Bengal Warriors
-
PKL 11: ప్లే ఆఫ్స్లో ఢిల్లీ.. తెలుగు టైటాన్స్ పరిస్థితి?
అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ దశకు చేరింది. ఈ సీజన్లో టాప్-6కు అర్హత సాధించిన రెండో జట్టుగా జట్టు నిలిచింది. పుణె వేదికగా బెంగాల్ వారియర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో 47–25 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకుంది.ఇక ప్రొ కబడ్డి లీగ్ తాజా ఎడిషన్లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్ జట్టు ప్లే ఆఫ్స్నకు అర్హత పొందింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో 20 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఢిల్లీ జట్టు 11 మ్యాచ్ల్లో గెలిచింది. 5 మ్యాచ్ల్లో ఓడిపోయి, 4 మ్యాచ్లను ‘టై’ చేసుకొని 71 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. మొత్తం 12 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుకుంటాయి.మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్లుహరియాణా, ఢిల్లీ ఇప్పటికే తమ అర్హత సాధించగా.. మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు కావాల్సి ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బెంగాల్తో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ ఏకంగా 17 పాయింట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు 18 సార్లు రెయిడింగ్కు వెళ్లి.. తొమ్మిదిసార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. ఆరుసార్లు పాయింట్ నెగ్గకుండానే తిరిగి వచ్చాడు. మరో మూడుసార్లు విఫలమయ్యాడు.ఈ క్రమంలో.. నాలుగు బోనస్ పాయింట్లతోపాటు 12 టచ్ పాయింట్లు సాధించిన అశు ఒక ట్యాకిల్ పాయింట్ కూడా నెగ్గాడు. ఢిల్లీకే చెందిన యోగేశ్ 9 పాయింట్లు, ఆశిష్ 5 పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ తరఫున విశ్వాస్ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. నితేశ్ కుమార్ ఐదు పాయింట్లు, కెప్టెన్ ఫజల్ అత్రాచలి నాలుగు పాయింట్లు స్కోరు చేశారు.రేసులో పుణేరి పల్టన్ఇక మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 37–32 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో పట్నా పైరేట్స్ 68 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్నకు చేరువైంది. తెలుగు టైటాన్స్ ఏస్థానంలో ఉందంటే?ఇక మంగళవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇరవై మ్యాచ్లలో పదకొండు గెలిచిన తెలుగు టైటాన్స్ 60 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.చదవండి: తమిళ్ తలైవాస్ అవుట్ -
తెలుగు టైటాన్స్ గెలుపు
పుణే: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పదో విజయంతో నాలుగో స్థానానికి ఎగబాకింది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 34–32తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. తెలుగు కెపె్టన్ విజయ్ మాలిక్ 19 సార్లు కూతకెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో ఆశిష్ నర్వాల్ (9) రాణించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ (14), మన్జీత్ (7) అదరగొట్టారు. దీంతో ఇరుజట్ల మధ్య ఆఖరిదాకా హోరాహోరీ సమరం జరిగింది. అంతకుముందు జరిగిన మ్యాచ్లో యూపీ యోధాస్ 36–33తో పుణేరి పల్టన్పై విజయం సాధించింది. యూపీ రెయిడర్ గగన్ గౌడ (15) చెలరేగాడు.17 సార్లు కూతకెళ్లిన గగన్ క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో భవాని రాజ్పుత్ (6) రాణించగా, కెప్టెన్ సుమిత్ 3, అశు సింగ్, మహేందర్, హితేశ్ తలా 2 పాయింట్లు చేశారు. పల్టన్ జట్టులో పంకజ్ మోహితే (11), మోహిత్ గోయత్ (7) రాణించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్... యూ ముంబాతో గుజరాత్ జెయంట్స్ తలపడతాయి. -
పల్టన్ ఫటాఫట్
నోయిడా: డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ ఆల్రౌండ్ ప్రదర్శనకు బెంగాల్ వారియర్స్ చేతులెత్తేసింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో పుణేరి పల్టన్ అర్ధసెంచరీని మించిన పాయింట్లను అవలీలగా చేసింది. కూతకెళ్లిన రెయిడర్లు, డిఫెండర్లు క్రమం తప్పకుండా పాయింట్లను సాధించారు. దీంతో పల్టన్ 51–34 స్కోరుతో 17 పాయింట్ల తేడాతో వారియర్స్పై జయభేరి మోగించింది. ఆట మొదలైన 7 నిమిషాలకే బెంగాల్ ఆలౌటైంది. మళ్లీ తొలి అర్ధభాగం ముగిసే దశలో ఆలౌట్ కావడంతో 24–11తో పుణేరి పూర్తి ఆధిపత్యంతో బ్రేక్కు వెళ్లింది. అనంతరం రెండో అర్ధభాగంలోనూ వారియర్స్ ఆటతీరు ఏమాత్రం మారలేదు. ఐదు నిమిషాలకే మ్యాచ్లో మూడోసారి ఆలౌటైంది. 11 నిమిషాల వ్యవధిలో నాలుగోసారి ఆలౌటైంది. పుణేరి జట్టు మ్యాచ్లో ఒకే ఒక్కసారి అది కూడా మ్యాచ్ ముగిసే ఆఖరి నిమిషంలో ఆలౌట్ కాగా... అప్పటికే పాయింట్ల ఫిఫ్టీ కొట్టింది. పల్టన్ రెయిడర్లు ఆకాశ్ షిండే (9 పాయింట్లు), మోహిత్ గోయత్ (9), పంకజ్ మోహితె (6), డిఫెండర్లు మోహిత్ (5), గౌరవ్ ఖత్రి (3) రాణించారు. బెంగాల్ తరఫున రెయిడర్ నితిన్ కుమార్ (13) అదరగొట్టాడు. మిగతా వారిలో కెప్టెన్, డిఫెండర్ ఫజల్ అత్రాచలి (3), ప్రణయ్ రాణే (5) మెరుగ్గా ఆడారు. తర్వాత జరిగిన రెండో మ్యాచ్లో యూపీ యోధాస్ 44–42తో పట్నా పైరేట్స్పై గెలిచింది. యూపీ ఆటగాళ్లలో గగన్ గౌడ (11), భవాని రాజ్పుత్ (10), హితేశ్ (8)లు రాణించారు. పట్నా జట్టులో రెయిడర్ దేవాంక్ (18) ఆకట్టుకున్నాడు. అయాన్ (10) రాణించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో పుణేరి పల్టన్తో జైపూర్ పింక్పాంథర్స్ తలపడనుండగా, యు ముంబాతో బెంగళూరు బుల్స్ పోటీపడుతుంది. -
తెలుగు టైటాన్స్దే పైచేయి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ‘హ్యాట్రిక్’ విజయాలతో పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 31–29తో బెంగాల్ వారియర్స్ పై నెగ్గింది. కెప్టెన్ విజయ్ మలిక్ (14 పాయింట్లు) అద్భుతంగా రాణించాడు. మ్యాచ్ కీలక దశలో రెయిడింగ్కు వెళ్లిన విజయ్ మూడు పాయింట్లు తెచ్చిపెట్టడం టైటాన్స్ విజయానికి కారణమైంది. డిఫెన్స్లోనూ తెలుగు జట్టు ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చేసింది. ఆల్రౌండర్ శంకర్ గడాయ్, డిఫెండర్ అంకిత్, రెయిడర్ మన్జీత్ తలా 3 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున రెయిడర్ ప్రణయ్ రాణే (9) అదరగొట్టాడు. తొలి అర్ధభాగాన్ని 19–9తో టైటాన్స్ ముగించగా... ద్వితీయార్ధంలో ప్రణయ్ క్రమంగా తెచ్చిపెట్టిన పాయింట్లతో రేసులోకి వచ్చింది. మిగతా వారిలో హేమరాజ్, విశ్వాస్ చెరో 4 పాయింట్లు చేశారు. అయితే తెలుగు కెప్టెన్ విజయ్ మలిక్ చేసిన పోరాటంతో విజయం దక్కింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 32–26తో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. స్టీలర్స్ జట్టులో రెయిడర్ వినయ్ (12) ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా 4, రెయిడర్ శివమ్ 5, డిఫెండర్ సంజయ్ 4 పాయింట్లు చేశారు. బుల్స్ జట్టులో ఒక్క అక్షిత్ (7) మాత్రమే నిలకడగా స్కోరు చేశాడు. స్టార్ రెయిడర్, కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ (1) ఆకట్టుకోలేకపోయాడు. నితిన్ రావల్ (4), జై భగవాన్ (3) మెరుగ్గా ఆడారు. ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన హరియాణా 9 విజయాలతో టాప్లో నిలువగా, 12 మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచిన టైటాన్స్ రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
దేవాంక్ ధమాకా
నోయిడా: స్టార్ రెయిడర్ దేవాంక్ 15 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. లీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో పట్నా పైరేట్స్ 52–31 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై విజయం సాధించింది. పట్నా తరఫున దేవాంక్ 10 రెయిడ్ పాయింట్లు, 5 బోనస్ పాయింట్లు సాధించగా... అయాన్ 11 పాయింట్లతో సత్తా చాటాడు. సందీప్ కుమార్ (8 పాయింట్లు), దీపక్ రాఠి (5 పాయింట్లు) కూడా రాణించడంతో పట్నా జట్టు ఘనవిజయం సాధించింది. మరోవైపు బెంగాల్ వారియర్స్ తరఫున నితిన్ కుమార్ (11 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. తాజా సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన పట్నా 6 విజయాలు, 4 పరాజయాలతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానానికి చేరింది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 32–24 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్లు, నీరజ్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమాన్ సింగ్ 11 పాయింట్లతో పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు. 9 మ్యాచ్లాడిన జైపూర్ 5 విజయాలు, 3 పరాజయాలు, ఒక ‘టై’తో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. లీగ్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
బెంగాల్ భారీ విజయం
హైదరాబాద్, నవంబర్ 9, 2024: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో బెంగాల్ వారియర్స్ దుమ్మురేపింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 40-29తో బెంగళూరు బుల్స్పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శన కనబరిచిన బెంగాల్ తరపున నితిన్కుమార్(14), మన్దీప్సింగ్(10) సూపర్-10తో కదంతొక్కారు. మరోవైపు బెంగళూరు జట్టులో అక్షిత్(11), అజింక్యా పవార్(8) రాణించినా..పర్దీప్ నార్వల్(2) ఘోరంగా విఫలమయ్యాడు.బెంగాల్ జోరు: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది. లీగ్లో కీలకమైన ప్లేఆఫ్స్ దశకు చేరుకోవాలంటే గెలక తప్పని పరిస్థితుల నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. శనివారం బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. మాజీ చాంపియన్ బెంగాల్ తమదైన రీతిలో బెంగళూరుపై జోరు కనబరిచింది. ముఖ్యంగా స్టార్ రైడర్ మన్దీప్సింగ్ దూకుడు కనబరిచాడు. తన తొలి రైడ్లోనే సుబ్రమణ్యంను ఔట్ చేసి బెంగాల్ పాయింట్ల ఖాతా తెరిచాడు. మరోవైపు పర్దీప్ నార్వల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మ్యాచ్ 16వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్కు వెళ్లిన బెంగళూరు రైడర్ అక్షిత్ను నితీశ్కుమార్ ఉడుం పట్టుతో బెంగాల్కు పాయింట్ అందించాడు. రెండు నిమిషాల వ్యవధిలో రైడ్కు వెళ్లిన మన్దీప్సింగ్..ఈసారి నితిన్ రావల్, పర్దీప్ నర్వాల్ను ఔట్ రెండు పాయింట్లతో బెంగాల్ జట్టులో జోష్ నింపాడు. బెంగళూరు తరఫున పర్దీప్ నార్వల్ విఫలమైనా..అక్షిత్ వరుస పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఓవైపు రైడింగ్తో పాటు డిఫెన్స్లోనూ బెంగాల్ జోరు కనబర్చడంతో బెంగళూరు ఢీలా పడిపోయింది. ఈ క్రమంలో తొలి అర్ధభాగం ముగిసే సరికి బెంగాల్ 15-12తో బెంగళూరుపై ఆధిక్యంలో నిలిచింది.అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలో బెంగాల్ పాయింట్ల వేటలో అదే దూకుడు కనబరిచింది. అంతగా అనుభవం లేని బెంగళూరును బోల్తా కొట్టిస్తూ కీలక పాయింట్లు కొల్లగొట్టింది. మ్యాచ్ 17వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్కు వచ్చిన నితిన్కుమార్..లకీకుమార్ను ఔట్ చేసి బెంగాల్ను ఆధిక్యంలో నిలిపాడు. నిమిషం తేడాతో రైడ్కు వచ్చిన మనిందర్సింగ్..నితిన్ నార్వల్, అజింక్యా పవార్ను ఔట్ చేయడంతో బెంగళూరు తొలిసారి ఆలౌటైంది. అంతగా ప్రభావం చూపని పర్దీప్ నార్వల్ స్థానంలో మరో ప్లేయర్ను బెంగళూరు సబ్స్టిట్యూట్గా తీసుకుంది. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగస్తుందనగా బెంగళూరు రెండో సారి ఆలౌట్ కావడంతో బెంగాల్ విజయం ఖరారైంది. మ్యాచ్ ఆసాంతం మన్దీప్సింగ్ రైడింగ్ జోరు సాగింది. -
దబాంగ్ ఢిల్లీ గెలుపు బాట
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ దబాంగ్ ఢిల్లీ కేసీ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత బెంగాల్ వారియర్స్ను ఓడించి మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 33–30 తేడాతో బెంగాల్పై ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్, స్టార్ రెయిడర్ పది పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు. అతనికి తోడు వినయ్ 8 పాయింట్లు, ఆశీష్ ఆరు పాయింట్లతో రాణించారు. బెంగాల్ వారియర్స్ జట్టులో రెయిడర్ నితిన్ కుమార్ 15 పాయింట్లతో అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్, డిఫెండర్ ఫజెల్ అత్రాచలి 5 పాయింట్లతో హైఫైవ్ ఖాతాలో వేసుకున్నాడు.హోరాహోరీలో ఢిల్లీ పైయిఆరంభంలో ఆట హోరాహోరీగా సాగినా దబాంగ్ ఢిల్లీ క్రమంగా జోరు పెంచి తొలి అర్ధభాగంలో పైచేయి సాధించింది. మణిందర్ బోనస్తో బెంగాల్ వారియర్స్ జట్టు ఖాతా తెరిచాడు. ఆవెంటనే ఢిల్లీ స్టార్ రెయిడర్ బోనస్ సాధించినా ఫజెల్ అత్రాచలి అతడిని ట్యాకిల్ చేశాడు. తర్వాతి రెయిడ్లో విజయ్ కూడా ప్రత్యర్థి డిఫెండర్లకు చిక్కగా.. డూ ఆర్ డై రెయిడ్లో నితిన్ కుమార్ అషు మాలిక్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు.దాంతో బెంగాల్ 4–1తో ఆరంభ ఆధిక్యం దక్కించుకుంది. కానీ, ఆశీష్ వరుస రెయిడ్లలో విజయవంతం కావడంతో ఢిల్లీ 6–6తో స్కోరు సమం చేసింది. అషు మాలిక్ రెయిండింగ్లో జోరు పెంచగా.. డిఫెన్స్లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. మణిందర్తో పాటు విశ్వాస్ను ట్యాకిల్ చేసి బెంగాల్ ను ఆలౌట్ చేసి 14–8తో ఆధిక్యాంలోకి వెళ్లింది. బెంగాల్ జట్టులో నితిన్ వరుస రెయిడ్ పాయింట్లు రాబట్టినా.. ఆధిక్యాన్ని కాపాడుకున్న ఢిల్లీ19-13తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.ఢిల్లీదే జోరురెండో అర్ధభాగంలోనూ వారియర్స్ ఆటగాడు నితిన్ జోరు చూపెడూ సూపర్ 10 పూర్తి చేసుకున్నాడు. దాంతో బెంగాల్ నెమ్మదిగా ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించి పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. డిఫెన్స్లోనూ కాస్త మెరుగైంది. అటు రెయిడింగ్లో నితిన్కు తోడు సుశీల్ కూడా వెంటవెంటనే రెండు రెయిడ్ పాయింట్లు రాబట్టాడు. డూ ఆర్ డై రెయిడ్కు వచ్చిన అంకిత్ మానెను అద్భుతంగా ట్యాకిల్ చేసిన ఫజెల్ అత్రాచలి హై ఫైవ్ పూర్తి చేసుకున్నాడు. దాంతో మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా బెంగాల్27–31తో ఢిల్లీ ఆధిక్యాన్ని నాలుగు పాయింట్లకు పరిమితం చేసింది.ఈ దశలో అషు మాలిక్ ఎమ్టీ రైయిడ్తో సమయం వృథా చేసే ప్రయత్నం చేశాడు. చివర్లో నితిన్ మెరుపు వేగంతో రెండు పాయింట్లు తీసుకురావడంతో స్కోరు 29–31తో ఉత్కంఠా మారింది. అయితే, డూ ఆర్ డై రెయిడ్కు వెళ్లిన అషు మాలిక్.. మయూర్ కదమ్ను డైవింగ్ హ్యాండ్ టచ్తో ఢిల్లీకి మరో పాయింట్ అందించాడు. ఆ వెంటనే నితిన్ మరో టచ్ పాయింట్ తెచ్చినా.. ఆఖరి రెయిడ్కు వచ్చిన అషు మాలిక్.. ఫజెల్ అత్రాచలి పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో ఢిల్లీ మూడు పాయింట్ల ఆధిక్యంతో మ్యాచ్ను ముగించింది. -
PKL 11: నువ్వా- నేనా!.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ ఎడిషన్లో మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఆఖరు కూత వరకు ఉత్కంఠ రేపిన బెంగాల్ వారియర్స్, పుణెరి పల్టాన్ పోరు 32-32తో టై అయ్యింది. మంగళవారం జరిగిన మాజీ చాంపియన్ల సమరంలో ప్రథమార్థం ఆటలో పుణెరి పల్టాన్ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించినా.. ద్వితీయార్థంలో బెంగాల్ వారియర్స్ లెక్క సరి చేసింది.ఇక ఈ సీజన్లో ఇది మూడో టై కావటం విశేషం. కాగా బెంగాల్ వారియర్స్ ఆటగాళ్లలో రెయిడర్ సుశీల్ (10 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో మెరువగా.. నితిన్ కుమార్ (6 పాయింట్లు), నితేశ్ కుమార్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. పుణెరి పల్టాన్ తరఫున ఆకాశ్ షిండె (8 పాయింట్లు), పంకజ్ మోహిత్ (8 పాయింట్లు) రాణించారు. ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు,ఓ టైతో పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్ అగ్రస్థానం నిలుపుకోగా.. బెంగాల్ వారియర్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లలో ఒక్కటే గెలిచింది.నువ్వా.. నేనా! అంటూ సాగిన సమరం బెంగాల్ వారియర్స్తో మ్యాచ్ను పుణెరి పల్టాన్ ఘనంగా ఆరంభించింది. తొలి పది నిమిషాల్లో పాయింట్ల కోసం ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చారు. ప్రతి కూతకు పాయింట్లు మారుతుండటంతో ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్టు ఉత్కంఠ నడిచింది.తొలి పది నిమిషాల ఆట అనంతరం బెంగాల్ వారియర్స్ 7-6తో ఓ పాయింట్ ముందంజలో నిలిచింది. కానీ తర్వాతి పది నిమిషాల్లో పుణెరి పల్టాన్ పుంజుకుంది. ప్రథమార్థం ఆట ముగిసే సమయానికి పుణెరి పల్టాన్ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. 15-12తో బెంగాల్ వారియర్స్పై పైచేయి సాధించింది.విరామం అనంతరం బెంగాల్ వారియర్స్ దూకుడు పెంచింది. రెయిడర్లు సుశీల్ సూపర్ టెన్ షోతో దూకుడు పెంచాడు. దీంతో బెంగాల్ వారియర్స్ వెనుకంజ నుంచి పుంజుకుని ఆధిక్యం కోసం పోటీపడింది. రెయిడింగ్లో నితిన్ కుమార్, డిఫెన్స్లో నితిన్ మెరవటంతో బెంగాల్ వారియర్స్ రేసులోకి వచ్చింది.చావోరేవో తేల్చకోవాల్సిన రెయిడ్లలోఈ క్రమంలో.. 30-31తో ఓ పాయింట్ వెనుకంజలో ఉండగా విశ్వాస్ రెయిడ్ పాయింట్తో బెంగాల్ వారియర్స్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా చావోరేవో తేల్చకోవాల్సిన రెయిడ్లలో ఇరు జట్లు నిరాశపరిచాయి. ఆఖరు రెండు కూతల్లో ఎవరికీ పాయింట్ దక్కలేదు. దీంతో 32-32తో బెంగాల్ వారియర్స్, పుణెరి పల్టాన్ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమానంగా పంచుకున్నాయి. -
PKL 11: బెంగాల్ వారియర్స్ బోణీ, యూపీ యోధాస్పై 32-29తో గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో బెంగాల్ వారియర్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యూపీ యోధాస్పై బెంగాల్ వారియర్స్ మెరుపు విజయం నమోదు చేసింది. హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్లో యూపీ యోధాస్పై బెంగాల్ వారియర్స్ 32-29తో గెలుపొందింది. ఉత్కంఠ మ్యాచ్లో మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించిన బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాస్కు సీజన్లో తొలి ఓటమి రుచి చూపించింది. బెంగాల్ వారియర్స్ సమిష్టి ప్రదర్శనతో రాణించింది. రెయిడర్లు మణిందర్ సింగ్ (8), నితిన్ (7), సుశీల్ (7) అదరగొట్టారు. యూపీ యోధాస్ ఆల్రౌండర్ భరత్ (13) సూపర్ టెన్తో షో చేసినా.. ఫలితం దక్కలేదు.ప్రథమార్థం హోరాహోరీ : బెంగాల్ వారియర్స్, యూపీ యోధాస్ తొలి అర్థభాగం ఆటలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. తొలి రెండు మ్యాచుల్లో విజయాలతో ఊపుమీదున్న యూపీ యోధాస్ను ఒత్తిడిలో నిలువరించిన బెంగాల్ వారియర్స్ 12-11తో ప్రథమార్థంలో ఆధిక్యం సాధించింది. ఇరు జట్లూ రెయిడింగ్, డిఫెన్స్లో బలంగా ఉండటంతో ఏ జట్టు సైతం ఆలౌట్ స్కోరు చేయలేకపోయింది. భరత్ సక్సెస్ఫుల్ రెయిడ్తో యూపీ యోధాస్ తొలుత ఖాతా తెరిచినా.. బెంగాల్ వారియర్స్ను మణిందర్ సింగ్ ముందుండి నడిపించాడు. బెంగాల్ వారియర్స్ రెయిడింగ్లో 9 పాయింట్లు సాధించగా, యూపీ యోధాస్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. డిఫెన్స్లో ఇరు జట్లు మూడేసి పాయింట్లు సాధించాయి.వారియర్స్ దూకుడు : ప్రథమార్థం ఆటలో ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచిన బెంగాల్ వారియర్స్ విరామం అనంతరం దూకుడు పెంచింది. ఆఖరు పది నిమిషాల ఆట వరకు యూపీ యోధాస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ మణిందర్ సింగ్కు నితిన్ జత కలవటంతో బెంగాల్ దూకుడు ముందు యూపీ యోధాస్ నిలువలేదు. వరుసగా సక్సెస్ఫుల్ రెయిడ్స్తో బెంగాల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 25-21తో నాలుగు పాయింట్ల ముందంజ వేసిన బెంగాల్ ఆ తర్వాత యోధాస్కు చిక్కలేదు. యోధాస్ రెయిడర్ భరత్ సూపర్ టెన్ ప్రదర్శనతో మెరిసినా.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. ఆఖరు రెండు నిమిషాల్లోనూ యూపీ యోధాస్ గట్టిగా ప్రయత్నించినా అప్పటికే మ్యాచ్ బెంగాల్ వారియర్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. -
PKL 10: బెంగాల్ వారియర్స్ అవుట్
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలవాలంటే మిగిలివున్న రెండు మ్యాచ్ల్ని కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బెంగాల్ వారియర్స్ 26–29తో పుణేరి పల్టన్ చేతిలో ఓడిపోయింది. దీంతో హరియాణా స్టీలర్స్కు నాలుగో సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో పుణేరి రెయిడర్లు ఆకాశ్ షిండే 10, పంకజ్ మోహితే 6 పాయింట్లు సాధించగా, బెంగాల్ జట్టులో నితిన్ కుమార్ (5), మణిందర్ (4) రాణించారు. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 45–43తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ (18) అదరగొట్టాడు. తలైవాస్ జట్టుల -
Pro Kabaddi League 2024: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. సీజన్లో పదో పరాజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు 26–46తో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో టైటాన్స్ జట్టుకిది పదో పరాజయం. టైటాన్స్ జట్టులో కెపె్టన్ పవన్ సెహ్రావత్ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. పవన్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. వారియర్స్ జట్టులో వైభవ్ 9 పాయింట్లు, నితిన్ 9 పాయింట్లు, విశ్వాస్ 8 పాయింట్లు, శుభమ్ 6 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో తమిళ్ తలైవాస్; యు ముంబాతో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
వారియర్స్ విక్టరీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో బెంగాల్ వారియర్స్ రెండో విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 48–38 పాయింట్ల తేడాతో గెలిచింది. కెపె్టన్ మణీందర్ సింగ్ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేసి వారియర్స్ విక్టరీలో కీలకపాత్ర పోషించాడు. తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ 13 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 35–33తో దబంగ్ ఢిల్లీ జట్టును ఓడించింది. -
Pro Kabaddi 2022: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ అంచె మ్యాచ్లు మొదలయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 28–36తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్లో నెగ్గి, 14 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. తొమ్మిది పాయింట్లతో టైటాన్స్ చివరిదైన 12వ స్థానంలో ఉంది. వారియర్స్తో మ్యాచ్లో టైటాన్స్ తరఫున రెయిడర్లు అభిషేక్ సింగ్ తొమ్మిది పాయింట్లతో, సిద్ధార్థ్ దేశాయ్ ఎనిమిది పాయింట్లతో, పర్మేశ్ ఐదు పాయింట్లతో రాణించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలువగా... శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. ఇతర మ్యాచ్ల్లో పుణేరి పల్టన్ 41–28తో హరియాణా స్టీలర్స్పై, బెంగళూరు బుల్స్ 45–38తో గుజరాత్ జెయింట్స్పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. బెంగాల్ వారియర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 25–45 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున వినయ్ ఎనిమిది పాయింట్లు, మోనూ గోయట్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ జట్టులో రెయిడర్లు మణీందర్ సింగ్ 11 పాయింట్లు, దీపక్ హుడా 11 పాయింట్లు, శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. ఇతర మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్ 41–39తో పుణేరి పల్టన్పై, జైపూర్ పింక్ పాంథర్స్ 35–30తో పట్నా పైరేట్స్పై నెగ్గాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో యు ముంబా; గుజరాత్ జెయింట్స్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. చదవండి: Women's Asia Cup 2022: మరో విజయమే లక్ష్యంగా... థాయ్లాండ్తో భారత్ ఢీ -
Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో శనివారం మూడు మ్యాచ్లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నాతో మ్యాచ్లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్తో మ్యాచ్లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్తో మ్యాచ్లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్ విజయం.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా..
Pro Kabaddi League- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–26 స్కోరుతో పుణేరీ పల్టన్ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. పట్నా తరఫున గుమాన్ సింగ్ 13 పాయింట్లు స్కోర్ చేయగా, పుణేరీ ఆటగాళ్లలో అస్లమ్ ఇనామ్దార్ 9 పాయింట్లు సాధించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 18 మ్యాచ్లు ఆడిన పట్నా పదమూడింట గెలిచి 70 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంది. ఇదిలా ఉండగా... బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. బెంగాల్ తరఫున మణీందర్ సింగ్, ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ చెరో 16 పాయింట్లు స్కోర్ చేశారు. చదవండి: Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్ శర్మ -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్ని గెలిపించిన సచిన్
Pro Kabaddi League: Patna Pirates Beat Bengal Warriors: ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–29తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నా రెయిడర్ సచిన్ తన్వర్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్లో 11వ విజయంతో పట్నా మొత్తం 60 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 40–36తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
Pro Kabaddi League: బెంగాల్ వారియర్స్కు హరియణా షాక్
Pro Kabaddi League- Haryana Steelers Beat Bengal Warriors, Patna Pirates Defeat Gujarat Giants: ప్రొ కబడ్డీ లీగ్లో హరియాణా స్టీలర్స్ జట్టు ఏడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 46–29తో ఘనవిజయం సాధించింది. హరియాణా కెప్టెన్ వికాశ్ కండోలా పది రెయిడింగ్ పాయింట్లు సంపాదించి తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ 36–36తో ‘టై’ కాగా... మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–23తో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
బెంగాల్ వారియర్స్కు మరో ఓటమి..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో పుణేరి పల్టన్ 39–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. ఈ లీగ్లో బెంగాల్ వారియర్స్ జట్టుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. పుణేరి పల్టన్ రెయిడర్ ఇనామ్దార్ 17 పాయింట్లు స్కోరు చేశాడు. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 13 పాయింట్లతో ఆకట్టుకున్నా అతనికి ఇతర సభ్యుల నుంచి సహకారం లభించలేదు. మరో మ్యాచ్లో యూపీ యోధ 42–27తో బెంగళూరు బుల్స్పై గెలిచింది. యూపీ యోధ రెయిడర్ శ్రీకాంత్ జాదవ్ 15 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో హరియాణా స్టీలర్స్; జైపూర్ పింక్పాంథర్స్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. చదవండి: IPL- 2022: ఐపీఎల్పై బీసీసీఐ కీలక ప్రకటన! -
బెంగాల్ వారియర్స్కు పట్నా పైరేట్స్ షాక్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ జట్టు తమ ప్రతాపం చూపించింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్కు షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నా రెయిడర్ మోనూ గోయట్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పట్నా 32–25తో ఆధిక్యంలో ఉన్న దశలో మోనూ గోయట్ సింగిల్ రెయిడ్లో ఏకంగా ఏడు పాయింట్లు సాధించి అబ్బురపరిచాడు. మ్యాచ్ మొత్తంలో మోనూ 15 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓవరాల్గా ఈ లీగ్ చరిత్రలో మోనూ 500 రెయిడింగ్ పాయింట్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ లీగ్లో పట్నాకిది మూడో విజయం. బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 36–26తో పుణేరి పల్టన్ను ఓడించి ఈ లీగ్లో తొలి విజయం నమోదు చేసింది. నేడు జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో యూపీ యోధ; బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
అహ్మదాబాద్: తొలి 6 నిమిషాల ఆటను చూస్తే దబంగ్ ఢిల్లీదే టైటిల్ అనుకున్నారు. అయితే అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న బెంగాల్ వారియర్స్ సీజన్లో టాప్ ఫామ్లో ఉన్న దబంగ్ ఢిల్లీకి షాక్ ఇస్తూ ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్ను తొలిసారి కైవసం చేసుకుంది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 18 పాయింట్లతో జట్టు విజయం కోసం తుది వరకు చేసిన పోరాటం... బెంగాల్ సమష్టి ప్రదర్శన ముందు ఓడిపోయింది. దీంతో శనివారం జరిగిన టైటిల్ పోరులో బెంగాల్ వారియర్స్ 39–34తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. బెంగాల్ తరఫున నబీబ„Š (10 పాయింట్లు), సుకేశ్ హెగ్డే (8 పాయింట్లు), ట్యాక్లింగ్లో జీవన్ (4 పాయింట్లు) ప్రదర్శన జట్టుకు టైటిల్ను ఖాయం చేసింది. సీజన్ మొత్తం అద్భుతంగా రాణిస్తూ వచ్చిన ఢిల్లీ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. ఆరంభంలో అద్భుతంగా ఆడి 11–3తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఇక్కడి నుంచి అనూహ్యంగా గాడి తప్పిన ఆ జట్టు మళ్లీ కోలుకోలేకపోయింది. బెంగాల్ స్టార్ రైడర్ మణీందర్ సింగ్ గాయం కారణంగా ఫైనల్ బరిలో దిగలేదు. దీంతో రైడింగ్ భారాన్ని సుకేశ్, నబీబ„Š మోశారు. తొలుత తడబడి పుంజుకున్న వీరు ప్రత్యరి్థని ఆలౌట్చేసి విరామానికి స్కోర్ను 17–17తో సమం చేశారు. రెండో అర్ధభాగంలో మరింతగా చెలరేగిన బెంగాల్ ప్రత్యరి్థని మరో రెండు సార్లు ఆలౌట్ చేసి కబడ్డీ కింగ్గా నిలిచింది. విజేత బెంగాల్ వారియర్స్ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. -
ఎవరో కొత్త విజేత?
అహ్మదాబాద్: 13 వారాల పాటు 13 నగరాల్లో వందకు పైగా మ్యాచ్లతో సాగిన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తుది ఘట్టానికి చేరింది. టోర్నీ మొత్తం అదరగొట్టి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన దబంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్లే తుది పోరుకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య నేడు జరిగే ఫైనల్తో ప్రొ కబడ్డీ లీగ్లో సరికొత్త చాంపియన్ అవతరించనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో సత్తా చాటి తొలిసారి ట్రోఫీని ముద్దాడడానికి రెండు జట్లూ పూర్తిగా సంసిద్ధమయ్యాయి. నవీన్ కుమార్ గీ మణీందర్ సింగ్ ఈ సీజన్ మొత్తం రైడింగ్లో అదరగొట్టిన రైడర్ నవీన్ కుమార్ ఢిల్లీ జట్టుకు వెన్నెముకగా నిలుస్తూ వచ్చాడు. దాదాపు ప్రతీ మ్యాచ్లో సూపర్ ‘టెన్’తో చెలరేగిన అతడు జట్టును పాయింట్ల పట్టికలో టాప్లో నిలిపాడు. సెమీస్లో కూడా 15 పాయింట్లతో చెలరేగిన అతను జట్టును ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు మరోసారి చెలరేగితే ఢిల్లీ టైటిల్ గెలవడం ఖాయం.గాయం కారణంగా ముంబైతో జరిగిన మ్యాచ్కు దూరమైన బెంగాల్ కెప్టెన్, స్టార్ రైడర్ మణీందర్ సింగ్ ఫైనల్కి సిద్ధమయ్యాడు. నేడు జరిగే మ్యాచ్లో సత్తా చాటి జట్టుకు టైటిల్ని అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇక డిఫెన్స్లోనూ రెండు జట్లూ సమానంగా ఉన్నాయి. ఢిల్లీ తరఫున రవీందర్ పహల్, బెంగాల్ తరఫున బల్దేవ్ సింగ్లు ప్రత్యర్థి రైడర్లను ఒక పట్టు పట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అన్ని విభాగాల్లోనూ కాస్త ఆధిక్యంలో ఉన్న ఢిల్లీ జట్టుకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
ఫైనల్లో ఢిల్లీ, బెంగాల్
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్లో దబంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ ఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీ జట్టు 44–38తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్కు షాకిచి్చంది. ఈ మ్యాచ్లో దబంగ్ టీమ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. రైడర్లలో నవీన్ 15, చంద్రన్ రంజీత్ 9 పాయింట్లు సాధించారు. డిఫెండర్ అనిల్ 4 పాయింట్లు చేశాడు. మిగతావారిలో విజయ్, రవీందర్, జోగిందర్ తలా 3 పాయింట్లు తెచ్చిపెట్టారు. బెంగళూరు జట్టు తరఫున పవన్ షెరావత్ (18) చక్కని పోరాటపటిమ కనబరిచాడు. రెండో సెమీస్లో బెంగాల్ వారియర్స్ 37–35తో యు ముంబాపై నెగ్గింది. వారియర్స్ తరఫున సుకేశ్ (8), నబీబ„Š (5), ప్రపంజన్ (4) రాణించారు. యు ముంబా జట్టులో అభిõÙక్ 11 పాయింట్లు సాధించాడు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం శనివారం ఢిల్లీ, బెంగాల్ జట్ల మధ్య ఇక్కడే టైటిల్ పోరు జరగనుంది. -
ప్రదీప్ ప్రతాపం
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో పట్నా పైరేట్స్ రైడర్ ప్రదీప్ నర్వాల్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 36 పాయింట్లు సాధించాడు. దీంతో పట్నా 69–41తో బెంగాల్ వారియర్స్పై ఘన విజయం సాధించింది. అతడికి జాంగ్ కున్ లీ (8 పాయింట్లు), ట్యాక్లింగ్లో నీరజ్ కుమార్ (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు. ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్కు వెళ్లిన ప్రదీప్... ఏకంగా ఆరుగురిని ఔట్ చేసి రైడింగ్లో తనకు ఎదురులేదని చాటాడు. ఈ మ్యాచ్లో పట్నా ప్రత్యరి్థని నాలుగు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. బెంగాల్ తరఫున సౌరభ్ (11 పాయింట్లు), రాకేశ్ (10 పాయిం ట్లు) ఆకట్టుకున్నారు. ఈ సీజన్లో 300 పాయింట్ల మార్కును అందుకున్న రెండో రైడర్గా ప్రదీప్ (304 పాయింట్లు) నిలిచాడు. బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ 309 పాయింట్లతో ముందున్నాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 43–39తో పుణేరి పల్టన్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో తెలుగు టైటాన్స్; తమిళ్ తలైవాస్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
టైటాన్స్ పదో పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్లో తెలుగు టైటాన్స్ పదో పరాజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 39–40తో బెంగాల్ వారియర్స్ చేతిలో పోరాడి ఓడింది. టైటాన్స్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా ట్యాక్లింగ్లో సారథి అ»ొజర్ మోహజెర్ మిఘాని ‘హై–ఫై’ (5 పాయింట్లు)తో చెలరేగినా అది జట్టుకు విజయం అందించలేదు. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్గా నిలిచాడు. తాజా విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెంగాల్... టైటాన్స్ను 15వ నిమిషంలో ఆలౌట్ చేసింది. మొదటి భాగాన్ని 19–13తో ముగించింది. రెండో భాగంలో జోరు పెంచిన టైటాన్స్ ప్రత్యరి్థని ఆలౌట్ చేసింది. ఈ సమయంలో బెంగాల్ను రైడింగ్తో ఆదుకున్న మణీందర్ గెలుపు ఖాయం చేశాడు. తాజా ఓటమితో టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 43–34తో పుణేరి పల్టన్పై గెలుపొందింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా సూపర్ ‘టెన్’ (12 పాయింట్లు)తో రాణించాడు. నేటి మ్యాచ్లో పట్నా పైరేట్స్తో దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. -
పట్నా, బెంగాల్ విజయం
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన జైపూర్ పింక్ పాంథర్స్ అపజయాల బాటలో పయనిస్తుంది. గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 36–33తో జైపూర్ను చిత్తు చేసింది. స్టార్ రైడర్ దీపక్ హుడా (5 పాయింట్లు) నిరాశపరిచాడు. పట్నా తరఫున ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో చెలరేగగా... జాన్ కున్ లీ (8 పాయింట్లు) అతనికి చక్కని సహకారం అందించాడు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 42–40తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. -
హరియాణాను గెలిపించిన వికాశ్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 36–33తో బెంగాల్ వారియర్స్ను కంగుతినిపించింది. హరియాణా రైడర్ వికాశ్ కండోలా 11 పాయింట్లతో చెలరేగాడు. మరో రైడర్ వినయ్ 9 పాయింట్లతో వికాశ్కు చక్కని సహకారం అందించాడు. బెంగాల్ వారియర్స్ రైడర్ మణీందర్ సింగ్ 15 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 35–30తో పుణేరి పల్టన్పై నెగ్గింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
వారియర్స్ విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 35–26తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. రైడర్ మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి డిఫెండర్ రింకు నర్వాల్ (5 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. పట్నా తరఫున ఒంటరి పోరాటం చేసిన ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా... సహచరులు రాణించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్ లో బెంగాల్ ప్రత్యర్థిని 4 సార్లు ఆలౌట్ చేయగా... పట్నా రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఈ విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్తో యు ముంబా తలపడతాయి. -
వారియర్స్తో ‘టై’టాన్స్
అహ్మదాబాద్: గుజరాత్పై విజయంతో ఇక తెలుగు టైటాన్స్ గాడిలో పడిందని అనుకుంటే... ఆ దూకుడు కేవలం ఒక విజయానికి మాత్రమే పరిమితమైంది. సోమవారం బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్ను టైటాన్స్ 29–29తో ‘టై’ చేసుకుంది. ఈ సీజన్లో టైటాన్స్కిది రెండో ‘టై’ కావడం విశేషం. ఆట ఆరంభంలోనే సిద్ధార్థ్ దేశాయ్ తన రైడ్తో పాయింట్ తెచ్చి జట్టు ఖాతా తెరిచాడు. మ్యాచ్ మొదటి భాగంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో తెలుగు టైటాన్స్ 13–11తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ 17–12తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఆధిక్యంలో ఉన్నామన్న అతివిశ్వాసం జట్టును దెబ్బతీసింది. ప్రతి రైడర్ను పట్టేయాలని డిఫెండర్ విశాల్ భరద్వాజ్ చూపించిన అనవసరపు దూకుడు అతడిని పలుమార్లు కోర్టును వీడేలా చేసింది. అప్పటి వరకు నిలకడగా రాణించిన సిద్ధార్థ్ దేశాయ్, సూరజ్ దేశాయ్ల రైడింగ్ లయ తప్పడంతో ప్రత్యర్థులకు సులభంగా దొరికిపోయారు. ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చిన వారియర్స్ టైటాన్స్ను ఆలౌట్ చేసి 23–21తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే చివర్లో పుంజుకున్న టైటాన్స్ స్కోర్ను సమం చేసి ఊపిరి పీల్చుకుంది. టైటాన్స్ రైడర్ సూరజ్ దేశాయ్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్లో యూపీ యోధ జట్టు 35–33తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. యూపీ రైడర్ పవన్ శెరావత్ అటు రైడింగ్లో, ఇటు ప్రత్యర్థిని పట్టేయడంలోనూ చెలరేగాడు. మొత్తం 15 పాయింట్ల (6 రైడ్, 3 టాకిల్, 6 బోనస్)తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధతో హరియాణా స్టీలర్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
పట్నా: పేరుకు తగ్గట్టే బెంగాల్ వారియర్స్ అసలైన వారియర్లా పోరాడింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల అంతరాన్ని పూడ్చి విజేతగా నిలిచింది. ఒత్తిడి సమయాన ఎలా ఆడాలో మిగతా జట్లకు నేర్పింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 32–30తో యు ముంబాను ఓడించింది. అదిరే ఆరంభం లభించినా... దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. యు ముంబా రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్ ‘టెన్’తో చెలరేగినా... వారియర్స్ సమష్టి కృషి ముందు అది ఏ మాత్రం నిలవలేదు. వారియర్స్ డిఫెండర్లయిన మణీందర్ సింగ్, బల్దేవ్ సింగ్లు చెరో 5 టాకిల్ పాయింట్లతో మెరిశారు. ముంబా... విజయం ముంగిట... మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. విరామ సమయానికి ఆ జట్టు 16–11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్ రైడ్తో చెలరేగిన వారియర్ రైడర్ ప్రపంజన్ కుమార్ యు ముంబా ఆధిక్యాన్ని 14–16కు తగ్గించాడు. అనంతరం మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్ జట్టు 18–17తో ముందంజ వేసింది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్లు కనిపించిన ముంబై జట్టు వరుసగా పాయింట్లు సాధించి 26–21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటువంటి ఒత్తిడి సమయంలో ముంబైని తమ పట్టుతో పట్టేసిన బెంగాల్ డిఫెండర్లు ఆ జట్టును ఆలౌట్ చేసి... అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నారు. సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పట్నా... చివరి మ్యాచ్లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 41–20తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి గుజరాత్ అంచె పోటీలు అహ్మదాబాద్లో ఆరంభం కానున్నాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్; పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
బెంగాల్ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..
ముంబై : బెంగాల్ వారియర్స్ దూకుడుకు పుణెరి పల్టన్ కుదేలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్ ఆడిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇక బెంగాల్ ఆటగాళ్ల దూకుడైన ఆటకు పుణెరి ఆటగాళ్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. సోమవారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 43-23 తేడాతో పుణెరి పల్టాన్పై ఘన విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ రైడర్ మణిందర్ సింగ్(14) హోరెత్తించగా.. మహ్మద్ నబిబక్ష్(8), రింకూ నర్వాల్(5) రాణించారు. ఆ జట్టు స్టార్ రైడర్ ప్రపంజన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక పుణెరి ఆటగాళ్లలో ఏ ఒక్కరూ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. సారథి సుర్జీత్ సింత్ చేతులెత్తేయగా.. పంకజ్ మోహితె(6) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఇక డిఫెండర్ గిరీష్ ఎర్నాక్(3) ప్రత్యర్థి రైడర్లను కట్టడి చేయలేకపోయాడు. ఓవరాల్గా బెంగాల్ వారియర్స్ 22రైడ్, 12 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 13 రైడ్, 9 టాకిల్ పాయింట్లతో అందుకోలేకపోయింది. దీంతో పుణెరి ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి పడింది. -
గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్
ముంబై : బెంగాల్ వారియర్స్ విజయం ముంగిట బోల్తాపడింది. యూపీ యోధపై భారీ విజయంతో ఊపు మీదున్న బెంగాల్కు జైపూర్ పింక్ పాంథర్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రొ కబడ్డీ సీజన్ 7లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్ 27-25 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో బెంగాల్ నాలుగు పాయింట్లతో లీడింగ్లో ఉంది. కనీసం ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నా బెంగాల్ విజయం సాధించేదే. కానీ జైపూర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన.. బెంగాల్ ఆటగాళ్ల తొందరపాటుతో గెలుపు సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జైపూర్ విజయంలో సారథి దీపక్ హుడా, డిఫెండర్ సందీప్ దుల్లు కీలకపాత్ర పోషించారు. మ్యాచ్ను ఘనంగా ఆరంభించిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టును తొలి నాలుగు నిమిషాలు పాయింట్ల ఖాతాను తెరవనివ్వలేదు. దీంతో 0-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రపంజన్(7), మణిందర్ సింగ్(6), బల్దేవ్ సింగ్(6)లు రాణించడంతో తొలి అర్ద భాగం ముగిసే సరికి బెంగాల్ 14-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్దభాగంలోనూ బెంగాల్ ఆటగాళ్లు ఆచితూచి ఆడారు. అయితే చివర్లో తడబడటంతో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. జైపూర్ ఆటగాళ్లు సందీప్ దుల్(8), దీపక్ హుడా(6), దీపక్ నర్వాల్(4) కీలక సమయంలో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఓవరాల్గా జైపూర్ 12 రైడ్, 10 టాకిల్ పాయింట్లు సాధించగా.. బెంగాల్ 13 రైడ్, 11 టాకిల్ పాయింట్లను సాధించింది. అయితే బెంగాల్ను ఓ సారి ఆలౌట్ చేయడం, మూడు ఎక్సట్రా పాయింట్లు సాధించడం జైపూర్కు కలిసొచ్చింది. -
గర్జించిన బెంగాల్.. కుదేలైన యూపీ
హైదరాబాద్: ప్రో కబడ్డీ సీజన్ లీగ్-7 తమ తొలి మ్యాచ్లోనే బెంగాల్ వారియర్స్ జూలు విదిల్చింది. బెంగాల్ దెబ్బకు యూపీ యోదా చిత్తుచిత్తుగా ఓడింది. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏకపక్షపోరులో యూపీ యోధాపై బెంగాల్ వారియర్స్ 48-17 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో బెంగాల్ను ప్రతిఘటించిన యూపీ యోధా.. మ్యాచ్ జరిగే కొద్ది పట్టు విడిచింది. తొలుత పాయింట్ల ఖాతా తెరిచిన యూపీ 4-0తో మంచి లీడింగ్లో ఉంది. అనంతరం తొలిహాఫ్ ముగిసే సరికి యూపీ 8-11తో స్పల్ప వెనుకంజలో నిలిచింది. రెండో అర్ధభాగం ప్రారంభమయ్యాక బెంగాల్ వారియర్స్ అసలు ఆట ప్రారంభమైంది. బెంగాల్ ఆటగాళ్ల దూకుడుతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అటాకింగ్ గేమ్తో విరుచుకపడటంతో యూపీ ఆటగాళ్లకు ఏం చేయాలో పాలు పోలేదు. యూపీ స్టార్ రైడర్ మోనూ గోయత్(6) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. బెంగాల్ ఆటగాళ్లలో మహ్మద్ నబిబక్ష్ 10 పాయింట్లతో రెచ్చిపోయాడు. అతడికి తోడుగా మనిందర్ సింగ్(8), బల్దేవ్ సింగ్(7), ప్రపంజన్(5) ఆకట్టుకున్నారు. ఓవరాల్గా బెంగాల్ 24 రైడ్ పాయింట్లు, 14 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. యూపీ యోధా 10 రైడ్ పాయింట్లతో, 5 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థి జట్టును అందుకోలేకపోయింది. ఇక బెంగాల్ ధాటిక యూపీ జట్టు నాలుగు సార్లు ఆలౌటవ్వడం గమనార్హం. -
‘ప్లే ఆఫ్స్’కు యూపీ యోధ
ప్రొ కబడ్డీ లీగ్ కోల్కతా: ‘ప్లే ఆఫ్స్’కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యూపీ యోధ జట్టు సత్తా చాటింది. ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో భాగంగా గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో యూపీ యోధ 41–25తో బెంగాల్ వారియర్స్పై గెలిచి 57 పాయింట్లతో జోన్ ‘బి’ నుంచి ‘ప్లే ఆఫ్’కు చేరింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ (55 పాయింట్లు) పట్టికలో నాలుగో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కీలకమైన మ్యాచ్లో పటిష్టమైన డిఫెన్స్తో ఆకట్టుకున్న యూపీ యోధ అలవోకగా గెలిచింది. యూపీ తరఫున రిషాంక్ 9, శ్రీకాంత్, నితేశ్ చెరో 6 పాయింట్లతో చెలరేగగా... బెంగాల్ తరఫున ఆదర్శ్ 4, జాంగ్ కున్ లీ 3 పాయింట్లు సాధించారు. నామమాత్రమైన మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 40–32తో జైపూర్పింక్ పాంథర్స్పై గెలిచింది. జోన్ ‘ఎ’ నుంచి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ (93 పాయింట్లు), యు ముంబా (86 పాయింట్లు), దబంగ్ ఢిల్లీ (68 పాయింట్లు) ‘ప్లే ఆఫ్స్’కు చేరగా... జోన్ ‘బి’ నుంచి బెంగళూరు బుల్స్ (78 పాయింట్లు), బెంగాల్ వారియరర్స్ (69 పాయింట్లు), యూపీ యోధా (57 పాయింట్లు) నాకౌట్కు అర్హత సాధించాయి. ఆదివారం కొచ్చిలో జరుగనున్న ఎలిమినేటర్–1లో యు ముంబాతో యూపీ యోధ... ఎలిమినేటర్–2లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి. -
ఓటమితో ముగిసిన టైటాన్స్ పోరు
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్ను తెలుగు టైటాన్స్ పరాజయంతో ముగించింది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో టైటాన్స్ 34–39తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. ఇప్పటికే ‘ప్లే ఆఫ్’ అవకాశాలను చేజార్చుకున్న టైటాన్స్ చివరి మ్యాచ్లోనూ ఆకట్టుకోలేకపోయింది. జోన్ ‘బి’లో 22 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ 8 విజయాలు, 13 పరాజయాలు, ఒక ‘డ్రా’తో 51 పాయింట్లు సాధించి పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి సగంలో జోరు కనబరిచిన టైటాన్స్ చివరి 13 మ్యాచ్ల్లో కేవలం మూడింట మాత్రమే నెగ్గి చేజేతులా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను దూరం చేసుకుంది. మంగళవారం మ్యాచ్లో స్టార్ రైడర్లు రాహుల్ చౌదరి, నిలేశ్ బరిలో దిగలేదు. అర్మాన్ 13 పాయింట్లతో పోరాడాడు. వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 12, సుర్జీత్ సింగ్ 7 పాయింట్లు సాధించారు. తమిళ్ తలైవాస్, హరియాణా స్టీలర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 40–40తో ‘డ్రా’గా ముగిసింది. జోన్ ‘ఎ’లో హరియాణా చివరి స్థానంలో నిలవగా... జోన్ ‘బి’లో తమిళ్ తలైవాస్ చివరి స్థానంతో సీజన్ ముగించింది. నేటి మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. ఇప్పటికే జోన్ ‘ఎ’ నుంచి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, యు ముంబా, దబంగ్ ఢిల్లీ... జోన్ ‘బి’ నుంచి బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ ‘ప్లే ఆఫ్’ దశకు అర్హత సాధించాయి. చివరిదైన ఆరో బెర్త్ కోసం పట్నా పైరేట్స్ (55 పాయింట్లు), యూపీ యోధ (52 పాయింట్లు) జట్లు రేసులో ఉన్నాయి. -
దబంగ్ ఢిల్లీకి పదో విజయం
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో దబంగ్ ఢిల్లీ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన ఆ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్లో 37–31తో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది. ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన దబంగ్ ఢిల్లీ తొలి సగం ముగిసే సమయానికి 20–14తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా జోరు కనబరిచి చివరకు విజయం సాధించింది. ఢిల్లీ తరఫున మిరాజ్ షేక్ 13 పాయింట్లతో మెరవగా... బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ 9, భూపేందర్ 5 పాయింట్లు సాధించారు. లీగ్లో నేడు విశ్రాంతి రోజు. మంగళవారం జరుగనున్న మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో తమిళ్ తలైవాస్, బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
హోరాహోరీ పోరులో హరియాణా స్టీలర్స్ గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్లో హరియాణా స్టీలర్స్ ఆరో విజయం సాధించింది. బుధవారం న్యూఢిల్లీలో హరియాణా స్టీలర్స్ 35–33తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చి చివరకు హరియాణా స్టీలర్స్ గెలుపొందింది. స్టీలర్స్ తరఫున మోనూ 12 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 32–31తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. నేటి మ్యాచ్ల్లో యూపీ యోధాతో హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. -
బెంగాల్ వారియర్స్ గెలుపు
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 26–22తో పుణేరీ పల్టన్స్పై గెలిచింది. గత రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన బెంగాల్ ఈ మ్యాచ్లో చెలరేగింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 18–19తో వెనుకబడి ఉన్న బెంగాల్... రైడర్ మణీందర్ (6 పాయింట్లు) చెలరేగడంతో అనూహ్యంగా పుంజుకొని గెలుపొందింది. పల్టన్స్ తరఫున జీబీ మోరె 9 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 30–30తో టైగా ముగిసింది. నేటి మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో యూపీ యోధా తలపడతాయి. -
గుజరాత్ జెయింట్స్ గెలుపు
అహ్మదాబాద్: సొంతగడ్డపై తొలి మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ దుమ్మురేపింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో గుజరాత్ 35–23తో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన ఫార్చూన్ జెయింట్స్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 19–14తో నిలిచింది. రెండో సగంలోనూ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ సునాయాస విజయం సొంతం చేసుకుంది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 9, అజయ్ 6 పాయింట్లు సాధించారు. బెంగాల్ తరఫున మణిందర్ 6, జాంగ్ కున్ లీ 5 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 45–28తో యూపీ యోధాపై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో పుణేరీ పల్టన్తో బెంగాల్ వారియర్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్కు ఐదో గెలుపు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిన టైటాన్స్ తిరిగి పుంజుకొని పుణేరీ పల్టన్స్ను చిత్తుచేసింది. జోన్ ‘బి’లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 28–25తో పుణేరీ పల్టన్స్పై గెలిచింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 8, నీలేశ్ 6 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో కృష్ణ (4 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో 5 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 27–17తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ అనూహ్యంగా తడబడి... ప్రత్యర్థికి వరుసగా 7 పాయింట్లు సమర్పించుకొని 27–23తో నిలిచింది. ఈ దశలో రాహుల్ చౌదరి సంయమనంతో ఆడి జట్టును గెలిపించాడు. పుణేరీ పల్టన్స్ తరఫున సందీప్ నర్వాల్ 7, మోను 5 పాయింట్లు సాధించారు. ఏకపక్షంగా సాగిన మరో మ్యాచ్లో యు ముంబా 41–24తో యూపీ యోధాపై గెలుపొందింది. నేటి మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో హరియాణా స్టీలర్స్, యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్ పరాజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో తెలుగు టైటాన్స్ మూడో ఓటమి మూటగట్టుకుంది. జోన్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 25–30తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 8 పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో ఫర్హద్ (5 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్లో యు ముంబా 48–24తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో బెంగాల్ వారియర్స్, యు ముంబాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడనున్నాయి. -
పట్నా పైరేట్స్ నాలుగో విజయం
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో పట్నా పైరేట్స్కు నాలుగో విజయం...! జోన్ ‘బి’లో గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా 29–27తో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది. దీంతో సొంత గడ్డపై చివరి మ్యాచ్ను విజయంతో ముగించింది. పట్నా కెప్టెన్, ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ గాయంతో బెంచ్కే పరిమితమైన ఈ మ్యాచ్లో దీపక్ నర్వాల్ 7 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు. ట్యాక్లింగ్లో జైదీప్ (5 పాయింట్లు) రాణించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున రాన్సింగ్ 7, మహేశ్గౌడ్ 6, జాంగ్ కున్ లీ 5 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఇరు జట్లు 25–25తో నిలిచాయి. ఈ దశలో నర్వాల్ రైడింగ్లో పాయింట్ సాధించడం, ఆ వెంటనే కున్ లీ ఔట్ కావడంతో దక్కిన 2 పాయింట్ల ఆధిక్యాన్ని పట్నా కొనసాగించి గెలుపొందింది. శుక్రవారం యూపీ యోధాతో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్ తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడతాయి. -
దబంగ్ ఢిల్లీ రెండో గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో దబంగ్ ఢిల్లీ రెండో విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో అద్భుతమైన డిఫెన్స్తో అదరగొట్టిన దబంగ్ ఢిల్లీ 39–30తో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది. దబంగ్ ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 11, చంద్రన్ రంజిత్ 7 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యా క్లింగ్లో రవీందర్ పహల్ (4 పాయిం ట్లు) ఆకట్టుకున్నాడు. బెంగాల్ వారియర్స్ తరఫున జాంగ్ కున్ లీ 10, మణిందర్ సింగ్ 6, మహేశ్ గౌడ్ 5 రైడ్ పాయింట్లు సాధించారు ట్యాక్లింగ్లో సుర్జిత్ సింగ్ (2 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్లో పుణేరీ పల్టన్ 27–25తో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్; తమిళ్ తలైవాస్తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్కు తొలి ఓటమి
సోనెపట్: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ తొలి ఓటమి చవిచూసింది. జోన్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 25–30తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరీ (2 పాయింట్లు) విఫలమవడంతో టైటాన్స్కు పరాజయం తప్పలేదు. విజేత జట్టు తరఫున మణీందర్ సింగ్ 11 రైడ్ పాయింట్లతో సత్తా చాటగా... ట్యాక్లింగ్లో శ్రీకాంత్ (3 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. టైటాన్స్ తరఫున నీలేశ్ 5 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో అబోజర్ మిఘాని (5 పాయింట్లు) రాణించాడు. జోన్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–33తో హరియాణా స్టీలర్స్పై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్తో తమిళ్ తలైవాస్, హరియాణా స్టీలర్స్తో యు ముంబా తలపడనున్నాయి. -
తలైవాస్ను గెలిపించిన అజయ్
న్యూఢిల్లీ: ఉత్కంఠ భరిత మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 33–32తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. చివరి నిమిషంలో అజయ్ ఠాకూర్ సూపర్ రైడింగ్తో తలైవాస్ పాయింట్ తేడాతో గట్టెక్కింది. ఆట ఆఖరి రైడ్కు ముందు బెంగాల్ 32–31తో స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఈ దశలో కూతకు వెళ్లిన అజయ్ ఠాకూర్ రెండు పాయింట్లు తెచ్చిపెట్టడంతో విజయం ఖాయమైంది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 18–15తో ఆధిక్యంలో నిలిచిన తలైవాస్ రెండో అర్ధభాగంలోనూ ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే చివరి 10 నిమిషాల్లో బెంగాల్ రైడర్లు పాయింట్లు సాధించడంతో పోటీ రసవత్తరంగా మారింది. తలైవాస్ తరఫున అజయ్ (8), అరుణ్ (8), తివకరణ్ (5) రాణించారు. బెంగాల్ వారియర్స్ జట్టులో మణిందర్ సింగ్ (13) ఆకట్టుకున్నాడు. సుర్జీత్ సింగ్ 5, దీపక్ నర్వాల్, జంగ్ కున్ లి చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 42–24తో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లకు విరామం. -
బెంగాల్ వారియర్స్ విజయం
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో బెంగాల్ వారియర్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎనిమిదో విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన పోరులో బెంగాల్ 33–29 స్కోరుతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. బెంగాల్ రైడర్లు ఆట ఆరంభం నుంచి మ్యాచ్ ముగిసేదాకా జట్టును ఆధిక్యంలో నిలిపారు. మరోవైపు బెంగళూరు బుల్స్ ఏ దశలోనూ ప్రత్యర్థి స్కోరును అందుకోలేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి వారియర్స్ 18–10తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. బెంగాల్ రైడర్లలో మణిందర్ సింగ్ (9 పాయింట్లు) రాణించాడు. 14 సార్లు రైడింగ్కు వెళ్లిన మణిందర్ 9 పాయింట్లు తెచ్చిపెట్టాడు. టాకిల్లో సుర్జిత్ సింగ్ 5 పాయింట్లు చేశాడు. ఓవరాల్గా అతను 6 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో దీపక్ నర్వాల్ 7, రాణ్ సింగ్ 4 పాయింట్లు చేశారు. బెంగళూరు బుల్స్ తరఫున హరీశ్ నాయక్ (11) ఆకట్టుకున్నాడు. మిగతావారిలో రవీందర్ పాహల్, మహేందర్ సింగ్ తలా 5 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 34–29తో దబంగ్ ఢిల్లీపై నెగ్గింది. పుణేరి జట్టులో దీపక్ హుడా (10) అదరగొట్టాడు. రాజేశ్ మోండల్, గిరీశ్ మారుతి ఎర్నాక్ చెరో 5 పాయింట్లు చేశారు. దబంగ్ ఢిల్లీ తరఫున మిరాజ్ షేక్ (7), రోహిత్ బలియాన్ (6), అబొల్ఫజల్ (5) రాణించారు. ఆదివారం జరిగే పోటీల్లో తమిళ్ తలైవాస్తో బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్ తలపడతాయి -
తలైవాస్ మళ్లీ ఓడింది
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో ఈ ఏడాది ప్రవేశించిన సచిన్ జట్టు తమిళ్ తలైవాస్ నిరాశజనక ప్రదర్శనను కొనసాగిస్తుంది. జోన్ ‘బి’లో ఆదివారం జరిగిన పోరులో తలైవాస్ 25–29 స్కోరుతో బెంగాల్ వారియర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. లీగ్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడిన తమిళ్ తలైవాస్కు ఇది ఆరో ఓటమి కాగా... ఒకే ఒక్క మ్యాచ్లో నెగ్గింది. మరోవైపు ఆల్రౌండ్ ప్రదర్శనతో బెంగాల్ వారియర్స్ ఆరో విజయాన్ని సాధించింది. రైడింగ్లో మణిందర్ సింగ్ (6) రాణించగా, డిఫెండర్ సుర్జీత్ సింగ్ టాకిల్లో 4 పాయింట్లు చేశాడు. జాంగ్ కున్ లీ 4, వినోద్ కుమార్, రాన్ సింగ్ చెరో 3 పాయింట్లు సాధించారు. తలైవాస్ జట్టు తరఫున అమిత్ హుడా 4, ప్రపంజన్, దర్శన్, అజయ్ ఠాకూర్ తలా 3 పాయింట్లు చేశారు. అంతకుముందు జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ 31–25తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై గెలుపొందింది. సోమవారం విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్తో జైపూర్ పింక్పాంథర్స్, బెంగాల్ వారియర్స్తో హర్యానా స్టీలర్స్ తలపడతాయి. -
బెంగాల్ వారియర్స్కు మరో విజయం
నాగ్పూర్: ప్రొ కబడ్డీ లీగ్లో బెంగాల్ వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్లో వారియర్స్ 40–20తో యూపీ యోధ జట్టును చిత్తుగా ఓడించింది. బెంగాల్ ఆటగాళ్లలో వినోద్ కుమార్ 8 పాయింట్లతో చెలరేగగా, జంగ్ కున్లీ ఏడు, మణీందర్ సింగ్ ఆరు పాయింట్లతో ఆకట్టుకున్నారు. యూపీ యోధ జట్టు తరఫున సురేందర్ సింగ్ (5 పాయింట్లు) టాప్ స్కోరర్ కాగా... రాజేశ్ నర్వాల్ (3) కూడా రాణిం చాడు. మరో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ పట్నా పైరేట్స్ 46–32తో బెంగళూరు బుల్స్పై గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. పైరేట్స్ జట్టులో ప్రదీప్ నర్వాల్ 15 పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేయగా, మను గోయట్, వినోద్ కుమార్ చెరో 7 పాయింట్లు సాధించారు. బుల్స్ తరఫున రోహిత్ కుమార్ (8) అజయ్ (6) మెరుగ్గా ఆడారు. నాగ్పూర్ అంచె పోటీలకు నేడు విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్తో హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ల్ని స్టార్ స్పోర్ట్స్–2 ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
బెంగాల్ సంచలన విజయం
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో సొంతగడ్డపై తొలి మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ సంచలన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఈ జట్టు 32-25 తేడాతో పటిష్ట జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. బెంగాల్ విజయంలో జంగ్ కున్ లీ 12 రైడింగ్ పాయింట్లతో కీలకంగా వ్యవహరిం చాడు. ఈ సీజన్లో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో బెంగాల్కు ఇది కేవలం రెండో విజయం. జైపూర్కు వరుసగా ఇది రెండో పరాజయం. ఆరంభంలో 13వ నిమిషంలో ఇరు జట్ల స్కోరు 10-10తో సమానంగా ఉన్న దశలో లీ ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో ఐదు పాయింట్ల ఆధిక్యం లభించింది. తొలి అర్ధ భాగాన్ని 18-13తో ముగించిన బెంగాల్ ఆతర్వాత కూడా జైపూర్ను ఇబ్బంది పెట్టింది. డిఫెండర్ నీలేష్ షిండే నాలుగు ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. జైపూర్ నుంచి అజయ్ కుమార్ 11 రైడింగ్ పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్లో డిఫెండింగ్ చాంప్ పట్నా పైరేట్స్ 34-24 తేడాతో యు ముంబాను ఓడించింది. దీంతో 36 పాయింట్లతో జైపూర్ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ప్రొ కబడ్డీలో నేడు పుణెరి పల్టాన్ X జైపూర్ పింక్ పాంథర్స్ రాత్రి 8 గంటల నుంచి బెంగాల్ వారియర్స్ X పట్నా పైరేట్స్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం -
ఎదురులేని పట్నా పైరేట్స్
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆ జట్టు 35-21తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. దీంతో వరుసగా ఐదో విజయంతో 25 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. సూపర్ రైడింగ్తో చెలరేగిన పట్నా ఆటగాడు ప్రదీప్ నర్వాల్ 10 పాయింట్లు సాధించాడు. రాజేశ్ మోండల్ (5) ఫర్వాలేదనిపించాడు. అయితే ట్యాక్లింగ్లో అద్భుత నైపుణ్యం చూపెట్టిన ధర్మరాజు 9 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫజెల్ మూడు పాయింట్లతో సహకారం అందించాడు. రైడింగ్లో విఫలమైన వారియర్స్ తొలి అర్ధభాగానికే వెనుకబడింది. నితిన్ (7), విశాల్ (4), మోను (3) రాణించినా ప్రయోజనం లేకపోయింది. ఓవరాల్గా మ్యాచ్ మొత్తంలో పట్నా రైడింగ్లో 17, ట్యాక్లింగ్లో 15 పాయింట్లు గెలిస్తే... బెంగాల్ 13, 8 పాయింట్లతోనే సరిపెట్టుకుంది. పట్నాకు రెండు ఆలౌట్ పాయింట్లు కూడా లభించాయి. మరో మ్యాచ్లో యు ముంబా 24-23తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. ప్రస్తుతం యు ముంబా 22 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. యు ముంబా కెప్టెన్ అనుప్ కుమార్ 11 పాయింట్లతో చెలరేగాడు. రాకేశ్, సునీల్ చెరో మూడు పాయింట్లతో రాణించారు. శనివారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో పుణెరి పల్టన్; పట్నా పైరేట్స్తో ఢిల్లీ దబంగ్ తలపడతాయి. -
బెంగాల్ వారియర్స్ బోణీ
ప్రొ కబడ్డీ లీగ్ ముంబై: తమ తొలి మ్యాచ్లో తృటిలో పరాజయం పాలైన బెంగాల్ వారియర్స్ రెండో మ్యాచ్లో పుంజుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో భాగంగా సోమవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్లో 31-23 తేడాతో విజయం సాధించింది. ప్రథమార్ధం వరకు ఇరు జట్లు పోటాపోటీగా ఆడినా ఆ తర్వాత బెంగాల్ పైచేయి సాధించింది. ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణించడంతో బెంగాల్ విజయం సులువైంది. నితిన్ మదానే, మోను గోయట్ మూడేసి రైడింగ్ పాయింట్లు సాధించగా ఢిల్లీ నుంచి మెరాజ్ షేక్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడు. పట్నా విజయం: డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ విజయంతో లీగ్ను ఆరంభించింది. పుణెరి పల్టాన్తో జరిగిన మ్యాచ్లో 30-24 తేడాతో నెగ్గింది. పర్దీప్ నర్వాల్, సుర్జీత్ సింగ్ ఏడేసి పాయింట్లతో అదరగొట్టారు. పుణెరి నుంచి నితిన్ ఏడు, దీపక్ హూడా ఆరు పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్లో పుణెరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ కేసీ తలపడతాయి. -
ముంబాకు వరుసగా ఎనిమిదో గెలుపు
ముంబై: సొంత వేదికపై ముంబా జట్టు మరోసారి ఆకట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా పుణేరి పల్టన్తో జరిగిన మ్యాచ్లో యు ముంబా 30-27 పాయింట్ల తేడాతో గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబా జట్టుకిది వరుసగా ఎనిమిదో విజయం కాగా... ఓవరాల్గా పదోది. ఇప్పటికే పట్నా పైరేట్స్, ముంబా జట్లు సెమీఫైనల్ బెర్త్లను ఖాయం చేసుకోగా... మిగతా రెండు స్థానాల కోసం పుణేరి పల్టన్ (43 పాయింట్లు), బెంగాల్ వారియర్స్ (42 పాయింట్లు), తెలుగు టైటాన్స్ (38 పాయింట్లు) రేసులో ఉన్నాయి. మంగళవారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
ఎదురులేని పుణే
న్యూఢిల్లీ: తమ చివరి ఐదు మ్యాచ్ల్లో పరాజయమనేది లేకుండా వణికించిన పుణేరి పల్టన్ మరోసారి అదే స్థాయి ఆటతీరును ప్రదర్శించింది. శనివారం బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో 44-27 తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఈ జట్టు రెండో స్థానానికి చేరింది. అజయ్ ఠాకూర్ 7, మంజిత్ చిల్లార్ ఆరు రైడింగ్ పాయింట్లు సాధించారు. బెంగళూరు నుంచి దీపక్ హుడా ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడు. అయితే ఆరంభంలో బెంగళూరు నుంచి పుణే గట్టి పోటీనే ఎదుర్కోవడంతో పాటు 10వ నిమిషంలో ఆలౌట్ అయ్యింది. 10-4తో ఉన్న బెంగళూరు ఆధిక్యానికి దీపక్ హుడా సూపర్ రైడ్తో మరో మూడు పాయింట్లు వచ్చాయి. ఈ సమయంలో అంతగా ఫామ్లో లేని అజయ్ ఠాకూర్ ముగ్గురు డిఫెండర్లను అవుట్ చేసి పుణే స్కోరును పెంచాడు. దీంతో తొలి అర్ధభాగాన్ని పుణే 19-13తో ముగించింది. ద్వితీయార్ధం 32వ నిమిషం వరకు కూడా ఆట పోటాపోటీగా సాగి 24-21తో పుణే స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అయితే కొద్దిసేపట్లోనే బెంగళూరు ఆలౌట్ కావడంతో తిరిగి కోలుకోలేకపోయింది. బెంగాల్ విజయం మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 37-31 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. బెంగాల్ నుంచి జంగ్ కున్ లీ 13, నితిన్ తోమర్ 10 రైడింగ్ పాయింట్లు.. ఢిల్లీ నుంచి అనిల్ శ్రీరామ్ 12, సెల్వమణి 10 రైడింగ్ పాయింట్లు సాధించారు. ప్రస్తుతం బెంగాల్ జట్టు పుణేతో సమానంగా 42 పాయింట్లతో ఉన్నా నాలుగు పరాజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో జైపూర్ పింక్పాంథర్స్; తెలుగు టైటాన్స్తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
జైపూర్కు మరో ఓటమి
జైపూర్: సొంత వేదికపై జైపూర్ పింక్ పాంథర్స్కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా సోమవారం బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో జైపూర్ 18-34 తేడాతో ఓడింది. బెంగాల్ నుంచి జంగ్ కున్ లీ ఆరు రైడింగ్ పాయింట్లు సాధించగా, జైపూర్ తరఫున సోనూ నర్వాల్ మూడు పాయింట్లు చేశాడు. 37 పాయింట్లతో ప్రస్తుతం బెంగాల్ రెండో స్థానంలో ఉంది. -
టైటాన్స్కు మరో ఓటమి
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. బెంగాల్ వారియర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 28-32 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. ఈ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ జట్టులో సుకేశ్ ఆరు పాయింట్లు, ధర్మరాజ్ ఎనిమిది పాయింట్లు సాధించినా... కెప్టెన్ రాహుల్ చౌదరీ మరోసారి విఫలమవ్వడం ఆ జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపింది. మరో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 34-28తో పట్నా పైరేట్స్ను ఓడించింది. ముంబా జట్టుకిది ఏడో విజయంకాగా... పట్నా జట్టుకు రెండో పరాజయం. శనివారం జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్; పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
వారియర్స్కు మరో ఓటమి
పుణే: వరుసగా ఐదు మ్యాచ్ల్లో నెగ్గి ఊపు మీద కనిపించిన బెంగాల్ వారియర్స్ తడబడుతోంది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా యు ముంబాతో జరిగిన మ్యాచ్లో బెంగాల్ 21-32తో ఓడింది. ఆ జట్టుకిది రెండో పరాజయం. మరో మ్యాచ్లో పుణెరి పల్టన్ 29-27 తేడాతో బెంగళూరు బుల్స్ను ఓడించింది. -
బెంగాల్ వారియర్స్కు ఐదో విజయం
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో బెంగాల్ వారియర్స్ జట్టు ఐదో విజయాన్ని నమోదు చేసింది. జైపూర్ పింక్పాంథర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 34-20 పాయింట్ల తేడాతో గెలిచింది. విరామ సమయానికి వారియర్స్ 10-9తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధభాగంలో వారియర్స్ ఆటగాళ్లు విజృంభించి ఆడి నిలకడగా పాయింట్లు సాధించారు. నితిన్ తోమర్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి వారియర్స్ విజయంలో ముఖ్యపాత్ర పోషించగా... జాంగ్ కున్ లీ ఐదు పాయింట్లు, మహేశ్ గౌడ్, గిరీశ్ నాలుగేసి పాయింట్లు సాధించారు. మరోమ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 29-28తో బెంగళూరు బుల్స్ను ఓడించి తమ ఖాతాలో మూడో విజయాన్ని జమచేసుకుంది. ప్రస్తుతం బెంగాల్ వారియర్స్ 26 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్లో పుణేరి పల్టన్తో పట్నా పైరేట్స్ తలపడుతుంది. -
బెంగాల్కు తొలి ఓటమి
* పట్నా పైరేట్స్ విజయం * ప్రొ కబడ్డీ లీగ్ కోల్కతా: వరుసగా నాలుగు విజయాలతో దూకుడు మీదున్న బెంగాల్ వారియర్స్కు ప్రొ కబడ్డీ లీగ్లో తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో 36-31 తేడాతో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. ప్రథమార్ధం వరకు పట్నాకు బెంగాల్ గట్టిపోటీనే ఇచ్చి పాయింట్ల పరంగా 15-15తో సమానంగా నిలిచింది. అయితే ఆ తర్వాత పట్నా ఆటగాళ్ల ఆధిపత్యం ముందు బెంగాల్ నిలవలేకపోయింది. పట్నా నుంచి రోహిత్ కుమార్ 10 రైడ్ పాయింట్లు, సందీప్ నర్వాల్ 6 టాకిల్ పాయింట్లు సాధించాడు. బెంగాల్ నుంచి నితిన్ తోమర్ 9, జంగ్ కున్ లీ 7 రైడ్ పాయింట్లు సాధించారు. -
టైటాన్స్ ఓటమి
కోల్కతా: ఆరంభంలో కనబరిచిన జోరును తుదికంటా ప్రదర్శించకపోవడంతో తెలుగు టైటాన్స్కు పరాజయం ఎదురైంది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా సోమవారం పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 25-29 తేడాతో ఓడింది. దీంతో పట్నా 20 పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్లింది. తొలి పది నిమిషాలు ఆధిక్యాన్ని చూపిన టైటాన్స్ ఆ తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. పట్నా తరఫున పర్దీప్ నర్వాల్ 11 పాయింట్లు సాధించాడు. టైటాన్స్ నుంచి సుకేశ్ హెగ్డే 8, రాహుల్ చౌధరి 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో బెంగాల్ వారి యర్స్ 34-17 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. -
బెంగాల్ వారియర్స్ హ్యాట్రిక్
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ టోర్నీమెంట్లో బెంగాల్ వారియర్స్ దూసుకెళుతోంది. సొంత వేదికపై ఆదివారం పుణేరి పల్టన్తో జరిగిన మ్యాచ్లో 33-28 తేడాతో నెగ్గి వరుసగా మూడు విజయాలను ఖాతాలో వేసుకుంది. నితిన్ తోమర్ దుమ్ము రేపే ఆటతీరుతో 11 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహేశ్ గౌడ్ నాలుగు పాయింట్లు సాధించాడు. పుణేరి పల్టన్లో కెప్టెన్ మంజీత్ చిల్లార్ తన ఆల్రౌండ్ ప్రతిభతో ఆరు రైడ్ పాయింట్లు.. ఏడు టాకిల్ పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధభాగంలో 10-11తో కాస్త వెనుకబడినా అనంతరం బెంగాల్ పైచేయి సాధించింది. మరో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ గట్టి పోటీనిచ్చినప్పటికీ చివరికి జైపూర్ పింక్పాంథర్స్ 39-34 తేడాతో గట్టెక్కింది. సోమవారం జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్; బెంగాల్ వారియర్స్తో ఢిల్లీ దబంగ్ జట్టు తలపడతాయి. -
బెంగళూరు బుల్స్ కు చుక్కెదురు
బెంగళూరు: సొంతగడ్డపై ప్రొ కబడ్డీ లీగ్లో బెంగళూరు బుల్స్కు షాక్ ఎదురైంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆ జట్టు 24-34తో బెంగాల్ వారియర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో ఓడి ఐదు పాయింట్లతో జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. బుల్స్ తరఫున అమిత్ రాఠి (6), సుర్జీత్ (5), సోమ్వీర్ (4) పాయింట్లు సాధించారు. నితిన్ తోమర్ (7), గిరిష్ మారుతి (4), నీలేష్ షిండే (3)లు వారియర్స్కు పాయింట్లు అందించారు. రైడింగ్లో అద్భుతమైన నైపుణ్యం చూపెట్టిన వారియర్స్....క్యాచింగ్లో కాస్త వెనుకబడింది. ఆట 32వ నిమిషం వరకు ఒక్క పాయింట్ (21-22) మాత్రమే వెనుకబడి ఉన్న బుల్స్ ఆ తర్వాత నిరాశపర్చింది. 8 నిమిషాల్లో ఏకంగా 12 పాయింట్లు సమర్పించుకుంది. శుక్రవారం జరిగే లీగ్ మ్యాచ్ల్లో దబాంగ్ ఢిల్లీతో యు ముంబా; బెంగళూరు బుల్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
కబడ్డీ ఆడుతున్న గణనాధులు
-
పుణేరి పల్టన్కు ఊరట
పుణే : వరుస పరాజయాలతో డీలా పడిన పుణేరి పల్టన్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్-2 చివరి దశలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పుణేరి పల్టన్ 33-28 పాయింట్ల తేడాతో ఢిల్లీ దబంగ్ జట్టును ఓడించి తమ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో పుణేరి పాయింట్ల సంఖ్య 19కు పెరిగినా, లీగ్లో మాత్రం చివరిదైన ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది. జితేశ్ జోషి ఏడు పాయింట్లు, సంజయ్ కుమార్ ఆరు పాయింట్లు సాధించి పుణేరి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలి అర్ధభాగంలో ఢిల్లీ జోరు కనబరిచినా... రెండో అర్ధభాగంలో పుణేరి జట్టు పుంజుకుంది. విరామ సమయానికి ఢిల్లీ 18-11తో ఏడు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధభాగంలో పుణేరి ఆటగాళ్లు అద్భుత రైడింగ్తో ఢిల్లీ జట్టును ఆలౌట్ చేశారు. ఢిల్లీ స్టార్ ప్లేయర్స్ కాశిలింగ్, శ్రీకాంత్ రాణించినా డిఫెన్స్లో లోపాల కారణంగా ఆ జట్టు చివర్లో తడబడింది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 39-38తో జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి బెంగాల్ 24-14తో పది పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో జైపూర్ జట్టు పోరాడినా ఆఖరికి పాయింట్ తేడాతో ఓడిపోయింది. సోమవారం జరిగే ఏకైక మ్యాచ్లో యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడుతుంది. -
ప్రొ కబడ్డీ: జైపూర్పై బెంగాల్ వారియర్స్ గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా ఆదివారం బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 37-39 తేడాతో జైపూర్ పై గెలిచింది. చివర వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో డిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఒక పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. -
పుణేరి పల్టన్ బోణీ
బెంగాల్ వారియర్స్పై గెలుపు ప్రొ కబడ్డీ లీగ్-2 జైపూర్: బరిలో ఉన్న ఎనిమిది జట్లలో బోణీ కొట్టని జట్టుగా పేరున్న పుణేరి పల్టన్ ఎట్టకేలకు తొలి విజయాన్ని సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా బెంగాల్ వారియర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో పుణేరి పల్టన్ 33-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దాంతో వరుసగా నాలుగు పరాజయాలకు బ్రేక్ వేస్తూ తమ ఖాతాలో తొలి విజయాన్ని జమచేసుకుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో పుణే జట్టుకు ప్రవీణ్ నివాలి తురుపుముక్కగా నిలిచాడు. ఆరంభంలో రెండు జట్లు హోరాహోరీగా తలపడినా... విరామ సమయానికి రెండు నిమిషాలముందు పుణే ఒక్కసారిగా విజృంభించింది. ప్రవీణ్ నివాలి రైడింగ్కు వెళ్లి ఒకేసారి మూడు పాయింట్లు సంపాదించడంతో పుణే 13-10తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వజీర్ సింగ్ తన రైడింగ్లో రెండు పాయింట్లు సంపాదించడంతో పాటు బెంగాల్ ఆలౌట్ కావడంతో పుణే ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి. విరామ సమయానికి పుణే 17-10తో ముందంజలో ఉంది. రెండో అర్ధభాగంలో పుణే ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఢిల్లీ దబాంగ్తో బుధవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ జట్టు 27-35తో ఓడిపోయింది. ఈ సీజన్లో జైపూర్కిది ఐదో పరాజయం కావడం గమనార్హం. గురువారం జరిగే ఏకైక మ్యాచ్లో పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
జైపూర్కు మళ్లీ షాక్
బెంగాల్ వారియర్స్ సంచలనం {పొ కబడ్డీ లీగ్-2 కోల్కతా: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్కు మరోసారి చుక్కెదురైంది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్కు చెందిన ఈ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 28-26తో జైపూర్ పింక్ పాంథర్స్ను బోల్తా కొట్టించింది. బెంగాల్ వారియర్స్కు ఈ సీజన్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. జైపూర్ జట్టు తొలి అర్ధభాగంలో ఆకట్టుకున్నా మ్యాచ్ కొనసాగేకొద్దీ తడబాటుకులోనై మూల్యం చెల్లించుకుంది. ఒకదశలో 20-14కు ఆధిక్యంలో నిలిచింది. అయితే చివరి నిమిషాల్లో బెంగాల్ సమన్వయంతో ఆడుతూ జైపూర్ స్టార్ రైడర్ జస్వీర్ను రెండుసార్లు అవుట్ చేసింది. మ్యాచ్ ముగియడానికి కొన్ని సెకన్లు మాత్రమే ఉందనగా బెంగాల్ 25-26తో పాయింట్ వెనుకంజలో ఉంది. ఈ సమయంలో రైడింగ్కు వచ్చిన జైపూర్ ఆటగాడు సమర్జీత్ సింగ్ను నిలువరించడంతో జైపూర్ ఆలౌ టైంది. దాంతో బెంగాల్ ఖాతాలో ఒకేసారి మూడు పాయింట్లు చేరడంతో వారికి సంచలన విజయం దక్కింది. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 31-26తో పాట్నా పైరేట్స్ను ఓడించింది. కబడ్డీలోనూ బెం‘గాలి’ వీయాలి: గంగూలీ గతేడాది ఏడో స్థానంలో నిలిచి నిరాశపరిచిన బెంగాల్ వారియర్స్ ఈసారి టైటిల్పై గురి పెట్టాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. బుధవారం కోల్కతా దశ పోటీలను ప్రారంభించిన గంగూలీ ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన చేశాడు. ‘బెంగాల్కు చెందిన ఫ్రాంచైజీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఇండియన్ సూపర్లీగ్ (ఐఎస్ఎల్) టైటిల్స్ను సొంతం చేసుకున్నాయి. కబడ్డీలో బెంగాల్ వారియర్స్ ఈ ఘనత సాధించాలి. ప్రొ కబడ్డీ లీగ్ దేశవాళీ ఆటగాళ్లకు ఎంతో ఉపకరిస్తుంది’ అని గంగూలీ అన్నాడు. కబడ్డీ తన అభిమాన క్రీడ అని, చిన్నతనంలో చాలామంది ఈ క్రీడ ఆడేవారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. -
వారియర్స్పై బెంగళూరు విజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో బెంగళూరు బుల్స్ జట్టు తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కంఠీరవ ఇండోర్ స్టేడియంలో ఆదివారం బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్ను 37-24 తేడాతో నెగ్గింది. ప్రథమార్ధంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగినా ద్వితీయార్ధంలో బెంగళూరు పూర్తిగా ఆధిపత్యం చూపింది. ఈ గెలుపుతో బుల్స్ 36 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో యు ముంబ 37-30 తేడాతో దబాంగ్ ఢిల్లీపై నెగ్గింది.