Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్‌ గెలుపు | Pro Kabaddi 2022: Telugu Titans Defeat U Mumba | Sakshi
Sakshi News home page

Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్‌ గెలుపు

Nov 20 2022 5:59 AM | Updated on Nov 20 2022 5:59 AM

Pro Kabaddi 2022: Telugu Titans Defeat U Mumba - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా 11 పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు రెండో విజయం అందుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 32–26తో యు ముంబాను ఓడించింది.

టైటాన్స్‌ తరఫున సిద్ధార్థ్‌ దేశాయ్‌ తొమ్మిది పాయింట్లు, అభిషేక్‌ ఐదు పాయింట్లు, విశాల్‌ భరద్వాజ్‌ నాలుగు పాయింట్లు స్కోరు చేశారు. యు ముంబా తరఫున గుమన్‌ సింగ్‌ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్‌ ఢిల్లీ 30–27తో పట్నా పైరేట్స్‌పై... జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 42–29తో యూపీ యోధాస్‌పై గెలిచాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement