మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌ | Telugu Titans defeated again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

Published Sat, Sep 16 2017 12:42 AM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిన టైటాన్స్‌ శుక్రవారం

రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిన టైటాన్స్‌ శుక్రవారం పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత చెత్తగా ఆడింది. దీంతో 30–46 తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో జట్టుకిది 11వ ఓటమి కావడం గమనార్హం. ప్రథమార్ధం ఆరంభంలో బాగానే ఆడినా ఆ తర్వాత ఆట గతి తప్పింది. దీంతో 16–23తో వెనకబడింది. ఆ తర్వాత కూడా పట్నా ఆటగాళ్లు సులువుగా కట్టడి చేయడంతో టైటాన్స్‌ ఓటమి ఖాయమైంది.

ప్రదీప్‌ నర్వాల్‌ 14 రైడింగ్‌ పాయింట్లు సాధించగా టైటాన్స్‌ నుంచి రాహుల్‌ చౌధరి 7 పాయింట్లు మాత్రమే సాధించాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 39–28 తేడాతో యు ముంబాపై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్‌.. పట్నా పైరేట్స్‌తో యూపీ యోధ తలపడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement