Telugu Titans
-
ఆఖరి బెర్త్ యు ముంబాదే
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్... ఆ తర్వాత పడుతూ లేస్తూ చివరకు గ్రూప్ దశతోనే పోరాటాన్ని ముగించింది. మంగళవారం ముగిసిన లీగ్ దశ చివరి మ్యాచ్లో మాజీ చాంపియన్ యు ముంబా 36–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై గెలిచి ప్లే ఆఫ్స్కు చేరింది. యు ముంబా జట్టు ఆఖరి పోరులో 48 పాయింట్ల తేడాతో ఓడిపోయి ఉంటే టైటాన్స్ ఆరో స్థానంతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేది. కానీ యు ముంబా విజయం సాధించడంతో తెలుగు టైటాన్స్ ఏడో స్థానంతో లీగ్ దశకే పరిమితమైంది. కీలక పోరులో ముంబా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అమీర్ మొహమ్మద్ 7 పాయింట్లు, అజిత్ చవాన్ 6 పాయింట్లు, సునీల్ కుమార్ 5 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ తరఫున ప్రణయ్ 12 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 22 మ్యాచ్లాడి 12 విజయాలు, 8 పరాజయాలు, 2 ‘టై’లతో 71 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యు ముంబా జట్టు పట్టికలో ఐదో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 44–30 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. యూపీ యోధాస్ తరఫున శివమ్ చౌధరీ 13 పాయింట్లు, సురేందర్ గిల్ 9 పాయింట్లతో రాణించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుశీల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. నేడు విశ్రాంతి రోజు. గురువారం జరగనున్న తొలి ఎలిమినేటర్లో యూపీ యోధాస్తో జైపూర్ పింక్ పాంథర్స్, రెండో ఎలిమినేటర్లో పట్నా పైరేట్స్తో యు ముంబా తలపడనున్నాయి. -
టైటాన్స్ గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–11)లో తెలుగు టైటాన్స్ 12వ విజయాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో టైటాన్స్ 48–36తో పుణేరి పల్టన్పై విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ జట్టును కెప్టెన్, రెయిడర్ పవన్ సెహ్రావత్ ముందుండి నడిపించాడు. 16 సార్లు రెయిడింగ్కు వెళ్లిన కెపె్టన్ 11 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. 4 బోనస్ పాయింట్లు కలుపుకొని మొత్తం 15 పాయింట్లు సాధించాడు. స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (11) కూడా క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్లలో అంకిత్ (6), అజిత్ పవార్ (3) రాణించారు. పుణేరి జట్టులో రెయిడర్ అజిత్ (10 పాయింట్లు) అదరగొట్టాడు. సబ్స్టిట్యూట్గా ఆలస్యంగా మైదానంలోకి దిగిన అజిత్ 13 సార్లు కూతకెళ్లి 10 పాయింట్లు చేశాడు. మిగతా సహచరుల్లో రెయిడర్ ఆర్యవర్ధన్ నవలె (8), డిఫెండర్లు అమన్ (5), దాదాసో పూజారి (3) రాణించారు.అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్లో జైపూర్ పింక్పాంథర్స్ 31–28తో బెంగాల్ వారియర్స్పై గెలుపొందడంతో ప్లే ఆఫ్స్కు ఐదో జట్టుగా అర్హత సాధించింది. జైపూర్ జట్టులో కెప్టెన్, రెయిడర్లు అర్జున్ దేశ్వాల్ (9), అభిజిత్ మాలిక్ (7) నిలకడగా స్కోరు చేశారు. మిగతావారిలో డిఫెండర్లు రెజా మీర్బఘేరి (5), అంకుశ్ రాఠి (3) మెరుగ్గా ఆడారు. బెంగాల్ వారియర్స్ తరఫున రెయిడర్లు ప్రణయ్ (8), అర్జున్ రాఠి (7) ఆకట్టుకున్నారు. డిఫెండర్లలో వైభవ్ గార్జే 4 పాయింట్లు చేశాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్... గుజరాత్ జెయంట్స్తో పోటీ పడనుండగా, దబంగ్ ఢిల్లీ... జైపూర్ పింక్పాంథర్స్తో తలపడుతుంది. -
PKL 11: ప్లే ఆఫ్స్లో ఢిల్లీ.. తెలుగు టైటాన్స్ పరిస్థితి?
అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ దశకు చేరింది. ఈ సీజన్లో టాప్-6కు అర్హత సాధించిన రెండో జట్టుగా జట్టు నిలిచింది. పుణె వేదికగా బెంగాల్ వారియర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో 47–25 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకుంది.ఇక ప్రొ కబడ్డి లీగ్ తాజా ఎడిషన్లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్ జట్టు ప్లే ఆఫ్స్నకు అర్హత పొందింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో 20 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఢిల్లీ జట్టు 11 మ్యాచ్ల్లో గెలిచింది. 5 మ్యాచ్ల్లో ఓడిపోయి, 4 మ్యాచ్లను ‘టై’ చేసుకొని 71 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. మొత్తం 12 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుకుంటాయి.మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్లుహరియాణా, ఢిల్లీ ఇప్పటికే తమ అర్హత సాధించగా.. మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు కావాల్సి ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బెంగాల్తో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ ఏకంగా 17 పాయింట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు 18 సార్లు రెయిడింగ్కు వెళ్లి.. తొమ్మిదిసార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. ఆరుసార్లు పాయింట్ నెగ్గకుండానే తిరిగి వచ్చాడు. మరో మూడుసార్లు విఫలమయ్యాడు.ఈ క్రమంలో.. నాలుగు బోనస్ పాయింట్లతోపాటు 12 టచ్ పాయింట్లు సాధించిన అశు ఒక ట్యాకిల్ పాయింట్ కూడా నెగ్గాడు. ఢిల్లీకే చెందిన యోగేశ్ 9 పాయింట్లు, ఆశిష్ 5 పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ తరఫున విశ్వాస్ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. నితేశ్ కుమార్ ఐదు పాయింట్లు, కెప్టెన్ ఫజల్ అత్రాచలి నాలుగు పాయింట్లు స్కోరు చేశారు.రేసులో పుణేరి పల్టన్ఇక మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 37–32 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో పట్నా పైరేట్స్ 68 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్నకు చేరువైంది. తెలుగు టైటాన్స్ ఏస్థానంలో ఉందంటే?ఇక మంగళవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇరవై మ్యాచ్లలో పదకొండు గెలిచిన తెలుగు టైటాన్స్ 60 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.చదవండి: తమిళ్ తలైవాస్ అవుట్ -
తెలుగు టైటాన్స్ గెలుపు
పుణే: రెండు వరుస పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–11)లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో టైటాన్స్ 36–32తో గుజరాత్ జెయంట్స్పై విజయం సాధించింది. స్టార్ రెయిడర్, కెప్టెన్ పవన్ సెహ్రావత్ (12 పాయింట్లు) కూతకెళ్లిన ప్రతీ సారి ప్రత్యర్థుల్ని హడలెత్తించాడు. 18 సార్లు రెయిడింగ్కు వెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచర రెయిడర్ ఆశిష్ నర్వాల్ (6) కూడా రాణించాడు. ఆల్రౌండర్ విజయ్ మాలిక్ (18) అదరగొట్టాడు. ప్రథమార్ధం ముగిసే ఆఖరి నిమిషంలో గుజరాత్ ఒకసారి తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేస్తే... ద్వితీయార్ధంలో పవన్, ఆశిష్, విజయ్లు చెలరేగడంతో ప్రత్యర్థి జట్టును స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఆలౌట్ చేసి మ్యాచ్ గెలిచింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ గుమన్ సింగ్ (9), రాకేశ్ (10) రెయిడింగ్లో ఆకట్టుకున్నారు. అనంతరం జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సంపాదించిన హరియాణ స్టీలర్స్కు దబంగ్ ఢిల్లీ షాకిచ్చిoది. ఢిల్లీ జట్టు 44–37తో స్టీలర్స్పై గెలుపొందింది. రెయిడర్, ఢిల్లీ కెపె్టన్ అషు మాలిక్ (15) అద్భుతంగా రాణించాడు. అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచరుల్లో రెయిడర్ నవీన్ (7), డిఫెండర్లు యోగేశ్ (4), ఆశిష్ (5) రాణించారు. హరియాణా జట్టులో ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా (9), రెయిడర్ శివమ్ పతారే (6) ఆదుకున్నారు.సంజయ్, నవీన్, వినయ్ తలా 3 పాయింట్లు చేశారు. జైదీప్, రాహుల్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు (ఆదవారం) జరిగే పోటీల్లో తమిళ్ తలైవాస్తో జైపూర్ పింక్పాంథర్స్... యు ముంబాతో యూపీ యోధాస్ తలపడుతుంది. -
తెలుగు టైటాన్స్ పరాజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో మరో పరాజయం చేరింది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 27–33 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్ తరఫున విజయ్ మలిక్ 10 పాయింట్లు, ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించారు. దబంగ్ ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ 11 పాయింట్లతో రాణించగా... ఆశు మలిక్ 9 పాయింట్లతో అతడికి సహకరించాడు.ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... టైటాన్స్ 20 రెయిడ్ పాయింట్లు సాధించింది. అయితే టైటాన్స్ రెండుసార్లు ఆలౌటై... ప్రత్యర్థి కి 4 పాయింట్లు సమర్పించుకోగా... ఢిల్లీ జట్టు ఒకేసారి ఆలౌటైంది. తాజా సీజన్లో 19 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ 10 విజయాలు, 9 పరాజయాలతో 55 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఆరో స్థానంలో నిలవగా... దబంగ్ ఢిల్లీ 18 మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో 61 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. యూపీ యోధాస్, బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 31–31 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 11 పాయింట్లతో రాణించగా... బెంగాల్ వారియర్స్ తరఫున ప్రణయ్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. పాయింట్ల పట్టికలో యూపీ యోధాస్ (59 పాయింట్లు) నాలుగో స్థానానికి చేరగా... బెంగాల్ వారియర్స్ (40 పాయింట్లు) 9వ స్థానంలో ఉంది. శుక్రవారం జరగనున్న మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో పట్నా పైరెట్స్ (రాత్రి 8 గంటలకు), పుణేరి పల్టన్తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి..
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జోరుకు హరియాణా స్టీలర్స్ చెక్ పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా ఏకంగా 21 పాయింట్ల తేడాతో టైటాన్స్ను ఓడించింది. స్టీలర్స్ 46–25 స్కోరుతో తెలుగు టైటాన్స్ జట్టును చిత్తు చేసింది. రెయిడర్ వినయ్ (7) ఆరంభం నుంచే క్రమం తప్పకుండా పాయింట్లు తెచి్చపెట్టడంతో హరియాణా ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మరో రెయిడర్ శివమ్ పతారే (12) కూతలో పాయింట్ల వేగం పెంచడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. మిగతా వారిలో ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా (5), డిఫెండర్లు రాహుల్ (4), సంజయ్ (3) రాణించడంతో స్టీలర్స్ ఎదురులేని విజయం సాధించింది. టైటాన్స్ తరఫున స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (13) అదరగొట్టాడు. 14 సార్లు కూతకెళ్లిన ఆశిష్ రెయిడింగ్లో 11 పాయింట్లు చేశాడు. ప్రత్యర్థి రెయిడర్లు నిలువరించి రెండు టాకిల్ పాయింట్లు సాధించాడు. కెపె్టన్ విజయ్ మాలిక్ 5, డిఫెండర్ అంకిత్ 2 పాయింట్లు చేశారు. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్లో ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడి హరియాణా 14 మ్యాచ్ల్లో గెలిచింది.4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 72 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ జట్టు 18 మ్యాచ్ల్లో 10 విజయాలు, 8 పరాజయాలతో 54 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 30–26 స్కోరుతో పుణేరి పల్టన్పై గెలుపొందింది. దబంగ్ జట్టును కెప్టెన్ అశు మలిక్ (13) ముందుండి నడిపించాడు. 19 సార్లు రెయిడింగ్కు వెళ్లిన 13 పాయింట్లు తెచ్చి పెట్టాడు. సహచరుల్లో నవీన్ కుమార్ (4), యోగేశ్ (3), ఆశిష్ (2) స్కోరు చేశారు. పుణేరి జట్టులో అత్యధికంగా రెయిడర్ మోహిత్ గోయత్ 7 పాయింట్లు చేశాడు. మిగతా వారిలో పంకజ్ మోహితె (5), ఆకాశ్ షిండే (4), అమన్ (3) రాణించారు. దబంగ్ ఢిల్లీ 17 మ్యాచ్లు ఆడి 8 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో కలిపి మొత్తం 56 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పుణేరి పల్టన్ 18 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. 7 మ్యాచ్ల్లో నెగ్గి, 8 మ్యాచ్ల్లో ఓడింది. 3 మ్యాచ్లను ‘టై’గా ముగించింది. 49 పాయింట్లతో ఏడో ర్యాంక్లో ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్తో జైపూర్ పింక్పాంథర్స్ (రాత్రి 8 గంటల నుంచి), బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ గెలుపు
పుణే: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పదో విజయంతో నాలుగో స్థానానికి ఎగబాకింది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 34–32తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. తెలుగు కెపె్టన్ విజయ్ మాలిక్ 19 సార్లు కూతకెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో ఆశిష్ నర్వాల్ (9) రాణించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ (14), మన్జీత్ (7) అదరగొట్టారు. దీంతో ఇరుజట్ల మధ్య ఆఖరిదాకా హోరాహోరీ సమరం జరిగింది. అంతకుముందు జరిగిన మ్యాచ్లో యూపీ యోధాస్ 36–33తో పుణేరి పల్టన్పై విజయం సాధించింది. యూపీ రెయిడర్ గగన్ గౌడ (15) చెలరేగాడు.17 సార్లు కూతకెళ్లిన గగన్ క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో భవాని రాజ్పుత్ (6) రాణించగా, కెప్టెన్ సుమిత్ 3, అశు సింగ్, మహేందర్, హితేశ్ తలా 2 పాయింట్లు చేశారు. పల్టన్ జట్టులో పంకజ్ మోహితే (11), మోహిత్ గోయత్ (7) రాణించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్... యూ ముంబాతో గుజరాత్ జెయంట్స్ తలపడతాయి. -
టైటాన్స్కు మరో పరాజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు ఏడో పరాజయం ఎదురైంది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో టైటాన్స్ 33–36తో యూపీ యోధాస్ చేతిలో ఓటమి పాలైంది. స్టార్ రెయిడర్ విజయ్ 11 పాయింట్లతో సత్తా చాటినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన యోధాస్ విజేతగా నిలిచింది.ఓవరాల్గా ఈ మ్యాచ్లో టైటాన్స్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా... యూపీ యోధాస్ 24 పాయింట్లతో ముందంజ వేసింది. యూపీ యోధాస్ ప్రధాన రెయిడర్ గగన్ నారంగ్ 15 పాయింట్లతో విజృంభించాడు. తాజా సీజన్లో 16 మ్యాచ్లాడిన టైటాన్స్ తొమ్మిందిట గెలిచింది. ఏడింటిలో ఓడింది. 49 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 39–32తో హరియాణా స్టీలర్స్ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్తో యు ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ ఓటమి
నోయిడా: స్టార్ రెయిడర్ విజయ్ 17 పాయింట్లతో పోరాడినా... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్కు పరాజయం తప్పలేదు. లీగ్లో భాగంగా శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 28–41 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. విజయ్ ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్ (12 పాయింట్లు), అర్జున్ దేశ్వాల్ (11 పాయింట్లు) సత్తా చాటారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ పింక్ పాంథర్స్ 22 రెయిడ్ పాయింట్లు సాధించింది. ట్యాక్లింగ్లో పింక్ పాంథర్స్ 12 పాయింట్లు సాధించగా... టైటాన్స్ 7 ట్యాక్లింగ్ పాయింట్లకే పరిమితమైంది. టైటాన్స్ మూడు సార్లు ఆలౌట్ కావడంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 6 పాయింట్లు దక్కాయి.తాజా సీజన్లో 15 మ్యాచ్లాడి 9 విజయాలు, 6 పరాజయాలతో 48 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టైటాన్స్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... జైపూర్ పింక్ పాంథర్స్ (46 పాయింట్లు) పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో పట్నా పైరెట్స్ 54–29 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. పట్నా పైరెట్స్ తరఫున దేవాంక్ 17 పాయింట్లు, అయాన్ 13 పాయింట్లతో విజృంభించగా... బుల్స్ తరఫున జై భగవాన్ 9 పాయింట్లు, ప్రదీప్ నర్వాల్ 8 పాయింట్లు సాధించారు. 25 పాయింట్ల తేడాతో నెగ్గిన పట్నా జట్టు పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
యు ముంబాపై తెలుగు టైటాన్స్ గెలుపు
నోయిడా: స్టార్ రెయిడర్లు ఆశిష్ కుమార్, విజయ్ చెరో 10 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిన టైటాన్స్... గురువారం జరిగిన పోరులో 41–35 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై ఘనవిజయం సాధించింది. అటు రెయిడింగ్, ఇటు డిఫెన్స్లో ఆకట్టుకున్న తెలుగు టైటాన్స్ జట్టు ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసి సత్తా చాటగా... యు ముంబా జట్టు టైటాన్స్ను ఒకేసారి ఆలౌట్ చేయగలిగింది. తాజా లీగ్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ 9 విజయాలు, 5 పరాజయాలతో 48 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 14 మ్యాచ్ల్లో 8 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 46 పాయింట్లతో ఉన్న యు ముంబా మూడో స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 33–29తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), గుజరాత్ జెయింట్స్తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
PKL 11: ప్రొ కబడ్డి లీగ్ ఫైనల్ తేదీ, వేదిక ఖరారు
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ వేదిక ఖరారైంది. పుణే వేదికగా ఈ మెగా టోర్నీ టైటిల్ పోరు జరుగనుంది. ఈసారి లీగ్ను మూడు నగరాల్లో నిర్వహిస్తుండగా... హైదరాబాద్ వేదికగా మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నోయిడా వేదికగా పోటీలు జరుగుతున్నాయి.ఇక.. డిసెంబర్ 3 నుంచి మూడో అంచె మ్యాచ్లు పుణేలో జరుగుతాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్, సెమీఫైనల్స్తో పాటు తుదిపోరును పుణేలోనే నిర్వహించనున్నారు. బలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న బ్యాడ్మింటన్ హాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.డిసెంబర్ 29నఇక గ్రూప్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మరోవైపు.. మూడు నుంచి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్లో తలపడతాయి. కాగ.. డిసెంబర్ 26న రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు... డిసెంబర్ 27న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. డిసెంబర్ 29న ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది.ఎనభై మ్యాచ్లు ముగిసేసరికి ప్రొ కబడ్డి లీగ్ 2024 పాయింట్ల పట్టిక ప్రస్తుతం ఇలా..1. హర్యానా స్టీలర్స్: ఆడినవి 14.. గెలిచినవి 11.. ఓడినవి మూడు.. పాయింట్లు 562. యు ముంబా: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 4.. టై.. ఒకటి.. పాయింట్లు 453. దబాంగ్ ఢిల్లీ: 14... గెలిచినవి 6... ఓడినవి ఐదు.. టై.. మూడు.. పాయింట్లు 434. తెలుగు టైటాన్స్: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 5.. పాయింట్లు 435. పట్నా పైరేట్స్: ఆడినవి 13... గెలిచినవి 7.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 436. పుణెరి పల్టన్: ఆడినవి 14... గెలిచినవి 6.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 427. జైపూర్ పింక్ పాంథర్స్: ఆడినవి 13.. గెలిచినవి 7.. ఓడినవి ఐదు.. టై ఒకటి.. పాయింట్లు 408. యూపీ యోధాస్: ఆడినవి 13... గెలిచినవి 6.. ఓడినవి 6.. టై ఒకటి.. పాయింట్లు 389. తమిళ్ తలైవాస్: ఆడినవి 13.. గెలిచినవి 5.. ఓడినవి 7.. టై ఒకటి.. పాయింట్లు 3310. బెంగాల్ వారియర్స్: ఆడినవి 13... గెలిచినవి 3.. ఓడినవి 8.. టై 2.. పాయింట్లు 2511. గుజరాత్ జెయింట్స్: ఆడినవి 13.. గెలిచివని 4.. ఓడినవి 8.. టై ఒకటి.. పాయింట్లు 2512. బెంగళూరు బుల్స్: ఆడినవి 14.. గెలిచినవి 2.. ఓడినవి 12.. పాయింట్లు 16.చదవండి: రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్ -
పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో జోరు మీదున్న తెలుగు టైటాన్స్ జట్టుకు వరుసగా మూడు విజయాల తర్వాత పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 28–31 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున విజయ్ 15 పాయింట్లతో సత్తాచాటగా.. ఆశీష్ నర్వాల్ 7 పాయింట్లు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రతీక్ దహియా 11 పాయింట్లతో రాణించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 16 రెయిడ్ పాయింట్లు సాధించగా... తెలుగు టైటాన్స్ 21 పాయింట్లు సాధించింది. అయితే ట్యాక్లింగ్లో జెయింట్స్ 12 పాయింట్లతో సత్తాచాటగా... టైటాన్స్ 6 పాయింట్లకే పరిమితమై పరాజయం పాలైంది. తాజా సీజన్లో 13 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ 8 విజయాలు, 5 పరాజయాలతో 43 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్కు ఇది మూడో విజయం కాగా... 20 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 43–30 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. స్టీలర్స్ తరఫున వినయ్, శివమ్ చెరో 11 పాయింట్లతో కదంతొక్కగా... జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. హరియాణా స్టీలర్స్ 13 మ్యాచ్ల్లో 10 విజయాలు 3 పరాజయాలతో 51 పాయింట్లతో పట్టిక ‘టాప్’లో నిలిచింది. లీగ్లో భాగంగా ఆదివారం పుణేరి పల్టన్తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరెట్స్తో యూపీ యోధాస్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్దే పైచేయి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ‘హ్యాట్రిక్’ విజయాలతో పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 31–29తో బెంగాల్ వారియర్స్ పై నెగ్గింది. కెప్టెన్ విజయ్ మలిక్ (14 పాయింట్లు) అద్భుతంగా రాణించాడు. మ్యాచ్ కీలక దశలో రెయిడింగ్కు వెళ్లిన విజయ్ మూడు పాయింట్లు తెచ్చిపెట్టడం టైటాన్స్ విజయానికి కారణమైంది. డిఫెన్స్లోనూ తెలుగు జట్టు ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చేసింది. ఆల్రౌండర్ శంకర్ గడాయ్, డిఫెండర్ అంకిత్, రెయిడర్ మన్జీత్ తలా 3 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున రెయిడర్ ప్రణయ్ రాణే (9) అదరగొట్టాడు. తొలి అర్ధభాగాన్ని 19–9తో టైటాన్స్ ముగించగా... ద్వితీయార్ధంలో ప్రణయ్ క్రమంగా తెచ్చిపెట్టిన పాయింట్లతో రేసులోకి వచ్చింది. మిగతా వారిలో హేమరాజ్, విశ్వాస్ చెరో 4 పాయింట్లు చేశారు. అయితే తెలుగు కెప్టెన్ విజయ్ మలిక్ చేసిన పోరాటంతో విజయం దక్కింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 32–26తో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. స్టీలర్స్ జట్టులో రెయిడర్ వినయ్ (12) ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా 4, రెయిడర్ శివమ్ 5, డిఫెండర్ సంజయ్ 4 పాయింట్లు చేశారు. బుల్స్ జట్టులో ఒక్క అక్షిత్ (7) మాత్రమే నిలకడగా స్కోరు చేశాడు. స్టార్ రెయిడర్, కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ (1) ఆకట్టుకోలేకపోయాడు. నితిన్ రావల్ (4), జై భగవాన్ (3) మెరుగ్గా ఆడారు. ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన హరియాణా 9 విజయాలతో టాప్లో నిలువగా, 12 మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచిన టైటాన్స్ రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ దూకుడు
నోయిడా: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో ఏడో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్లో ‘టేబుల్ టాపర్’ హరియాణా స్టీలర్స్ను మట్టికరిపించిన టైటాన్స్... తాజాగా పట్టికలో రెండో స్థానంలో ఉన్న యు ముంబాను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 31–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టైటాన్స్ జట్టు రెయిడింగ్లో విఫలమైనా... డిఫెన్స్లో రాణించింది. టైటాన్స్ తరఫున ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించగా... సాగర్ నర్వాల్, అజిత్ పవార్, మన్జీత్ తలా 4 పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున రోహిత్ 8 పాయింట్లు, మన్జీత్ 7 పాయింట్లతో పోరాడారు. ఓవరాల్గా మ్యాచ్లో టైటాన్స్ 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... యు ముంబా 18 పాయింట్లు సాధించింది. లీగ్లో 11 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ 7 విజయాలు, 4 పరాజయాలతో 37 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు యు ముంబా 12 మ్యాచ్లాడి 7 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో ఉంది. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. నేడు బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
పుష్ప 2 ఫేమస్ డైలాగ్.. ప్రొ కబడ్డీలోనూ వాడేశారు!
పుష్ప-2 ఆ పేరు వింటే చాలు ఎవరికైనా పూనకం రావాల్సిందే. అంతలా సినీప్రియులను ఊపేస్తోంది తాజాగా రిలీజైన ట్రైలర్. ఆ డైలాగ్స్, ఆ మేనరిజం బన్నీ ఫ్యాన్స్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఊపేస్తున్నాయి. నవంబర్ 17న పాట్నా వేదికగా భారీస్థాయిలో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేశారు. దేశంలో ఇంతవరకు ఏ భారతీయ సినిమాకు రాని రికార్డులను పుష్ప-2 సాధించింది.అయితే పుష్పలోని ఆ డైలాగ్ చెబితే ఫ్యాన్స్కే కాదు.. ఎవరికైనా పూనకాలే. అంతలా ఫేమస్ అయింది. పుష్ప-2 ట్రైలర్లో 'పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్' అనే బన్నీ డైలాగ్ ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఇలాంటి ఫేమస్ డైలాగ్ను ప్రొ కబడ్డీ లీగ్లోనూ వాడేశారు.ఈ సీజన్లో విజయాలతో జోరుమీదున్న తెలుగు టైటాన్ టీమ్ ప్రత్యేకంగా పోస్టర్ను షేర్ చేసింది. ఈ డైలాగ్తో ఉన్న టీమ్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. 'టైటాన్స్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ను పుష్ప టీమ్ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. టైటన్స్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ 🔥#ProKabaddi #PKL11 #LetsKabaddi #ProKabaddiOnStar #TeluguTitans pic.twitter.com/EZXQMMkOKD— ProKabaddi (@ProKabaddi) November 18, 2024 -
తెలుగు టైటాన్స్ తడాఖా
నోయిడా: తెలుగు టైటాన్స్ ఈ సీజన్లో చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న హరియాణా స్టీలర్స్కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్కు ముందు పది మ్యాచ్లాడిన హరియాణా స్టీలర్స్ కేవలం 2 మ్యాచ్ల్లోనే ఓడి, ఎనిమిదింట విజయం సాధించిది. అలాంటి మేటి ప్రదర్శన కనబరుస్తున్న హరియాణాపై తెలుగు టైటాన్స్ సాధికార విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ పోరులో కీలకమైన ఆటగాడు, కెప్టెన్ పవన్ సెహ్రావత్ గాయంతో బరిలోకి దిగలేదు. అయినా సరే టైటాన్స్ 49–27తో స్టీలర్స్కు ఊహించని పరాజయాన్ని రుచి చూపించింది. ఆట ఆరంభమైన పది నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్ రెయిడర్లు, డిఫెండర్లు సత్తా చాటుకోవడంతో హరియాణా ఆలౌటైంది. సరిగ్గా ప్రథమార్ధం ముగిసే సమయానికి (20 నిమిషాలు) మళ్లీ ఆలౌట్ చేసిన టైటాన్స్ ఆధిక్యాన్ని 23–11కు పెంచకుంది. ద్వితీయార్ధంలో స్టీలర్స్ పాయింట్లు చేసినప్పటికీ క్రమం తప్పకుండా తెలుగు టైటాన్స్ చేస్తున్న స్కోరును ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. రెయిడర్లు ఆశిష్ నర్వాల్ (11 పాయింట్లు), కెపె్టన్ విజయ్ మలిక్ (8) అదరగొట్టారు. డిఫెండర్ సాగర్, ఆల్రౌండర్ శంకర్ చెరో 5 పాయింట్లు చేశారు. హరియాణా తరఫున కెప్టెన్ రాహుల్ (6), ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా (5), రెయిడర్ జయసూర్య (5) రాణించారు. ప్రస్తుతం 10 మ్యాచ్లాడిన తెలుగు జట్టు ఆరో విజయంతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అనంతరం హోరాహోరిగా జరిగిన రెండో మ్యాచ్లో యు ముంబా 38–37 ఒకే ఒక్క పాయింట్ తేడాతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. ముంబా తరఫున రెయిడర్ అజిత్ చౌహాన్ (10) ఆకట్టుకున్నాడు. అమిర్ మొహమ్మద్, కెప్టెన్ సునీల్ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. బెంగళూరు జట్టులో ప్రదీప్ నర్వాల్ (10), సుశీల్ (6), నితిన్ రావల్ (6) రాణించారు. నేడు జరిగే పోటీల్లో పుణేరి పల్టన్తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటల నుంచి)... బెంగళూరు బుల్స్తో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో వరుసగా నాలుగు విజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టుకు పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 34–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున విజయ్ మలిక్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్ పవన్ సెహ్రావత్ 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. యూపీ యోధాస్ తరఫున భవాని రాజ్పుత్ 12, భరత్ 11 పాయింట్లు సాధించారు. తాజా సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ 5 విజయాలు, 4 పరాజయాలలతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ యోధాస్ లీగ్లో నాలుగో మ్యాచ్ నెగ్గి 25 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో యు ముంబా 35–32 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. యు ముంబా తరఫున మన్జీత్ 10 పాయింట్లు, అజిత్ చవాన్ 8 పాయింట్లు సాధించగా... తలైవాస్ తరఫున మోయిన్ 10 పాయింట్లతో పోరాడాడు. 10 మ్యాచ్లాడి 6వ విజయం నమోదు చేసుకున్న యు ముంబా జట్టు 34 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరగా... వరుసగా నాలుగో మ్యాచ్లో ఓటమి పాలైన తమిళ్ తలైవాస్ 22 పాయింట్లతో పట్టికలో 10వ స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
PKL 11: దుమ్ములేపిన టైటాన్స్.. ఉత్కంఠ పోరులో ఆఖరి నిమిషంలో గెలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(PKL) పదకొండో సీజన్లో భాగంగా.. సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. టేబుల్ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్కు ఊహించని షాకిచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది. ఆట ఆఖరి నిమిషాల్లో విజయ్ మాలిక్ ప్రతిభతో పుణెరికి చెక్ పెట్టి వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది.కాగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 34–33 తేడాతో పుణెరిని ఓడించింది. టైటాన్స్ జట్టులో విజయ్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు.ఇక పుణెరి జట్టులో పంకజ్ మోహితే 9 పాయింట్లతో సత్తా చాటగా.. అతడికి తోడుగా అజిత్ కుమార్ ఆరు,మోహిత్ గోయత్ ఐదు పాయింట్లతో రాణించారు. అయినప్పటికీ ఆఖరికి ఓటమి నుంచి పుణెరి తప్పించుకోలేకపోయింది.ఆధిపత్యం చేతులు మారగాకాగా ఆట ఆరంభంలోనే తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ వరుస రెయిడ్ పాయింట్లకు తోడు డిఫెండర్లు కూడా రాణించారు. ఇక తన మూడు రెయిడ్స్ లో పవన్ నాలుగు పాయింట్లు రాబట్టగా.. టైటాన్స్ 5–0 ఆధిక్యంతో ఆటలో ఆధిపత్యం కనబరిచింది. ఈ క్రమంలో పుణెరి జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలిపోవడంతో ఆ జట్టు ఆలౌట్ ప్రమాదం ముంగిట నిలిచింది.ఇలాంటి దశలో పంకజ్ బోనస్ పాయింట్తో పుణెరి ఖాతా తెరిచాడు. పవన్ మరో టచ్ పాయింట్ట రాబట్టగా.. పుణెరి కోర్టులో పంకజ్ ఒక్కడే మిగిలాడు. తీవ్ర ఒత్తిడిలో కూతకు వెళ్లిన పంకజ్ బోనస్, సూపర్ రెయిడ్తో మూడు పాయింట్లతో జట్టును ఆదుకున్నాడు. ఆ వెంటనే పవన్ను సూపర్ ట్యాకిల్ చేసిన పుణెరి 6–6తో స్కోరు సమం చేసింది.తొలి అర్ధభాగం 20–20తో సమంగా అస్లాం, పంకజ్ చెరో పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన విజయ్ను ట్యాకిల్ చేసిన పుణెరి డిఫెండర్లు తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేశారు. దాంతో పుణెరి 13–9తో ఆధిక్యంలోకి వెళ్లింది. జట్టు మొత్తం కోర్టుపైకి వచ్చిన తర్వాత టైటాన్స్ తిరిగి పుంజుకుంది. పవన్ తన జోరు కొనసాగిస్తూ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు.మరో రెయిడర్ విజయ్ మాలిక్ కూడా ఆకట్టుకోగా.. డిఫెన్స్ విభాగం కూడా మెరుగవ్వడంతో పుణెరిని ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న తెలుగు జట్టు 20–18తో తిరిగి ఆధిక్యం సాధించింది. కానీ, విరామం ముంగిట పవన్ ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోవడంతో తొలి అర్ధభాగం 20–20తో సమంగా ముగిసింది.ఆఖరికి టైటాన్స్ పైచేయిరెండో అర్ధభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. ఇరు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లడంతో ఆట సమంగా సాగింది. విరామం తర్వాత పది నిమిషాల్లో చెరో నాలుగు పాయింట్లు మాత్రమే రాబట్టాయి. అటు టైటాన్స్, ఇటు పల్టాన్ ఏ మాత్రం తప్పిదానికి తావివ్వకుండా ఆడే ప్రయత్నం చేశాయి.ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో ఎక్కువగా ఎమ్టీ రెయిడ్స్ వచ్చాయి. టైటాన్స్ ఒక్కో పాయింట్ ఆధిక్యంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసినా పుణెరి వెంటనే స్కోరు సమం చేయడంతో ఆట ఉత్కంఠగా సాగింది. అయితే రెండో భాగంలో పవన్ సెహ్రావత్ వేగం తగ్గింది. విజయ్ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నా.. టైటాన్స్ కోర్టులో తక్కువ మంది ఉండటంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఓ దశలో 31–29తో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆలౌట్ అయింది. దాంతో పుణెరి 33–32తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి నిమిషంలో విజయ్ ఒక రెయిడ్ పాయింట్తో పాటు అజిత్ కుమార్ను ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. -
టైటాన్స్ అదుర్స్.. తలైవాస్పై ఉత్కంఠ విజయం
హైదరాబాద్, నవంబర్ 6: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-34 తేడాతో తమిళ్ తలైవాస్పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్-8వ సీజన్ తర్వాత తలైవాస్పై టైటాన్స్కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్ నార్వల్(9), విజయ్ మాలిక్(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్ జట్టులో సచిన్ 17 పాయింట్లతో టాప్స్కోరర్గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. సచిన్కు తోడు నితీశ్కుమార్(4), నరేందర్(3) ఫర్వాలేదనిపించారు. పీకేఎల్లో 1000 పాయింట్ల క్లబ్లో సచిన్ తాజాగా చేరాడు. వరుసగా హ్యాట్రిక్ విజయంతో టైటాన్స్ 21 పాయింట్లతో 4వ స్థానంలోకి దూసుకురాగా, తలైవాస్ 21 పాయింట్లతో మూడులో ఉంది.ఇరు జట్లు హోరాహోరీగా..లీగ్ సాగుతున్న కొద్దీ జట్ల మధ్య పోరు నువ్వానేన్నా అన్నట్లు హోరాహోరీగా సాగుతున్నది. గత సీజన్లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన తెలుగు టైటాన్స్ ఈసారి అంచనాలకు అనుగుణంగా ముందుకెళుతున్నది. స్థానిక అభిమానుల మద్దతుతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. లీగ్లో ప్లేఆఫ్స్కు సాధించాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. ప్రతీ పాయింట్ను కీలకంగా భావిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య పోరులో తొలి అర్ధభాగం ఉత్కంఠగా సాగింది. తొలి 20 నిమిషాల ఆట ముగిసే సరికి టైటాన్స్ 20-17 తేడాతో తలైవాస్పై ఆధిక్యం ప్రదర్శించింది. స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ తనదైన జోరు కనబరుస్తూ టైటాన్స్ కీలక పాయింట్లు అందించాడు. తొలి రెండు రైడ్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన పవన్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. మ్యాచ్ 18వ నిమిషంలో విజయ్ మాలిక్ రైడ్తో టైటాన్స్ పాయింట్ల వేట ప్రారంభించింది. మరో ఎండ్లో పవన్ కూడా జతకలువడంతో టైటాన్స్ టాప్గేర్లోకి దూసుకొచ్చింది. మ్యాచ్ 12వ నిమిషంలో హిమాంశు, రోనక్ ఇద్దరిని పవన్ ఔట్ చేయడం ద్వారా తలైవాస్ తొలిసార ఆలౌటై టైటాన్స్కు నాలుగు పాయింట్లు సమర్పించుకుంది. సబ్స్టిట్యూట్గా వచ్చిన సచిన్ 11వ నిమిషంలో కిషన్, అశిష్ను ఔట్ చేసి తలైవాస్ను పోటీలోకి తీసుకొచ్చాడు. ఇక్కణ్నుంచి పోటీ మరింత రంజుగా మారింది. 6వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్కు వచ్చిన టైటాన్స్ రైడర్ అశిష్ నార్వల్..అభిషేక్ను ఔట్ చేసి పాయింట్ కొల్లగొట్టాడు. తొలి అర్ధభాగం మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్కు వెళ్లిన పవన్ను..నితీశ్కుమార్ సూపర్ ట్యాకిల్తో కట్టడి చేశాడు.పవన్, సచిన్ దూకుడుఓవైపు టైటాన్స్ తరఫున పవన్, మరోవైపు తలైవాస్కు సచిన్ పాయింట్ల వేటలో తమదైన దూకుడు ప్రదర్శించారు. రైడ్కు వెళ్లడం ఆలస్యం పాయింట్ పక్కా అన్న రీతిలో దూసుకెళ్లారు. ప్రథమార్ధంలో తలైవాస్పై ఒకింత పైచేయి సాధించిన టైటాన్స్..కీలకమైన ద్వితీయార్ధంలో తడపబడింది. ఇదే అదనుగా తలైవాస్ తమ దాడులకు పదునుపెట్టింది. ఈ క్రమంలో మ్యాచ్ 14వ నిమిషంలో టైటాన్స్ ఆలౌటైంది. రెండు జట్ల రైడర్లు, డిఫెండర్లు తుదికంటా పోరాడటంతో మ్యాచ్ రసపట్టుగా సాగింది. దాదాపు ఆఖరి రైడ్కు వెళ్లిన సచిన్ ఔట్ కావడంతో తలైవాస్ గెలుపు ఆశలపై టైటాన్స్ నీళ్లు చల్లింది. మొత్తంగా పవన్, సచిన్ రైడింగ్ జోరు అభిమానులను కట్టిపడేసింది. -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్
హైదరాబాద్, 2 నవంబర్ 2024 : తెలుగు టైటాన్స్ పంజా విసిరింది. బెంగళూర్ బుల్స్ను బోల్తా కొట్టించి సీజన్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ మూడు పాయింట్ల తేడాతో బెంగళూర్ బుల్స్పై గెలుపొందింది. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పవన్ సెహ్రావత్ (14 పాయింట్లు), ఆశీష్ నర్వాల్ (6 పాయింట్లు), అజిత్ పవార్ (5 పాయింట్లు), విజయ్ మాలిక్ (5 పాయింట్లు) అదరగొట్టారు. బెంగళూర్ బుల్స్ తరఫున ఆల్రౌండర్లు పంకజ్ (9 పాయింట్లు), నితిన్ రావల్ (7 పాయింట్లు), రెయిడర్ అజింక్య పవార్ (9 పాయింట్లు), డిఫెండర్ అరుల్ నంద బాబు వేలుస్వామి (4 పాయింట్లు) రాణించారు. తెలుగు టైటాన్స్కు ఇది ఆరు మ్యాచుల్లో మూడో విజయం కాగా.. బెంగళూర్ బుల్స్కు ఆరు మ్యాచుల్లో ఇది ఐదో పరాజయం కావటం గమనార్హం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రెయిడర్ పవర్ సెహ్రావత్ సీజన్లో అత్యధిక రెయిడ్ పాయింట్లు (65) సాధించిన ఆటగాడిగా నిలిచాడు.తెలుగు టైటాన్స్ పంజా : ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. బెంగళూర్ బుల్స్పై ధనాధన్ ప్రదర్శన చేసింది. కూతలో టైటాన్స్ కేక అనిపించగా తొలి పది నిమిషాల్లోనే తెలుగు జట్లు ఏకంగా 15 పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు పవన్ సెహ్రావత్, ఆశీష్ నర్వాల్లు కూతకెళ్లి బుల్స్ను ఆలౌట్ చేశారు. దీంతో 18-3తో తెలుగు టైటాన్స్ తిరుగులేని స్థానంలో నిలిచింది. తర్వాతి పది నిమిషాల ఆటలో బెంగళూర్ బుల్స్ కాస్త కోలుకుంది. డిఫెండర్లు మెరవటంతో సూపర్ ట్యాకిల్స్తో పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలో తెలుగు టైటాన్స్ 23-12తో నిలిచింది. విరామ సమయానికి 11 పాయింట్ల ముందంజలో నిలిచింది.బుల్స్ మెరుపు వేగంతో.. : విరామం అనంతరం బెంగళూర్ బుల్స్ భిన్నమైన ఆటను ప్రదర్శించింది. ద్వితీయార్థం ఆట మొదలైన నాలుగు నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేసింది. చివరి ఎనిమిది నిమిషాల ఉండగా మరోసారి టైటాన్స్ ఆలౌట్ చేసింది. మెరుపు ట్యాకిల్స్కు కూత పాయింట్లు సైతం తోడయ్యాయి. దీంతో భారీ వెనుకంజ నుంచి పుంజుకుని 31-33తో రేసులోకి వచ్చింది బెంగళూర్ బుల్స్. స్టార్ రెయిడర్ పవర్ సెహ్రావత్ విఫలమైతే.. టైటాన్స్ శిబిరం నైరాశ్యంలో పడటం ప్రతికూలంగా మారింది. ఆఖరు వరకు టైటాన్స్కు పోటీ ఇచ్చిన బెంగళూర్ బుల్స్ ద్వితీయార్థంలో 23 పాయింట్లు సాధించగా.. ఆతిథ్య జట్టు 15 పాయింట్లు మాత్రమే సాధించింది. -
ఆశీష్ మెరిసే.. టైటాన్స్ మురిసే
హైదరాబాద్, 28 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి నుంచి పుంజుకున్న తెలుగు టైటాన్స్.. సోమవారం హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై మెరుపు విజయం సాధించింది. ప్రథమార్థంలో వెనుకంజ వేసిన టైటాన్స్.. ద్వితీయార్థంలో దుమ్మురేపే ప్రదర్శన చేసింది. 2 పాయింట్ల తేడాతో సీజన్లలో రెండో విజయం సాధించి.. వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. తెలుగు టైటాన్స్ రెయిడర్లు ఆశీష్ నర్వాల్ (9 పాయింట్లు), పవన్ సెహ్రావత్(5 పాయింట్లు), డిఫెండర్ అంకిత్ (4 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున రెయిడర్లు దేవాంక్(7 పాయింట్లు), అయాన్ (6 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్కు మూడు మ్యాచుల్లో ఇది రెండో ఓటమి కాగా.. తెలుగు టైటాన్స్కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో విజయం కావటం విశేషం. ప్రథమార్థం హోరాహోరీ : వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్.. పట్నా పైరేట్స్తో మ్యాచ్లో సైతం శుభారంభం చేయలేదు. స్టార్ రెయిడర్ పవన్ సెహ్రావత్ తొలి కూతలోనే అవుట్ కాగా.. ఐదు నిమిషాల వరకు అతడు బెంచ్పైనే కూర్చుకున్నాడు. ఆరో నిమిషంలో పవన్ సెహ్రావత్ రాకతో తెలుగు టైటాన్స్ పాయింట్ల వేట మొదలైంది. పది నిమిషాల అనంతరం 5-7తో టైటాన్స్ రెండు పాయింట్ల వెనుకంజలో నిలిచింది. కానీ ఆ తర్వాత పట్నా పైరేట్స్కు గట్టి పోటీ ఇచ్చింది. పైరేట్స్ రెయిడర్లలో అయాన్, దేవాంక్లు మెరువగా.. డిఫెండర్లు దీపక్, అంకిత్లు ఆకట్టుకున్నారు. దీంతో ప్రథమార్థం అనంతరం పట్నా పైరేట్స్ 13-10తో మూడు పాయింట్ల ముందంజలో నిలిచింది. రెయిడింగ్, డిఫెన్స్లో పైరేట్స్తో సమవుజ్జీగా నిలిచిన టైటాన్స్.. అదనపు పాయింట్ల రూపంలో ఆధిక్యాన్ని కోల్పోయింది. పుంజుకున్న టైటాన్స్ : విరామం అనంతరం తెలుగు టైటాన్స్ గొప్పగా పుంజుకుంది. ఓ ట్యాకిల్, ఓ రెయిడ్ పాయింట్తో 12-13తో పాయింట్ల అంతరాన్ని కుదించింది. పవన్ సెహ్రావత్కు ఆశీష్ నర్వాల్ జతకలిశాడు. దీంతో టైటాన్స్ వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ద్వితీయార్థం తొలి పది నిమిషాల్లో పది పాయింట్లు సాధించిన టైటాన్స్ 20-18తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సొంతం చేసుకుంది. పట్నా పైరేట్స్ రెయిడర్లు దేవాంక్, అయాన్లు మెరవటంతో తెలుగు టైటాన్స్పై ఒత్తిడి పెరిగింది. 22-21తో ఆధిక్యం ఒక్క పాయింట్కు చేరుకుంది. ఈ సమయంలో ఆశీష్ నర్వాల్ సూపర్ రెయిడ్తో అదరగొట్టాడు. మూడు పాయింట్లు తీసుకొచ్చి 25-21తో టైటాన్స్ను ఆధిక్యంలో నిలిపాడు. పైరేట్స్కు అయాన్ సూపర్ రెయిడ్ ఇవ్వగా.. ఆ జట్టు 25-25తో స్కోరు సమం అయ్యింది. ఆఖరు నిమిషంలో ఒత్తిడిలోనూ అద్బుతంగా రాణించిన తెలుగు టైటాన్స్ చివరి రెండు కూతల్లో పాయింట్లు సాధించింది. 28-26తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. -
టైటాన్స్ పరాజయాల ‘హ్యాట్రిక్’
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ను విజయంతో మొదలుపెట్టిన తెలుగు టైటాన్స్ తర్వాత వరుసగా ఓడిపోతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 37–41 స్కోరు తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో కంగుతింది. తెలుగు టైటాన్స్కు వరుసగా ఇది మూడో ఓటమి. కెప్టెన్ పవన్ సెహ్రావత్ జట్టును గెలిపించేందుకు చక్కని పోరాటమే చేశాడు. 17 సార్లు కూతకెళ్లిన పవన్ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. 6 బోనస్ పాయింట్లు సహా మొత్తం 18 పాయింట్లు సాధించాడు. మరో రెయిడర్ ఆశిష్ నర్వాల్ (9) కూడా రాణించాడు. మిగతా వారిలో ఆల్రౌండర్ విజయ్ మాలిక్ 3, డిఫెండర్ సాగర్ 2 పాయింట్లు తెచ్చారు. అయితే ప్రత్యర్థి దబంగ్ ఢిల్లీ జట్టు తరఫున రెయిడర్లు కెపె్టన్ నవీన్ కుమార్, అశు మాలిక్ చెలరేగారు. ఇద్దరు చెరో 15 పాయింట్లతో జట్టు విజయానికి బాట వేశారు.వీళ్లిద్దరు క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టడంతో తెలుగు టైటాన్స్ ఆఖరిదాకా పోరాడిన ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లాడిన టైటాన్స్ ఒక్క మ్యాచ్లో గెలిచి మూడింట ఓడింది. మూడు మ్యాచ్లాడిన ఢిల్లీ రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగే పోటీల్లో జైపూర్ పింక్పాంథర్స్తో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది. యూపీ యోధాస్ను గుజరాత్ జెయింట్స్ ఢీకొంటుంది. బెంగాల్, యూ ముంబా మ్యాచ్ టై అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్లో యూ ముంబా, బెంగాల్ వారియర్స్ హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ 31–31 స్కోరు వద్ద టై అయ్యింది. వారియర్స్ జట్టులో రెయిడర్ మణిందర్ సింగ్ (8 పాయింట్లు), డిఫెండర్ మయూర్ కదం (6) అదరగొట్టారు. ఒకరు కూతకెల్లి పాయింట్లు తెస్తుంటే మరొకరు ప్రత్యర్థి రెయిడర్లను టాకిల్ చేసి పాయింట్లు సాధించారు. మిగిలిన వారిలో నితీశ్ కుమార్ (4), సుశీల్ కాంబ్రేకర్ (3), నితిన్ ధన్కర్ (3), కెప్టెన్ ఫజల్ అత్రాచలి (3) మెరుగ్గా ఆడారు. యూ ముంబా జట్టులో రెయిడర్ మన్జీత్ (7 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. -
తెలుగు టైటాన్స్కు రెండో ఓటమి
హైదరాబాద్, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జైపూర్ 52–22 తేడాతో తెలుగు టైటాన్స్ను ఓడించింది. జైపూర్ జట్టులో అర్జున్ తో పాటు అభిజీత్ మాలిక్ (8) కూడా ఆకట్టుకున్నాడు. ఆతిథ్య టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ (7 ), విజయ్ మాలిక్ ( 5), ఆశీష్ నర్వాల్ (5) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో డిఫెన్స్లో పూర్తిగా తేలిపోయిన టైటాన్స్ నాలుగుసార్లు ఆలౌటైంది.ఇరు జట్ల మధ్య ఆరంభం నుంచి ఆట హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగం మొదటి పది నిమిషాల్లో తెలుగు టైటాన్స్ మెప్పించగా.. చివరి పది నిమిషాల్లో జైపూర్ పింక్ పాంథర్స్ పైచేయా సాధించింది. తన తొలి రైడ్లోనే టచ్ పాయింట్తో కెప్టెన్ పవన్ సెహ్రావత్ తెలుగు టైటాన్స్ ఖాతా తెరిచాడు. ఆ వెంటనే అర్జున్ దేశ్వాల్ జైపూర్కు తొలి పాయింట్ అందించాడు. రెండు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లాయి. 6–6తో స్కోరు సమంగా నిలిచిన దశలో అర్జున్ను ట్యాకిల్ చేసిన టైటాన్స్.. పవన్ వరుస రైడ్ పాయింట్లతో 9–6తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో పవన్ను ఔట్ చేయడంతో పాటు వరుసగా మూడు పాయింట్లు రాబట్టిన జైపూర్ 9–9తో స్కోరు సమం చేసింది. అయితే, 18వ నిమిషంలో జైపూర్ అభిజీత్ చేసిన సూపర్ రైడ్ ఆటను మలుపు తిప్పింది. బోనస్తో పాటు అంకిత్, పవన్, క్రిషన్లను ఔట్ చేసిన అభిజీత్ ఏకంగా నాలుగు పాయింట్లు తీసుకొచ్చాడు. ఆ వెంటనే అర్జున్ కోర్టులో మిగిలిన ఇద్దరు డిఫెండర్ల పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో టైటాన్స్ను తొలిసారి ఆలౌట్ చేసిన పింక్ పాంథర్స్ 18–13తో ఐదు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది.రెండో భాగంలో జైపూర్ విజృంభించగా.. తెలుగు జట్టూ పూర్తిగా డీలా పడింది. విరామం తర్వాత అర్జున్ జైపూర్కు మరో రైడ్ పాయింట్ అందించగా, విజయ్ మాలిక్ జైపూర్ ఆటగాడు రెజాను టచ్ చేసి వచ్చాడు. కానీ, తన తర్వాతి రైడ్లో అర్జున్.. విజయ్, సాగర్ను ఔట్ చేసి జట్టుకు మరో రెండు పాయింట్లు తెచ్చి పెట్టడంతో జైపూర్ తన ఆధిక్యాన్ని 21–14కి పెంచుకుంది. ఆపై ఇరు జట్ల డూ ఆర్ డై రైడ్స్లో ఇటు పవన్, అటు అర్జున్ సక్సెస్ అయ్యారు.ఈ క్రమంలో అర్జున్ సూపర్ టెన్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు కెప్టెన్లు వరుస రైడ్స్ చేయగా.. ఇందులో అర్జున్ పైచేయి సాధించాడు. అర్జున్ వరుసగా రెండు డబుల్ రైడ్స్తో సత్తా చాటగా.. పవన్ను అంకుష్ ట్యాకిల్ చేశాడు. విజయ్ మాలిక్ను కూడా ట్యాకిల్ చేసిన పింక్ పాంథర్స్ జట్టు టైటాన్స్ను రెండోసారి ఆలౌట్ చేసి 31–17తో విజయం ఖాయం చేసుకుంది. చివరి పది నిమిషాల్లో టైటాన్స్ మరింత నిరాశ పరిచింది. సెహ్రావత్ సహా రైడర్లు ప్రత్యర్థికి దొరికిపోగా.. డిఫెండర్లు సైతం చేతులెత్తేశారు. దాంతో మరో రెండుసార్లు ఆలౌటైన తెలుగు జట్టు 21–49తో వెనుకబడింది. మరోవైపు అర్జున్ సూపర్ రైడింగ్తో జైపూర్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్..
-
PKL: తమిళ్ తలైవాస్ చేతిలో టైటాన్స్ చిత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ను ఘనంగా ఆరంభించిన ఆతిథ్య తెలుగు టైటాన్స్ రెండో మ్యాచ్లో మాత్రం నిరాశ పరిచింది. తమిళ్ తలైవాస్తో శనివారం నాటి మ్యాచ్లో ఓటమిపాలైంది. తలైవాస్ తరఫున నరేందర్ ఖండోలా, సచిన్ సూపర్ టెన్స్ విజృంభించడంతో టైటాన్స్కు పరాజయం తప్పలేదు.హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తమిళ్ తలైవాస్ జట్టు 44–29 తేడాతో తెలుగు టైటాన్స్ ను చిత్తు చేసింది. ఆరంభంలో విజృంభించిన టైటాన్స్ ప్లేయర్ పవన్ సెహ్రావత్ (10) వరుసగా రెండో సూపర్ టెన్ సాధించినా.. ఆ తర్వాత తడబడ్డాడు. అనంతరం విజయ్ మాలిక్ (9) పోరాడినా ఫలితం లేకపోయింది. తమిళ్ తలైవాస్ జట్టులో నరేందర్, సచిన్ చెరో పది పాయింట్లు తీసుకురాగా.. డిఫెండర్ సాహిల్ గులియా ఐదు పాయింట్లతో హై ఫైవ్ సాధించాడు.టైటాన్స్- తలైవాస్ పోరుసాగిందిలాతలైవాస్తో మ్యాచ్లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఆరంభంలో వరుస రైడ్ పాయింట్లతో చెలరేగాడు. మొదటి కూతలోనే సూపర్ రైడ్ చేయడంతో 3–0తో ఆటను ఆరంభించిన తెలుగు టైటాన్స్.. పవన్ డబుల్ రైడ్ పాయింట్తో 5–1తో ఆధిక్యం సాధించింది. కానీ,అభిషేక్ చేసిన ట్యాకిల్తో పవన్ను నిలువరించిన తలైవాస్ ఒక్కసారిగా జోరు పెంచింది. నరేందర్ ఖండోలా ముగ్గురు డిఫెండర్లను ఔట్ చేస్తూ సూపర్ రైడ్ చేయడంతో 7–6తో ఆధిక్యంలోకి వచ్చింది.ఆపై కోర్టులో మిగిలిన క్రిషన్, విజయ్ మాలిన్ ను సచిన్ అవుట్ చేశాడు. ఫలితంగా ఆరో నిమిషంలోనే తెలుగు టైటాన్స్ ను ఆలౌట్ చేసిన తలైవాస్ 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. సాహిల్, అభిషేక్ తృత్వంలోని డిఫెండర్లు కూడా సత్తా చాటడంతో సెహ్రావత్ ను మరోసారి కోర్టు బయటికి పంపించిన తమిళ జట్టు తన ఆధిక్యాన్ని 14–9కి పెంచుకుంది.ఈ దశలో టైటాన్స్ రైడర్ విజయ్ మాలిక్ పోరాటంతో ఆతిథ్య జట్టు వెంటవెంటనే పాయింట్లు రాబట్టి 14–15తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ, తలైవాస్ రైడర్ నరేందర్తో పాటు సచిన్ కూడా జోరు కనబరిచాడు.సెహ్రావత్ ఎక్కువ సేపు కోర్టు బయట ఉంచిన ఆ జట్టు 20–17తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. సెకండాఫ్లో తెలుగు టైటాన్స్ జట్టు పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఓవైపు విజయ్ మాలిక్ రైడ్ పాయింట్లు రాబడుతున్నా.. కెప్టెన్ సెహ్రావత్ నిరాశ పరచడంతో మళ్లీ వెనకబడింది. ఇంకోవైపు సచిన్ను నిలువరించడంలో టైటాన్స్ డిఫెండర్లు పూర్తిగా విఫలమయ్యారు.31వ నిమిషంలో మరోసారి ఆలౌట్ చేసిన తలైవాస్ 31–21తో ఆధిక్యం సాధించింది. పూర్తి జట్టు కోర్టులోకి వచ్చిన తర్వాత కూడా తెలుగు టైటాన్స్ తడబాటు మారలేదు. నరేందర్ తన సూపర్ టెన్ పూర్తి చేసుకుంటూ అంకిత్, అజిత్ పవార్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో మూడోసారి టైటాన్స్ ను ఆలౌట్ చేసిన తలైవాస్ 40–24తో భారీ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి ఐదు నిమిమిషాల్లో తెలుగు జట్టు పోరాటం ఓటమి అంతరాన్ని కూడా పెద్దగా తగ్గించలేకపోయింది. -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ను తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. లీగ్లో ప్రతీ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన టైటాన్స్ ఈసారి శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 37–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్ను ఓడించింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 13 పాయింట్లతో జట్టును ముందుండి నడిపించగా ... బెంగళూరు కెపె్టన్ ప్రదీప్ నర్వాల్ కేవలం 3 పాయింట్లే నమోదు చేసి విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 20–11తో 9 పాయింట్ల తేడాతో ముందంజలో నిలిచింది. అయితే ఆ తర్వాత కోలుకున్న బుల్స్ 18–11 పాయింట్లతో రెండో అర్ధభాగంలో ఆధిక్యం ప్రదర్శించింది. బుల్స్ తమ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయగా... టైటాన్స్ జట్టు బెంగళూరును రెండుసార్లు ఆలౌట్ చేసింది. పవన్ ప్రొ కబడ్డీ లీగ్లో 1200 రైడింగ్ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ జట్టు 36–28 పాయింట్ల తేడాతో యు ముంబా జట్టును ఓడించింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటల నుంచి), పుణేరి పల్టన్తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
తొడగొట్టేందుకు సిద్ధం.. ప్రో కబడ్డీ లీగ్కు సర్వం సిద్దం
సాక్షి, హైదరాబాద్: పది సీజన్లుగా కబడ్డీ అభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడాది వ్యవధిలోపే మళ్లీ ముందుకు వచ్చింది. పీకేఎల్ 11వ సీజన్కు నేటితో తెర లేవనుంది. గత సీజన్కంటే భిన్నంగా ఈసారి మూడు వేదికలకే టోర్నీ లీగ్ దశను పరిమితం చేస్తున్నారు. సీజన్–10 ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోనే నేడు టోర్నీ ప్రారంభం అవుతుంది. నవంబర్ 9 వరకు ఇక్కడే పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత నోయిడా, పుణే తర్వాతి దశ పోటీలకు ఆతిథ్యం ఇస్తాయి. మరోసారి 12 టీమ్లతోనే పీకేఆల్ జరగనుండగా... లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్ (ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2, రెండు సెమీఫైనల్స్, ఫైనల్) ఐదు మ్యాచ్లతో కలిపి ఓవరాల్గా 137 మ్యాచ్లు పీకేఎల్లో జరుగుతాయి. టోర్నీ తొలిరోజు జరిగే మొదటి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్తో తలపడనుండగా... మాజీ చాంపియన్స్ దబంగ్ ఢిల్లీ, యు ముంబా మధ్య రెండో మ్యాచ్ మ్యాచ్ (రాత్రి 9 గంటల నుంచి) జరుగుతుంది. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 24న జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాత నాకౌట్ మ్యాచ్ల వేదికలను ఖరారు చేస్తారు. భారీ వేలంతో మొదలు... సీజన్–11 కోసం నిర్వహించిన వేలంలో ఆటగాళ్లకు భారీ విలువ పలికింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో రూ. 1 కోటికి పైగా విలువతో అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో ఏకంగా 8 మంది ఉండటం విశేషం. అత్యధికంగా తమిళ్ తలైవాస్ సచిన్ తన్వర్ను రూ.2 కోట్ల 15 లక్షలకు దక్కించుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు గురువారం హైదరాబాద్లో ట్రోఫీ ఆవిష్కరణ సహా లీగ్ ప్రచార కార్యక్రమం జరిగింది. పీకేఎల్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తదితరులు ఇందులో పాల్గొన్నారు. దశాబ్దకాలంగా తమ లీగ్కు మంచి ఆదరణ దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన మున్ముందు టోర్నీని మరింత ఆకర్షణీయంగా మారుస్తామని ప్రకటించారు. పీకేఎల్ రాకతో తమ కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎంతో మార్పు వచ్చి0దని... డబ్బుతో పాటు గుర్తింపూ దక్కిందని అగ్రశ్రేణి ఆటగాళ్లు పవన్ సెహ్రావత్, ప్రదీప్ నర్వాల్ వెల్లడించారు. టైటాన్స్ రాత మారేనా... ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమైన నాటినుంచి లీగ్లో ఉన్న ఎనిమిది జట్లలో తెలుగు టైటాన్స్ కూడా ఒకటి. కానీ మిగతా ఏడు జట్లతో పోలిస్తే టైటాన్స్దే ఇప్పటి వరకు పేలవ ప్రదర్శన. టైటాన్స్ మినహా మిగిలిన ఏడు జట్లు కనీసం ఒక్కసారైనా విజేతగా నిలవడం విశేషం. రెండో సీజన్లో మూడో స్థానంలో నిలవడమే ఇప్పటి వరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత మూడు సీజన్లుగానైతే మరీ చెత్త ప్రదర్శనతో చివరిదైన 12వ స్థానంలో నిలుస్తూ వచ్చి0ది. ఓవరాల్గా 10 సీజన్లలో కలిపి 192 మ్యాచ్లు ఆడితే 56 మాత్రమే గెలిచి 116 ఓడిపోయింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, లీగ్లో దబంగ్ ఢిల్లీకి టైటిల్ అందించిన కోచ్ కృషన్ కుమార్ హుడా ఈసారి టైటాన్స్ కోచ్గా రావడం జట్టుకు సానుకూలాంశం. అతని నేతృత్వంలో టీమ్ రాత మారుతుందా అనేది ఆసక్తికరం. వేలంలో ఎఫ్బీఎం ద్వారా రూ.1.72 కోట్లకు కెపె్టన్ పవన్ సెహ్రావత్ను టీమ్ కొనసాగించింది. విజయ్ మలిక్, అమిత్ కుమార్, సంజీవి వంటి ఆల్రౌండర్లు జట్టులో ఉన్నారు. అయితే పవన్ మినహా చెప్పుకోదగ్గ అగ్రశ్రేణి రైడర్ లేకపోవడం జట్టులో ఒక లోపం. ప్రఫుల్, ఓంకార్, మన్జీత్ ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. డిఫెన్స్లో కృషన్ ధుల్ రూపంలో కీలక ఆటగాడు ఉండగా... మిలాద్, అజిత్, సాగర్ నుంచి సహకారం అవసరం. పీకేఎల్–11లో పాల్గొనే జట్లు: తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పట్నా పైరేట్స్, పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్, యు ముంబా, యూపీ యోధాస్. -
నేటి నుంచి హైదరాబాద్లో ప్రొ కబడ్డీ లీగ్
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్కు నగారా మోగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. మొత్తం 12 జట్లు బరిలో ఉన్నాయి. డిసెంబర్ 24 వరకు సాగే లీగ్ దశలో 132 మ్యాచ్లు నిర్వహిస్తారు. హైదరాబాద్తో పాటు నోయిడా, పుణే ఇతర వేదికలుగా ఉన్నాయి. నేడు జరిగే రెండు మ్యాచ్ల్లో తెలుగు టైటాన్స్తో బెంగళూరు బుల్స్; ఢిల్లీ దబంగ్తో యు ముంబా ఆడతాయి. గురువారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని జట్ల కెపె్టన్లు పాల్గొన్నారు. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్లు చూడాలనుకునే కబడ్డీ అభిమానులు bౌౌజుఝyటజిౌఠీ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. రూ.500, రూ.1000, రూ. 2500లకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ అంచె మ్యాచ్లు నవంబర్ 9వ తేదీన ముగుస్తాయి. ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలో... డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణేలో మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. -
PKL: షెడ్యూల్ పూర్తి వివరాలు.. తొలి మ్యాచ్లో తలపడే జట్లు ఇవే
Pro Kabaddi League Season 11: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించారు. ఆరంభ దశ మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 18 నుంచి పీకేఎల్ ప్రారంభం కానుండగా... గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరగనున్న తొలి పోరులో బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ జట్టు తలపడనుంది.అదే రోజు జరగనున్న రెండో మ్యాచ్లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ పోటీపడుతుంది. మూడు వేదికల్లో పీకేఎల్ మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించగా... అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్లో పీకేఎల్ తొలి దశ సాగనుంది.ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణేలో లీగ్ సాగనుంది. ఇక ప్లే ఆఫ్స్కు సంబంధించిన షెడ్యూల్ను తర్వాత ప్రకటించనున్నారు. గత నెలలో జరిగిన పీకేఎల్ వేలంలో మొత్తం 12 జట్లు తమ అస్త్రశ్రస్తాలకు పదును పెంచుకోగా... లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిది మంది ప్లేయర్లు కోటి రూపాయలకు పైగా ధర పలికారు. హైదరాబాద్ (గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం)అక్టోబర్ 18, శుక్రవారం-తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)-దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 19, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 20, ఆదివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు) అక్టోబర్ 21, సోమవారం- యూపీ యోధాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 22, మంగళవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 23, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 24, గురువారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 25, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 26, శనివారం- యు ముంబా వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 27, ఆదివారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 28, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 29, మంగళవారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 30, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 31, గురువారం- పట్నా పైరేట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 2, శనివారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 3, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 4, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 5, మంగళవారం- యు ముంబా వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 6, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 7, గురువారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 8, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 9, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)నోయిడా (నోయిడా ఇండోర్ స్టేడియం)నవంబర్ 10, ఆదివారం- యూపీ యోధాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 11, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 12, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 13, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 14, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 15, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 16, శనివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 17, ఆదివారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 18, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 19, మంగళవారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 20, బుధవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 21, గురువారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 22, శుక్రవారంజైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యూపీ యోధస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 23, శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 24, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 25, సోమవారం- యు ముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 26, మంగళవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 27, బుధవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 28, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 29, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 30, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 1, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)పుణె (బాలేవాడి బ్యాడ్మింటన్ స్టేడియం)డిసెంబర్ 3, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 4, బుధవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 5, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 6, శుక్రవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 7, శనివారం- యూపీ యోధాస్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 8, ఆదివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 9, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 10, మంగళవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 11, బుధవారంహర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 12, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 13, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 14, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 15, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 16, సోమవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 17, మంగళవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 18, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 19, గురువారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 20, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 21, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 22, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 23, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 24, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు) -
ప్రొ కబడ్డీ లీగ్ ఆరంభ తేదీ ప్రకటన
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ అక్టోబరు 18వ తేదీన మొదలవుతుంది. మూడు నగరాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబరు 18 నుంచి తొలి అంచె పోటీలు జరుగుతాయి. అనంతరం నవంబరు 10 నుంచి రెండో అంచె మ్యాచ్లకు నోయిడా నగరం ఆతిథ్యమిస్తుంది. చివరి అంచె పోటీలు డిసెంబరు 3 నుంచి పుణేలో జరుగుతాయని... పూర్తి షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామని పీకేఎల్ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు. కాగా 2014లో ప్రొ కబడ్డీ లీగ్ మొదలైంది. ఇప్పటి వరకు 10 సీజన్లపాటు ఈ టోర్నీ జరిగింది. పుణేరి పల్టన్ జట్టు డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. తెలుగు టైటాన్స్ దారుణ వైఫల్యంపట్నా పైరేట్స్ జట్టు అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలువగా... జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు రెండుసార్లు టైటిల్ను దక్కించుకుంది. బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, యు ముంబా, పుణేరి పల్టన్ జట్లు ఒక్కోసారి చాంపియన్గా నిలిచాయి. తెలుగు టైటాన్స్ జట్టు రెండో సీజన్లో మూడో స్థానంలో, నాలుగో సీజన్లో నాలుగో స్థానంలో నిలిచింది. గత మూడు సీజన్లలో తెలుగు టైటాన్స్ జట్టు చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. -
PKL Auction: షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ సహా పూర్తి వివరాలు
పది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ ఎడిషన్కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆగష్టు 15, 16 తేదీల్లో ప్లేయర్ల వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో పీకేఎల్లో భాగమైన పన్నెండు ఫ్రాంఛైజీలు.. అంతా కలిపి 88 మంది ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.అయితే, అనూహ్య రీతిలో ప్రదీప్ నర్వాల్, పవన్ షెరావత్, మణిందర్ సింగ్, ఫజల్ అట్రాచలీ, మొహమ్మద్ రెజా తదితర స్టార్ ప్లేయర్లు ఈసారి వేలంలో పాల్గొననుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా, వేలంలో ఆటగాళ్లను కొనేందుకు పర్సులో మిగిలి ఉన్న మొత్తం, వేలం ఆరంభ సమయం, లైవ్స్ట్రీమింగ్ ఎక్కడ తదితర వివరాలు మీకోసం..పన్నెండు జట్లు ఇవేతెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ్ తలైవాస్, యూ ముంబా, యూపీ యోధాస్.రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతెలుగు టైటాన్స్అంకిత్, ఓంకార్ నారాయణ్ పాటిల్, ప్రఫుల్ సుదమ్ జవారే, సంజీవి ఎస్, నీల్, శంకర్ భీమ్రాజ్ గడాయ్, అజిత్ పాండురంగ పవార్.బెంగాల్ వారియర్స్శ్రేయాస్ ఉమర్దండ్, ఆదిత్య ఎస్ షిండే, దీపక్ అర్జున్ షిండే, మహరుద్ర గార్జే, నీల్, విశ్వాస్ ఎస్, నితిన్ కుమార్.బెంగళూరు బుల్స్ఆదిత్య శంకర్ పవార్, అక్షిత్, అరుల్అనంతబాబు, ప్రతీక్, సౌరభ్ నందాల్, పొన్పార్తీబన్ సుబ్రమణియన్, సుశీల్, రోహిత్ కుమార్.దబాంగ్ ఢిల్లీఆశిష్, హిమ్మత్ అంతిల్, మనూ, యోగేశ్, నీల్, అన్షు మాలిక్, విక్రాంత్, నవీన్ కుమార్.గుజరాత్ జెయింట్స్నితిన్, ప్రతీక్ దహియా, రాకేశ్,బాలాజీ డి, జితేందర్ యాదవ్.హర్యానా స్టీలర్స్జయసూర్య ఎన్ఎస్, హర్దీప్, శివం అనిల్ పటారే, విశాల్ ఎస్ టాటే, జైదీప్, మోహిత్, వినయ్, రాహుల్ సేత్పాల్, ఘనశ్యామ్ రోకా మగర్.జైపూర్ పింక్ పాంథర్స్అభిజీత్ మాలిక్, అంకుశ్, అభిషేక్ కేఎస్, అర్జున్ దేశ్వాల్, రెజా మీరాఘెరిపట్నా పైరైట్స్అబినంద్ శుబాంశ్, కునాల్ మెహతా, సుధాకర్ ఎమ్, మనీశ్, అంకిత్, సందీప్ కుమార్.పుణెరి పల్టన్దదాసో శివాజీ పూజారి, నితిన్, తుషార్ దత్తాత్రేయ అధావడె, వైభవ్ బాలాసాహెబ్ కాంబ్లీ, ఆదిత్య తుషార్ షిండే, ఆకాశ్ సంతోశ్ షిండే, మోహిత్ గయత్, అస్లాం ముస్తఫా ఇనాందార్, పంకజ్ మోహితే, సంకేత్ సెహ్రావత్, అబినేశ్ నదరాజన్, గౌరవ్ ఖత్రీ.తమిళ్ తలైవాస్నితేశ్ కుమార్, నితిన్ సింగ్, రొనాక్, విశాల్ చహల్, నరేందర్, సాహిల్, మోహిత్, ఆశిష్, సాగర్, హిమాన్షు, ఎం. అభిషేక్, నీల్.యూ ముంబాబిట్టు, గోకులకన్నన్ ఎం, ముకిలన్ షణ్ముగం, సోంవీర్, శివం, అమీర్ మొహ్మద్ జఫార్దనేశ్, రింకూ.యూపీ యోధాస్గగన గౌడ హెచ్ఆర్, హితేశ్, శివం చౌదరి, సుమిత్, సురేందర్ గిల్, అశూ సింగ్, నీల్.ఒక్కో జట్టులో ఎంత మంది?కనీసం 18 నుంచి అత్యధిక 25 మంది ఆటగాళ్లు ఒక్కో జట్టులో ఉండవచ్చు. ఇప్పటికి 88 మందిని ఆయా ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్నాయి గనుక 212 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.ఎంత మంది విదేశీ ఆటగాళ్లు?ఒక్కో జట్టులో కనీసం రెండు, అత్యధికంగా నలుగురు విదేశీ ప్లేయర్లు ఉండవచ్చు.టీమ్ పర్సు వివరాలుఒక్కో ఫ్రాంఛైజీ రూ. 5 కోట్ల మేర పర్సు వాల్యూ కలిగి ఉంటుంది. అయితే, రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కోసం చెల్లించిన మొత్తం పోగా.. మిగిలిన డబ్బుతో వేలంలో పాల్గొంటాయి.సీజన్-11 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీల పర్సులో మిగిలి ఉన్న మొత్తం👉బెంగాల్ వారియర్స్'- రూ. 3.62 కోట్లు👉బెంగళూరు బుల్స్- రూ. 3.02 కోట్లు👉దబాంగ్ ఢిల్లీ- రూ. 2.66 కోట్లు👉గుజరాత్ జెయింట్స్- రూ. 4.08 కోట్లు👉హర్యానా స్టీలర్స్- రూ. 2.32 కోట్లు👉జైపూర్ పింక్ పాంథర్స్- రూ. 2.29 కోట్లు👉పట్నా పైరేట్స్- రూ. 3.59 కోట్లు👉పుణెరి పల్టన్- రూ. 2.12 కోట్లు👉తమిళ్ తలైవాస్- రూ. 2.57 కోట్లు👉తెలుగు టైటాన్స్- రూ. 3.82 కోట్లు👉యు ముంబా- 2.88 కోట్లు👉యూపీ యోధాస్- 3.16 కోట్లు.నాలుగు కేటగిరీలు👉‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్ల కనీస ధర రూ. 30 లక్షలు👉‘బి’ కేటగిరీలో ఉన్న వాళ్ల బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు. 👉‘సి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.13 లక్షలు👉‘డి’ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 9 లక్షలు ప్రాథమిక ధర 👉ఈ సారి వేలంలో 500 మందికి పైగా ప్లేయర్లు పాల్గొననున్నారు.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?ఆగష్టు 15 రాత్రి ఏడు గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రసారం(టీవీ). డిజిటల్ మీడియాలో డిస్నీ+హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం. చదవండి: అర్షద్ నదీమ్పై కానుకల వర్షం.. ఘన సత్కారం -
‘టై’తో టైటాన్స్ ముగింపు
పంచ్కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ను తెలుగు టైటాన్స్ జట్టు ‘టై’తో ముగించింది. యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ 45–45 వద్ద ‘టై’ అయింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నిర్ణీత 22 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ను ‘టై’ చేసుకొని, రెండు మ్యాచ్ల్లో నెగ్గి 21 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకుంది. తొమ్మిదో సీజన్లోనూ టైటాన్స్ చివరి స్థానంలోనే నిలిచింది. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో పుణేరి పల్టన్తో యూపీ యోధాస్; హరియాణా స్టీలర్స్తో బెంగళూరు బుల్స్ ఆడతాయి. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ తెలుగు టైటాన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 55–35 స్కోరుతో టైటాన్స్పై విజయం సాధించింది. తెలుగు జట్టు తరఫున మిలాద్ జబారి 9, ప్రఫుల్ జవారే 8, పవన్ సెహ్రావత్ 6 పాయింట్లు సాధించగా...బెంగాల్ ఆటగాళ్ళలో నితిన్ కుమార్ 13 పాయింట్లతో చెలరేగాడు. టైటాన్స్కు ఓవరాల్గా 19 మ్యాచ్లలో ఇది 17వ పరాజయం. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 44–23 స్కోరుతో యు ముంబాపై గెలుపొందింది. -
PKL 2024: తీరు మార్చుకోని తెలుగు టైటాన్స్.. మరో ఘోర ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ 15వ పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం పట్నాలో పుణేరి పల్టన్తో జరిగిన పోరులో పవన్ సెహ్రావత్ నాయకత్వంలోని తెలుగు టైటాన్స్ 29–60 తో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో పుణేరి ఆల్రౌండ్ దెబ్బకు టైటాన్స్ జట్టు నాలుగుసార్లు ఆలౌటైంది. పల్టన్ తరఫున ఆకాశ్ 11 పాయింట్లతో రాణించాడు. టైటాన్స్ ప్లేయర్ సంజీవి అత్యధికంగా 8 పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (17 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు) టైటాన్స్ చివరి స్థానంలో ఉండగా.. పుణేరి పల్టన్ 16 మ్యాచ్ల్లో 12 విజయలతో అగ్రస్థానంలో నిలిచింది. -
తెలుగు టైటాన్స్ జట్టుకు 14వ పరాజయం
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు 14వ పరాజయం ఎదురైంది. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో పవన్ సెహ్రావత్ కెపె్టన్సీలోని తెలుగు టైటాన్స్ 29–54తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 35–32తో హరియాణా స్టీలర్స్పై గెలిచింది. బుధవారంతో హైదరాబాద్ అంచె పోటీలు ముగిశాయి. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం పటా్నలో జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో పట్నా పైరేట్స్; గుజరాత్ జెయింట్స్తో యు ముంబా తలపడతాయి. -
తీరు మారని తెలుగు టైటాన్స్.. 13వ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఖాతాలో 13వ పరాజయం చేరింది. హరియాణా స్టీలర్స్తో సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 30–37తో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున సంజీవి, ప్రఫుల్ 6 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–25తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. చదవండి: ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం -
ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని సాధించి సొంత ప్రేక్షకుల్ని మురిపించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 49–32 స్కోరుతో యూపీ యోధాస్పై విజయం సాధించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ (16 పాయింట్లు), ఓంకార్ (10) రాణించారు. అంతకుముందు జరిగిన తొలిపోరులో దబంగ్ ఢిల్లీ 39–33తో యు ముంబాపై నెగ్గింది. -
తెలుగు టైటాన్స్కు మరో ఓటమి.. ఏకంగా 12వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం హైదరాబాద్ అంచె పోటీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జట్టు 26–42 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టుకిది 12వ పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. అదే విధంగా.. బెంగళూరు జట్టు తరఫున సుర్జీత్ ఏడు పాయింట్లు, వికాశ్ ఆరు పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 34–31తో యూపీ యోధాస్ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో యు ముంబా; తెలుగు టైటాన్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
గచ్చిబౌలి స్టేడియంలో తొడగొట్టనున్న తెలుగు టైటాన్స్.. ఎప్పుడంటే?
క్రీడా సంబురాలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ప్రో కబాడ్డీ లీగ్ సీజన్ 10లో తమ హోమ్ మ్యాచ్లను ప్రారంభించడానికి తెలుగు టైటాన్స్ సిద్ధమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో బెంగళూరు బుల్స్తో శుక్రవారం తెలుగు టైటాన్స్ తలపడనుంది. హోమ్ మ్యాచ్లను జనవరి 19 నుండి 24 వరకు హైదరాబాద్లో ఆడనుంది. వీటికి సంబంధించిన టికెట్లు bookmyshow లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు టైటాన్స్ సీఈఓ త్రినాధ్ రెడ్డి మాట్లాడుతూ: “ఈ లీగ్ పోటీ నాణ్యత, గేమ్ప్లే, ఆటగాళ్ల ప్రదర్శనల పరంగా గొప్ప స్థాయికి పెరిగిందన్నారు. . ప్రో కబడ్డీ లీగ్ ప్రస్తుత సీజన్లా గట్టి పోటీతో కూడిన కొన్ని మ్యాచ్లకు సాక్షిగా నిలబోతుందన్నారు. తెలుగు టైటాన్స్లో కెప్టెన్ పవన్ సెహ్రావత్, సందీప్ ధుల్, పర్వేష్ వంటి దిగ్గజాలు తమ ఆటను పునర్నిర్వచించుకోవడం తో పాటుగా కొత్త ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వనున్నారని చెప్పారు. తెలుగు టైటాన్స్ తమ మొదటి హోమ్ లెగ్ మ్యాచ్ను జనవరి 19, 2024న బెంగళూరు బుల్స్తో ఆడుతుంది. అభిమానులు ప్రతి మ్యాచ్ని లైవ్లో, రాత్రి 7:30 గంటలకు FTA ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 2 & స్టార్ స్పోర్ట్స్ 2 HD – ఇంగ్లీష్, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, కన్నడలో స్టార్ సువర్ణ ప్లస్లో, తెలుగులో స్టార్ మా గోల్డ్ మరియు హాట్స్టార్ తో సహా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు. -
PKL: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. పదకొండో పరాజయం
Pro Kabaddi League Telugu Titans 11th Defeat- జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. జైపూర్ పింక్ పాంథర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 35–38తో పోరాడి ఓడిపోయింది. ఈ లీగ్లో టైటాన్స్కిది 11వ ఓటమి కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లు స్కోరు చేయగా... సందీప్ ధుల్, రాబిన్ 5 పాయింట్ల చొప్పున సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 14 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 37–17తో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. పుణేరి పల్టన్ కెప్టెన్ అస్లమ్ ముస్తఫా 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో పుణేరి పల్టన్; యూపీ యోధాస్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. చదవండి: Ind vs Eng: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు భారత్ జట్టు ప్రకటన -
Pro Kabaddi League 2024: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. సీజన్లో పదో పరాజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు 26–46తో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో టైటాన్స్ జట్టుకిది పదో పరాజయం. టైటాన్స్ జట్టులో కెపె్టన్ పవన్ సెహ్రావత్ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. పవన్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. వారియర్స్ జట్టులో వైభవ్ 9 పాయింట్లు, నితిన్ 9 పాయింట్లు, విశ్వాస్ 8 పాయింట్లు, శుభమ్ 6 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో తమిళ్ తలైవాస్; యు ముంబాతో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
Pro kabaddi League 2023: మళ్లీ ఓడిన టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 18–54 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. ఈ లీగ్లో టైటాన్స్ జట్టుకిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ జట్టు కెపె్టన్ పవన్ సెహ్రావత్ ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడు. పవన్ కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. మొత్తం 14 సార్లు రెయిడింగ్కు వెళ్లిన పవన్ ఒకసారి సఫలమై, మరోసారి బోనస్ పాయింట్ రాబట్టాడు. తొమ్మిదిసార్లు పాయింట్ సాధించకుండానే తిరిగి వచ్చాడు. టైటాన్స్ జట్టు మరో ప్లేయర్ సందీప్ ఐదు పాయింట్లు గెలిచాడు. మరోవైపు పుణేరి పల్టన్ తరఫున మోహిత్ గోయట్, అస్లమ్ ముస్తఫా చెలరేగిపోయారు. మోహిత్ 13 పాయింట్లు, అస్లమ్ 8 పాయింట్లు స్కోరు చేశారు. గౌరవ్ ఖత్రీ (6), అభినేశ్ (5), మొహమ్మద్ రెజా (5) కూడా రాణించారు. మరో మ్యాచ్లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 48–41తో యూపీ యోధాస్పై గెలుపొందింది. యూపీ యోధాస్ కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 21 పాయింట్లతో అదరగొట్టినా తన జట్టును గెలిపించలేకపోయాడు. చదవండి: సంజూ శాంసన్ భారీ సిక్సర్.. బంతి ఎక్కడ పడిందో తెలుసా? వీడియో వైరల్ -
PKL 2024: టైటాన్స్కు ఏడో ఓటమి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 32–54తో ఓడిపోయింది. ఈ లీగ్లో టైటాన్స్ జట్టుకిది ఏడో పరాజయం కావడం గమనార్హం. యు ముంబా తరఫున గుమన్ సింగ్ 10 పాయింట్లు, రింకూ 8 పాయింట్లు, సోంబీర్ 8 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున రజనీశ్ 8 పాయింట్లు, రాబిన్ చౌధరీ 7 పాయింట్లు, ప్రఫుల్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 35–25తో యూపీ యోధాస్ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్; తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
PKL 2023: పవన్ పోరాటం వృథా
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఆరో మ్యాచ్లో గెలుపు బోణీ కొట్టిన టైటాన్స్ మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన తమ ఏడో మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 31–33తో బెంగళూరు బుల్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేసిన తన జట్టును గెలిపించలేకపోయాడు. అజిత్ పవార్ 5 పాయింట్లు, రజనీశ్ 3 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుర్జీత్ సింగ్ (7), భరత్ (6), వికాశ్ కండోలా (5), నీరజ్ నర్వాల్ (5) రాణించారు. మరో మ్యాచ్లో యు ముంబా 39–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. యు ముంబా జట్టు తరఫున అమీర్ మొహమ్మద్ 8 పాయింట్లు, గుమన్ సింగ్ 6 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ అత్యధికంగా 11 పాయింట్లు స్కోరు చేశాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో దబంగ్ ఢిల్లీ; తమిళ్ తలైవాస్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. Came like 𝙋𝙖𝙬𝙖𝙣, went with the Bulls 😉#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/azN98ZP8fU — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 SUPE𝐑𝐑𝐑 TACKLE ft. Ajit Pawar 💛#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/fHyLLmze8F — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 -
PKL: ఎట్టకేలకు బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్.. ఉత్కంఠ పోరులో విజయం
Pro Kabaddi League 2023: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం జరిగిన తమ ఆరో మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 37–36తో హరియాణా స్టీలర్స్ జట్టుపై నెగ్గింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 10 పాయింట్లు, అజిత్ పవార్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 46–33తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. When you play for the Steelers, you always 𝐒𝐓𝐄𝐀𝐋 points 😉🔥#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #HSvTT #HaryanaSteelers #TeluguTitans pic.twitter.com/Es9C6C7ZYx — ProKabaddi (@ProKabaddi) December 22, 2023 టాప్లో పుణెరి పల్టన్.. టైటాన్స్ చివర ఇక పీకేఎల్-2023 సీజన్లో ఇప్పటి వరకు పుణెరి పల్టన్ ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు గెలిచి 26 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు... బెంగాల్ వారియర్స్ ఆరింట మూడు(21 పాయింట్లు), హరియాణా స్టీలర్స్ ఆరింట నాలుగు(21 పాయింట్లు), జైపూర్ పింక్ పాంథర్స్ ఆరింట మూడు (20 పాయింట్లు) గెలిచి టాప్-4లో స్థానం సంపాదించాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ ఆరింట ఐదు ఓడగా.. తాజా విజయంతో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, ఇప్పటికీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే ఉంది. చదవండి: విండీస్దే టి20 సిరీస్ తరూబా (ట్రినిడాడ్): సొంతగడ్డపై వెస్టిండీస్ జట్టు వన్డే, టి20ల్లో ఇంగ్లండ్పై పైచేయి సాధించింది. ఇంతకుముందే వన్డే సిరీస్ను గెలుచున్న విండీస్ ఇప్పుడు టి20 సిరీస్నూ 3–2తో తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన చివరిదైన ఐదో టి20 మ్యాచ్లో రోవ్మన్ పావెల్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ముందుగా ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (22 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుడకేశ్ మోతీ (3/24) ఇంగ్లండ్ను కట్టడి చేశాడు. అనంతరం విండీస్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు సాధించింది. షై హోప్ (43 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోరీ్నలో నాలుగో మ్యాచ్ ఆడిన జట్టు వరుసగా నాలుగో ఓటమిని ఎదుర్కొంది. బుధవారం హోరాహోరీగా జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 38–36 స్కోరుతో టైటాన్స్పై విజయం సాధించింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్, రాబిన్ చౌదరి చెరో 7 పాయింట్లు సాధించారు. తలైవాస్ ఆటగాళ్లలో నరేందర్ 10, సాహిల్ 7 పాయింట్లతో జట్టు గెలిపించా రు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 32–30 తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. -
తెలుగు టైటాన్స్కు నిరాశ
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 28–50 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెపె్టన్ పవన్ సెహ్రావత్ 11 పాయింట్లతో రాణించాడు. పట్నా తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 57–27తో హరియాణా స్టీలర్స్పై ఘనవిజయం సాధించింది. యూపీ యోధాస్ తరఫున సురేందర్ 13 పాయింట్లు, ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లు స్కోరు చేశారు. -
PKL 2023: తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ ఓటమి
ప్రో కబడ్డీ-2023 సీజన్ను ఓటమితో తెలుగు టైటాన్స్ ప్రారంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో 38-32 పాయింట్ల తేడాతో టైటాన్స్ పరాజయం పాలైంది. ఫస్ట్హాఫ్లో తెలుగు టైటాన్స్ అధిక్యం కనబరచగా.. సెకెండ్ హాఫ్లో గుజరాత్ అనూహ్యంగా పుంజుకుని తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గుజరాత్ రైడర్ సోను జగ్లాన్ 5 పాయింట్ల రైడ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గుజరాత్ రైడర్లలో సోనూతో పాటు రాకేష్ 5 పాయింట్లు, రోహిత్ గులియా 4 పాయింట్లు సాధించారు. తెలుగు టైటాన్స్లో పవన్ సెహ్రావత్ ఆరు, రజనీష్ దలాల్ నాలుగు పాయింట్లు చేశారు. చదవండి: IND vs SA: 'నిజంగా సిగ్గు చేటు'.. భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్పై డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు -
చాలా కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాం..టైటిల్ మనదే
-
సూర్యపేటలో తెలుగు టైటాన్స్ ప్లేయర్ల సందడి
సూర్యపేట జిల్లాలోని మేళ్లచెరువులో తెలుగు టైటాన్స్ కబడ్డీ క్రీడాకారులు సందడి చేశారు. మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం (జాతర) సందర్భంగా మంగళవారం రాత్రి స్థానిక ఫ్రెండ్స్ యూత్ «ఆధ్వర్యంలో మేళ్లచెరువులో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. కాగా ఈ పోటీల్లో ప్రో కబడ్డీ జట్టు సభ్యులు తెలుగు టైటన్స్ కెప్టెన్ సిద్ధార్ద్ దేశ్రాయ్, మోనుగోయత్, మల్లికార్జున్, ఆశీష్సింగ్ పాల్గొని సందడి చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు టైటాన్స్కు మరో ఓటమి.. మొత్తంగా 16వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో 16వ పరాజయం చేరింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 28–35తో పుణేరి పల్టన్ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ తరఫున ఆదర్శ్ తొమ్మిది పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పటివరకు 18 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ 15 పాయింట్లతో 12వ ర్యాంక్లో ఉంది. -
Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: వరుసగా 11 పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు రెండో విజయం అందుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 32–26తో యు ముంబాను ఓడించింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ తొమ్మిది పాయింట్లు, అభిషేక్ ఐదు పాయింట్లు, విశాల్ భరద్వాజ్ నాలుగు పాయింట్లు స్కోరు చేశారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఇతర మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీ 30–27తో పట్నా పైరేట్స్పై... జైపూర్ పింక్ పాంథర్స్ 42–29తో యూపీ యోధాస్పై గెలిచాయి. -
Pro Kabaddi 2022: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ అంచె మ్యాచ్లు మొదలయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 28–36తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్లో నెగ్గి, 14 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. తొమ్మిది పాయింట్లతో టైటాన్స్ చివరిదైన 12వ స్థానంలో ఉంది. వారియర్స్తో మ్యాచ్లో టైటాన్స్ తరఫున రెయిడర్లు అభిషేక్ సింగ్ తొమ్మిది పాయింట్లతో, సిద్ధార్థ్ దేశాయ్ ఎనిమిది పాయింట్లతో, పర్మేశ్ ఐదు పాయింట్లతో రాణించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలువగా... శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. ఇతర మ్యాచ్ల్లో పుణేరి పల్టన్ 41–28తో హరియాణా స్టీలర్స్పై, బెంగళూరు బుల్స్ 45–38తో గుజరాత్ జెయింట్స్పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
PKL 2022: తెలుగు టైటాన్స్ దారుణ వైఫల్యం.. తొమ్మిదింట 8 పరాజయాలతో..
Pro Kabaddi League 2022- Telugu Titans- పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్లో తొమ్మిదో మ్యాచ్ ఆడిన టైటాన్స్ ఎనిమిదో పరాజయాన్ని చవిచూసింది. సోమవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 24–43 స్కోరు తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ జట్టులో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ పాయింట్లు సాధించలేకపోయారు. ఆదర్శ్, మోహిత్ పహాల్ చెరో 5 పాయింట్లు సాధించారు. మిగతావారంతా నిరాశపరిచారు. యూపీ తరఫున రెయిడర్ సురేందర్ గిల్ (13 పాయింట్లు), ప్రదీప్ నర్వాల్(9) రాణించారు. కాగా 12 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో తెలుగు టైటాన్స్ ఒకే ఒక్క విజయంతో అట్టడుగున ఉంది. ఇక బెంగళూరు బుల్స్ ఆరు విజయాలతో 34 పాయింట్లు సాధించి టాప్లో కొనసాగుతోంది. చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్ Match 5️⃣0️⃣ belonged to the Pirates while the Yoddhas claimed Match 5️⃣1️⃣ Here's the league table 📊 after tonight's encounters 😃#vivoProKabaddi #FantasticPanga #GGvPAT #UPvTT pic.twitter.com/M3Yhds5cFK — ProKabaddi (@ProKabaddi) October 31, 2022 Full time.#vivoProKabaddi #TeluguTitans #IdiAataKaaduVetaa #MatchDay #WeRiseAgain #TTvsUP #Kabaddi #KabaddiIndia pic.twitter.com/QDL3sLMAXw — Telugu Titans (@Telugu_Titans) October 31, 2022 -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో 24–42 స్కోరుతో హరియాణా స్టీలర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. హరియాణా రెయిడర్ మీతూ శర్మ అదరగొట్టాడు. 18 సార్లు కూతకెళ్లిన మీతూ 13 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో మన్జీత్ (7), కెప్టెన్ నితిన్ రావల్ (4), జైదీప్ దహియా (4) రాణించారు. తెలుగు టైటాన్స్లో సిద్ధార్థ్ దేశాయ్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు. ఆదర్శ్, విజయ్ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. ఈ సీజన్లో ఏడు మ్యాచ్లాడిన టైటాన్స్ ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది. -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో వరుసగా రెండు పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు గెలుపు బోణీ చేసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 30–21తో నెగ్గింది. టైటాన్స్ తరఫున మోనూ గోయట్ 10 పాయింట్లు, సిద్ధార్థ్ దేశాయ్ 7 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 27–22 తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. -
PKL 2022: పరాజయంతో మొదలు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ను తెలుగు టైటాన్స్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 29–34 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ తరఫున రెయిడర్లు వినయ్, రజనీశ్ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... సిద్ధార్థ్ దేశాయ్ నాలుగు పాయింట్లతో నిరాశపరిచాడు. బెంగళూరు బుల్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు), భరత్ (5), వికాశ్ కండోలా (5), మహేందర్ సింగ్ (4), సౌరభ్ (4 పాయింట్లు) రాణించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. శుక్రవారమే జరిగిన మరో రెండు మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీ 41–27తో యు ముంబాను ఓడించగా... యూపీ యోధాస్ 34–32 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై గెలుపొందింది. -
బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ తొలిపోరు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్లో చివరిదైన పన్నెండో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ తొమ్మిదో సీజన్కు సిద్ధమైంది. ఈనెల ఏడో తేదీన బెంగళూరులో జరిగే తొలి మ్యాచ్లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. కొత్త ఆటగాళ్లు, కొత్త కోచ్తో తెలుగు టైటాన్స్ బరిలోకి దిగనుందని, ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తామని టీమ్ యజమానులు శ్రీనివాస్ శ్రీరామనేని, నేదురుమల్లి గౌతమ్ రెడ్డి, మహేశ్ కొల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు టైటాన్స్కు కోచ్గా వెంకటేశ్ గౌడ్, కెప్టెన్గా రవీందర్ పహల్ వ్యవహరించనున్నారు. సిద్ధార్థ్ దేశాయ్, అంకిత్ బెనివాల్, మోనూ గోయట్, రజనీశ్, అభిషేక్ సింగ్, వినయ్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, పర్వేశ్, విజయ్ కుమార్, ఆదర్శ్, ప్రిన్స్, నితిన్, రవీందర్, మోహిత్, హనుమంతు, మొహమ్మద్ షిహాస్, పల్లా రామకృష్ణ, మోసిన్, హమీద్, అంకిత్, మోహిత్ పహల్, సుమిత్ జట్టులోని ఇతర సభ్యులు. -
అక్టోబర్ 7 నుంచి ప్రో కబడ్డీ లీగ్.. తెలుగు టైటాన్స్ షెడ్యూల్ ఇదే
ప్రో కబడ్డీ లీగ్ (పీకెఎల్) సీజన్ - 9 బెంగళూరులో అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గ్రీన్కో గ్రూప్ కో–ఫౌండర్, చైర్మన్ శ్రీనివాస్ శ్రీరామనేని, ఎన్ఈడీ గ్రూప్కు చెందిన మహేష్ కొల్లి, గౌతమ్ రెడ్డి తెలుగు టైటాన్స్ సీజన్ 9 కొత్త జట్టు సభ్యులను పరిచయం చేశారు. తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని మాట్లాడుతూ..''గత సీజన్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ సీజన్ను విజయవంతంగా మలుచుకోలుచుకోవాలనుకుంటున్నాం. మా కొత్త స్క్వాడ్కి పూర్తి శిక్షణను మా కోచింగ్ సిబ్బంది అందించారు. రాబోయే సీజన్లో అభిమానులకు గర్వకారణంగా మా టీమ్ నిలవాలని ఆకాంక్షిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు. తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని నేదురుమల్లి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సీజన్ 9 వివో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. మా టీమ్ను గత సీజన్తో పోలిస్తే సమూలంగా మార్చాం. ఇప్పుడు మా టీమ్లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు నూతన యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వెంకటేష్ గౌడ్, మన్జీత్ల కాంబినేషన్ టీమ్కు కప్ను తేగలదని విశ్వసిస్తున్నాం. ఈ సంవత్సరం కప్ గెలవాలన్న ఏకైక లక్ష్యంతో మా టీమ్ పోటీపడుతుంది’’ అని చెప్పారు. తెలుగు టైటాన్స్ కోచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ‘‘పర్వేష్ భైంశ్వాల్, విశాల్ భరద్వాజ్, సూర్జీత్ సింగ్, రవీందర్ పహల్ టీమ్లో ఉన్నారు. వీరు మా ఆటగాళ్లలో అత్యంత కీలక ఆటగాళ్లు’’ అని తెలిపారు. ఇక మ్యాచ్లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో పాటుగా డిస్నీ+హాట్స్టార్లో కూడా చూడవచ్చని తెలిపారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9లో తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్ను అక్టోబర్ 7న బెంగళూరు బుల్స్తో ఆడనుంది. తెలుగు టైటాన్స్ జట్టు: రవీందర్ పహల్ (కెప్టెన్), సిద్దార్ధ్ దేశాయ్, అంకిత్ బెనివాల్, మోను గోయత్, రజ్నీష్, అభిషేక్ సింగ్, వినయ్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, పర్వేష్ భైంశ్వాల్, విజయ్ కుమార్, ఆదర్శ్ , ప్రిన్స్, నితిన్, రవీందర్, మోహిత్, హనుమంతు, ముహమ్మద్ షిహాస్, పళ్ల రామకృష్ణ, మోహసేన్ మగసౌద్లూ, హమీద్ నాడర్, అంకిత్, మోహిత్ పహల్ రిజర్వ్ ప్లేయర్- సుమిత్ తెలుగు టైటాన్స్ మ్యాచ్ షెడ్యూల్.. 7 అక్టోబర్ 2022 శుక్రవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs బెంగళూరు బుల్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 9 అక్టోబర్ 2022 ఆదివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs బెంగాల్ వారియర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 11 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs పాట్నా పైరేట్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 15 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs దబాంగ్ ఢిల్లీ కె.సి. శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 18 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs పుణెరి పల్టన్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 22 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 25 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs హర్యానా స్టీలర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 29 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs గుజరాత్ జెయింట్స్, శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 31 అక్టోబర్ 2022 సోమవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ Vs U.P. యోద్ధ శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 2 నవంబర్ 2022 బుధవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs యు ముంబా శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 5 నవంబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్ శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే -
PKL 2022: ప్రొ కబడ్డీ లీగ్ మొదటి దశ షెడ్యూల్ విడుదల! వేదికలు, ఇతర వివరాలు
Pro Kabaddi League 2022 Schedule And Other Details: కబడ్డీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)- 2022 వచ్చే నెల(అక్టోబరు)లో ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్ను లీగ్ నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు లీగ్ నిర్వాహక సంస్థ మాషల్ స్పోర్ట్స్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్తో లీగ్ ఆరంభం డిఫెండింగ్ చాంపియన్ దబాంగ్ ఢిల్లీ కేసీ, యు ముంబా మధ్య మ్యాచ్తో అక్టోబరు 7 పీకేఎల్ సీజన్ 9కు తెరలేవనుంది. అదే రోజు బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్తో యూపీ యోధాస్ తలపడనున్నాయి. మొదటి దశలో భాగంగా అక్టోబరు 7 నుంచి నవంబరు 8 వరకు 66 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్లో లీగ్లో పాల్గొనే ప్రతి జట్టూ ఇతర జట్లతో పోటీపడుతుంది. అంతకు మించిన వినోదం ఇక వీవో పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మాషల్ స్పోర్ట్స్ హెడ్, లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. బెంగళూరు, పుణె, హైదరాబాద్ వేదికగా మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సీజన్కు మించిన వినోదంతో కబడ్డీ అభిమానుల ముందుకు వస్తున్నామని.. సరికొత్త బెంచ్మార్క్లు సెట్ చేస్తామని పేర్కొన్నారు. లైవ్స్ట్రీమింగ్ ఎక్కడంటే.. వివో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టికెట్లు ఎలా? పీకేఎల్-2022 టికెట్లను బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు. చదవండి: Ind Vs Aus 1st T20: పాండ్యా భావోద్వేగం! పాక్తో మ్యాచ్లోనూ ఓడిపోవాలంటూ నటి ట్వీట్! మీ వాళ్లేదో పొడిచేసినట్టు?! Rohit Vs Dinesh Karthik: దినేశ్ కార్తిక్పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ -
ప్రో కబడ్డీ వేలం: ఐపీఎల్ రేంజ్లో ధర పలికిన ప్లేయర్స్.. రికార్డులు బ్రేక్
Pro Kabaddi.. దేశంలో క్రికెట్తో పాటుగా కబడ్డీకి సైతం క్రేజ్ ఉంది. ఇండియాలో ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీకి(Pro Kabbadi)కి కూడా ఎంతో ఆదరణ కనిపించింది. కబడ్డి ఫ్యాన్స్ను అలరిస్తూ ప్రో కబడ్డీ ఇప్పటికి 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రో కబడ్డీ 9వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. అయితే, 9వ సీజన్కు ముందు ప్రో కబడ్డీకి భారీ వేలం జరిగింది. ముంబై వేదికగా రెండు రోజులపాటు(ఆగస్టు5, 6 తేదీల్లో) జరిగిన మెగా వేలంలో కబడ్డీ స్టార్ ప్లేయర్స్ ఊహించని ధర పలికారు. వేలంలో రికార్డు ధరకు ప్లేయర్స్ను ప్రాంచైజీలు దక్కించుకున్నాయి. మొత్తంగా 12 టీమ్స్ 500 మంది ప్లేయర్స్ను కొనుగోలు చేయడానికి పోటీపడ్డాయి. It's the Hi-Flyer's 🌏 and we're just living in it 🤷♂️ Pawan Sehrawat shatters the #vivoPKLPlayerAuction records to emerge as the most expensive buy in the history of #vivoProKabaddi 🤯@tamilthalaivas can now breathe easy like all of us, eh? 👀 pic.twitter.com/Ej2PtKPqFv — ProKabaddi (@ProKabaddi) August 5, 2022 కాగా, ఈ మెగా వేలంలో రికార్డు స్థాయిలో పవన్ షెరావత్ను రూ.2.65కోట్లకు తమిళ్ తలైవాస్ దక్కించుకోగా.. వికాస్ ఖండోలాను రూ.1.70కోట్లకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. ఇక, ఫజల్ అట్రాసలిని పూణేరి పల్టన్స్.. రూ. 1. 38కోట్లకు దక్కించుకుంది. గుమాన్ సింగ్ను రూ. 1.21కోట్లకు యు ముంబా కొనుగోలు చేసింది. మరోవైపు.. ప్రొ కబడ్డీలో రికార్డు బ్రేకర్గా పేరొందిన ప్రదీప్ నర్వాల్ను రూ.90 లక్షలకు యూపీ యోధా ఎఫ్బీఎంలో దక్కించుకుంది. ప్రొ కబడ్డీ చరిత్రలోనే పవన్ షెరావత్.. భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఇక హర్యానా స్టీలర్ రూ.65.10లక్షలకు అమీర్ హొసైన్ను, రవికుమార్ను రూ.64.10లక్షలకు(దబాంగ్ ఢిల్లీ), నీరజ్ నర్వాల్ను బెంగళూరు బుల్స్ రూ.43లక్షలకు కొనుగోలు చేసుకున్నాయి. ನಮ್ಮ ಗೂಳಿ ಪಡೆ 😍 How's that squad looking, #BullsSene? ⚡#FullChargeMaadi #BengaluruBulls #vivoPKLPlayerAuctions pic.twitter.com/oDyrX89itc — Bengaluru Bulls (@BengaluruBulls) August 6, 2022 Ala re ala! We welcome the Sultan to Pune! 🦁 . .#PuneriPaltan #Bhaaripaltan #Gheuntak #vivoPKLPlayersAuction #BhaariAuction pic.twitter.com/CqgL2limse — Puneri Paltan (@PuneriPaltan) August 5, 2022 ఇక, తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే.. రజనీష్, అంకిత్ బెనివల్ను రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా అభిషేక్ సింగ్, మోను గోయల్,పర్వేష్ భైంస్వాల్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, సిద్దార్ధ్ దేశాయ్ను కొనుగోలు చేశారు. కాగా, రాహుల్ చౌదరిని కనీస ధర రూ.10లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. దబాంగ్ ఢిల్లీ నవీన్ కుమార్, విజయ్ను రీటైన్ చేసుకుంది. Our first buy of the day Parvesh Bhainswal will be the part of #Titansquad#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/uYFjkcC4jo — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Abhishek Singh is set to expand the strength of the #Titansquad in season-9. How excited are you ?#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/gvJRfJaIkD — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Pesh hai aapke #PKL2022 #GujaratGiants squad! 💪#Giant family, how do you feel about the team? 🤩#GarjegaGujarat #Adani #vivoProKabaddi #vivoPKLPlayerAuction pic.twitter.com/UCyjmZSGdX — Gujarat Giants (@GujaratGiants) August 6, 2022 ఇది కూడా చదవండి: సెమీ ఫైనల్కు దూసుకెళ్లిన పీవీ సింధు.. -
PKL 2022: 16వ పరాజయం.. మీరు ఆడడం దండగ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టుకు 16వ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 35–54 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. తెలుగు టైటాన్స్ తరఫున ఆడుతున్న తెలంగాణ ప్లేయర్ గల్లా రాజు రెడ్డి అద్భుత రెయిడింగ్తో ఆకట్టుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన రాజు తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ లీగ్లో ఇప్పటివరకు 21 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక మ్యాచ్లో నెగ్గి, నాలుగు మ్యాచ్లను ‘టై’ చేసుకొని 16 మ్యాచ్ల్లో ఓడి 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 52–21తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. -
ప్లే ఆఫ్స్కు పట్నా పైరేట్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. తెలుగు టైటాన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా 38–30 పాయింట్ల తేడాతో గెలిచింది. 19 మ్యాచ్లు ఆడిన పట్నా 14 మ్యాచ్ల్లో గెలిచి 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్లో 15వ పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్ 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. పట్నాతో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ మరోసారి రాణించి 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో అతను వంద వ్యక్తిగత రెయిడింగ్ పాయింట్లను పూర్తి చేసుకున్నాడు. పట్నా పైరేట్స్ తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 44–28తో దబంగ్ ఢిల్లీపై నెగ్గగా... గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్ మ్యాచ్ 31–31తో ‘టై’గా ముగిసింది. -
Pro Kabaddi League: అయ్యో.. మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
Pro Kabaddi League: - బెంగళూరు: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ‘టై’ లేదంటే ఓటమితో పదేపదే నిరాశపరుస్తోన్న తెలుగు జట్టు గురువారం జరిగిన మరో మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. తమిళ్ తలైవాస్తో జరిగిన ఈ పోరులో తెలుగు టైటాన్స్ 25–43 స్కోరుతో ఓడిపోయింది. టైటాన్స్ జట్టులో గల్లా రాజు (9 పాయింట్లు) రాణించాడు. తలైవాస్ జట్టులో రెయిడర్ అజింక్యా పవార్ 10 పాయింట్లు సాధించాడు. ఇంతవరకు ఒక్కటే మ్యాచ్ గెలిచిన టైటాన్స్ జట్టు 11 మ్యాచ్ల్లో ఓడి 3 మ్యాచ్లను ‘టై’ చేసుకుంది. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! -
తెలుగు టైటాన్స్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో హరియాణా స్టీలర్స్, తెలుగు టైటాన్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ 39–39 వద్ద టైగా ముగిసింది. టైటాన్స్ తరఫున అంకిత్ బెనివాల్ 10, రోహిత్ కుమార్ 8, సందీప్, ఆదర్శ్ 6 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ 22 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు తమ 11వ మ్యాచ్లో ఎట్టకేలకు తొలి గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 35–34తో జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ ఎనిమిది పాయింట్లు... మరో రెయిడర్ ఆదర్శ్ తొమ్మిది పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ 13 పాయిం ట్లు స్కోరు చేశాడు. టైటాన్స్ ప్రస్తుతం 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 37–30తో పుణేరి పల్టన్పై గెలిచింది. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. వరుసగా ఎనిమిదో పరాజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. బెంగాల్ వారియర్స్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 27–28తో ఓటమి చవిచూసింది. ఈ లీగ్లో తెలుగు టైటాన్స్కిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ రెండు మ్యాచ్లను ‘టై’ చేసుకుంది. 12 పాయింట్లతో టైటాన్స్ జట్టు 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో చిట్టచివరి స్థానంలో ఉంది. బెంగళూరుతో మ్యాచ్ లో ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ చివర్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. టైటాన్స్ తరఫున రెయిడర్ రజనీశ్ 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 50–40తో పుణేరి పల్టన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. -
Pro Kabaddi League: రాత మారలేదు.. మళ్లీ ఓడిన టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 22–40తో ఓడింది. ఈ లీగ్లో తెలుగు టైటాన్స్కిది ఆరో ఓటమి. టైటాన్స్ తరఫున రెయిడర్ రజనీశ్ ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేసి 12 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–23తో యు ముంబాను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో యూపీ యోధ; దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. చదవండి: SA vs IND: కోహ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్.. వెంటనే మయాంక్ ఔటయ్యాడు.. వీడియో వైరల్ -
PKL 2021: తెలుగు టైటాన్స్కు ఐదో ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 38–48తో ఓడిపోయింది. ఈ లీగ్లో తెలుగు టైటాన్స్కిది ఐదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున గల్లా రాజు ఎనిమిది పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీ 37–33తో యూపీ యోధపై, పట్నా పైరేట్స్ 27–26తో గుజరాత్ జెయింట్స్పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో పుణేరి పల్టన్తో బెంగాల్ వారియర్స్; బెంగళూరు బుల్స్తో యూపీ యోధ తలపడతాయి. చదవండి: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా! -
Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ జట్టు 39–37తో తెలుగు టైటాన్స్ను ఓడించింది. హరియాణా తరఫున మీతూ 12 పాయింట్లు సాధించాడు. తెలుగు టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్, అంకిత్ చెరో 9 పాయిం ట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–26తో పుణేరి పల్టన్పై నెగ్గింది. -
ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ తొలి ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 33–34తో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. స్టార్ రెయిడర్ సిద్ధార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 20–14తో ఆధిక్యంలో నిలిచింది. అయితే పుణేరి పల్టన్ వరుస రెయిడ్ పాయింట్లతో పాటు టైటాన్స్ ప్లేయర్లను పట్టేయడంతో మ్యాచ్లోకి దూసుకొచ్చింది. స్కోరు 33–33తో సమంగా ఉన్న సమయంలో కూతకు వెళ్లిన మోహిత్ పుణేరి పల్టన్కు పాయింట్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్ చివరి రెయిడ్కు వెళ్లిన అంకిత్ (టైటాన్స్) ఒట్టి చేతులతో రావడంతో పాయింట్ తేడాతో పుణేరి పల్టన్ విజయం సాధించింది. ఇతర మ్యాచ్ల్లో యూపీ యోధ 36–35తో పట్నా పైరేట్స్పై, జైపూర్ పింక్ పాంథర్స్ 40–38తో హరియాణా స్టీలర్స్పై నెగ్గాయి. చదవండి: India vs South africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే.. -
‘టై’తో మొదలుపెట్టిన టైటాన్స్
బెంగళూరు: తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ను ‘టై’తో ఆరంభించింది. బుధవారం టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 స్కోరుతో సమంగా ముగిసింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ 11 పాయింట్లు సాధించగా, డిఫెండర్లలో సందీప్ 5, రుతురాజ్, అరుణ్ మూడేసి పాయింట్లు తెచ్చి పెట్టారు. మ్యాచ్లో తలైవాస్ రైడర్ మన్జీత్ సత్తా చాటాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 3 బోనస్ పాయింట్లు సహా 12 పాయింట్లు స్కోరు చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే స్టార్ రైడర్ సిద్ధార్థ్, రజ్నీశ్ జట్టుకు వరుస పాయింట్లు సాధించిపెట్టారు. డిఫెండర్ సందీప్ కండోలా కూడా ప్రత్యర్థి రైడర్లను చేజిక్కించుకోవడంతో టైటాన్స్ జట్టు 8 నిమిషాల్లోనే తలైవాస్ను ఆలౌట్ చేసింది. అనంతరం తలైవాస్ రైడర్ మన్జీత్ దీటుగా పాయింట్లు సాధించడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మన్జీత్ చేసిన సూపర్ రైడ్ ఏకంగా 3 పాయింట్లు తెచ్చిపెట్టడంతో నిమిషాల వ్యవధిలో ఆధిక్యం మారిపోయింది. తొలి అర్ధ భాగం 23–21 వద్ద ముగిసింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు శ్రమించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఒక దశలో ఇరు జట్ల రైడర్లు విఫలమైతే డిఫెండర్ల హవా కొనసాగింది. తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేయడం ద్వారా తలైవాస్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే సిద్ధార్ధ్ దేశాయ్ కీలక దశలో రైడింగ్కు వెళ్లినప్పుడల్లా పాయింట్లు సాధించడంతో టైటాన్స్ పుంజుకుంది. ఇంకో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా తన రైడింగ్ పాయింట్తో తమిళ్ తలైవాస్ రెండోసారి ఆలౌటైంది. అక్కడే స్కోరు సమమైంది. టాకిల్తో సందీప్, రైడింగ్తో సిద్ధార్థ్ తెలుగు జట్టును ఓటమి నుంచి తప్పించారు. ఇతర మ్యాచ్లలో యు ముంబా 46–30తో బెంగళూరు బుల్స్పై...బెంగాల్ వారియర్స్ 38–33తో యూపీ యోధపై గెలిచింది. సిద్ధార్థ్ దేశాయ్ -
తెలుగు టైటాన్స్తో ట్రూక్ భాగస్వామ్యం
ప్రో కబడ్డీ లీగ్ టీమ్ తెలుగు టైటాన్స్తో ట్రూక్ భాగస్వామ్యం చేసుకుంది.అత్యధిక నాణ్యత గల వైర్లెస్ స్టీరియోలు, వైర్లెస్ హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లతో పాటు సంగీత అభిమానుల కోసం బెస్పోక్ అకౌస్టిక్ పరికరాలను రూపొందించే భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఆడియో బ్రాండ్ లలో ట్రూక్ ఒకటిగా ఉంది. లీగ్ లో ట్రూక్.. తెలుగు టైటాన్స్ కు అధికారిక ఆడియో పార్ట్నర్ గా ఉండనుంది.ఇటీవలి కాలంలో ట్రూక్ ఆఫర్లు గేమింగ్ TWS సెగ్మెంట్పై దృష్టి సారించాయి. ఇక తాజాగా ప్రో కబడ్డీ లీగ్ లో కూడా తాము భాగస్వాములమైనందుకు ట్రూక్ ఇండియా సీఈవో పంకజ్ ఉపాధ్యాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంకజ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ..ప్రో-కబడ్డీ లీగ్లో అత్యంత ఆశాజనకమైన టీమ్లలో ఒకటైన తెలుగు టైటాన్స్ అధికారిక ఆడియో భాగస్వామిగా, దేశంలోని ప్రతి కబడ్డీ అభిమానుల గర్జనను సెట్ చేస్తామని మేము నమ్ముతున్నాము. అలాగే, గేమింగ్-ఓరియెంటెడ్ TWS కంపెనీగా మమ్మల్ని మేము సమలేఖనం చేసుకున్నందున, ఈ అద్భుతమైన కమింగ్-టుగెదర్ అనేది బ్రాండింగ్ కోణంలో ఖచ్చితమైన సమయం కంటే తక్కువ కాదు. మా ఈ ప్రయాణం మాకు అండగా నిలిచే వారందరికీ అద్భుతమైన ఉత్సాహాన్ని, వినోదాన్ని అందిస్తుంది.. ’ అని తెలిపారు. తెలుగు టైటాన్స్ యజమాని శ్రీని శ్రీరామనేని స్పందిస్తూ.. వివో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 కోసం ట్రూక్ తెలుగు టైటాన్ అధికారిక ఆడియో భాగస్వామిగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. కొత్త బ్రాండ్ అయిన ట్రూక్ మా బృందం శక్తితో సరిపోతుంది. మేము ట్రూక్తో గొప్ప సంబంధం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము" అని అన్నారు. చదవండి: జనవరి 1 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ధరలు పెరగనున్నాయి? -
Pro Kabaddi League: ఈనెల 22 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: కబడ్డీ కూతకు రంగం సిద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఈ నెల 22 నుంచి బెంగళూరులో జరగనుంది. ఎనిమిదో సీజన్ మొత్తానికి ఇదే నగరం వేదిక కానుండటం మరో విశేషం. కరోనా కొత్త వేరియంట్ల కలకలం, ఈ ఏడాది ఐపీఎల్ అనుభవాల దృష్ట్యా మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. డిసెంబర్ 22న తొలి మ్యాచ్లో యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడనుంది. అదే రోజు తెలుగు టైటాన్స్తో తమిళ్ తలైవాస్, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్తో యూపీ యోధ పోటీ పడతాయి. కరోనా మహమ్మారి పడగ విప్పటంతో గతేడాది ప్రొ కబడ్డీ లీగ్ రద్దయింది. చదవండి: Ind Vs SA 2021- Virat Kohli: వారం రోజుల్లో తేలననున్న కోహ్లి భవితవ్యం.. కొనసాగిస్తారా? లేదంటే! -
విజయంతో టైటాన్స్ వీడ్కోలు
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ను తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 41–36తో యూపీ యోధపై విజయం సాధించింది. సిద్ధార్థ్ దేశాయ్ చక్కగా రాణించాడు. 15 సార్లు రైడింగ్ వెళ్లిన అతను 15 పాయింట్లు తెచి్చపెట్టాడు. మిగతా వారిలో కృష్ణ మదనే, ఫర్హాద్ చెరో 4 పాయింట్లు సాధించారు. యూపీ యోధ జట్టులో శ్రీకాంత్ జాదవ్ (8), రిషాంక్ దేవడిగ (8) అదరగొట్టారు. సుమిత్ (5), మోను గోయత్ (4), నితీశ్ కుమార్ (4) రాణించారు. మొత్తం మీద 22 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ 6 విజయాలతో 11వ స్థానంలో నిలిచింది. 4 విజయాలతో తమిళ్ తలైవాస్ అట్టడుగున నిలిచింది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 33–29తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. నేడు (గురువారం) జరిగే పోటీలో యు ముంబాతో హరియాణా స్టీలర్స్ తలపడుతుంది. -
తీరు మారని టైటాన్స్
గ్రేటర్ నోయిడా: ఇప్పటికే డజను ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్... తాజాగా మరో ఓటమితో ఆ స్థానాన్ని మెరుగు పరుచుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది. సోమవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 38–48తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో చిత్తయింది. సిద్దార్థ్ దేశాయ్ 13 పాయింట్ల ప్రదర్శన ప్రత్యర్థి రైడర్లు సోను (17 పాయింట్లు), రోహిత్ గులియా (9 పాయింట్లు) ముందు చిన్నదైంది. టైటాన్స్కు సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా... దానిని గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కాపాడుకుంటుందో లేక చిట్ట చివరి స్థానానికి పడిపోతుందో చూడాలి. మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 35–33తో జైపూర్ పింక్ పాంథర్స్పై నెగ్గింది. అజిత్కుమార్ సూపర్‘టెన్’తో జట్టుకు విజయాన్ని అందించాడు నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో తమిళ్ తలైవాస్; యూపీ యోధతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
మళ్లీ ఓడిన టైటాన్స్
పంచకుల: పేలవ ఆటతీరుతో ప్లే ఆఫ్స్కు దూరమైన తెలుగు టైటాన్స్... చివరి దశ మ్యాచ్ల్లోనైనా సత్తా చాటుతుందని అనుకుంటే దారుణమైన ఆటతీరుతో నిరాశ పరుస్తోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 32–52తో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడింది. రైడర్ సిద్దార్థ్ దేశాయ్ (12 పాయింట్లు), ఆల్ రౌండర్ ఫర్హాద్ (10 పాయింట్లు) పోరాటం... సమష్టిగా రాణించిన హరియాణా ముందు నిలబడలేదు. వికాస్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 41–34తో బెంగళూరు బుల్స్పై గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో దీపక్ (16 పాయింట్లు) సత్తా చాటడంతో జైపూర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కు ఇప్పటికే ఐదు జట్లు ఢిల్లీ, బెంగాల్, హరియాణా, ముంబై, బెంగళూరు అర్హత సాధించగా... చివరిదైన ఆరో బెర్త్ కోసం జైపూర్, యూపీ పోటీ పడుతున్నాయి. -
పోరాడి ఓడిన టైటాన్స్
పంచకుల: తెలుగు టైటాన్స్ను గెలిపించడానికి రాకేశ్ గౌడ చేసిన పోరాటం వృథా అయ్యింది. గురువారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లో టైటాన్స్ 50–53తో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. ఒక దశలో టైటాన్స్ 21–44 తో వెనుకబడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకునేట్లు కనిపించింది. అయితే రాకేశ్ గౌడ (17 పాయింట్లు), ఫర్హాద్ మిలాఘర్దన్ (10 పాయింట్లు) చెలరేగి ఓటమి అంతరాన్ని తగ్గించారు. పుణేరి తరఫున మంజీత్ (12 పాయింట్లు), సుశాంత్ (11 పాయింట్లు) రాణించారు. నేటి మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్; హరియాణా స్టీలర్స్తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
టైటాన్స్ను గెలిపించిన సిద్ధార్థ్
జైపూర్: తెలుగు టైటాన్స్ను సిద్ధార్థ్ దేశాయ్ గెలిపించాడు. ఏకంగా 22 పాయింట్లతో చెలరేగిన అతను జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 51–31తో జైపూర్ పింక్ పాంథర్స్ను చిత్తు చేసింది. సిద్ధార్థ్కు తోడు రజ్నీశ్ దలాల్ సూపర్ టెన్ (11 పాయింట్లు), ట్యాక్లింగ్లో ఫర్హాద్ మిలాఘర్దాన్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 35–33తో యు ముంబాపై గెలుపొందింది. పవన్ షెరావత్ 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేటి మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో యూపీ యోధ; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
టైటాన్స్ పదో పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్లో తెలుగు టైటాన్స్ పదో పరాజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 39–40తో బెంగాల్ వారియర్స్ చేతిలో పోరాడి ఓడింది. టైటాన్స్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా ట్యాక్లింగ్లో సారథి అ»ొజర్ మోహజెర్ మిఘాని ‘హై–ఫై’ (5 పాయింట్లు)తో చెలరేగినా అది జట్టుకు విజయం అందించలేదు. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్గా నిలిచాడు. తాజా విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెంగాల్... టైటాన్స్ను 15వ నిమిషంలో ఆలౌట్ చేసింది. మొదటి భాగాన్ని 19–13తో ముగించింది. రెండో భాగంలో జోరు పెంచిన టైటాన్స్ ప్రత్యరి్థని ఆలౌట్ చేసింది. ఈ సమయంలో బెంగాల్ను రైడింగ్తో ఆదుకున్న మణీందర్ గెలుపు ఖాయం చేశాడు. తాజా ఓటమితో టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 43–34తో పుణేరి పల్టన్పై గెలుపొందింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా సూపర్ ‘టెన్’ (12 పాయింట్లు)తో రాణించాడు. నేటి మ్యాచ్లో పట్నా పైరేట్స్తో దబంగ్ ఢిల్లీ తలపడుతుంది.