
PV Sindhu: స్పెయిన్లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021లో తెలుగు తేజం, డిఫెండింగ్ ఛాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్ల్యాండ్కు చెందిన పాన్పావీ చోచువాంగ్తో గురువారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో 21-14, 21-18 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సింధు తన తదుపరి మ్యాచ్లో(క్వార్టర్స్) చైనీస్ తైపీ క్రీడాకారిణి టైజు యింగ్తో తలపడనుంది.
చదవండి: విరాట్లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment