తెలుగు టైటాన్స్‌ ఓటమి  | Pro Kabaddi 2022: Bengal Warriors defeat Telugu Titans | Sakshi
Sakshi News home page

Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్‌ ఓటమి 

Oct 10 2022 7:38 AM | Updated on Oct 10 2022 7:38 AM

Pro Kabaddi 2022: Bengal Warriors defeat Telugu Titans  - Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. బెంగాల్‌ వారియర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 25–45 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్‌ తరఫున వినయ్‌ ఎనిమిది పాయింట్లు, మోనూ గోయట్‌ ఏడు పాయింట్లు స్కోరు చేశారు.

 బెంగాల్‌ జట్టులో రెయిడర్లు మణీందర్‌ సింగ్‌ 11 పాయింట్లు, దీపక్‌ హుడా 11 పాయింట్లు, శ్రీకాంత్‌ జాదవ్‌ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌ 41–39తో పుణేరి పల్టన్‌పై, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 35–30తో పట్నా పైరేట్స్‌పై నెగ్గాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో యు ముంబా; గుజరాత్‌ జెయింట్స్‌తో దబంగ్‌ ఢిల్లీ తలపడతాయి.
చదవండి: Women's Asia Cup 2022: మరో విజయమే లక్ష్యంగా... థాయ్‌లాండ్‌తో భారత్‌ ఢీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement