-
‘టై’తో టైటాన్స్ ముగింపు
పంచ్కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ను తెలుగు టైటాన్స్ జట్టు ‘టై’తో ముగించింది. యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ 45–45 వద్ద ‘టై’ అయింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నిర్ణీత 22 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ను ‘టై’ చేసుకొని, రెండు మ్యాచ్ల్లో నెగ్గి 21 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకుంది. తొమ్మిదో సీజన్లోనూ టైటాన్స్ చివరి స్థానంలోనే నిలిచింది. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో పుణేరి పల్టన్తో యూపీ యోధాస్; హరియాణా స్టీలర్స్తో బెంగళూరు బుల్స్ ఆడతాయి. -
Pro Kabaddi League: పుణేరి, ముంబా మ్యాచ్ ‘టై’
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరి పల్టన్ తొలి ‘టై’ నమోదు చేసింది. యు ముంబా, పుణేరి పల్టన్ జట్ల మధ్య గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ 32–32 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యు ముంబా ప్లేయర్ గుమన్ సింగ్ 15 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో దబంగ్ ఢిల్లీ; తెలుగు టైటాన్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
మాజీ ఛాంపియన్కు షాకిచ్చిన ఢిల్లీ.. సీజన్లో ఏడో విజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 40–34తో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. ఈ లీగ్లో దబంగ్ ఢిల్లీకిది ఏడో విజయం కావడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ జట్టు 40 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ముంబాతో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు. మంజీత్ ఆరు పాయింట్లు, యోగేశ్ నాలుగు పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 11 పాయింట్లు, గుమన్ సింగ్ 9 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 35–33తో పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. బెంగళూరు బుల్స్ తరఫున సచిన్ నర్వాల్ 9 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 8 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్లో తెలుగు టైటాన్స్తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. -
PKL 2024: టైటాన్స్కు ఏడో ఓటమి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 32–54తో ఓడిపోయింది. ఈ లీగ్లో టైటాన్స్ జట్టుకిది ఏడో పరాజయం కావడం గమనార్హం. యు ముంబా తరఫున గుమన్ సింగ్ 10 పాయింట్లు, రింకూ 8 పాయింట్లు, సోంబీర్ 8 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున రజనీశ్ 8 పాయింట్లు, రాబిన్ చౌధరీ 7 పాయింట్లు, ప్రఫుల్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 35–25తో యూపీ యోధాస్ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్; తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
PKL 2023: పవన్ పోరాటం వృథా
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఆరో మ్యాచ్లో గెలుపు బోణీ కొట్టిన టైటాన్స్ మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన తమ ఏడో మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 31–33తో బెంగళూరు బుల్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేసిన తన జట్టును గెలిపించలేకపోయాడు. అజిత్ పవార్ 5 పాయింట్లు, రజనీశ్ 3 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుర్జీత్ సింగ్ (7), భరత్ (6), వికాశ్ కండోలా (5), నీరజ్ నర్వాల్ (5) రాణించారు. మరో మ్యాచ్లో యు ముంబా 39–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. యు ముంబా జట్టు తరఫున అమీర్ మొహమ్మద్ 8 పాయింట్లు, గుమన్ సింగ్ 6 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ అత్యధికంగా 11 పాయింట్లు స్కోరు చేశాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో దబంగ్ ఢిల్లీ; తమిళ్ తలైవాస్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. Came like 𝙋𝙖𝙬𝙖𝙣, went with the Bulls 😉#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/azN98ZP8fU — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 SUPE𝐑𝐑𝐑 TACKLE ft. Ajit Pawar 💛#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/fHyLLmze8F — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 -
మాజీ ఛాంపియన్కు షాక్.. గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయం
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 39–37తో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. ఈ లీగ్లో గుజరాత్కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. రెయిడర్ సోనూ జగ్లాన్ 11 పాయింట్లు స్కోరు చేసి గుజరాత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. రాకేశ్ (9 పాయింట్లు), రోహిత్ గులియా (7 పాయింట్లు) కూడా రాణించారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్, అమీర్ మొహమ్మద్ పది పాయింట్ల చొప్పున స్కోరు చేసినా కీలకదశలో గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో తెలుగు టైటాన్స్తో పట్నా పైరేట్స్; యూపీ యోధాస్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: వరుసగా 11 పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు రెండో విజయం అందుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 32–26తో యు ముంబాను ఓడించింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ తొమ్మిది పాయింట్లు, అభిషేక్ ఐదు పాయింట్లు, విశాల్ భరద్వాజ్ నాలుగు పాయింట్లు స్కోరు చేశారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఇతర మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీ 30–27తో పట్నా పైరేట్స్పై... జైపూర్ పింక్ పాంథర్స్ 42–29తో యూపీ యోధాస్పై గెలిచాయి. -
Pro Kabaddi League 9: కూతకు వేళాయె!
బెంగళూరు: ఎనిమిది సీజన్లుగా అలరిస్తున్న కబడ్డీ మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్కు రంగం సిద్ధమైంది. బెంగళూరులో నేడు ఈ టోర్నీ ప్రారంభం కానుంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్, పుణే నగరాల్లో అన్ని మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో టీవీలకే పరిమితమైన అభిమానులు ఈ సారి నేరుగా ఆటను ఆస్వాదించడం అవకాశం నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఈ మూడు వేదికల్లోనూ ఫ్యాన్స్ను అనుమతించనున్నారు. మొత్తం 12 జట్లు లీగ్ బరిలోకి దిగుతున్నాయి. లీగ్లో భాగంగా మొత్తం 66 మ్యాచ్లు జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి పోరులో యు ముంబాతో డిఫెండింగ్ చాంపియన్ దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. జాతీయ క్రీడల్లో కబడ్డీ ఈవెంట్ ముగిసిన వారం రోజుల్లోపే అందరూ ఆటగాళ్లు లీగ్కు సిద్ధమై బరిలోకి దిగుతున్నారు. రాహుల్ రెడీ లీగ్ వేలంలో రూ. 2.26 కోట్ల విలువ పలికిన పవన్కుమార్ సెహ్రావత్ (తమిళ్ తలైవాస్)పై అందరి దృష్టీ నిలిచి ఉంది. గత సీజన్లో పునేరీ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన స్టార్ రాహుల్ చౌదరి గాయంనుంచి కోలుకొని ఈ సారి జైపూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది సీజన్లలో పట్నా పైరేట్స్ 3 సార్లు విజేతగా నిలవగా...బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. టైటాన్స్ రాత మారేనా! ప్రొ కబడ్డీ లీగ్లో ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్లలో తెలుగు టైటాన్స్ ఒకటి. ఎనిమిది సీజన్లు కలిపి 148 మ్యాచ్లలో 52 గెలిచిన టైటాన్స్, అంతకంటే ఎక్కువ పరాజయాలు (77) నమోదు చేసింది. అయితే ఇతర జట్లకంటే ఎక్కువ ‘డ్రా’లు (19) కూడా టైటాన్స్ ఖాతాలో ఉన్నాయి. వీటిని విజయాలుగా మలచుకోగలిగితే కథ వేరేగా ఉండేదేమో. టైటాన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో ఏడో సీజన్లో 11వ, ఎనిమిదో సీజన్లో 12వ స్థానాల్లో నిలిచింది. అయితే ఈ సారి జట్టు కాస్త మెరుగ్గా, సమతూకంగా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో ఆకట్టుకున్న రైడర్ అభిషేక్ సింగ్ను తీసుకోగా, మనూ గోయత్, సిద్ధార్థ్ దేశాయ్ మళ్లీ జట్టులోకి వచ్చారు. అంకిత్ బెనివాల్, రజనీశ్, డిఫెన్స్లో విశాల్ భరద్వాజ్ జట్టుకు కీలకం కానున్నారు. వెంకటేశ్ గౌడ్ టీమ్కు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. నేడు తమ తొలి పోరులో బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
PKL 2022: ప్రొ కబడ్డీ లీగ్ మొదటి దశ షెడ్యూల్ విడుదల! వేదికలు, ఇతర వివరాలు
Pro Kabaddi League 2022 Schedule And Other Details: కబడ్డీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)- 2022 వచ్చే నెల(అక్టోబరు)లో ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్ను లీగ్ నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు లీగ్ నిర్వాహక సంస్థ మాషల్ స్పోర్ట్స్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్తో లీగ్ ఆరంభం డిఫెండింగ్ చాంపియన్ దబాంగ్ ఢిల్లీ కేసీ, యు ముంబా మధ్య మ్యాచ్తో అక్టోబరు 7 పీకేఎల్ సీజన్ 9కు తెరలేవనుంది. అదే రోజు బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్తో యూపీ యోధాస్ తలపడనున్నాయి. మొదటి దశలో భాగంగా అక్టోబరు 7 నుంచి నవంబరు 8 వరకు 66 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్లో లీగ్లో పాల్గొనే ప్రతి జట్టూ ఇతర జట్లతో పోటీపడుతుంది. అంతకు మించిన వినోదం ఇక వీవో పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మాషల్ స్పోర్ట్స్ హెడ్, లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. బెంగళూరు, పుణె, హైదరాబాద్ వేదికగా మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సీజన్కు మించిన వినోదంతో కబడ్డీ అభిమానుల ముందుకు వస్తున్నామని.. సరికొత్త బెంచ్మార్క్లు సెట్ చేస్తామని పేర్కొన్నారు. లైవ్స్ట్రీమింగ్ ఎక్కడంటే.. వివో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టికెట్లు ఎలా? పీకేఎల్-2022 టికెట్లను బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు. చదవండి: Ind Vs Aus 1st T20: పాండ్యా భావోద్వేగం! పాక్తో మ్యాచ్లోనూ ఓడిపోవాలంటూ నటి ట్వీట్! మీ వాళ్లేదో పొడిచేసినట్టు?! Rohit Vs Dinesh Karthik: దినేశ్ కార్తిక్పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ -
పవన్ ఒంటరి పోరాటం వృథా
ప్రొ కబడ్డీ లీగ్లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్కు ఆరో పరాజయం ఎదురైంది. బెంగళూరులో బుధవారం యు ముంబాతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 34–45తో ఓడిపోయింది. గత ఐదు మ్యాచ్ల్లో బెంగళూరుకిది నాలుగో ఓటమి. బెంగళూరు కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ముంబా జట్టులో అభిషేక్ సింగ్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. -
Pro Kabaddi League: దబంగ్ ఢిల్లీకి ఏడో విజయం.. అగ్రస్థానంలోకి
Pro Kabaddi League: Delhi Dabang Beat Patna Pirates: ప్రొ కబడ్డీ లీగ్లో దబంగ్ ఢిల్లీ జట్టు ఏడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 32–29తో పట్నా పైరేట్స్ను ఓడించింది. ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ సందీప్ నర్వాల్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఈ లీగ్ చరిత్రలో సందీప్ రెయిడింగ్ పాయింట్ల సంఖ్య 250 దాటింది. గుజరాత్ జెయింట్స్, యు ముంబా జట్ల మధ్య మ్యాచ్ 24–24తో ‘టై’ అయింది. చదవండి: IPL 2022 Auction: రాహుల్తో పాటు ఆసీస్ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడికి 15 కోట్లు! -
తమిళ్ తలైవాస్, యు ముంబా మ్యాచ్ టై
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మూడో ‘టై’ నమోదైంది. తమిళ్ తలైవాస్, యు ముంబా జట్ల మధ్య సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ 30–30 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యు ముంబా తరఫున వి.అజిత్ కుమార్ 15 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు ఖాతాలో ఇది రెండో ‘టై’ కావడం గమనార్హం. లీగ్ తొలి రోజు తెలుగు టైటాన్స్తో జరిగిన మ్యాచ్ను తమిళ్ తలైవాస్ 40–40తో ‘టై’ చేసు కుంది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 32–29తో యూపీ యోధపై నెగ్గింది. నేడు పుణేరి పల్టన్తో పట్నా పైరేట్స్; తెలుగు టైటాన్స్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. చదవండి: Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే.. -
నవీన్ అదుర్స్ దబంగ్ ఢిల్లీకి రెండో విజయం
బెంగళూరు: దబంగ్ ఢిల్లీ జట్టు స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ మరోసారి చెలరేగాడు. ఏకంగా 17 పాయింట్లు సాధించడంతో... ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 31–27తో యు ముంబాపై గెలిచింది. మ్యాచ్లో మొత్తం 28 సార్లు కూతకు వెళ్లిన నవీన్ 16 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్ను పట్టేసి మరో పాయింట్ను సాధించాడు. ఈ ప్రదర్శనతో నవీన్ 500 రెయిడింగ్ పాయింట్ల మార్కును అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్ (47)ల్లో ఈ ఘనతను అందుకున్న తొలి రెయిడర్గా నవీన్ నిలిచాడు. సహచరుడు జోగిందర్ సింగ్ నర్వాల్ (4 పాయింట్ల) ప్రత్యర్థిని పట్టేయడంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యు ముంబా తరఫున అజిత్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు. ఇతర మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్ 38–30తో తమిళ్ తలైవాస్పై, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 31–28తో గుజరాత్ జెయింట్స్ గెలిచాయి. నేటి మ్యాచ్ల్లో యూపీ యోధతో పట్నా పైరేట్స్; పుణేరి పల్టన్తో తెలుగు టైటాన్స్; హరియాణా స్టీలర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి. -
సెమీస్లో బెంగళూరు, ముంబా
అహ్మదాబాద్: ఆరంభంలో తడబడినా... పవన్ అసాధారణ పోరాటంతో ఓడాల్సిన మ్యాచ్ను డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ గెలిచింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఫలితం కోసం అదనపు సమయం వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 48–45తో యూపీ యోధపై విజయం సాధించి సెమీస్లో అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 36–36తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ఆరు నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. అదనపు సమయంలో వవన్ సూపర్ రైడ్తో చెలరేగడంతో బెంగళూరు బుల్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. పవన్కు సుమిత్ సింగ్ (7 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) సహకరించారు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో యు ముంబా 46–38తో హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. బుధవారం జరిగే సెమీఫైనల్స్లో బెంగళూరు బుల్స్తో దబంగ్ ఢిల్లీ; యు ముంబాతో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
యు ముంబా విజయం
గ్రేటర్ నోయిడా: తన అద్భుతమైన ట్యాక్లింగ్తో ప్రత్యర్థిని పట్టేసిన యు ముంబా సారథి ఫజల్ అత్రాచలి జట్టుకు విజయాన్ని అందించాడు. గురువారం జరిగిన మ్యాచ్లో యు ముంబా 39–33తో హరియాణా స్టీలర్స్పై గెలుపొందింది. ట్యాక్లింగ్లో మెరిసిన అత్రాచలి 8 పాయింట్లతో అదరగొట్టాడు. అతనికి రైడర్ అజింక్యా కప్రె (9 పాయింట్లు) చక్కటి సహకారం అందించాడు. హరియాణా రైడర్ వినయ్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ; యూపీ యోధతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
ప్లే ఆఫ్స్కు యు ముంబా
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–7)లో తాజాగా యు ముంబా ప్లే ఆఫ్స్కు చేరింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో మాజీ చాంపియన్ ముంబా జట్టు 30–26తో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. యు ముంబా జట్టులో అభిషేక్ సింగ్ (7), అతుల్ (5), రోహిత్ బలియన్ (5), ఫజల్ అత్రాచలి (4) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున ప్రదీప్ నర్వాల్ (8) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 59–36తో హరియాణా స్టీలర్స్పై భారీ విజయం సాధించింది. బెంగళూరు తరఫున పవన్ షెరావత్ ఒక్కడే రికార్డు స్థాయిలో 39 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే పోరులో తెలుగు టైటాన్స్తో పుణేరి పల్టన్ తలపడుతుంది. -
ప్లే ఆఫ్స్కు చేరువగా ముంబా
పంచకుల: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ ప్లే ఆఫ్స్కు యు ముంబా మరింత చేరువైంది. సోమవారం జరిగిన మ్యాచ్లో మాజీ చాంపియన్ ముంబా 36–32తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. దీంతో 59 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. ముంబై రైడర్ అభిషేక్ సింగ్ సూపర్ ‘టెన్’తో ఆకట్టుకున్నాడు. తలైవాస్ రైడర్ అజిత్ (16 పాయింట్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. యు ముంబాకు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో... ఒక్క మ్యాచ్ గెలిచినా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్తును సొంతం చేసుకుంటుంది. ఒక వేళ రెండు మ్యాచ్లు ఓడితే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరో మ్యాచ్లో బెంగాల్ 42–33తో దబంగ్ ఢిల్లీపై నెగ్గింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరాయి. -
యూపీ యోధపై యు ముంబా గెలుపు
పుణే: అభిషేక్ సింగ్ (11 రైడ్ పాయింట్లు) చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్లో బుధవారం యూపీ యోధపై మాజీ చాంపియన్ యు ముంబా 39–36 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో యూపీ ఆధిపత్యం చూపినా ముంబై తేరుకుని మొదటి భాగాన్ని 16–15తో ముగించింది. రెండో భాగమూ పోటాపోటీగానే సాగింది. ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అభిõÙక్ మూడు రైడ్ పాయింట్లతో ఫలితాన్ని మలుపు తిప్పాడు. పుణేరి పల్టన్–తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 36–36తో ‘డ్రా’గా ముగిసింది. -
యు ముంబా సిక్సర్...
బెంగళూరు: రైడర్ అభిషేక్ సింగ్ (13 పాయింట్లు), డిఫెండర్ ఫజల్ అత్రాచలి (6 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో యు ముంబా జట్టు జయాపజయాలను సమం చేసింది. స్థానిక కంఠీరవ స్టేడియంలో శనివారం మ్యాచ్లో యు ముంబా 47–21తో జైపూర్ పింక్ పాంథర్స్ను చిత్తుగా ఓడించి ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన ముంబా 6 మ్యాచ్ల్లో గెలిచి మరో ఆరింటిలో ఓడినట్లయింది. అభిషేక్ సింగ్ 18 సార్లు రైడింగ్కు వెళ్లి 10 సార్లు సఫలమయ్యాడు. మరో 7 పర్యాయాలు పాయింట్లేమీ తీసుకురాకుండా, ఒకసారి మాత్రం ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోయాడు. మరో రైడర్ అర్జున్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. హరేంద్ర ఐదుగురిని పట్టేసి ఐదు పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లలో రైడింగ్లో నితిన్ రావల్ (5 పాయింట్లు), ట్యాకిల్లో అమిత్ హుడా (3 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 32–23తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. విజేత జట్టులో సౌరభ్ (8 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) రాణించారు. బెంగళూరు జట్టులో సచిన్, జీబీ మోరే చెరో 5 పాయింట్లు సాధించారు. నేడు యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్తో తమిళ్ తలైవాస్ ఆడతాయి. -
యు ముంబా విజయం
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7 మ్యాచ్లో యు ముంబా 34–30తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. యు ముంబా రైడర్ రోహిత్ బలియాన్ 9 పాయింట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 22–19తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై విజయం సాధించింది. జైపూర్ రైడర్ దీపక్ నివాస్ హుడా 7 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి చెన్నైలో పోటీలు జరుగుతాయి. తొలి రోజు తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్; బెంగాల్ వారియర్స్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
పట్నా: పేరుకు తగ్గట్టే బెంగాల్ వారియర్స్ అసలైన వారియర్లా పోరాడింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల అంతరాన్ని పూడ్చి విజేతగా నిలిచింది. ఒత్తిడి సమయాన ఎలా ఆడాలో మిగతా జట్లకు నేర్పింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 32–30తో యు ముంబాను ఓడించింది. అదిరే ఆరంభం లభించినా... దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. యు ముంబా రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్ ‘టెన్’తో చెలరేగినా... వారియర్స్ సమష్టి కృషి ముందు అది ఏ మాత్రం నిలవలేదు. వారియర్స్ డిఫెండర్లయిన మణీందర్ సింగ్, బల్దేవ్ సింగ్లు చెరో 5 టాకిల్ పాయింట్లతో మెరిశారు. ముంబా... విజయం ముంగిట... మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. విరామ సమయానికి ఆ జట్టు 16–11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్ రైడ్తో చెలరేగిన వారియర్ రైడర్ ప్రపంజన్ కుమార్ యు ముంబా ఆధిక్యాన్ని 14–16కు తగ్గించాడు. అనంతరం మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్ జట్టు 18–17తో ముందంజ వేసింది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్లు కనిపించిన ముంబై జట్టు వరుసగా పాయింట్లు సాధించి 26–21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటువంటి ఒత్తిడి సమయంలో ముంబైని తమ పట్టుతో పట్టేసిన బెంగాల్ డిఫెండర్లు ఆ జట్టును ఆలౌట్ చేసి... అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నారు. సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పట్నా... చివరి మ్యాచ్లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 41–20తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి గుజరాత్ అంచె పోటీలు అహ్మదాబాద్లో ఆరంభం కానున్నాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్; పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
జయహో... యు ముంబా
ముంబై: మొదటి అర్ధభాగంలో పోటీ ఇచ్చిన పుణేరి పల్టన్ తర్వాత చేతులెత్తేయడంతో యు ముంబా విజయాన్ని పట్టేసింది. దీంతో ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో రెండు మరాఠా జట్ల పోరులో తొలి విజయం ముంబైని వరించింది. శనివారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్లో మాజీ చాంపియన్ యు ముంబా 33–23తో పుణేరి పల్టన్పై గెలిచింది. అభిషేక్ సింగ్ 5 రైడ్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యు ముంబా సారథి ఫజేల్ అత్రాచలి, రోహిత్, సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్లు చెరో 4 పాయింట్లతో రాణించా రు. పుణేరి తరఫున సుర్జీత్ సింగ్ 6 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ గీతం ఆలపించాడు. నెమ్మదిగా మొదలై.. ఆరంభంలో రెండు జట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్లు ఎక్కువగా రాలేదు. పుణే తరఫున తొలి కూతకు వెళ్లిన మంజీత్ రిక్తహస్తాలతో తిరిగొచ్చాడు. అనంతరం ముంబై తరఫున కూతకు వెళ్లిన లీ డాంగ్ జీన్ను పుణే పట్టేయడం అదే సమయంలో లీ బోనస్ లైన్ను దాటడంతో ఇరు జట్లు ఒకేసారి ఖాతా తెరిచాయి. 2–5తో యు ముంబా వెనుకంజలో ఉన్నప్పుడు ఫజేల్ అత్రాచలి మంజీత్ను సూపర్ టాకిల్ చేశాడు. ఆ వెంటనే అభిషేక్ ఒక రైడ్ పాయింట్ తీసుకురావడంతో స్కోరు 5–5తో సమమైంది. పుణే తరఫున సుర్జీత్ సింగ్ సూపర్ టాకిల్ చేయడం, ఆ వెంటనే రైడ్కు వెళ్లి సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్లను ఔట్ చేసి పుణేని 9–8తో ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే ఈ దశలో ముంబై చకచకా మూడు పాయింట్లు సాధించి 11–9తో విరామానికి వెళ్లింది. రెండో అర్ధభాగం ఆరంభమైన కాసేపటికే యు ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 15–10తో దూసుకెళ్లింది. ఇదే అధిక్యాన్ని చివరి వరకు కొనసాగించిన ముంబై జట్టు విజేతగా నిలిచింది. గట్టెక్కిన జైపూర్... మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 27–25తో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది. చివరి మూడు నిమిషాల్లో తడబడిన బెంగాల్ మూల్యం చెల్లించుకుంది. జైపూర్ డిఫెండర్ సందీప్ ధుల్ (8 టాకిల్ పాయింట్లు)తో బెంగాల్ను పట్టేశాడు. రైడర్ దీపక్ హుడా 6 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
పుణెరీని బోల్తా కొట్టించిన యు ముంబా
ముంబై: సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో యు ముంబా అదరగొట్టింది. సుర్జీత్ సింగ్ సారథ్యంలోని పుణెరీ పల్టన్ను యు ముంబా బోల్తా కొట్టించి విజయం సాధించింది. శనివారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యు ముంబా 33-23 తేడాతో పుణెరీ పల్టన్పై విజయాన్ని అందుకుంది. దీంతో పుణెరి ఖాతాలో రెండో ఓటమి పడింది. తొలి మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆరంభంలో ధాటిగా ఆడిన పుణెరి ఆటగాళ్లు.. మ్యాచ్ జరిగే కొద్దీ ఢీలా పడ్డారు. ప్రత్యర్థి జట్టుకు దాసోహమయ్యారు. రైడింగ్లో, టాకిల్లో పూర్తిగా విఫలమయ్యారు. తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్ల వేగం తగ్గింది. అయితే రెండో అర్ద భాగంలో యు ముంబా ఆటగాళ్లు విరుచుకపడ్డారు. ఇక ఈ మ్యాచ్లో యు ముంబా ఆటగాళ్లు ఒకరిపై ఆధారపడకుండా సమిష్టిగా ఆడారు. రైడర్లు అభిషేక్ సింగ్(5), రోహిత్ బలియాన్(4) రాణించగా.. డిఫెండర్లు సురిందర్ సింగ్(4), సందీప్ నర్వాల్(4), ఫజల్ అత్రచలి(4) పుణెరి పని పట్టారు. ఇక పుణెరీ ఆటగాళ్లలో సారథి సుర్జీత్ సింగ్(4) ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఆ జట్టు స్టార్ డిఫెండర్ గిరీష్ ఎర్నాక్ పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క టాకిల్ కూడా చేయలేకపోయాడు. ముంబా జట్టు 15 రైడ్, 12 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 12 రైడ్, 11 టాకిల్ పాయింట్లు మాత్రమే సాధించింది. యు ముంబా ధాటికి పుణెరి పల్టాన్ జట్టు రెండు సార్లు ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరైన భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. -
జైపూర్ పింక్ పాంథర్స్ పంజా
సాక్షి, హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ మాజీ చాంపియన్స్ జైపూర్ పింక్ పాంథర్స్ ఏడో సీజన్ను ఘనవిజయంతో ప్రారంభించింది. ఆరంభ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ను ఓడించి దూకుడు మీదున్న యు ముంబా ఆటలు జైపూర్ పింక్ పాంథర్స్ ముందు సాగలేదు. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్ 42–23 తేడాతో యు ముంబాను ఓడించింది. జైపూర్ జట్టు 25 రైడ్ పాయింట్లు, 11 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా... యు ముంబా 18 రైడ్ పాయింట్లు, 5 టాకిల్ పాయింట్లతో పాంథర్స్ను అందుకోలేకపోయింది. పాంథర్స్ తరపున దీపక్ హుడా 11 పాయింట్లతో మెరిశాడు. అతనికి నితిన్ (7 పాయింట్లు), దీపక్ (6 పాయింట్లు), అమిత్ హుడా (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు. యు ముంబా తరపున అభిషేక్ (7 పాయింట్లు), డాంగ్ జీన్ లీ (6 పాయింట్లు) పర్వాలేదనిపించారు. దడదడలాడించిన దీపక్... ఆట ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించిన పాంథర్స్ ఏ దశలోనూ యు ముంబాకు కోలుకునే అవకాశాన్నివ్వలేదు. ముఖ్యంగా దీపక్ హుడా తన రైడ్లతో ప్రత్యర్థిని దడదడలాడించాడు. తన తొలి రెండు రైడ్లలో మూడు పాయింట్లు సాధించి జైపూర్కు మంచి ఆరంభాన్నిచ్చాడు. ఖాతా తెరవడానికే 4 నిమిషాల సమయం తీసుకున్న యు ముంబా ఏ దశలోనూ జైపూర్ డిఫెన్స్ను ఛేదించలేకపోయింది. మొదటి అర్ధ భాగం ముగిసే సరికి జైపూర్ 22–9 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. రెండో భాగంలోనూ పింక్ పాంథర్స్ ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసిన పాంథర్స్ ఒక్క సారి కూడా ఆలౌట్ కాలేదు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ జట్టు 34–24తో పుణేరి పల్టన్పై గెలుపొందింది. హరియాణా జట్టు స్టార్ రైడర్ నవీన్ 14 పాయింట్లతో ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాడు. మంగళవారం మ్యాచ్లకు విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
యు ముంబా చిత్తుచిత్తుగా
హైదరాబాద్ : ప్రొ కబడ్డీ సీజన్-7లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన మ్యాచ్లో యు ముంబా చిత్తయింది. తెలుగు టైటాన్స్పై విజయంతో ఊపుమీదున్న యూ ముంబా జట్టుకు జైపూర్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. సోమవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యు ముంబా 23-42 తేడాతో జైపూర్ చేతిలో చిత్తుగా ఓడింది. తొలి రైడ్లోనే దీపక్ హుడా రెండు పాయింట్లతో జైపూర్కు శుభారంభాన్ని అందించాడు. అక్కడి నుంచి జైపూర్ అటాకింగ్ గేమ్ ఆడి ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి 22-9తో జైపూర్ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యు ముంబా ఆటగాళ్లు ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు. ఫజల్ అత్రచెలీతో సహా అందరూ విపలమయ్యారు. జైపూర్ స్టార్ రైడర్స్ దీపక్ హుడా 11 పాయింట్లతో రెచ్చిపోగా.. నితిన్ రావల్ 7 పాయింట్లతో, దీపక్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. యు ముంబా రైడర్ అభిషేక్ సింగ్ ఒక్కడే 7 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు
ఏపీలో అల్లర్లు చేసింది వీరే..
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
కర్నూల్ లో వజ్రాల వేట
యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్..
హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు!.. కానీ..
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
తప్పక చదవండి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
- అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
Advertisement