ఆశలు కనుమరుగైపోయాయని అధికారులు అంటున్నారు. మొరాకోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ పెను విపత్తు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు వణికిపోయాయని తెలిపింది. దీంతో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. -
శవాల దిబ్బగా మొరాకో
మర్రకేశ్: భూకంపం సృష్టించిన పెను విధ్వంసం, ప్రాణనష్టం మొరాకో వాసులను షాక్కు గురిచేసింది. ఈ ఉత్తర ఆఫ్రికా దేశంలో ఇంతటి తీవ్ర భూకంపం రావడం 120 ఏళ్లలో ఇదే మొదటిసారి. దేశంలోని మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్ల్లో శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు భయాందోళనలతో వీధుల్లో రెండో రోజూ చీకట్లోనే జాగారం చేశారు. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది. శిథిలాలను తొలగిస్తుండటంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 2,012కు చేరింది. క్షతగాత్రులైన మరో 2,059 మందిలో 1,404 మందికి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు చెబుతున్నారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని గుర్తించి, కాపాడేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సుదూరంగా కొండ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు సహాయక బృందాలు చేరడం కష్టంగా మారింది. అక్కడి మట్టిరోడ్లపై బండరాళ్లు పడిపోవడంతో టాక్సీలు, అంబులెన్సులు, రెడ్ క్రాస్ సిబ్బంది వాహనాలు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. అక్కడ జరిగిన నష్టం వివరాలు కూడా వెల్లడైతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఈ విలయానికి తీవ్రంగా ప్రభావితమైన అల్ హౌజ్ ప్రావిన్స్లో మరణాలు అత్యధికంగా 1,293 నమోదయ్యాయి. ఆ తర్వాత టరౌడంట్ ప్రావిన్స్లో 452 మంది చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్, అల్జీరియా, జర్మనీ, యూఏఈ, జోర్డాన్ తదితర దేశాలతోపాటు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి సంస్థలు చేయూత అందించేందుకు ముందుకు వచ్చాయి. కళతప్పిన పర్యాటక పట్టణం అట్లాస్ పర్వతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతం మౌలే బ్రహీం భూకంపం ధాటికి విలవిల్లాడింది. మూడువేల జనాభా కలిగిన ఈ చిన్న పట్టణవాసుల ప్రధాన ఆధారం వ్యవసాయం, పర్యాటకం. ఇక్కడి వందల ఏళ్లనాటి ఇటుకతో నిర్మించిన ఇళ్లు పర్యాటకులను ఆకట్టుకునేవి. భూకంపం తీవ్రతకు ఈ ఇళ్లు చాలా వరకు నామరూపాలు కోల్పోగా మిగిలినవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో, జనం ఇళ్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పట్టణంలోని కూడలిలోనే భారీ టెంట్ వేసుకుని, అందులోనే ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ఇల్లంతా ఒక్కసారిగా కదులుతున్నట్లు అనిపించడంతో తమ కుటుంబసభ్యులంతా కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశామని మౌలే బ్రహీంకు చెందిన హంజా లంఘానీ చెప్పాడు. బయటికి వెళ్లాక చూడగా తమ ఇంటితోపాటు పొరుగిల్లు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయన్నాడు. పొరుగింట్లో ఉండే తన చిన్ననాటి స్నేహితులు అయిదుగురూ ఆ శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయారని నిర్వేదంతో చెప్పాడు. భారతీయులంతా సురక్షితం భూకంపం నేపథ్యంలో మొరాకోలోని భారత దౌత్యకార్యాలయం స్పందించింది. దేశంలోని భారత పౌరులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం లేదన్నారు. స్థానిక యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాల్సిందిగా సలహా ఇచ్చింది. అవసరమైన పక్షంలో తమ హెల్ప్లైన్ నంబర్ 212661297491కు కాల్ చేయాల్సిందిగా కోరింది. -
Morocco : 2000 దాటిన భూకంప మృతుల సంఖ్య
మర్రకేశ్: మొరాకోను భూకంపం అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి సంభవించిన భూప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఉలికిపడి వీదుల్లోకి పరుగులు తీశారు. వేలాది భవనాలు నేలమట్టం కాగా.. శిధిలాల్లో చిక్కుకుని 2000 మందికిపై పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విపత్తులో 2,012 మంది ప్రాణాలు కోల్పోగా, 2,059 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికా ఖండం ఉత్తరభాగం చరిత్రలో ఇంత పెద్ద భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అధికారులు అన్నారు. తీరప్రాంత నగరాలైన రబాత్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో బలమైన ప్రకంపనలు సంభవించాయని పేర్కొన్నారు. ఘటనాస్థలాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. MOMENTS BEFORE DISASTER: Horrific moments of the earthquake caught on CCTV footage. BREAKING NEWS: A devastating 6.8 magnitude earthquake that rattled Morocco on Friday night is believed to have left at least 300 people dead and 153 injured. pic.twitter.com/U12GfYPfRL — Cypy The Great (@Cypy254) September 9, 2023 భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్ హౌజ్ ప్రావిన్స్లోని ఇఘిల్ పట్టణం సమీపంలో, మర్రకేశ్కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. #Morocco #earthquake: The next 48 hours will be “#critical” for saving #lives. https://t.co/tmR0ZCnfDg— The Skuup (@TSkuup) September 10, 2023 2004లో, ఈశాన్య మొరాకోలోని అల్ హోసీమాలో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో కనీసం 628 మంది మరణించారు. 926 మంది గాయపడ్డారు.1960లో అగాదిర్లో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 12,000 మందికి పైగా ప్రాణాలను హరించింది. US President Joe Biden "deeply saddened" over loss of lives in Morocco earthquake Read @ANI Story | https://t.co/qqLDEElZAq#USPresident #JoeBiden #moroccoearthquake pic.twitter.com/l9heuiUfGB — ANI Digital (@ani_digital) September 10, 2023 మొరాకో భూకంపంపై ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి. ఇదీ చదవండి: Morocco earthquake: వణికిన మొరాకో -
Morocco earthquake: వణికిన మొరాకో
మర్రకేశ్: మొరాకోను భారీ భూకంపం వణికించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, వీధుల్లోకి పరుగులు తీశారు. అట్లాస్ పర్వతాల్లోని గ్రామాలు మొదలుకొని చార్రితక మర్రకేశ్ నగరం వరకు వందలాదిగా భవనాలు ధ్వంసం కాగా 1,000 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. సుమారు 45 లక్షల మంది నివసించే మర్రకేశ్–సఫి ప్రాంతంలోనే భూకంప నష్టం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా. సుదూర ప్రాంతాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మర్రకేశ్లోని 12వ శతాబ్దం నాటి చారిత్రక కౌటౌబియా మసీదు భూకంప ధాటికి దెబ్బతింది. ఈ మసీదులోని 226 అడుగుల ఎత్తైన మినారెట్ ‘రూఫ్ ఆఫ్ మర్రకేశ్’గా ప్రసిద్ధి. అదేవిధంగా, నగరం చుట్టూతా ఉన్న ఎర్రటి గోడ అక్కడక్కడా దెబ్బతిన్న దృశ్యాలు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ గోడను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. భూకంప కేంద్రానికి చుట్టుపక్కలున్న మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్ల్లో వెయ్యి మందికి పైగా చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మరో 672 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 205 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మొరాకో ప్రభుత్వం తెలిపింది. భూకంప కేంద్రం సమీపంలోని ఓ పట్టణంలో చాలా వరకు ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికుడొకరు వెల్లడించారు. అట్లాస్ పర్వతప్రాంతంలోని అల్ హౌజ్ ప్రావిన్స్లోని తలత్ ఎన్ యాకూబ్ పట్టణంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్పారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. పర్యాటకులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రహదారులు దెబ్బతినడంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అత్యవసర బృందాలు భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా అరుదు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో భూకంపాలు చాలా అరుదు. మొరాకోలోని పర్వత ప్రాంతంలో ఇంతటి అత్యంత తీవ్ర భూకంపం గతంలో ఎన్నడూ సంభవించలేదని నిపుణులు చెబుతున్నారు. 1960లో 5.8 తీవ్రతతో మొరాకోలోని అగడిర్ నగరంలో సంభవించిన భూకంపంలో వేలాదిగా జనం చనిపోయారు. 2004లో తీరప్రాంత నగరం అల్ హొసైమాలో భూకంపంతో 600 మంది చనిపోయారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని నగరాలు, పట్టణాల్లో భూకంపాలను తట్టుకునే విధంగా భవనాల నిర్మాణం జరిగింది. అయితే, పల్లెల్లో మాత్రం ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. తాజా భూకంపం ప్రభావం పోర్చుగల్, అల్జీరియా వరకు ఉంది. ప్రమాదకర భూకంపం భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్ హౌజ్ ప్రావిన్స్లోని ఇఘిల్ పట్టణం సమీపంలో, మర్రకేశ్కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ప్రపంచదేశాల ఆపన్న హస్తం సాయం కోసం మొరాకో ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి విజ్ఞాపన చేయనప్పటికీ..ఈ ఘోర ప్రకృతి విపత్తుపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి. సాధ్యమైనంత సాయం అందజేస్తాం: మోదీ మొరాకోలో భూకంపంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు భారత్ సాధ్యమైనంత మేర ఆదుకుంటుందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం మొదలైన జీ20 భేటీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మొరాకో భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం మొరాకోకు మద్దతుగా నిలవాలనీ, సాధ్యమైనంత మేర సాయం అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
Morocco: భూకంప విలయం.. 1000 మంది మృతి
రాబత్: ప్రకృతి విలయంతో ఆఫ్రికా దేశం మొరాకో తల్లడిల్లిపోయింది. శుక్రవారం రాత్రి సమయంలో మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. కనీసం 1000 మంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎటు చూసినా భవనాలు కుప్పకూలిపోయి.. అయిన వాళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 11.11 సమయంలో మధ్య మొరాకో మర్రకేచ్ నగరం కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 7.2 త్రీవతతో భూకంపం సంభవించింది. ఉన్నట్లుండి భవనాలు కుప్పకూలిపోయాయి. రోడ్డుల వెంట ఉన్న జనం.. ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రంతా రోడ్ల మీదే గడిపారు. భూకంపం ధాటికి.. వందల సంఖ్యలో మరణించి ఉంటారని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. మరో 300 మందిదాకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని ప్రభుత్వం చెబుతోంది. Moment when powerful 6.8 magnitude #earthquake rocked #Morocco atleast 296 dead #moroccoearthquake #moroccosismo #Sismo #viral #BREAKING pic.twitter.com/2fyjtgEC2O — Utkarsh Singh (@utkarshs88) September 9, 2023 మొరాకో భూకంపం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్(ట్విటర్)లో ఆయన సంతాప సందేశం ఉంచారు. Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to… — Narendra Modi (@narendramodi) September 9, 2023 యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.11 గం. ప్రాంతంలో కొన్ని సెకండ్ల పాటు భారీగా భూమి కంపించింది. భూమి ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఆ తర్వాత.. 19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు వెల్లడించింది. అయితే మొరాకో నేషనల్ సెయిస్మిక్ మానిటరింగ్ అండ్ అలర్ట్ నెట్వర్క్ మాత్రం.. తీవ్రత 7గా ఉన్నట్లు చెబుతోంది. అలాగే.. కేవలం 8 కిలోమీటర్ల లోతునే ప్రకంపనల కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది. Earthquake Morocco Richter 6.8#marrakech #agadir #casablanca #fes#مراكش #فاس #أغادير #الدار_البيضاء#moroccoearthquake #morocco #earthquakemorocco #earthquake#زلزال_المغرب #هزة_أرضية pic.twitter.com/EXBcv4rw17 — Jalal (@jalaloni) September 8, 2023 Scenes from Morocco's earthquake aftermath Understandably, people don't want to go back indoors because fearing aftershocks#earthquake #Maroc #moroccoearthquake #Morocco #earthquakemorocco #pray #hope #god #Marrakesh pic.twitter.com/cKg1bq0maq — Kinetik (@KinetikNews) September 9, 2023 మొరాకోలో స్వల్పతీవ్రతతో సంభవించే భూకంపాలకు సైతం తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. 1960లో రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం.. వేల మందిని బలిగొనడం గమన్హార్హం. ఇదిలా ఉంటే.. పోర్చుగల్, అల్జీరియాలోనూ భూకంపం సంభవించినా.. అవి స్వల్ఫ ప్రకంపనలే అని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని సమాచారం. -
మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..
రాబాత్: మొరాకోలో ప్యాసింజర్లతో వెళ్తోన్న ఓ బస్సు ప్రమాదకరమైన మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో బోల్తా కొట్టింది. ప్రమాదంలో 24 మందిమృతి చెందినట్లు తెలిపింది మొరాకో వార్తా సంస్థ(MAP ). సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డెమ్నాట్లోని వీక్లీ మార్కెట్కు వెళ్తోన్న ఓ బస్సు రోడ్డు మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 24 ముంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే రాయల్ జెండర్మీర్ పౌర రక్షణ సంస్థ వారు సహాయక చర్యలు చేపట్టారు. దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని విచారణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మొరాకోలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఏడాదికి రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించేవారు సంఖ్య సగటున 3500గా ఉందని, గతేడాది 3200 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతంలో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని సరిగ్గా గత ఏడాది ఆగస్టులో తూర్పు కాసాబ్లాంకాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకోగా ఆ ప్రమాదంలో 25 మంది మృతి చెందారని అంతకు ముందు 2015లో యువ అథ్లెట్లు ప్రయాణిస్తున్న ఒక బస్సును సెమీ ట్రైలర్ ట్రక్కు ఢీకొట్టడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: చైనాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు.. -
Monaco Grand Prix: వెర్స్టాపెన్దే గెలుపు.. సీజన్లో నాలుగో టైటిల్
మోంటెకార్లో: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాలుగో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సీజన్లోని ఆరో రేసు మొనాకో గ్రాండ్ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ నిరీ్ణత 78 ల్యాప్లను అందరికంటే వేగంగా 1 గంట 48 నిమిషాల 51.980 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెర్నాండో అలోన్సో (ఆస్టిన్ మార్టిన్) రెండో స్థానంలో, ఎస్టెబన్ ఒకాన్ (అలై్పన్ టీమ్) మూడో స్థానంలో నిలిచారు. max cమెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, జార్జి రసెల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. ఈ సీజన్లో ఆరు రేసులు జరగ్గా ఆరింటిని రెడ్బుల్ డ్రైవర్లే గెల్చుకోవడం విశేషం. వెర్స్టాపెన్ బహ్రెయిన్, ఆ్రస్టేలియన్, మయామి, మొనాకో గ్రాండ్ప్రిలలో నెగ్గగా... సెర్జియో పెరెజ్ సౌదీ అరేబియా, అజర్బైజాన్ గ్రాండ్ప్రిలలో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం 144 పాయింట్లతో వెర్స్టాపెన్ టాప్ ర్యాంక్లో, 105 పాయింట్లతో పెరెజ్ రెండో ర్యాంక్లో, 93 పాయింట్లతో అలోన్సో మూడో ర్యాంక్లో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్ప్రి జూన్ 4న జరుగుతుంది. -
135 మ్యాచ్ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
మొరాకోకు చెందిన టెన్నిస్ ఆటగాడికి అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రీటీ ఏజెన్సీ(ITIA) షాక్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో 135 మ్యాచ్ల్లో ఫిక్సింగ్ నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు ఐటీఐఏ గురువారం పేర్కొంది. బెల్జియంలోని ఐటీఐఏతో కలిసి లా ఎన్ఫోర్స్మెంట్ పరిశోధనల తర్వాత ఇద్దరు అల్జీరియన్ ఆటగాళ్లతో రచిడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇకపై యూనెస్ రచిడి కోచింగ్ లేదా క్రీడల పాలక సంస్థలు అనుమతించిన ఏ టెన్నిస్ ఈవెంట్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు తెలిపింది. కెరీర్లో అత్యధిక డబుల్స్ ర్యాంకింగ్స్లో 473వ ర్యాంక్కు చేరుకున్న యూనెస్ రచిడికి 34 వేల డాలర్ల జరిమానా కూడా విధించినట్లు ఐటీఐఏ వివరించింది. చదవండి: ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు -
చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో క్రొయేషియా మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం మూడోస్థానం కోసం మొరాకోతో జరిగని ప్లే ఆఫ్ మ్యాచ్లో 2-1 తేడాతో క్రొయేషియా ఘన విజయం సాధించింది. గతేడాది రన్నరప్గా నిలిచిన క్రొయేషియా మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జట్టు కెప్టెన్ లుకా మోడ్రిక్ తన కెరీర్లో చివరి ఫిఫా వరల్డ్కప్ ఆడేసినట్లే. వరుసగా రెండు ప్రపంచకప్ల్లో క్రొయేషియాను నడిపించిన లుకా మోడ్రిక్ ఒకసారి రన్నరప్, మరోసారి మూడో స్థానంలో నిలిపాడు. టైటిల్ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయాడు లుకా మోడ్రిక్. అయినా కూడా ఈ క్రొయేషియా స్టార్ తన ఆటతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే.. ఫిఫా వరల్డ్కప్లో ఫుట్బాల్ స్టార్స్ తర్వాత మరో పేరు బాగా మార్మోగింది. ఆమెనే క్రొయేషియా మోడల్ ఇవానా నోల్. ఖతర్లో పొట్టి దుస్తులు వేసుకోవాన్ని ఆ దేశం బహిష్కరించనప్పటికి ఇవానా నోల్ మాత్రం పొట్టి బట్టలు ధరించి క్లీవేజ్ షో చేస్తూ అందాల ఆరబోతను ప్రదర్శించింది. తనకు ఖతర్ అధికారుల నుంచి అనుమతి ఉందని.. అందుకే పొట్టి దుస్తులు వేసుకొని స్టేడియానికి వచ్చినట్లు ఇవానా పేర్కొంది. ఇక తాజాగా శనివారం క్రొయేషయా, మొరాకోల మధ్య జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్లో మరోసార దర్శనమిచ్చింది. అయితే ఈసార అందాల ప్రదర్శన కాకుండా తన ఫెవరెట్ అయిన.. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిక్ కోసం మ్యాచ్కు వచ్చిందంట. అందుకు తగ్గట్లుగానే లుకా మోడ్రిక్ పేరున్న ప్రత్యేక ఔట్ఫిట్ను వేసుకొచ్చింది. ఈ సందర్భంగా లుకా మోడ్రిక్కు స్పెషల్ థాంక్స్ చెబుతూ.. థాంక్యూ కెప్టెన్ లుకా మోడ్రిక్.. మన దేశం గర్వించేలా చేశారు. ఇక మూడోప్లేస్లో నిలిచి మెడల్ అందుకోవడమే తరువాయి. ఇంకెందుకు ఆలస్యం పని కానిచ్చేయండి అంటూ రాసుకొచ్చింది. ఇవానా నోల్ కోరికను క్రొయేషియా నిలబెట్టింది. మొరాకోతో జరిగిన మ్యాచ్లో 2-1తేడాతో గెలిచి ఈ వరల్డ్కప్ను మూడోస్థానంతో ముగించింది క్రొయేషియా జట్టు. ఏది ఏమైనా ఈసారి మాత్రం ఇవానా నోల్ తన అందచందాలతో ప్రత్యేకంగా నిలిచింది. చదవండి: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే FIFA: అర్జెంటీనాదే వరల్డ్కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ను క్రొయేషియా మూడోస్థానంతో ముగించింది. శనివారం మూడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్లో క్రొయేషియా.. మొరాకోను 2-1 తేడాతో ఓడించింది. క్రొయేషియా తరపున ఆట 7వ నిమిషంలో జోస్కో గ్వార్డియోల్, ఆట 42వ నిమిషంలో మిస్లావ్ ఓర్సిక్ గోల్స్ చేశారు. ఇక మొరాకో తరపున ఆట 9వ నిమిషంలో అచ్రఫ్ డారీ గోల్ చేశాడు. అయితే ఆట తొలి అర్థభాగంలోనే ఇరుజట్లు గోల్స్ చేశాయి. రెండో అర్థభాగంలో గోల్స్ కోసం ప్రయత్నించినప్పటికి సఫలం కాలేకపోయాయి. ఇక గతేడాది రన్నరప్గా నిలిచిన క్రొయేషియా ఈసారి మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో తొలిసారి సెమీస్ చేరి సంచలనం సృష్టించింది. గ్రూప్ దశలో బెల్జియం.. నాకౌట్స్లో పోర్చుగల్, స్పెయిన్లను ఓడించి సెమీస్కు చేరుకున్న మొరాకో డిఫెడింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఆదివారం(డిసెంబర్ 18న) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగే ఫైనల్తో మెగాటోర్నీ ముగియనుంది. -
FIFA WC: వార్నీ వదిలేస్తే మొత్తం తినేసేలా ఉన్నాడు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో శనివారం మొరాకో, క్రొయేషియా మధ్య మూడోస్థానం కోసం ప్లేఆఫ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు అంతా సిద్ధం చేసుకున్నాయి. గతేడాది రన్నరప్గా నిలిచిన క్రొయేషియా మూడో స్థానంలో నిలుస్తుందా లేక తొలిసారి సెమీస్ వరకు అందరి దృష్టిని ఆకర్షించిన మొరాకో జట్టు మూడోస్థానం సాధించి కెరీర్ బెస్ట్ను అందుకుంటుందా అనేది చూడాలి. ఈ సంగతి పక్కనబెడితే.. మొరాకో గోల్కీపర్ యాసీ బౌనౌ కుమారుడు చేసిన పని సోషల్ మీడియలో వైరల్గా మారింది. పోర్చుగల్తో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన అనంతరం యాసీ బౌనౌ తన కుమారుడితో కలిసి ఇంటర్య్వూ ఇచ్చేందుకు వచ్చాడు. యాసీ మాట్లాడుతుండగా.. రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్ను ఐస్క్రీం అనుకొని నాకడానికి ప్రయత్నించాడు. కానీ అది ఐస్క్రీం కాదని తెలుసుకొని వెనక్కి తగ్గాడు. కొడుకు చేసిన పనిని గమనించిన యాసీ బౌనౌకు నవ్వు ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక మొరాకో గోల్కీపర్గా యాసీ బౌనౌ సూపర్ ఫామ్ కొనసాగించాడు. పెనాల్టీ అడ్డుకోవడంలో మంచి ప్రదర్శన కనబరిచిన యాసీ ఫిఫా వరల్డ్కప్లోనూ అదే ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పెనాల్టీల్లో ఐదింటిని గోల్స్ కాకుండా అడ్డుకున్నాడు. Yassine Bounou's son thinking the 🎤 to be 🍦 is supremely adorable! ❤️ #FIFAWorldCup pic.twitter.com/YTorvQwDvM — FIFA World Cup (@FIFAWorldCup) December 14, 2022 -
FIFA World Cup Qatar 2022 Second Semi-Final: ఫైనల్కు ‘ఫ్రెంచ్ కిక్’
ఎట్టకేలకు మొరాకో తన ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకుంది. మేటి జట్లకే కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఆఫ్రికా జట్టు చివరకు సెమీఫైనల్లో ఓడింది. సంచలనానికి ఛాన్స్ ఇవ్వని ఫ్రాన్స్ నిర్ణీత సమయంలోనే విజయం సాధించింది. ‘డిఫెండింగ్ చాంపియన్’ వరుసగా రెండో ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిజానికి మొరాకో ఆషామాషీగా తలొగ్గలేదు. గోల్ కోసం ఆఖరి ఇంజ్యూరీ టైమ్ దాకా శ్రమించింది. మైదానం మొత్తం మీద ఫ్రాన్స్ స్ట్రయికర్లకు దీటుగా ప్రత్యర్థి గోల్పోస్ట్పై గురి పెట్టినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. మరోవైపు ఫ్రాన్స్... ఈ టోర్నీలోనే కొరకరాని కొయ్యను ఐదో నిమిషంలోనే దారికి తెచ్చుకుంది. ద్వితీయార్ధంలో ఎదురులేని విజయానికి స్కోరును రెట్టింపు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్కు వచ్చి తమ అద్భుత పోరాటపటిమతో తమకంటే ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టించిన మొరాకో ఇక మూడో స్థానం కోసం శనివారం గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తలపడుతుంది. దోహా: అర్జెంటీనా ఫైనల్ ప్రత్యర్థి ఎవరో తేలింది. ఇక ఆఖరి సమరమే మిగిలుంది. విజేత ఎవరో... రన్నరప్గా మిగిలేదెవరో ఆదివారం రాత్రి తెలుస్తుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ 2–0 గోల్స్ తేడాతో ఈ టోర్నీలో మింగుడు పడని ప్రత్యర్థి మొరాకోను ఓడించి ఫైనల్ చేరింది. మ్యాచ్ 5వ నిమిషంలో థియో హెర్నాండెజ్... 79వ నిమిషంలో ‘సబ్స్టిట్యూట్’ రాన్డల్ కొలొముని ఫ్రాన్స్ జట్టుకు చెరో గోల్ అందించారు. 78వ నిమిషంలోనే మైదానంలోకి వచ్చిన సబ్స్టిట్యూట్ రాన్డల్ 44 సెకన్లలోనే గోల్ చేయడం విశేషం. ఈ మెగా టోర్నీలోనే నిర్ణీత సమయంలో క్వార్టర్స్ దాకా ప్రత్యర్థులెవరికీ గోల్ ఇవ్వని మొరాకో సెమీస్లో రెండు గోల్స్ ఇవ్వడమే కాకుండా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మొరాకో గత మ్యాచ్లకి, తాజా సెమీఫైనల్స్కు ఇదొక్కటే తేడా! దీని వల్లే సంచలనం, టైటిల్ సమరం రెండు సాకారం కాలేకపోయాయి. ఆట మొదలైన కాసేపటికే ఫ్రాన్స్ పంజా విసరడం మొదలు పెట్టింది. గ్రీజ్మన్ ‘డి’ ఏరియాలో బంతిని ప్రత్యర్థి గోల్పోస్ట్ సమీపానికి తీసుకెళ్లాడు. కానీ క్రాస్ షాట్ కష్టం కావడంతో కిలియాన్ ఎంబాపెకు క్రాస్ చేశాడు. కానీ అతని షాట్ విఫలమైంది. అక్కడే గుమిగూడిన మొరాకో డిఫెండర్లు అడ్డుకున్నారు. అయితే బంతి మాత్రం అక్కడక్కడే దిశ మార్చుకుంది. గోల్పోస్ట్కు కుడివైపు వెళ్లగా అక్కడే ఉన్న థియో హెర్నాండెజ్ గాల్లోకి ఎగిరి ఎడమ కాలితో కిక్ సంధించాడు. దీన్ని ఆపేందుకు గోల్ కీపర్ యాసిన్ బోనో అతని ముందుకెళ్లగా... మొరాకో కెప్టెన్ రొమెయిన్ సైస్, అచ్రాఫ్ డారి గోల్పోస్ట్ను కాచుకున్నారు. అయినా సరే హెర్నాండెజ్ తన ఛాతీ ఎత్తున ఉన్న బంతిని ఎడమ కాలితో తన్ని లక్ష్యానికి చేర్చాడు. ఆఖరి క్షణంలో గోల్పోస్ట్లోనే ఉన్న అచ్రాఫ్ డారి దాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడు. కానీ అతని కుడి మొకాలికి వెంట్రుకవాసి దూరంలోనే బంతి గోల్ అయ్యింది. ఫ్రాన్స్ 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరో 5 నిమిషాల వ్యవధిలోనే... మొరాకోకు ఆట పదో నిమిషంలో సమం చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘డి’ ఏరియా వెలుపలి నుంచి అజెడైన్ వొవునహి ఫ్రాన్స్ గోల్పోస్ట్ లక్ష్యంగా లాంగ్షాట్ కొట్టాడు. ఫ్రాన్స్ గోల్కీపర్ లోరిస్ ఎడమ చేతితో అడ్డుకున్నప్పటికీ బంతి రీబౌండ్ అయింది. కానీ సమీపంలో తిరిగి షాట్ కొట్టే మొరాకో స్ట్రయికర్లు ఎవరూ లేకపోవడంతో గోల్ అవకాశం త్రుటిలో చేజారింది. 17వ నిమిషంలో ఫ్రాన్స్ స్కోరు రెట్టింపయ్యే ఛాన్స్ కూడా మిస్సయ్యింది. ఒలివియర్ జిరూడ్ మెరుపు వేగంతో మొరాకో ‘డి’ ఏరియాలోకి దూసుకొచ్చి బలంగా కొట్టిన షాట్ ప్రత్యర్థి గోల్కీపర్ కూడా ఆపలేకపోయాడు. కానీ బంతి గోల్పోస్ట్ కుడివైపున బార్ అంచును తాకి బయటికి వెళ్లిపోయింది. మళ్లీ 36వ నిమిషంలోనూ ఫ్రాన్స్ ఆటగాడు జిరూడ్ గట్టిగానే ప్రయత్నించాడు. వాయువేగంతో కొట్టిన షాట్ను మొరాకో డిఫెండర్ జవాద్ ఎల్ యామిక్ కళ్లు చెదిరే కిక్తో అడ్డుకున్నాడు. లేదంటే బంతి బుల్లెట్ వేగంతో గోల్పోస్ట్లోకి వెళ్లేది! 44వ నిమిషంలో కార్నర్ను గోల్పోస్ట్ కుడివైపున ఉన్న జవాద్ ఎల్ యామిక్ చక్కగా తనను తాను నియంత్రించుకొని బైసైకిల్ కిక్ కొట్టాడు. దాదాపు గోల్ అయ్యే ఈ షాట్ను ఫ్రాన్స్ గోల్కీపర్ లోరిస్ కుడి వైపునకు డైవ్ చేసి చేతితో బయటికి పంపించాడు. ద్వితీయార్ధంలోనూ మొరాకో గోల్స్ కోసం అదేపనిగా చేసిన ప్రయత్నాల్ని ఫ్రాన్స్ ఆటగాళ్లు ఎక్కడికక్కడ కట్టడి చేసి అడ్డుకున్నారు. 78వ నిమిషంలో రాన్డల్ మైదానంలోకి వచ్చాడు. అప్పుడే సహచరులు మార్కస్ తురమ్, ఎంబాపెలు మొరాకో ‘డి’ ఏరియాలో పరస్పరం పాస్ చేసుకొని గోల్పై గురి పెట్టారు. కానీ డిఫెండర్లు చుట్టుముట్టడంతో గోల్పోస్ట్కు మరింత సమీపంలో ఉన్న రాన్డల్కు ఎంబాపె క్రాస్పాస్ చేశాడు. 79 నిమిషంలో రాన్డల్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సులువుగా గోల్పోస్ట్లోకి పంపడంతో ఫ్రాన్స్ ఆధిక్యం రెట్టింపైంది. మొరాకో విజయంపై ఆశలు వదులుకుంది. 4: ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఫ్రాన్స్ నాలుగోసారి (1998, 2006, 2018, 2022) ఫైనల్ చేరింది. రెండుసార్లు (1998, 2018) విజేతగా నిలిచింది. 5: వరుసగా రెండు అంతకంటే ఎక్కువసార్లు ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన ఐదో జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962), నెదర్లాండ్స్ (1974, 1978), పశ్చిమ జర్మనీ (1982, 1986), బ్రెజిల్ (1994, 1998, 2002) ఈ ఘనత సాధించాయి. 4: తమ జట్టును వరుసగా రెండు ప్రపంచకప్ లలో ఫైనల్కు చేర్చిన నాలుగో కోచ్గా ఫ్రాన్స్కు చెందిన దిదీర్ డెషాంప్ గుర్తింపు పొందాడు. గతంలో విటోరియో పోజో (ఇటలీ; 1934, 1938), కార్లోస్ బిలార్డో (అర్జెంటీనా; 1986, 1990), బెకన్బాయెర్ (జర్మనీ; 1986, 1990) ఈ ఘనత సాధించారు. 1998లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో డెషాంప్ ప్లేయర్గా ఉన్నాడు. అనంతరం 2018లో విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు ఆయనే కోచ్గా ఉన్నారు. 3: ప్రపంచకప్ చరిత్రలో సబ్స్టిట్యూట్గా ఫాస్టెస్ట్ గోల్ చేసిన మూడో ప్లేయర్గా రాన్డల్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు. మొరాకోతో మ్యాచ్లో అతను సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగిన 44 సెకన్లకే గోల్ చేశాడు. ఈ జాబితాలో రిచర్డ్ మొరాలెస్ (ఉరుగ్వే; 2002లో సెనెగల్పై 16 సెకన్లలో), ఎబ్బీ సాండ్ (డెన్మార్క్; 1998లో నైజీరియాపై 26 సెకన్లలో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన మ్యాచ్లో 2-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ దర్జాగా ఫైనల్స్కు చేరుకుంది. ఇక డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరగనున్న ఫైనల్లో గెలిచి చాంపియన్షిప్ను నిలుపుకోవాలని ఫ్రాన్స్ భావిస్తోంది. అయితే మొరాకోతో జరిగిన సెమీస్లో ఫ్రాన్స్ సూపర్స్టార్ కైలియన్ ఎంబాపె మెరవనప్పటికి తామున్నామంటూ ఇద్దరు ఆటగాళ్లు అదరగొట్టారు. వారిలో ఒకడు తియో హెర్నాండేజ్ అయితే.. ఇంకొకడు రాండల్ కొలో మునాయ్. ఆట 5వ నిమిషంలో హెర్నాండేజ్ గోల్ కొట్టి ఫ్రాన్స్ను ఆధిక్యంలోకి తీసుకెళ్తే.. రెండో అర్థభాగంలో ఆట 79వ నిమిషంలో రాండల్ మరో గోల్ కొట్టి 2-0తో ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు. రాండల్ సంగతి పక్కనబెడితే.. ఆట ఆరంభంలోనే గోల్తో మెరిసిన తియో హెర్నాండేజ్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే.. తియో హెర్నాండేజ్ ఎవరో కాదు.. ఫ్రాన్స్ స్టార్ లుకాస్ ఫెర్నాండేజ్ సొంత తమ్ముడు. అన్నదమ్ములిద్దరు ఏకకాలంలో ఫిఫా వరల్డ్కప్లో ఫ్రాన్స్కు ప్రాతినిధ్యం వహించారు.అయితే గ్రూప్ దశలో ఫ్రాన్స్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో ఫ్రాన్స్ 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. కానీ ఆట ఆరంభమైన కాసేపటికే లుకాస్ ఫెర్నాండేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. మైదానం వీడిన లుకాస్ ఇప్పటి వరకు తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఫిఫా వరల్డ్కప్కు పూర్తిగా దూరమైనట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. అన్న దూరం కావడం తియో హెర్నాండేజ్ను బాధించింది. ఎలాగైనా అన్న కోసం కప్ గెలవాలని బలంగా కోరుకున్నాడు. అప్పటినుంచి ప్రతీ మ్యాచ్ ఆడినప్పటికి హెర్నాండేజ్కు గోల్ కొట్టే అవకాశం రాలేదు. తాజాగా ఆ సమయం రానే వచ్చింది. మొరాకోతో కీలకమైన సెమీఫైనల్లో తియో హెర్నాండేజ్ గోల్ కొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక అన్న లుకాస్ హెర్నాండేజ్ కల నిజం చేసేందుకు తియో హెర్నాండేజ్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అర్జెంటీనాతో జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్ను గెలిపించి అన్నకు టైటిల్ కానుకగా ఇవ్వాలనుకుంటున్నాడు. మొరాకోపై గెలుపు అనంతరం తియో హెర్నాండేజ్ మీడియాతో మాట్లాడాడు. ''లూలూ(లుకాస్ హెర్నాండేజ్).. ఈసారి వరల్డ్కప్ మనిద్దరి కోసం ఆడుతున్నా. మొరాకోతో మ్యాచ్లో గోల్ కొట్టగానే కోచ్ నన్ను పిలిచి మీ అన్న లుకాస్ నిన్ను అభినందించినట్లు చెప్పమని పేర్కొనడం సంతోషం కలిగించింది. నా ప్రదర్శన పట్ల లుకాస్ గర్వపడుతున్నాడు. ఆటలో నువ్వు లేకపోవచ్చు.. కానీ ఎప్పుడు నాతోనే ఉండాలని ఆశపడుతున్నా. నీ గాయం నాకు కష్టంగా అనిపిస్తున్నప్పటికి తప్పదు. అన్న కోసం కప్ గెలవాలనుకుంటున్నా. మ్యాచ్ ముగిసిన ప్రతీరోజు మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం'' అంటూ పేర్కొన్నాడు. 😬 Is @TheoHernandez a ninja? 🥷🏻 Check out the 🔢 from his 🤯 goal in last night's #FRAMAR 📹 Next 🆙 for the @FrenchTeam 👉🏻 #FIFAWorldCup Final 🆚 @Argentina on Dec 18 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/qX69GwBACz — JioCinema (@JioCinema) December 15, 2022 చదవండి: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు' -
'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయం అందుకుంది. డిఫెండింగ్ చాంపియన్స్గా వరల్డ్కప్లో బరిలోకి దిగిన ఫ్రాన్స్ టోర్నీ ఆసాంతం అందుకు తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తూ వచ్చింది. ఫ్రాన్స్ సూపర్స్టార్ కైలియన్ ఎంబాపె గోల్ కొట్టడంలో విఫలమైనప్పటికి మేమున్నామంటూ తియో హెర్నాండేజ్(ఆట 5వ నిమిషం), రాండల్ కొలో మునాయ్(ఆట 79వ నిమిషం)లో ఫ్రాన్స్కు గోల్ అందించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక డిసెంబర్ 18(ఆదివారం) జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమితుమీ తేల్చుకోనుంది. ఇదిలా ఉంటే ఈ ఫిఫా వరల్డ్కప్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆఫ్రికా జట్టు మొరాకో సెమీస్ చేరి అందర్ని ఆశ్చర్యపరిచింది. గ్రూప్ దశలో బెల్జియం, నాకౌట్స్లో స్పెయిన్, పోర్చుగల్లను చిత్తు చేసి సెమీఫైనల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. అయితే ఫ్రాన్స్ అనుభవం ముందు మొరాకో తలవంచక తప్పలేదు.. అయినా సరే తమ ఆటతీరుతో ఇంత దూరం వచ్చిన మొరాకో జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, మొరాకో ఢిపెండర్ అచ్రఫ్ హకీమిలు బయట బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. దాదాపు ఒకేసారి ఫుట్బాల్ కెరీర్ను ఆరంభించిన ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరు ఫిఫా వరల్డ్కప్ సెమీఫైనల్లో మాత్రం ప్రత్యర్థులయ్యారు. దేశం కోసం మ్యాచ్ ఆడగా.. ఎంబాపె విజయం సాధించగా.. హకీమి ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ వరకు మాత్రమే తాము ప్రత్యర్థులమని.. బయట ఎప్పటికీ ప్రాణ స్నేహితులమేనని మరోసారి నిరూపించారు. అండర్డాగ్స్గా బరిలోకి దిగి సంచలన విజయాలు అందుకున్న తన జట్టు సెమీస్లో నిష్క్రమించడంతో హకీమి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇది గమనించిన ఎంబాపె.. అతని వద్దకు వచ్చి ఓదార్చాడు. బాధపడకు మిత్రమా.. ఓడినా మీరు చరిత్ర సృష్టించారు. మేటి జట్లను చిత్తు చేసి ఇంతదూరం రావడం సామాన్యమైన విషయం కాదు. మీ పోరాటం అమోఘం. అయితే మ్యాచ్లో ఏదో ఒక జట్టు మాత్రమే విజయం సాధిస్తుంది. ఇవాళ నీపై నేను పైచేయి సాధించాను. టోర్నీ వరకే ప్రత్యర్థులం.. బయట మాత్రం ఎన్నటికి స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఎంబాపె, అచ్రఫ్ హకీమిలు తమ జెర్సీలను మార్చుకొని తమ స్నేహం గొప్పతనాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Don’t be sad bro, everybody is proud of what you did, you made history. ❤️ @AchrafHakimi pic.twitter.com/hvjQvQ84c6 — Kylian Mbappé (@KMbappe) December 14, 2022 Kylian Mbappe went straight over to console his good friend and teammate Achraf Hakimi.🤗 pic.twitter.com/IvbwKbemEu — Ben Jacobs (@JacobsBen) December 14, 2022 PSG team-mates Mbappe and Hakimi swapping shirts at the end.#Mar #fra #FIFAWorldCup pic.twitter.com/DrufStKHAV — Shamoon Hafez (@ShamoonHafez) December 14, 2022 Hugo Lloris kept his first clean sheet in #Qatar2022 to guide #LesBleus to another #FIFAWorldCup Final 📈 Relive his brilliant saves in #FRAMAR & watch @FrenchTeam go for 🏆 - Dec 18, 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/2GKLlJL6kX — JioCinema (@JioCinema) December 14, 2022 చదవండి: FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ -
ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్లో మొరాకో అభిమానుల విధ్వంసం
ఫిఫా ప్రపంచకప్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఖతర్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్.. వరుసగా రెండో సారి ఫైనల్కు చేరుకుంది. ఇక నాకౌట్ దశలో అదరగొట్టిన మొరాకో.. కీలకమైన సెమీఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. 0-2 తేడాతో ఓటమిపాలైన మొరాకో ఈ మెగా ఈవెంట్ నుంచి ఇంటిముఖం పట్టింది. బ్రస్సెల్స్లో అల్లర్లు.. కాగా మొరాకో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మొరాకో అభిమానులు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో విధ్వంసం సృష్టించారు. సుమారు 100 మంది ఫ్యాన్స్ బ్రస్సెల్స్ సౌత్ స్టేషన్ సమీపంలో పోలీసులపై బాణాసంచాలను విసిరారు. అదే విధంగా వీధుల్లో ఉన్న షాప్లకు నిప్పు అంటించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఈ అల్లర్లకు కారణమైన చాలా మంది అభిమానలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, భారీ నష్టం ఏమీ జరగలేదని రాయిటర్స్ పేర్కొంది. చదవండి: FIFA WC:సెమీస్లో అదరగొట్టిన ఫ్రాన్స్.. రికార్డులు బ్రేక్ చేస్తూ విజయం 🚨🇫🇷 Breaking: Moroccans start attacking French people celebrating their country's victory in Paris, France. pic.twitter.com/k19wvVeD5J — Terror Alarm (@Terror_Alarm) December 14, 2022 -
FIFA WC: సెమీస్లో అదరగొట్టిన ఫ్రాన్స్.. రికార్డులు బ్రేక్ చేస్తూ విజయం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ అదరగొట్టింది. మొరాకోతో జరిగిన కీలక మ్యాచ్లో 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ఫైనల్కు చేరింది. ఇక, డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ అమితుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. గత ఏడు ఎడిషన్లలో ఫ్రాన్స్ జట్టు నాల్గొవ సారి ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకోవడం విశేషం. ఈ విజయంతో 2002లో బ్రెజిల్ తర్వాత వరుసగా ఫైనల్స్కు చేరిన తొలి డిఫెండింగ్ ఛాంపియన్గా ఫ్రాన్స్ నిలిచింది. ఇదిలా ఉండగా.. రష్యాలో జరిగిన 2018 ప్రపంచ కప్లో ఫ్రాన్స్ 4-2తో క్రొయేషియాను ఓడించి విన్నర్గా నిలిచింది. 🔝 performance 💥@AntoGriezmann covered every blade of grass to ensure @FrenchTeam would reach back-to-back #FIFAWorldCup Finals 🔥 Enjoy his Hero of the Day display, presented by @Mahindra_Auto#FRAMAR #Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/G7UOQ42HCa — JioCinema (@JioCinema) December 14, 2022 -
FIFA WC 2022: మొరాకోతో సెమీ ఫైనల్.. డిఫెండింగ్ ఛాంపియన్కు భారీ షాక్
ఫిఫా వరల్డ్కప్-2022లో భాగంగా ఫ్రాన్స్-మొరాకో జట్ల మధ్య రేపు (అర్ధరాత్రి 12:30) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్టర్లు డయోట్ ఉపమెకనో, అడ్రెయిన్ రేబియట్ అనారోగ్యం కారణంగా ఇవాళ ప్రాక్టీస్కు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో వీరిద్దరు మొరాకోతో జరిగే సెమీస్ మ్యాచ్కు అందుబాటులో ఉండేది అనుమానమేనని సమాచారం. పై పేర్కొన్న ఇద్దరిలో డయోట్ ఉపమెకనో సోమవారం కూడా ప్రాక్టీస్ సెషన్కు హాజరు కాలేదని, అతను తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాడని తెలుస్తోంది. ఉపమెకనో, రేబియట్ సెమీఫైనల్కు అందుబాటులో ఉండకపోవడం ఫ్రాన్స్ విజయావకాశాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత వరల్డ్కప్లో రేబియట్ ఒక గోల్ సాధించి, మరో గోల్ చేసేందుకు సహాయపడగా.. ఉపమెకనో ఖాతా తెరవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్.. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్పై 2-1 గోల్స్ తేడాతో గెలుపొంది సెమీస్కు చేరగా, మొరాకో.. పటిష్టమైన పోర్చుగల్పై సంచలన విజయం (1-0) సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన మొరాకో.. బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ లాంటి హేమాహేమీ జట్లకు షాకిచ్చి సెమీస్ వరకు చేరింది. మరోవైపు హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఫ్రాన్స్.. స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ఫైనల్ ఫోర్కు చేరింది. కాగా, ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన తొలి సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనా.. క్రొయేషియాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్-మొరాకో మ్యాచ్లో విజేత డిసెంబర్ 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో ఇవాళ(డిసెంబర్ 14న) మొరాకో, ఫ్రాన్స్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో గెలిచిన జట్టు డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ సంగతి పక్కనబెడితే ఫ్రాన్స్ సూపర్స్టార్ కైలియన్ ఎంబాపె, మొరాకో డిఫెండర్ అచ్రాఫ్ హకీమిలు ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం పారిస్ సెయింట్-జర్మెన్కు(పీఎస్జీ) ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నెలన్నర వ్యవధిలో పుట్టారు. దేశాలు వేరైనా ఇద్దరి మనసులు మాత్రం ఒక్కటే. ఎంబాపె గోల్ కొడితే.. అచ్రాఫ్ హకీమి సెలబ్రేట్ చేయడా.. అదే విధంగా హకీమి గోల్ కొడితే ఎంబాపె సంబరం చేసుకుంటాడు. హాలిడే టూర్ వెళ్లాల్సి వస్తే ఇద్దరు కలిసే వెళ్తారు. అలాంటి ప్రాణ స్నేహితులు ఇప్పుడు దేశం కోసం ప్రత్యర్థులుగా మారాల్సి వచ్చింది. ఫిఫా వరల్డ్కప్లో భాగంగా ఫ్రాన్స్ తరపున ఎంబాపె.. మొరాకో తరపున అచ్రాఫ్ హకీమిలు ఎదురుపడనున్నారు. ఇంతకాలం స్నేహితులుగా ఉన్న వీళ్లలో ఎవరిరపై ఎవరు ఆధిపత్యం చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఫ్రాన్స్ సూపర్స్టార్ ఎంబాపె ఈ వరల్డ్కప్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే ఐదు గోల్స్ చేసిన ఎంబాపె అత్యధిక గోల్స్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ సెమీస్ చేరింది. మరోవైపు మొరాకో మాత్రం సంచలన ఆటతీరుతో అదరగొట్టింది. గ్రూఫ్ దశలో బెల్జియంను, నాకౌట్స్లో స్పెయిన్, పోర్చుగల్ లాంటి పటిష్టమైన జట్లకు షాక్ ఇస్తూ రోజురోజుకు మరింత బలంగా తయారవుతూ వచ్చింది. మరి ఇవాళ్టి మ్యాచ్లో ఫ్రాన్స్ ముందు మొరాకో ఆటలు సాగుతాయా లేక ఛాంపియన్స్కు మొరాకో షాక్ ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ మొరాకో ఫైనల్ చేరితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికా జట్టుగా చరిత్ర సృష్టించనుంది. చదవండి: FIFA WC: ప్చ్.. క్రొయేషియాతో పాటే అమ్మడు అందాలకు చెక్ పదేళ్ల క్రితం మెస్సీ కోసం.. ఇప్పుడు మెస్సీతో కలిసి View this post on Instagram A post shared by Achraf Hakimi (@achrafhakimi) -
FIFA World Cup Qatar 2022 Semi-Final: అందరి కళ్లు మొరాకో పైనే...
దోహా: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ఊహకందని ప్రదర్శనతో అదరగొడుతున్న ఆఫ్రికా జట్టు మొరాకో మరో సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఫుట్బాల్ ప్రపంచకప్లో భాగంగా నేడు జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్తో మొరాకో తలపడనుంది. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి ముఖాముఖి మ్యాచ్ కాగా... వేర్వేరు టోర్నీలలో ఈ రెండు జట్లు 11 సార్లు తలపడ్డాయి. 1963లో ఒక్కసారి ఫ్రాన్స్ను ఓడించిన మొరాకో ఆ తర్వాత ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయి, మూడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. 2007 తర్వాత ఈ రెండు జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరుగుతుండటం విశేషం. ఎంబాపె, జిరూడ్, గ్రీజ్మన్, థియో హెర్నాండెజ్, చువమెని, గోల్కీపర్ హుగో లోరిస్లాంటి స్టార్ ఆటగాళ్లతో ఫ్రాన్స్ పటిష్టంగా ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 22వ స్థానంలో ఉన్న మొరాకో ప్రపంచకప్లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా రికార్డు నెలకొల్పింది. కెనడాతో మ్యాచ్లో సెల్ఫ్ గోల్ మినహా ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా సమర్పించుకొని ఏకైక జట్టుగా మొరాకో నిలిచింది. గ్రూప్ దశలో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును నిలువరించిన మొరాకో ఆ తర్వాత రెండో ర్యాంకర్ బెల్జియంపై... ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 విశ్వవిజేత స్పెయిన్పై... క్వార్టర్ ఫైనల్లో 2016 యూరో చాంపియన్ పోర్చుగల్ను ఓడించి తమను ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని ఫ్రాన్స్కు హెచ్చరికలు పంపించింది. మొరాకో తరఫున యూసుఫ్ ఎన్ నెసిరి, అచ్రఫ్ హకీమి, హకీమ్ జియెచ్, సఫ్యాన్ అమ్రాబత్, గోల్కీపర్ యాసిన్ బోనో ప్రదర్శన మరోసారి కీలకం కానుంది. ఈ టోర్నీలో ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్పోస్ట్ లక్ష్యంగా కొట్టిన 39 షాట్లను గోల్కీపర్ యాసిన్ బోనో నిలువరించడం విశేషం. -
పోర్చుగల్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న అడల్ట్ స్టార్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో పోర్చుగల్ కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఈసారి కచ్చితంగా కప్ కొడుతుందనుకున్న రొనాల్డో సేన అనూహ్యంగా మొరాకో చేతిలో ఓటమి పాలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక రొనాల్డో అయితే తనకిదే చివరి మ్యాచ్ అన్నట్లుగా వెక్కివెక్కి ఏడ్చాడు. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో ఫిఫా వరల్డ్కప్లో తొలిసారి సెమీస్లో అడుగుపెట్టింది. పోర్చుగల్ ఓటమితో అభిమానులు నిరాశలో ఉంటే.. మాజీ పోర్న్ స్టార్, మోడల్ మియా ఖలీఫా మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. రొనాల్డో సేన క్వార్టర్స్లో ఇంటిబాట పట్టిన సందర్భంగా మొరాకోకు కంగ్రాట్స్ చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేసింది. మొరాకో జెండాను పెట్టిన పక్కన ఆశ్చర్యార్థకం గుర్తులను పెట్టింది. ఆమె చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1–0 గోల్ తేడాతో గెలిచింది.ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్ అలా అందించిన పాస్ను ‘డి’ ఏరియాలో యూసుఫ్ ఎన్ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్’ షాట్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. రెండో అర్థభాగం చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్కు గోల్ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్కీపర్ యాసిన్ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్ను యాసిన్ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్గా మ్యాచ్ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు. 🇲🇦!!!!! — Mia K. (@miakhalifa) December 10, 2022 చదవండి: FIFA: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం FIFA WC 2022: 'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు' -
పోర్చుగల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన రోనాల్డో! వీడియో వైరల్
56 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్కు మరోసారి నిరాశే ఎదురైంది. తన ఆఖరి ప్రపంచకప్లోనైనా జట్టుకు ట్రోఫీని అందించాలన్న రోనాల్డో కల కలగానే మిగిలిపోయింది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో ఓటమిపాలైన పోర్చుగల్ ఇంటిముఖం పట్టింది. ఎన్నో గోప్ప ట్రోఫీలను సాధించిన రోనాల్డో.. ప్రపంచకప్ టైటిల్ లేకుండానే తన కెరీర్ను ముగించాల్సి వస్తుంది. తన వయస్సు దృష్ట్యా రోనాల్డోకు ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. కన్నీళ్లు పెట్టుకున్న రోనాల్డో మొరాకో చేతిలో తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రోనాల్డో కన్నీటిపర్యంతమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తూ రోనాల్డో కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోనాల్డోను అటవంటి పరిస్థితుల్లో చూసిన అభిమానులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్విటర్ వేదికగా అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. "ప్రపంచకప్ గెలవకపోతేనేమీ.. ఎప్పటికీ నీవు మా సూపర్ హీరోవి"అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా క్రిస్టియానో రొనాల్డోను టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37 ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్స్టిట్యూట్ ప్లేయర్గా బరిలోకి దించారు. అయితే మొరాకో పటిష్ట డిఫెన్స్ ముందు రోనాల్డో తలవంచాడు. మరోవైపు సెమీఫైనల్కు చేరుకున్న తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది. It hurts me to see Ronaldo like this man 💔 pic.twitter.com/MbRGnTcRO2 — WolfRMFC (@WolfRMFC) December 10, 2022 చదవండి: FIFA WC: పోర్చ్గల్కు షాకిచ్చిన మొరాకో.. సెమీఫైనల్కు చేరిన ఆఫ్రికా జట్టు -
పోర్చుగల్కు షాకిచ్చిన మొరాకో.. సెమీఫైనల్కు చేరిన ఆఫ్రికా జట్టు
ఇప్పటి వరకు 92 ఏళ్ల ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీలో ఆఫ్రికా ఖండానికి చెందిన 13 దేశాలు 48 సార్లు బరిలోకి దిగాయి. మూడు దేశాలు కామెరూన్, ఘనా, సెనెగల్ ఒక్కోసారి క్వార్టర్ ఫైనల్ చేరి అక్కడి నుంచే ఇంటిదారి పట్టాయి. ఎట్టకేలకు 49వ ప్రయత్నంలో మొరాకో రూపంలో ఓ ఆఫ్రికా జట్టు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటి ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్కు వచ్చిన మొరాకో జట్టు క్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన పోర్చుగల్ జట్టును ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో మొరాకో తలపడుతుంది. దోహా: లీగ్ దశలో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం జట్టుపై తాము సాధించిన విజయం... గత రన్నరప్ క్రొయేషియాను 0–0తో నిలువరించడం... గాలివాటమేమీ కాదని ప్రపంచ 22వ ర్యాంకర్ మొరాకో నిరూపించింది. ఫుట్బాల్ ప్రపంచకప్లో ఆరోసారి పోటీపడిన మొరాకో ఈసారి సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1–0 గోల్ తేడాతో గెలిచింది. తద్వారా ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా, తొలి అరబ్ దేశంగా రికార్డు నెలకొల్పింది. ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్ అలా అందించిన పాస్ను ‘డి’ ఏరియాలో యూసుఫ్ ఎన్ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్’ షాట్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. విఖ్యాత ప్లేయర్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37 ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్స్టిట్యూట్ ప్లేయర్గా బరిలోకి దించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్పై హ్యాట్రిక్ చేసిన గొన్సాలో రామోస్ ఈ మ్యాచ్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. మొరాకో డిఫెన్స్ కూడా పటిష్టంగా ఉండటంతో పోర్చుగల్ జట్టు ఆటగాళ్లు గోల్పోస్ట్పై గురి చూసి కొట్టలేకపోయారు. చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్కు గోల్ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్కీపర్ యాసిన్ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్ను యాసిన్ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్గా మ్యాచ్ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు. -
పోర్చు‘గోల్స్’ మోత
దోహా: ఆరంభం నుంచి సూపర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను ఆడించకపోయినా... తమ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదని నిరూపిస్తూ పోర్చుగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో కళ్లు చెదిరే ప్రదర్శనతో మెరిసింది. ఆద్యంతం దూకుడుగా ఆడుతూ, పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ రొనాల్డో లేకున్నా పోర్చుగల్ జట్టు భవిష్యత్కు ఢోకా లేదని నిరూపించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 6–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ను చిత్తుగా ఓడించి 16 ఏళ్ల తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోర్చుగల్ తరఫున తొలి ప్రపంచకప్లో ఆడుతున్న 21 ఏళ్ల గొన్సాలో రామోస్ (17వ, 51వ, 67వ ని.లో) మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... పెపె (33వ ని.లో), రాఫెల్ గెరెరో (55వ ని.లో), రాఫెల్ లియా (90+2వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్విట్జర్లాండ్ జట్టుకు మాన్యుయెల్ అకాంజీ (58వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. చివరిసారి 1954లో ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్విట్జర్లాండ్ ఆ తర్వాత ఐదుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరోవైపు ఎనిమిదోసారి ప్రపంచకప్లో ఆడుతున్న పోర్చుగల్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 1966లో మూడో స్థానంలో నిలిచిన పోర్చుగల్, 2006లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో పోర్చుగల్ తలపడుతుంది. తొలిసారి సబ్స్టిట్యూట్గా రొనాల్డో... వరుసగా ఐదో ప్రపంచకప్లో ఆడుతున్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి తుది 11 మంది జట్టులో చోటు కోల్పోయాడు. రొనాల్డో స్థానంలో గొన్సాలో రామోస్ను తొలి నిమిషం నుంచి ఆడించాలని కోచ్ ఫెర్నాండో సాంటోస్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించిన రామోస్ ఘనా, ఉరుగ్వేలతో మ్యాచ్ల్లో సబ్స్టిట్యూట్గా చివరి నిమిషాల్లో బరిలోకి దిగాడు. అయితే కీలకమైన మ్యాచ్లో అత్యంత అనుభవజ్ఞుడు, 37 ఏళ్ల రొనాల్డోను కాదని రామోస్ను ఆరంభం నుంచే ఆడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే తన ఎంపిక సరైనదేనని రామోస్ నిరూపించుకున్నాడు. మూడు గోల్స్ చేయడమే కాకుండా గెరెరో గోల్ చేయడానికి రామోస్ సహాయపడ్డాడు. పోర్చుగల్ ఖాతాలో ఐదు గోల్స్ జమయ్యాక.. 74వ నిమిషంలో రొనాల్డోను జావో ఫెలిక్స్ స్థానంలో సబ్స్టిట్యూట్గా మైదానంలోకి పంపించారు. ప్రపంచకప్ మ్యాచ్ల్లో రొనాల్డో రిజర్వ్ బెంచ్కు పరిమితమై మ్యాచ్ మధ్యలో సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
FIFA: మొరాకో సంచలనం.. స్పెయిన్కు షాక్! చెత్త రికార్డు.. టోర్నీ నుంచి అవుట్
FIFA World Cup 2022 Morocco Vs Spain- దోహా: ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో 2010 విజేత స్పెయిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంటిముఖం పట్టింది. ఆఫ్రికా ఖండానికి చెందిన ప్రపంచ 22వ ర్యాంకర్ మొరాకో జట్టు మొండి పట్టుదలతో ఆడి ఏడో ర్యాంకర్ స్పెయిన్ను ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫిఫా వరల్డ్కప్-2022లో భాగంగా ప్రిక్వార్టర్స్లో ఈ రెండు జట్లు నిర్ణీత సమయంలో... ఆ తర్వాత అదనపు సమయంలోనూ గోల్స్ చేయలేకపోయాయి. దాంతో ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో స్పెయిన్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. వరుసగా మూడు షాట్లను లక్ష్యానికి పంపించలేకపోయారు. షూటౌట్లో ఇలా సరాబియా తొలి షాట్ గోల్పోస్ట్ బార్కు తగిలి పక్కకు వెళ్లగా... సోలెర్ రెండో షాట్ను.. బుస్క్వెట్స్ మూడో షాట్ను మొరాకో గోల్కీపర్ యాసిన్ బోనో నేర్పుతో నిలువరించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. ప్రపంచకప్లో నాలుగుసార్లు పెనాల్టీ షూటౌట్లలో ఓడిన జట్టుగా స్పెయిన్ నిలిచింది. పోర్చుగల్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో ఈనెల 10న క్వార్టర్ ఫైనల్లో మొరాకో తలపడుతుంది. మొరాకో ఘనత ► ప్రపంచకప్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్ చేరిన నాలుగో ఆఫ్రికా దేశం మొరాకో. గతంలో కామెరూన్ (1990లో), సెనెగల్ (2002లో), ఘనా (2010లో) ఈ ఘనత సాధించాయి. చదవండి: Virender Sehwags son: క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: 1986 తర్వాత తొలిసారి నాకౌట్ దశకు మొరాకో.. గ్రూప్ టాపర్గా!
FIFA World Cup Qatar 2022: ఫిఫా వరల్డ్కప్-2022లో భాగంగా గ్రూప్ ‘ఎఫ్’లో ఆఫ్రికా ఖండానికి చెందిన మొరాకో జట్టు చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించింది. కెనడా జట్టును 2–1తో ఓడించి 1986 తర్వాత ప్రపంచగకప్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇక ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఏడు పాయింట్లు సాధించిన మొరాకో గ్రూప్ ‘ఎఫ్’ టాపర్గా నిలిచింది. కెనడాతో మ్యాచ్లో మొరాకో తరఫున హకీమ్ జియెచ్ (4వ ని.లో), యుసెఫ్ ఎన్ నెస్రి (23వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... 40వ నిమిషంలో మొరాకో డిఫెండర్ నాయెఫ్ సెల్ఫ్ గోల్తో కెనడా ఖాతాలో గోల్ చేరింది. మెక్సికోకు నిరాశ... గ్రూప్ ‘సి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో అర్జెంటీనా 2–0తో పోలాండ్పై... మెక్సికో 2–1తో సౌదీ అరేబియాపై గెలిచాయి. రెండో విజయంతో మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా ఆరు పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ (46వ ని.), అల్వరెజ్ (67వ ని.) గోల్ చేశారు. సౌదీ అరేబియాపై మెక్సికో జట్టు గెలిచినా ముందంజ వేయలేకపోయింది. మెక్సికో జట్టులో మార్టిన్ (47వ ని.లో), చావెజ్ (52వ ని.లో) గోల్ చేయగా, సౌదీ తరఫున సాలెమ్ (95+5వ ని. ఇంజ్యూరీ టైమ్) గోల్ చేసి ఓటమిలో ఓదార్పునిచ్చాడు. పోలాండ్, మెక్సికో నాలుగు పాయింట్లతో సమంగా నిలిచినా... గోల్స్ అంతరంతో పోలాండ్ నాకౌట్కు అర్హత సంపాదించింది. 1994 తర్వాత మెక్సికో గ్రూప్ దశలోనే అవుటైంది. చదవండి: BCCI Chief Selector:టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ స్పీడ్స్టర్..! Pak Vs Eng: పాక్కు దిమ్మతిరిగేలా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు! టీమిండియాను వెనక్కినెట్టి.. -
FIFA WC 2022: మొరాకో చేతిలో పరాభవం.. బెల్జియంలో చెలరేగిన అల్లర్లు
ఫిఫా ప్రపంచకప్లో మొరాకో జట్టు బెల్జియంపై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఖతర్లో అల్ థుమమ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో 2-0 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన బెల్జియంను మొరాకో మట్టికరిపించింది. ఈ విజయంతో మొరాకో గ్రూప్-ఎఫ్లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. బెల్జియం రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఈ మ్యాచ్ బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉద్రిక్తతలకు దారితీసింది. బ్రెజిల్ పరాజయాన్ని జీర్జించుకోలేని పలువురు ఫుట్బాల్ అభిమానులు మొరాకో జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించారు. కొందరు కర్రలతో దాడి చేస్తూ వాహనాలపై రాళ్లు రువ్వారు. కారుతో సహా పలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకోగా ఒకరిని అరెస్ట్ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. బెల్జియం రాజధాని అంతటా అనేక చోట్ల ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని, సాయంత్రం 7 గంటల వరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందని బెల్జియం పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పబ్లిక్ హైవేపై అల్లరి మూకలు పైరోటెక్నిక్ మెటీరియల్, కర్రలతో దాడి చేశారని, వాహనాలకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు. బాణా సంచా పేల్చడంతో ఓ జర్నలిస్టు ముఖానికి గాయమైనట్లు పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల తాము జోక్యం చేసుకొని జల ఫిరంగులను, టియర్ గ్యాస్ ఉపయోగించినట్లు తెలిపారు. చదవండి: Ju Ae: కిమ్ వారసురాలు ఆమే? వయసు కేవలం పదేళ్లు మాత్రమే! 🚨BREAKING NEWS🚨 Brussels, home of the EU parliament, ERUPTS in street riots as Moroccans 'celebrate' their victory over their now home country. Are we feeling enriched? pic.twitter.com/YI0h6nXSxt — UNN (@UnityNewsNet) November 27, 2022 Meanwhile, in Brussels, Moroccans celebrate their win over Belgium. The cultural enrichment is paying dividends, right? pic.twitter.com/yakNCjTSSN — David Vance (@DVATW) November 27, 2022 -
ఫిఫా వరల్డ్కప్-2022లో మరో సంచలనం.. బెల్జియంను ఖంగుతినిపించిన మొరాకో
ఫిఫా వరల్డ్కప్-2022లో భాగంగా భారతకాలమానం ప్రకారం ఇవాళ (నవంబర్ 27) సాయంత్రం 6:30 గంటలకు అల్ తుమామ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్లో ప్రపంచ 2వ ర్యాంకర్ బెల్జియం, 22వ ర్యాంకర్ మొరాకో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మొరాకో.. తమ కంటే మెరుగైన బెల్జియంను 2-0 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. రెండో అర్ధభాగం 75వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్ను అబ్దెల్ హమీద్ సాబిరి అద్భుతమైన గోల్గా మలిచి మొరాకోను ఆధిక్యంలో తీసుకెళ్లాడు. అనంతరం 90వ నిమిషంలో జకారియా అబౌక్లాల్ రెండో గోల్ చేసి మొరాకోకు చారిత్రక విజయాన్ని అందించాడు. 1998 తర్వాత ఫిఫా వరల్డ్కప్లో మొరాకో మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో గ్రూప్-ఎఫ్లో మొరాకో.. బెల్జియంను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. కాగా, నవంబర్ 23న క్రొయేషియాతో జరిగినను మ్యాచ్ను మొరాకో 0-0తో డ్రా చేసుకోగా.. 24న కెనడాపై బెల్జియం 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు అహ్మద్ అలీ బిన్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-ఈ మ్యాచ్లో ప్రపంచ 31 ర్యాంకర్ కోస్టారికా.. తమ కంటే పటిష్టమైన 24వ ర్యాంకర్ జపాన్కు షాకిచ్చింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో కోస్టారికా.. జపాన్ను 1-0 గోల్స్ తేడాతో ఓడించింది. రెండో అర్ధభాగం 81వ నిమిషంలో కీషర్ ఫుల్లర్ గోల్ కొట్టి కోస్టారికాను గెలిపించాడు. -
ఇదేనా ఆటతీరు.. మెరుపుల్లేవ్!
ఫిఫా వరల్డ్కప్లో భాగంగా బుధవారం గ్రూప్-ఎఫ్లో భాగంగా మొరాకో, క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్ పేలవ డ్రాగా ముగిసింది. 2018 ఫిఫా వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచిన క్రొయేషియా జట్టు ఈ మ్యాచ్లో పెద్దగా మెరవలేదు. క్రొయేషియా పలుసార్లు గోల్పోస్ట్పై దాడి చేసినప్పటికి మొరాకో డిఫెన్స్ పటిష్టంగా ఉండడంతో గోల్స్ కొట్టలేకపోయింది. తొలి హాఫ్ టైమ్లో ఇరుజట్లు గోల్స్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. ఇక రెండో హాఫ్ టైంలోనూ అదే పరిస్థితి. అదనపు సమయంలోనే ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో చెరొక పాయింట్ కేటాయించారు. ఇక తమ తర్వాతి మ్యాచ్లో క్రొయేషియా..కెనడాతో ఆడనుండగా; మొరాకో బెల్జియంతో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: మరొక మ్యాచ్ ఓడితే అంతే సంగతి.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ చాన్స్ ఎంత? Morocco and Croatia share the points. 🤝@adidasfootball | #FIFAWorldCup — FIFA World Cup (@FIFAWorldCup) November 23, 2022 -
FIFA Football WC 2022: బెల్జియంపై భారీ అంచనాలు.. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి..!
గత నాలుగు ప్రపంచకప్లలో యూరోప్ జట్లే విశ్వవిజేతగా నిలిచాయి. ఈసారీ యూరోప్ నుంచే మళ్లీ ప్రపంచ చాంపియన్ వచ్చే అవకాశాలున్నాయి. గత వరల్డ్కప్లో విశేషంగా రాణించి కీలకమైన సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన బెల్జియం మరోసారి టైటిల్ ఫేవరెట్గా ఖతర్లో అడుగు పెట్టింది. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడికి తడబడకుండా ఆడితే ఈసారి ఆ జట్టుకు గొప్ప ఫలితం లభిస్తుంది. –సాక్షి క్రీడా విభాగం బెల్జియం ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: మూడో స్థానం (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 2. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఇ’ విన్నర్. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లతో నిండిన బెల్జియం జట్టును కచ్చితంగా టైటిల్ ఫేవరెట్స్లో ఒక జట్టుగా పరిగణించాలి. 14వ సారి ప్రపంచకప్లో ఆడుతున్న బెల్జియం క్వాలిఫయింగ్ టోర్నీలో అజేయంగా నిలిచింది. ఆరు విజయాలు సాధించి, రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. సమకాలీన ఫుట్బాల్లో మేటి గోల్కీపర్గా పేరొందిన థిబాట్ కుర్టియస్, ఉత్తమ మిడ్ఫీల్డర్ కెవిన్ డి బ్రున్, స్టార్ ఫార్వర్డ్స్ లుకాకు, హెజార్డ్లతో బెల్జియం పటిష్టంగా కనిపిస్తోంది. తమ గ్రూప్లో క్రొయేషియాతో మ్యాచ్ మినహా మొరాకో, కెనడా జట్ల నుంచి బెల్జియంకు పెద్దగా ప్రతిఘటన ఉండకపోవచ్చు. మొరాకో ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (1986). ‘ఫిఫా’ ర్యాంక్: 22. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విన్నర్. ఆఫ్రికా క్వాలిఫయింగ్ టోర్నీలో అజేయంగా నిలిచిన మొరాకో ప్రపంచకప్ ప్రధాన టోర్నీలోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అయితే బెల్జియం, క్రొయేషియాలాంటి రెండు పటిష్ట జట్లను నిలువరించాలంటే మొరాకో అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. హకీమ్ జియచ్, హకీమీ కీలక ఆటగాళ్లు. కెనడా ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ (1986). ‘ఫిఫా’ ర్యాంక్: 41. అర్హత ఎలా: ఉత్తర, మధ్య అమెరికా కరీబియన్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విన్నర్. మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రపంచకప్కు అర్హత పొందిన కెనడా జట్టులో అల్ఫోన్సో డేవిస్, డేవిడ్ల రూపంలో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రెండోసారి ప్రపంచకప్లో ఆడుతున్న కెనడా 1986లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. గ్రూప్లో బెల్జియం, క్రొయేషియా లాంటి పటిష్ట జట్లు ఉండటంతో కెనడా ఈసారైనా పాయింట్ల ఖాతా తెరుస్తుందో లేదో వేచి చూడాలి. క్రొయేషియా ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: రన్నరప్ (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 12. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘హెచ్’ విన్నర్. నాలుగేళ్ల క్రితం సంచలన ప్రదర్శనతో క్రొయేషియా తొలిసారి ఫైనల్కు చేరింది. ఆ తర్వాత పలువురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ కావడంతో కొంత బలహీన పడ్డా యూరోపియన్ క్వాలిఫయింగ్లో పూర్తి ఆధిపత్యం చలాయించి తొలి అవకాశంలోనే ప్రపంచకప్ బెర్త్ సాధించింది. తాజా జట్టులో అనుభవంలేని యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో స్టార్ మిడ్ ఫీల్డర్లు లుకా మోడ్రిచ్, బ్రొజోవిచ్, కొవాచిచ్ల ఆటతీరుపైనే క్రొయేషియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన జట్టు తదుపరి వరల్డ్కప్లోనూ ఫైనల్కు చేరడం చివరిసారి 2002లో జరిగింది. 1998 ప్రపంచకప్ రన్నరప్ బ్రెజిల్ 2002లో ఫైనల్ చేరడంతోపాటు విజేతగా నిలిచింది. -
ఫిఫా అండర్-17 వరల్డ్ కప్.. లీగ్ దశలోనే భారత్ అవుట్
భువనేశ్వర్: ప్రపంచ అండర్–17 మహిళల ఫుట్బాల్ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే లీగ్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో 0–8తో ఓడిన భారత్... శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో 0–3తో మొరాకో చేతిలో పరాజయం పాలైంది. మొరాకో తరఫున దోహా ఎల్ మదానీ (51వ ని.లో), యాస్మీన్ జౌహర్ (62వ ని.లో), జెనా షరీఫ్ (90+1వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత్ ఈనెల 17న జరిగే నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్లో బ్రెజిల్తో ఆడుతుంది. బ్రెజిల్, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతం బ్రెజిల్, అమెరికా నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో... మూడు పాయింట్లతో మొరాకో రెండో స్థానంలో ఉంది. -
‘అమ్మా కాపాడు..’ అని అరుస్తూ ఆ పసిగుండె ఆగింది
ఐదేళ్ల పసిబాలుడు.. ఐదు రోజుల పాటు చీకటి ఊబిలాంటి బావిలో అల్లాడిపోయాడు. ఆకలి, ఆక్సిజన్ అందిస్తూ అభయం అందించినా.. భయంతో ‘అమ్మా.. పైకి లాగమ్మా’ అంటూ వేసిన కేకలు కోట్ల మందిని చలింపజేశాయి. నిర్విరామంగా కృషి చేసిన సహాయక సిబ్బంది.. ఆ చిన్నారిని చేరుకునేలోపే నష్టం జరిగిపోయింది. ఆ చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయింది. బోరుబావి విషాద ఘటన.. మొరాకోలో మాత్రమే కాదు ఆ మాటకొస్తే ఇంటర్నెట్ ప్రపంచం మొత్తానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. రయాన్ అవ్రామ్ వయసు ఐదేళ్లు. షెఫ్షావూలోని తన ఇంటి దగ్గర పోయిన మంగళవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 32 మీటర్ల లోతైన బోరుబావిలో పడిపోయాడు. పిల్లాడు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తప్పిపోయాడేమోనని అంతా వెతికారు. అయితే, సమీపంలోని బోరు బావి నుంచి కేకలు వినిపిస్తుండడంతో అప్రమత్తమైన స్థానికులు.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లైట్లు వేసి చూశారు. తనను పైకి లాగాలంటూ ఆ చిన్నారి ఆర్తనాదాలు చేశాడు. వెంటనే అధికారులకు సమాచారమివ్వగా వారొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల పాటు ఆపరేషన్ సాగింది. పిల్లాడికి గొట్టం ద్వారా తిండి, నీళ్లు, ఆక్సిజన్ పంపించారు. ఊపిరి ఆడక ఆ చిన్నారి ఆక్సిజన్ పైపు దగ్గరికి ముఖం పోనిచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం.. పలువురిని కంటతడి పెట్టించింది. నాన్స్టాప్ ఆపరేషన్ పిల్లాడిని బతికించేందుకు బోరుబావికి సమాంతరంగా అధికారులు సొరంగం తవ్వడానికి తీవ్రంగా శ్రమించారు. భారీ ఎత్తున జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్కు స్థానికులు సైతం సహకరించారు. వాళ్ల కోసం వంటవార్పు సిద్ధం చేసి.. సహాయక కార్యక్రమాలు ఆగిపోకుండా చూసుకున్నారు. మరోవైపు దేశం మొత్తం, ఇంటర్నెట్ నిండా ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనల పోస్టులు కనిపించాయి. ఐదురోజుల శ్రమ అనంతరం బాలుడు ఇరుకున్న చోటుకు చేరుకున్నారు. కానీ, అప్పటికే ఆ పిల్లాడి ఊపిరి ఆగిపోయింది. విగత జీవిగా మారిన తమ బిడ్డను చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మొరాకో వ్యాప్తంగా పాఠశాలల్లో నివాళిగా పిల్లలు ర్యాలీలు తీశారు. ఘటనపై గురించి తెలిసి మొరాకో రాజు మహ్మద్ సంతాపం తెలిపారు. Morocco moves a mountain to save a child 🇲🇦#SaveRayan 🇲🇦 humanity first ✊🏿✊🏿 pic.twitter.com/fp2jaSW8fL — Distinguished Senator (@Senatorisiaq) February 5, 2022 Minutes after the announcement of the death of the child #Rayan in Morocco, a young man from Palestine, Hamza Mansour, has a child and calls him #Rayan, in solidarity with the cause of the Moroccan child Rayan and in honor of his memory 💔🇲🇦🇵🇸 #Ryan pic.twitter.com/9m28efE78x — Simø Elyouzghi (@Mohamed365076) February 6, 2022 బా అంకుల్ కంటతడి పెట్టిన వేళ.. రయాన్ మరణవార్త తెలిసిన తర్వాత.. మొరాకో మొత్తం విషాదంలోకి కూరుకుపోయింది. చాలా చోట్ల ఆ చిన్నారికి నివాళులు అర్పించారు. పాలస్తీనాకు చెందిన ఓ తండ్రి.. అప్పుడే పుట్టిన తన బిడ్డను రయాన్ అని పేరు పెట్టడం విశేషం. బా అలీ.. మొరాకో మొత్తం బా అంకుల్ అని ముద్దుగా పిల్చుకుంటుంది. బోరు బావులను తవ్వడంలో నేర్పరి అయిన బా అలీ.. గతంలోనూ ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లు ఎన్నో నిర్వహించారు కూడా. వంద గంటలపాటు నాన్స్టాప్గా పని చేసిన బా అంకుల్.. చివరికి చిన్నారి రయాన్ ప్రాణాలతో లేడనే విషయం తెలిసి కన్నీళ్ల ప్రాయం అయ్యాడు. Rest In Peace to Rayan 👼🏻 So sad. Was praying he would make it out of the well safe, but God had other plans for this little boy 💔Praying for his family 🙏🏼 #Rayan pic.twitter.com/6ESpSoehFT — ENISA (@IAmENISA) February 5, 2022 All the love & respect to Ba (uncle) Ali who dug with his hand for more than 100 straight hours to help in Rayan's rescue operation. Ba Ali, a well-drilling expert who never cared about the looming risk & insisted on contributing his long experience to save the little #Rayan. 😞 pic.twitter.com/escoatEs8Z — Zouhir • ⵣⵓⵁⵉⵔ (@oskai_z) February 6, 2022 #Rayan may have not survived but they are still heroes. Along with parents of Ryan No one can estimate the immense pain of the rescue workers who worked 24x7 to save him May Allah grant them paradise also 🤲🏽 #Ryan#PrayforRayan #ريان_المغرب #الطفل_ريان pic.twitter.com/C4948V9mbN — Mubeen ❄️ (@MubeenFatma) February 5, 2022 -
ఎంత మోసం.. మాయరోగం నటించి విమానాన్ని దారి మళ్లించి..
పాల్మా(స్పెయిన్): మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ మనుషులు పరాయి దేశాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. కొందరు చట్టబద్ధంగా వెళ్తే.. ఆ అవకాశం లేని మరికొందరు అక్రమంగా మరో దేశంలోకి ప్రవేశిస్తుంటారు. పుట్టిన గడ్డపై బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి మరీ విదేశాలకు వలస వెళ్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఇదొక కొత్త రకం అక్రమ వలస. శుక్రవారం స్పెయిన్లో చోటుచేసుకుంది. ఎయిర్ అరేబియా విమానం మొరాకోలోని కాసాబ్లాంకా నుంచి టర్కీలోని ఇస్తాంబుల్కు బయలుదేరింది. ఇందులో చాలామంది మొరాకో దేశస్తులున్నారు. మార్గమధ్యంలో ఓ ప్రయాణికుడు తనకు అనారోగ్యమంటూ విలవిల్లాడాడు. దీంతో విమానాన్ని స్పెయిన్ దేశానికి చెందిన పాల్మా డి మాలోర్కా దీవిలో ఉన్న ఎయిర్పోర్టుకు మళ్లించారు. ఇది స్పెయిన్లో బిజీ ఎయిర్పోర్టు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బాధిత ప్రయాణికుడికి చికిత్స అందించేందుకు(మెడికల్ ఎమర్జెన్సీ) ఎయిర్ అరేబియా ఫ్లైట్ను మాలోర్కా ఎయిర్పోర్టులో దించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వెంట ఓ సహాయకుడు ఉన్నాడు. విమానంలో ఆగడంతో ఇదే అదనుగా భావించి దాదాపు 22 మంది కిందికి దిగి, పరుగులు ప్రారంభించారు. కొందరు ఎయిర్పోర్టు కంచెను దాటుకొని బయటకు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.12 మందిని పట్టుకున్నారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా విమానాశ్రయాన్ని శుక్రవారం 4 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. దాదాపు 60 విమానాలను దారి మళ్లించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రయాణికుడు అనారోగ్యం అంటూ విమానంలో నాటకం ఆడినట్లు తేలింది. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు. ప్రయాణికుడి వెంట వచ్చిన సహాయకుడు సైతం పరారయ్యాడు. ఇలాంటి సంఘటన తమ ఎయిర్పోర్టులో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెప్పారు. స్పెయిన్లోకి అక్రమంగా ప్రవేశించడానికే మొరాకో దేశస్తులు ఈ కుట్ర పన్నినట్లు గుర్తించారు. (చదవండి: టెక్సాస్ మ్యూజిక్ ఫెస్ట్లో తొక్కిసలాట) -
ఎర్రటి ఎండలో రయ్ రయ్మంటూ..
-
దారుణం: ప్రియుడిని చంపి ఆ భాగాలతో బిర్యానీ..
రబాత్: ఉత్తర ఆఫ్రికాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మరో యువతితో పెళ్లికి సిద్దమైన ప్రియుడిని హత్య చేసిన మహిళ అనంతరం అతడి ప్రైవేటు భాగాలను బిర్యాని వండిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంతేగాక ఆ బిర్యానినీ భవన నిర్మాణ కార్మికులకు పెట్టిన ఈ సంఘటన విని పోలీసులు సైతం విస్తుపోయారు. వివరాలు.. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోకు చెందిన 30 ఏళ్ల మహిళ ఏడేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో అతడు మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె అనుమానించింది. ఇదే విషయం ప్రియుడిని అడుగగా అతడు ఆ యువతిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆ మహిళ ప్రియుడితో గొడవపడింది. ఈ క్రమంలో అతడిని హత్య చేసింది. అయితే ఈ విషయం బయటరాకుండా ఉండేందుకు అతడి మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. దీంతో అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి అతడి ప్రైవేటు భాగాలు(పురుషాంగం, వృషణాలు)తో బిర్యానీ వండింది. దానిని పక్కనే భవన నిర్మాణం పనులు చేస్తున్న కూలీలకు వడ్డించింది. ఆ తర్వాత మిగిలిన శరీరా భాగాలను కుక్కలకు వేసింది. అయితే ఆ వ్యక్తి ఎంతకి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో మృతుడి కుటుంబ సభ్యులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఆచూకి కనిపించకపోవడంతో సదరు మహిళపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు మిక్సీలో దంతాలు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షించగా అవి మృతుడివే అని తేలడంతో పోలీసుల ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలు చెప్పిన విషయాలకు పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో సదరు మహిళపై కేసు నమోదు చేసి ఆమె మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చదవండి: సంబంధం పెట్టుకోవాలని కానిస్టేబుల్ వేధింపులు డబ్బు వివాదం: కుటుంబంతో కలిసి భర్త హత్య -
నీటిలోనూ రాక్షసబల్లులు
రాక్షసబల్లులు.. ఒకప్పుడు భూమిపై వీటిదే రాజ్యం.. భూమిపై ఓకే.. మరి నీటిలోనో.. అక్కడ కూడా వీటిదే రాజ్యమని తాజాగా తేలింది.. చిత్రంలో చూస్తున్నారుగా.. నీట్లో ఉండే జీవులను ఎలా కరకరలాడిస్తోందో.. దీని పేరు స్పైనొసొరస్ ఈజిప్టాయకస్. చిన్నప్పుడు ఎంతుంటాయో తెలియదు గానీ.. పెద్దయ్యాక మాత్రం 50 అడుగుల పొడవుండి.. 20 వేల కిలోల బరువుంటాయట. పళ్ల సైజు ఆరంగుళాలు. ఈ మధ్యే దీని తోకకు సంబంధించిన శిలాజం మొరాకోలోని ఎడారి ప్రాంతంలో దొరికాయి.. శాస్త్రవేత్తలు దీని తోకను పట్టుకుని.. చరిత్రను తవ్వితే.. మొత్తం విషయం బయటపడింది. నదుల్లో ఎక్కువగా ఉండేవని.. తమ జీవితకాలంలో అత్యధిక భాగం నీటిలోనే గడిపేవని చెబుతున్నారు. నీటిలోనూ రాక్షస బల్లులు ఉండేవనడానికి స్పష్టమైన ఆధారం దొరకడం ఇదే తొలిసారట. -
పరదేశంలోకి చొరబడదామనుకున్నరు కటకటాలపాలయ్యారు
-
పరాయిదేశం కాదు.. పైకే పోతారు..!
మెలీలియా : అక్రమంగా పరదేశంలోకి చొరబడదామనుకున్న కొందరు ఆఫ్రికన్లు ప్రాణాలను పణంగా పెట్టారు. పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు కారు, లారీ యాక్సిల్ పట్టుకుని ప్రయాణం సాగించారు. చివరికి స్పెయిన్ బోర్డర్ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మొరాకో.. మెలీలియా సరిహద్దుల్లో శనివారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకో నుంచి దానిని ఆనుకుని ఉన్న స్పెయిన్ అధీనంలోని మెలీలియా నగరంలోకి చొరబడేందుకు నలుగురు వ్యక్తులు.. కారు ఇంజన్లో, లారీ యాక్సిల్ పట్టుకుని ప్రయాణం చేశారు. మెలీలియా సరిహద్దుల్లో స్పెయిన్ బోర్డర్ ప్రొటెక్షన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి పట్టుబడిన నలుగురితో పాటు వారికి సాయం చేసిన వాహన డ్రైవర్లను కూడా అరెస్టు చేశారు. అయితే, ప్రయాణం సందర్భంగా అస్వస్థతకు గురైన ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు. ‘నలుగురు వ్యక్తులు వేర్వేరు వాహనాల్లో దొంగచాటుగా మా నగరంలోకి చొరబడేందుకు యత్నించగా పట్టుకున్నాం. వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు. వాహనాల ఇంజన్ల నుంచి వెలువడే కాలుష్యకారక పొగతో వారు మరణించే అవకాశాలున్నాయి. వారంతా కోనాక్రీ, గినియా దేశస్తులుగా అనుమానిస్తున్నాం. అక్రమ వలసదారులకు మొరాకో సరిహద్దులు అడ్డాగా మారిపోయాయి. మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై తదుపరి విచారణ చేపడతాం’ అని సరిహద్దు పోలీస్ అధికారొకరు తెలిపారు. పట్టుబడిన వారిలో ముగ్గురు 20-22 ఏళ్ల వయసున్న పురుషులు కాగా ఒక 15 ఏళ్ల యువతి కూడా ఉండటం విచారకరం. -
మొరాకో పౌరుషం
కలినిన్గ్రాడ్: మొరాకో దెబ్బకు ఉక్కిరిబిక్కిరై, ఓ దశలో వెనుకబడి, ఓటమి దిశగా వెళ్లినప్పటికీ మాజీ చాంపియన్ స్పెయిన్ నిలదొక్కుకుంది. సోమవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్ను అతి కష్టమ్మీద 2–2తో ‘డ్రా’ చేసుకున్న ఆ జట్టు గ్రూప్ ‘బి’ టాపర్గా నాకౌట్ చేరింది. ఫలితం ఎలా ఉన్నా మ్యాచ్ రెండు భాగాల్లోనూ ముందుగా గోల్ కొట్టి మొరాకోనే మొనగాడుగా నిలిచింది. పదేపదే దాడులు ఎదుర్కొన్నా, బంతిపై ఆధిక్యం దక్కకున్నా, పాస్లు అందుకోవడంలో విఫలమైనా, విపరీతంగా ఫౌల్స్ చేసినా, ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు ఎల్లో కార్డ్లకు గురైనా... ఆ జట్టు స్పెయిన్కు షాకిచ్చేలా కనిపించింది. అయితే, ఇంజ్యూరీ సమయంలో ఇయాగో అస్పాస్ (90+1వ ని.లో) గోల్ కొట్టి స్పెయిన్ను ఒడ్డున పడేశాడు. అంతకుముందు మొరాకో తరఫున ఖలిద్ బౌతైబ్ (14వ నిమిషం), ఎన్ నెసిరి (81వ ని.), స్పెయిన్ నుంచి ఇస్కో (19వ ని.) గోల్స్ చేశారు. ఆటలో అంతరం... ఫలితం సమం తమ స్థాయికి తగినట్లు మ్యాచ్ను స్పెయిన్ దూకుడుగా ప్రారంభించింది. మొరాకో ఇబ్బంది పడకుండానే ఆడింది. 14వ నిమిషంలో ప్రత్యర్థి డిఫెన్స్లోని ఆండ్రెస్ ఇనెస్టాను తప్పిస్తూ బంతిని ముందుకు తీసుకెళ్లిన బౌతైబ్... కీపర్ డేవిడ్ డి గీని బోల్తా కొట్టించి ఎడమకాలితో గోల్ పోస్ట్లోకి పంపాడు. అయితే, ఐదు నిమిషాల్లోనే స్పెయిన్ స్కోరు సమం చేసింది. ఇనెస్టా చురుకైన కదలికలతో అందించిన బంతిని ఇస్కో గోల్గా మలిచాడు. రెండు జట్లకు తర్వాత కూడా అవకాశాలు వచ్చినా సద్వినియోగం కాకపోవడంతో మొదటి భాగం 1–1తోనే ముగిసింది. రెండో భాగం ప్రారంభం నుంచే మొరాకో ఆటలో తీవ్రత పెంచింది. వీలైనంతగా ప్రత్యర్థి డిఫెండర్లను ఇబ్బందిపెట్టింది. స్ట్రయికర్ల దూకుడుతో స్పెయిన్ కూడా తగ్గలేదు. ఈ క్రమంలో ఇరుజట్లకు వరుసగా హెడర్ గోల్ అవకాశాలు వచ్చాయి. 70వ నిమిషంలో పికె కొట్టిన ఓ హెడర్ గోల్పోస్ట్కు కొద్ది దూరం నుంచి వెళ్లింది. కొద్దిసేపటికే అప్రయత్నంగా పికె చేతికి తగిలిన బంతి బయటకు వెళ్లింది. దీంతో మొరాకోకు కార్నర్ కిక్ లభించింది. దీనిని ఎన్ నెసిరి... హెడర్ ద్వారా స్కోరు చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. నిర్ణీత సమయం ముగిసే క్రమంలో స్పెయిన్ పరాజయం ముంగిట నిలిచింది. కానీ, ఇంజ్యూరీ (90+1)లో డ్రామా నడిచింది. డి బాక్స్ లోపల కుడి వైపు నుంచి అందిన పాస్ను... అస్పాస్ క్షణాల వ్యవధిలో గోల్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు. సరిగ్గా మొరాకో గోల్పోస్ట్ ఎదుట ఉన్న అతడు కీపర్ తేరుకునేలోపే బంతిని గోల్పోస్ట్లోకి పంపాడు. ఇది ఆఫ్సైడ్ అంటూ అభ్యంతరాలు రావడతో వీఏఆర్ సాయం తీసుకున్నారు. అందులో స్పష్టమైన గోల్గా తేలింది. మిగతా రెండు నిమిషాల ఇంజ్యూరీ సమయమూ స్కోరేమీ లేకుండానే ముగిసింది. స్పెయిన్ డ్రాతో బయటపడింది. మొరాకో ఆటగాళ్లు ఆరుగురు ఎల్లో కార్డుకు గురయ్యారు. గ్రూప్ ‘బి’లో ఒక గెలుపు, రెండు డ్రాలతో స్పెయిన్, పోర్చుగల్ ఐదు పాయింట్లు పొంది పట్టికలో సమంగా నిలిచాయి. అయితే చేసిన గోల్స్ ( 6) ఆధారంగా స్పెయిన్కు అగ్రస్థానం లభించింది. పోర్చుగల్కు (5 గోల్స్) రెండో స్థానం దక్కింది. నాకౌట్ మ్యాచ్ల్లో ఈనెల 30న ఉరుగ్వేతో పోర్చుగల్; జూలై 1న రష్యాతో స్పెయిన్ తలపడతాయి. -
ఫిఫా వరల్డ్కప్: మళ్లీ అదే నిజమైంది
సెయింట్ పీటర్స్బర్గ్: ఫిఫా వరల్డ్కప్ మ్యాచ్ ఫలితాలపై అంచనా వేస్తున్న చెవిటి పిల్లి అచిల్లీస్ జోస్యం నిజమైంది. టోర్నీ ఆరంభపు మ్యాచ్లో రష్యా గెలుస్తుందని అంచనా వేసిన అచిల్లీస్.. శుక్రవారం రాత్రి మొరాకోపై ఇరాన్ జట్టు గెలుస్తుందని అంచనా వేసింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ 90 నిమిషాల్లో ఒక గోల్ కూడా నమోదు కాకపోవడంతో.. అదనంగా మరో ఆరు నిమిషాలు కేటాయించారు. అయినప్పటికీ.. తొలి నాలుగు నిమిషాల్లో గోల్ నమోదవలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. కానీ.. 95వ నిమిషంలో మొరాకో సెల్ఫ్ గోల్తో ఇరాన్ని గెలిపించింది. ఈ మ్యాచ్కి ముందు ఇరాన్, మొరాకో జెండాల పక్కన బౌల్స్తో ఆహారాన్ని ఉంచగా.. అచిల్లీస్ ఇరాన్ జెండా పక్కన ఉన్న ఆహారాన్ని ఆరగించింది. మ్యాచ్ 95వ నిమిషంలో ఇషాన్ హాజి కొట్టిన ఫ్రీకిక్ను.. సబ్స్టిట్యూట్ ఆటగాడు అజీజ్ తలతో బంతిని గోల్పోస్ట్ అవతలకి నెట్టబోయాడు. కానీ.. బంతి అనూహ్యంగా మొరాకో గోల్పోస్ట్లోకే వెళ్లిపోయింది. దీంతో.. ఇరాన్ ఆటగాళ్లు సంబరాలతో మైదానాన్ని హోరెత్తించారు. గత 20 ఏళ్లలో ప్రపంచకప్ మ్యాచ్లో గెలవడం ఇరాన్కి ఇదే తొలిసారి. -
ఇరాన్కు మొరాకో ‘కానుక’
సెయింట్ పీటర్స్బర్గ్: పాపం... మొరాకో! ఇరాన్తో గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్ను చక్కగా మొదలు పెట్టింది. పాస్లు, దాడులతో ప్రత్యర్థిని ఆసాంతం ఇరుకునపెట్టింది. 19వ, 30వ నిమిషాల్లో గోల్ కొట్టినంత పని చేసింది. అనేక అవకాశాలు సృష్టించుకుంది. రెండు భాగాల్లోనూ 60 శాతం పైగా ఆధిపత్యం కనబర్చింది. కానీ, ఏం లాభం..? 77వ నిమిషంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన అజీజ్ బుహాదూజ్... ఇంజూరీ సమయంలో చేసిన ‘సెల్ఫ్ గోల్’ ఆ జట్టు కొంపముంచింది. ఆపసోపాలు పడుతూ లేస్తూ, పట్టు చిక్కక ఏమాత్రం ఆశావహంగా కనిపించని ఇరాన్కు ఊహించని కానుక ఇచ్చింది. 90+5 నిమిషంలో వంపులు తిరుగుతూ ఎడమవైపు నుంచి వచ్చిన క్రాస్ఫ్రీ కిక్ను తప్పించే యత్నంలో స్ట్రయికర్ అజీజ్ బుహాదూజ్ తమ గోల్ పోస్ట్లోకే కొట్టుకున్నాడు. ఈ అనూహ్య పరిణామంతో మొరాకో గోల్ కీపర్ మోనిర్ ఎల్ కజోయ్ నిస్సహాయంగా మిగిలిపోగా... తాము చేయని గోల్తో విజయం దక్కిన ఇరాన్ ఆటగాళ్లు ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయారు. ప్రపంచకప్లో 13 మ్యాచ్లాడిన ఇరాన్కు ఇది కేవలం రెండో గెలుపు మాత్రమే కావడం గమనార్హం. 2010 తర్వాత ఓ ఆసియా జట్టు విజయం సాధించడమూ ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్కు ముందు ఇరాన్కు లభించిన ఏకైక విజయం 1998 వరల్డ్ కప్లో అమెరికాపై 2–1తో దక్కింది. ► 42 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన సెల్ఫ్గోల్స్ సంఖ్య -
బస్సులో బట్టలు చించి.. లైంగిక వేధింపులు
లండన్: చట్టాలు కఠినంగా ఉండే ఇస్లాం దేశాల్లోనూ మహిళలపైనా లైంగిక వేధింపుల పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మొరాకోలోని కాసాబ్లాంకా పట్టణంలో ఓ బస్సులో యువతిని దారుణంగా వేధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో నలుగురు కుర్రాళ్లు నవ్వుతూ, ఆమె టాప్, జీన్స్ బట్టలు చించుతూ, అరబిక్ భాషలో బండ బూతులు తిట్టడం, ఆమె నోటికి టేప్ వేసి హింసించటం.. యువతి కన్నీళ్ల పర్యంతం కావటం ఉంది. అయితే అంత జరుగుతున్నా ఆమెకు సాయం చేసేందుకు తోటి ప్రయాణికులెవరూ ముందుకు రాకపోవటం గమనార్హం. ఆదివారం నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే యువతిపై అత్యాచారం జరిగిందంటూ విమర్శలు వినిపించటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 15 నుంచి 17 ఏళ్ల వయసున్న ఆరుగురు బాలురు ఈ వెకిలి చేష్టకు పాల్పడ్డారని రుజువు కావటంతో వారిని అరెస్ట్ చేశారు. ఇక ఘటనపై పలువురు భిన్నంగా స్పందించారు. మరికొందరు యువతి డ్రెస్సింగ్ సరిగ్గా లేదని, ఆమె రెచ్చగొట్టడం మూలంగానే వాళ్లు అలా చేసి ఉంటారని కామెంట్లు చేశారు. మరికొందరు మహిళల శరీరాన్ని గౌరవించండి అంటూ చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం జీన్స్ వేసుకుందన్న కారణంతో మొరాకో వీధుల్లోనే ఓ యువతిని కొందరు ఫాలో అయి వేధించిన వీడియో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. -
సాహసాలు చేస్తున్న స్టార్ హీరోయిన్
ఉత్తరాది భామలు ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అంటున్నారు. లాంగ్ లెగ్స్ బ్యూటీ కత్రినా కైఫ్ షూటింగ్ లకు గ్యాప్ రావటంతో మొరాకోలో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా జగ్గా జాసూస్ సినిమాతో నటిగానూ మంచి మార్కులు సాధించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే జగ్గా జాసూస్ సినిమా షూటింగ్ తో పాటు ప్రమోషన్ కోసం హాలీడేస్ కి దూరంగా ఉన్న ఈ భామ అన్ని పనులు ముగించుకొని మొరాకో టూర్ కు వెళ్లింది. అక్కడ అందమైన ప్రదేశాలని చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తుంది. కత్రినా తాజాగా ఓ సర్ఫింగ్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. అలలపై సర్ఫింగ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది క్యాట్. సర్ఫింగ్ ఎక్స్పర్ట్ సమక్షంలోనే క్యాట్ ఈ రిస్క్ చేసిందట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైల్ అవుతోంది.ఈ టూర్ ముగింసిన తరువాత సల్మాన్ ఖాన్ తో కలిసి 'ఏక్ థా టైగర్౮ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న 'టైగర్ జిందా హై' సినిమా చేయనుంది. First time surfing in Essaouira 🏄🏻♀️ A post shared by Katrina Kaif (@katrinakaif) on Jul 21, 2017 at 8:58am PDT -
అంబులెన్స్లోకి ఎక్కించాక కూడా సిగరెట్..
-
అంబులెన్స్లోకి ఎక్కించాక కూడా సిగరెట్..
రబత్: తప్పు చేయాలంటేనే ప్రతి ఒక్కరూ భయపడుతుంటారు. ఒక వేళ చేస్తున్నా అది బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. అయితే అది ఎప్పటికో బయటపడుతుందిగానీ ఆ సమయానికి తీవ్రత తక్కువగా ఉంటుంది. కానీ, తాను తప్పు చేస్తున్నాను చూడండహో అంటూ ఓ 20 ఏళ్ల యువకుడు ఏకంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఫుల్లుగా మధ్యం సేవిస్తూ ఫెరారీ కారును డ్రైవింగ్ చేస్తూ ఆ వీడియోలను నేరుగా ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేశాడు. అలా అతడు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలోనే మరో కారు ఢీకొట్టి అప్పుడు కూడా ఏ మాత్రం భయపడకుండా పోలీసులు వచ్చిన లక్ష్యపెట్టకుండా వారి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా అతడు మాత్రం అదే తీరుతో వ్యవహరించాడు. తానొక తప్పు చేశానని, మరో కారును ఢీకొట్టాననే విషయం కూడా ఆదమరిచి పోలీసుల ముందే ఫుల్లుగా తాగుతూ వీడియోలు తీసుకుంటూ కనిపించాడు. ఖండించాల్సిన మరో విషయం ఏమిటంటే అతడిని అంబులెన్స్లోకి ఎక్కించాక కూడా సిగరెట్ తాగుతూ దానిని కూడా వీడియో తీసి పెట్టాడు. మొరాకోలోని రాబత్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత నెలలో పోలీసులు అరెస్టు చేయగా అతడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. అయితే, ఆ యువకుడు స్థానికంగా ఉండే ఓ బడా వ్యాపారి మేనళ్లుడంట. అతడికి రూ.1.4లక్షల ఫైన్ కూడా విధించారు. అయితే, ప్రస్తుతం అతడికి జైలులో కూడా సకల సౌకర్యాలు ఇస్తూ ప్రత్యేకంగా పరిగణిస్తున్నారంట. అదేదో సినిమాలో అన్నట్లు పేదోడు తాగితే తాగుబోతని, ధనవంతులు తాగితే పార్టీ చేసుకున్నారని అన్నట్లు సమాజానికి హానీ చేసే ఈ ధనవంతుల కుటుంబానికి చెందిన యువకుడికి ఏ పేరు పెట్టి పిలవాలో మరి. -
మొరాకోలో బుర్ఖాపై నిషేధం !
రబాట్: భద్రతా కారణాల రీత్యా ఆఫ్రికా దేశం మొరాకోలో బుర్ఖాల తయారీ, అమ్మకాలను నిషేధించినట్లు మీడియాలో మంగళవారం వార్తలొచ్చాయి. ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకున్నా ఈమేరకు హోంమంత్రిత్వ ఆదేశాలు ఈ వారంలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ‘అన్ని పట్టణాలు, నగరాల్లో బుర్ఖాల అమ్మకం, తయారీ, ఎగుమతి, దిగుమతులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఓ అధికారిని ఉటంకిస్తూ లీ360 అనే వార్తా వెబ్సైట్ పేర్కొంది. బందిపోట్లు బుర్ఖాలు ధరించి నేరాలకు పాల్పడుతుండటం వల్లే ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. -
అసహజ శృంగారం.. ఇద్దరమ్మాయిల అరెస్ట్
మర్రాకెచ్: మొరాకోలో ఇద్దరు బాలికలను స్వలింగ సంపర్కం నేరం కింద అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరికీ మూడేళ్లు జైలు శిక్ష విధించే అవకాశముంది. వీరిద్దరినీ గతవారం మర్రాకెచ్ లో అరెస్ట్ చేశారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకుని, కౌగిలించుకున్నారన్న కారణంతో 16, 17 ఏళ్ల వయసున్న బాలికలను అదుపులోకి తీసుకున్నారని 'సీఎన్ఎన్' తెలిపింది. తర్వాత వీరిని బెయిల్ పై విడుదల చేశారు. మొరాకో చట్టం 489 సెక్షన్ ప్రకారం వీరిపై నేటి నుంచి కోర్టులో విచారణ జరగనుంది. 489 సెక్షన్ ప్రకారం... స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తారు. స్వలింగ సంపర్కులు అసభ్యంగా, అసహజంగా ప్రవర్తిస్తే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. కాగా, బాలికల తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించినట్టు మొరాకో మానవ హక్కుల సంఘం ప్రతినిధి ఒమర్ అర్బీబ్ తెలిపారు. 489 సెక్షన్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు సరికాదని పేర్కొన్నారు. బాలికలకు మద్దతుగా ఆల్టర్నేటివ్ మూవ్ మెంట్ ఫర్ ఇండివిడ్యువల్ లిబర్టీస్(ఎంఏఎల్ఐ) ఒక ఫొటోను ప్రచురించింది. 'మేము భిన్న లింగ సంపర్కులం. ఎల్జీబీటీ హక్కులకు మద్దతు ఇస్తా' మంటూ ఇద్దరు మహిళలతో ఉన్న ఫొటో పెట్టింది. -
వెబ్క్యామ్లో అందం ఎరవేసి..
'ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ అమ్మాయి ఫేస్ బుక్ రిక్వెస్ట్ పంపింది. ఎవరో తెలియని వాళ్లు అని నేను అనుకోలేదు. ఎందుకంటే నాతో చదివిన ఎక్కువగా పరిచయంలేని నా పాత స్కూల్ స్నేహితులు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు పంపుతుంటారు. దీంతో వెంటనే రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేశా. మరుసటి రోజు అదే అకౌంట్ నుంచి హాయ్ హౌ ఆర్ యూ, మీ ఫ్రొఫైల్ చూసి రిక్వెస్ట్ పంపా అంటూ మెసేజ్ వచ్చింది. ఫ్రొఫైల్ చెక్ చేశా. నిజంగా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అదే రోజు రాత్రి స్కైప్ ద్వారా చాట్ చేసింది. తనకు 23 ఏళ్లని, తల్లిదండ్రులు మరణించారని, లెబనాన్లోని సెడాన్లో తన సోదరి ఇంట్లో ఉంటున్నానని, ప్రస్తుతం చదువు, పని లేకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉండాల్సి రావడంతో బోరుకొడుతోందని చెప్పింది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ.. తనకు శృంగారమంటే అమితమైన ఆసక్తి అని, అయితే తన సోదరి బయటకు వెళ్లనివ్వదని చెప్పింది. ఎదో తెలియని క్యూరియాసిటీ నాలో మొదలైంది. కానీ, ఎక్కడో ఎదో చిన్న సందేహం. తెలియని అమ్మాయితో అలా మాట్లాడటం..! అయినాసరే ఆమెకు దగ్గరవుతూనేఉన్నా. ఒకరోజు నా దగ్గర వెబ్ కామ్ ఉందా అని ఆ అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయి కూడా వెబ్ కామ్ ఆన్ చేసింది. అంతే కళ్లు చెదిరే తన అందాన్ని చూసి ముగ్దుడినైపోయా. మేము మాట్లాడుకోకుండానే, కేవలం టైపింగ్ చేస్తూనే చాట్ చేశాము. తన సోదరి ఇంట్లోనే ఉందని, మాట్లాడితే తనకు తెలిసిపోతుందని ఆ అమ్మాయి చెప్పింది. ఇంకోరోజు.. 'నువ్వు ఏం చేస్తావ్?' అని అడిగింది. వెంటనే మిలాన్లో మార్కెటింగ్ చేస్తానంటూ బదులిచ్చా. 'అయితే మీరు కచ్చితంగా కోటీశ్వరుడై ఉంటారే' అంది. అవునన్నాను. తన సోదరి వస్తుందంటూ డ్రెస్ వెసుకొని సైన్ ఆఫ్ అయ్యింది. ఒక అరగంట తరువాత నా ఫేస్ బుక్ అకౌంట్కు ఓ మెసేజ్ వచ్చింది. 'చూడు, నేను ఓ మగాణ్ని. అవతల నువ్వేం చేశావో వెబ్ క్యామ్ ద్వారా మొత్తం రికార్డు చేశా' అంటూ ఆ వీడియోను నాకు పంపాడు. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోను చూసి షాక్కు గురై ఒక్కసారిగా కుంగిపోయా. 'నీ ఫెస్ బుక్ అకౌంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితుల జాబితా మొత్తం నా దగ్గర సిద్ధంగా ఉంది. మీ తల్లి, సోదరులు, కజిన్స్ అందిరివి ఉన్నాయి. నీకు వారం రోజులు గుడువు ఇస్తా, ఇలోగా నాకు 5000యూరోలు పంపించు లేదా వీడియోను అందరికి పంపిస్తా'అని మెసేజ్ పంపాడు. దిమ్మతిరిగినంత పనైందినాకు. వెంటనే స్కైప్ లిస్ట్ నుంచి ఆ కాంటాక్ట్ను డిలీట్ చేశా. దీంతో వాట్సప్లో మెసేజ్లు వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక అతన్ని బతిమిలాడటం ప్రారంభించా. 5000ల యూరోలు కట్టే అంత స్తోమత నాకు లేదన్నా. దానికి అతను ' నువ్వు కచ్చింతంగా ఇవ్వగలుగుతావు, యూరప్లో మంచి ఉద్యోగం చేస్తున్నావు కదా' అన్నాడు. లేదు అమ్మాయి అనుకొని ఇంప్రెస్ చేయడాకి అబద్ధం చెప్పాను. నేను కేవలం పిజ్జా డెలివరీ బోయ్ అని చెప్పా. బాత్ రూంకి నేనే టైల్స్ వేస్తూ దిగిన ఓ ఫోటో పరిచయం చేసుకుంటున్న సందర్భంగా ఆమెకు పంపిన విషయం గుర్తొచ్చి, దాని గురించి వివరించా. నిజంగానే నేను డబ్బు ఉన్నోడినైతే ఆ పని నేనే ఎందుకు చేస్తా అంటూ కొంత మేర ఆ వ్యక్తిని కన్విన్స్ చేయగలిగా. 'అదీ నిజమే కానీ, నాకు అదంతా అవసరం లేదు. నీకు ఒక వారం గడువు ఇస్తున్న 2000 యూరోలు అరెంజ్ చేయి. లేదా నీ కుటుంబ సభ్యులకు వీడియో పంపిస్తా' అన్నాడు. ఇప్పుడు నాముందు రెండే దారులున్నాయి. ఒకటి అతడు అడిగినంత డబ్బు ఇస్తూనే ఉండాలి, పైగా గ్యారంటీ ఏమీ లేదు. రెండు.. అతని డీల్ను రిజక్ట్ చేసి ఆ వీడియో ఎవరూ చూడరని కామ్గా ఉండటం. నేను రెండోదే ఎంచుకున్నా... ఆ రోజు రానే వచ్చింది....వీడియోను యూట్యూబ్లో అప్ లోడ్ చేస్తున్నాఅంటూ మెసెజ్ వచ్చింది. మరో సందేహం లేకుండా అప్ లోడ్ చేసుకో అంటూ బదులిచ్చా. నా ఫేస్ బుక్ వాల్ పైన నా పర్మిషన్ లేకుండా వేరే వాళ్లు పోస్టు చేయకుండా వెంటనే ప్రైవసీ సెట్టింగ్ మార్చా. యూట్యూబ్లో ఆ వీడియోను చూశా. సెక్సువల్ కంటెంట్ ఉందంటూ వీడియోను రిపోర్టు చేయడం ప్రారంభించా. వీడియోను నిలిపివేయండి అంటూ ఎన్నో సార్లు రిపోర్టు చేశా. డబ్బు పంపకపోతే వీడియో లింక్ను నా బంధువులకు పంపిస్తానంటూ అతను మరో మెసెజ్ పెట్టాడు. సరే అలాగే చేయ్ అంటూ మెసేజ్ పెట్టా. యూట్యూబ్లోని వీడియోను రిపోర్టు చేస్తూనే ఉన్నా, వీడియోను చూస్తున్న ప్రతిసారి ఎంత మంది దాన్ని చూశారో పరిశీలిస్తూనే ఉన్నా. సరిగ్గా ఓ గంట తర్వాత ఆ వీడియోను యూట్యూబ్ తొలగించింది. వీడియోను అప్లోడ్ చేసినప్పటినుంచి ఎంతమంది చూసారో తెలిపే వ్యూస్లో అన్ని నేను చూసినవే ఉన్నాయి. ఒక్క వ్యూ తప్ప. అది వీడియోను అప్ లోడ్ చేసిన తర్వాత ఆ వ్వక్తే చూసి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒక వేళ నా తల్లి, సోదరి, బందువులు ఆ వీడియోను చూస్తే ఎలా ఉండేది. సిగ్గుతో చచ్చిపోవాలని అనుకునే వాడినేమో. ఆ వీడియో యూట్యూబ్ నుంచి తీసివేసిన తర్వాత తిరిగి ఆ వ్యక్తినుంచి నాకు ఎలాంటి మెసేజ్లు రాలేదు. డబ్బు కోసం నాలాంటి పేదోళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అతన్ని అడిగిన ప్రశ్నకు..నేను గల్ఫ్లో ఉన్న కోటీశ్వరులని కూడా లక్ష్యంగా చేసుకొనే పని చేస్తామంటూ బదులిచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. నేను చాలా అదృష్టవంతున్ని అతను నన్ను నిజంగానే పేదవాడని నమ్మి, మళ్లీ నన్ను ఇబ్బందిపెట్టలేదు. కానీ, యూట్యూబ్లో మళ్లీ ఏమైనా అప్లోడ్ చేశాడేమే అని ప్రతి సారి చెక్ చేసుకోవడం మాత్రం అలవాటుగా మారింది' అని విదేశాల్లో ఉంటున్న పాలస్తీనా యువకుడు తాను ఆన్లైన్ స్కామ్లో ఇరుక్కున్న వైనాన్ని ప్రఖ్యాత బీబీసీ వార్తా సంస్థకు వివరించాడు. ఇప్పుడీ కథనం ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది. రిపోర్టర్: 23 ఏళ్ల లెబనాన్ అమ్మాయిగా సమీర్ను నమ్మించింది మోసం చేసింది మోరాకోలోని ఒడ్ జెమ్ టౌన్కు చెందిన యువకుడు. అది సెక్సార్షన్ ఇండస్ట్రీకి రాజధానిలాంటి ప్రాంతం. ఒడ్ జెమ్ స్కామర్లు ఫేస్ బుక్ పేజీల్లో ఇలాగే ఎంతో మందికి వల వేస్తూ ఉంటారు. ఎవరైనా అబ్బాయి చిక్కితే పోర్న్ సైట్ నుంచి అమ్మాయిలకు సంబంధించి డౌన్ లోడ్ చేసుకున్న వీడియోను ప్లే చేసి అమ్మాయిలా నమ్మించి బుట్టలోకి దింపుతారు. రోజుకు కనీస 500 డాలర్లు సంపాదిస్తారని స్కామ్లో ఆరితేరిన ఓ వ్యక్తి తెలిపాడు. వందలాది ఒడ్ జెమ్ యువకులు ఇలాంటి స్కామ్లో ఆరితేరారని తెలిపాడు. వేరే ఇతర జీవనాధారం లేని ఈ ప్రాంతంలో 50 అంతర్జాతీయ మనీ ట్రాన్సఫర్ ఆఫీసులు ఉన్నాయంటేనే ఈ స్కామ్ ఎంతగా వారికి డబ్బు సంపాదించి పెడుతుందో అర్థం అవుతుంది. ఇక్కడి వీధుల్లో జర్మన్ కార్లు, జపాన్ మోటారు బైకులతో కలకలలాడుతున్నాయి. యూకే, యూఎస్, యువ అరబ్ యువకులే లక్ష్యంగా ఎక్కువగా ఈ దందా కొనసాగుతోంది. ప్రపంచంలో ఈ తరహా జరుగుతున్న స్కాముల్లో మూడో వంతు ఈ ప్రాంతాల్లోంచే జరుగుతుండటం కొసమెరుపు. -
పోరాటమే ఊపిరిగా..!
ఒకటో శతాబ్దం నాటి కాలం అది. గౌతమీ పుత్ర శాతకర్ణి తన శత్రు దేశపు రాజుతో విజయమో... వీరస్వర్గమో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఎంతో మంది సైనికులు యుద్ధభూమిలో తమ ప్రాణాలను ఒడ్డి పోరాడుతున్నారు. మరి విజయం ఎవరిది...? ఆ సంగతి పక్కన పెడితే... ఈ పోరాట దృశ్యాలను ‘గౌతమీ పుత్ర శాతకరి’్ణ టీమ్ చిత్రీకరించింది. క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి పతాకంపై వై. రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మొరాకోలో జరుగుతోంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయింది. క్రిష్ మాట్లాడుతూ- ‘‘ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో దాదాపు వెయ్యి మంది షూటింగ్లో పాల్గొనగా బాలకృష్ణ, కబీర్బేడీల మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాం. బాలకృష్ణ ఏకంగా రోజుకు 14 గంటల పాటు ఈ చిత్రం కోసం శ్రమిస్తు న్నారు. అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియాస్లలో చిత్రీకరణ జరిపాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, మాటలు: బుర్రా సాయి మాధవ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు. -
మొరాకోలో మొదలు!
తెలుగుజాతి గొప్పతనాన్ని నలుదిశలా చాటిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. ఆయన చరిత్రను కథాంశంగా తీసుకుని దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొరాకోలో ప్రారంభం కానుంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మొరాకోలోని అద్భుతమైన లొకేషన్లలో ఒకటవ శతాబ్దానికి సంబంధించిన సన్నివేశాలు తీస్తాం. ఫైట్మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్తో యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నాం. ఎన్నో హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పాటల రికార్డింగ్ మొదలుపెట్టారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సిరివెన్నెల, సమర్పణ: బిబో శ్రీనివాస్, కెమేరా: జ్ఞానశేఖర్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు. -
పారిస్ దాడిపై బెల్జియన్ వ్యక్తి అరెస్టు
రాబత్: పారిస్ దాడితో నేరుగా సంబంధం ఉన్న బెల్జియన్ పౌరుడిని మోరాకో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని వారే ధ్రువీకరించారు. గత ఏడాది నవంబర్ నెలలో పారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి ఇప్పటికీ పారిస్ విచారణ జరుపుతోంది. అయితే, ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కొంతమందితో నేరుగా ఓ బెల్జియన్ పౌరుడికి సంబంధం ఉన్నట్లు గుర్తించి గత శుక్రవారం అరెస్టు చేసినట్లు మోరాకో అంతర్గత వ్యవహారాలమంత్రి తెలిపారు. అతడు కూడా ఉగ్రవాద సంస్థలు గతంలోనే చేరినట్లు భావిస్తున్నామని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో 31మంది అథ్లెట్ల దుర్మరణం
రబాట్: మొరాకోలో ఘోరం జరిగింది. శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 31 మంది అథ్లెట్లతో సహా 40 మంది మరణించారు. యువ అథ్లెట్లు, కోచ్లు ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్రక్ ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు అగ్నికీలకల్లో ఆహుతవడంతో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. అథ్లెట్లు మంటల్లో చిక్కుకుని దహనమయ్యారు. ఉత్తర మొరాకోలో పోటీలో పాల్గొన్న అనంతరం అథ్లెట్లు తిరిగివస్తుండగా టన్ టన్ నగరం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ సయమంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అథ్లెట్లతో సహా 40 మంది మంటల్లో కాలి మరణించగా, మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. -
మొరాకో
ప్రపంచవీక్షణం నైసర్గిక స్వరూపం వైశాల్యం: 4,46,500 చదరపు కిలోమీటర్లు జనాభా: 3,32,50,000 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: రబత్ ప్రభుత్వం: యూనిటరీ రిపబ్లిక్ కాన్స్టిట్యూషనల్ మొనార్చీ కరెన్సీ: దిర్హమ్ భాషలు: అరబ్బీ అధికార భాష, బెర్బర్, ఫ్రెంచి, స్పానిష్ ఇతర భాషలు మతము: 99% ముస్లిములు, 1% క్రైస్తవులు వాతావరణం : జనవరిలో 8-17 డిగ్రీలు, ఆగస్ట్లో 18-20 డిగ్రీలు పంటలు : గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, పప్పులు, నిమ్మ, కూరగాయలు, ఆలివ్, ద్రాక్ష. పరిశ్రమలు: ఫుడ్ ప్రాసెసింగ్, దుస్తులు, తోలు వస్తువులు, సిమెంట్, సారాయి, ఎరువులు, గనులు, ఫాస్ఫెట్, ఇనుము, సీసము ముడి పదార్థాలు. సరిహద్దులు: అల్జీరియా, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. పరిపాలనా రీతులు: పాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 16 రీజియన్లుగా విభజించారు. ఈ రీజియన్లను తిరిగి 62 ప్రావిన్స్లు లేదా ప్రిఫెక్చర్లుగా విభజించారు. దేశంలో కాసాబ్లాంకా, బబత్-సాలె, ఫెస్, మారకేశ్, టాంజియర్, మెక్నెస్, అదాగిర్, అవుజ్దా, కెనిట్రా, టెటోవాన్, అస్ఫి, మొహమ్మదియా, బేని మెల్లాల్, ఖౌరిబ్గా, ఎల్జదిదా, తాజా, నాదోర్, సెట్టాట్, బెర్రెచిడ్, లరాచ్చెలు పెద్ద నగరాలు. వీటిలో కాసాబ్లాంకా, రబత్ సాలెలు అతి పెద్ద నగరాలు. చరిత్ర: 8వ శతాబ్దంలో బెర్బర్ రాజులు మొరాకో నుండి పక్కనే ఉన్న స్పెయిన్ దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేశారు. వీరికంటే ముందు మొరాకో దే శాన్ని రోమ్, వండాల్ రాజులు పాలించారు. క్రీ.శ. 685లో అరబ్బులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి మొరాకోను ముస్లిం దేశంగా మార్చేశారు. 11వ శతాబ్దంలో బెర్బర్ రాజులు ముస్లిం రాజులను పారద్రోలి తమ సామ్రాజ్యాన్ని స్పెయిన్, సెనెగల్ దాకా విస్తరించారు. అరబ్బులకు, బెర్బర్లకు ఎప్పుడూ ప్రచ్ఛన్న యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ తరువాత స్పెయిన్, పోర్చుగల్ అధికారంలో ఉన్న క్రిస్టియన్ పాలకులు క్రమంగా మొరాకోలోని మూరిష్ పాలకులను విడదీసి మొరాకో దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 15వ శతాబ్దంలో తిరిగి మూరిష్ రాజులు మొరాకోపై తమ ఆధిపత్యం కొనసాగించారు. మూడు వందల సంవత్సరాల తరువాత 19వ శతాబ్దంలో ఫ్రెంచి రాజులు మొరాకో చర్చిల్, రూజ్వెల్ట్, డిగాలేల చర్చల ఫలితంగా 1956లో మొరాకో స్వతంత్ర దేశంగా మారింది. అయితే క్యూటా, మెలిల్లా అనే రెండు చిన్న పట్టణాలు మాత్రం ఇప్పటికీ స్పెయిన్ ఆధీనంలో ఉన్నాయి. దేశంలో చూడదగిన ప్రదేశాలు రబత్ నగరం ఈ నగరం కూడా అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉంది. ఈ నగరానికి ఆనుకుని తెమారా, సాలె అనే నగరాలు ఉన్నాయి. ఈ మూడు నగరాలు కలిసిపోయి ఉన్నాయి. క్రీ.శ. 11వ శతాబ్దంలోనే ఈ నగరం నిర్మింపబడింది. 1912లో ఫ్రెంచి రాజులు దీనిని ఆక్రమించుకున్నారు. నగరం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది - పాత నగరం. దీనిని మదీనా అంటారు. రెండవది ఔదాయాస్, మూడోది హసన్. నగరంలో మహమ్మద్ - 5 రాజభవనం, యూనివర్సిటీ, హసన్ టవర్, చిల్లా నెక్రో పోలిస్, ఉదాయాస్ కజ్జా, పురావస్తు మ్యూజియం, సూసీ స్టేజి, సెయింట పియరీ కాథడ్రల్, పార్లమెంట్ భవనం, దల్-అల్-మఖ్జన్, బేరెగ్రెగ్ లు చూడ దగిన స్థలాలు. కారకల్లా ఆర్చ్ ఇది ఒకప్పటి రోమన్ల నగరం. మూడవ శతాబ్దానికి పూర్వం రోమన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అప్పుడు నిర్మించిన ఒక ఆర్చి ఇప్పటికీ నిలిచి ఉంది. ఈ ప్రాంతమంతా ఎంతో సారవంతమైన భూములు ఉన్నాయి. వివిధ ధాన్యాలు, ఆలివ్ పండుతాయి. వోలు బిల్లిస్ రోమన్ల పరిపాలన సమయంలో ఎంతో గొప్పగా ఉండేది. ప్రస్తుతం శిథిలాలు మాత్రం మిగిలాయి. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించింది. రోమన్లు దాదాపు 700 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేశారు. 8వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని ఇద్రిస్ ఇబ్బన్ అబ్దుల్లా అనే రాజు ఆక్రమించుకున్నారు. 18వ శతాబ్దంలో వచ్చిన పెద్ద భూకంపం కారణంగా ఈ ప్రాంతంలోని భవనాలన్నీ కూలిపోయాయి. అలా కూలి పోయినవి ఈనాటికీ అలాగే ఉన్నాయి. కాసాబ్లాంకా మొరాకో దేశంలో అతిపెద్ద నగరం కాసాబ్లాంకా అట్లాంటిక్ మహా సముద్ర తీరంలో ఉంది. నాలుగు మిలియన్ల పైగా జనాభా ఉంది. ప్రసిద్ధ ఓడరేవులు, విమానాశ్రయాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో బెర్బర్లు ఈ పట్టణాన్ని నిర్మించారు. తరువాత కాలంలో రోమన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 14వ శతాబ్దం నుండి ఈ నగరం ఒక ప్రముఖ ఓడరేవుగా ప్రపంచంలో గుర్తించబడింది. 15వ శతాబ్దంలో ఈ నగరాన్ని పోర్చుగీసువాళ్లు ఆక్రమించుకున్నారు. పోర్చుగీసులో కాసా బ్లాంకా అంటే శ్వేత భవనం అని అర్థం. క్రీ.శ. 1755లో వచ్చిన భయంకర భూకంపంలో ఈ పట్టణం 75% కూలిపోయింది. 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ పట్టణాన్ని సుల్తాన్ మహమ్మద్ చిన్ అబ్దుల్లా తిరిగి నిర్మించాడు. 1930 నుండి ఈ నగరం బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు మొరాకో దేశంలో ఈ నగరమే గొప్ప వ్యాపార కేంద్రం. ఈ నగర పరిసరాల్లో అనేక పరిశ్రమలు ఉన్నాయి. దేశ ఆదాయంలో 50% ఆదాయం ఈ నగరం నుండే వస్తుంది. నగరంలో హసన్-2 మసీదు ఒక గొప్ప ఆకర్షణ. ఫ్రెంచి దేశపు శిల్పి మిచెల్ పిన్సావు ఈ కట్టడానికి రూపకల్పన చేశాడు. నగరంలో ఇంకా కాసాబ్లాంకా కాథడ్రల్, కాసాబ్లాంకా ట్విన్ సెంటర్. చెఫ్ చావెన్ ఇది దేశంలో ఉత్తర-తూర్పు భాగంలో ఉంది. ఇదొక ప్రత్యేకమైన నగరం. ఈ నగరం రిఫ్ట్ పర్వతాల పాదాల మీద ఈ నగరం నిర్మించబడింది. ఇళ్లన్నీ ఎంతో ఇరుకుగా కనిపిస్తాయి. దూరం నుండి చూస్తే ఇళ్లనీ ఒకదాన్ని ఒకటి అతుక్కొన్నట్లుగా కనిపిస్తాయి. ప్రతి ఇంటి గోడలు సున్నం వేయబడి తెల్లగా ఉంటాయి. పై కప్పులు ఎర్రటి పెంకులతో ఉంటాయి. ఈ నగరం హస్తకళల వస్తువులకు ప్రసిద్ధి. ఈ వస్తువులు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా దొరకవు. ఊలు, ఉన్ని దుస్తులు, బ్లాంకెట్లకు ఈ నగరం ప్రసిద్ధి. ఈ నగరానికి ఉన్న మరో ప్రత్యేకత మేకపాల వెన్న! ఇది కూడా దేశంలో మరెక్కడా దొరకదు. హషిష్ అనే మత్తు పదార్థం ఈ నగరంలో విస్త ృతంగా లభిస్తుంది. మొరాకో ఇసుక తిన్నెలు మొరాకో దేశ దక్షిణ భాగం చివరిలో సహారా ఎడారి ఆనుకొని ఉంది. ఈ ఎడారిలో ఇసుక తిన్నెలను చూడడానికి పర్యాటకులు లక్షలాదిగా వస్తారు. ఎర్గ్ చెబ్బి ఇసుక తిన్నెలు బాగా ప్రసిద్ధి. ఒంటెల మీద ప్రయాణం గొప్ప అనుభూతిని స్త్తుంది. ఈ ఎర్గ్ చెబ్బి ఇసుక తిన్నెలు చాలా విశాలమైనవి. ఈ ఎడారిలో ఒక చిన్న నగరం ఉంది. దాని పేరు మెర్జోగా. చాలా మంది పర్యాటకులు ఈ ఎడారిలో గుడారాలు వేసుకొని ఉండి ఆనందిస్తారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ ఎడారిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగేచలికాలంలో అతితక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి.ఎడారిలో ఒయాసిస్సులు కూడా ఉన్నాయి. దాయత్ శ్రీజ అనే ఉప్పు నీటి సరస్సు కూడా ఉంది. -
శృంగారం కోసం 'తపించి' పోతున్నారు
కరాచీ : శృంగారానికి సంబంధించిన సమాచారాన్ని శోధించే విషయంలో పాకిస్తాన్ అన్ని దేశాలను వెనక్కి నెట్టి టాప్లో దూసుకెళుతోంది. ఈ విషయంలో ప్రపంచం మొత్తంగా తమ వెబ్సైట్ను ఆశ్రయిస్తున్న దేశాలలో పాక్ మొదటి స్థానాన్ని ఆక్రమించిందని ప్రముఖ వెబ్సైట్ గూగుల్ వెల్లడించింది. శృంగారంపై సమాచారం కోసం పరితపించే దేశ వాసుల జాబితాను మంగళవారం గూగుల్ ఇక్కడ విడుదల చేసింది. శృంగారంపై చిన్న సమస్య నుంచి సమగ్ర సమాచారం కోసం పాకిస్తానీయులు గూగుల్ తల్లినే ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. అలాగే ఆ తర్వాత స్థానాన్ని ఈజిప్టు ఆక్రమించిందని పేర్కొంది. ఇక ఇరాన్, మొరాకో నాలుగు,అయిదో స్థానాలను... సౌదీ అరేబియా, టర్కీ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాలలో నిలిచాయని తెలిపింది. అయితే శృంగారానికి సంబంధించిన సమాచారాన్ని లెబనాన్, టర్కీ తప్పించి మిగిలిన అరబ్ దేశాలు నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లిం దేశాలకు చెందిన యువత గూగుల్ను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. కాగా శృంగారం కోసం గూగుల్ని ఆశ్రయిస్తున్న దేశాల జాబితాలో మొదటి ఎనిమిది దేశాల్లో ఆరు ముస్లిం దేశాలే ఉండటం గమనార్హం. అయితే జంతువుల శృంగారానికి సంబంధించిన సమాచారం కోసం ఆయా దేశాల వాసులు గుగూల్ లో శోధించారని పేర్కొంది. ఈ మేరకు 'ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' కథనాన్ని వెలువరించింది. -
మొరాకోలో 32 మంది మృతి
రాబత్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా మొరాకో దేశంలోని వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో 32 మంది మరణించారని ఆ దేశ హోంశాఖ మంత్రి మంగళవారం మొరాకో రాజధాని రాబత్ లో వెల్లడించారు. వారిలో ఆరుగురు ఆచూకీ తెలియలేదన్నారు. వీరంతా దేశానికి దక్షిణ ప్రాంతంలోని అల్జీరియా సరిహద్దుల్లోని గ్లుమిమ్ నగరవాసులను తెలిపారు. నదులు, కాలువ పరివాహక ప్రాంతాల్లోని 214 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. వర్షాలు, వరదల తాకిడికి దేశంలోని చాలా నగరాల మధ్య రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర అటంకం కలుగుతుందన్నారు. రవాణా వ్యవస్థను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నిన్న ఉదయం వరదల్లో చిక్కుకున్న 14 మంది భద్రత సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో రక్షించినట్లు ఆ దేశ హోంశాఖ మంత్రి వెల్లడించారు.