BWF
-
15 పాయింట్లతో మూడు గేమ్లు!
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా మెరుపు వేగంలో ముగిసే ఆటలపై పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా బ్యాడ్మింటన్ కూడా అటువైపే పయనించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్ ) 21 పాయింట్లతో మూడు గేముల (బెస్టాఫ్ త్రీ) స్కోరింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆయా దేశాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే స్కోరింగ్తో టోర్నీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆట మరింత రసవత్తరంగా జరిగేందుకు, మ్యాచ్ చకచకా ముగిసిపోయేందుకు కొత్త స్కోరింగ్ విధానం అమలు చేసేందుకు బీడబ్ల్యూఎఫ్ సిద్ధమైంది. ఇప్పుడున్న మూడు గేమ్లను 15 పాయింట్లతో ముగించి ఆటలో వేగం పెంచనుంది. తద్వారా కొత్తతరం ప్రేక్షకుల్ని ఆకర్శించాలని, సుదీర్ఘంగా సాగదీయకుండా, నిమిషాల్లో మ్యాచ్ ఫలితం వచ్చేలా కొత్త స్కోరింగ్ విధానాన్ని ఈ ఏప్రిల్ నుంచే అమలు చేయాలని బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ నిర్ణయించింది. నవంబర్లో కౌలాలంపూర్లో జరిగే బీడబ్ల్యూఎఫ్ అత్యున్నత సమావేశానికి ముందు ఆరు నెలల పాటు ఈ స్కోరింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాక... ఆ సమావేశంలో సమీక్షించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. ‘కాంటినెంటల్ చాంపియన్షిప్లు, గ్రేడ్–3 టోర్నమెంట్లు, జాతీయ, అంతర్జాతీయ లీగ్లు, జాతీయ టోర్నీల్లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ కొత్త స్కోరింగ్ పద్ధతిని అవలంభిస్తారు’ అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త విధానం వల్ల మ్యాచ్ల్లో పోటీ మరింత పెరుగుతుందని, ప్రతీ పాయింట్ కోసం ప్రత్యర్థులు దీటుగా సన్నద్ధమై బరిలోకి దిగుతారని, మ్యాచ్ త్వరగా ముగియడం కాదు... పోటాపోటీగా జరగడం ఖాయమని బీడబ్ల్యూఎఫ్ వివరణ ఇచ్చింది. నిజానికి 15 పాయింట్ల ‘బెస్టాఫ్ త్రీ’ గేమ్లు కొత్తేం కాదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో గతంలో ఏళ్ల తరబడి ఈ స్కోరింగ్ పద్ధతిలో మ్యాచ్లు జరిగాయి. తర్వాత 7 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్’ పద్ధతిలోనూ కొన్నాళ్లు జరిగాయి. క్రమానుగతంగా మారుతుండగా 2014లో తొలిసారి 11 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్’ స్కోరింగ్ పద్ధతి తెరపైకి వచ్చింది. కానీ బీడబ్ల్యూఎఫ్లోని సభ్యదేశాలు సమ్మతించకపోవడంతో ఆ ఏడాది, తర్వాత 2021లో బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్లో కనీస మద్దతు లభించక మరోసారి ఇలా రెండుసార్లూ ప్రతిపాదన దశలోనే ఆ స్కోరింగ్ (11 పాయింట్ల బెస్టాఫ్ ఫైవ్) పద్ధతిని ఉపసంహరించుకున్నారు. దీంతో 2006 నుంచి స్థిరంగా ప్రస్తుత 21 పాయింట్ల స్కోరింగే కొనసాగుతోంది. -
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నేటి నుంచే..
హాంగ్జౌ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్కు నేడు తెర లేవనుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మొత్తం ఐదు విభాగాల్లో (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) మ్యాచ్లను నిర్వహిస్తారు. ఈసారి భారత్ నుంచి కేవలం మహిళల డబుల్స్లో మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె పుల్లెల గాయత్రి, కేరళ అమ్మాయి ట్రెసా జాలీ మహిళల డబుల్స్లో జోడీగా బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది ఆయా టోర్నీలలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా టాప్–8లో నిలిచిన వారు వరల్డ్ టూర్ ఫైనల్స్కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులెవరూ టాప్–8లో నిలవకపోవడంతో ఈ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని పొందలేకపోయారు. ఈ టోర్నీ చరిత్ర లో భారత్ నుంచి పీవీ సింధు 2018లో మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్గా నిలిచింది. కఠిన ప్రత్యర్థులే... సీజన్ ముగింపు టోర్నీలో గాయత్రి–ట్రెసా జోడీకి క్లిష్టమైన ‘డ్రా’ పడింది. మహిళల డబుల్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రపంచ నంబర్వన్ జంట లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా), ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ షిడా చిహారు–నామి మత్సుయామ (జపాన్), ప్రపంచ ఆరో ర్యాంకర్ ద్వయం పియర్లీ టాన్–థీనా మురళీధరన్ (మలేసియా)లతో 13వ స్థానంలో ఉన్న గాయత్రి–ట్రెసా తలపడాల్సి ఉంది. బుధవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో టాప్ సీడ్ లియు షెంగ్ షు–టాన్ నింగ్లతో గాయత్రి–ట్రెసా ఆడతారు. ప్రైజ్మనీ ఎంతంటే... వరల్డ్ టూర్ ఫైనల్స్ మొత్తం ప్రైజ్మనీ 25 లక్షల డాలర్లు (రూ. 21 కోట్ల 21 లక్షలు). పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 2 లక్షల డాలర్ల (రూ. 1 కోటీ 69 లక్షలు) చొప్పున... మూడు డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ నెగ్గిన వారికి 2 లక్షల 10 వేల డాలర్ల (రూ. 1 కోటీ 78 లక్షలు) చొప్పున ప్రైజ్మనీ లభిస్తుంది. రన్నరప్, సెమీఫైనలిస్ట్లకు, గ్రూపుల్లో మూడో స్థానంలో, నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా ప్రైజ్మనీ అందజేస్తారు. -
సింధు సత్తాకు సవాల్!
కౌలాలంపూర్: ఒలింపిక్స్ చరిత్రలో గతంలో ఏ భారతీయ ప్లేయర్కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకోవాలంటే... భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ‘డ్రా’ వివరాలను శుక్రవారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన సింధు ‘పారిస్’లోనూ పతకం గెలిస్తే... భారత్ నుంచి ఒలింపిక్స్ చరిత్రలో మూడు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక ప్లేయర్గా రికార్డు సృష్టిస్తుంది. ‘డ్రా’ ప్రకారం సింధుకు గ్రూప్ దశలో సునాయాస ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. గ్రూప్ ‘ఎం’లో ఉన్న సింధు ప్రపంచ 75వ ర్యాంకర్ క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)తో, ప్రపంచ 111వ ర్యాంకర్ ఫాతిమత్ నభా (మాల్దీవులు)తో ఆడుతుంది. గ్రూప్ విజేత హోదాలో సింధు ప్రిక్వార్టర్ చేరితే ఆరో సీడ్ హి బింగ్జియావో (చైనా)తో తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 9–11తో వెనుకంజలో ఉంది. హి బింగ్జియావోపై నెగ్గితే సింధుకు క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) ఎదురవుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 6–6తో సమంగా ఉంది. చెన్ యు ఫెను కూడా ఓడిస్తే సింధుకు సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ విజేత, మూడుసార్లు వరల్డ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) సిద్ధంగా ఉండే అవకాశముంది. ముఖాముఖి రికార్డులో సింధు 5–12తో వెనుకంజలో ఉంది. ఒకవేళ మారిన్పై ఈసారి సింధు గెలిస్తే పతకం ఖరారవుతుంది. మారిన్ చేతిలో సింధు ఓడిపోతే కాంస్య పతకం కోసం రేసులో నిలుస్తుంది. కాంస్య పతకం కోసం మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్ నంబర్వన్ అన్ సె యంగ్ (దక్షిణ కొరియా), ప్రపంచ మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), ప్రపంచ ఐదో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)లలో ఒకరితో సింధు ఆడే చాన్స్ ఉంటుంది. పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి ప్రణయ్, లక్ష్య సేన్ బరిలో ఉన్నారు. గ్రూప్ ‘కె’లో ప్రణయ్... గ్రూప్ ‘ఎల్’లో లక్ష్య సేన్ ఉన్నారు. లక్ష్య సేన్ గ్రూప్లోనే ఈ ఏడాది ఆసియా చాంపియన్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, ప్రపంచ 3వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) ఉన్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాలంటే లక్ష్య సేన్ తప్పనిసరిగా క్రిస్టీపై గెలవాల్సి ఉంటుంది. స్థాయికి తగ్గట్టు ఆడితే గ్రూప్ ‘కె’ నుంచి ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాడు. ‘డ్రా’ ప్రకారం ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇద్దరు భారత ఆటగాళ్లలో ఒకరికి మాత్రమే పతకం నెగ్గే అవకాశం ఉంటుంది. మహిళల డబుల్స్లో నాలుగు జోడీలు ఉన్న గ్రూప్ ‘సి’లో అశ్విని పొన్నప్ప–తనీషాలకు చోటు లభించింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే భారత జోడీ రెండు మ్యాచ్ల్లో గెలవాలి.మరోవైపు పురుషుల డబుల్స్ ‘డ్రా’లో ఎన్ని జోడీలు ఉండాలనే విషయంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్లో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ విభాగం ‘డ్రా’ను ప్రకటించలేదు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉండటంతో భారత స్టార్ ద్వయం సాతి్వక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టిపై భారీ అంచనాలు ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్ ఈనెల 26 నుంచి జరగనుండగా... బ్యాడ్మింటన్ ఈవెంట్ 27న మొదలవుతుంది. -
Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
కౌలాలంపూర్: భారత టాప్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ ఏడాది తన తొలి టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్–500 టోర్నీ మలేసియా మాస్టర్స్లో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో సింధు 13–21, 21–16, 21–12 స్కోరుతో బుసానన్ ఆంగ్బమ్రున్పన్ (థాయిలాండ్)పై విజయం సాధించింది. తన కెరీర్లో ఐదేళ్ల క్రితం ఒకే ఒక సారి బుసానన్ చేతిలో ఓడిన సింధుకు ఇది ఆమెపై 18వ గెలుపు కావడం విశేషం. వరల్డ్ నంబర్ 20 బుసానన్ తొలి గేమ్లో ఆధిక్యం ప్రదర్శించి ముందంజ వేసింది. అయితే వెంటనే కోలుకున్న సింధు ర్యాలీలతో చెలరేగి గేమ్ను గెలుచుకుంది. మూడో గేమ్లో సింధు తన స్థాయిలో సత్తా చాటింది. 8–3తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఆమెకు తిరుగులేకుండా పోయింది. అదే జోరును కొనసాగిస్తూ 17–10తో దూసుకుపోయిన సింధు వరుస పాయింట్లతో మ్యాచ్ను సొంతం చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో వరల్డ్ నంబర్ 7 వాంగ్ జి యీ (చైనా)తో సింధు తలపడుతుంది. -
మళ్లీ నంబర్వన్ ర్యాంక్లో సాత్విక్ –చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం మళ్లీ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో సాత్విక్–చిరాగ్ జోడీ ఒక స్థానం మెరుగుపర్చుకొని 95,861 పాయింట్లతో టాప్ ర్యాంక్కు ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ ... మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి ఈ ఏడాది జరిగిన రెండు ప్రధాన టోరీ్నల్లోనూ (మలేసియా ఓపెన్–1000, ఇండియా ఓపెన్–750) అద్భుత ప్రతిభ కనబరిచి రన్నరప్గా నిలిచారు. గత ఏడాది అక్టోబర్లో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాక సాత్విక్ –చిరాగ్ తొలిసారి వరల్డ్ నంబర్వన్గా అవతరించింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఎనిమిదో ర్యాంక్లో నిలిచాడు. -
సాత్విక్ – చిరాగ్ జోడీకి నిరాశ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక టోర్నీలో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్శెట్టిలకు చుక్కెదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ – సూపర్ 750 టోర్నీ ఇండియా ఓపెన్లో భారత జోడి రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన వరల్డ్ చాంపియన్ జంట కాంగ్ మిన్ హ్యూక్ – సియో సంగ్ జె 15–21, 21–11, 21–18 స్కోరుతో సాత్విక్ – చిరాగ్పై విజయం సాధించింది. 65 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్ను సునాయాసంగానే గెలుచుకున్న భారత జోడి ఆ తర్వాత తడబడింది. ముఖాముఖీ పోరులో కొరియా ఆటగాళ్లతో ఈ మ్యాచ్కు ముందు 4–1తో సాతి్వక్–చిరాగ్లదే పైచేయిగా ఉంది. అదే తరహాలో చక్కటి ర్యాలీలతో దూసుకుపోయిన వీరిద్దరు తొలి గేమ్ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్లో 1–5తో ఆరంభంలో వెనుకబడిన మన ఆటగాళ్లు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. ఒక దశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన కొరియా టీమ్ 15–5తో ముందంజలో నిలిచి ఆపై గేమ్ను గెలుచుకుంది. మూడో గేమ్ పోటాపోటీగా సాగింది. గేమ్ తొలి అర్ధభాగాన్ని కొరియా ఆటగాళ్లు 11–6తో ముగించారు. అయితే ఆ తర్వాత భారత ద్వయం కోలుకొని మళ్లీ నిలిచారు. 15–16కు, ఆపై 18–19 వరకు స్కోరు వెళ్లింది. అయితే సాత్విక్ బయటకు కొట్టిన షాట్తో, అనంతరం చిరాగ్ నెట్కు కొట్టిన షాట్తో కొరియా విజయం ఖాయమైంది. తైజుకు మహిళల టైటిల్ వరల్డ్ నంబర్ 3 ప్లేయర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) మహిళల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో నాలుగో సీడ్ తై జు 21–16, 21–12తో రెండో సీడ్ చెన్ యు ఫిపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్ను షి యు కి (చైనా) సొంతం చేసుకున్నాడు. -
అశ్విని –తనీషా జోడీ ర్యాంక్లో పురోగతి
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ పురోగతి సాధించింది. తాజా ర్యాంకింగ్స్లో అశ్విని –తనీషా ద్వయం నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 28వ ర్యాంక్కు చేరుకుంది. గతవారం లక్నోలో జరిగిన సయ్యద్ మోడి ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టో ర్నీలో అశ్విని –తనీషా జోడీ రన్నరప్గా నిలిచింది. -
బీడబ్ల్యూఎఫ్ వార్షిక అవార్డు రేసులో సాత్విక్–చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక అవార్డు రేసులో నిలిచారు. 2023 సంవత్సరానికిగాను సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిని ‘పెయిర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం కోసం బీడబ్ల్యూఎఫ్ నామినేట్ చేసింది. భారత ద్వయంతోపాటు చెన్ కింగ్ చెన్–జియా ఇ ఫాన్ (చైనా), జెంగ్ సి వె–హువాంగ్ యా కియాంగ్ (చైనా), సియో సెంగ్ జే–చె యు జంగ్ (దక్షిణ కొరియా) జోడీలు కూడా ఈ అవార్డు కోసం బరిలో ఉన్నాయి. డిసెంబర్ 11న అవార్డు విజేతను ప్రకటిస్తారు. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ ద్వయం అంచనాలకు మించి రాణించి అద్భుత విజయాలు సాధించింది. ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఇండోనేసియా సూపర్–1000 టోర్నీలో, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీలో, స్విస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో డబుల్స్ టైటిల్స్ గెలిచింది. -
మళ్లీ మరీన్ చేతిలో...
ఒడెన్స్: పీవీ సింధు, కరోలినా మరీన్ మధ్య మంచి స్నేహం ఉంది. కోర్టులో ప్రత్యర్థులే అయినా కోర్టు బయట తమ సాన్నిహిత్యం గురించి వీరిద్దరు చాలా సార్లు చెప్పుకున్నారు. కానీ శనివారం ఇద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరు అనూహ్య రీతిలో సాగింది. ఒక దశలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించే క్రమంలో అరుపులు, కేకలతో పాటు పలు మార్లు ఇద్దరూ అంపైర్ల హెచ్చరికకు కూడా గురయ్యారు. అయితే చివరకు 73 నిమిషాల సమరం తర్వాత భారత షట్లర్ పరాజయం పక్షానే నిలిచింది. ఈ మ్యాచ్కు ముందు ముఖాముఖీ రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉండగా, ఇప్పుడు అది 5–11కు చేరింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ డెన్మార్క్ ఓపెన్ సెమీ ఫైనల్లో సింధు ఓటమిపాలైంది. కరోలినా మరీన్ (స్పెయిన్) 21–18, 19–21, 21–7 స్కోరుతో సింధుపై విజయం సాధించింది. ఇద్దరు ప్లేయర్లు తమదైన శైలిలో చెలరేగడంతో తొలి గేమ్ దాదాపు సమంగా సాగింది. విరామ సమయంలో సింధు 11–10తో ఒక పాయింట్ ముందంజలో ఉంది. ఆ తర్వాతా ఇదే కొనసాగి స్కోరు 18–18కి చేరింది. అయితే మరీన్ వరుసగా మూడు పాయింట్లు గెలుచుకొని గేమ్ను తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్లో మాత్రం సింధు దూసుకుపోయింది. చకచకా పాయింట్లు సాధించిన ఆమె ఎక్కడా ఆధిక్యం తగ్గనీయకుండా 11–3కు చేరింది. అయితే ఆ తర్వాత ప్రతిఘటించిన మరీన్ వరుసగా పాయింట్లు గెలుచుకొని అంతరాన్ని తగ్గించింది. సింధు 20–16తో ముందంజలో నిలిచిన తర్వాత మరీన్ వరుసగా మూడు పాయింట్లు గెలవడంతో 20–19గా మారింది. కానీ స్మాష్తో పాయింట్ సాధించి సింధు గేమ్ గెలుచుకుంది. చివరి గేమ్ మాత్రం పూర్తి ఏకపక్షంగా మారిపోయింది. మరీన్ జోరు ముందు భారత షట్లర్ నిలవలేకపోయింది. ముందు 3–0, ఆపై 3–2...ఆ తర్వాత ఆమె జోరు సాగిపోయింది. వరుసగా 11 పాయింట్లు సాధించిన మరీన్ 14–2 దాకా వెళ్లింది. అనంతరం మ్యాచ్ను ముగించేందుకు ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. మరీన్ అరుపులు... సింధు అసహనం పాయింట్లు సాధించినప్పుడు అతిగా భావోద్వేగాలు ప్రదర్శించవద్దని అంపైర్ ఇద్దరినీ పిలిచి మ్యాచ్లో పలు మార్లు వారించాడు. అయితే మరీన్ తన అరుపులను ఆపకపోగా, సర్వీస్ అందుకునేందుకు సింధు ఎక్కువ సమయం తీసుకుంది. తొలి గేమ్ను మరీన్ను మళ్లీ అంపైర్ హెచ్చరించాడు. మూడో గేమ్లో సర్వీస్ ఆలస్యానికి సింధును అంపైర్ ప్రశ్నించగా...‘ఆమె అరిచేందుకు అవకాశమిచ్చారు కదా. ముందు ఆమెను ఆపమని చెబితే నేనూ సిద్ధంగా ఉంటా’ అని సింధు బదులిచ్చింది. మరొకరి కోర్టునుంచి షటిల్ తీసుకోవద్దని ఇద్దరికీ చెప్పాల్సి వచ్చింది. చివరకు అంపైర్ ఇద్దరికీ ‘ఎల్లో కార్డు’లు కూడా చూపించాల్సి వచ్చింది. -
ప్రపంచ నంబర్వన్ జోడీగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో పురుషుల డబుల్స్లో నంబర్వన్ ర్యాంక్కు చేరుకున్న తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. మంగళవారం విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో సాత్వి క్–చిరాగ్ ద్వయం 92,411 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. గతవారం హాంగ్జౌలో ముగిసిన ఆసియా క్రీడల్లోసాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ స్వర్ణ పతకం సాధించింది. దాంతో ఈ జంట ఒక స్థానం పురోగతి సాధించి రెండు నుంచి టాప్ ర్యాంక్కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ ఈ సీజన్లో స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్íÙప్లో, ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్లలో విజేతగా నిలిచారు. గతంలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2018లో), మహిళల సింగిల్స్లో సైనా నెహా్వల్ (2021లో) ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో నిలిచారు. -
Japan Open 2023 badminton: పోరాడి ఓడిన లక్ష్యసేన్
టోక్యో: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–750 జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత షట్లర్ లక్ష్య సేన్ ఆట ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్య పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్లో ఇండోనేసియాకు చెందిన ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ 21–15, 13–21, 21–16 స్కోరుతో సేన్ను ఓడించాడు. 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరు తొలి గేమ్లో క్రిస్టీ చేసిన పొరపాట్లతో సేన్ 7–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిన క్రిస్టీ 15–12తో ఆధిక్యంలోకి వచ్చేశాడు. రెండో గేమ్లో చక్కటి సర్వీస్, ర్యాలీలతో 11–5తో సేన్ ముందంజ వేశాడు. ఆపై పదునైన స్మాష్లతో చెలరేగి భారత షట్లర్ రెండో గేమ్ను సొంతం చేసుకున్నాడు. చివరి గేమ్లో మాత్రం మొదటినుంచి ఆధిక్యం ప్రదర్శించిన క్రిస్టీ చివరి వరకు దానిని నిలబెట్టుకున్నాడు. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్
బాసెల్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి మరోసారి మేజర్ టోర్నీలో సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్–300 టోర్నీ స్విస్ ఓపెన్లో సాత్విక్ – చిరాగ్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నీలో ఈ జంట మినహా ఇతర భారత షట్లర్లంతా ముందే నిష్క్రమించగా...వీరిద్దరు మాత్రం తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగారు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ ద్వయం 19–21, 21–17, 17–21తో మూడో సీడ్ మలేసియా జోడి ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీపై విజయం సాధించింది. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్ను కోల్పోయినా...తర్వాతి రెండు గేమ్లలో సత్తా చాటి భారత జంట విజయాన్ని అందుకుంది. నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన అన్సీడెడ్ జంట రెన్ జియాంగ్ యు – టాన్ ఖియాంగ్తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. -
సత్తా చాటిన ముత్తు
శాంటండెర్ (స్పెయిన్): భారత రైజింగ్ షట్లర్ శంకర్ ముత్తుసామి జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీలో నాలుగో సీడ్గా బరిలోకి దిగిన అతను పురుషుల అండర్–19 సింగిల్స్లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో ఈ భారత ఆటగాడికి కనీసం కాంస్యమైనా దక్కుతుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముత్తుసామి 21–18, 8–21, 21–16తో హు జె అన్ (చైనా)ను కంగుతినిపించాడు. ఒక గంటా 31 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత టీనేజ్ షట్లర్కు చైనా ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్ను గెలిచేందుకు చెమటోడ్చిన శంకర్కు రెండో గేమ్లో నిరాశ తప్పలేదు. అయితే నిర్ణాయక మూడో గేమ్ను గెలిచి ముందంజ వేశాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత షట్లర్ థాయ్లాండ్కు చెందిన పనిత్చఫొన్ తీరరత్సకుల్తో తలపడతాడు. జూనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకం దక్కించుకున్న 9వ భారత ఆటగాడు ముత్తుసామి. లక్ష్యసేన్ 2018లో చివరిసారిగా భారత్కు పతకం (కాంస్యం) అందించాడు. -
ప్రపంచ చాంపియన్షిప్పై కసరత్తు
న్యూఢిల్లీ: జపాన్లాంటి కోర్టుల్లో ఆడాలంటే చాలా ఓపిక కావాలని భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ అన్నాడు. త్వరలో అక్కడ జరగనున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్ కోసం కసరత్తు చేస్తున్నానని చెప్పాడు. ‘నేను రెండు వారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పట్లా రొటిన్గానే సన్నద్ధమవుతున్నా. నా ప్రాక్టీస్లో తేడా ఏమీ లేదు. కానీ టోక్యోలోని బ్యాడ్మింటన్ కోర్టులు మందకొడిగా ఉంటాయి. అక్కడ ఆడాలంటే నేర్పుంటే చాలదు. చాలా ఓర్పు కావాలి. అందుకే నేను ఆటతీరులో సహనం, సంయమనంపై దృష్టిపెట్టాను’ అని అన్నాడు. ఈ నెల 22 నుంచి టోక్యోలో ప్రపంచ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. స్పెయిన్లో జరిగిన గత మెగా ఈవెంట్లో ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న అతను ర్యాంకు మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. ‘ర్యాంకుల్లో ఎగబాకడం ఇప్పుడు అంత సులభం కాదు. ఒక్క రేటింగ్ పాయింట్ కూడా కీలకమే. నేను మళ్లీ టాప్–20 ర్యాంకుల్లోకి రావాలంటే ఒక్కో టోర్నీలో నిలకడగా క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ చేరుతుండాలి. అప్పుడు అనుకున్న ర్యాంకుకు చేరుకోగలం’ అని అన్నాడు. ఒకానొక దశలో చక్కని ఆటతీరుతో ప్రపంచ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకిన ప్రణయ్ని 2020 నవంబర్లో కోవిడ్ దెబ్బతీసింది. మహమ్మారి అతని ప్రదర్శనపై పెను ప్రభావమే చూపింది. ఆ తర్వాత ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ సహకారంతో ఆరోగ్యాన్ని, తర్వాత ఫిట్నెస్ను మెల్లిగా ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. ఈ సీజన్లో ఇండోనేసియా, మలేసియా ఓపెన్లలో సెమీస్ చేరిన ప్రణయ్ స్విస్ ఓపెన్లో రన్నరప్తో తృప్తి చెందాడు. థామస్ కప్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. అయితే పెద్ద పెద్ద ఎండార్స్మెంట్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులుంటున్నాయని, మేజర్ టోర్నీల్లో గెలిస్తేనే బ్రాండింగ్ దక్కుతుందని చెప్పాడు. -
కిడాంబి శ్రీకాంత్కు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో రజతం నెగ్గిన స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘శ్రీకాంత్కు అభినందనలు. రజతంతో చరిత్రకెక్కావు. నీ విజయం మరెంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Congratulations to @srikidambi for winning a historic Silver Medal. This win will inspire several sportspersons and further interest in badminton. https://t.co/rxxkBDAwkP— Narendra Modi (@narendramodi) December 20, 2021 కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్గా చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. -
BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన శ్రీకాంత్..
హుఎల్వా (స్పెయిన్): వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్గా చరిత్ర సృష్టించాడు. కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్గా యశ్ దుల్, ఆంధ్రా కుర్రాడికి వైస్ కెప్టెన్సీ -
BWF World Championships 2021: మహిళల సింగిల్స్ ఛాంపియన్గా యమగుచి
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021 మహిళ సింగిల్స్లో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ 3 అకానే యమగుచి విజేతగా నిలిచింది. ప్రపంచ నంబర్ 1, చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్తో జరిగిన తుది పోరులో 21-14, 21-11తో వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో జపాన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. కేవలం 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో యమగుచి పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు ప్రపంచ రెండో సీడ్, థాయ్ జోడీ డెచాపోల్ పువావరనుక్రో, సప్సిరీ టరెట్టనాచాయ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను ఎగురేసుకుపోయింది. ఈ ద్వయం ఫైనల్లో ప్రపంచ మూడో సీడ్ జపాన్ ద్వయం యుటా వటనాబే, అరిసా హిగాషినోపై 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది. చదవండి: బాబర్, రిజ్వాన్ లాంటి ఆటగాళ్లు లేరని భారతీయులు బాధపడతారు.. -
శభాష్ శ్రీకాంత్...
ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ విశ్వకిరీటాన్ని అందుకునేందుకు విజయం దూరంలో నిలిచాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో బరిలోకి దిగిన ఈ తెలుగు తేజం అద్వితీయ ఆటతీరుతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్కే చెందిన యువతార లక్ష్య సేన్తో నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ సమరంలో తుదకు అనుభవజ్ఞుడైన శ్రీకాంత్దే పైచేయిగా నిలిచింది. లక్ష్య సేన్ ఓడిపోయినప్పటికీ తన ఆటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. ప్రకాశ్ పదుకొనే (1983), సాయిప్రణీత్ (2019) తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్లో కాంస్య పతకం సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. హుఎల్వా (స్పెయిన్): ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఇద్దరు భారతీయుల మధ్య జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ అందర్నీ అలరించింది. 69 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 21–14, 21–17తో భారత్కే చెందిన యువతార లక్ష్య సేన్పై విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ఘనత వహించాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా సాధించలేకపోయాడు. ఇప్పుడా లోటును తీర్చుకోవడానికి అతడు కేవలం విజయం దూరంలో నిలిచాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యె (సింగపూర్) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో శ్రీకాంత్ తలపడతాడు. భారత కాలమానం ప్రకారం పురుషుల సింగిల్స్ ఫైనల్ నేటి సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే అవకాశముంది. అన్ని విభాగాల ఫైనల్స్ను స్టార్ స్పోర్ట్స్–3, హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హోరాహోరీగా... అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి శ్రీకాంత్, లక్ష్య సేన్ తలపడగా... ప్రతీ పాయింట్కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ముఖ్యంగా శ్రీకాంత్ కళ్లు చెదిరే రీతిలో స్మాష్లు సంధించాడు. అయితే శ్రీకాంత్ సంధించిన స్మాష్లకు అంతే చాణక్యంగా లక్ష్య సేన్ తిప్పి కొట్టాడు. 17 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్లో శ్రీకాంత్ అనవసర తప్పిదాలతోనే లక్ష్య సేన్ ఖాతాలో ఎక్కువ పాయింట్లు చేరాయి. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఉత్తరాఖండ్కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ అలసిపోయినట్లు కనిపించాడు. రెండో గేమ్లో ఒకదశలో శ్రీకాంత్ 6–9తో వెనుకబడినా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. డ్రాప్ షాట్లు, క్రాస్కోర్టు షాట్లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన శ్రీకాంత్ 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న శ్రీకాంత్ రెండో గేమ్ను 21 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించారు. ఈ క్రమంలో కొన్ని సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. తుదకు ఈ సుదీర్ఘ ర్యాలీలకు కళ్లు చెదిరే షాట్లతో ముగింపు ఇస్తూ వీరిద్దరు తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. చివరి గేమ్లో రెండుసార్లు శ్రీకాంత్ వెనుకంజ వేసినా వెంటనే తేరుకొని స్కోర్లను సమం చేశాడు. స్కోరు 16–16 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఒత్తిడికి లోనైన లక్ష్య సేన్ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. శ్రీకాంత్ రిటర్న్ షాట్ను లక్ష్య సేన్ నెట్కు కొట్టడంతో గేమ్తోపాటు మ్యాచ్ శ్రీకాంత్ వశమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చరిత్రలో సింగిల్స్ విభాగంలో ఫైనల్కు చేరిన మూడో భారతీయ ప్లేయర్ శ్రీకాంత్. గతంలో మహిళల సింగిల్స్లో పీవీ సింధు మూడుసార్లు (2017, 2018–రన్నరప్; 2019–విన్నర్), సైనా నెహ్వాల్ ఒకసారి (2015–రన్నరప్) ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్లో మాత్రం భారత్ నుంచి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా శ్రీకాంత్ నిలిచాడు. -
వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీలో దూసుకుపోతున్న సింధు..
PV Sindhu: స్పెయిన్లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021లో తెలుగు తేజం, డిఫెండింగ్ ఛాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్ల్యాండ్కు చెందిన పాన్పావీ చోచువాంగ్తో గురువారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో 21-14, 21-18 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సింధు తన తదుపరి మ్యాచ్లో(క్వార్టర్స్) చైనీస్ తైపీ క్రీడాకారిణి టైజు యింగ్తో తలపడనుంది. చదవండి: విరాట్లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
మూడో రౌండ్లోకి దూసుకెళ్లిన సింధు.. 24 నిమిషాల్లో ఖేల్ ఖతం
PV Sindhu: స్పెయిన్లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021లో తెలుగు తేజం, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో స్లోవేకియాకి చెందిన మార్టినా రెపిస్కాను 21-7, 21-9 తేడాతో వరుస సెట్లలో చిత్తుగా ఓడించిన సింధు.. తొలి సెట్ను 10 నిమిషాల్లో, మ్యాచ్ను 24 నిమిషాల్లో ఖతం చేసింది. ఈ మ్యాచ్లో సింధు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించడంతో ప్రత్యర్ధి రెపిస్కా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కాగా, ఈ టోర్నీలో సింధు సహా కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్లు కూడా మూడో రౌండ్కు చేరుకున్నారు. చదవండి: లంక ప్రీమియర్ లీగ్లో కోహ్లి.. శ్రీలంక క్రికెటర్ మనసులో మాట..! -
అథ్లెటిక్స్ కమిషన్ ఎన్నికల బరిలో సింధు
భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెటిక్స్ కమిషన్ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఎన్నికలు డిసెంబర్ 17న జరుగుతాయి. సింధు 2017నుంచి అథ్లెటిక్స్ కమిషన్లో కొనసాగుతుండగా... రెండో సారి ఆమె మాత్రమే పోటీ పడుతోంది. ఇందులో అందుబాటులో ఉన్న ఆరు మహిళల స్థానాల కోసం తొమ్మిది మంది ఎన్నికల్లో నిలబడుతున్నారు. -
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి!
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో అర్హత నిబంధనలలో మార్పులు చేస్తే తప్ప... టోక్యో ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆటను చూసే భాగ్యం లేనట్టే. ఆసియాలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో... క్రీడాకారులతోపాటు టోర్నీ సహాయక సిబ్బంది, ఇతర వర్గాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్–500 టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీలలో భాగమైన ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్ను కరోనా కారణంగానే వాయిదా వేయగా... సింగపూర్ ఓపెన్ను ఏకంగా రద్దు చేయడంతో చివరి అవకాశంగా టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలన్న భారత స్టార్స్ సైనా, శ్రీకాంత్లకు నిరాశ ఎదురైంది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై సింగపూర్ నిషేధం విధించింది. మరోవైపు జూన్, జూలైలలో జరగాల్సిన ఇతర టోర్నీలు కొరియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ వాయిదా పడగా... ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ, థాయ్లాండ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలు రద్దయ్యాయి. దాంతో ఈ ఏడాది జూలై 23న టోక్యో ఒలింపిక్స్ మొదలయ్యే వరకు అంతర్జాతీయ ఎలాంటి బ్యాడ్మింటన్ టోర్నీలు లేకుండా పోయాయి. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలు రద్దయిన నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనల వివరాలపై మరో ప్రకటన విడుదల చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ నిబంధనల ప్రకారం సింగిల్స్లో ఒకే దేశం నుంచి ఇద్దరు అర్హత పొందాలంటే టాప్–16లో కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ‘టోక్యో’ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్లో మహిళల సింగిల్స్లో పీవీ సింధు ఏడో ర్యాంక్లో... సైనా 22వ ర్యాంక్లో ఉంది. దాంతో సింధుకు ‘టోక్యో’ బెర్త్ ఖరారయింది. పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్లో ఉండగా... శ్రీకాంత్ 20వ స్థానంలో ఉన్నాడు. దాంతో సాయిప్రణీత్కు టోక్యో బెర్త్ ఖాయమైంది. పురుషుల డబుల్స్లో తొమ్మిదో ర్యాంక్లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట కూడా ‘టోక్యో’ బెర్త్ దక్కించుకుంది. 31 ఏళ్ల సైనా నెహ్వాల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్ చేరగా... 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్వన్ అయిన శ్రీకాంత్ 2016 రియో ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
‘వరల్డ్ ఫైనల్స్’ టోర్నీ నిర్వహణపై...
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ నిర్వహణపై చైనా నుంచి మరింత స్పష్టత కోరినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో జరగాల్సిన ఈ టోర్నీకి చైనా ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 2022 వింటర్ ఒలింపిక్స్ (బీజింగ్) ట్రయల్స్ మినహా... షెడ్యూల్ చేసిన ఏ అంతర్జాతీయ టోర్నీకీ ఆతిథ్యమివ్వబోమని శుక్రవారం చైనా క్రీడా పరిపాలక మండలి ప్రకటించింది. దీంతో గ్వాంగ్జౌ వేదికగా డిసెంబర్ 16–20 వరకు జరగాల్సిన వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీపై సందిగ్ధత నెలకొంది. చైనా తాజా నిర్ణయంతో ఈ ఏడాది బ్యాడ్మింటన్ క్యాలెండర్పై ఎలాంటి ప్రభావం పడనుందనే అంశంపై చైనీస్ బ్యాడ్మింటన్ సంఘం (సీబీఏ)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. వరల్డ్ ఫైనల్స్తో పాటు చైనా ఓపెన్ సూపర్–1000 ఈవెంట్ (సెప్టెంబర్ 15–20, చాంగ్జౌ), ఫుజు చైనా ఓపెన్ సూపర్–750 (నవంబర్ 3–8) టోర్నీలు కూడా చైనాలోనే జరుగనున్న నేపథ్యంలో వీటి భవిష్యత్పై కూడా బీడబ్ల్యూఎఫ్ వివరణ కోరింది. -
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ వాయిదా
ఆక్లాండ్: కరోనా వైరస్ నేపథ్యంలో మెగా టోర్నమెంట్ల వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చేరింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ ఈ ఏడాది సెప్టెంబర్లో న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరగాల్సింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ మెగా టోర్నీని వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 24 వరకు నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. సెప్టెంబర్లో జరగాల్సిన టోర్నీకి అర్హత పొందిన క్రీడాకారులే వాయిదా పడిన టోర్నీలో ఆడతారని బీడబ్ల్యూఎఫ్ వివరించింది. -
హైదరాబాద్ ఓపెన్తో బీడబ్ల్యూఎఫ్ సీజన్ పునః ప్రారంభం
న్యూఢిల్లీ: కరోనా కారణంగా మూలకు పడిన టోర్నమెంట్లను నిర్వహించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సిద్ధమైంది. ఈ మేరకు పలు టోర్నీల సవరించిన షెడ్యూల్ను శుక్రవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్ ఓపెన్తో మళ్లీ బ్యాడ్మింటన్ సందడి మొదలు కానుంది. హైదరాబాద్ ఓపెన్ కాకుండా... సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ (నవంబర్ 17–22), ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ (డిసెంబర్ 8–13) కూడా భారత్లో జరుగనున్నాయి. నిజానికి ఇండియా ఓపెన్ మార్చి 24–29 వరకు జరగాల్సి ఉండగా కరోనా ధాటికి వాయిదా పడింది. సవరించిన క్యాలెండర్ ప్రకారం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ స్థాయి టోర్నీలు తైపీ ఓపెన్ సూపర్ 300 (సెప్టెంబర్ 1–6)తో ప్రారంభం కాను న్నాయి. అనంతరం డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 3–11) జరుగనుంది. వీటితో పాటు 8 ప్రముఖ అంతర్జాతీయ టోర్నీలను రీషెడ్యూల్ చేశారు. అయితే బీడబ్ల్యూఎఫ్ సవరించిన షెడ్యూల్పై భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు నెలల కాలంలో ఏకంగా 22 అంతర్జాతీయ టోర్నీలు ఉండటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆటగాళ్లు ఇంకా ప్రాక్టీసే ప్రారంభించలేదని... ప్రాక్టీస్ మొదలుపెట్టాక మ్యాచ్ ఫిట్నెస్ సంతరించుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని సాయిప్రణీత్ అన్నాడు. -
ఉపరాష్ట్రపతిని కలిసిన పీవీ సింధూ ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. దేశం ఖ్యాతిని సింధూ ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. కుటుంబంతో కలిసి సింధూ ఉపరాష్ట్రపతిని హైదరాబాద్లో శనివారం కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా సింధూ కొత్త చరిత్ర లిఖించారని వెంకయ్య అన్నారు. ఆమె సాధించిన విజయాలు, కఠోర శ్రమ యువతకు ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. సింధూలాంటి అథ్లెట్లు దేశ యువతకు రోల్స్మోడల్స్గా నిలుస్తారని చెప్పారు. కఠినమైన ఆహార నియమాలు, కఠోర శ్రమ, క్రమశిక్షణ లక్ష్యాన్ని సాధించేందుకు ఆమెకు దోహదం చేశాయని వ్యాఖ్యానించారు. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) హెల్తీ అయితే దేశం వెల్తీ అవుతుంది.. ఇక జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ జాతీయోద్యమంగా ముందుకు సాగాలని వెంకయ్య ఆకాక్షించారు. ఆధునిక జీవన విధానంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్గా ఉండటం తప్పనిసరని పేర్కొన్నారు. ఆహార పద్ధతుల్లో మార్పులు, వ్యాయామం చేస్తే ఫిట్గా ఉండొచ్చని సూచించారు. ఫిట్ ఇండియా మూవ్మెంట్కు ఇదే సరైన సమయమని అన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ఉన్నారని, వారంతా ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉన్నప్పుడే దేశం పురోగమిస్తుందని చెప్పారు. ఆరోగ్యం ఉండటం మాత్రమే కాకుండా ఫిట్గా ఉంటేనే లక్ష్యాల్ని సాధింంచగులుగుతామన్నారు. దేశం హెల్తీగా ఉంటేనే వెల్తీగా మారుతుందని అన్నారు. -
2020 ఒలంపిక్స్లో కూడా స్వర్ణం ఆమెదేనా?
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్షిప్-2019లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె సాధించిన ఈ ఘనతపై జాతీయంగా, అంతర్జాతీయంగా సింధుపై అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ప్రతీ చిన్నవిశేషం కూడా క్రీడాభిమానులను, యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మరో భారతీయ గోల్డెన్ గర్ల్ , పరుగుల రాణి పద్మశ్రీ పీటీ ఉషతో కలిసి వున్న సింధు చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఆకర్షిస్తోంది. పీటీ ఉష సింధుకు అభినందనలు తెలుపుతూ పీవీ సింధు చిన్నప్పుడు తనతో కలిసి దిగిన 18 ఏళ్ల క్రితంనాటి ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో మీరిద్దరు దేశానికి గర్వ కారణమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా, పలువురు క్రీడాభిమానులు, ఇతర అభిమానులు అరుదైన ఆ ఫోటోకు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చదవండి :‘దారుణమైన వర్కవుట్లు; కాబట్టే సింధూ గెలిచింది’ ఛాంపియన్షిప్లో పీవీ సింధు బంగారు పతకం గెలవడంతో ఆమెని అభినందించిన పీటీ ఉష 2020 టోక్యో ఒలింపిక్స్లో పీవీ సింధు స్వర్ణాన్ని గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఆమె ఇప్పటికే రజత పతకం గెలిచింది. పసిడిపై గురి పెడితే కచ్చితంగా చేజిక్కించుకోగలదంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పీవీ సింధు ప్రపంచ పోటీకి ముందు కఠోర సాధన చేస్తున్న వీడియో ఒకటి టాక్ ఆఫ్ ది యూత్గా నిలిచింది. 2020 స్వర్ణం కూడా సింధూకే సొంతం కావాలంటూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) The passion and dedication for the sport will always be rewarded when hardwork comes into play. @Pvsindhu1 success will inspire generations to come! Hefty congratulations on winning the Gold at #BWFWorldChampionships2019 🇮🇳 pic.twitter.com/xBP7RgOHnt — P.T. USHA (@PTUshaOfficial) August 25, 2019 -
‘దారుణమైన వర్కవుట్లు; కాబట్టే సింధూ గెలిచింది’
-
పీవీ సింధూపై ట్వీట్ వైరల్...
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూపై చేసిన ట్వీట్ వైరల్ అయింది. సింధూ వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన ఆయన.. ‘పీవీ సింధూ బ్యాడ్మింటన్లో వరల్డ్ చాంపియన్గా నిలవడంలో రహస్యమేముంది. ఆమె చేస్తున్న దారుణమైన వర్కవుట్లు చూసి మతిపోయింది. అంతలా కష్టపడుతోంది కాబట్టే ప్రపంచ చాంపియన్గా అవతరించింది. యావత్ భారతంలోని యువ క్రీడాకారులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఆమెలా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరాలి’ అని ట్వీట్ చేశారు. సింధూ వర్కవుట్కు సంబంధించిన ఈ వీడియో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలకు బయల్దేరే ముందు హైదరాబాద్లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడెమీలోనిది. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై జయకేతనం ఎగరేసింది. బీడబ్ల్యూఎఫ్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు కొత్త చరిత్ర లిఖించింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. -
క్రీడల మంత్రిని కలిసిన పీవీ సింధు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అనంతరం కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆమె కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధును కేంద్ర మంత్రి అభినందించారు. మధ్యాహ్నం ఆమె హైదరాబాద్కు చేరుకోనున్నారు. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై జయకేతనం ఎగరేసింది. బీడబ్ల్యూఎఫ్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు కొత్త చరిత్ర లిఖించింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. -
క్వార్టర్స్లో సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో ఐదో సీడ్ శుభాంకర్ డే, ఏడో సీడ్ సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్ క్వార్టర్స్కు చేరుకోగా... మహిళల సింగిల్స్ కేటగిరీలో ఆకర్షి కశ్యప్, చుక్కా సాయి ఉత్తేజితరావు పోరాటం ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్ల్లో శుభాంకర్ డే 21–16, 21–15తో చికో అరా వార్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందగా... సౌరభ్ వర్మ 21–16, 21–11తో సన్ పెయ్ జియాంగ్ (చైనా)ను, అజయ్ జయరామ్ 21–18, 21–13తో జియా వీ తాన్ (మలేసియా)ను ఓడించారు. మరో మ్యాచ్లో నాలుగో సీడ్ పారుపల్లి కశ్యప్ 21–17, 15–21, 19–21తో లోహ్ కియాన్ యు (సింగపూర్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సాయి ఉత్తేజిత రావు 10–21, 21–9, 8–21తో క్వాలిఫయర్ బెన్యప ఎమ్సార్డ్ (థాయ్లాండ్) చేతిలో, క్వాలిఫయర్ ఆకర్షి కశ్యప్ 18–21, 13–21తో రెండో సీడ్ అన్ సు యంగ్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో మహిళల సింగిల్స్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. -
భారత స్టార్స్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్ రెండో రౌండ్లోనే నిష్క్రమించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్ల్లో టాప్ సీడ్ సమీర్ వర్మ 18–21, 11–21తో హియో క్వాంగ్ హీ (కొరియా) చేతిలో... రెండో సీడ్ సాయిప్రణీత్ 17–21, 23–21, 15–21తో లియోనార్డో రుంబే (ఇండోనేసియా) చేతిలో... మూడో సీడ్ ప్రణయ్ 17–21, 10–21తో జియా వె తాన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. భారత్కే చెందిన పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, శుభాంకర్ డే ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో నాలుగో సీడ్ కశ్యప్ 23–21, 19–21, 21–17తో క్వాలిఫయర్ కిమ్ డాంగ్హున్ (కొరియా)పై, శుభాంకర్ 19–21, 21–13, 21–16తో సెంగ్ జో యో (మలేసియా)పై గెలిచారు. హైదరాబాద్ ఆటగాడు, క్వాలిఫయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ తొలి రౌండ్లో 21–16, 21–23, 15–21తో మరో క్వాలిఫయర్ బాయ్ యు పెంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో చుక్కా సాయి ఉత్తేజిత రావు 21–14, 17–21, 21–10తో దిశా గుప్తా (అమెరికా)పై గెలుపొందగా... గుమ్మడి వృశాలి 16–21, 10–21తో ఫితాయపోర్న్ చైవన్ (థాయ్లాండ్) చేతిలో... కుదరవల్లి శ్రీకృష్ణప్రియ 15–21, 10–21తో కి జుయ్ఫె (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యారు. -
ఒలింపిక్ అర్హత పద్ధతి బాగా లేదు!
న్యూఢిల్లీ: ఒలింపిక్స్కు అర్హత సాధించే విషయంలో ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అనుసరిస్తున్న విధానాన్ని భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తప్పుపట్టారు. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఆటగాళ్లు ఏడాదంతా ఆడాల్సి వస్తోందని, అది వారిపై తీవ్ర ఒత్తిడి పెంచుతోందని ఆయన అన్నారు. ‘ఎక్కువ సంఖ్యలో టోర్నీలు ఆడటం వల్ల ఆటగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉంటుందనేది వాస్తవం. అయితే సంవత్సరం పాటు ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీలు కొనసాగడం సరైంది కాదు. దీనిపై దృష్టి పెట్టాలి. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ, ప్రపంచ చాంపియన్షిప్ లేదా ఆసియా, యూరోపియన్ చాంపియన్షిప్ లాంటివి గెలిచినప్పుడు కొందరికైనా నేరుగా అర్హత సాధించే సౌకర్యం ఉండాలి. ఇప్పుడేమో పిచ్చి పట్టినట్లుగా ఆటగాళ్లు ప్రపంచమంతా తిరగాల్సి వస్తోంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న విషయం’ అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. -
మురిపించే ముగింపు ఎవరిదో!
గతేడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్లో అదరగొట్టిన భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాదీ నిలకడగా రాణించింది. కానీ ఫైనల్ చేరిన ప్రతి టోర్నీలోనూ తడబడి ఒక్క టైటిల్ కూడా తన ఖాతాలో జమ చేసుకోలేకపోయింది. అయితే ఈ సీజన్ను టైటిల్తో ముగించేందుకు ఆమెకు వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్ రూపంలో చివరి అవకాశం వచ్చింది. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్–8 క్రీడాకారుల మధ్య జరిగే ఈ మెగా ఈవెంట్లో సింధు ‘ఫినిషింగ్ టచ్’ ఇస్తుందో లేదో వేచి చూడాలి. మరోవైపు పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. గ్వాంగ్జౌ (చైనా): ఈ ఏడాది ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, థాయ్లాండ్ ఓపెన్, ప్రపంచ చాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్ ఈవెంట్స్లో పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కానీ చివరి అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఈ ఐదు ఈవెంట్స్లో ఆమె ఐదుగురు వేర్వేరు ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి చవిచూసింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో సింధు 63 మ్యాచ్లు ఆడి 45 విజయాలు నమోదు చేసి, 18 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఏడాది పొడవునా నిలకడగా రాణించిన ఆమెకు టైటిల్ మాత్రం ఇంకా ఊరిస్తోంది. గతేడాది దుబాయ్లో జరిగిన సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్లో రన్నరప్గా నిలిచిన సింధు ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగి రావాలని... ఈ ఏడాది టైటిల్ లేని లోటును తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్ ‘ఎ’లో సింధుతోపాటు ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్), 12వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా) ఉన్నారు. ఈ ముగ్గురూ ఈ ఏడాది సింధును ఓడించడం గమనార్హం. బుధవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో అకానె యామగుచితో సింధు ఆడనుంది. ఇప్పటివరకు వీరిద్దరు 13 సార్లు ముఖాముఖిగా తలపడ్డారు. తొమ్మిది సార్లు సింధు... నాలుగుసార్లు యామగుచి గెలుపొందారు. అయితే చివరి మూడు మ్యాచ్ల్లో మాత్రం యామగుచినే విజయం వరించడం విశేషం. యామగుచి తర్వాత తదుపరి రెండు మ్యాచ్ల్లో బీవెన్ జాంగ్తో, తై జు యింగ్తో సింధు ఆడాల్సి ఉంటుంది. బీవెన్ జాంగ్తో ముఖాముఖి రికార్డులో సింధు 3–3తో సమంగా ఉండగా... తై జు యింగ్తో మాత్రం సింధు 3–10తో వెనుకంజలో ఉంది. ఈ ఏడాది తై జు యింగ్ సూపర్ ఫామ్లో ఉంది. ఎనిమిది టోర్నమెంట్లలో ఫైనల్ చేరిన ఆమె ఆరు టైటిల్స్ను సొంతం చేసుకుంది. రెండు టోర్నీలలో రన్నరప్గా నిలిచింది. మరోవైపు గ్రూప్ ‘బి’లో ఐదో ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్), మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా), ఎనిమిదో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత రచనోక్ (థాయ్లాండ్), 16వ ర్యాంకర్ మిచెల్లి లీ (కెనడా) ఉన్నారు. గ్రూప్ లీగ్ మ్యాచ్లు ముగిశాక ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్కు అర్హత సాధిస్తారు. ఎవరికెంత... 15 లక్షల డాలర్ల (రూ. 10 కోట్ల 83 లక్షలు) ప్రైజ్మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు లక్షా 20 వేల డాలర్ల (రూ. 86 లక్షల 70 వేలు) చొప్పున లభిస్తాయి. రన్నరప్గా నిలిచిన వారు 60 వేల డాలర్లు (రూ. 43 లక్షల 34 వేలు) అందుకుంటారు. సెమీఫైనల్లో ఓడిన వారికి 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 67 వేలు) లభిస్తాయి. లీగ్ దశలో గ్రూప్లో మూడో స్థానంలో నిలిచిన వారికి 16,500 డాలర్ల (రూ. 11 లక్షల 92 వేలు) చొప్పున... చివరి స్థానంలో నిలిచిన వారికి 9 వేల డాలర్లు (రూ. 6 లక్షల 50 వేలు) లభిస్తాయి. సమీర్ సంచలనం సృష్టించేనా... పురుషుల సింగిల్స్లో తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించిన సమీర్ వర్మ తన స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది సమీర్ వర్మ సయ్యద్ మోదీ ఓపెన్, హైదరాబాద్ ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు. మధ్యప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల సమీర్ ఈ ఏడాది 47 మ్యాచ్లు ఆడాడు. 31 మ్యాచ్ల్లో గెలిచి, 16 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్)తో సమీర్ వర్మ ఆడతాడు. స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచే క్రమంలో క్వార్టర్ ఫైనల్లో మొమోటాపై సమీర్ వర్మ గెలుపొందడం గమనార్హం. అయితే ఈ ఏడాది మొమోటా అద్వితీయమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది అతను ఏడు టైటిల్స్ సాధించడం విశేషం. మొత్తం 77 మ్యాచ్ల్లో కేవలం 7 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయాడు. మొమోటా ఫామ్ చూస్తుంటే సీజన్ను మరో టైటిల్తో ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ గ్రూప్లో ఎవరంటే... మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’: పీవీ సింధు (భారత్), తై జు యింగ్ (చైనీస్ తైపీ), అకానె యామగుచి (జపాన్), బీవెన్ జాంగ్ (అమెరికా). గ్రూప్ ‘బి’: నొజోమి ఒకుహారా (జపాన్), చెన్ యుఫె (చైనా), ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్), మిచెల్లి లీ (కెనడా). పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’: చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ), షి యుకి (చైనా), సన్ వాన్ హో (దక్షిణ కొరియా), ఆంథోని సిన్సుక్ గిన్టింగ్ (ఇండోనేసియా). గ్రూప్ ‘బి’: సమీర్ వర్మ (భారత్), కెంటో మొమోటా (జపాన్), కాంతపోన్ వాంగ్చరోయెన్ (థాయ్లాండ్), టామీ సుగియార్తో (ఇండోనేసియా). ‘ఈసారి సన్నాహానికి కావాల్సినంత సమయం లభించింది. టోర్నీలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాననే నమ్మకం ఉంది. బ్యాడ్మింటన్ సర్క్యూట్లో ఇది అతి పెద్ద టోర్నమెంట్.అగ్రశ్రేణి క్రీడాకారిణులు బరిలోకి దిగుతారు. కఠిన పరిస్థితులు ఎదురవనున్నా టైటిల్ సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నాను’ – పీవీ సింధు ►సీజన్ ముగింపు టోర్నీలో ఆడటం సింధుకిది వరుసగా మూడో ఏడాది. 2016లో సెమీస్కు చేరిన ఆమె... 2017లో రన్నరప్గా నిలిచింది. ►వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భారత క్రీడాకారులు నెగ్గిన పతకాలు. 2009లో జ్వాల–దిజు ద్వయం మిక్స్డ్ డబుల్స్లో రజతం... 2011లో సైనా మహిళల సింగిల్స్లో రజతం... 2017లో సింధు రజతం సాధించారు. -
పాల్గొంటే సరిపోతుందా!
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కొత్తగా అమల్లోకి తేవాలనుకుంటున్న షెడ్యూలుపై భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ అసంతృప్తి వెలిబుచ్చింది. తీరిక లేకుండా వరుస టోర్నీల్లో పాల్గొంటే గెలవడం కష్టమవుతుందని చెప్పింది. బీడబ్ల్యూఎఫ్ కొత్త షెడ్యూల్ ప్రకారం ప్రపంచ టాప్–15 సింగిల్స్ క్రీడాకారులు ఏడాదిలో కనీసం 12 పెద్ద టోర్నీల్లో తప్పనిసరిగా ఆడాలి. లేదంటే పెనాల్టీ పాయింట్లు విధిస్తారు. ‘బీడబ్ల్యూఎఫ్ షెడ్యూల్ మేటి క్రీడాకారుల ప్రయోజనాలను కాలరాసేలా ఉంది. నా వరకైతే అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు, తిరిగి పుంజుకునేందుకు సమయం అవసరం. వరుసబెట్టి టోర్నీలు ఆడలేను. అలాగైతే గెలవలేను. పీబీఎల్ తర్వాత మూడు టోర్నీలున్నాయి. ప్రపంచ చాంపియన్షిప్కు ముందు మరో మూడు సూపర్ సిరీస్ ఈవెంట్లున్నాయి. దీంతో ఆటగాళ్లు బాగా అలసిపోతారు. ఇది చాలా సవాలుతో కూడుకున్నది’ అని సైనా చెప్పింది. టెన్నిస్తో బ్యాడ్మింటన్ను పోలుస్తూ సైనా మరో సూచన చేసింది. బ్యాడ్మింటన్ను టెన్నిస్లా చేయాలనుకుంటే నాలుగైదు గ్రాండ్ స్లామ్లకు పరిమితం చేయాలి. దీంతో డబ్బుకు డబ్బు, కవరేజ్ కవరేజ్ వస్తుందని వ్యాఖ్యానించింది. పీబీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ... స్టార్ ఆటగాళ్ల మధ్య పీబీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ఒక్క సింధు మినహా మేటి ప్లేయర్లంతా పాల్గొన్నారు. శనివారం (ఈ నెల 23) నుంచి 23 రోజుల పాటు జరగనున్న ఈ మూడో సీజన్లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలు జతయ్యాయి. దీంతో ఐపీఎల్ లాగే మొత్తం 8 ఫ్రాంచైజీలతో పీబీఎల్ ముస్తాబైంది. బుధవారం జరిగిన కార్యక్రమంలో సైనా, ప్రణయ్, అజయ్ జయరామ్, మారిన్, సన్వాన్, తియన్ హౌవీ పాల్గొన్నారు. -
బీడబ్ల్యూఎఫ్లో ఒలింపిక్ కమిటీ ప్రతినిధిగా సైనా
హైదరాబాద్: భారత బ్యా డ్మింటన్ స్టార్ సైనా నెహ్వా ల్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)లో ఒలింపిక్ కమిటీ ప్రతినిధిగా వ్యవహరించనుంది. గతేడాది రియో ఒలింపిక్స్ ఈవెంట్ ముగిసిన వెంటనే ఆమె అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోని అథ్లెట్స్ కమిషన్ (ఏసీ) సభ్యురాలిగా నియమితులైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెను బీడబ్ల్యూఎఫ్ ప్యానెల్ సభ్యురాలిగా కూడా నియమించారు. ఈ విషయాన్ని ప్యానెల్లోని ఇతర సభ్యులకు తెలియజేసినట్లు బీడబ్ల్యూఎఫ్ ఏసీ తెలిపింది. రియో ఒలింపిక్స్లో గాయపడిన ఆమె శస్త్రచికిత్సతో కొన్నాళ్లు ఆటకు దూరమైంది. ఇటీవల మళ్లీ రాకెట్ పట్టిన ఆమె మలేసియా గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నమెంట్లో టైటిల్ సాధిం చింది. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో పదో స్థానంలో ఉన్న సైనా... వచ్చే నెలలో జరిగే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్పై కన్నేసింది. -
కరోలినాపై సింధు గెలుపు
-
కరోలినాపై సింధు గెలుపు
దుబాయ్: ఒలింపిక్స్ ఓటమిపై పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుంది. ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో శుక్రవారం జరిగిన గ్రూప్-బి థర్డ్ మ్యాచ్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ ను సింధు ఓడించింది. 21-17, 21-13 తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో పీవీ సింధు సెమీస్కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్లో యామగుచిపై సింధు గెలవగా.. గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సున్ యు (చైనా) చేతిలో సింధు 15–21, 17–21తో ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
ప్రతిష్టాత్మక టోర్నీ.. సింధు శుభారంభం
-
ప్రతిష్టాత్మక టోర్నీ.. సింధు శుభారంభం
దుబాయ్: ప్రతిష్టాత్మక ‘వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్’ టోర్నమెంట్కు అర్హత సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. దుబాయ్లో బుధవారం సాయంత్రం జరిగిన గ్రూపు దశ తొలి మ్యాచ్ లో జపాన్ ప్లేయర్ అకానె యామగుచిపై 12-21, 21-8, 21-15 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది. తొలి గేమ్ కోల్పోయిన సింధు ఆపై రెండో గేమ్లో ప్రత్యర్థి యామగుచికి అవకాశమే ఇవ్వలేదు. రెండో గేమ్ సింధు నెగ్గడంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. నిర్ణయాత్మక మూడో గేమ్లో జపాన్ షట్లర్ కాస్త ప్రతిఘటించినా ర్యాలీలతో సింధు తన ప్రత్యర్థికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. పాయింట్ల అంతరాన్ని కొనసాగిస్తూ వచ్చిన సింధు మూడో గేమ్ను నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకుంది. సింధు తన తర్వాతి మ్యాచ్లో సున్ యు (చైనా)తో తలపడనుంది. -
సైనా నెహ్వాల్ కు అరుదైన గౌరవం
దుబాయ్: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) సైనాను తన అంబాసిడర్ గా ఎంచుకున్నట్లు ప్రకటించింది. మొత్తం ఐదుగరు టాప్ ప్లేయర్లను ఫెయిర్ అండ్ హనరబుల్ స్పోర్ట్ ఇంటిగ్రిటీ అంబాసిడర్స్ గా ఎంపిక చేసిన బీడబ్ల్యూఎఫ్ అందులో సైనాను కూడా ఎంపిక చేసినట్లు చెప్పింది. డెన్మార్క్ కు చెందిన క్రిస్టిన్నా పిడెర్సెన్, విక్టర్ అక్సెల్సెన్ లు, జపాన్ కు చెందిన డబుల్స్ పెయిర్ మిసాకి మత్సుతోమో, అయకా తకాహషిలు కూడా ఇందులో ఉన్నారు. దుబాయ్ లో మంగళవారం జరగనున్న వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ సందర్భంగా బీడబ్ల్యూఎఫ్ డిప్యూటీ ప్రెసిడెంట్ గుత్సావో సలాజర్ అంబాసిడర్లను మీడియాకు పరిచయం చేశారు. బ్యాడ్మింటన్ ను మరింత వృద్ధి చేసేందుకు బీడబ్ల్యూఎఫ్ తీసుకున్న సరికొత్త చర్యల్లో ఇంటిగ్రిటీ ప్రోగ్రామ్ కొత్తది. బీడబ్ల్యూఎఫ్ తరఫున అంబాసిడర్లు ఇంటిగ్రిటీ ప్రోగ్రామ్ పై విస్తృత ప్రచారం చేస్తారని సలాజర్ చెప్పారు. అంబాసిడర్లుగా ఎంపికైన ప్లేయర్లకు సర్టిఫికేట్లను అందజేశారు. -
కొత్త లక్ష్యంతో...
నేటి నుంచి వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ తొలిసారి పోటీపడుతున్న పీవీ సింధు భారత షట్లర్ గ్రూప్లోనే కరోలినా మారిన్ ఈ ఏడాది అద్వితీయ ఫామ్లో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు గొప్ప విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించడం... కెరీర్లో లోటుగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్నూ సొంతం చేసుకోవడం... ఇలా తాను నిర్దేశించుకున్న ఒక్కో లక్ష్యాన్ని ఈ హైదరాబాద్ అమ్మాయి సమర్ధవంతంగా చేరుకుంది. ఇక సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక ‘వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్’ టోర్నమెంట్కు సింధు తొలిసారి అర్హత సాధించింది. ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగుతున్న తొలిసారే తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ఆమె దుబాయ్లో అడుగుపెట్టింది. 2011లో సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో రన్నరప్గా నిలువడం భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన. సింధు తన దూకుడు కొనసాగించి సైనా ఘనతను సవరిస్తుందా? లేదా ఆమె సరసన నిలుస్తుందో లేదో వేచి చూడాలి. సాయంత్రం 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్4లో ప్రత్యక్ష ప్రసారం సాక్షి క్రీడా విభాగం : అంతర్జాతీయస్థాయిలో అడుగుపెట్టిన కొన్నేళ్లకే ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో పరీక్షకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా బుధవారం తెర లేవనున్న వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్లో ఈ హైదరాబాద్ అమ్మాయి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈనెల 18 వరకు జరిగే ఈ టోర్నీలో సింధుతో పాటు ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), అకానె యామగుచి (జపాన్), సున్ యు (చైనా), హీ బింగ్జియావో (చైనా), సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా), ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) పాల్గొంటున్నారు. గ్రూప్ ‘ఎ’లో తై జు యింగ్, సుంగ్ జీ హున్, రచనోక్, హీ బింగ్జియావో... గ్రూప్ ‘బి’లో సింధు, మారిన్, యామగుచి, సున్ యు ఉన్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్ లీగ్ మ్యాచ్లో అకానె యామగుచితో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2–1తో ఆధిక్యంలో ఉంది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో సున్ యుతో... శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో కరోలినా మారిన్తో సింధు తలపడుతుంది. చివరి టోర్నీతో బెర్త్... 2011 నుంచి గత ఏడాది వరకు మహిళల సింగిల్స్లో భారత్ నుంచి సైనా నెహ్వాల్ ఈ మెగా ఈవెంట్లో ఆడింది. కానీ ఈసారి మాత్రం సైనాను వెనక్కినెట్టి సింధు ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి బెర్త్ సాధించింది. సీజన్ చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్లో సింధు రన్నరప్గా నిలువడం... అదే టోర్నీలో సైనా క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించడం జరిగింది. దాంతో సూపర్ సిరీస్ ర్యాంకింగ్స్లో సింధు 46,290 పాయింట్లతో చివరిదైన 8వ బెర్త్ దక్కించుకోగా... 43,120 పాయింట్లతో సైనా తొమ్మిదో ర్యాంక్లో నిలిచి ఈ టోర్నీకి అర్హత పొందలేకపోయింది. నిలకడగా రాణిస్తేనే... అగ్రశ్రేణి క్రీడాకారుల కోసం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ మొత్తంలో 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్లు నిర్వహిస్తుంది. ఇందులో ఆరు సూపర్ సిరీస్ టోర్నీలు కాగా... మరో ఆరు ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలు. సూపర్ సిరీస్తో పోలిస్తే ప్రీమియర్ టోర్నీలో ప్రైజ్మనీ, ర్యాంకింగ్ పాయింట్లు ఎక్కువగా లభిస్తాయి. 12 సూపర్ సిరీస్ టోర్నీలు ముగిశాక ఈ టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా టాప్–8లో నిలిచిన వారు ‘మాస్టర్స్ ఫైనల్స్’కు అర్హత పొందుతారు. 10 లక్షల డాలర్ల ప్రైజ్మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇదీ ఫార్మాట్... పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలుంటాయి. ప్రతి విభాగంలో రెండు గ్రూప్లు ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్కు అర్హత సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం... ఈ ఏడాది నిలకడగా రాణించిన సింధుకు దానికి తగ్గ గుర్తింపు లభించింది. ప్రపంచ బ్యాడ్మిం టన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక పురస్కారాల్లో ఆమెకు ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్’ (చాలా మెరుగైన క్రీడాకారిణి) అవార్డు లభించింది. దుబాయ్లో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు దావూద్ అల్ హజ్రి చేతుల మీదుగా సింధు ఈ అవార్డును అందుకుంది. ఈ పురస్కారం లభిస్తుందని అనుకోలేదు. ఊహించని అవార్డు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. దుబాయ్లో తొలిసారి సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ను ఆడనున్నాను. నాకు ‘డ్రా’ కఠినంగా పడింది. మారిన్, బింగ్జియావో, సున్ యులతో మా గ్రూప్ పటిష్టంగా ఉంది. మంచి ఫలితాలను సాధించాలంటే నేను తొలి మ్యాచ్ నుంచే బాగా ఆడాల్సి ఉంటుంది. –పీవీ సింధు -
చాంపియన్కు చుక్కలు
మారిన్పై సైనా సంచలన విజయం నిరాశపర్చిన శ్రీకాంత్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ దుబాయ్: టోర్నమెంట్లో ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా నెహ్వాల్ అదరగొట్టింది. చాలాకాలంగా తన విజయాలకు అడ్డుగా నిలుస్తున్న ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను కంగుతినిపించింది. సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల గ్రూప్-ఎ మ్యాచ్లో సైనా 23-21, 9-21, 21-12తో మారిన్ను ఓడించింది. గంటా 15 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో సైనా అప్పుడప్పుడు తడబడినా తొందరగానే తేరుకుంది. తొలి గేమ్లో 9-4 ఆధిక్యంలోకి వెళ్లినా వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయింది. ఓ దశలో మారిన్ 15-12 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ సైనా పుంజుకుని స్కోరును 21-21తో సమం చేసి... క్రాస్ షాట్స్తో వరుసగా రెండు పాయింట్లతో గేమ్ను చేజిక్కించుకుంది. అయితే రెండో గేమ్లో ఊహించని రీతిలో హైదరాబాదీ ఆట గాడి తప్పింది. స్కోరు 5-5తో సమమైన తర్వాత మారిన్ ఒక్కసారిగా చెలరేగిపోయింది. వరుసగా ఐదు, ఆరు పాయింట్ల చొప్పున సాధించి గేమ్ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో సైనా తన వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. రక్షణాత్మకంగా కాకుండా అటాకింగ్ గేమ్తో వణికించింది. స్కోరు 4-4తో సమమైన తర్వాత సైనా తన అనుభవాన్ని రంగరించి 10-5 ఆధిక్యంలో వెళ్లింది. తర్వాత మారిన్ పుంజుకోవడంతో ఆధిక్యం 8-11కు తగ్గింది. ఈ దశలో మారిన్ చేసిన అనవసర తప్పిదాలను హైదరాబాద్ అమ్మాయి అందిపుచ్చుకుంది. చకచకా పాయింట్లతో 16-8 స్కోరు సాధించింది. తర్వాత అద్భుతమైన క్రాస్ కట్స్తో 19-9 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మారిన్ పోరాడినా... రెండు సూపర్ స్మాష్లతో సైనా గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్కు చుక్కెదురు: మరోవైపు పురుషుల గ్రూప్-బి మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ వరుసగా రెండో పరాజయం మూటగట్టుకున్నాడు. రెండో లీగ్ మ్యాచ్లో 13-21, 18-21తో అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. దీంతో టోర్నీలో ముందుకెళ్లే అవకాశాలు కాస్త సన్నగిల్లాయి. -
బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో శ్రీకాంత్ ఓటమి
దుబాయ్: ప్రపంచ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో శనివారం భారత్కు నిరాశ ఎదురైంది. భారత టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్తో పాటు శ్రీకాంత్ కూడా ఓటమి చవిచూశాడు. పురుషుల సింగిల్స్ సెమీస్లో శ్రీకాంత్ 18-21, 9-21 స్కోరుతో చైనా ఆటగాడు చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు మహిళల సింగిల్స్ సెమీస్లో వరల్డ్ నెంబర్ 4 సైనా 21-11, 13-21, 9-21 తేడాతో తైవాన్ క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 9 టే జూ యింగ్ చేతిలో ఓడిపోయింది. -
వరల్డ్ సూపర్ సిరీస్ సెమీఫైనల్స్లో సైనా ఓటమి
దుబాయ్: అద్వితీయ ఆటతీరును కొనసాగించిన భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) సూపర్ సిరీస్ సెమీఫైనల్స్లో ఓడిపోయింది. శనివారం జరిగిన సెమీఫైనల్స్లో 21-11, 13-21, 9-21 తేడాతో తైవాన్ క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 9 టే జూ యింగ్ చేతిలో వరల్డ్ నెంబర్ 4 సైనా ఓడిపోయింది. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ అజేయంగా నిలిచి గ్రూప్ ఏ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సైనా 15-21, 21-7, 21-17తో యోన్ జూ బే (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది.