
హ్యూస్టన్ (అమెరికా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ నేటి నుంచి అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో జరగనుంది. వారంరోజుల పాటు జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, ఆంథోనీ అమల్రాజ్ పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో మనిక బత్రా, సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, మధురిక, అర్చన కామత్ బరిలో ఉన్నారు.