Table tennis
-
TT Legend: పతకాల వీరుడు.. శరత్ శకం ముగిసే!
కామన్వెల్త్ గేమ్స్లో 7 పసిడి పతకాలు... మరో 3 రజతాలు, 3 కాంస్యాలు...ఆసియా క్రీడల్లో 2 కాంస్య పతకాలు..ఆసియా చాంపియన్షిప్లో 4 కాంస్యాలు...ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 30వ స్థానం...10 సార్లు జాతీయ సీనియర్ చాంపియన్గా ఘనత... ఐదుసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం...అర్జున, ఖేల్రత్నతో పాటు పద్మశ్రీ పురస్కారం కైవసం...2024 పారిస్ ఒలింపిక్స్లో త్రివర్ణ పతాకధారిగా భారత బృందానికి నాయకత్వం వహించడం...ఒక క్రీడాకారుడి కెరీర్లో ఇంతకుమించి ఏం కావాలి! భారత టేబుల్ టెన్నిస్ (టీటీ)కు వన్నెతెచి్చన ఆచంట శరత్ కమల్ ఇవన్నీ సాకారం చేసుకున్నాడు. రెండు దశాబ్దాలుగా భారత టీటీ ముఖచిత్రంగా ఉన్న శరత్ కమల్ ఆట ముగించాలని నిర్ణయం తీసుకున్నాడు. స్వస్థలం చెన్నైలో ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో చివరిసారి బరిలోకి దిగుతానని శరత్ బుధవారం ప్రకటించాడు. 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో లెక్కకు మిక్కిలి పతకాలు నెగ్గిన శరత్ ఘనతలను ఒకసారి గుర్తుచేసుకుంటే... సాక్షి క్రీడావిభాగం : భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. మార్చి 25 నుంచి 30 వరకు చెన్నై వేదికగా జరగనున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీ అనంతరం ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించాడు. రెండు దశాబ్దాలకు పైగా దేశ అత్యుత్తమ ప్యాడ్లర్గా కొనసాగిన 42 ఏళ్ల శరత్ కమల్... కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. ఆసియా క్రీడల్లోనూ అదరగొట్టిన శరత్ కమల్... 2018 జకార్తా గేమ్స్లో పురుషుల టీమ్ విభాగంతో పాటు... మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆసియా చాంపియన్షిప్లో 4 కాంస్య పతకాలు సాధించిన శరత్ కమల్... ఐదుసార్లు ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. విశ్వక్రీడల్లో శరత్ పతకం సాధించనప్పటికీ అతడి ఘనతలను పతకాలతో కొలవలేం. సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ... కెరీర్లో అత్యుత్తమంగా ప్రపంచ 30వ ర్యాంక్కు చేరుకున్న శరత్ కమల్... దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్రత్న’తో పాటు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ కూడా దక్కించుకున్నాడు. శరత్ స్ఫూర్తితోనే టేబుల్ టెన్నిస్ వైపు అడుగులు వేసిన మనిక బత్రా, ఆకుల శ్రీజ అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. ‘ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పడం లేదు కానీ, ఇకపై పెద్ద టోర్నీలు, జనసమూహాల ముందు జరిగే మ్యాచ్ల్లో ఆడను. నా రాకెట్కు కొంత విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నా. టేబుల్ టెన్నిస్ నాకు ఇచ్చిన ఆనందం, అభిమానం వెలకట్టలేనిది. దాన్ని మాటల్లో వర్ణించలేను’ అని శరత్ పేర్కొన్నాడు. ‘1998లో చెన్నై వేదికగానే ఆసియా జూనియర్ చాంపియన్షిప్తో నా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది. 2025లో చెన్నై వేదికగానే డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ ద్వారా నా కెరీర్ను ముగించాలని నిర్ణయం తీసుకున్నాను. నా ఆఖరి ఆట తిలకించేందుకు నా కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులు, శ్రేయోభిలాషులు వస్తారు. అత్యుత్తమ ఆటతీరుతో సగర్వంగా కెరీర్కు ముగింపు పలకాలని భావిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. » సీనియర్ నేషనల్ చాంపియన్షిప్లో 10 సార్లు విజేతగా నిలిచిన శరత్ కమల్... అంతకుముందు కమలేశ్ మెహతా నెలకొల్పిన రికార్డును (8 సార్లు) బద్దలు కొట్టాడు. ‘గత 20 ఏళ్లలో ఆటలో ఎన్నో మార్పులు సంభవించాయి. అప్పట్లో ఇలాంటి కొత్త తరహా షాట్లు ఏమీ లేవు. కానీ ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని మెరుగు పర్చుకుంటూ కొత్త ఒరవడి సృష్టించుకుంటూ వెళ్లడంతోనే శరత్ ఇంత సుదీర్ఘ కాలం రాణించగలిగాడు’ అని కమలేశ్ పేర్కొన్నాడు. » 2015 ప్రపంచ చాంపియన్షిప్ సమయంలో గాయపడిన శరత్ తిరిగి కోలుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు. కండరాల సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న శరత్... ఆ తర్వాత కెరీర్లో ఎన్నో అద్వితీయ విజయాలు సాధించాడు. » టేబుల్ టెన్నిస్లో చైనా, జపాన్, దక్షిణ కొరియా ఆదిపత్యం కొనసాగుతున్న సమయంలో చైనీయులను ఓడించగలమని నిరూపించిన తొలి భారత ప్లేయర్గా శరత్ నిలిచాడు. » 2018 ఆసియా క్రీడల్లో చెన్నైకే చెందిన సత్యన్తో కలిసి శరత్... జపాన్ ద్వయంపై విజయం సాధించి కాంస్యం గెలుచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనిది. » జకార్తా వేదికగా జరిగిన ఆ క్రీడల్లో మనిక బత్రాతో కలిసి శరత్ మిక్స్డ్ డబుల్స్లోనూ కాంస్యం నెగ్గాడు. అప్పటి వరకు ఏమాత్రం అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన శరత్ జంట... ఆ తర్వాత విజృంభించింది. » 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో నాలుగు పదులు వయసు దాటిన తర్వాత కూడా శరత్ చెలరేగిపోయాడు. ఫిట్నెస్ రక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయతి్నంచి పోటీల్లో దిగిన శరత్ కమల్... మూడు స్వర్ణాలతో అదరగొట్టాడు. తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజతో కలిసి శరత్ కమల్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. » పెద్ద టోర్నమెంట్లో బరిలోకి దిగే ముందు బాగా ప్రాక్టీస్ చేసి కొత్త షాట్లను తన అమ్ములపొదిలో చేర్చుకోవడం శరత్కు అలవాటు. ఈ వయసులో ఇవన్నీ ఎలా సాధ్యం అనే ప్రశ్నకు చిరునవ్వే కమల్ సమాధానం. » అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) అథ్లెట్స్ కమిషన్కు ఎంపికైన తొలి భారత అథ్లెట్గా శరత్ ఘనత సాధించాడు. » ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సభ్యుడిగా ఉన్న శరత్ కమల్... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోనూ చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు. » ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (ఎస్డీఏటీ) సహకారంతో మెలకొట్టాయుర్లోని తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శరత్ సొంతంగా హై పెర్ఫార్మెన్స్ సెంటర్ను నెలకొల్పనున్నాడు. -
తెలంగాణ టీటీ జట్టుకు కాంస్యం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో (National Games) తెలంగాణ (Telangana) ఖాతాలో పదో పతకం చేరింది. సోమవారం జరిగిన టేబుల్ టెన్నిస్ (Table Tennis) (టీటీ) టీమ్ ఈవెంట్లో తెలంగాణ పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. సూరావజ్జుల స్నేహిత్, అలీ మొహమ్మద్, మొహమ్మద్ అలీ, స్వర్ణేందు చౌధురీ, సంతోష్ రమేశ్ కుమార్లతో కూడిన తెలంగాణ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో తెలంగాణ 0–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్లో స్నేహిత్ 6–11, 7–11, 9–11తో జశ్ మోదీ చేతిలో... రెండో మ్యాచ్లో మొహమ్మద్ అలీ 9–11, 9–11, 6–11తో రీగన్ చేతిలో... మూడో మ్యాచ్లో స్వర్ణేందు చౌధురీ 12–10, 1–11, 9–11, 3–11తో చిన్మయ సోమయ్య చేతిలో ఓడిపోయారు. మరో సెమీఫైనల్లో తమిళనాడు 2–3తో పశి్చమ బెంగాల్ చేతిలో పరాజయం చూవిచూసి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో పశి్చమ బెంగాల్ 3–0తో మహారాష్ట్రపై నెగ్గి పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల విభాగంలోనూ పశి్చమ బెంగాల్ జట్టుకే స్వర్ణ పతకం లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, పొయ్మంతీ బైస్యా, మౌమా దాస్, మౌహిత దత్తాలతో కూడిన పశ్చిమ బెంగాల్ ఫైనల్లో 3–0తో మహారాష్ట్రపై గెలిచింది. సోమవారం క్రీడలు ముగిశాక తెలంగాణ 10 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 7 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది. -
మనిక బత్రాకు నిరాశ
వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్స్ ఫ్రాంక్ఫర్ట్ టోర్నీలో భారత స్టార్ మనిక బత్రా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. జర్మనీలో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్లో ్రçపపంచ 26వ ర్యాంకర్ మనిక 6–11, 11–13, 6–11తో పదో ర్యాంకర్ షిన్ యుబిన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో మనిక తన సర్వీస్లో 14 పాయింట్లు్ల గెల్చుకుంది. మనికకు 4,250 డాలర్ల (రూ. 3 లక్షల 57 వేలు) ప్రైజ్మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత పురుషుల టీటీ జట్టుకు కాంస్యం
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు వరుసగా మూడోసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 2021, 2023 ఆసియా చాంపియన్షిప్లోనూ భారత జట్టుకు కాంస్య పతకాలు లభించాయి. కజకిస్తాన్లో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 0–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో శరత్ కమల్ 7–11, 10–12, 9–11తో లిన్ యున్ జు చేతిలో... రెండో మ్యాచ్లో మానవ్ ఠక్కర్ 9–11, 11–8, 3–11, 11–13తో చెంగ్ జుయ్ చేతిలో... మూడో మ్యాచ్లో హర్మీత్ దేశాయ్ 6–11, 9–11, 7–11తో హువాంగ్ యాన్ చెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. నేటి నుంచి మొదలయ్యే వ్యక్తిగత విభాగంలో శరత్ కమల్, సత్యన్, హర్మీత్, మనుష్ షా, మానవ్ ఠక్కర్, ఆకుల శ్రీజ, మనిక బత్రా, ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ, దియా పరాగ్ పోటీపడతారు. -
వరుసగా మూడోసారి భారత పురుషుల టీటీ జట్టుకు పతకం ఖరారు
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–1తో ఆతిథ్య కజకిస్తాన్ జట్టుపై గెలిచింది. 2021, 2023 ఆసియా టీటీ టోర్నీల్లో భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించింది. కజకిస్తాన్తో జరిగిన పోరులో తొలి మ్యాచ్లో మానవ్ 11–9, 11–7, 11–6తో గెరాసిమెంకోపై నెగ్గాడు. రెండో మ్యాచ్లో కుర్మంలియెవ్ 11–6, 11–5, 11–8తో హర్మత్ దేశాయ్ను ఓడించాడు. మూడో మ్యాచ్లో శరత్ కమల్ 11–4, 11–7, 12–10తో కెంజిగులోవ్పై గెలిచాడు. నాలుగో మ్యాచ్లో హర్మీత్ దేశాయ్ 6–11, 11–9, 7–11, 11–8, 11–8తో గెరాసిమెంకోను ఓడించడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనీస్ తైపీతో భారత్ ఆడుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1–3తో జపాన్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
64 ఏళ్ల తర్వాత...
అస్తానా (కజకిస్తాన్): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్íÙప్లో పెను సంచలనం సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, గత ఏడాది రన్నరప్ దక్షిణ కొరియా జట్టును భారత బృందం బోల్తా కొట్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న దక్షిణ కొరియాతో మంగళవారం జరిగిన టీమ్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 3–2తో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘డబుల్స్ స్పెషలిస్ట్’ ఐహిక ముఖర్జీ రెండు సింగిల్స్ మ్యాచ్ల్లో నెగ్గి తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్ బెర్త్ పొందిన భారత జట్టుకు కనీసం కాంస్య పతకం ఖరారైంది. భారత మహిళల జట్టు ఏకైకసారి 1960లో ముంబై ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్షిప్లో సెమీఫైనల్ చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 64 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకోవడం విశేషం. ఆసియా టీటీ సమాఖ్య ఆధ్వర్యంలో 1952 నుంచి 1970 వరకు ఆసియా చాంపియన్షిప్ జరగ్గా... 1972 నుంచి కొత్తగా ఏర్పడిన ఆసియా టీటీ యూనియన్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇద్దరు మేటి ర్యాంకర్లపై గెలిచి... ప్రపంచ 8వ ర్యాంకర్ షిన్ యుబిన్తో జరిగిన తొలి మ్యాచ్లో ప్రపంచ 92వ ర్యాంకర్ ఐహిక 11–9, 7–11, 12–10, 7–11, 11–7తో గెలిచి భారత్కు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్లో ప్రపంచ 29వ ర్యాంకర్ మనిక బత్రా 12–14, 13–11, 11–5, 5–11, 12–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీను ఓడించి భారత ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్లో ప్రపంచ 26వ ర్యాంకర్, భారత నంబర్వన్ ఆకుల శ్రీజ 6–11, 10–12, 8–11తో ప్రపంచ 49వ ర్యాంకర్ లీ యున్హై చేతిలో... నాలుగో మ్యాచ్లో మనిక బత్రా 11–13, 4–11, 11–6, 11–7, 10–12తో షిన్ యుబిన్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో ఐహిక ముఖర్జీ 7–11, 11–6, 12–10, 12–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీపై గెలిచి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. -
ఫైనల్లో దబంగ్ ఢిల్లీ
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్లో దబంగ్ ఢిల్లీ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఢిల్లీ 8–6తో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్పై విజయం సాధించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్తో మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. తొలి పురుషుల సింగిల్స్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 1–2 (4–11, 11–5, 5–11)తో లిలియాన్ బార్డెట్ చేతిలో ఓడిపోగా, మహిళల సింగిల్స్లో ఒరవన్ పరనగ్ 3–0 (11–7, 11–9, 11–9)తో బెర్నడెట్ సాక్స్పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో ఒరవన్–సత్యన్ జోడీ 0–3 (9–11, 7–11, 9–11)తో బెర్నడెట్ సాక్స్–మానుశ్ షా ద్వయం చేతిలో ఓడింది. రెండో పురుషుల సింగిల్స్లో అండ్రియస్ లెవెంకొ 2–1 (11–8, 10–11, 11–8)తో మానుశ్ షాపై గెలుపొందాడు. గేమ్ల పరంగా ఇరుజట్ల స్కోరు 6–6తో సమం కాగా కీలకమైన రెండో మహిళల సింగిల్స్లోకి దిగిన ఢిల్లీ ప్లేయర్ దియా చిటాలే వరుస గేమ్లు గెలిచి జట్టును గెలిపించింది. ఆమె 2–0 (11–8, 11–4)తో రీత్ రిష్యాపై నెగ్గడంతో దబంగ్ ఢిల్లీ విజయం ఖాయమైంది. -
శరత్ కమల్ గెలిచినా... గోవా చేతిలో చెన్నై ఓటమి
చెన్నై: అల్ట్మేట్లో టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్లో గోవా చాలెంజర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో గోవా 9–6తో చెన్నై లయన్స్పై గెలుపొందింది. సొంతగడ్డపై శరత్ కమల్ 2–1 (11–6, 11–10, 6–11)తో మిహయి బొబోసికాపై గెలుపొందినప్పటికీ సహచరుల వైఫల్యంతో చెన్నైకి నిరాశ తప్పలేదు.మహిళల సింగిల్స్లో సకుర మొరి 2–1 (11–9, 11–9, 9–11)తో యాంగ్జీ లియూ (గోవా)పై గెలిచి చెన్నై ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. కానీ తర్వాతి మ్యాచ్ల్లో చెన్నై ప్లేయర్లు వరుసగా ఓడిపోయారు. రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్లో హరి్మత్ దేశాయ్ (గోవా) 2–1 (6–11, 11–7, 11–5)తో జులెస్ రోలండ్పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్లో శరత్–సకుర జోడీ 0–3 (9–11, 10–11, 7–11)తో హరి్మత్ దేశాయ్–యాంగ్లీ లియూ (గోవా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మహిళల సింగిల్స్లో యశస్విని ఘోర్పడే (గోవా) 2–1 (11–5, 11–8, 3–11)తో మౌమ దాస్పై గెలుపొందడంతో చెన్నై ఓటమిపాలైంది. మరో పోరులో బెంగళూరు స్మాషర్స్ 9–6తో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్పై గెలిచింది. పురుషుల సింగిల్స్లో ఆంథోని అమల్రాజ్ (బెంగళూరు) 1–2 (9–11, 10–11, 11–10)తో లిలియన్ బార్డెట్ చేతిలో, మహిళల సింగిల్స్లో మనిక బత్రా (బెంగళూరు) 1–2 (11–7, 9–11, 7–11)తో బెర్నడెట్ సాక్స్ చేతిలో కంగుతిన్నారు. తర్వాత మిక్స్డ్ డబుల్స్లోనూ అల్వరొ రొబెల్స్–మనిక జోడీ 1–2 (3–11, 11–7, 8–11)తో మనుశ్ షా–బెర్నాడెట్ సాక్స్ జంట చేతిలో ఓడిపోయింది. ఈ దశలో పురుషుల సింగిల్స్లో అల్వరో రొబెల్స్ (బెంగళూరు) 3–0 (11–8, 11–7, 11–8)తో మనుశ్ షాపై, మహిళల సింగిల్స్లో లిలి జాంగ్ (బెంగళూరు) 3–0 (11–5, 11–8, 11–10)తో క్రిత్విక సిన్హా రాయ్లపై ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా గెలుపొందడంతో బెంగళూరు విజయం సాధించింది. -
US Open: ప్రిక్టార్టర్స్లో కోకో గాఫ్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో మూడో సీడ్ కోకో గాఫ్ 3–6, 6–3, 6–3తో 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఏడో సీడ్ పౌలా కిన్వెన్ జెంగ్ (చైనా), 26వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.మూడో రౌండ్ మ్యాచ్ల్లో కిన్వెన్ జాంగ్ 6–2, 6–1తో జూలీ నెమియర్ (జర్మనీ)పై, పౌలా బదోసా 4–6, 6–1, 7–6 (10/8)తో ఎలెనా రూస్ (రొమేనియా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–3, 7–5తో సాండెర్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీపై విజయం సాధించింది. చెన్నైపై యు ముంబా పైచేయి చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్లో భాగంగా సీనియర్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్తో జరిగిన హోరాహోరీ పోరులో మానవ్ ఠక్కర్ విజయం సాధించాడు. దీంతో మానవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యు ముంబా టీటీ జట్టు 8–7తో చెన్నై లయన్స్పై గెలిచింది. ఈ ఫలితంతో యు ముంబా టీటీ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.‘టై’లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో మానవ్ 6–11, 11–8, 11–9తో శరత్ కమల్పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్లో మానవ్–మారియా జంట 11–7, 11–10, 11–4తో శరత్–సకురా మోరీ ద్వయంపై గెలిచింది. ఇతర మ్యాచ్ల్లో అరునా ఖాద్రి 10–11, 11–9, 11–7తో రోలాండ్పై విజయం సాధించగా.. సుతీర్థ ముఖర్జీ 8–11, 10–11, 7–11 సాకురా మోరీ చేతిలో మారియా 10–11, 8–11, 11–10తో మౌమా దాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
UTT 2024: అహ్మదాబాద్కు రెండో విజయం
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్లో కొత్త జట్టు అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ రెండో విజయం అందుకుంది. యు ముంబా టీటీ జట్టుతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో అహ్మదాబాద్ జట్టు 9-6 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్లో మనుశ్ షా (అహ్మదాబాద్) 2-11, 9-11, 11-8తో మానవ్ ఠక్కర్ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్లో రీత్ రిష్యా (అహ్మదాబాద్) 5-11, 11-8, 11-7తో సుతీర్థ ముఖర్జీపై నెగ్గింది. మూడో మ్యాచ్లో మనుశ్-బెర్నాడెట్ జాక్స్ ద్వయం 11-4, 11-8, 11-8తో మానవ్-మరియా జియో జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్లో లిలియన్ బార్డెట్ (అహ్మదాబాద్) 5-11, 11-9, 9-11తో ఖాద్రీ అరునా చేతిలో ఓటమి చవిచూశాడు. ఐదో మ్యాచ్లో బెర్నాడెట్ జాక్స్ 9-11, 11-4, 11-6తో మరియా జియోపై గెలిచి అహ్మదాబాద్కు విజయాన్ని ఖరారు చేశాడు. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో ప్రస్తుతం అహ్మదాబాద్ జట్టు 24 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. -
ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అర్చన కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. టేబుల్ టెన్నిస్కు అర్చన కామత్ రిటైర్మెంట్ ప్రకటించింది. 24 ఏళ్ల కామత్ ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్కు ఆమె వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని కామత్ కోచ్ అన్షుల్ గార్గ్ ధ్రువీకరించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కామత్ తన కెరీర్ గురుంచి చర్చించినట్లు అన్షుల్ తెలిపాడు. "లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028లో పతకం సాధించడం చాలా కష్టమైన పని నేను కమత్కు చెప్పాను. అందుకోసం తీవ్రంగా శ్రమించివలసి ఉంటుంది. ఎందుకంటే ఆమె టాప్- 100 ర్యాంకు జాబితాలో లేదు.అయితే గత రెండు నెలల్లో ఆమె చాలా మెరుగుపడింది. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని నిర్ణయించుకుంది. ఒక్కసారి ఆమె నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం ఎవరి తరం కాదు. అయితే ఏ క్రీడలోనైనా అగ్రశ్రేణి ఆటగాళ్లకు సాధారణంగా ఎటువంటి సమస్య ఉండదు. వారికి అన్నిరకాల సపోర్ట్ ఉంటుంది. కానీ యువ ఆటగాళ్లు పరిస్థితి వేరు. వారికి శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎవరూ భరోశా ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా వారు జీవనోపాధిని కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కమత్ తన కెరీర్ను దృష్టిలో పెట్టుకుని ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఇండియన్ ఎక్స్ప్రెస్తో అన్షుల్ పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్లో కమత్ పతకం సాధించికపోయినప్పటకి తన పోరాటంతో అందరిని ఆకట్టుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో భారత టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్కు చేరుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. జర్మనీతో జరిగిన క్వార్టర్స్లో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత్ తరుపున గెలిచింది అర్చన మాత్రమే. -
UTT 2024: టీటీ లీగ్కు వేళాయె... బరిలో 8 జట్లు
గత నాలుగు సీజన్లుగా భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లకు చక్కని అవకాశాలు కల్పిస్తున్న అల్ట్మేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఫ్రాంచైజీ లీగ్ టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటి నుంచి చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో యూటీటీ ఐదో సీజన్ పోటీలు జరుగనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్తో పాటు మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు లీగ్ దశ పోటీలు జరుగుతాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్ల మధ్య 5, 6 తేదీల్లో సెమీఫైనల్స్... 7న జరిగే ఫైనల్స్తో ఐదో సీజన్ ముగుస్తుంది. ప్రతి రోజూ రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే మ్యాచ్లను స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్లో సత్తాచాటి మహిళల సింగిల్స్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే పురుషుల కేటగిరీలో హైదరాబాదీ ఆటగాడు సూరావజ్జుల స్నేహిత్ జైపూర్ పేట్రియాట్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ సీజన్లో రాణించడం ద్వారా అందరి దృష్టిలో పడేందుకు అతను ఉవ్విళ్లూరుతున్నాడు.భారత స్టార్ మహిళా ప్లేయర్ మనిక బత్రా బెంగళూరు స్మాషర్స్ తరఫున సత్తా చాటేందుకు సిద్ధమైంది. శ్రీజతో పాటు మనిక కూడా పారిస్లో ప్రిక్వార్టర్ ఫైనల్దాకా పోరాడింది. యూటీటీ టోర్నీ సందర్భంగా 29 ఏళ్ల మనిక మాట్లాడుతూ తన ప్రదర్శన మెరుగయ్యేందుకు ఈ ఫ్రాంచైజీ లీగ్ ఎంతగానో దోహదం చేసిందని చెప్పుకొచ్చింది. ‘వ్యక్తిగతంగా నేను రాణించేందుకు ఈ టోర్నీ ఉపయోగపడింది. విదేశీ ప్లేయర్లతో కలిసి ఆడటం ద్వారా మెలకువలు నేర్చుకునేందుకు, దీటుగా పోరాడేందుకు యూటీటీ దోహదం చేసింది. ఈ టోర్నీని ప్లేయర్లంతా ఆస్వాదిస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళల సింగిల్స్లో పురోగతికి యూటీటీ కూడా ఒక కారణం. అంతర్జాతీయంగా మన క్రీడాకారిణులు సాధిస్తున్న విజయాలు యూటీటీ చలవే’ అని మనిక తెలిపింది. నిరుటి రన్నరప్ చెన్నై లయన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట శరత్ కమల్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లు రాటుదేలేందుకు యూటీటీ చక్కని వేదికని అన్నాడు.దీనివల్లే మన జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడమే కాదు... ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాయని చెప్పాడు. మహిళల సింగిల్స్లో ప్రిక్వార్టర్స్, టీమ్ ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరడం గొప్ప మైలురాయని శరత్ తెలిపాడు.ఈ టోర్నీలో ఆడటాన్ని అమితంగా ఇష్టపడతానని పేర్కొన్నాడు. పారిస్ మెగా ఈవెంట్లో శరత్కు ఊహించని విధంగా తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. కెరీర్లో చివరి ఒలింపిక్స్ ఆడిన 42 ఏళ్ల శరత్ రిటైర్మెంట్ అనంతరం అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్లే యోచనలో ఉన్నాడు. దీనిపై భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్యతో పాటు, తన కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. బరిలో ఉన్న జట్లుఅహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్, చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ టీటీసీ, గోవా చాలెంజర్స్, జైపూర్ పేట్రియాట్స్, బెంగళూరు స్మాషర్స్, పుణేరి పల్టన్ టీటీ, యూ ముంబా టీటీ. -
యూటీటీ సీజన్కు శ్రీజ దూరం
చెన్నై: భారత నంబర్వన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) సీజన్ నుంచి తప్పుకుంది. ఒత్తిడి కారణంగా ఈ నెల 22న ప్రారంభం కానున్న సీజన్కు తాను దూరం అవుతున్నట్లు ఆమె తెలిపింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ టీటీ మహిళల సింగిల్స్లో ప్రిక్వార్టర్స్కు చేరి ఆకట్టుకున్న 26 ఏళ్ల శ్రీజ ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు వెల్లడించింది. ‘యూటీటీలో ఆడలేకపోవడం బాధగా ఉంది. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని రెండుసార్లు జాతీయ చాంపియన్ శ్రీజ పేర్కొంది. లీగ్లో శ్రీజ జైపూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా ఆమె స్థానంలో ఫ్రాంచైజీ నిత్యశ్రీ మణిని ఎంపిక చేసుకుంది. -
రోబోతో టేబుల్ టెన్నిస్.. ఫిదా చేస్తున్న వీడియో
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని వాడేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టేబుల్ టెన్నిస్ ఆడే రోబోట్ వెలుగులోకి వచ్చింది. ఇది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తోంది. వేగం, సామర్థ్యంలో ఈ రోబోట్.. మనుషులను కూడా మించిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనిస్తే.. టేబుల్ టెన్నిస్ ఆడే రోబో మానవ పోటీదారులు గట్టి పోటీ ఇస్తోంది. సొంతంగా బాల్ పట్టుకోలేదు, సర్వ్ కూడా చేయలేదు. కానీ టేబుల్ టెన్నిస్ ఆడవాళ్లను మాత్రం అవలీలగా ఓడించేస్తోంది. ఈ రోబోట్ మొత్తం 29 మ్యాచ్ల సమయంలో 13 మందిని ఓడించి 45 శాతం విజయాన్ని సొంతం చేసుకుంది. కొంతమంది ఆటగాళ్లతో రోబోట్ కూడా ఓడిపోయింది. -
Paris Olympics 2024: భారత మహిళల టీటీ జట్టు అవుట్
పారిస్: ఒలింపిక్స్లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. జర్మనీ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా, అర్చనా కామత్లతో కూడిన భారత జట్టు 1–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో శ్రీజ–అర్చన ద్వయం 5–11, 11–8, 10–12, 6–11తో చైనా సంతతికి చెందిన జర్మనీ జోడీ యువాన్ వాన్–జియోనా షాన్ చేతిలో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్లో మనిక బత్రా 11–8, 5–11, 7–11, 5–11తో అనెట్ కౌఫమన్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్లో అర్చన 19– 17, 1–11, 11–5, 11–9తో జియోనా షాన్ను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్లో శ్రీజ 6–11, 7–11, 7–11తో అనెట్ చేతిలో ఓడిపోవడంతో భారత కథ ముగిసింది. -
మనిక మెరిసె
పారిస్: ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల టీమ్ ఈవెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి రౌండ్ మ్యాచ్లో భారత్ 3–2తో రొమేనియా జట్టును బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో టీమిండియా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్టార్ ప్లేయర్ మనిక బత్రా రెండు మ్యాచ్ల్లో గెలిచి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. తొలి మ్యాచ్లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–అర్చనా కామత్ జోడీ 11–9, 12–10, 11–7తో అదీనా దియకోను–ఎలిజబెటా సమారా (రొమేనియా) జంటను ఓడించి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్లో మనిక 11–5, 11–7, 11–7తో బెర్నాడెట్టె జాక్స్పై గెలిచింది. దాంతో భారత్ ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్లో భారత నంబర్వన్ శ్రీజ 11–8, 4–11, 11–7, 6–11, 8–11తో ఎలిజబెటా సమారా చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్లో అర్చన 5–11, 11–8, 7–11, 9–11తో బెర్నాడెట్టె జాక్స్ చేతిలో ఓటమి పాలైంది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో మనిక 11–5, 11–9, 11–8తో అదీనా దియకోనుపై గెలిచి భారత్కు 3–2తో విజయాన్ని అందించింది. నేడు అమెరికా, జర్మనీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఆడతుంది. -
Olympics 2024: సరికొత్త చరిత్ర.. క్వార్టర్ ఫైనల్లో భారత్
పారిస్ ఒలింపిక్స్ మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు (మనిక బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్) క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో భారత్.. రొమేనియాపై 3-2 తేడాతో గెలుపొందింది. విశ్వ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపె ట్టడం ఇదే తొలిసారి.MANIKA BATRA - The Clutch moment in Table Tennis for India. 🥶 pic.twitter.com/dN3XApe98K— Johns. (@CricCrazyJohns) August 5, 2024ఈ మ్యాచ్లో భారత్ తొలి రెండు గేమ్ల్లో (సింగిల్స్, డబుల్స్) విజయాలు సాధించి ఏకపక్ష విజయం సాధించేలా కనిపించింది. అయితే రొమేనియా ఆటగాళ్లు అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు గేమ్స్లో (సింగిల్స్) విజయం సాధించి స్కోర్ను లెవెల్ (2-2) చేశారు. చివరి గేమ్లో మనిక బత్రా తన అనుభవాన్ని అంతా రంగరించి ప్రత్యర్ధిపై విజయం సాధించింది. రేపు జరుగబోయే క్వార్టర్ ఫైనల్లో భారత్.. యూఎస్ఏ, జర్మనీ మధ్య మ్యాచ్లో విజేతతో తలపడుతుంది. కాగా, మహిళల సింగిల్స్ ఈవెంట్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా రౌండ్ ఆఫ్ 16కు చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాతి రౌండ్లో వీరు ఓడిపోయారు. -
పోరాడి ఓడిన శ్రీజ
పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్లో సంచలన ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్కు చేరిన భారత నంబర్వన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ.. ప్రపంచ నంబర్వన్ చేతిలో పోరాడి ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీజ 10–12, 10–12, 8–11, 3–11తో సన్ యింగ్షా (చైనా) చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు గేమ్ల్లో మొదట ఆధిక్యం కనబర్చిన శ్రీజ.. చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయింది. -
మనిక అవుట్... ప్రిక్వార్టర్స్లో శ్రీజ
పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి ఆకుల శ్రీజ మాత్రమే బరిలో నిలిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో భారత నంబర్వన్, ప్రపంచ 25వ ర్యాంకర్ ఆకుల శ్రీజ 9–11, 12–10, 11–4, 11–5, 10–12, 12–10తో జెంగ్ జియాన్ (సింగపూర్)పై విజయం సాధించింది. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీజకు గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలక దశల్లో శ్రీజ పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో మనిక బత్రా తర్వాత ఒలింపిక్స్ క్రీడల టీటీ పోటీల్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన రెండో భారతీయ క్రీడాకారిణిగా తెలంగాణ అమ్మాయి శ్రీజ గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ సన్ యింగ్షా (చైనా)తో శ్రీజ తలపడుతుంది. మరోవైపు భారత రెండో ర్యాంకర్ మనిక బత్రా పోరాటం విశ్వ క్రీడల్లో ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మనిక 6–11, 9–11, 14–12, 8–11, 7–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ మియు హిరానో (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. తొలి భారత టీటీ ప్లేయర్గా (ఫోటోలు)
-
Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన మనిక బత్రా
పారిస్ ఒలింపిక్స్లో మూడో రోజు ఆఖర్లో భారత్కు ఊరట కలిగించే విజయం దక్కింది. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్లో మనిక బత్రా విజయం సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఫ్రాన్స్కు చెందిన ప్రితిక పవడేపై మనిక 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో గెలుపొంది, రౌండ్ ఆఫ్ 16కు చేరింది. ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో రౌండ్ ఆఫ్ 16కు క్వాలిఫై అయిన తొలి భారత పాడ్లర్గా మనిక చరిత్ర సృష్టించింది. రౌండ్ ఆఫ్ 16లో మనిక హాంగ్కాంగ్ చైనాకు చెందిన ఝూ చెంగ్ఝూ లేదా జపాన్కు చెందిన మియు హిరానోతో తలపడతుంది.HISTORIC MOMENT. 🔥Manika Batra becomes the first Indian Table Tennis player to qualify into R-16 in Olympics history...!!! 👌 pic.twitter.com/Aez0cYRavR— Johns. (@CricCrazyJohns) July 30, 2024కాగా, ఒలింపిక్స్లో మూడో రోజు భారత్కు ఆశించినంత ఫలితాలు రాలేదు. షూటింగ్, టెన్నిస్, ఆర్చరీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ సింగిల్స్లో లక్ష్య సేన్, డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ తదుపరి రౌండ్లకు అర్హత సాధించగా.. హాకీలో భారత్ డ్రాతో గట్టెక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా తృటిలో పతకం చేజార్చుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్-సరబ్జోత్ కాంస్య పతక రేసులో నిలిచింది. మనూ-సరబ్జోత్ కాంస్య పతకం మ్యాచ్ ఇవాళ (జులై 30) మధ్యాహ్నం ఒంటి గంటకు జరుగనుంది. -
Paris Olympics 2024: బోణి కొట్టిన మరో తెలుగమ్మాయి
పారిస్ ఒలింపిక్స్లో రెండో రోజు భారత్ వరుస విజయాలతో శుభారంభం చేసింది. తొలుత బ్యాడ్మింటన్లో పీవీ సింధు విజయం సాధించగా.. ఆతర్వాత టేబుల్ టెన్నిస్లో ఆకుల శ్రీజ బోణి కొట్టింది. సింధు తొలి రౌండ్ మ్యాచ్లో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్పై 21-9, 21-6 విజయం సాధించగా.. ఆకుల శ్రీజ.. రౌండ్ ఆఫ్ 64 మ్యాచ్లో స్వీడన్కు చెందిన క్రిస్టినా కల్బర్గ్పై 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో నెగ్గి, రౌండ్ ఆఫ్ 32కు క్వాలఫై అయ్యింది. SREEJA AKULA QUALIFIES INTO ROUND OF 32...!!!! 👌- She won the match without losing a single game, What a fantastic performance in Paris Olympics 🔥 pic.twitter.com/uoSxsD6muX— Johns. (@CricCrazyJohns) July 28, 2024సింధు తొలి రౌండ్లో ప్రత్యర్దిపై 29 నిమిషాల్లో జయకేతనం ఎగురవేయగా.. శ్రీజ 30 నిమిషాల్లో ప్రత్యర్దిని చిత్తు చేసింది. సింధు, శ్రీజ తమతమ ప్రత్యర్దులపై వరుస సెట్లలో విజయం సాధించారు. సింధు, శ్రీజ ఇద్దరూ తెలుగమ్మాయిలే కావడం విశేషం. BALRAJ PAWAR INTO QUARTER-FINAL IN ROWING..!!!! 🇮🇳- India continues to have a great time on Day 2 in the Paris Olympics. pic.twitter.com/3y9q7PLWMV— Johns. (@CricCrazyJohns) July 28, 2024మరోవైపు పురుషుల రోయింగ్ సింగిల్స్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్లో భారత్కు చెందిన బల్రాజ్ పన్వర్ విజయం సాధించాడు. ఈ విజయంతో బల్రాజ్ క్వార్టర్ ఫైనల్కు చేరాడు.మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత జిందాల్ (631.5) ఫైనల్కు చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా (630.1) ఫైనల్కు చేరాడు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో మనికా బత్రా విజయం సాధించింది. గ్రేట్ బ్రిటన్కు చెందిన అన్నా హర్సేపై 11-8, 12-10, 11-9, 9-11, 11-5 తేడాతో గెలుపొందింది. పురుషుల టేబుల్ టెన్నిస్ తొలి రౌండ్లో భారత్కు చెందిన శరత్ కమల్ స్లొవేనియాకు చెందిన డేనీ కొజుల్ చేతిలో 2-4 తేడాతో (12-10 9-11 6-11 7-11 11-8 10-12) ఓటమిపాలయ్యాడు.పురుషుల టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో భారత్కు చెందిన సుమిత్ నగాల్ ఫ్రాన్స్కు చెందిన కొరెంటిన్ మౌటెట్ చేతిలో 2-6, 6-2, 5-7 తేడాతో ఓటమిపాలయ్యాడు.భారత మహిళల ఆర్చరీ టీమ్ (అంకిత భకత్, భజన్ కౌర్, దీపికా కుమార్) క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో 0-6 తేడాతో భారత్ ఓటమిపాలైంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్లో భారత్కు చెందిన హెచ్ ఎస్ ప్రణయ్.. జర్మనీకు చెందిన ఫేబియన్ రోథ్పై 21-18, 21-12 తేడాతో గెలుపొందాడు. -
టీటీలో మేటి మనికా..
ఆ అమ్మాయి చదువులో చాలా చురుకు.. స్కూల్ దాటి కాలేజ్లోకి వచ్చిన తర్వాతా అదే కొనసాగింది. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక కళాశాలలో ప్రవేశం. కానీ టేబుల్ టెన్నిస్ కోసం అర్ధాంతరంగా చదువు వదిలేసింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. టీనేజ్లోనే పేరున్న కంపెనీలు మోడలింగ్ కోసం ఆమెను సంప్రదించాయి. కానీ టేబుల్ టెన్నిస్ కోసం వాటన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.ఎందుకంటే ఆమె ధ్యాసంతా ఆటపైనే కాబట్టి! ఒక క్రీడాకారిణిగా ఎదగాలనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆమె అన్నింటినీ పక్కన పెట్టింది. కఠిన శ్రమ, పట్టుదల, అంకితభావంతో ఆటలోనే పైకి ఎదిగింది. ఆరంభ అవరోధాలను దాటి కామన్వెల్త్ పతకాల విజేతగా, ఒలింపియన్గా నిలిచింది. టేబుల్ టెన్నిస్లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో తన పేరు లిఖించుకున్న ఆ ప్యాడ్లరే మనికా బత్రా.29 ఏళ్ల మనికా ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్కు సన్నద్ధమవుతోంది. గత రెండు సందర్భాల్లో తనకు దక్కకుండా పోయిన పతకాన్ని ఈసారి ఎలాగైనా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.దాదాపు రెండున్నరేళ్ల క్రితం మనికా బత్రా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించకపోయినా గతంలో ఒలింపిక్స్ ఆడిన భారత ఆటగాళ్లతో మెరుగైన ప్రదర్శన కనబరచి మూడో రౌండ్ వరకు చేరింది. అయితే ఒలింపిక్స్ ముగిసిన కొద్ది రోజులకే ఆమెకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. మ్యాచ్లు జరిగే సమయంలో కోర్టు పక్కనుంచి భారత జట్టు కోచ్ సౌమ్యదీప్ రాయ్ సూచనలను తీసుకునేందుకు ఆమె అంగీకరించలేదు. తన వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేను అక్కడికి వచ్చేందుకు అధికారులు అంగీకరించకపోగా.. కోచ్ లేకపోయినా ఫర్వాలేదని, అలాగే ఆడతానని ఆమె చెప్పేసింది.అర్జున అవార్డ్ అందుకుంటూ..ఇది టీటీఎఫ్ఐకి ఆగ్రహం తెప్పించింది. అందుకే మనికాపై చర్య తీసుకునేందుకు సిద్ధమైంది. దాంతో మనికా కోర్టు మెట్లెక్కింది. అంతటితో ఆగిపోకుండా తన నిరసనకు కారణాన్ని కూడా వెల్లడించింది. కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ సందర్భంగా సౌమ్యదీప్ మ్యాచ్ ఫిక్సింగ్కు ప్రయత్నించారంటూ సంచలన విషయాన్ని వెల్లడించింది. తన అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సుతీర్థ ముఖర్జీ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు తనను మ్యాచ్ ఓడిపొమ్మని చెప్పాడంటూ బయటపెట్టింది. షోకాజ్ నోటీసుతో తనను మానసికంగా ఇబ్బంది పెట్టారని తెలిపింది.చివరకు కోర్టు మనికా ఆవేదనను అర్థంచేసుకుంది. టీటీఎఫ్ఐలో పూర్తి ప్రక్షాళన కార్యక్రమం జరిగి అధికారులు మారాల్సి వచ్చింది. సాధారణంగా అగ్రశ్రేణి ప్లేయర్లు ఏ ఆటలోనైనా జాతీయ సమాఖ్యతో గొడవకు దిగరు. భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సర్దుకుపోయే, రాజీ మనస్తత్వంతోనే ఉంటారు. కానీ కెరీర్లో అగ్రస్థానానికి ఎదుగుతున్న దశలో ఒక 27 ఏళ్ల ప్లేయర్ అధికారులతో తలపడింది. ఇది టీటీ కోర్టు బయట ఆమె పోరాటానికి, ధైర్యానికి సంకేతం. అత్యుత్తమ ఆటను ప్రదర్శించేందుకు మాత్రమే కాదు.. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తాను నిలబడగలననే ధైర్యాన్ని ఆమె చూపించింది.కుటుంబసభ్యుల అండతో..ఢిల్లీలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది మనికా. ముగ్గురు సంతానంలో ఆమె చిన్నది. అన్న సాహిల్, అక్క ఆంచల్ టేబుల్ టెన్నిస్ ఆడటం చూసి నాలుగేళ్ల వయసులో తాను కూడా అటు వైపు ఆకర్షితురాలైంది. చాలామంది ప్లేయర్ల తరహాలోనే ఒకరిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటే ఇతర కుటుంబసభ్యులు వారిని ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడపడం, తాము తెర వెనక్కి వెళ్లిపోవడం తరచుగా జరిగేదే. మనికా విషయంలో కూడా ఇదే పునరావృతమైంది.తల్లి సుష్మతో..ఆమె ఆటను మొదలుపెట్టినప్పుడు అందరిలాగే సరదాగా ఆడి ముగిస్తుందని అనుకున్నారు. కానీ ఆమెలో దానికి మించి అపార ప్రజ్ఞ ఉన్నట్లు కోచ్లు చెప్పడంతోనే కుటుంబ సభ్యులకు అర్థమైంది. ఆ తర్వాత మనికా విషయంలో మరో ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. అక్క ఆంచల్ కూడా ఆటపై తనకున్న పరిజ్ఞానంతో చెల్లికి మెంటార్గా మారి నడిపించింది. రాష్ట్రస్థాయి అండర్–8 టోర్నీ మ్యాచ్లో ఆ చిన్నారి ప్రతిభను చూసిన కోచ్ సందీప్ గుప్తా తన మార్గనిర్దేశనంతో శిక్షణకు తీసుకోవడంతో ఆటలో మనికా ప్రస్థానం మొదలైంది.అగ్రస్థానానికి చేరి..‘బ్యాడ్మింటన్లో కూడా కొన్నేళ్ల క్రితం వరకు భారత ఆటగాళ్లు అంతంత మాత్రమే ప్రదర్శన కనబరచారు. కానీ సైనా నెహ్వాల్, పీవీ సింధులాంటి వాళ్లు అద్భుత ప్రదర్శనతో దాని స్థాయిని పెంచారు. మన దేశంలో బ్యాడ్మింటన్ ఒక్కసారిగా దూసుకుపోయింది. ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా నేనూ అదే చేయాలనుకుంటున్నా. టీటీకి చిరునామాగా మారి మన దేశంలో ఆటకు ఆదరణ పెంచాలనేదే నా లక్ష్యం’ అని మనికా చెప్పింది.నిజంగానే భారత టీటీకి సంబంధించి ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. మరో మహిళా ప్లేయర్కు సాధ్యం కాని రీతిలో వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంది. శాఫ్ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో పతకాలు, వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీల్లో పెద్ద సంఖ్యలో విజయాలు ఆమె ఖాతాలో చేరాయి. ప్రపంచ ర్యాంకింగ్స్లో కూడా మహిళల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమంగా 24వ స్థానానికి చేరుకొని ఆమె భారత్ తరఫున కొత్త చరిత్ర సృష్టించింది. ఆమెకు ముందు ఎవరూ కూడా మహిళల సింగిల్స్లో ఇంత మెరుగైన ర్యాంక్ సాధించలేదు.2018, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్తో.., 2018, ఐఐటీఎఫ్ ‘ద బ్రేక్త్రూ స్టార్’ అవార్డ్తో..పతకాల జోరు..అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్లో మనికా అత్యుత్తమ ప్రదర్శన 2018 కామన్వెల్త్ గేమ్స్లో కనబడింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరిగిన ఈ పోటీల్లో మనికా ఏకంగా నాలుగు వేర్వేరు విభాగాల్లో నాలుగు పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణం గెలుచుకున్న ఆమె.. మహిళల డబుల్స్లో రజత పతకం, మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం అందుకుంది.అదే ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. డబ్ల్యూటీటీ టోర్నీల్లోనైతే ఆమె ఖాతాలో పలు సంచలన విజయాలు నమోదయ్యాయి. ఇటీవల సౌదీ స్మాష్ టోర్నీలో వరల్డ్ నంబర్ 2, మాజీ ప్రపంచ చాంపియన్ వాంగ్ మాన్యు (చైనా)పై సాధించిన గెలుపు వాటిలో అత్యుత్తమైంది.మూడో ప్రయత్నంలో..మనికా బత్రా తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. ఆమె ఘనతలకుగాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అర్జున, ఖేల్ రత్న పురస్కారాలు అందుకుంది. ఒకప్పుడు మోడలింగ్ వద్దనుకున్న ఆమె ఇప్పుడు టీటీలో స్టార్గా ఎదిగిన తర్వాత అలాంటివాటిలో చురుగ్గా భాగమైంది. ప్రఖ్యాత మేగజీన్ ‘వోగ్’ తమ కవర్పేజీలో మనికాకు చోటు కల్పించి అటు గేమ్ ప్లస్ ఇటు గ్లామర్ కలబోసిన ప్లేయర్ అంటూ కథనాలు ప్రచురించింది.ఇతర ఫొటోషూట్ల సంగతి సరేసరి. కెరీర్లో ఎన్నో సాధించిన ఆమె ది బెస్ట్ కోసం చివరి ప్రయత్నం చేస్తోంది. 21 ఏళ్ల వయసులో తొలిసారి 2016 రియో ఒలింపిక్స్లో బరిలోకి దిగిన మనికా చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకుండా అనుభవం మాత్రమే సాధించి తిరిగొచ్చింది. ఆ తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్లో మెరుగైన ఆటతో మూడో రౌండ్కి చేరింది. ఇప్పుడు మరింత పదునెక్కిన ఆటతో చెలరేగితే పారిస్ ఒలింపిక్స్లో పతకం దక్కవచ్చు. ఈ లక్ష్యాన్ని మనికా అందుకోవాలని భారత అభిమానులందరూ కోరుకుంటున్నారు. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
జైపూర్ పేట్రియాట్స్ జట్టులో ఆకుల శ్రీజ, స్నేహిత్... ఆగస్టులో యూటీటీ లీగ్...
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ ఐదో సీజన్ కోసం మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 48 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 16 మంది విదేశీ క్రీడాకారులు. భారత నంబర్వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, తెలంగాణకే చెందిన యువతార సూరావజ్జుల స్నేహిత్ జైపూర్ పేట్రియాట్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచ 25వ ర్యాంకర్ శ్రీజ గత నెలలో నైజీరియా లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆగస్టు 22 నుంచి సెపె్టంబర్ 7 వరకు చెన్నైలో జరిగే యూటీటీ లీగ్లో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్, చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ టీటీసీ, గోవా చాలెంజర్స్, జైపూర్ పేట్రియాట్స్, పీబీజీ బెంగళూరు స్మాషర్స్, పుణేరి పల్టన్, యు ముంబా జట్లు పాల్గొంటాయి. -
Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
Paris Olympics 2024- న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్ టెన్నిస్ సంఘం (టీటీఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. మే 16న అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నుంచి టాప్–3లో ఉన్న క్రీడాకారులను జట్లలోకి ఎంపిక చేశారు. తొలిసారి టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడనుంది. పురుషుల, మహిళల టీమ్ విభాగంలో ముగ్గురి చొప్పున ఎంపిక చేయగా... ఈ ముగ్గురిలో టాప్–2లో ఉన్న ఇద్దరు సింగిల్స్ విభాగాల్లోనూ పోటీపడతారు. ఒక్కొక్కరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. తుది జట్టులో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే రిజర్వ్ ప్లేయర్ను ఆడిస్తారు. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్గా ఉన్న ఆచంట శరత్ కమల్ ఐదోసారి ఒలింపిక్స్లో పాల్గోనుండటం విశేషం. పారిస్ ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. భారత మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్). భారత పురుషుల జట్టు: శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, సత్యన్ జ్ఞానశేఖరన్ (రిజర్వ్). మనిక పరాజయం కపాడోసియా (టర్కీ): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్వన్ మనిక బత్రా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక 11–5, 4–11, 5–11, 11–13తో హిటోమి సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. భారత్కే చెందిన కృత్విక రాయ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో కృత్విక 12–10, 11–4, 11–7తో వెరోనికా (ఉక్రెయిన్)పై నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సానిల్ శెట్టి–హరీ్మత్ దేశాయ్ (భారత్) ద్వయం 8–11, 11–6, 6–11, 6–11తో ఎస్టెబన్ డోర్–ఫ్లోరియన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పోమంతి బైస్యా–కృత్విక రాయ్ (భారత్) జంట 11–7, 11–1, 14–12తో ఫ్రాన్జిస్కా (జర్మనీ)–యశస్విని (భారత్) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. -
చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. తొలిసారి ఇలా!
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళా స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో మనిక 24వ ర్యాంక్లో నిలిచింది. గతవారం సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన మనిక ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్ నుంచి 24వ ర్యాంక్కు చేరుకుంది. తద్వారా ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–25లో నిలిచిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. మిగతా క్రీడాకారుల ర్యాంకులు ఇలాగతవారం 38వ ర్యాంక్లో నిలిచి భారత నంబర్వన్గా ఉన్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు పడిపోయి 41వ ర్యాంక్కు చేరుకోగా... యశస్విని రెండు స్థానాలు పడిపోయి 99వ ర్యాంక్లో నిలిచింది.పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు ఆచంట శరత్ కమల్ 40వ ర్యాంక్లో, మానవ్ ఠక్కర్ 62వ ర్యాంక్లో, హర్మీత్ దేశాయ్ 63వ ర్యాంక్లో, సత్యన్ 68వ ర్యాంక్లో ఉన్నారు -
భారత నంబర్వన్గా శ్రీజ
న్యూఢిల్లీ: రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్ నంబర్వన్ ర్యాంకర్గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజా ర్యాంకింగ్స్లో శ్రీజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 38వ ర్యాంక్లో నిలిచింది. ఇప్పటి వరకు భారత నంబర్వన్గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్కు చేరుకుంది. భారత్ నుంచి యశస్విని 99వ ర్యాంక్లో, అర్చన కామత్ 100వ ర్యాంక్లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న 25 ఏళ్ల శ్రీజ ఈ ఏడాది నిలకడగా రాణిస్తూ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్లో రెండు టైటిల్స్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్లో ఆచంట శరత్ కమల్తో కలిసి శ్రీజ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో శరత్ కమల్ 37వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్ 60వ స్థానంలో, మానవ్ ఠక్కర్ 61వ స్థానంలో, హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్లో ఉన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 147వ ర్యాంక్లో నిలిచాడు. -
WTT Champions Tourney 2024: పోరాడి ఓడిన మనిక
ఇంచియోన్ (దక్షిణ కొరియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత నంబర్వన్ మనిక బత్రా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మనిక 12–10, 9–11, 6–11, 11–8, 8–11తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హినా హయాటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణాయక ఐదో సెట్లో కీలక తరుణంలో మనిక తప్పిదాలు చేసి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో ఓడిన మనిక బత్రాకు 3,500 డాలర్ల (రూ. 2 లక్షల 91 వేలు) ప్రైజ్మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
శ్రీజకు సింగిల్స్.. మనుష్–మానవ్లకు డబుల్స్ టైటిళ్లు
లెబనాన్లో జరిగిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ లెవెల్ రెండో టోర్నీలో భారత్కు చెందిన మనుష్ షా–మానవ్ ఠక్కర్ జోడీ డబుల్స్ టైటిల్ సాధించింది. బీరుట్లో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మనుష్–మానవ్ ద్వయం 11–7, 11–5, 9–11, 11–6తో భారత్కే చెందిన ముదిత్–ఆకాశ్ పాల్ జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్–మనిక బత్రా (భారత్) జోడీ రన్నరప్గా నిలిచింది. ఆకుల శ్రీజకు సింగిల్స్ టైటిల్.. ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీజ అకుల 6-11, 12-10, 11-5, 11-9తో లక్సెంబర్గ్కు చెందిన సారా డి నట్టేపై గెలిచి, మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. -
చాంపియన్ ఆకుల శ్రీజ
లెబనాన్లో జరిగిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ రెండో టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ చాంపియన్గా అవతరించింది. బీరుట్లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీజ 6–11, 12–10, 11–5, 11–9తో సారా డి నుట్టె (లక్సెంబర్గ్)పై గెలిచింది. విజేతగా నిలిచిన శ్రీజకు 550 డాలర్ల (రూ. 46 వేలు) ప్రైజ్మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. డబుల్స్ విభాగంలో శ్రీజ–దియా చిటాలె (భారత్) ద్వయం రన్నరప్గా నిలిచింది. -
సత్యన్కు తొలి డబ్ల్యూటీటీ టైటిల్
భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ ‘డబ్ల్యూటీటీ’ ఫీడర్ సిరీస్లో టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా ఘనతకెక్కాడు. లెబనాన్లోని బీరుట్లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం అర్ధరాత్రి ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్యే టైటిల్ పోరు జరిగింది. ఈ టోర్నీలో 11వ సీడ్గా బరిలోకి దిగిన సత్యన్ 3–1 (6–11, 11–7, 11–7, 11–4)తో సహచరుడు, తొమ్మిదో సీడ్ మానవ్ ఠక్కర్పై విజయం సాధించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సత్యన్ అంతర్జాతీయ ర్యాంకింగ్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. 2021 ఆగస్టులో జరిగిన ఐటీటీఎఫ్ చెక్ ఇంటర్నేషనల్ ఓపెన్లో అతను టైటిల్ గెలిచాడు. మరో వైపు భారత జోడీల మధ్యే జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో దియా చిటాలే–మానుష్ షా ద్వయం విజేతగా నిలిచింది. టైటిల్ పోరులో దియా– మానుష్ 3–1 (11–6, 10–12, 11–6, 11–6)తో అర్చన కామత్–మానవ్ ఠక్కర్లపై గెలుపొందారు. పురుషుల డబుల్స్ తుది పోరులో మానవ్ ఠక్కర్–మానుష్ జంట రన్నరప్తో సరిపెట్టుకుంది. -
పతాకధారిగా శరత్ కమల్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరిస్తాడు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల శరత్ ఐదోసారి ఒలింపిక్స్లో పోటీపడనున్నాడు. మహిళల బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ భారత జట్టుకు ‘చెఫ్ డి మిషన్’గా వ్యవహరిస్తుందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. -
శరత్ కమల్ ఓటమి
సింగపూర్: సంచలన విజయాలతో సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో అదరగొట్టిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ జోరుకు బ్రేక్ పడింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన ప్రపంచ 88వ ర్యాంకర్ శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శరత్ కమల్ 9–11, 2–11, 7–11, 11–9, 8–11తో ప్రపంచ 6వ ర్యాంకర్ ఫెలిక్స్ లెబ్రున్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శరత్ మొత్తం 37 పాయింట్లు సాధించాడు. ఇందులో 24 పాయింట్లు తన సర్వీస్లో నెగ్గగా... తన సరీ్వస్లో మరో 22 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శరత్ కమల్కు 14,000 డాలర్ల (రూ. 11 లక్షల 60 వేలు) ప్రైజ్మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్ బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో ప్రపంచ నంబర్వన్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 16–21, 15–21తో 2022 డబుల్స్ చాంపియన్ షోహిబుల్ ఫిక్రీ–మౌలానా బగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. గతంలో ఫిక్రీ–మౌలానా ద్వయంపై నాలుగుసార్లు గెలిచిన సాతి్వక్–చిరాగ్ ఈసారి ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ వాటరింజెన్ (నెదర్లాండ్స్): డచ్ ఇంటర్నేషనల్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్గా అడుగుపెట్టిన తరుణ్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–16, 23–21తో భారత్కే చెందిన శుభాంకర్ డేపై గెలుపొందాడు. తొలి రౌండ్లో తరుణ్ 18–21, 21–10, 23–21తో ఆరో సీడ్ మథియాస్ కిక్లిట్జ్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించాడు. -
రెండో రౌండ్లో శరత్ కమల్.. తొలి రౌండ్లోనే ఓటమిపాలైన మనిక
సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆచంట శరత్ కమల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 41 ఏళ్ల శరత్ కమల్ క్వాలిఫయింగ్ ద్వారా పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ప్రపంచ 87వ ర్యాంకర్ శరత్ కమల్ 11–5, 11–4, 11–6తో నికోలస్ బర్గోస్ (చిలీ)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్వన్ మనిక బత్రా 4–11, 7–11, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ యిది వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
చరిత్ర సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ జట్లు.. తొలిసారి ఒలింపిక్స్ అర్హత
భారత టేబుల్ టెన్నిస్ జట్లు చరిత్ర సృష్టించాయి. పురుషులు, మహిళల జట్లు తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్లకు పారిస్ ఒలింపిక్స్లో (2024) పాల్గొనే సువర్ణావకాశం దక్కింది. తాజాగా (మార్చి) ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్లో భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్ను.. మహిళల జట్టు 13వ ర్యాంక్ను సాధించి ఒలింపిక్స్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి. Indian Men's and Women's Table Tennis teams Qualifies for the Olympics for the first tym ever! The TT March World Team Rankings are out. Men's Team remained at WR15 while Women's team made a jump to WR13. This is Huge. Historic Feat!#Paris2024#TableTennis https://t.co/MBqX417KQQ pic.twitter.com/zV4yhhWZUz — Rambo (@monster_zero123) March 4, 2024 ఇటీవల ముగిసిన ITTF వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీల్లో భారత జట్లకు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ప్రపంచ ర్యాంకింగ్ కారణంగా ఒలింపిక్స్ బెర్తులు ఖరారు చేసుకోవడం విశేషం. కాగా, వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 16 స్థానాల్లో నిలిచే జట్లు ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. -
ప్రిక్వార్టర్స్లో భారత జట్ల ఓటమి
బుసాన్: పారిస్ ఒలింపిక్స్ బెర్త్లు ఖరారు కావడానికి అవసరమైన విజయాన్ని భారత మహిళల, పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లు సాధించలేకపోయాయి. పటిష్ట జట్లతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో భారత జట్లు ఓడిపోయి ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్షిప్ నుంచి నిష్క్రమించాయి. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల జట్టు 1–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 0–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. అంతకుముందు జరిగిన నాకౌట్ దశ రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత మహిళల జట్టు 3–0తో ఇటలీపై... భారత పురుషుల జట్టు 3–2తో కజకిస్తాన్పై విజయం సాధించాయి. ఈ మెగా ఈవెంట్లో పురుషుల, మహిళల విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన 8 జట్లు పారిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాయి. మార్చి 5న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–16లో చోటు సంపాదిస్తే భారత జట్లకు పారిస్ ఒలింపిక్ బెర్త్లు లభిస్తాయి. ప్రస్తుతం భారత మహిళల జట్టు 17వ ర్యాంక్లో, భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్లో ఉన్నాయి. చైనీస్ తైపీతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్లో భారత నంబర్వన్ మనిక బత్రా 11–8, 8–11, 4–11, 11–9, 11–9తో ప్రపంచ 10వ ర్యాంకర్ చెన్ జు యుపై సంచలన విజయం సాధించి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 6–11, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో... మూడో మ్యాచ్లో ఐహిక ముఖర్జీ 10–12, 13–15, 11–9, 2–11తో లి యు జున్ చేతిలో... నాలుగో మ్యాచ్లో మనిక బత్రా 10–12, 11–5, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. కొరియాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్లో హర్మీత్ దేశాయ్ 10–12, 11–13, 7–11తో జాంగ్ వూజిన్ చేతిలో... రెండో మ్యాచ్లో ఆచంట శరత్ కమల్ 9–11, 5–11, 11–8, 4–11తో లిమ్ జాంగ్హూన్ చేతిలో... మూడో మ్యాచ్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 8–11, 2–11తో లీ సాంగ్ హు చేతిలో ఓటమి పాలయ్యారు. -
నాకౌట్ దశకు భారత టీటీ జట్లు
బుసాన్ (దక్షిణ కొరియా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షి ప్లో భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. గ్రూప్–1లోని చివరి లీగ్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 3–2తో స్పెయిన్పై గెలిచి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్రూప్–3లోని చివరి లీగ్ మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3–0తో న్యూజిలాండ్ను ఓడించి 6 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. నేడు జరిగే నాకౌట్ దశ రెండో రౌండ్ పోటీల్లో ఇటలీతో భారత మహిళల జట్టు... కజకిస్తాన్తో భారత పురుషుల జట్టు తలపడతాయి. క్వార్టర్ ఫైనల్ చేరితే భారత జట్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్లు ఖరారవుతాయి. స్పెయిన్తో జరిగిన పోటీలో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత బృందం ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో నెగ్గడం విశేషం. తొలి మ్యాచ్లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 9–11, 11–9, 11–13, 4–11తో మరియా జియావో చేతిలో... రెండో మ్యాచ్లో మనిక బత్రా 11–13, 11–6, 11–8, 9–11, 7–11తో సోఫియా జువాన్ జాంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్లో ఐహిక ముఖర్జీ 11–8, 11–13, 11–8, 9–11, 11–4తో ఎల్విరా రాడ్పై గెలిచి భారత ఆశలను సజీవంగా నిలిపింది. నాలుగో మ్యాచ్లో మనిక బత్రా 11–9, 11–2, 11–4తో మరియా జియావోపై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో ఆకుల శ్రీజ 11–6, 11–13, 11–6, 11–3తో సోఫియా జువాన్ జాంగ్ను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేసింది. -
World Table Tennis ontender Tourney: ముగిసిన శ్రీజ పోరాటం
దోహా: వరల్డ్ టేబుల్ టెన్నిస్ దోహా కంటెండర్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ‘బై’ పొందిన శ్రీజ రెండో రౌండ్లో 14–12, 11–8, 11–7తో ఆద్రీ జరీఫ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. అయితే మూడో రౌండ్లో శ్రీజ 5–11, 10–12, 9–11తో చెన్ జు యు (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో శ్రీజ–యశస్విని ద్వయం 6–11, 7–11, 5–11తో జియాన్ టియాని–చెన్ జింగ్టాన్ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
Table Tennis Player Manika Batra Pics: ఆటలోనే కాదు అందంలోనూ తగ్గేదేలే..(ఫొటోలు)
-
జాతీయ టీటీ విజేత శ్రీజ
సాక్షి, విజయవాడ: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్íÙప్ మహిళల సింగిల్స్లో తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. టోరీ్నలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన శ్రీజ శనివారం జరిగిన ఫైనల్లో 6–11, 9–11, 11–4, 9–11, 11–7, 12–10, 12–10 (4–3) స్కోరుతో అర్చనా కామత్ (పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్)పై విజయం సాధించింది. తొలి నాలుగు గేమ్లలో మూడు ఓడి 1–3తో వెనుకబడిన శ్రీజ...ఆ తర్వాత చెలరేగి వరుసగా మూడు గేమ్లను గెలుచుకోగలిగింది. 3–3తో సమంగా నిలిచిన తర్వాతి చివరి గేమ్లో ఒక దశలో 10–8తో అర్చన విజయానికి చేరువైంది. అయితే వరుసగా నాలుగు పాయింట్లు సాధించి శ్రీజ మ్యాచ్ను ముగించింది. పురుషుల సింగిల్స్లో మానవ్ ఠక్కర్ (పీఎస్పీబీ)కి టైటిల్ దక్కింది. ఫైనల్లో జి.సత్యన్ (పీఎస్పీబీ)ని ఠక్కర్ గెలుపొందాడు. ఐదు గేమ్ల తర్వాత 2–3తో వెనుకబడిన తర్వాత ఆరో గేమ్లో 0–2 స్కోరు వద్ద వెన్నునొప్పితో సత్యన్ మ్యాచ్నుంచి వైదొలిగాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో మనిక బత్రా
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. తాజా ర్యాంకింగ్స్లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మనిక దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో సెమీఫైనల్కు, ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్కు చేరింది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 82వ ర్యాంక్లో ఉంది. -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్జంప్లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్వాల్ట్లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
సుతీర్థ–ఐహిక జోడీ ఓటమి
ప్యాంగ్చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ వ్యక్తిగత విభాగాల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మానవ్ ఠక్కర్ 9–11, 10–12, 5–11తో చైనా దిగ్గజం మా లాంగ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సుతీర్థ 9–11, 6–11, 4–11తో ఒరావన్ పరానాంగ్ (థాయ్లాండ్) చేతిలో... ఐహిక ముఖర్జీ 11–2, 11–6, 8–11, 9–11, 3–11తో చెన్ జింగ్టాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ (భారత్) జోడీ 5–11, 11–13, 10–12తో మాన్యు వాంగ్–చెన్ మెంగ్ (చైనా) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మానవ్ ఠక్కర్–మనుష్ షా (భారత్) జంట 5–11, 3–11, 5–11తో ఫాన్ జెన్డాంగ్–లిన్ గావోయువాన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి. టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టుకు ఆరో స్థానం లభించింది. -
మనికాకు చేదు అనుభవం.. ఒక్క ట్వీట్తో తిరిగొచ్చేలా! థాంక్యూ సర్..
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా.. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ధన్యవాదాలు తెలిపింది. తన బ్యాగేజ్ను ఇంటికి చేర్చేలా చొరవ తీసుకున్నందుకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. కాగా పెరూ టోర్నమెంట్లో ఆడిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనిక బత్రా డచ్ విమానయాన సంస్థకు చెందిన కేఎల్ఎమ్ ఎయిర్లైన్స్లో భారత్కు చేరుకుంది. అయితే ఈ విమానంలో తన విలువైన బ్యాగేజ్ను మరిచిపోయిన మనిక ఇక్కడికి వచ్చాక సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థను సంప్రదించినప్పటికీ ఆశించిన స్పందన కరువైంది. దీంతో ఆమె.. సాయం చేయాలని కోరుతూ జ్యోతిరాదిత్య సింధియాకు ట్వీట్ చేసింది. మనికా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రి కార్యాలయం.. ‘‘ఢిల్లీకి రానున్న విమానంలో బ్యాగేజీ ఉంది. రేపు ఉదయం 01:55 నిమిషాలకు కలెక్ట్ చేసుకోవచ్చు’’ అని బుధవారం ట్విటర్ వేదికగా మనికాకు రిప్లై ఇచ్చింది. కాగా డచ్ విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణించిన తాను బ్యాగేజీ పోగొట్టుకున్నానని మనిక మంగళవారం ట్వీట్ చేసింది. ఈ విషయం గురించి ఎయిర్పోర్టు సిబ్బందిని ఆరా తీసినా ఫలితం లేకుండా పోయిందంటూ మనికా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయగా.. ఆమెకు ఊరట లభించింది. Thank you so much @JM_Scindia sir and his office for prompt action and helping me in getting my baggage. I have received it this morning. https://t.co/XBVeQIApXO — Manika Batra (@manikabatra_TT) August 9, 2023 -
ఆసియా క్రీడలకు భారత టీటీ జట్టులో శ్రీజ.. జట్ల వివరాలివే
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్షిప్లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను శుక్రవారం ప్రకటించారు. 10 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల, మహిళల జట్లకు ఆచంట శరత్ కమల్, మనిక బత్రా సారథ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్ జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కూడా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలంగాణకు చెందిన ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, మహారాష్ట్ర ప్లేయర్ సానిల్ షెట్టి రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. ఆసియా టీటీ చాంపియన్షిప్ సెపె్టంబర్ 3 నుంచి 10 వరకు దక్షిణ కొరియాలో... ఆసియా క్రీడల టీటీ ఈవెంట్ చైనాలోని హాంగ్జౌలో సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. భారత టీటీ జట్లు: పురుషుల టీమ్ విభాగం: ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుష్ షా. రిజర్వ్: ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, సానిల్ శెట్టి. మహిళల టీమ్ విభాగం: మనిక బత్రా, ఆకుల శ్రీజ, సుతీర్థ ముఖర్జీ, అహిక ముఖర్జీ, దియా చిటాలె. రిజర్వ్: అర్చన కామత్, రీత్ రిష్యా. పురుషుల డబుల్స్: శరత్ కమల్–సత్యన్; మానవ్–మనుష్. మహిళల డబుల్స్: సుతీర్థ–అహిక ముఖర్జీ; శ్రీజ–దియా. మిక్స్డ్ డబుల్స్: మనిక– సత్యన్; శ్రీజ–హర్మీత్ దేశాయ్. ఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్లాండ్లో శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి చౌధరీ (భారత్) ద్వయం 6–4, 6–3తో పునిన్ కొవాపిటుక్టెడ్–మంచాయ సావంగ్కెవ్ (థాయ్లాండ్) జంటపై నెగ్గింది. హైదరాబాద్కే చెందిన సహజ యామలపల్లి సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సహజ 0–6, 6–1, 6–1తో లీ జాంగ్ సియో (కొరియా)పై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సహజ రెండు ఏస్లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. -
సంచలనం సృష్టించిన భారత జోడీ.. వరల్డ్ టైటిల్ సొంతం
ట్యూనిస్ (ట్యూనిషియా): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జోడీ సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సుతీర్థ–ఐహిక ద్వయం మహిళల డబుల్స్లో చాంపియన్గా నిలిచింది. మియు కిహారా–మివా హరిమోటో (జపాన్) జంటతో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సుతీర్థ–ఐహిక జోడీ 11–5, 11–6, 5–11, 13–11తో నెగ్గింది. విజేతగా నిలిచిన సుతీర్థ–ఐహిక జంటకు 1,000 డాలర్ల (రూ. 82 వేలు) ప్రైజ్మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత క్రీడాకారులకు డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ టైటిల్ లభించడం ఇది మూడోసారి. 2019లో మనిక బత్రా–అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటీటీ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ను... 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ ట్యూనిషియాలో జరిగిన డబ్ల్యూటీటీ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ను గెల్చుకున్నారు. -
పారుపల్లి కశ్యప్ అవుట్.. క్వార్టర్స్లో ప్రణయ్
Taipei Open 2023- తైపీ: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత నంబర్వన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. భారత్కే చెందిన పారుపల్లి కశ్యప్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కశ్యప్ 16–21, 17–21తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 13–21, 18–21తో చియు సియా సియె–లిన్ జియావో మిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తాన్యా హేమంత్ (భారత్) 11–21, 6–21తో తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. పోరాడి ఓడిన శ్రీజ న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో ఆకుల శ్రీజ, దియా చిటాలె తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... అహిక ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్ మ్యాచ్ల్లో శ్రీజ 6–11, 11–4, 5–11, 11–2, 7–11తో హువాంగ్ యిహువా (చైనీస్ తైపీ) చేతిలో, దియా 11–9, 7–11, 2–11, 1–11తో మియు కిహారా (జపాన్) చేతిలో ఓడిపోయారు. అహిక 11–8, 11–3, 11–2తో జియోటాంగ్ వాంగ్ (చైనా)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సత్యన్–మనిక బత్రా (భారత్) ద్వయం 11–3, 11–3, 11–6తో అబ్దుల్ బాసిత్ చైచి–మలీసా నస్రి (అల్జీరియా) జంటను ఓడించిం -
ఆకుల శ్రీజ సంచలనం.. ఒకేసారి మూడు టైటిల్స్
జమ్మూ: తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సత్తా చాటింది. తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో మూడు విభాగాల్లో టైటిల్స్ సొంతం చేసుకుంది. సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున పోటీపడిన శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నిలబెట్టుకోగా... డబుల్స్ విభాగంలో తన భాగస్వామి దియా చిటాలెతో కలిసి విజేతగా నిలిచింది. మహిళల టీమ్ ఈవెంట్లో శ్రీజ, దియా, అహిక ముఖర్జీలతో కూడిన ఆర్బీఐ జట్టు టైటిల్ సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 9–11, 14–12, 11–7, 13–11, 6–11, 12–10తో సుతీర్థ ముఖర్జీ (పశ్చిమ బెంగాల్)పై గెలిచి రూ. 2 లక్షల 75 వేల ప్రైజ్మనీని దక్కించుకుంది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ–దియా ద్వయం 11–7, 11–7, 8–11, 14–12తో స్వస్తిక ఘోష్–శ్రుతి అమృతే (మహారాష్ట్ర) జోడీని ఓడించింది. టీమ్ ఫైనల్లో ఆర్బీఐ 3–2తో తమిళనాడును ఓడించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో మొహమ్మద్ అలీ–వంశ్ సింఘాల్ (తెలంగాణ) జోడీ 6–11, 7–11, 6–11తో జీత్ చంద్ర–అంకుర్ భట్టాచార్య (పశ్చిమ బెంగాల్) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. -
క్వార్టర్ ఫైనల్లో మనిక–సత్యన్ జోడీ ఓటమి, ముగిసిన భారత పోరాటం
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోరీ్నలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ 9–11, 9–11, 11–8, 11–5, 7–11తో హినా హయాటా–టొమొకాజు హరిమోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జోడీ 2–11, 6–11, 15–13, 12–10, 6–11తో మెంగ్ చెన్–యిది వాంగ్ (చైనా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
WTT Singapore Smash Tourney 2023: ఆకుల శ్రీజకు నిరాశ
సింగపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నీలో భారత్కు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది. బుధవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ రెండో మ్యాచ్లో జాతీయ చాంపియన్ శ్రీజ 12–10, 6–11, 9–11, 3–11తో జూ చెన్హుయ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ సూరావజ్జుల 11–4, 7–11, 10–12, 11–6, 11–8తో జేవియర్ డిక్సన్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. -
సింగపూర్ స్మాష్ టోర్నీలో ఆకుల శ్రీజ ముందంజ
సింగపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’ బెర్త్కు విజయం దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి మ్యాచ్లో జాతీయ చాంపియన్ శ్రీజ 11–5, 8–11, 11–8, 12–10తో చార్లోటి లుట్జ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్లో దక్షిణ కొరియాకు చెందిన జూ చెన్హుయ్తో శ్రీజ ఆడుతుంది. ఈ మ్యాచ్లో శ్రీజ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు చేరుకుంటుంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో మనిక.. పడిపోయిన ఆకుల శ్రీజ ర్యాంకు
International Table Tennis Federation (ITTF) world rankings- న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్లో నిలిచింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మనిక గత నవంబర్లో ఆసియా కప్లో కాంస్యం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతవారం దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో కాంస్యం గెలిచి 140 ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించింది. తెలంగాణకు చెందిన జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ ఆరు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్ 41వ ర్యాంక్లో, ఆచంట శరత్ కమల్ 46వ ర్యాంక్లో ఉన్నారు. తెలంగాణకు చెందిన సూరావజ్జుల స్నేహిత్ మూడు స్థానాలు పడిపోయి 125వ ర్యాంక్లో నిలిచాడు. చదవండి: Rajat Patidar: అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ.. Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
Table Tennis: కెరీర్ బెస్ట్ ర్యాంక్లో మనిక బత్రా.. ఆకుల శ్రీజ పురోగతి
Manika Batra: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్కు చేరుకుంది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు స్థానాలు పురోగతి సాధించి 72వ ర్యాంక్లో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ 136వ ర్యాంక్ లో ఉన్నాడు. సత్యన్ 39వ ర్యాంక్తో భారత నంబర్వన్గా కొనసాగుతున్నాడు. ఇది కూడా చదవండి: రామ్కుమార్కు మిశ్రమ ఫలితాలు పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ రామ్కుమార్ రామనాథన్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రామ్కుమార్ 3–6, 7–5, 3–6తో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. అయితే డబుల్స్ తొలి రౌండ్లో రామ్కుమార్–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ 7–6 (7/5), 6–7 (4/7), 11–9తో రోహన్ బోపన్న (భారత్)–జాండ్షుల్ప్ (నెదర్లాండ్స్) ద్వయంపై ‘సూపర్ టైబ్రేక్’లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇతర మ్యాచ్ల్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 7–6 (7/1), 5–7, 7–10తో మూడో సీడ్ సాదియో దుంబియా–రిబూల్ (ఫ్రాన్స్) జంట చేతిలో... పురవ్ రాజా–దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 4–6, 3–6తో జీవన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ చేతిలో ఓడిపోయాయి. చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా? -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. మెడల్ గెలిచిన తొలి భారత ప్లేయర్గా రికార్డు
Manika Batra Won Bronze Medal At Asia Cup TT 2022: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్లో భారత స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 2 ప్లేయర్, జపాన్ క్రీడాకారిణి మిమా ఇటో చేతిలో ఓడిన మనిక.. శనివారమే జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో వరల్డ్ నంబర్ 6 క్రీడాకారిణి, జపాన్కు చెందిన హిన హయటపై 4-2 (11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) తేడాతో గెలుపొంది రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్లో మనికా, హిన ఇద్దరూ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడినప్పటికీ, విజయం మనికనే వరించింది. కాగా, మనిక బత్రా ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో అసమాన విజయాలతో సెమీస్ వరకు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. తొలి భారతీయ క్రీడాకారిణిగా..!
బ్యాంకాక్: ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ మనిక బత్రా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ మనిక 6–11, 11–6, 11–5, 11–7, 8–11, 9–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్ చెన్ సు యు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. -
శరత్ కమల్కు అరుదైన గౌరవం.. భారత్ తరఫున తొలి ఆటగాడిగా..!
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు, ఖేల్రత్న అవార్డీ ఆచంట శరత్ కమల్ను అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) సముచిత రీతిలో గౌరవించింది. ప్రతిష్టాత్మక ఐటీటీఎఫ్ అథ్లెట్స్ కమిషన్లో శరత్ కమల్కు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు శరత్ కావడం విశేషం. 2022–2026 మధ్య నాలుగేళ్ల కాలానికిగాను వేర్వేరు ఖండాల నుంచి ఎనిమిది మందిని (నలుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఇందులోకి ఎంపిక చేశారు. మొత్తం 283 మంది అథ్లెట్లు ఓటింగ్లో పాల్గొనగా, ఆసియా ఖండం ప్రతినిధిగా శరత్కు 187 ఓట్లు లభించాయి. మహిళల కేటగిరీలో ఎంపికైన చైనా ప్యాడ్లర్ ల్యూ షీవెన్కు 153 ఓట్లు మాత్రమే వచ్చాయి. తనకు లభించిన ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేసిన శరత్ కమల్...ఆసియా ఖండం నుంచి తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో శరత్ 3 స్వర్ణాలు నెగ్గాడు. నేటి నుంచి ఏషియన్ కప్... బ్యాంకాక్ వేదికగా నేటినుంచి ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఏషియన్ కప్ టోర్నీలో శరత్ కమల్తో పాటు మరో భారత టాప్ ఆటగాడు సత్యన్ పాల్గొంటున్నారు. అయితే వీరిద్దరికీ కఠిన ‘డ్రా’ ఎదురైంది. తొలి పోరులో తమకంటే మెరుగైన ర్యాంక్ల్లో ఉన్న చువాంగ్ చి యువానా (చైనీస్ తైపీ)తో శరత్ తలపడనుండగా, యుకియా ఉడా (జపాన్)ను సత్యన్ ఎదుర్కొంటాడు. -
National Games 2022: తెలంగాణ నెట్బాల్ జట్టుకు రజతం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఖాతాలో నాలుగో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే మూడు పతకాలు లభించగా... తాజాగా నెట్బాల్ క్రీడాంశంలో తెలంగాణ జట్టుకు రజత పతకం దక్కింది. భావ్నగర్లో శుక్రవారం జరిగిన పురుషుల నెట్బాల్ ఫైనల్లో తెలంగాణ 73–75తో (16–9, 12–18, 16–20, 29–28) హరియాణా చేతిలో పోరాడి ఓడిపోయింది. రజత పతకం నెగ్గిన తెలంగాణ జట్టులో బి.విక్రమాదిత్య రెడ్డి, సయ్యద్ అమ్జాద్ అలీ, జన్ను హరీశ్, కంబాల శ్రీనివాసరావు, ముజీబుద్దీన్, మొహమ్మద్ ఇస్మాయిల్, పి.వంశీకృష్ణ, కె.సుమన్, కురకుల సంయుత్, బి.రంజీత్ కుమార్, సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, ఎన్.లునావత్ అఖిల్ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీమ్ టెన్నిస్లో తెలంగాణ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తెలంగాణ 0–2తో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు మహిళల వెయిట్లిఫ్టింగ్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మణిపూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్లో 84+క్లీన్ అండ్ జెర్క్లో 107) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. -
పికిల్బాల్ ఎప్పుడైనా విన్నారా.. అమెరికాలో ఎందుకంత క్రేజ్!
క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్.. ఇలా చెప్పుకుంటే పోతే చాలా క్రీడలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.యూరోపియన్ దేశాల్లో ఫుట్బాల్కు అత్యంత ఆదరణ ఉంటే.. ఆసియా ఖండంలో క్రికెట్కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక అమెరికా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో రగ్బీ, బాస్కెట్బాల్ క్రీడలకు ఉండే ఆదరణ గురించి చెప్పనవసరం లేదు. మొత్తానికి ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్ సహా ఇతర క్రీడలు ఇవాళ విశ్వవ్యాప్తంగా ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే మనకు తెలియని క్రీడలు చాలానే ఉన్నాయి. ఒక క్రీడాభిమానిగా వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం తప్పకుంటా ఉంటుంది. తాజాగా అమెరికాలో పికిల్బాల్ అనే క్రీడకు ప్రస్తుతం యమా క్రేజ్ ఉంది. అక్కడ ఇప్పుడు పికిల్బాల్ దూసుకెళ్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఈ పికిల్బాల్ క్రీడపై విపరీతమైన ఆదరణ కనబరుస్తున్నారు. పికిల్బాల్ చూడడానికి అచ్చం టెన్నిస్ ఆటలాగే ఉన్నప్పటికి ఇందులో ఉండే రూల్స్ వేరు. బంతి కొట్టే విధానం నుంచి బ్యాట్ పట్టుకునే విధానం వరకు.. షాట్స్, సర్వ్ చేసే తీరులో కూడా చాలా మార్పులు ఉన్నాయి. అసలు పికిల్బాల్ అంటే ఏంటి? పికిల్బాల్ ఇప్పుడు పుట్టిన క్రీడ మాత్రం కాదు. చాలా ఏళ్ల క్రితమే అమెరికాలోని వాషింగ్టన్లో ఉండే బెయిన్బ్రిడ్జ్ ఐలాండ్కు చెందిన ఒక కుటుంబం పికిల్బాల్ను కనిపెట్టింది. టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కలగలిపి ఆడే క్రీడ పికిల్బాల్. కాగా పికిల్బాల్ కోర్టు టెన్నిస్ కోర్టు కంటే కాస్త చిన్నగా ఉంటుంది. పాడిల్ రూపంలో రాకెట్.. బంతి చుట్టూ హోల్స్.. పికిల్ బాల్ స్పోర్ట్స్ను ఇండోర్, ఔట్డోర్ గేమ్స్లో ఆడే అవకాశం ఉంటుంది. టెన్నిస్ రాకెట్లా కాకుండా పాడిల్ను(చిన్న రాకెట్) ఉపయోగిస్తారు. ఇక ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే పికెల్ బాల్పై చుట్టూ హోల్స్ ఉంటాయి. ఈ రెండింటితో పాటు నెట్, మంచి గ్రౌండ్ అందుబాటులో ఉండాల్సిందే. ఇక పికిల్బాల్ కోర్ట్ డబుల్స్ బ్యాడ్మింటన్ కోర్ట్తో సమానంగా ఉంటుంది. 20×44 అడుగుల కొలతలు కలిగి ఉంటుంది. నికర ఎత్తు సైడ్లైన్లో 36 అంగుళాలు..మధ్యలో 34 అంగుళాలు పొడవు. కోర్ట్ టెన్నిస్ కోర్ట్ లాగా కుడి, ఎడమ సర్వీస్ కోర్ట్లతో పాటు నెట్ ముందు 7-అడుగుల నాన్-వాలీ జోన్ కలిగి ఉంటుంది. పికిల్బాల్ రూల్స్.. ఆడే విధానం: ►అండర్హ్యాండ్ సర్వ్ని మాత్రమే ఉపయోగించాలి ►సర్వ్, రిటర్న్ ఆఫ్ సర్వ్ రెండూ తప్పనిసరిగా బౌన్స్ కావాలి. ►సర్వ్ చేజే జట్టు మాత్రమే పాయింట్లను స్కోర్ చేయగలదు. ►పాయింట్ గెలిచిన తర్వాత సర్వ్ చేసే బృందం తప్పనిసరిగా తమ దిశను మార్చుకోవాలి ►సర్వర్ చేయడానికి ముందు సర్వర్ బిగ్గరగా స్కోర్ని పిలవాలి ►నాన్-వాలీ జోన్తో సంప్రదింపులు జరుపుతున్నప్పుడు వాలీలు అనుమతించబడవు. ►నాన్-వాలీ జోన్లో పికిల్బాల్ బౌన్స్ అయిన తర్వాతే షాట్లు కొట్టడానికి అనుమతి ఉంటుంది ►పికిల్బాల్ ఎక్కడా తగిలినా (మణికట్టు క్రింద కాకుండా)..అప్పుడు ర్యాలీని కోల్పోయే అవకాశం ఉంటుంది. -
National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ
జాతీయ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్లోని సూరత్లో శనివారం టీటీ ఈవెంట్ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్లో రజతం... మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణకే చెందిన స్నేహిత్తో కలిసి రజతం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్ ఉత్పల్ షా–కృత్విక సిన్హా రాయ్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్షిప్లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్ను నిర్వహించారు. -
తెలంగాణకు కాంస్య పతకం
సూరత్: అధికారికంగా జాతీయ క్రీడలు ఇంకా ప్రారంభంకాకముందే తెలంగాణ జట్టు పతకాల ఖాతా తెరిచింది. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్లో జాతీయ సింగిల్స్ చాంపియన్ ఆకుల శ్రీజ, నిఖత్ బాను, వరుణి జైస్వాల్, గార్లపాటి ప్రణీత, మోనిక మనోహర్ సభ్యులుగా ఉన్న తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన టీమ్ ఈవెంట్ సెమీఫైనల్స్లో తెలంగాణ 0–3తో పశ్చిమ బెంగాల్ చేతిలో... తమిళనాడు 1–3తో మహారాష్ట్ర చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. బెంగాల్తో జరిగిన సెమీఫైనల్స్లో తొలి మ్యాచ్లో వరుణి జైస్వాల్ 7–11, 11–13, 4–11తో సుతీర్థ ముఖర్జీ చేతిలో... రెండో మ్యాచ్లో ఆకుల శ్రీజ 9–11, 11–7, 11–13, 11–9, 12–14తో ఐహిక ముఖర్జీ చేతిలో... మూడో మ్యాచ్లో నిఖత్ బాను 10–12, 8–11, 4–11, 13–11, 9–11తో మౌమా దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఫైనల్లో పశ్చిమ బెంగాల్ 3–1తో మహారాష్ట్రను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించగా, మహారాష్ట్ర రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల టీమ్ ఈవెంట్లో స్నేహిత్, మొహమ్మద్ అలీ, అమన్, ఫారూఖి, వరుణ్ శంకర్లతో కూడిన తెలంగాణ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఆతిథ్య గుజరాత్ 3–0తో ఢిల్లీని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. అయితే భారత టీటీ జట్లు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 9 వరకు చైనాలో జరగనున్న ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనాల్సి ఉండటంతో జాతీయ క్రీడల నిర్వాహకులు టీటీ ఈవెంట్ను ముందస్తుగా నిర్వహిస్తున్నారు. -
టేబుల్ టెన్నిస్ సెమీఫైనల్లో తెలంగాణ
గుజరాత్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్కు చేరింది. ఆకుల శ్రీజ, నిఖత్ బాను, వరుణి జైస్వాల్ సభ్యులుగా ఉన్న తెలంగాణ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. హరియాణా, గుజరాత్ జట్లపై 3–1తో నెగ్గిన తెలంగాణ 0–3తో మహారాష్ట్ర చేతిలో ఓడింది. జాతీయ క్రీడలు ఈనెల 29 నుంచి జరగనున్నాయి. అయితే అవే తేదీల్లో భారత జట్లు ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనాల్సి ఉండటంతో టీటీ ఈవెంట్ను ముందుగా నిర్వహిస్తున్నారు. -
భారత జోడీకి స్వర్ణం
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత్కు తొలి సారి స్వర్ణ పతకం లభించింది. లావోస్లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో జూనియర్ మిక్స్డ్ డబుల్స్లో పాయస్ జైన్–యశస్విని జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాయస్–యశస్విని ద్వయం 11–9, 11–1, 10–12, 7–11, 11–8తో హాన్ జిన్యువాన్–కిన్ యుజువాన్ (చైనా) జోడీపై విజయం సాధించింది. అండర్–19 బాలుర డబుల్స్లో, అండర్–19 బాలికల సింగిల్స్లో, అండర్–19 బాలుర టీమ్ ఈవెంట్లో భారత్కు కాంస్య పతకాలు లభించాయి. -
మ్యాచ్కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్లకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశ్ ప్లేయర్స్పై నిషేధం
కామన్వెల్త్ గేమ్స్ లాంటి కీలకమైన ఈవెంట్లో మ్యాచ్కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్ల సందర్శనకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులపై ఆ దేశ క్రీడల సమాఖ్య నిషేధం విధించింది. సోనమ్ సుల్తానా సోమా, సాదియా అక్తర్ మౌ అనే ఇద్దరు బంగ్లాదేశ్ టీటీ ప్లేయర్లు.. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆగస్ట్ 5న షెడ్యూలైన మహిళల మ్యాచ్ల్లో (సింగిల్స్, డబుల్స్, మిక్సడ్ డబుల్స్) పాల్గొనాల్సి ఉండింది. అయితే ఈ జోడీ క్యాంప్ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, మ్యాచ్ సమయానికి కనిపించకుండా పోయారు (బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు విచారణలో పేర్కొన్నారు). దీంతో ప్రత్యర్ధులకు బై లభించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బంగ్లాదేశ్ క్రీడల సమాఖ్య.. దేశ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కారణంగా ఇద్దరు మహిళా టీటీ ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ నిషేధం అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు డొమెస్టిక్ సర్క్యూట్కు కూడా వర్తిస్తుందని బంగ్లాదేశ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించింది. చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
World table tennis: సింగిల్స్ విజేత హన్సిని
న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టీటీ టోర్నీలో భారత క్రీడాకారిణులు అదరగొట్టారు. మూడు సింగిల్స్ విభాగాల్లో టైటిల్స్ గెల్చుకున్నారు. ఈక్వెడార్లో జరిగిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన హన్సిని మథన్ రాజన్ అండర్–13 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో హన్సిని 11–7, 11–8, 11–7తో మరియానా రోడ్రిగెజ్ (ఈక్వెడార్)పై గెలిచింది. అండర్–19 బాలికల సింగిల్స్ విభాగంలో యశస్విని, అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో సుహానా సైనీ కూడా టైటిల్స్ సాధించారు. -
నైనా జైశ్వాల్ను వేధించిన పోకిరి అరెస్ట్
హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ను గత కొంతకాలంగా వేధిస్తున్న శ్రీకాంత్ అనే పోకిరీని శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా నైనా జైశ్వాల్కు ఇన్స్టాగ్రామ్లో అసభ్య మెసేజ్లు పోస్ట్ చేసి శ్రీకాంత్ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఈ మేరకు శ్రీకాంత్ అనే యువకుడ్ని హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలోనే గతంలో సిద్ధిపేట్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా నైనా జైశ్వాల్కు మరోసారి అసభ్యకర సందేశాలు పంపుతున్నాడు. దాంతో నైనా జైశ్వాల్ తండ్రి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకుడ్ని అరెస్ట్ చేశారు. -
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్కు వేధింపులు
-
నైనా జైశ్వాల్కు వేధింపులు.. అసభ్యకర మెసేజ్లు పంపుతున్న ఆకతాయి
సాక్షి, హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, విద్యావేత్త నైనా జైస్వాల్ సోషల్ మీడియా నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తి పదే పదే మెసేజ్లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు నైనా జైస్వాల్ తండ్రి అశ్విన్ జైస్వాల్ హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ సిద్దిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి నోటీసులిచ్చారు. పీజీ పూర్తి చేసిన శ్రీకాంత్ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. కొన్ని నెలల క్రితం నైన జైస్వాల్కు ఇన్స్ట్రాగామ్లో మెసేజ్లు చేశాడు. ఆ మెసేజ్లు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఆమె శ్రీకాంత్ను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆ తర్వాత పలు పేర్లతో ఫేక్ ఖాతాలు సృష్టించి నైనా పోస్ట్ చేసిన పోస్టులకు అసభ్య కామెంట్లు పెడుతున్నాడు. దీనిపై అప్పట్లో తండ్రి అశ్విన్జైస్వాల్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సిద్దిపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్, అతని తండ్రిని, సోదరుడిని పిలిచిన పోలీసులు రెండు పర్యాయాలు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆ తర్వాత ట్విట్టర్ అకౌంట్స్ సుమారు 30–50 క్రియేట్ చేసి కామెంట్ చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో మరోమారు సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి శ్రీకాంత్ అరెస్టు చేసినట్టు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా.. చదువుల తల్లిగానూ పేరొందింది. 8 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తద్వారా ఆసియాలోనే పిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఘనత దక్కించుకుంది. మోటివేషనల్ స్పీకర్గానూ రాణిస్తున్న నైనా జైశ్వాల్ ఇటీవలే తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్ఎల్బీలో చేరగా.. ఫస్ట్క్లాస్లో పాసైంది. చదవండి: Chess Olympiad 2022: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం -
కామన్వెల్త్ గేమ్స్ హీరో శరత్ కమల్కు రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం ఏంటి..?
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్సిస్ (టీటీ) సింగిల్స్లో ఆచంట శరత్ కమల్ బంగారు పతకం సాధించాడు. అంతకుముందు మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనూ ఆకుల శ్రీజతో కలిసి స్వర్ణం నెగ్గాడు. కామన్వెల్త్ గేమ్స్లో మొత్తం 13 పతకాలు గెలిచిన శరత్ కమల్కు మన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కమల్ ప్రస్తుతం నివాసముంటున్నది చెన్నైలోనే అయినా టీటీలో అతన్ని తీర్చిదిద్దిన తండ్రి ఆచంట శ్రీనివాసరావు క్రీడా ప్రస్తానానికి బీజం పడింది ఇక్కడే. శ్రీనివాసరావు టేబుల్ టెన్నిస్ నేర్చుకుందీ.. అనంతరం కోచ్గా ఎదగడానికి ఇక్కడే నాంది పడింది. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) అది 1970వ సంవత్సరం. రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం పురమందిరం(టౌన్హాల్)లో కొంత మంది యువకులు టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆడుతున్నారు. వారి ఆటను 17 ఏళ్ల యువకుడు తదేకంగా చూస్తున్నాడు. రోజూ అక్కడకు వచ్చి, ఆటను చూడటం ఆతడికి అలవాటుగా మారింది. తరువాత తానూ ఆ ఆట ఆడాలని నిర్ణయించుకున్నాడు. అంతే.. కొద్ది రోజుల్లోనే టేబుల్ టెన్నిస్లో చిచ్చర పిడుగులా మారాడు. రోజంతా టీటీ ఆడినా అలసట అనేదే తెలిసేది కాదు. ఆయనే ఆచంట శ్రీనివాసరావు.. ఫాదర్ ఆఫ్ ఆచంట శరత్ కమల్. మచిలీపట్నంలో జననం తన తల్లి పుట్టిల్లు మచిలీపట్నంలో 1953 నవంబర్ 1న శ్రీనివాసరావు జన్మించారు. తండ్రిది రాజమహేంద్రవరం కావడంతో ఇక్కడే పెరిగారు. తమ్ముడు మురళీధర్తో కలిసి రోజూ టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు. 1973, 74 సంవత్సరాల్లో చైన్నె, ఇండోర్లలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మెరికల్లాంటి శిష్యులు శ్రీనివాసరావు వద్ద శిష్యరికం చేస్తే చాలు.. గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమనే పేరు వచ్చింది. ఆయన వద్ద శిక్షణ పొందిన చేతన్ పి. బాబున్, ఎస్.రామన్, ఎంఎస్ మైథిలి, ఎన్ఆర్ నాయుడు, కె.షామిని, భువనేశ్వరి, ఆచంట రజత్ కమల్, ఆచంట శరత్ కమల్ తదితరులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. శిష్యుల ద్వారా సాధించిన అపూర్వ విజయాలతో కేంద్ర ప్రభుత్వం శ్రీనివాసరావును గుర్తించింది. 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్లో రాణిస్తున్న తన కొడుకు శరత్ కమల్ను కూడా స్వయంగా శ్రీనివాసరావే తీర్చిదిద్దారు. అతడు సాధించిన విజయాల్లో ఆయన పాత్ర చాలా ఉంది. మిక్స్డ్ డబుల్స్లో శ్రీజ – శరత్ కమల్ జోడీ, సింగిల్స్లో శరత్ కమల్ ఆట తీరును ఆసాంతం తిలకించిన శ్రీనివాసరావు.. వారు స్వర్ణ పతకాలు సాధించడంతో సగర్వంగా తలెత్తుకున్నారు. మలుపు తిప్పిన చైన్నె శ్రీనివాసరావుకు చైన్నె ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్య అన్నపూర్ణతో కలిసి చైన్నె చేరుకున్నారు. అక్కడ అర్జున అవార్డు గ్రహీత జి.జగన్నాథ్తో కలిగిన పరిచయం శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పింది. ‘ఇంతటి సామర్థ్యం ఉన్న ఆటగాడివి ఇలా ఉండిపోవడం బాగోలేదు. ఆటగాడిగా కాకపోయినా కోచ్గా అయినా మారు’ అని జగన్నాథ్ సలహా ఇచ్చారు. దీంతో పాటియాలాలోని ఎన్ఐఎస్లో కోచ్గా శ్రీనివాసరావు శిక్షణ పొందారు. 1983లోనే కోచింగ్ రంగంలో డిప్లొమా సాధించారు. -
commonwealth games 2022: ‘నా ఆనందానికి హద్దుల్లేవు’
శరత్ కమల్ తొలి కామన్వెల్త్ పతకం గెలిచినప్పుడు ఆకుల శ్రీజ వయసు 8 ఏళ్లు! ఇప్పుడు అలాంటి దిగ్గజం భాగస్వామిగా కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగిన శ్రీజ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పాల్గొన్న తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది తొలిసారి సీనియర్ స్థాయిలో జాతీయ చాంపియన్గా నిలిచిన శ్రీజ దురదృష్టవశాత్తూ సింగిల్స్ విభాగంలో నాలుగో స్థానానికే పరిమితమైనా... 24 ఏళ్ల వయసులోనే తొలి పతకంతో ఈ హైదరాబాద్ అమ్మాయి భవిష్యత్తుపై ఆశలు రేపింది. విజయం సాధించిన అనంతరం బర్మింగ్హామ్ నుంచి ‘సాక్షి’తో ఆనందం పంచుకుంటూ శ్రీజ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ‘సింగిల్స్ కాంస్య పతక పోరులో ఓటమితో చాలా బాధపడ్డాను. ఎంతో పోరాడిన తర్వాత ఓడిపోవడంతో విపరీతంగా ఏడ్చేశాను. ఈ సమయంలో శరత్ అన్నయ్య నన్ను సముదాయించారు. నువ్వు చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. మిక్స్డ్లో ఇంకా ఫైనల్ మిగిలే ఉంది. మనం స్వర్ణానికి గురి పెడదాం అని చెప్పారు. అప్పటికే సెమీస్ వరకు అన్న నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. తెలుగులోనే మేం మాట్లాడుకునేవాళ్లం. నాకంటే ఎంతో సీనియర్ అయిన ఆయన ప్రతీ మ్యాచ్లో, ప్రతీ పాయింట్కు అండగా నిలిచారు. ఏమాత్రం ఆందోళన వద్దు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావని మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చారు. చివరకు నేను పాయింట్ చేజార్చినా ఆయనే సారీ చెప్పేవారు. 2019లో ఒకసారి శరత్ అన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడాను. నా కోచ్ సోమ్నాథ్ ఘోష్కు శరత్ అన్నతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆ చొరవతోనే ఈ సారి కామన్వెల్త్ క్రీడలకు ముందు నాతో కలిసి ఆడితే బాగుంటుందని ఆయన అన్నకు సూచించారు. దీనికి ఆయన ఒప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తితో కలిసి ఇప్పుడు పతకమే గెలవడం చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా శరత్ అన్న... ఇప్పటి వరకు నాకు సరైన భాగస్వామి లేక మిక్స్డ్ పతకం లోటుగా ఉండేది. ఇప్పుడు నీతో కలిసి ఆడాక అది దక్కింది, థాంక్యూ అని చెప్పడం ఎప్పటికి మరచిపోలేను’ -
Commonwealth Games 2022: 16 వసంతాలుగా ‘శరత్’ కాలం
2006 – మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు – టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆటగాడు విలియం హెన్జెల్పై విజయంతో స్వర్ణం... 2022 – బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలు– సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్ఫోర్డ్పై విజయంతో స్వర్ణం... ఈ రెండు సందర్భాల్లోనూ విజేత ఒక్కడే... నాడు 24 ఏళ్ల వయసులో తొలి పతకం సాధించి ఇప్పుడు 40 ఏళ్ల వయసులో 13వ పతకం సాధించిన ఆ స్టార్ ఆటగాడే ఆచంట శరత్ కమల్. ఇన్నేళ్ల సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ప్రత్యర్థులు మారారు... వేదికలు, పరిస్థితులు మారాయి. కానీ అతని ఆట మాత్రం మారలేదు. ఆ విజయకాంక్ష ఎక్కడా తగ్గలేదు. సింగిల్స్లో తొలి స్వర్ణం నెగ్గిన 16 సంవత్సరాల తర్వాత కూడా స్వర్ణంపై గురి పెట్టగలిగిన అతని సత్తాను ఎంత ప్రశంసించినా తక్కువే... వరుసగా ఐదు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని శరత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 13 కాగా, ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. భారత్ తరఫున ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన శరత్ కమల్ సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాలు, రుతువుల్లోనూ తనలో వాడి ఉందని నిరూపించాడు. కొత్త కుర్రాడిలాగే... సుదీర్ఘ కాలంగా భారత టేబుల్ టెన్నిస్ను శాసిస్తూ రికార్డు స్థాయిలో 10 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచి శరత్ కమల్ ఆటకు పర్యాయపదంగా నిలిచాడు. అయితే 40 ఏళ్ల వయసులో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటాడా, ఒకవేళ ఆడినా గత స్థాయి ప్రదర్శనను ఇవ్వగలడా అనే సందేహాలు వినిపించాయి. కానీ అతను అన్నింటినీ పటాపంచలు చేసేశాడు. గత నాలుగు కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు విభాగాల్లోనూ అతను పతకాలు (3 స్వర్ణాలు, 1 రజతం) సాధించడం విశేషం. షెడ్యూల్ ప్రకారం చాలా తక్కువ వ్యవధిలో వరుసగా మ్యాచ్లు ఆడాల్సి రావడం, ఒకే రోజు వేర్వేరు ఈవెంట్లలో పాల్గొనాల్సి వచ్చినా శరత్ లయ కోల్పోలేదు. ఆడిన మూడు మ్యాచ్లలోనూ విజయాలు సాధించి అతను సత్తా చాటాడు. -
టేబుల్ టెన్నిస్లో భారత్కు మరో స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్-2022 అఖరి రోజు భారత్ ఖాతాలో నాలుగో గోల్డ్ మెడల్ వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్ఫోర్డ్పై 4-1తో కమల్ విజయం సాధించాడు. ఇక ఓవరాల్గా అఖరి రోజు భారత్కు ఇది ఐదో పతకం. అంతకుముందు పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించగా, పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అదే విధంగా బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్లో రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ గోల్డ్ మెడల్ సాధించింది. మరో వైపు టేబుల్ టెన్నిస్ కాంస్య పతక పోరులో జ్ఞానశేఖరన్ సాతియన్ విజయం సాధించాడు. భారత్ ఇప్పటి వరకు 22 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 60 మెడల్స్తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: CWG 2022:: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి -
భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. టేబుల్ టెన్నిస్లో శరత్ కమల్ హవా
టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్ చూంగ్–లిన్ కరెన్ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్గా 53వ పతకం చేరాయి. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్ డ్రింక్హాల్–లియామ్ పిచ్ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది. ఫైనల్లోకి దూసుకెళ్లిన శరత్ కమల్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 40 ఏళ్ల శరత్ కమల్ 11–8, 11–8, 8–11, 11–7, 9–11, 11–8తో పాల్ డ్రింక్హాల్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 11–4, 8–11, 9–11, 9–11తో లియామ్ పిచ్ఫోర్డ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకపోరుకు సిద్ధమయ్యాడు. పోరాడి ఓడిన శ్రీజ మహిళల సింగిల్స్లో ఆకుల శ్రీజ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో శ్రీజ పోరాడినా తుదకు 11–3, 6–11, 2–11, 11–7, 13–15, 11–9, 7–11తో లియు యాంగ్జీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. -
రజతంతో సరిపెట్టుకున్న శరత్ కమల్-జ్ఞానశేఖరన్ జోడీ
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ టేబుల్ టెన్నిస్ డబుల్స్ జోడీ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్స్లో అచంట శరత్ కమల్-జ్ఞానశేఖరన్ సతియాన్ ద్వయం.. ఇంగ్లండ్ జోడీ లియామ్ పిచ్ఫోర్డ్-పాల్ డ్రింక్హాల్ చేతిలో ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లీష్ జోడీ 8-11, 11-8, 11-3, 7-11, 11-4తేడాతో భారత ద్వయంపై విజయం సాధించి స్వర్ణ పతకం ఎగరేసుకుపోయింది. 2018 కామన్వెల్త్ గేమ్స్లోనూ ఇంగ్లండ్ జోడీ.. భారత జోడీపై దాదాపు ఇదే తరహాలో విజయం సాధించింది. నాడు డిసైడింగ్ గేమ్లో ఇంగ్లండ్ 11-8 తేడాతో నెగ్గగా.. ఇప్పుడు 11-4 తేడాతో విజయం సాధించింది. టీటీలో శరత్ కమల్-జ్ఞానశేఖరన్ జోడీ సాధించిన పతకంతో భారత పతకాల సంఖ్య 49కి (17 స్వర్ణాలు, 13 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. ఇవాళ ఒక్క రోజే భారత్ ఖాతాలో 9 పతకాలు చేరాయి. చదవండి: పసిడి పంచ్ విసిరిన తెలంగాణ బిడ్డ.. అభినందనలతో ముంచెత్తిన కేసీఆర్ -
CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో శనివారం భారత స్టార్ పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ మహిళల సింగిల్స్ 3-5తో స్వర్ణ పతకం సాధించింది. టోక్యో పారాలింపిక్స్లో రజతం గెలిచిన గుజరాత్కు చెందిన 35 ఏళ్ల యువకుడు 12-10 11-2 11-9తో నైజీరియాకు చెందిన ఇఫెచుక్వుడే క్రిస్టియానా ఇక్పెయోయ్పై విజయం సాధించి క్వాడ్రినియెల్ ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ఇక సోనాల్బెన్ మనుభాయ్ పటేల్ కూడా మహిళల సింగిల్స్ క్లాస్లో 3-5తో కాంస్యం సాధించి భారత్కు పతకాన్ని అందించింది. 34 ఏళ్ల భారత ఆటగాడు కాంస్య పతక ప్లే ఆఫ్లో ఇంగ్లండ్కు చెందిన స్యూ బెయిలీపై 11-5 11-2 11-3 తేడాతో విజయం సాధించారు. అయితే, పురుషుల సింగిల్స్ తరగతుల్లో రాజ్ అరవిందన్ అళగర్ 0-3తో నైజీరియాకు చెందిన ఇసౌ ఒగున్కున్లే చేతిలో 3-5తో కాంస్య పతక ప్లే-ఆఫ్తో ఓడిపోయాడు. కాగా కామన్వెల్త్ గేమ్మ్ తొమ్మిదో రోజు భారత్ మూడు స్వర్ణాలు సాధించింది. పలు కాంస్య పతకాలు గెలుచుకుంది. మొత్తం ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత్ 40 మెడల్స్తో ఐదో స్థానంలో ఉండగా.. అందులో 13 స్వర్ణం, 11 రజతం, 16 కాంస్యం ఉన్నాయి. Our country is constantly being brought up with the stellar performance of Indian sports talent in #CommonwealthGames2022. In this sequence, in the Para Table-Tennis match, Gujarat's pride, Bhavinaben Patel, won the GOLD🏅medal and made the nation proud. You are a champion 👏 pic.twitter.com/ANWtyMiksA — Sports Authority of Gujarat (@sagofficialpage) August 6, 2022 చదవండి: Commonwealth Games 2022: ‘పసిడి’కి పంచ్ దూరంలో... -
Commonwealth Games 2022: సూపర్ శ్రీజ, శరత్
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ... పురుషుల డబుల్స్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–9, 11–8, 9–11, 12–14, 11–7తో నికోలస్ లమ్–మిన్హైంగ్ జీ (ఆస్ట్రేలియా) జంటపై... శరత్ కమల్–సత్యన్ జోడీ 8–11, 11–9, 10–12, 11–1, 11–8తో నికోలస్ లమ్–ఫిన్ లు (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీజ 6–11, 11–8, 11–6, 9–11, 8–11, 11–8, 10–12తో తియాన్వె ఫెంగ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో యాంగ్జీ లియు (ఆస్ట్రేలియా)తో శ్రీజ ఆడుతుంది. పురుషుల సింగిల్స్లో సత్యన్, శరత్ కమల్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్లో శ్రీజ–రీత్... మనిక బత్రా–దియా చిటాలె (భారత్) జోడీలకు క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. -
భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం.. ఎందులో అంటే..?
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత టీమ్.. తాజాగా పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లోనూ బంగారు పతకం కైవసం చేసుకుంది. సింగపూర్తో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 3-1 తేడాతో విజయం సాధించి టైటిల్ నిలబెట్టుకుంది. తద్వారా భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం, ఓవరాల్గా 11వ పతకం చేరింది. తొలి మ్యాచ్లో హర్మీత్ దేశాయ్- జీ సాథియన్ జోడి 13-11, 1-7, 11-5 తేడాతో యంగ్ ఇజాక్ క్వెక్-యో ఎన్ కోన్ పంగ్ ద్వయంపై విజయం సాధించి భారత ఆధిక్యాన్ని 1-0 పెంచగా.. ఆ తర్వాతి మ్యాచ్లో భారత స్టార్ ఆటగాడు శరత్ కమాల్.. క్లెరెన్స్ చ్యూ చేతిలో 7-11, 14-12, 3-11, 9-11 తేడాతో ఓడిపోయాడు. అనంతరం జీ సాథియన్.. కొన్ పంగ్పై 12-10, 7-11, 11-7, 11-4 తేడాతో గెలుపొంది భారత్కు 2-1 ఆధిక్యం అందించగా.. నాలుగో మ్యాచ్లో హర్మీత్ దేశాయ్.. జెడ్ చ్యూపై 11-8, 11-5,11-6 వరుస సెట్లలో గెలుపొంది భారత్కు గోల్డ్ మెడల్ ఖరారు చేశాడు. చదవండి: CWG 2022: చరిత్ర సృష్టించిన భారత్.. స్వర్ణం నెగ్గిన వుమెన్స్ టీమ్ -
CWG 2022: పతకం రేసులో భారత టీటీ జట్టు
కామన్వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల టీమ్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–0తో బంగ్లాదేశ్ను ఓడించింది. తొలి మ్యాచ్లో హర్మీత్–సత్యన్ జ్ఞానశేఖరన్ ద్వయం 11–8, 11–6, 11–2తో రమిహిమిలన్–అహ్మద్ జంటను ఓడించింది. రెండో మ్యాచ్లో శరత్ కమల్ 11–4, 11–7, 11–2తో రిఫాత్పై గెలిచాడు. మూడో మ్యాచ్లో జ్ఞానశేఖరన్ 11–2, 11–3, 11–5తో అహ్మద్పై నెగ్గి భారత విజయాన్ని ఖాయం చేశాడు. -
Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో మొదటి రోజు భారత ఆటగాళ్ల ప్రదర్శన అంచనాలకు అనుగుణంగానే సాగింది. బలహీన జట్లపై భారత బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ టీమ్లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించగా... హాకీలోనూ ఘన విజయం దక్కింది. ఊహించినట్లుగానే స్విమ్మింగ్, సైక్లింగ్వంటి క్రీడల్లో మనోళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓవరాల్గా ఆస్ట్రేలియా అగ్ర స్థానంతో రోజును ముగించింది. భారత్ ఫలితాలు మహిళల క్రికెట్: తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో భారత్కు తొలి మ్యాచ్లో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (34 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, షఫాలీ వర్మ (33 బంతుల్లో 48; 9 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడింది. అనంతరం ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. పేసర్ రేణుకా సింగ్ (4/18) దెబ్బకు ఆసీస్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే గార్డ్నర్ (35 బంతుల్లో 52 నాటౌట్; 9 ఫోర్లు), గ్రేస్ హారిస్ (20 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టును గెలిపించారు. బ్యాడ్మింటన్: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ 5–0 తేడాతో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ 21–7, 21–12తో మురాద్ అలీపై, మహిళల సింగిల్స్లో పీవీ సింధు 21–7, 21–6తో మహూర్ షహజాద్పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్లో సాత్విక్–చిరాగ్ జోడి 21–12, 21–9 మురాద్ అలీ–ఇర్ఫాన్ సయీద్ను, మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 21–4, 21–5తో మహూర్ షహజాద్–గజాలా సిద్దిఖ్ను ఓడించగా... మిక్స్డ్ డబుల్స్లో సుమీత్ రెడ్డి–పొన్నప్ప ద్వయం 21–9, 21–12తో ఇర్ఫాన్–గజాలా సిద్ధిక్పై ఆధిక్యం ప్రదర్శించింది. టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ విభాగంలో ముందుగా దక్షిణాఫ్రికాను 3–0తో, ఆపై ఫిజీని 3–0తో భారత్ చిత్తు చేసింది. పురుషుల టీమ్ విభాగంలో ముందుగా 3–0 తేడాతో బార్బడోస్పై నెగ్గింది. ∙ పురుషుల బాక్సింగ్ (63.5 కేజీలు) లో శివ థాపా 5–0తో సులేమాన్ బలూచ్ (పాకిస్తాన్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. స్విమ్మింగ్: పురుషుల స్విమ్మింగ్లో శ్రీహరి నటరాజ్ (100 మీ. బ్యాక్స్ట్రోక్)లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 54.68 సెకన్ల టైమింగ్తో రేస్ను పూర్తి చేసిన అతను ముందంజ వేశాడు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్ఫ్లయ్) హీట్స్లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. సైక్లింగ్: మూడు ఈవెంట్లలోనూ భారత సైక్లిస్ట్లు ఫైనల్ చేరడంలో విఫలమయ్యారు. పురుషుల స్ప్రింట్ టీమ్ ఈవెంట్లో రొనాల్డో, రోజిత్, బెక్హామ్, ఎల్కొటొచొంగో బృందం క్వాలిఫికేషన్లో ఆరో స్థానంలో నిలవగా... శశికళ, త్రియాశ, మయూరి సభ్యులుగా ఉన్న మహిళల స్ప్రింట్ టీమ్ కూడా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. విశ్వజీత్, వెంకప్ప, దినేశ్ సభ్యులైన 4000 మీటర్ల పర్సా్యట్ టీమ్ కూడా ఆరో స్థానంలో నిలిచింది. ట్రయథ్లాన్: భారత్నుంచి పేలవ ప్రదర్శన నమోదైంది. పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్లో ఆదర్శ్ మురళీధరన్ 30వ స్థానంలో, విశ్వనాథ్ యాదవ్ 33 స్థానంలో నిలిచి నిష్క్రమించగా... మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్లో ప్రజ్ఞా మోహన్ 26వ స్థానంతో, సంజన జోషి 28వ స్థానంతో సరిపెట్టుకున్నారు. హాకీ: మహిళల లీగ్ మ్యాచ్లో భారత్ 5–0తో ఘనాను చిత్తు చేసింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (3వ నిమిషం, 39వ ని.), నేహ (28వ ని.), సంగీతా కుమారి (36వ ని.), సలీమా టెటె (56వ ని.) గోల్స్ సాధించారు. ఇంగ్లండ్ ఖాతాలో తొలి స్వర్ణం బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం ఆతిథ్య ఇంగ్లండ్ ఖాతాలో చేరింది. పురుషుల ట్రయాథ్లాన్లో ఇంగ్లండ్కు చెందిన అలెక్స్ యీ విజేతగా నిలిచాడు. 50 నిమిషాల 34 సెకన్లలో పరుగు పూర్తి చేసిన యీ అగ్ర స్థానం అందుకోగా...హేడెన్ విల్డ్ (న్యూజిలాండ్), మాథ్యూ హాజర్ (ఆస్ట్రేలియా) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. తొలి రోజు ఆస్ట్రేలియా 2 స్వర్ణాలు, 1 కాంస్యం సాధించగా...ఇంగ్లండ్ 1 స్వర్ణం సహా మొత్తం 5 పతకాలు గెలుచుకుంది. స్కాట్లాండ్, బెర్ముడా ఖాతాలో కూడా ఒక్కో స్వర్ణం చేరాయి. -
తేజస్విన్ పేరును పరిశీలించండి
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ కోసం ఎంపికల రగడ కోర్టుల చుట్టూనే తిరుగుతుంది. టేబుల్ టెన్నిస్లో అయితే భారత జట్టులో చోటు కోసం వరుసబెట్టి క్రీడాకారులు హైకోర్టు తలుపు తట్టారు. తాజాగా పురుష అథ్లెట్ తేజస్విన్ శంకర్ కూడా ఎంపిక విషయమై కోర్టు మెట్లెక్కాడు. అతని పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సెలక్షన్ కమిటీ ఆ హై జంపర్ మెరిట్స్ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)ను ఆదేశించింది. తేజస్విన్ శంకర్ హైజంప్లో జాతీయ రికార్డు (2.29 మీటర్లు) సాధించాడు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న అతను ఇటీవల అక్కడే జరిగిన నేషనల్ కాలేజియట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్లో 2.27 మీటర్ల దూరం ఎత్తుకు ఎగిరి బంగారు పతకం గెలిచాడు. ఏఎఫ్ఐ అర్హత మార్క్ కూడా 2.27 మీటర్లే! అయితే ఏఎఫ్ఐ అమెరికా పోటీల విషయమై శంకర్ తమను సంప్రదించలేదనే అహంతో... అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొనలేదన్న కారణంతో బర్మింగ్హామ్ ఈవెంట్కు ఎంపిక చేయలేదు. దీనిపై విచారించిన జస్టిస్ జస్మిత్ సింగ్ ఇలాంటి అహం, భేషజాలను పక్కనబెట్టి అతని ప్రతిభను గుర్తించి కామన్వెల్త్ గేమ్స్కు ఎంపిక చేయాలని కేంద్ర క్రీడాశాఖ, ఏఎఫ్ఐకు నోటీసులు జారీ చేసింది. -
ప్రపంచ ఆరో ర్యాంకర్పై సత్యన్ విజయం
వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత నంబర్వన్ సత్యన్ జ్ఞానశేఖరన్ సంచలనం సృష్టించాడు. క్రొయేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సత్యన్ తొలి రౌండ్లో 6–11, 12–10, 11–9, 12–10తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జార్జిక్ డార్కో (స్లొవేనియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టాప్–10 ర్యాంకింగ్స్ లోని క్రీడాకారుడిని ఓడించడం సత్యన్ కెరీర్లో ఇది రెండోసారి. -
కామన్వెల్త్ బెర్తు కోసం కోర్టుకెక్కిన టీటీ ప్లేయర్లు
న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్లో మరో క్రీడాకారిణి కామన్వెల్త్ గేమ్స్ బెర్తు కోసం కోర్టుకెక్కింది. డబుల్స్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన అర్చన కామత్ తనను జాతీయ జట్టు నుంచి తప్పించడంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక విషయమై కోర్టుకెక్కిన నాలుగో ప్లేయర్ అర్చన. గతంలో దియా, మానుశ్ షా, స్వస్తిక ఘోష్లు కూడా కోర్టు తలుపు తట్టారు. ప్రస్తుతం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) వ్యవహారాలను పరిపాలక మండలి (సీఓఏ) పర్యవేక్షిస్తోంది. తొలుత టీటీఎఫ్ఐ సెలక్టర్లు అర్చనను ఎంపిక చేశారు. కానీ ఆమె ఇటీవలి ప్రదర్శన బాగోలేదంటూ బర్మింగ్హామ్ ఈవెంట్ నుంచి ఉన్నపళంగా తప్పించారు. చదవండి: 'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్టుతో సంబంధం అంటగట్టి'.. మాజీ సైక్లింగ్ కోచ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు -
‘కామన్వెల్త్’ టీటీ ప్రాబబుల్స్లో స్నేహిత్, శ్రీజ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్హమ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను ఎంపిక చేసేందుకు 16 మంది క్రీడాకారులతో కూడిన ప్రాథమిక జాబితాను ప్రకటించారు. ఈనెల 23 నుంచి 30 వరకు బెంగళూరులో జరిగే శిక్షణ శిబిరం తర్వాత తుది జట్లను ఎంపిక చేస్తారు. ప్రాబబుల్స్లో ప్రస్తుత జాతీయ మహిళల సింగిల్స్ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ... తెలంగాణకే చెందిన యువతార సూరావజ్జుల స్నేహిత్లకు చోటు లభించింది. ఇప్పటివరకు ఐదు కామన్వెల్త్ గేమ్స్లో కలిపి భారత టీటీ క్రీడాకారులు మొత్తం ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలు సాధించారు. -
శ్రీజ ‘డబుల్’ ధమాకా
షిల్లాంగ్ (మేఘాలయ): కొన్నేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ అందని ద్రాక్షగా ఉన్న జాతీయ సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎట్టకేలకు అందుకుంది. అంతేకాకుండా మహిళల డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. గత ఏడాది సింగిల్స్లో కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ 23 ఏళ్ల శ్రీజ ఈసారి చాంపియన్గా అవతరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హైదరాబాద్ బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీజ ఈ మెగా ఈవెంట్లో ఆర్బీఐ తరఫున బరిలోకి దిగింది. సోమవారం సాయంత్రం జరిగిన సింగిల్స్ ఫైనల్లో ఆకుల శ్రీజ 11–8, 11–13, 12–10, 11–8, 11–6తో భారత సీనియర్ స్టార్ ప్లేయర్, మౌమా దాస్పై విజయం సాధించింది. బెంగాల్కు చెందిన 38 ఏళ్ల మౌమా దాస్ ఐదుసార్లు జాతీయ సింగిల్స్ చాంపియన్గా నిలువడంతోపాటు అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడ్డ భారత, ఆసియా ప్లేయర్గా గుర్తింపు పొంది ంది. సెమీఫైనల్లో శ్రీజ 12–10, 8–11, 11–8, 11–9, 3–11, 12–10తో అహిక ముఖర్జీ (ఆర్బీఐ) పై నెగ్గింది. అంతకుముందు జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీజ–అహిక ముఖర్జీ (ఆర్బీఐ) ద్వయం 3–11, 11–9, 11–5, 12–10తో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు చెందిన టకేమి సర్కార్–ప్రాప్తి సేన్ జోడీపై గెలిచింది. తాజా విజయంతో శ్రీజ జాతీయ సీనియర్ టీటీ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్గా ఘనత వహించింది. గతంలో హైదరాబాద్కు చెందిన సయీద్ సుల్తానా ఆరుసార్లు (1949, 1950, 1951, 1952, 1953, 1955) జాతీయ మహిళల సింగిల్స్ చాంపియన్గా నిలిచింది. అయితే సుల్తానా కుటుంబం 1956లో హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కు వలస వెళ్లి అక్కడే స్థిర పడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరా బాద్కు చెందిన మీర్ ఖాసిమ్ అలీ రెండుసార్లు (1968, 1969) చాంపియన్గా నిలిచారు. నా కల నిజమైంది... గతంలో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో జాతీయ టైటిల్స్ సాధించాను. కానీ సింగిల్స్ విభాగంలో తొలిసారి జాతీయ చాంపియన్ కావడంతో నా చిరకాల స్వప్నం నెరవేరింది. తాజా విజయం త్వరలో మొదలయ్యే అంతర్జాతీయ సీజన్ లో మరింత మెరుగ్గా రాణించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. –‘సాక్షి’తో ఆకుల శ్రీజ -
రోడ్డు ప్రమాదంలో యువ ప్లేయర్ దుర్మరణం
Tamil Nadu Table Tennis Player Passed Away: తమిళనాడుకు చెందిన యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీనదయాళన్ (18) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విశ్వ మరో ఐదుగురు కలిసి 83వ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు గౌహతి నుండి షిల్లాంగ్కు వెళ్తుండగా (టాక్సీలో) ఈ ఘోరం సంభవించింది. ఈ ప్రమాదంలో విశ్వతో పాటు కారు డ్రైవర్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదలగా, మిగతా ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. Saddened to learn that Tamil Nadu paddler, Deenadayalan Vishwa passed away after an accident in Ri Bhoi District while on his way to Shillong to participate in the 83rd Senior National Table Tennis Championship in our State@ianuragthakur @KirenRijiju @mkstalin @CMOTamilnadu pic.twitter.com/sGvAc3eDhe — Conrad Sangma (@SangmaConrad) April 17, 2022 ఈ విషయాన్ని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. విశ్వ అకాల మరణం పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా సంతాపం వ్యక్తం చేశారు. షిల్లాంగ్ వేదికగా జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఇవాల్టి (ఏప్రిల్ 18) నుంచి ప్రారంభమైంది. కాగా, విశ్వ.. అండర్-19 అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున అనేక పతకాలు సాధించాడు. ఈనెల 27 నుంచి ఆస్ట్రియాలోని లింజ్లో జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో అతను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండింది. చదవండి: VVS Laxman: క్రీడలపై మక్కువతోనే క్రికెటర్నయ్యా.. -
మనిక జంటకు కాంస్యం.. సాయిప్రణీత్ శుభారంభం.. రెండో రౌండ్లో సౌజన్య
న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్ టోర్నీలో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జంట కాంస్య పతకం సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మనిక–అర్చన ద్వయం 8–11, 6–11, 7–11తో చెంగ్ ఐ చింగ్–లియు జున్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో మనిక–అర్చన తమ సర్వీస్లో ఏకంగా 16 పాయింట్లు కోల్పోయారు. ఇతర క్రీడాంశాలు.. సాయిప్రణీత్ శుభారంభం పారిస్: ఓర్లియన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అతను బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 21–19, 21–12తో జాన్ లూడా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో కెయుర మోపాటి (భారత్) 21–16, 7–21, 15–21తో వెన్ జు జాంగ్ (కెనడా) చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండో రౌండ్లో సౌజన్య కాన్బెర్రా: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సౌజన్య బవిశెట్టి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. జో హైవ్స్ (ఆస్ట్రేలియా)తో జరిగిన తొలి రౌండ్లో సౌజన్య తొలి సెట్ను 2–6తో కోల్పోయి, రెండో సెట్ను 6–4 తో గెల్చుకుంది. మూడో సెట్లో సౌజన్య 1–0 తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగింది. చదవండి: IPL 2022- RCB Vs KKR: బెంగ తీర్చిన హసరంగ -
ఎఫ్సీఐ స్పోర్ట్స్ మీట్: రన్నరప్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) సౌత్జోన్ ఇంటర్ రీజినల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ (టీటీ) స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ జట్టు రన్నరప్గా నిలిచింది. టీటీ మహిళల సింగిల్స్లో రత్న స్వప్న (తెలంగాణ) విజేతగా, పరిమళ కిశోరి (తెలంగాణ) రన్నరప్గా నిలిచారు. డబుల్స్లో రత్న స్వప్న–పరిమళ జంట టైటిల్ సొంతం చేసుకుంది. ఎఫ్సీఐ (రీజియన్) జనరల్ మేనేజర్ దీపక్ శర్మ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో వంశీ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) టైటిల్ గెలిచాడు. పురుషుల డబుల్స్లో వంశీ కుమార్ రెడ్డి–చైతన్య (ఆంధ్రప్రదేశ్) జోడీ టైటిల్ను సొంతం చేసుకుంది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
శ్రీజ జోడీకి కాంస్యం
మస్కట్ (ఒమన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ మస్కట్ కంటెండర్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల డబుల్స్లో కాంస్య పతకం నెగ్గింది. సెమీఫైనల్లో శ్రీజ–సెలీనా (భారత్) జంట 4–11, 6–11, 10–12తో సుతీర్థ–అహిక (భారత్) ద్వయం చేతిలో ఓడింది. ఫైనల్లో సుతీర్థ–అహిక జోడీ 6–11, 11–8, 10– 12, 7–11తో జాంగ్ రుయ్–కుయ్ మాన్ (చైనా) జంట చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. -
ఆత్మవిశ్వాసమే ఆలంబన.. మహిళా పారాలింపియన్లు
అంగవైకల్యం శాపం అన్న భావనను వీడి మనోధైర్యమే బాసటగా విజయశిఖరాలను అధిరోహిస్తున్నారు. భారతదేశ మహిళా పారాలింపియన్లు. ప్రపంచ క్రీడలో మన ఖ్యాతిని చాటుతున్నారు. టెన్నిస్ నుండి షాట్ పుట్ వరకు భారతదేశానికి అనేక పతకాలు తీసుకొచ్చారు. వైకల్యపు మూస పద్ధతులను తొలగించుకుంటూ అనన్య బన్సాల్, అవని లేఖర, భావినా పటేల్, ఏక్తా భ్యాన్, రుబినా ప్రాన్సిస్ లు.. మనందరికీ రోల్మోడల్గా నిలుస్తున్నారు. బంగారు అవని 2021 పారాలింపిక్లో భారత స్వర్ణ పతక విజేతగా నిలిచిన అవని లేఖర ఈ యేడాది ప్రతిష్టాత్మక ఖేల్రత్న అవార్డును కూడా అందుకుంది. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఫైనల్ ఈవెంట్లో 149.6 స్కోర్తో స్వర్ణం సాధించి సరికొత్త పారాలింపిక్ రికార్డ్ను నెలకొల్పింది అవని. పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదానికి గురైన అవని 2012లో నడుము క్రింది భాగం పక్షవాతానికి లోనైంది. రాజస్థాన్లో లా చదువుతున్న విద్యార్థి. ఆమె తండ్రి ఆమెను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాడు. రజతం అనన్య మేధోపరమైన లోపం ఉన్న అథ్లెట్ అనన్య బన్సాల్. కిందటివారం బహ్రెయిన్లోని మనామాలో ఆసియా యూత్ పారాలింపిక్ గేమ్స్ జరిగాయి. ఈ పారాలింపిక్లో 30 దేశాల నుంచి 23 ఏళ్ల వయసు లోపు వారు పాల్గొన్నారు. వీరిందరితో పోటీపడి ఎఫ్–20 విభాగం షాట్పుట్లో భారత్కి తొలి రజత పతకాన్ని సాధించింది అనన్య. భారత్లోని మొహాలీకి చెందిన అనన్య బన్సాల్ సాధించిన ఘనతకు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దీపామాలిక ‘ఒక అమ్మాయి భారతదేశ ఖ్యాతిని నిలుపుతూ తొలి ఖాతాను తెరిచింది. విజయాన్ని జరుపుకోవడానికి ఇది సరైన రోజు’ అంటూ ప్రశంసించారు. పతకాల భావినా పటేల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్. 2020 టోక్యోలో పారాలింపిక్స్లో రజత పతకాన్ని సాధించింది. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అనేక పతకాలు సాధించి వార్తల్లో నిలిచింది. 12 ఏళ్ల వయసులో పోలియో బారిన పడిన భావినా గుజరాత్లోని సుంధియా అనే చిన్న గ్రామం నుండి వచ్చిన మహిళ. టోక్యో విజయగాథలలో ఆమె విజయం ఒక మైలురాయి. క్లబ్ త్రో ఏక్తాభ్యాన్ కారు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని, చక్రాల కుర్చీకే పరిమితమైన ఏక్తాభ్యాన్ క్లబ్ త్రో అథ్లెట్గా టోక్యో 2020 పారాలింపిక్స్కు చేరుకునేంతగా తనను తాను మలుచుకుంది. తన కలలను సాకారం చేసుకునేందుకు ఆత్మవిశ్వాసాన్నే పెట్టుబడిగా పెట్టింది. ‘మొదట క్రీడల గురించి ఆలోచించలేదు. ఎప్పుడూ విద్యావేత్తలతో సంభాషించడానికి ఇష్టపడేదాన్ని. నా వైకల్యం రోజువారి పనులకు కూడా సవాల్ మారింది. ఫిట్నెస్ మెరుగుపరుచుకోవడానికి క్రీడలను ఎంచుకున్నాను. అందులో భాగంగా క్లబ్ త్రో నా సాధనలో భాగమైంది’ అని అనందంగా చెబుతుంది ఏక్తా. షూటర్ రుబినా ఫ్రాన్సిస్ భారతీయ పారా పిస్టల్ షూటర్గా వార్తల్లో నిలిచింది రుబినా ఫ్రాన్సిస్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి ఐదవ స్థానంలో ఉంది. 2018లో ఆసియా పారా గేమ్స్లో పాల్గొంది. జబల్పూర్లోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో ఈ క్రీడను సాధన చేసింది రుబినా. ‘స్కూల్ చదువుతో పాటు మరేదైనా చేయాలనుకున్నాను. షూటింగ్ అకాడమీకి చెందిన వారు తమ ప్రచారంలో భాగంగా ఓ రోజు మా స్కూల్కు వచ్చారు. ఈ విషయం మా నాన్నకు చెప్పి, రిజిస్టర్ చేయించుకున్నాను. ఎంపికయ్యాను. దీంతో ఈ క్రీడలో ఆసక్తి పెరిగింది’ అని చెబుతుంది రుబినా. విధి చిన్నచూపు చూసిందని వీధి వాకిలివైపు కూడా చూడని ఎంతోమందికి ఈ మగువల సాధన ఓ దిక్సూచి. మనోబలమే కొండంత అండగా సాగుతున్న వీరి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. చదవండి: IND vs SA: ఆ ముగ్గురు ఆటగాళ్లకి ఇదే చివరి ఛాన్స్! -
పాయస్ జైన్కు పతకం ఖాయం
ప్రపంచ యూత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత్కు రెండో పతకం ఖరారైంది. పోర్చుగల్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అండర్–19 బాలుర సింగిల్స్లో భారత ప్లేయర్ పాయస్ జైన్ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పాయస్ జైన్ 11–9, 11–8, 11–8, 8–11, 11–4తో నవీద్ షమ్స్ (ఇరాన్)పై గెలిచాడు. అండర్–15 బాలికల డబుల్స్లో సుహానా సైనీ (భారత్)–వెరోనికా (ఉక్రెయిన్) జంట సెమీఫైనల్లో ఓడి కాంస్యం దక్కించుకుంది. -
అమెరికాలో ప్రపంచ టీటీ చాంపియన్షిప్
హ్యూస్టన్ (అమెరికా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ నేటి నుంచి అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో జరగనుంది. వారంరోజుల పాటు జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, ఆంథోనీ అమల్రాజ్ పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో మనిక బత్రా, సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, మధురిక, అర్చన కామత్ బరిలో ఉన్నారు. -
మనిక బత్రాకు క్లీన్చిట్ ఇవ్వండి
న్యూఢిల్లీ: క్రీడా సమాఖ్యలు క్రీడాకారులను అనవసరంగా వేధించడం ఆపాలని ఢిల్లీ హైకోర్డు ఆదేశించింది. స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బత్రాకు క్లీన్చిట్ ఇవ్వాలని భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ)ను ఆదేశించింది. ఆసియా చాంపియన్షిప్లో ఆడకుండా ఉద్దేశపూర్వకంగానే తనను జట్టు నుంచి తప్పించారని, కోచ్ సౌమ్యదీప్ రాయ్ తన శిష్యురాలికి ఒలింపిక్ బెర్త్ కోసం తనను మ్యాచ్లో ఓడిపోవాలని ఒత్తిడి చేశారని మనిక గత నెలలో హైకోర్టును ఆశ్రయించింది. అప్పుడు జస్టిస్ రేఖ పల్లి ప్లేయర్ ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా క్రీడా శాఖను ఆదేశించగా... సీల్డు కవర్లో నివేదికను కోర్టుకు సమరి్పంచింది. ఇందులో ఆమె వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని తేలడంతో ఢిల్లీ హైకోర్టు సోమ వారం విచారణ సందర్భంగా టీటీఎఫ్ఐపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘సమాఖ్య తీరుపట్ల నిరాశ చెందాను. కారణం లేకుండానే ఒక క్రీడాకారిణిని వివాదాల్లోకి లాగు తున్నారు. ఇది సమంజసం కాదు. క్రీడాశాఖ నివేదిక చదివాను. ఆమెకు జారీచేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోండి. క్లీన్చిట్ ఇచ్చి భారత జట్టుకు ఎంపిక చేయండి’ అని ఆదేశిస్తూ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది. -
వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫైనల్లో మనిక, అర్చన జోడీ
లాస్కో (స్లొవేనియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) కంటెండర్ టోర్నమెంట్లో భారత్కు చెందిన మనిక బత్రా–అర్చన కామత్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మనిక–అర్చన ద్వయం 11–6, 8–11, 11–6, 5–11, 11–8తో లియు వెషన్–యిది వాంగ్ (చైనా) జోడీపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో మెలానీ–అద్రియానా దియాజ్ (ప్యూర్టోరికో) జంటతో మనిక–అర్చన జోడీ తలపడుతుంది. సింగిల్స్ సెమీఫైనల్లో మనిక 2–4తో యిది వాంగ్ చేతిలో ఓడి కాంస్య పతకం సాధించింది. చదవండి: T20 World Cup 2021: దురదృష్టం అంటే ఇదే..! మ్యాచ్ గెలిచినా సఫారీ జట్టు ఇంటికి.. ఎందుకంటే? -
ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫైనల్లో సత్యన్–హర్మీత్ జోడీ
సంజీత్ ముందంజ బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు సంజీత్ (92 కేజీలు), ఆకాశ్ (54 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో సంజీత్ 4–1తో ఆండ్రీ స్టోట్స్కీ (రష్యా)పై గెలిచాడు. ఆకాశ్తో తలపడాల్సిన జర్మనీ బాక్సర్ ఒమర్ సలాహ్ అస్వస్థత కారణంగా బరిలోకి దిగకపోవడంతో ఆకాశ్కు ‘వాకోవర్’ లభించింది. జ్వరం కారణంగా భారత బాక్సర్ వరీందర్ (60 కేజీలు) టోర్నీ నుంచి వైదొలిగాడు. ఫైనల్లో సత్యన్–హర్మీత్ జోడీ ట్యూనిస్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) కంటెండర్ ట్యూనిస్ ఓపెన్లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ (భారత్) జంట టైటిల్కు విజయం దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సత్యన్–హర్మీత్ ద్వయం 8–11, 12–14, 11–9, 11–8, 11–9తో నాందోర్ ఎసెకి–ఆడమ్ జుడి (హంగేరి) జంటపై గెలిచింది. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: భేష్.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్ -
కోచ్ కావాలనే ఓడిపోమన్నాడు.. మనికా బాత్రాపై చర్యలు!
Manika Batra: టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీల్లో తనను కావాలనే ఓడిపోమన్నాడంటూ భారత కోచ్ సౌమ్యదీప్ రాయ్పై ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు చేసిన టీటీ ప్లేయర్ మనికా బాత్రా చిక్కులో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా ఈ వివాదంపై దృష్టి పెట్టిన అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) విచారణ జరుపుతోంది. ఇప్పటికే దీనిపై సమావేశం నిర్వహించిన ఐటీటీఎఫ్, మనికాపై చర్యలు తీసుకోవచ్చు. చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే -
టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత జట్టుకు కాంస్యం..
దోహా: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. టోర్నీలో సెమీస్ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకం దక్కుతుంది. తొలి మ్యాచ్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 12–10, 8–11, 5–11తో 12వ ర్యాంకర్ వూజిన్ జాంగ్ చేతిలో ఓడాడు. రెండో మ్యాచ్లో ఆచంట శరత్ కమల్ 11–7, 13–15, 11–8, 6–11, 9–11తో లీ సాంగసూ చేతిలో పోరాడి ఓడాడు. ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మూడో మ్యాచ్లో హర్మీత్ దేశాయ్ 4–11, 11–9, 11–8, 6–11, 11–13తో చో సీంగ్మిన్ చేతిలో ఓటమి చవిచూశాడు. మరోవైపు మహిళల టీమ్ విభాగంలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 3–1తో థాయ్లాండ్పై నెగ్గి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. చదవండి: Poonam Raut: పూనమ్ క్రీడా స్ఫూర్తికి ఆసీస్ క్రికెటర్ ఫిదా.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’ -
అంతర్జాతీయ హాకీకి భారత స్టార్ ప్లేయర్ గుడ్బై..
Sv Sunil Retires From International Hockey: భారత స్టార్ ప్లేయర్ ఎస్వీ సునీల్ అంతర్జాతీయ హాకీ కెరీర్కు గుడ్బై చెప్పాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల సునీల్... తన 14 ఏళ్ల కెరీర్లో 264 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి 72 గోల్స్ చేశాడు. 2012, 2016 ఒలింపిక్స్లో ఆడిన సునీల్ టోక్యో గేమ్స్కు మాత్రం ఎంపిక కాలేదు. 2014 ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన భారత టీమ్లో సునీల్ సభ్యుడిగా ఉన్నాడు. చదవండి: Viral Video: సచిన్ను చూసాక ఇషాన్ కిషన్ రియాక్షన్.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్ -
సంచలన ఆరోపణలు.. ఢిల్లీ హైకోర్టులో మనిక బత్రాకు భారీ ఊరట
న్యూఢిల్లీ: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఎంపిక నిర్ణయంపై గురువారం స్టే విధించింది. జాతీయ శిబిరంలో పాల్గొన్న వారినే ఎంపిక చేయాలనే నిబంధనకు ఈ స్టే వర్తిస్తుంది. అంటే ఇకపై అంతర్జాతీయ టోర్నీలకు ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. జాతీయ శిబిరానికి హాజరు, గైర్హాజరుతో సంబంధం ఉండదు. అలాగే మనిక చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కూడా కోర్టు కేంద్ర క్రీడాశాఖను ఆదేశించింది. కాగా ఒలింపిక్ క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా సుతీర్థ ముఖర్జీ కోసం జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ తనను ఓడిపోవాలని సూచించారని మనిక ఆరోపించింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. దీనిపై గురువారం విచారించిన జస్టిస్ రేఖ పల్లి టీటీఎఫ్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన సమాఖ్యకు నోటీసు జారీ చేయాల్సిందిగా ఆర్డర్ పాస్ చేస్తానని అన్నారు. ఓ మేటి క్రీడాకారిణి ఆరోపణలపై తదుపరి చర్యలు చేపట్టకుండానే జాతీయ శిబిరంలో తప్పనిసరిగా పాల్గొంటేనే ఎంపిక చేస్తామని ఎలా అంటారని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది క్రీడాశాఖ విచారణ చేపడుతుందని కోర్టుకు విన్నవించారు. చదవండి: Naomi Osaka: మళ్లీ ఎప్పుడు ఆడతానో తెలీదు.. నిరవధిక విరామం -
తెలంగాణ కుర్రాడు.. స్నేహిత్ ఖాతాలో రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: కజకిస్తాన్ ఓపెన్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు సూరావజ్జుల స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో రజతం... డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 6–11, 9–11, 3–11, 11–9, 6–11తో 46వ ర్యాంకర్ కిరిల్ జెరాసిమెంకో (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశాడు. డబుల్స్ సెమీఫైల్లో స్నేహిత్–సుదాన్షు గ్రోవర్ (భారత్) జోడీ 11–8, 2–11, 6–11, 12–10, 5–11తో జెరాసిమెంకో–అలెన్ (కజకిస్తాన్) జంట చేతిలో ఓడి కాంస్య పతకం దక్కించుకుంది. చదవండి: RCB Vs KKR: కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు -
కోచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. భారత స్టార్ ప్లేయర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్పై స్టార్ ప్లేయర్ మనికా బత్రా సంచలన ఆరోపణలు చేసింది. దోహా వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్లో జాతీయ కోచ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నాడని ఆమె ఆరోపించింది. అయితే అందుకు తాను అంగీకరించలేదని, టోక్యో ఒలింపిక్స్లో అందుకే అతని సహాయం తీసుకోలేదని టీటీ సమాఖ్యకు నివేదించింది. ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకు కావాల్సిన సాక్షాధారాలు తన దగ్గరున్నాయని, సరైన సమయంలో వాటిని అధికారుల ముందుంచుతానని పేర్కొంది. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై మాట్లాడేందుకు కోచ్ నా వ్యక్తిగత హోటల్ గదికి వచ్చాడని, తాను మాట వినకపోవడంతో బెదిరింపులకు దిగాడని, ఓ శిష్యురాలు కోసమే ఆయన ఇదంతా చేశాడని వెల్లడించింది. కాగా, జాతీయ కోచ్పై మనికా బత్రా చేసిన ఆరోపణలపై టీటీఎఫ్ఐ విచారణ చేపట్టకపోవడం పలు అనుమానలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన ప్రపంచ 56వ ర్యాంకర్ మనికా బాత్రా మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఒలింపిక్స్ సందర్భంగా నేషనల్ కోచ్ సేవలను తిరస్కరించడంపై అప్పట్లో టేబుల్ టెన్నిస్ సమాఖ్య మనికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చదవండి: వారెవ్వా క్యా సీన్ హై.. ట్రాక్పైనే అంధ అథ్లెట్కు లవ్ ప్రపోజల్ -
Bhavinaben Patel: రజత సంబరం
జాతీయ క్రీడా దినోత్సవాన టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఒకేరోజు ఏకంగా మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భవీనాబెన్ పటేల్ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–47 విభాగంలో నిశాద్ కుమార్ కూడా రజత పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో ఎఫ్–52 విభాగంలో భారత ప్లేయర్ వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. అయితే వినోద్తో పోటీపడిన ప్రత్యర్థులు అతడి వైకల్యం స్థాయిపై సందేహం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. దాంతో డిస్కస్ త్రో ఫలితాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పతకాల ప్రదానోత్సవాన్ని నేటికి వాయిదా వేశారు. నేడు ఫిర్యాదుపై విచారించి వినోద్కు పతకం ఇవ్వాలా వద్దా అనేది నిర్వాహకులు తేలుస్తారు. టోక్యో: ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్కు నిరాశ ఎదురైంది. టోక్యో పారాలింపిక్స్లో భాగంగా ఆదివారం జరిగిన టీటీ మహిళల సింగిల్స్ క్లాస్–4 విభాగం ఫైనల్లో భవీనాబెన్ పటేల్ 7–11, 5–11, 6–11తో ప్రపంచ నంబర్వన్ యింగ్ జౌ (చైనా) చేతిలో ఓడిపోయింది. 19 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో యింగ్ జౌ నిలకడగా పాయింట్లు స్కోరు చేసింది. లీగ్ దశలోనూ యింగ్ జౌతో జరిగిన మ్యాచ్లో భవీనా పరాజయం చవిచూసింది. ఓవరాల్గా ఎలాంటి అంచనాలు లేకుండా తొలిసారి పారాలింపిక్స్లో పోటీపడిన గుజరాత్కు చెందిన 34 ఏళ్ల భవీనా అబ్బురపరిచే ఆటతీరుతో ఎవరూ ఊహించని విధంగా రజత పతకాన్ని సాధించింది. రజత పతకం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. అయితే పతకం స్వర్ణమై ఉంటే ఇంకా సంతోషం కలిగేది. తమ సామర్థ్యంపై నమ్మకం ఉంటే మహిళలు ఎన్నో అద్భుతాలు చేయగలరు. రియో పారాలింపిక్స్కు అర్హత సాధించినా సాంకేతిక కారణాలతో నేను ఆ క్రీడలకు దూరమయ్యాను. ‘రియో’లో చేజారిన అవకాశం నాలో కసిని పెంచింది. పతకం గెలిచేందుకు దోహదపడింది. వైకల్యం కారణంగా నేను జీవితంలో పడిన ఇబ్బందులు తర్వాతి తరంవారు ఎదుర్కోకూడదని కోరుకుంటున్నాను. దైనందిన జీవితంలో దివ్యాంగులకు ప్రతి చోటా క్లిష్ట పరిస్థితులే ఎదురవుతాయి. ఉద్యోగాలతోపాటు ఇతర రంగాల్లోనూ వారికి సముచిత స్థానం ఇవ్వాలి. నా పతకం ద్వారా దివ్యాంగులకు ఏదైనా మేలు జరిగితే అంతకంటే సంతోషం మరోటి ఉండదు. –భవీనాబెన్ పటేల్ విశేష ప్రదర్శనతో భవీనా చరిత్ర లిఖించింది. దేశానికి రజతం అందించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. యువతను క్రీడలవైపు ఆకర్షించేలా చేస్తుంది. –ప్రధాని మోదీ -
శెబ్బాష్ భవీనా.. ఈమె జీవితం నేర్చుకోవాల్సిన పాఠం
Bhavina Patel Wins Silver Medal: తొందరపడితే చరిత్రను తిరగరాయలేం.. ఊరికే చరిత్రను సృష్టించలేం.. ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా డైలాగ్. అయితే నిజ జీవితంలోనూ ఇది అక్షర సత్యమని నిరూపించింది భవీనాబెన్ పటేల్. టోక్యో పారాలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో తొలి పతకం(రజతం) సాధించి చరిత్ర సృష్టించిన భవీనాబెన్ పటేల్.. అందుకోసం పడ్డ కష్టం, గెలుపు కోసం పడ్డ తాపత్రయం ఎందరికో స్ఫూర్తిదాయకం కూడా.. సాక్షి, వెబ్డెస్క్: టోక్యో పారాలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ మహిళ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్లో మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే తొలిసారి. సెమీస్లో చేరినప్పుడే ఆమెకు పతకం ఖాయమైనప్పటికీ శనివారం జరిగిన సెమీస్ పోరులో గెలిచిన భవీనా ఫైనల్కు అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో గెలిస్తే బంగారు పతకాన్ని గెలిచే అవకాశం వచ్చింది. అయితే తుది పోరులో చైనా క్రీడాకారిణి.. ప్రపంచ నెంబర్వన్.. చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. టోక్యో పారాలింపిక్స్లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్ పటేల్ జీవితం ఒక ఆదర్శం. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ.. ఒడిదుడుకులతో విజయాలు సాధించింది. చదవండి: Tokyo Paralympics: భవీనాబెన్ పటేల్కు రజతం An accomplishment that will echo through #IND 🗣️ Bhavina Patel receives her medal as she wins the nation's first #silver in #ParaTableTennis at the #Tokyo2020 #Paralympics ❤️pic.twitter.com/l4xzgHpYWK — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021 పోలియో బారిన పడి... గుజరాత్లోని వాద్నగర్కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్షిప్లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. ప్రస్తుతం ఆమె సాధించిన విజయానికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. -
Tokyo Paralympics: పారాలింపిక్స్లో భారత్కు తొలి పతకం
టోక్యో: పారాలింపిక్స్లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల టేబుల్ టెన్నిస్ ఫైనల్లో ఓడిన భవీనాబెన్ పటేల్ రజతం గెలిచింది. ఫైనల్లో నంబర్వన్.. చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. అయితే పారాలింపిక్స్ చరిత్రలో టేబుల్ టెన్నిస్లో భారత్కి పతకం దక్కడం ఇదే మొదటిసారి. పారాలింపిక్స్లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భవీనాబెన్ పటేల్ను అభినందించారు. చదవండి: సీజన్లో తొలి టైటిల్కు విజయం దూరంలో... గుజరాత్లోని వాద్నగర్కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. చదవండి: మూడో టెస్టులో టీమిండియా పరాభవం -
Tokyo Paralympics: టేబుల్ టెన్నిస్ ఫైనల్స్కు భవీనాబెన్
టోక్యో: పారాలింపిక్స్లో భారత్కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి జాంగ్ మియావోను 3-2 తేడాతో ఓడించింది. ఈ విజయంతో భవానిబెన్ దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భవీనాబెన్ సెమీఫైనల్లో ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. చైనాకు చెందిన జాంగ్ మియావోను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో ఓడించింది. దాదాపుగా 34 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తన సత్తా ఏంటో చూపించింది. తొలి గేములో భవీనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఐతే మంచి లయలో ఉన్న ఆమె వెంటనే పుంజుకుంది. వరుసగా రెండు గేములు కైవసం చేసుకొని 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో గేమ్ను ఆమె కేవలం 4 నిమిషాల్లో గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. చదవండి: Tokyo Paralympics 2021: భళా భవీనా... గుజరాత్లోని వాద్నగర్కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. -
Tokyo Paralympics 2021: భారత్కు తొలి పతకం ఖరారు
గత నెలలో టోక్యో సమ్మర్ ఒలింపిక్స్లో మహిళా వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను ప్రదర్శనతో భారత్ పతకాల బోణీ కొట్టగా... తాజాగా టోక్యోలోనే జరుగుతున్న దివ్యాంగుల విశ్వ క్రీడల్లోనూ (పారాలింపిక్స్) మహిళా క్రీడాకారిణి ద్వారానే భారత్ పతకాల ఖాతా తెరిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా పారాలింపిక్స్లో పతకం అందించనున్న తొలి భారతీయ టీటీ ప్లేయర్గా 34 ఏళ్ల భవీనాబెన్ కొత్త చరిత్ర లిఖించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ మియావో జాంగ్తో భవీనాబెన్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భవీనా స్వర్ణ–రజత పతకాల కోసం ఫైనల్లో ఆడుతుంది. సెమీస్లో ఓడిపోతే మాత్రం కాంస్య పతకం లభిస్తుంది. టోక్యో: పారాలింపిక్స్ క్రీడల మూడో రోజు భారత మహిళా టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ శుభవార్త వినిపించింది. మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భవీనా కేవలం 18 నిమిషాల్లో 11–5, 11–6, 11–7తో 2016 రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ బొరిస్లావా పెరిచ్ రాన్కోవిచ్ (సెర్బియా)పై సంచలన విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ భారత నంబర్వన్ 12–10, 13–11, 11–6తో జాయ్స్ డి ఒలివియెరా (బ్రెజిల్)ను ఓడించింది. నడుము కింది భాగం అచేతనంగా మారిన వారు క్లాస్–4 విభాగం పరిధిలోకి వస్తారు. తొలిసారి పారాలింపిక్స్లో ఆడుతున్న గుజరాత్కు చెందిన 34 ఏళ్ల భవీనా సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది. పారాలింపిక్స్ టీటీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు అందజేస్తారు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్, 2016 రియో పారాలింపిక్స్ రజత పతక విజేత మియావో జాంగ్ (చైనా)తో భవీనా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో మియావో జాంగ్ 11–0తో భవీనాపై ఆధిక్యంలో ఉండటం విశేషం. జియోడాన్ జు (చైనా), యింగ్ జై (చైనా) మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. పోలియో బారిన పడి... గుజరాత్లోని వాద్నగర్కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్షిప్లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. సకీనాకు ఐదో స్థానం పారాలింపిక్స్ పవర్ లిఫ్టింగ్లో మహిళల 50 కేజీల విభాగంలో సకీనా ఖాతూన్ ఐదో స్థానంలో నిలిచింది. ఆమె 93 కేజీలు బరువెత్తింది. పురుషుల 65 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జైదీప్ మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. షాట్పుట్లో నిరాశ పురుషుల అథ్లెటిక్స్ ఎఫ్–54 షాట్పుట్ ఈవెంట్లో భారత ప్లేయర్ టెక్ చంద్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పారాలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన టెక్ చంద్ ఇనుప గుండును 9.04 మీటర్ల దూరం విసిరాడు. బ్రెజిల్కు చెందిన వాలెస్ సాంతోస్ ఇనుప గుండును 12.63 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. శుభారంభం.... ఆర్చరీ పురుషుల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్ లో భారత ఆర్చర్ రాకేశ్ కుమార్ 699 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో, శ్యామ్ సుందర్ స్వామి 682 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పురుషుల రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు వివేక్ 609 పాయింట్లు స్కోరు చేసి పదో స్థానంలో, హర్వీందర్ 600 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్లో నేటి భారత షెడ్యూల్ మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ సెమీఫైనల్: భవీనాబెన్ X మియావో జాంగ్ (చైనా); ఉదయం గం. 6:10 నుంచి. ఆర్చరీ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్ రౌండ్: శ్యామ్ సుందర్ X మ్యాట్ స్టుట్మన్ (అమెరికా); ఉదయం గం. 6:38 నుంచి; రాకేశ్ కుమార్ ్ఠ సులేమాన్ (ఇరాక్) లేదా ఎన్గాయ్ (హాంకాంగ్); ఉదయం గం. 8:38 నుంచి అథ్లెటిక్స్ పురుషుల ఎఫ్–57 జావెలిన్ త్రో ఫైనల్: రంజీత్ భాటి (మ. గం. 3:30 నుంచి) పారాలింపిక్స్లో పతకం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి భవీనాబెన్. 2016 రియో పారాలింపిక్స్లో అథ్లెట్ దీపా మలిక్ షాట్పుట్ ఎఫ్–53 విభాగంలో రజతం గెలిచింది. -
భళా భవీనా: పారా ఒలింపిక్స్లో భారత్కు పతకం ఖాయం
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతన్న పారా ఒలింపిక్స్లో భారత్కు పతకం ఖాయమైంది. భారత ప్యాడ్లర్ భవీనా పటేల్ సంచలనం సృష్టించింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్-4 విభాగంలో సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా రికార్డులకెక్కింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 2, రియో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్తో జరిగిన పోరులో ఘన విజయం సాధించి సెమీస్లోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి రాంకోవిక్ను 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడించింది. కాగా శనివారం జరిగే సెమీ ఫైనల్స్లో ఆమె చైనాకు చెందిన జాంగ్ మియావోతో తలపడుతుంది. కాంస్యం కోసం ప్లే ఆఫ్ లేకపోవడంతో భవీనాకు పతకం ఖాయమైంది. ఓడిపోయిన సెమీ-ఫైనలిస్టులు ఇద్దరూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంటారు. చదవండి: IND Vs ENG 3rd Test Day 3: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్(8) ఔట్ ⭐1st Indian to secure a #ParaTableTennis medal ⭐Lost her opening match and then won 3 in a row. ⭐In her quarter final match, she trailed just once. Take a bow, @BhavinaPatel6 🔥 Stay tuned for her semi-final tomorrow! ⌛#Paralympics #Tokyo2020 pic.twitter.com/1gyRX7cHOj — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 27, 2021 -
మనిక–సత్యన్ జోడీకి టైటిల్
బుడాపెస్ట్ (హంగేరి): టోక్యో ఒలింపిక్స్లో ఎదురైన నిరాశ నుంచి భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మనిక బాత్రా, సత్యన్ త్వరగానే బయటపడ్డారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో జోడీ కట్టిన మనిక–సత్యన్ మిక్స్డ్ డబుల్స్లో టైటిల్ చేజిక్కించుకున్నా. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జోడీ 3–1 (11–9, 9–11, 12–10, 11–6)తో ఆతిథ్య హంగేరీకి చెందిన 94వ ర్యాంక్ డోర మదరస్జ్–నండోర్ ఎక్సెకీ జంటపై గెలుపొందింది. సింగిల్స్ సెమీస్లో అవుట్ మిక్స్డ్ డబుల్స్లో విజయవంతమైన మనిక సింగిల్స్లో నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 60వ ర్యాంకర్ మనిక బాత్రా 0–4 (10–12, 9–11, 10–12, 8–11)తో ఎలిజబెత్ అబ్రామియెన్ (రష్యా) చేతిలో కంగుతిన్నది. ఏకంగా 415వ ర్యాంకర్ చేతిలో అది కూడా ఒక్క గేమ్ కూడా గెలవకుండా మనిక పరాజయం చవిచూడటం గమనార్హం. పురుషుల సింగిల్స్లో సత్యన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. -
క్రమశిక్షణ ఉల్లంఘన చర్య; భారత ప్లేయర్కు షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ సలహాలు తీసుకునేందుకు నిరాకరించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రాకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) సిద్ధమైంది. మనిక వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేకు ఒలింపిక్స్లో పోటీలు జరిగే ప్రదేశంలో ప్రవేశించడానికి అవసరమైన అక్రిడేషన్ కార్డు లేకపోవడంతో మనిక ఆడే మ్యాచ్లకు అతడు దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో సౌమ్యదీప్ సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించినా... మనిక పట్టించుకోలేదు. ఈ విషయం గురించి టీటీఎఫ్ఐ కార్యదర్శి అరుణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘టోక్యోలో జరిగింది దురదృష్టకరం. క్రమశిక్షణా ఉల్లంఘన చర్య. మనికా తన వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేతో అక్కడికి వెళ్లారు. కానీ ఆయన అక్రిడేషన్ కార్టుతో పోటీలు జరిగే చోట ప్రవేశించలేరు. దీంతో పరాంజపే కార్డు అప్గ్రేడ్ చేయాలని మనికా డిమాండ్ చేసింది. కానీ నిబంధనల ప్రకారం అది కుదరలేదు. సౌమ్యదీప్ సలహాలు తీసుకోమని చెప్పగా.. సుతిర్థా ముఖర్జీకి ఆయన ఒకప్పుడు వ్యక్తిగత కోచ్గా ఉన్నారంటూ మనికా అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నైనా జైస్వాల్
సాక్షి, చిత్తూరు: ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న నైనా జైస్వాల్కు ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేవారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల నాకు ఇష్టమైన క్షేత్రమని అన్నారు. టీటీడీ కోవిడ్ నిబంధనలు పాటిస్తుందని, భక్తులు కూడా పాటించాలని కోరారు. త్వరలోనే నా పీహెచ్డీ పూర్తి కానుంది. అతి పిన్న వయస్సులో పీహెచ్డీ పూర్తి చేసుకోనున్నానని నైనా జైస్వాల్ అన్నారు. -
మా లాంగ్దే టీటీ స్వర్ణం..
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో చైనాకు చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు దుమ్మురేపారు. వరుసగా నాలుగో ఒలింపిక్ క్రీడల్లోనూ స్వర్ణ, రజత పతకాలను చైనా ప్లేయర్లే సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా చైనాకు చెందిన మా లాంగ్ దుమ్మురేపాడు.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత మా లాంగ్ 11–4, 10–12, 11–8, 11–9, 3–11, 11–7తో చైనాకే చెందిన ప్రపంచ నంబర్వన్ ఫాన్ జెన్డాంగ్ను ఓడించాడు. -
టీటీ మూడో రౌండ్లో మనిక
టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో మనిక బత్రా మూడో రౌండ్కు చేరగా.. పురుషుల ఈవెంట్ నుంచి సత్యన్ నిష్క్రమించాడు. రెండో రౌండ్లో 62వ ర్యాంకర్ మనిక 4–11, 4–11, 11–7, 12–10, 8–11, 11–5, 11–7తో 32వ ర్యాంకర్ పెసొస్కా (ఉక్రెయిన్) పై గెలిచింది. తన వ్యక్తిగత కోచ్కు మైదానంలో అందుబాటులో ఉండే అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోవడంతో మనిక కోచ్ లేకుండానే ఆడుతోంది. జట్టు హెడ్ కోచ్ సౌమ్యదీప్ రాయ్ నుంచి ఆమె సలహాలు తీసుకోవడానికి నిరాకరించింది. పురుషుల రెండో రౌండ్లో సత్యన్ 7–11, 11–7, 11–4, 11–5, 9–11, 10–12, 6–11తో సియు హంగ్ లమ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. -
శరత్–మనిక జంట సంచలనం
దోహా: టోక్యో ఒలింపిక్స్ వేదికగా టేబుల్ టెన్నిస్ (టీటీ)లో తొలిసారి ప్రవేశపెట్టనున్న మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత ప్రాతినిధ్యం ఖరారైంది. శనివారం ముగిసిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జంట ఆచంట శరత్ కమల్–మనిక బత్రా విజేతగా నిలిచి ‘టోక్యో’ బెర్త్ను దక్కించుకుంది. ఫైనల్లో శరత్ కమల్–మనిక జోడీ 8–11, 6–11, 11–5, 11–6, 13–11, 11–8తో టాప్ సీడ్, ప్రపంచ ఐదో ర్యాంక్ జంట సాంగ్ సు లీ–జియోన్ జిహీ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్లో తొలిసారి టీటీ క్రీడకు చోటు కల్పించారు. పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి పురుషుల, మహిళల డబుల్స్ ఈవెంట్లను తొలగించి వాటి స్థానంలో టీమ్ ఈవెంట్కు స్థానం కల్పించారు. మూడు ఒలింపిక్స్ క్రీడల తర్వాత టీమ్ ఈవెంట్స్కు జతగా మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ను ప్రవేశపెట్టాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి సత్యన్ జ్ఞానశేఖరన్, శరత్ కమల్... మహిళల సింగిల్స్లో సుతీర్థ ముఖర్జీ, మనిక బత్రా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ‘క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలుస్తామని ఊహించలేదు. ఫైనల్లో మనిక అద్భుతంగా ఆడింది. ఒలింపిక్స్లో మిక్స్డ్ ఈవెంట్లో 16 జోడీలు మాత్రమే ఉన్న నేపథ్యంలో మేము మూడు మ్యాచ్ల్లో గెలిస్తే పతకం ఖాయమవుతుంది. సింగిల్స్తో పోలిస్తే మిక్స్డ్ డబుల్స్లో మాకు పతకం గెలిచే అవకాశముంది’ అని శరత్ కమల్ వ్యాఖ్యానించాడు. -
శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు ఆటగాళ్ల నిరాకరణ
లాక్డౌన్ కాలంలో శిక్షణను పునరుద్ధరించేందుకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా జూన్ చివర్లో శిక్షణా శిబిరం నిర్వహించేందుకు సమాఖ్య సిద్ధం కాగా, మరోసారి ఆటగాళ్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సురక్షితం కాని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణించేందుకు తాము సిద్ధంగా లేమని భారత స్టార్ ప్లేయర్లు శరత్ కమల్, జి.సత్యన్ పునరుద్ఘాటించారు. లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడంతో భారత 16 మంది మేటి క్రీడాకారులను జూన్ మొదటి వారంలో శిక్షణ కోసం ఢిల్లీ, సోనేపట్, పాటియాలా కేంద్రాల్లో ఏదైనా ఒక వేదిక వద్దకు రావాల్సిందిగా సమాఖ్య గతంలోనే ఆటగాళ్లను కోరింది. అయితే ఆంక్షల నేపథ్యంలో ప్రయాణం చేసేందుకు ఆటగాళ్లు నిరాకరించారు. ప్రస్తుతం శిబిరాన్ని జూన్ చివరికి పొడిగించినా ప్లేయర్లు ముందుకు రావడం లేదు. ‘కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి చక్కబడే వరకు ఇంటి నుంచే ప్రాక్టీస్ చేయడం మంచిది. శిబిరాల నిర్వహణ జూలైలో ప్రారంభిస్తే బాగుంటుంది’ అని శరత్ కమల్ అన్నాడు. సత్యన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ సూచనల ప్రకారమే ఆటగాళ్లను ఒక్క చోట చేర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్న టీటీఎఫ్ఐ కార్యదర్శి ఎంపీ సింగ్... ప్యాడ్లర్ల నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. -
టేబుల్ టెన్నిస్ ఇలా కూడా ఆడొచ్చా!
ముంబై : కరోనా నేపథ్యంలో లాక్డౌన్కే పరిమితమైన ఆటగాళ్లు నచ్చిన పని చేస్తూ గడిపేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పాండ్యా బ్రదర్స్ ఎప్పటికప్పుడు తాము చేసే పనులను షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వీరిద్దరు తమ బెడ్రూంలో టేబుల్ టెన్నిస్ ఆడుతున్న వీడియో ఒకటి షేర్ చేశారు. బెడ్కు ఇరువైపులా హార్ధిక్ , కృనాల్ పాండ్యాలు నిలబడి టేబుల్ టెన్నిస్ ఆడారు. కృనాల్ వీడియోనూ షేర్ చేస్తూ.. 'మేము ఈరోజు సరికొత్త టేబుల్ టెన్నిస్ ఆడాము. బెడ్షీట్ను నెట్గా మార్చుకొని చేతులనే బ్యాట్గా భావించి ఆడాము. మీకు తెలుసుగా.. నా తమ్ముడు ఉంటే ఇలాంటి చిలిపి ఆలోచనలే వస్తాయి. ఇది కూడా వాడి ప్లానే.. అయితే గేమ్ను మాత్రం కాంపిటేటివ్గానే ఆడాం.. ఈ రౌండ్లో ఎవరు గెలుస్తారో మీరో చెప్పండి అంటూ' క్యాప్షన్లో పేర్కొన్నాడు. (వైరల్ : నీ ఏకాగ్రతను మెచ్చుకోవాల్సిందే) లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి పాండ్యా బ్రదర్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటున్నారు. రెండు రోజుల క్రితం హార్ధిక్.. 2011లో తన సోదరుడు కృనాల్తో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నాడు. తాజాగా షేర్ చేసిన ఈ వీడియో కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. టేబుల్ టెన్నిస్ ఇలా కూడా ఆడతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గతేడాది సెప్టెంబర్లో వెన్నునొప్పితో ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. -
టీటీలో మరమనిషితో మన మనిషి పోరు...
చెన్నై: అప్పట్లో మనం వెండితెరపై తమిళ సూపర్స్టార్ రజనీకాంత్... తనను పోలిన రోబోతో ఇంచుమించు యుద్ధమే చేస్తాడు. ఇదంతా సినిమా‘ట్రిక్’. కానీ నిజజీవితంలో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్... రోబోతో తన ఆట ప్రాక్టీస్ చేస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రపంచంతో పాటు భారత్ కూడా లాక్డౌన్లో ఉంది. అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో సత్యన్ తన భాగస్వామిగా మరో మనిషిని కాకుండా మరమనిషిని ఎంచుకున్నాడు. రోబోతోనే తన ప్రాక్టీస్ చురుగ్గా సాగుతోందని చెప్పాడు. ఈ రోబోను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఇది నిమిషానికి 120 బంతుల్ని నెట్పై ఆడగలదు. అన్నట్లు బంతుల స్పిన్, వేగ నియంత్రణను చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. ఈ మరమనిషితోనే రోజు గంటన్నర సేపు ప్రాక్టీస్ చేస్తున్నట్లు 27 ఏళ్ల సత్యన్ తెలిపాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మొత్తం ఈవెంట్లను జూన్ 30 దాకా రద్దు చేసింది. -
స్నేహిత్కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఒమన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రీడాకారుడు సూరావజ్జుల స్నేహిత్ రాణించాడు. మస్కట్లో జరిగిన ఈ టోర్నీలో స్నేహిత్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన అండర్–21 పురుషుల సెమీఫైనల్లో స్నేహిత్ పోరాడి ఓడిపోయాడు. ఈ మ్యాచ్లో స్నేహిత్ 11–7, 5–11, 8–11, 11–8, 12–14తో ప్రపంచ నంబర్వన్ మానవ్ ఠక్కర్ (భారత్) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు క్వార్టర్స్ మ్యాచ్లో స్నేహిత్ 11–6, 11–2, 13–11తో హజిన్ జెరెమీ (కెనడా)పై గెలుపొందాడు. సెమీస్లో ఓటమి పట్ల స్నేహిత్ నిరాశ వ్యక్తం చేశాడు. ‘ఈ గేమ్ కోసం పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యా. నా కోచ్ సోమనాథ్ ఘోష్తో కూడా చర్చించా. కానీ అద్భుత ఫామ్లో ఉన్న మానవ్పై పైచేయి సాధించలేకపోయా. ఫైనల్ చేరే గొప్ప అవకాశం చేజార్చుకున్నా. కాస్త నిరాశగా ఉంది’ అని స్నేహిత్ అన్నాడు. పురుషుల విభాగంలో మెయిన్డ్రాకు అర్హత పొందిన స్నేహిత్ తొలి రౌండ్లోనే 2–4తో చెయ్ హి యు క్లారెన్స్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. -
సుతీర్థ ముఖర్జీ ‘డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో హరియాణా క్రీడాకారిణి సుతీర్థ ముఖర్జీ సత్తా చాటింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోరీ్నలో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి ఆమె రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో హర్మీత్ దేశాయ్ (పీఎస్పీబీ) చాంపియన్గా నిలిచాడు. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ (హరియాణా) 11–4, 11–5, 11–8, 11–4తో క్రితిక సిన్హా రాయ్ (పీఎస్పీబీ)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో హర్మీత్ దేశాయ్ 11–4, 11–13, 14–12, 9–11, 11–8, 5–11, 11–5తో మానవ్ ఠక్కర్ (పీఎస్పీబీ)ని ఓడించాడు. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ల్లో మానవ్ ఠక్కర్ 11–9, 16–14, 7–11, 15–13, 6–11, 11–9తో జి. సత్యన్ (పీఎస్పీబీ)పై, హరీ్మత్ దేశాయ్ 11–9, 11–7, 11–4, 8–11, 14–12తో సౌమ్యజిత్ ఘోష్ (హరియాణా)పై గెలుపొందారు. సెమీస్లో ఓడిన సత్యన్, సౌమ్యజిత్లకు కాంస్యాలు లభించాయి. మహిళల సింగిల్స్ సెమీస్లో సుతీర్థ 12–10, 8–11, 11–9, 11–5, 11–5తో ఐహిక ముఖర్జీ (ఆర్బీఐ)ని, క్రితిక సిన్హా రాయ్ 11–9, 11–6, 15–13, 11–7తో అంకిత దాస్ (బెంగాల్)ని ఓడించారు. సెమీస్లో ఓడిన ఐహిక, అంకిత దాస్ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల డబుల్స్ ఫైనల్లో సుతీర్థ–రితి శంకర్ (హరియాణా) ద్వయం 11–7, 11–7, 8–11, 11–8తో సురభి పటా్వరీ–పోమంతీ బైస్యా (బెంగాల్) జోడీపై గెలుపొందగా... పురుషుల డబుల్స్ తుదిపోరులో జుబిన్ కుమార్–సౌమ్యజిత్ ఘోష్ (హరియాణా) జంట 11–7, 8–11, 11–3, 11–7తో మనుశ్ షా–ఇషాన్ హింగోరాణి (గుజరాత్) జోడీని ఓడించి చాంపియన్షిప్లను కైవసం చేసుకున్నాయి. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రోనిత్ భాంజా–మౌసుమీ పాల్ (బెంగాల్) 15–13, 8–11, 12–10, 13–11తో సౌరవ్ సాహా–సుతీర్థ ముఖర్జీ (హరియాణా) జంటపై నెగ్గింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమలో తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, భారత టేబుల్ టెన్నిస్ సంఘం (టీటీఎఫ్ఐ) కార్యదర్శి ఎంపీ సింగ్, తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం (టీఎస్టీటీఏ) అధ్యక్షులు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి పి. ప్రకాశ్ రాజు పాల్గొన్నారు. -
ముగిసిన వరుణి, స్నేహిత్ పోరాటం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుల పోరాటం ముగిసింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో వరుణి జైస్వాల్ ప్రిక్వార్టర్స్లో పరాజయం పాలవ్వగా... పురుషుల సింగిల్స్ కేటగిరీలో స్నేహిత్ మూడో రౌండ్లో ఓటమి చవిచూశాడు. శనివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో వరుణి జైస్వాల్ (తెలంగాణ) 9–11, 6–11, 3–11, 6–11తో క్రితిక సిన్హా రాయ్ (పీఎస్పీబీ) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు మూడో రౌండ్లో ఆమె 4–2తో దీప్తి సెల్వకుమార్పై గెలుపొందింది. పురుషుల విభాగంలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్కు నిరాశ ఎదురైంది. మూడోరౌండ్ గేమ్లో స్నేహిత్ 3–4తో సౌమ్యజిత్ ఘోష్ (హరియాణా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ కేటగిరీలో సౌమ్యజిత్ ఘోష్తో పాటు జి. సత్యన్ (పీఎస్పీబీ), రోనిత్ భాన్జా (బెంగాల్ ‘ఎ’), సార్థక్ గాంధీ (టీటీఎఫ్ఐ), మానవ్ ఠక్కర్ (పీఎస్పీబీ), సనీల్ శెట్టి (పీఎస్పీబీ), హర్మీత్ దేశాయ్ (పీఎస్పీబీ), ఎ. శరత్ కమల్ (ఎస్పీబీ) క్వార్టర్స్లో అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్ల ఫలితాలు పురుషులు: సత్యన్ 10–12, 11–7, 9–11, 6–11, 11–7, 11–3, 11–7తో మనుశ్ షా (గుజరాత్)పై, రోనిత్ 8–11, 12–10, 11–9, 6–11, 11–5, 7–11, 11–8తో సౌరవ్ సాహా (హరియాణా)పై, సార్థక్ 11–8, 7–11, 11–9, 11–9, 9–11, 9–11, 11–9తో సుష్మిత్ శ్రీరామ్ (ఏఏఐ)పై, మానవ్ ఠక్కర్ 11–9, 11–8, 11–7, 8–11, 11–7తో జుబిన్ కుమార్ (హరియాణా)పై, సనీల్ శెట్టి 11–2, 12–10, 11–5, 4–11, 11–6తో జీత్ చంద్ర (హరియాణా)పై, హరీ్మత్ దేశాయ్ 11–4, 11–7, 8–11, 11–7, 8–11, 11–13, 11–8తో ఆకాశ్ పాల్ (బెంగాల్ ‘ఎ’)పై, సౌమ్యజిత్ 11–8, 9–11, 11–8, 11–7, 5–11, 12–10తో సుధాన్షు గ్రోవర్ (ఢిల్లీ)పై, శరత్ కమల్ 11–4, 11–9, 11–9, 8–11, 11–2తో అర్జున్ ఘోష్పై గెలుపొందారు. మహిళలు: సుతీర్థ (హరియాణా) 12–10, 11–9, 11–9, 12–10తో మధురిక పాట్కర్ (పీఎస్పీబీ)పై, కౌశాని (రైల్వేస్) 7–11, 11–9, 8–11, 8–11, 11–8, 11–9, 11–9తో సురభి పట్వారీ (బెంగాల్ ‘ఎ’)పై, మౌసుమీ పాల్ (పీఎస్పీబీ) 15–13, 9–11, 11–6, 12–14, 9–11, 11–6, 11–6తో ఆనందిత చక్రవర్తి (రైల్వేస్)పై, ఐహిక ముఖర్జీ (ఆర్బీఐ) 1–6, 11–5, 11–9, 16–14తో సాగరిక ముఖర్జీ (రైల్వేస్)పై, పూజ (పీఎస్పీబీ) 4–11, 11–13, 12–10, 12–10, 11–8, 11–8తో ప్రాప్తి సేన్ (బెంగాల్ ‘ఎ’)పై నెగ్గి ముందంజ వేశారు. -
పోరాడి ఓడిన నివేదిత
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో తెలంగాణకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం మహిళల సింగిల్స్ విభాగంలో తలపడిన ఐదుగురు రాష్ట్ర క్రీడాకారుల్లో కేవలం ఒకరు మాత్రమే ముందంజ వేశారు. ప్రణీత, లాస్య, నివేదిత, నిఖిత తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా వరుణి జైస్వాల్ ముందంజ వేసింది. శుక్రవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ బ్యాచ్లో వరుణి జైస్వాల్ 3–1తో తనుశ్రీ దాస్గుప్తా (మేఘాలయ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్లో నివేదిత 2–3తో మానసి (మహారాష్ట్ర) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఇతర మ్యాచ్ల్లో ప్రణీత గర్లపాటి (తెలంగాణ) 2–3తో క్రితిక ఉపాధ్యాయ (రైల్వేస్) చేతిలో, వి. లాస్య 1–3తో సన్య సెహగల్ (హరియాణా) చేతిలో, నిఖిత (తెలంగాణ) 0–3తో వరి్టకా భరత్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు బి. నాగశ్రావణి 2–3తో నేహా (పంజాబ్) చేతిలో, ఫల్గుణి చార్వి 0–3తో నిత్యాశ్రీ మణి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల విభాగంలో టాప్ సీడ్ జి. సత్యన్, రెండో సీడ్ ఎ. శరత్కమల్లకు తొలి రౌండ్లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్కు అర్హత సాధించారు. -
మెయిన్ ‘డ్రా’కు తెలంగాణ జట్లు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో ఆతిథ్య తెలంగాణ పురుషుల, మహిళల జట్లు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాయి. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో మంగళవారంతో లీగ్ దశ టీమ్ మ్యాచ్లు ముగిశాయి. గ్రూప్ ‘డి’లో తెలంగాణ పురుషుల జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి ఆరు పాయింట్లతో గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. స్నేహిత్, మొహమ్మద్ అలీ, అమన్లతో కూడిన తెలంగాణ జట్టు తొలి మ్యాచ్లో 3–1తో ఉత్తరప్రదేశ్పై, రెండో మ్యాచ్లో 3–1తో హిమాచల్ప్రదేశ్పై, మూడో మ్యాచ్లో 3–0తో మేఘాలయపై గెలుపొందింది. మహిళల విభాగంలో గ్రూప్ ‘ఇ’లో వరుణి జైస్వాల్, గార్లపాటి ప్రణీత, మోనికా మనోహర్లతో కూడిన తెలంగాణ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లో నెగ్గి ఆరు పాయింట్లతో గ్రూప్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ జట్టు వరుసగా 3–0తో రాజస్తాన్పై, 3–0తో హిమాచల్ప్రదేశ్పై, 3–0తో పాండిచ్చేరిపై గెలిచాయి. -
టీటీ ఫైనల్లో స్నేహిత్
మరోవైపు అండర్–21 బాలుర టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 6–11, 8–11, 11–4, 11–4, 14–16, 12–10, 11–5తో జీత్ చంద్ర (హరియాణా)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో స్నేహిత్ 10–12, 11–4, 11–5, 12–14, 11–5, 11–7తో రాజేశ్ (మహారాష్ట్ర)ను ఓడించాడు. అండర్–17 ఆర్చరీ బాలుర కాంపౌండ్ సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కుందేరు వెంకటాద్రి కాంస్య పతకం గెలిచాడు. కాంస్య పతక పోరులో వెంకటాద్రి 148–142తో యశ్ దూబేపై విజయం సాధించాడు. -
ప్రపంచ నంబర్వన్గా మానవ్ ఠక్కర్
న్యూఢిల్లీ: భారత యువ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు మానవ్ ఠక్కర్ అండర్–21 పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్వన్గా అవతరించాడు. గత నెలలో జరిగిన నార్త్ అమెరికా ఓపెన్ టోర్నీలో మానవ్ విజేతగా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) శుక్రవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో మానవ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్ను అధిరోహించాడు. గతంలో భారత్ తరఫున అండర్–21 విభాగంలో హర్మీత్ దేశాయ్, సత్యన్, సౌమ్యజిత్ ఘోష్ ప్రపంచ నంబర్వన్గా నిలిచారు. -
భారత్ జోరు
కఠ్మాండు: భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో ‘పసిడి’పట్టు పట్టారు. బుధవారం జరిగిన పలు ఈవెంట్ల ఫైనల్లో భారత ఆటగాళ్లే విజేతలుగా నిలిచారు. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఖోఖో పోటీల్లో భారత మహిళలు, పురుషులు బంగారు పతకాలు సాధించారు. టేబుల్ టెన్నిస్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో భారత జోడీలే టైటిల్ పోరులో తలపడ్డాయి. దీంతో స్వర్ణాలతోపాటు రజతాలు లభించాయి. టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో హర్మీత్ దేశాయ్–ఆంథోని అమల్రాజ్ జోడీ 8–11, 11–7, 11–7, 11–5, 8–11, 12–10తో సానిల్ శెట్టి–సుధాన్షు గ్రోవర్ జంటపై గెలుపొందింది. మహిళల ఫైనల్లో ఆకుల శ్రీజ–మధురిక పాట్కర్ జంట 2–11, 11–8, 11–8, 11–6, 5–11, 11–5తో సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో హర్మీత్–సుతీర్థ ద్వయం 11–6, 9–11, 11–6, 11–6, 11–8తో అమల్రాజ్–ఐహిక జంటపై గెలిచింది. ఖోఖో పురుషుల ఫైనల్లో భారత్ 16–9తో బంగ్లాదేశ్పై విజయం సాధించగా, మహిళల తుదిపోరులో 17–5తో ఆతిథ్య నేపాల్ను ఓడించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో పుల్లెల గాయత్రి, అష్మిత, పురుషుల సింగిల్స్లో సిరిల్ వర్మ, ఆర్యమన్ టాండన్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్లో భారత కోచ్ గోపీచంద్ తనయ గాయత్రి 21–15, 21–16తో మహూర్ షాజాద్ (పాక్)పై, అష్మిత 21–9, 21–7తో పాల్వశ బషీర్ (పాక్)పై నెగ్గారు. పురుషుల క్వార్టర్స్లో సిరిల్ వర్మ 21–12, 21–17తో మురద్ అలీ (పాక్)పై, ఆర్యమన్ 21–17, 21–17తో రంతుష్క కరుణతిలకే (శ్రీలంక)పై విజయం సాధించారు. దక్షిణాసియా క్రీడల్లో నాలుగో రోజు బుధవారం భారత్ ఏకంగా 29 పతకాలు సాధించింది. ఇందులో 15 స్వర్ణాలున్నాయి. మొత్తంమీద భారత్ 71 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 32 పసిడి పతకాలతో పాటు 26 రజతాలు, 13 కాంస్యాలు గెలిచింది. -
పసిడి పంట
కఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా క్రీడల్లో రెండో రోజు భారత క్రీడాకారులు పసిడి పతకాల పంట పండించారు. అథ్లెటిక్స్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ క్రీడాంశాల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకొని పతకాలు సొంతం చేసుకున్నారు. ఓవరాల్గా రెండో రోజు మంగళవారం భారత్కు 27 పతకాలు లభించాయి. ఇందులో 13 స్వర్ణాలు ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్స్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు నెగ్గాయి. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సభ్యురాలిగా ఉన్న భారత టీటీ మహిళల జట్టు ఫైనల్లో 3–0తో శ్రీలంకను ఓడించింది. ఫైనల్స్ మ్యాచ్ల్లో సుతీర్థ ముఖర్జీ 11–9, 11–7, 11–3తో ఇషారా మధురాంగిపై, కృత్విక సిన్హా రాయ్ 11–6, 11–4, 11–2తో ఇరాండి వరుస్వితానాపై, ఆకుల శ్రీజ 11–5, 11–5, 11–3తో హన్సిని పియుమిలాపై నెగ్గారు. ఆంథోని అమల్రాజ్, హర్మీత్ దేశాయ్, సౌమ్యజిత్ ఘోష్ సభ్యులుగా ఉన్న భారత పురుషుల టీటీ జట్టు ఫైనల్లో 3–0తో నేపాల్పై గెలిచింది. వాలీబాల్ ఈవెంట్లోనూ భారత జట్లకు రెండు స్వర్ణాలు దక్కాయి. ఫైనల్స్లో భారత పురుషుల జట్టు 20–25, 25–15, 25–17, 29–27తో పాకిస్తాన్పై నెగ్గగా, భారత మహిళల జట్టు 25–17, 23–25, 21–25, 25–20, 15–6తో నేపాల్ను ఓడించింది. షూటింగ్లో భారత్కు 4 స్వర్ణాలు, 4 రజతాలు, కాంస్యంతో కలిపి తొమ్మిది పతకాలు వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో మెహులీ ఘోష్... టీమ్ విభాగంలో భారత్ పసిడి పతకాలు గెలుచుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో చెయిన్ సింగ్... పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో యోగేశ్ సింగ్ స్వర్ణాలు సాధించారు. తైక్వాండోలో మహిళల 57 కేజీల విభాగంలో కశిష్ మలిక్ పసిడి పతకం నెగ్గింది. అథ్లెటిక్స్లో భారత్కు అర్చన సుశీంద్రన్ (మహిళల 100 మీటర్లు), జష్నా (మహిళల హైజంప్), సర్వేశ్ అనిల్ కుషారే (పురుషుల హైజంప్), అజయ్ కుమార్ సరోజ్ (పురుషుల 1500 మీటర్లు) బంగారు పతకాలు అందించారు. ఖో–ఖోలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్కు అర్హత సాధించాయి. -
అత్యుత్తమ ర్యాంక్లో భారత టీటీ జట్టు
న్యూఢిల్లీ: భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు అత్యుత్తమ ర్యాంకుకు ఎగబాకింది. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రపంచ 30వ ర్యాంకర్ సత్యన్, 36వ ర్యాంకర్ శరత్ కమల్, హరీ్మత్ దేశాయ్ (104వ ర్యాంకర్)లతో కూడిన భారత్... ఆ్రస్టియాతో కలిసి పదో స్థానంలో ఉండగా... వర్గీకరణలో తొమ్మిదో ర్యాంకు దక్కింది. తొలి మూడు ర్యాంకుల్లో చైనా, జపాన్, జర్మనీ జట్లున్నాయి. -
ధోని బ్యాక్ హ్యాండ్ స్మాష్కు బ్రేవో షాక్!
చెన్నై: దీపావళి పండుగను పురస్కరించుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తనలోని టేబుల్ టెన్నిస్ స్కిల్ను బయటపెట్టాడు. స్వతహాగా క్రికెటర్ అయినప్పటికీ పలు క్రీడలు ఆడటం ధోనికి అలవాడు. క్రికెటర్గా మారడానికి ముందు ఎంఎస్ ధోని తన కెరీర్ను ఫుట్బాల్ గోల్ కీపర్గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫుట్బాల్, గోల్ఫ్, టేబుల్ టెన్నిస్లను ధోని సరదాగా ఆడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే సీఎస్కే సహచర ఆటగాడైన బ్రేవోతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడాడు. కాగా, ధోని ఆడిన బ్యాక్హ్యాండ్ స్మాష్కు డ్వేన్ బ్రావో సైతం షాకయ్యాడు. దీంతో డ్వే బ్రావో నేను ర్యాలీ ఆడుతున్నా అని చెప్పగా ధోని తనదైన స్టైల్లో తాను ర్యాలీలు ఆడను అని చెప్పాడు. ఏదేమైనా ధోని, బ్రేవో సుదీర్ఘ ర్యాలీ ఆడినప్పటికీ ధోనినే పాయింట్ గెలిచాడు.2019, మార్చిలో రూపొందించిన ఈ వీడియోను సీఎస్కే తన ప్రమోషన్లో భాగంగా తాజాగా విడుదల చేసింది. Back in March 2019, when #Thala @msdhoni, #Champion @DJBravo47 and #Sir @imjadeja were all utterly dapperly attired for a Deepavali collection shoot, they decided to conquer other sports! Catch it fully here https://t.co/cDWiiCu3Vg! 🦁💛 #WhistlePodu #HappyDeepavali pic.twitter.com/4LHJEEqEDF — Chennai Super Kings (@ChennaiIPL) October 27, 2019 -
విజేతలు మనోహర్ కుమార్, నటరాజ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: వెటరన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో బి. మనోహర్ కుమార్ చాంపియన్గా నిలిచాడు. ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో 40 ప్లస్ పురుషుల సింగిల్స్ విభాగంలో మనోహర్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మనోహర్ కుమార్ 11–13, 11–2, 11–4, 11–8తో రామారావుపై గెలుపొందాడు. 50 ప్లస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో పి. సురేశ్ 11–7, 10–12, 11–4, 7–11, 11–9తో ఎంవీఎన్ కిశోర్ కుమార్ను ఓడించి విజేతగా నిలిచాడు. 60–64 వయో విభాగంలో నటరాజ్ శర్మ 14–12, 11–6, 11–3తో ఉపేంద్రనాథ్పై గెలుపొందాడు. 65 ప్లస్ పురుషుల ఫైనల్లో జీవీ రంగారావు 11–1, 11–3, 11–5తో కేఆర్ శ్రీనివాస రావుపై గెలుపొందగా.. 70 ప్లస్ పురుషుల టైటిల్పోరులో సి. శ్రీనివాస్ 12–10, 11–2, 12–8తో రమణ ప్రసాద్ను ఓడించాడు. -
హైదరాబాద్ జట్లకు రెండు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్టాగ్ అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో హైదరాబాద్ జట్లు సత్తా చాటాయి. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషుల, జూనియర్ బాలుర టీమ్ విభాగంలో హైదరాబాద్ జట్లు విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. మహిళల టీమ్ విభాగంలో రంగారెడ్డి జట్టు చాంపియన్గా నిలిచింది. సోమవారం జూనియర్ బాలుర టీమ్ ఫైనల్లో హైదరాబాద్ 3–0తో రంగారెడ్డిపై గెలుపొందింది. విజేత జట్టు తరఫున జషన్ సాయి 3–1తో అథర్వ మోఘేపై, కేశవన్ కన్నన్ 3–1తో వివేక్పై, ఎస్ఎస్కే కార్తీక్ 3–0తో ఇషాంత్పై గెలుపొందారు. పురుషుల టీమ్ ఫైనల్లో హైదరాబాద్ 3–2తో రంగారెడ్డి జట్టును ఓడించింది. తొలి సింగిల్స్ మ్యాచ్లో యశ్ 3–1తో శాశ్వత్ సామల్పై, రెండో మ్యాచ్లో సరోజ్ సిరిల్ 3–2తో సాయినాథ్ రెడ్డిపై గెలుపొందడంతో రంగారెడ్డి 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే తర్వాతి మూడు మ్యాచ్ల్లోనూ గెలుపొందిన హైదరాబాద్ విజేతగా నిలిచింది. మూడో సింగిల్స్ మ్యాచ్లో వత్సిన్ (హైదరాబాద్) 3–1తో విశాల్పై, నాలుగో మ్యాచ్లో శాశ్వత్ సామల్ 3–0తో సరోజ్ సిరిల్పై, ఐదో మ్యాచ్లో సాయినాథ్ రెడ్డి 3–1తో యశ్పై నెగ్గి జట్టును విజేతగా నిలిపారు. మహిళల టీమ్ ఫైనల్లో రంగారెడ్డి 3–2తో హైదరాబాద్ జట్టును ఓడించింది. రంగారెడ్డి తరఫున తొలి మ్యాచ్లో భవిత 3–1తో సృష్టిపై, రెండో మ్యాచ్లో 3–0తో రాగ నివేదితపై గెలుపొందగా... మూడో మ్యాచ్లో వినిచిత్ర 3–1తో సృష్టిపై నెగ్గింది. హైదరాబాద్ జట్టులో రాగ నివేదిత 3–2తో వినిచిత్రపై గెలుపొందగా... సృష్టి–నివేదిత జోడీ 3–2తో భవిత–వినిచిత్ర జంటను ఓడించింది. వ్యక్తిగత విభాగాల మ్యాచ్ల ఫలితాలు ∙క్యాడెట్ బాలికల క్వార్టర్స్: సత్య (జీఎస్ఎం) 3–0తో తేజస్విని (ఏడబ్ల్యూఏ)పై, శ్రేయ సత్యమూర్తి 3–2తో శ్రేష్టారెడ్డి (జీఎస్ఎం)పై, శ్రీయ (ఏడబ్ల్యూఏ) 3–1తో శరణ్య (హెచ్పీఎస్)పై, జలాని (వీపీజీ) 3–0తో వత్సల (హెచ్పీఎస్)పై గెలుపొందారు. -
సెమీస్లో సృష్టి గుప్తా, వరుణి జైస్వాల్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ ఎంవీ శ్రీధర్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో సృష్టిగుప్తా (ఏవీఎస్సీ), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం), జి. ప్రణీత (హెచ్వీఎస్), బి. రాగనివేదిత (జీటీటీఏ) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఖైరతాబాద్లో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ల్లో సృష్టి 10–12, 11–5, 11–4, 9–11, 11–6, 8–11, 11–3తో సస్య (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందగా... వరుణి 4–12, 13–15, 11–7, 11–9, 11–9తో లాస్య (ఏడబ్ల్యూఏ)ను ఓడించింది. ఇతర మ్యాచ్ల్లో ప్రణీత 11–6, 11–7, 11–5, 11–6తో దియా వోరా (హెచ్వీఎస్)పై, రాగ నివేదిత 6–11, 11–8, 11–9, 1–11, 11–8, 11–7తో మోనిక (జీఎస్ఎం)పై గెలుపొందారు. యూత్ బాలికల విభాగంలో రాగ నివేదిత, సస్య, ప్రణీత, వరుణి జైస్వాల్ సెమీస్కు చేరుకున్నారు. క్వార్టర్స్ మ్యాచ్ల్లో రాగ నివేదిత 11–8, 9–11, 11–5, 11–2, 11–4తో ఇక్షిత (ఏడబ్లూఏ)పై, ప్రణీత 12–10, 11–8, 11–7, 11–7తో హనీఫా ఖాతూన్ (వీపీజీ)పై, సస్య 11–8, 11–7, 11–7, 11–4తో కీర్తన (హెచ్వీఎస్)పై, వరుణి జైస్వాల్ 6–11, 11–7, 10–12, 10–12, 11–3, 11–9, 11–9తో సృష్టి గుప్తా (ఏవీఎస్సీ)పై నెగ్గారు. ఇతర మ్యాచ్ల ఫలితాలు ∙క్యాడెట్ బాలుర క్వార్టర్స్: ధ్రువ్సాగర్ (జీఎస్ఎం) 3–0తో అక్షయ్ (ఏడబ్ల్యూఏ)పై, జతిన్దేవ్ (ఎస్పీహెచ్ఎస్) 3–0తో చిరంతన్ (ప్రొ టీటీ)పై, శౌర్యరాజ్ సక్సేనా (ఏవీఎస్సీ) 3–1తో రిషభ్ సింగ్ (వైసీఏఎక్స్టీటీఏ)పై, ఆరుశ్ (ఏపీజీ) 3–0తో సాయి హర్ష (ఎస్పీహెచ్ఎస్)పై నెగ్గారు. ∙యూత్ బాలుర ప్రిక్వార్టర్స్: సాయినాథ్ రెడ్డి 4–1తో విశాల్పై, వరుణ్ శంకర్ 4–1తో యశ్పై, అమన్ 4–1తో ఐనేశ్పై, అరవింద్ 4–1తో వత్సిన్పై, జషాన్ సాయి 4–3తో గోవింద్ షాపై, కేశవన్ కన్నన్ 4–0తో రాఘవ్ లోయాపై, అలీ మొహమ్మద్ 4–2తో సరోజ్ సిరిల్పై, మొహమ్మద్ అలీ 4–0తో త్రిశూల్ మెహ్రాపై గెలుపొందారు. ∙పురుషుల ప్రిక్వార్టర్స్: అలీ మొహమ్మద్ 4–1తో మొహమ్మద్ అలీపై, వరుణ్ శంకర్ 4–3తో కేశవన్పై, సరోజ్ 4–0తో అంకిత్పై, పీయూశ్ 4–0తో సాయినాథ్ రెడ్డిపై, అమన్ 4–1తో విశాల్పై, అరవింద్ 4–0తో జుబేర్పై, విఘ్నయ్ 4–0తో శాశ్వత్పై గెలుపొందారు. ∙పురుషుల క్వార్టర్స్: విఘ్నయ్ 4–0తో స్వర్ణేందుపై, సరోజ్ 4–1తో పీయూశ్ పై, అరవింద్ 4–2తో అమన్పై, వరుణ్ శంకర్ 4–2తో అలీ మొహమ్మద్పై విజయం సాధించారు. ∙క్యాడెట్ బాలికల క్వార్టర్స్: జలాని 3–0తో వత్సలపై, శ్రీయ సత్యమూర్తి 3–2తో శ్రేష్టారెడ్డిపై, శ్రీయ 3–1తో తేజస్వినిపై, ప్రజ్ఞాన్ష 3–0తో శరణ్యపై నెగ్గారు. -
వరుణి జైస్వాల్కు రెండు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) ఆకట్టుకుంది. ఆమె మహిళల, యూత్ బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. జూనియర్ బాలికల విభాగంలో ఎన్. భవిత (జీఎస్ఎం), పురుషుల విభాగంలో అమన్ (సీఆర్ఎస్సీబీ), యూత్ బాలుర కేటగిరీలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ (జీటీటీఏ), జూనియర్ బాలుర విభాగంలో బి. వరుణ్ శంకర్ (ఎంఎల్ఆర్) చాంపియన్లుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో వరుణి జైస్వాల్ 7–11, 11–9, 11–8, 10–12తో నిఖత్ బాను (ఆర్బీఐ)పై గెలుపొందింది. ఐదో గేమ్లో నిఖత్ బాను గాయం కారణంగా వైదొలగడంతో వరుణిని విజేతగా ప్రకటించారు. పురుషుల తుదిపోరులో అమన్ 11–8, 7–11, 11–8, 8–11, 11–9, 11–9తో స్నేహిత్ (జీటీటీఏ)ను ఓడించాడు. యూత్ బాలికల ఫైనల్లో వరుణి 8–11, 11–9, 11–13, 11–7, 11–5, 8–11, 11–7తో రాగ నివేదిత (జీటీటీఏ)పై గెలుపొందగా... బాలుర విభాగంలో స్నేహిత్ 11–4, 11–7, 11–7, 11–4తో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్)ను ఓడించాడు. జూనియర్ బాలికల టైటిల్పోరులో భవిత 11–1, 11–3, 4–11, 11–2, 11–8తో మెర్సీ (హెచ్వీఎస్)పై నెగ్గింది. బాలుర తుదిపోరులో వరుణ్ శంకర్ 11–2, 11–8, 11–7, 11–4తో సాయినాథ్ రెడ్డి (ఎంఎల్ఆర్)పై విజయం సాధించాడు. సబ్ జూనియర్ బాలుర విభాగంలో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్), జషాన్ సాయి (ఎంఎల్ఆర్) ఫైనల్కు చేరుకున్నారు. సెమీస్ మ్యాచ్ల్లో కరన్ సప్తర్షి (ఎంఎల్ఆర్)పై, త్రిశూల్ మెహ్రా, ఇషాంత్ (ఎస్పీహెచ్ఎస్)పై జషాన్ సాయి నెగ్గారు. బాలికల విభాగంలో మెర్సీ (హెచ్వీఎస్), పలక్ (జీఎస్ఎం), శ్రీయ (జీఎస్ఎం), అనన్య (జీఎస్ఎం) సెమీస్కు చేరుకున్నారు. క్యాడెట్ బాలబాలికల్లో జతిన్దేవ్ (ఎస్పీహెచ్ఎస్), ధ్రువ్ సాగర్, శౌర్య రాజ్ (ఏవీఎస్సీ), స్మరణ్, శ్రీయ, శ్రీయ, ప్రజ్ఞాన్ష (వీపీజీ), పి. జలానీ (వీపీజీ) సెమీస్కు చేరారు. -
క్వార్టర్స్లో స్నేహిత్, మొహమ్మద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ (జీటీటీఏ), మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్కు చేరుకున్నారు. ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో స్నేహిత్ 4–1తో వరుణ్ శంకర్ (ఎంఎల్ఆర్)పై గెలుపొందగా... మొహమ్మద్ అలీ 4–3తో చంద్రచూడ్ను ఓడించి ముందంజ వేశారు. మహిళల విభాగంలో ఎం. మోనిక (జీఎస్ఎం), నిఖత్ బాను, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) సెమీఫైనల్లో అడుగు పెట్టారు. క్వార్టర్స్ మ్యాచ్ల్లో మోనిక 4–0తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, నిఖత్బాను 4–0తో సస్య (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్ 4–0తో భవిత (జీఎస్ఎం)పై విజయం సాధించారు. యూత్ బాలికల విభాగంలో జి. ప్రణీత (హెచ్వీఎస్), ఎన్. భవిత (జీఎస్ఎం), బి. రాగ నివేదిత (జీటీటీఏ), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) సెమీఫైనల్కు చేరుకున్నారు. క్వార్టర్స్ మ్యాచ్ల్లో ప్రణీత 4–0తో హనీఫా ఖాటూన్ (వీపీజీ)పై, భవిత 4–2తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, రాగ నివేదిత 4–1తో వినిచిత్రపై, వరుణి జైస్వాల్ 4–1తో సస్య (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. -
విజేతలు విష్ణు, దియా
సాక్షి, హైదరాబాద్: సీఐఎస్సీఈ ఏపీ, తెలంగాణ రీజినల్ ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బి. విష్ణు (గీతాంజలి స్కూల్), దియా ఎన్ వోరా (నాసర్ స్కూల్) ఆకట్టుకున్నారు. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ (ఆబిడ్స్) ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 బాలబాలికల సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ చాంపియన్లుగా నిలిచి టైటిళ్లను అందుకున్నారు. యశ్పాల్ రాజ్ పురోహిత్ (ఫ్యూచర్కిడ్స్, రాజమండ్రి) రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోగా... హృదయ్ షా (గీతాంజలి, బేగంపేట్) మూడోస్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో అషితా అగర్వాల్ (గీతాంజలి), ఉరినా ఖాన్ (నాసర్ స్కూల్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. టీమ్ విభాగంలో గీతాంజలి స్కూల్ (బేగంపేట్) జట్లు బాలబాలికల విభాగంలో చాంపియన్లుగా నిలిచాయి. అండర్–17 బాలుర సింగిల్స్లో కె. వరుణ్ (జాన్సన్ గ్రామర్ స్కూల్), యజ్ఞేశ్ (సెయింట్ జోసెఫ్), అర్జున్ (ఫ్యూచర్కిడ్స్)... బాలికల కేటగిరీలో నిషా గణేశ్ (హెచ్పీఎస్, బేగంపేట్), లెహర్ అగర్వాల్ (నాసర్ స్కూల్), అమూల్య (గీతాంజలి)... అండర్–14 బాలుర సింగిల్స్లో ఒమర్ మంజూర్ (నాసర్ స్కూల్), ఆదిత్య (సెయింట్ జోసెఫ్), సోహమ్ (ఫ్యూచర్ కిడ్స్).... బాలికల విభాగంలో దిత్య (గీతాంజలి), నష్రా షేక్ (నాసర్ స్కూల్), అమ్తుల్ నూర్ (నాసర్ స్కూల్) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్– 14 బాలుర టీమ్ చాంపియన్షిప్ను గీతాంజలి స్కూల్... బాలికల టీమ్ టైటిల్ను నాసర్ స్కూల్ (ఖైరతాబాద్) గెలుచుకున్నాయి. అండర్–17 టీమ్ చాంపియన్షిప్ను హెచ్పీఎస్ బేగంపేట్ (బాలుర), నాసర్ స్కూల్ (బాలికల) జట్లు సాధిం చాయి. బహుమతి ప్రదాన కార్యక్రమంలో మెదక్ చర్చి బిషప్ సోలోమన్ రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
విజేత హిందూ పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ (అబిడ్స్) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో జూనియర్ బాలికల టీమ్ విభాగంలో హిందూ పబ్లిక్ స్కూల్ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో హిందూ పబ్లిక్ స్కూల్ 3–0తో చిరెక్ (సీబీఎస్ఈ–ఎ) పబ్లిక్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్లో హిందూ పబ్లిక్ స్కూల్ 3–2తో డాన్ బాస్కో జట్టుపై, చిరెక్ 3–2తో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్పై గెలుపొందాయి. జూనియర్ బాలుర విభాగంలో చిరెక్ (సీబీఎస్ఈ–ఎ) పబ్లిక్ స్కూల్, సెయింట్ పాల్స్ హైస్కూల్ ‘బి’, సెయింట్ పాల్స్ హైస్కూల్ ‘ఎ’, చిరెక్ కేంబ్రిడ్జ్ స్కూల్ జట్లు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో చిరెక్ 2–0తో డీపీఎస్ (ఖాజా గూడ) జట్టుపై, చిరెక్ కేంబ్రిడ్జి స్కూల్ 2–0తో భారతీయ విద్యాభవన్ (జూబ్లీహిల్స్)పై... సెయింట్ పాల్స్ ‘ఎ’ 2–0తో చిరెక్ సీబీఎస్ఈ–ఎఫ్ జట్టుపై, సెయింట్ పాల్స్ ‘బి’ 2–0తో డీఏవీ జట్టుపై గెలిచాయి. సీనియర్ బాలికల విభాగంలో రోజరీ కాన్వెంట్ (అబిడ్స్), డాన్ బాస్కో హైస్కూల్, గీతాంజలి దేవాశ్రయ్, సెయింట్ పాల్స్ హైస్కూల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. కామన్వెల్త్ టీటీ చాంపియన్షిప్లో మూడు పతకాలు సాధించిన తెలంగాణ అంతర్జాతీయ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నమెంట్ను ప్రారంభించింది. -
జాడ లేని భారత టీటీ కోచ్!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు మరో ఏడాది ఉన్న తరుణంలో భారత టేబుల్ టెన్నిస్ శిబిరాన్ని కోచ్ లేమి కలవరపెడుతోంది. గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, జకార్తా ఆసియా క్రీడల్లో భారత్కు పతకాలను అందించిన కోచ్ మసిమో కోస్టాంటిని వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో డేజన్ పాపిక్ను మార్చిలో చీఫ్ కోచ్గా నియమించారు. అయితే ఇప్పటివరకు పాపిక్ భారత జట్టుతో చేరకపోవడంతో క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. కటక్లో సోమవారం ముగిసిన కామన్వెల్త్ టోర్నీకే పాపిక్ అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడంతో ఆటగాళ్లంతా సొంత ప్రాక్టీస్తోనే ఈ టోర్నీ బరిలో దిగారు. మరోవైపు భారత టీటీ సమాఖ్య (టీటీఎఫ్ఐ) కూడా పాపిక్ స్పందన కోసం వేచిచూస్తున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ‘సాయ్ అతని నియామకాన్ని ధ్రువీకరించింది. ఈ మేరకు సంబంధిత పత్రాలను ఐదు రోజుల క్రితమే అతనిని పంపించాం. అతని సమాధానం కోసం వేచి చూస్తున్నాం’ అని ఆయన తెలిపారు. -
క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్
చెన్నై,పెరంబూరు: రజనీకాంత్ పెద్ద కూతురు, నటుడు ధనుష్ సతీమణి, సినీ దర్శకురాలు ఐశ్వర్యధనుష్ తాజాగా క్రీడా రంగంలోకి అడుగిడుతున్నారు. 2019వ ఏడాదికి గానూ ఈ నెల 25వ తేదీన డిల్లీలో జరగనున్న టేబుల్ టెన్నీస్ పోటీలకు చెన్నై జట్టు నిర్వాహకుల్లో ఒకరిగా ఐశ్వర్యధనుష్ భాగస్వామిగా మారారు. టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఢిల్లీ, చెన్నై, పుణే, గోవా, కోల్కతా, ముంబై జట్లు పాల్గొననున్నాయి. -
కామన్వెల్త్లో టీటీ అంపైర్గా అజయ్
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగి, అంతర్జాతీయ అంపైర్ డి. అజయ్ కుమార్కు గొప్ప అవకాశం దక్కింది. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో అజయ్ కుమార్ అంపైర్గా విధులు నిర్వర్తించనున్నారు. కటక్లోని జవహర్లాల్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 17 నుంచి 22 వరకు కామన్వెల్త్ టీటీ చాంపియన్షిప్ జరుగుతుంది. -
సత్యన్–అమల్రాజ్ జంటకు కాంస్యం
గీలాంగ్ (మెల్బోర్న్): ఆస్ట్రేలియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సత్యన్– అమల్ రాజ్ (భారత్) జోడీ కాంస్య పతకాన్ని గెలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సత్యన్–అమల్రాజ్ జంట 12–14, 9– 11, 8–11తో టాప్ సీడ్ యంగ్సిక్– లీ సంగ్సు (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత జంటకు కాంస్య పతకం ఖాయమైంది. ప్రిక్వార్టర్స్లో ఈ జంట 11–7, 11–3, 11–8తో డేవిడ్–టౌన్సెండ్ (ఆస్ట్రేలియా) ద్వయంపై, క్వార్టర్స్లో 5–11, 11–6, 14–12, 11–8తో జాంగ్ వూజిన్–జాంగ్హూన్ (కొరియా) జోడీపై గెలుపొందింది. -
యూత్ చాంప్స్ స్నేహిత్, వరుణి
సాక్షి, హైదరాబాద్: సెయింట్ పాల్స్ వార్షిక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో యూత్ బాలబాలికల విభాగాల్లో సూరావజ్జుల స్నేహిత్ (గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ), వరుణి జైస్వాల్ (గుజరాతి సేవా మండల్) చాంపియన్స్గా అవతరించారు. హైదర్గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో జరిగిన ఫైనల్స్లో స్నేహిత్ 11–6, 7–11, 11–7, 11–4, 11–9తో అమాన్ ఉర్ రెహ్మాన్పై... వరుణి 8–11, 8–11, 11–5, 11–9, 11–8, 11–3తో జి.ప్రణీత (హనుమాన్ వ్యాయామశాల)పై గెలిచారు. సెమీఫైనల్స్లో స్నేహిత్ 12–10, 11–7, 11–6, 11–8తో అరవింద్ (ఆనంద్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్)పై, అమాన్ ఉర్ రెహ్మాన్ 11–6, 11–8, 9–11, 13–11, 14–12, 11–5తో మొహమ్మద్ అలీ (ఎల్బీ స్టేడియం)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్లో అమన్ బల్గు (సీఆర్ఎస్సీబీ), మహిళల సింగిల్స్లో నిఖత్ బాను (ఆర్బీఐ) టైటిల్స్ సాధించారు. ఫైనల్స్లో అమన్ 13–11, 11–9, 11–8, 13–15, 4–11, 12–10, 12–10తో మొహమ్మద్ అలీపై, నిఖత్ బాను 11–7, 11–9, 11–6, 5–11, 12–10తో వరుణి జైస్వాల్పై గెలుపొందారు. సెమీఫైనల్స్లో మొహమ్మద్ అలీ 11–7, 11–4, 11–7, 9–11, 10–12, 12–10, 11–5తో అమాన్ ఉర్ రెహ్మాన్పై, అమన్ 8–11, 11–9, 12–10, 7–11, 11–4, 11–8తో స్నేహిత్పై; నిఖత్ 11–3, 11–8, 7–11, 11–8, 9–11, 11–9తో మౌనిక (గుజరాతి సేవా మండల్)పై, వరుణి 4–11, 15–13, 6–11, 11–5, 11–9, 11–8తో జి.ప్రణీతపై విజయం సాధించారు. జూనియర్ బాలుర విభాగంలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్ అకాడమీ) విజేతగా నిలిచాడు. ఫైనల్లో కేశవన్ 8–11, 11–9, 5–11, 11–9, 12–10, 11–7తో బి.వరుణ్ శంకర్ (గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ)పై గెలిచాడు. సెంట్రల్ జోన్ ఏసీపీ (ట్రాఫిక్) విద్యాసాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం (టీఎస్టీటీఏ) ఉపాధ్యక్షుడు ఆనంద్ బాబా, కోశాధికారి ఇబ్రహీమ్ ఖాన్, సెయింట్ పాల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాయప్ప, కార్యనిర్వాహక కార్యదర్శి సంజీవ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
చాంప్స్ పలక్, జషన్ సాయి
సాక్షి, హైదరాబాద్: సెయింట్ పాల్స్ వార్షిక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పలక్ (జీఎస్ఎం), జషన్ సాయి (ఎంఎల్ఆర్), శ్రీయ (ఏడబ్ల్యూఏ), జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్) సత్తా చాటారు. హైదర్గూడలో జరుగుతోన్న ఈ టోర్నీ క్యాడెట్ విభాగంలో జతిన్ దేవ్, శ్రీయ... సబ్జూనియర్ విభాగంలో జషన్ సాయి, పలక్ విజేతలుగా నిలిచారు. ఆదివారం సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో జషన్ సాయి 11–5, 12–10, 9–11, 11–5, 11–9తో త్రిశూల్ మెహ్రా (ఎల్బీ స్టేడియం)పై గెలుపొందగా... బాలికల కేటగిరీలో పలక్ 9–11, 11–6, 11–7, 11–9, 14–12తో అనన్య (జీఎస్ఎం)ను ఓడించింది. మరోవైపు క్యాడెట్ బాలుర టైటిల్ పోరులో జతిన్ దేవ్ 13–11, 11–6, 11–8, 11–5తో తరుణ్ ముకేశ్ (ఆర్టీటీఏ)పై, బాలికల ఫైనల్లో శ్రీయ 7–11, 12–14, 11–9, 6–11, 11–7, 11–9, 12–10తో ప్రజ్ఞాన్ష (వీపీజీ)పై గెలుపొందారు. జూనియర్ బాలికల విభాగంలో భవిత (జీఎస్ఎం) చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో భవిత 9–11, 11–6, 11–9, 11–5, 11–9తో పలక్ (జీఎస్ఎం)ను ఓడించింది. అంతకుముందు సెమీస్ మ్యాచ్ల్లో పలక్ 11–7, 11–5, 11–5, 11–7తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, భవిత 11–9, 11–8, 11–9, 11–7తో విధి జైన్ (జీఎస్ఎం)పై గెలుపొందారు. బాలుర విభాగంలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్), బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ) ఫైనల్కు చేరుకున్నారు. సెమీస్ మ్యాచ్ల్లో కేశవన్ కన్నన్ 10–12, 11–7, 11–8, 5–11, 11–7, 11–6తో జషాన్ సాయి (ఎంఎల్ఆర్)పై, వరుణ్ శంకర్ 15–13, 11–9, 11–4, 8–11, 11–9తో ప్రణవ్ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. యూత్ బాలికల సెమీఫైనల్లో ప్రణీత (హెచ్వీఎస్) 11–2, 11–4, 11–6, 11–6తో విధి జైన్ (జీఎస్ఎం)పై గెలుపొందగా... వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 11–5, 11–13, 11–8, 7–11, 11–3, 11–7తో రాగ నివేదిత (జీటీటీఏ)ను ఓడించింది. యూత్ బాలుర విభాగంలో స్నేహిత్ (జీటీటీఏ), అరవింద్ (ఏడబ్ల్యూఏ), మొహ్మమద్ అలీ (ఎల్బీఎస్) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. పురుషుల క్వార్టర్స్ మ్యాచ్ల్లో స్నేహిత్ (జీటీటీఏ) 11–9, 11–5, 11–7, 8–11, 8–11, 11–13, 11–8తో వి. చంద్రచూడ్ (ఎంఎల్ఆర్)పై, అమన్ (సీఆర్ఎస్సీబీ) 11–3, 11–7, 11–9, 11–6తో అరవింద్ (ఏడబ్ల్యూఏ)పై, అమన్ రహమాన్ (ఏవీఎస్సీ)11–9, 11–6, 5–11, 11–6, 11–6తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై, మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 6–11, 12–10, 11–6, 11–8, 12–10తో సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది సెమీఫైనల్కు చేరుకున్నారు. మహిళల విభాగంలో మోనిక (జీఎస్ఎం), ప్రణీత (హెచ్వీఎస్), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం), నిఖత్ బాను (ఆర్బీఐ) కూడా సెమీస్కు చేరుకున్నారు. -
శ్రీజకు క్రీడల మంత్రి అభినందన
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున బరిలోకి దిగి మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుక్రవారం రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా శ్రీజను, ఆమె కోచ్ సోమ్నాథ్ ఘోష్ను అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
అమెరికా రైల్లో ‘టేబుల్ టెన్నిస్’
-
అమెరికా రైల్లో ‘పింగ్ పాంగ్’
న్యూయార్క్: సాధారణంగా ప్రయాణికులు రైల్లో కూర్చొని లేదా పడుకొని ప్రయాణిస్తారు. కానీ న్యూయార్క్లోని ఓ జంట రైల్లో ఏకంగా పింగ్ పాంగ్ (టేబుల్ టెన్నిస్) ఆడుతూ ప్రయాణం చేసింది. ఇందుకు సంబంధిచిన వీడియోను అమెరికన్ కవయిత్రి మేరీ కార్ ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. రద్దీగా ఉండే రైళ్లలో ఇలాంటి ఆటలను న్యూయార్క్ వాసులుగా తాము ప్రోత్సాహించమని మెజారిటీ నెటిజన్లు అభిప్రయపడుతున్నారు. వీడియోలో పింగ్ పాంగ్ ఆడిన వారికి చురకలు అట్టించేలా కామెంట్లు పెడుతున్నారు. అయితే మేరీ పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 10వేల రీట్వీట్లు, 60 వేలకు పైగా లైక్లు రావడం విశేషం. -
చాంపియన్ శ్రీజ
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ జూనియర్, యూత్ స్థాయిల్లో పలు టైటిల్స్ సాధించిన తెలంగాణ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ తొలిసారి సీనియర్ స్థాయిలో విజేతగా నిలిచింది. హరియాణాలోని సోనెపట్లో గురువారం ముగిసిన జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టీటీ టోర్నమెంట్లో 20 ఏళ్ల శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్గా అవతరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున బరిలోకి దిగిన శ్రీజ ఫైనల్లో 6–11, 7–11, 14–12, 13–11, 11–9, 11–9తో సుతీర్థ ముఖర్జీ (హరియాణా)పై విజయం సాధించింది. తొలి రెండు గేమ్లను చేజార్చుకున్న శ్రీజ ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో వరుసగా నాలుగు గేముల్లో గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది. రూ. 15 లక్షల ఆర్థిక సహాయం... జాతీయ ర్యాంకింగ్ టీటీ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించిన తొలి తెలంగాణ అమ్మాయిగా గుర్తింపు పొందిన శ్రీజను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) అభినందించారు. ఈ సందర్భంగా శ్రీజ, కోచ్ సోమ్నాథ్ ఘోష్కు శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ వై.శ్రీధర్ రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్బీఐలో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్న శ్రీజకు కోచ్గా సోమ్నాథ్ ఘోష్ వ్యవహరిస్తున్నారు. నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) సంస్థ సహకారంతో కూకట్పల్లిలోని సెంట్రల్ మాల్లో ఘోష్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ టేబుల్ టెన్నిస్ అకాడమీని నెలకొల్పారు. ప్రస్తుతం శ్రీజ ఇదే అకాడమీలో శిక్షణ పొందుతోంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఈ అకాడమీని రాష్ట్ర ఐటీ డిపార్ట్మెంట్ సీఆర్ఓ ఆత్మకూరి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. -
వరుణి జైస్వాల్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: సామ్రెడ్డి సుదర్శన్ రెడ్డి స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణి జైస్వాల్ సత్తా చాటింది. బండ్లగూడ మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో వరుణి జైస్వాల్ యూత్ బాలికలు, మహిళల కేటగిరీలలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. బుధవారం యూత్ బాలికల తుదిపోరులో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 11–8, 6–11, 11–8, 7–11, 11–5, 11–6తో నైనా (ఎల్బీ స్టేడియం)పై, మహిళల ఫైనల్లో 11–9, 10–12, 11–9, 10–12, 11–9, 8–11, 11–4తో జి. ప్రణీత (హెచ్వీఎస్)పై నెగ్గి చాంపియన్గా నిలిచింది. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో అమన్ (సీఆర్ఎస్సీబీ) 11–7, 11–9, 11–5, 4–11, 12–14, 7–11, 15–13తో విఘ్నయ్ రెడ్డి (ఆర్బీఐ)ని ఓడించి విజేతగా నిలిచాడు. యూత్ బాలుర ఫైనల్లో సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ) 12–14, 11–8, 11–3, 11–3, 11–7తో సాయినాథ్ రెడ్డి (ఎంఎల్ఆర్)పై గెలిచాడు. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో జషన్ సాయి 6–11, 11–9, 8–11, 11–2, 11–6, 11–8తో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్)పై, జూనియర్ బాలుర ఫైనల్లో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్) 11–8, 11–6, 11–8, 7–11, 9–11, 11–7తో జషన్ సాయి (ఎంఎల్ఆర్)పై గెలుపొందారు. మరోవైపు సబ్ జూనియర్ బాలికల తుదిపోరులో అనన్య (జీఎస్ఎం) 8–11, 11–8, 11–9, 11–6, 11–5తో పలక్ (జీఎస్ఎం)పై, జూనియర్ బాలికల ఫైనల్లో భవిత (జీఎస్ఎం) 11–9, 11–8, 10–12, 10–12, 11–4, 11–8తో పలక్పై గెలుపొంది టైటిళ్లను కైవసం చేసుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం (టీఎస్టీటీఏ) అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. -
దబంగ్ ఢిల్లీ టీటీసీ జట్టులో నైనా జైస్వాల్
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ మూడో సీజన్కు రంగం సిద్ధమైంది. న్యూఢిల్లీ వేదికగా జూలై 25 నుంచి జరుగనున్న ఈ లీగ్లో పాల్గొనే జట్లను గురువారం ప్రకటించారు. ఇందులో భాగంగా దబంగ్ ఢిల్లీ టేబుల్ టెన్నిస్ క్లబ్ (టీటీసీ) జట్టుకు హైదరాబాద్ ప్లేయర్ నైనా జైస్వాల్ ప్రాతినిధ్యం వహించ నుంది. నైనాతో పాటు ఈ జట్టులో భారత స్టార్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్, బెర్నాడెట్ జాక్స్, జాన్ పెర్సన్, పార్థ్ విర్మానీ, క్రిత్విక సిన్హా రాయ్ చోటు దక్కించుకున్నారు. భారత మహిళా స్టార్ ప్లేయర్, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత మనికా బత్రా ఆర్పీ–ఎస్జీ మావెరిక్స్ కోల్కతా తరఫున బరిలో దిగనుంది. ఈ ఏడాదే లీగ్లో ప్రవేశించిన కొత్త జట్టు చెన్నై లయన్స్ తరఫున శరత్ కమల్ ఆడనున్నాడు. మొత్తం 6 జట్లు ఈ లీగ్లో తలపడనుండగా... ఒక్కో జట్టులో ఆరుగురు చొప్పున ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ ఫార్మాట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది మాదిరిగా ఏడు మ్యాచ్లతో కాకుండా కేవలం ఐదు మ్యాచ్లతోనే టై నిర్వహించనున్నారు. ఈసారి మ్యాచ్లన్నీ న్యూఢిల్లీలోనే జరుగనున్నాయి. క్రితం సారి మూడు నగరాల్లో యూటీటీ జరిగింది. జట్ల వివరాలు చెన్నై లయన్స్: శరత్ కమల్, పెట్రిస్సా సోల్జా, టియాజో అపొలోనియా, మధురికా పట్కర్, యశినీ శివశంకర్, అనిర్బన్ ఘోష్. దబంగ్ ఢిల్లీ టీటీసీ: సత్యన్ జ్ఞానశేఖరన్, బెర్నడెట్ జాక్స్, జాన్ పెర్సన్, పార్థ్ విర్మానీ, నైనా జైస్వాల్, క్రిత్విక సిన్హా రాయ్. గోవా చాలెంజర్స్: చెంగ్ చింగ్, అర్చన కామత్, అమల్రాజ్ ఆంథోని, సిద్ధేశ్ పాండే, శ్రుతి అమృతే, అల్వారో రోబెస్. పుణేరీ పల్టన్: చాంగ్ చిన్ యా, హర్మీత్ దేశాయ్, ఐహిక ముఖర్జీ, సెలీనా సెల్వకుమార్, రోనిత్ భాన్జా, సబీనే వింటర్. ఆర్పీ ఎస్జీ మావెరిక్స్ కోల్కతా: మనికా బత్రా, బెనెడిక్ట్ డ్యూడా, మాల్టిడా ఎకోమ్, మనుష్ షా, ప్రాప్తి షా, సనీల్ శెట్టి. యు ముంబా టీటీ: డూ హోయ్ కెమ్, మానవ్ ఠక్కర్, సుతీర్థ ముఖర్జీ, కిరిల్ గెరాస్సిమెన్కో, జీత్ చంద్ర, మౌమితా దత్తా. -
ప్రపంచకప్కు సత్యన్
యొకోహామా: భారత నంబర్వన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు సత్యన్ ప్రపంచకప్ టీటీకి అర్హత సంపాదించాడు. ఇక్కడ జరిగిన ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఆసియా కప్లో అతను ఆరో స్థానం పొందడం ద్వారా ప్రపంచకప్ బెర్త్ లభించింది. ఆదివారం ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో 26 ఏళ్ల సత్యన్ 4–11, 8–11, 8–11, 12–14తో చైనీస్ తైపీకి చెందిన లిన్ యున్ జు చేతిలో పరాజయం చవిచూశాడు. అయితే ఈ ఓటమి అతని అవకాశాలను దెబ్బ తీయలేదు. ప్రపంచ 28వ ర్యాంకర్ అయిన సత్యన్ టోర్నీలో మెరుగైన స్థానం (టాప్–6)తో ఈ ఏడాది చైనాలో జరిగే మెగా ఈవెంట్కు అర్హత సాధించాడు. ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి 20 వరకు చెంగ్డూలో జరుగుతుంది. -
ప్రపంచ కప్కు చేరువైన సత్యన్
యొకోహామా: భారత నంబర్వన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు జి.సత్యన్ ప్రపంచకప్కు అర్హత సాధించేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. ‘ఐటీటీఎఫ్–ఏటీటీయూ’ ఆసియా కప్లో సత్యన్... ప్రపంచ 14వ ర్యాంకర్ చున్ టింగ్ వాంగ్ (హాంకాంగ్)కు షాకిచ్చాడు. శనివారం 5–8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో సత్యన్ 12–10, 10–12, 11–5, 11–6, 11–8తో హాంకాంగ్కు చెందిన నంబర్వన్ ఆటగాడిని కంగుతినిపించాడు. దీంతో భారత ఆటగాడు ఇప్పుడు 5వ స్థానం కోసం లిన్ యున్ జు (చైనీస్ తైపీ)తో తలపడతాడు. ఆదివారం జరిగే మ్యాచ్లో అతను గెలిస్తే ప్రపంచకప్కు అర్హత సాధిస్తాడు. శనివారం ముందుగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతనికి నిరాశ ఎదురైంది. అతను 5–11, 5–11, 11–6, 6–11, 3–11తో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ మ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
కార్పొరేట్ స్పోర్ట్స్ మీట్ షురూ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ సంఘం (హెచ్వైఎస్ఈఏ) కార్పొరేట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. బంజారాహిల్స్లోని హ్యాట్ ప్లేస్ వేదికగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హెచ్వైఎస్ఈఏ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సి. అనసూయ, హెచ్వైఎస్ఈఏ ఉపాధ్యక్షులు భరణి అరోల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ కార్పొరేట్ స్పోర్ట్స్ మీట్ను నిర్వహిస్తోన్న హెచ్వైఎస్ఈఏ యాజమాన్యాన్ని అభినందించారు. తమ డిపార్ట్మెంట్కు చెందిన ‘షీ టీమ్’ జట్లు కూడా ఇందులో పాల్గొని కార్పొరేట్కు దీటుగా రాణిస్తాయని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఉద్యోగుల పరంగా నిర్వహిస్తోన్న అన్ని టోర్నీలలో హెచ్వైఎస్ఈఏ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఇందులో 14 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. ఫీల్డ్ క్రికెట్, బాక్స్ క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, పూల్, కబడ్డీ, క్యారమ్, బాస్కెట్బాల్ ఈవెంట్లలో పోటీలను నిర్వహిస్తారు. ఈసారి సైక్లింగ్ ఈవెంట్ను కూడా ఇందులో ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో 160 జట్లు తలపడనున్నారు. పలు క్రీడాంశాల్లో నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు హెచ్వైఎస్ఈఏ సభ్య కంపెనీలకు చెందిన ఔత్సాహిక క్రీడాకారులు సిద్ధమయ్యారని శ్రీనివాస్ రావు తెలిపారు. -
భారత టీటీ జట్టులో ప్రణీత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి గార్లపాటి ప్రణీత గొప్ప అవకాశాన్ని అందుకుంది. ఒమన్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు ఆమె ఎంపికైంది. యూత్ బాలికలు, మహిళల విభాగాల్లో ఆమె భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నెల 20 నుంచి 24 వరకు మస్కట్లో ఒమన్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ టీటీ టోర్నీ జరుగుతుంది. జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ పతకాలు కైవసం చేసుకుంటోన్న ప్రణీత స్థానిక హనుమాన్ వ్యాయామశాల టేబుల్ టెన్నిస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఆమె భారత జట్టుకు ఎంపికవడం పట్ల తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ప్రణీత కేఎంఐటీ ఇంజనీరింగ్ కాలేజిలో చదువుతోంది. -
టీటీ విజేత డీఆర్కే కాలేజి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ (హితమ్) స్పోర్ట్స్ ఫెస్ట్ సంగ్రామ్లో డీఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (బౌరంపేట్) జట్టు ఆకట్టుకుంది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో డీఆర్కే జట్టు విజేతగా నిలిచింది. ఆతిథ్య హితమ్ (మేడ్చల్) కాలేజి రన్నరప్తో సరిపెట్టుకుంది. వాలీబాల్ బాలుర విభాగంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి (మైసమ్మగూడ), హితమ్ కాలేజి (మేడ్చల్)... బాలికల కేటగిరీలో బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నర్సాపూర్), ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మేడ్చల్) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. త్రోబాల్ ఈవెంట్లో బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నర్సాపూర్) టైటిల్ను గెలుచుకోగా... డీఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రెండోస్థానంలో నిలిచింది. కబడ్డీలో వీఎన్ఆర్, హితమ్ జట్లు తొలి రెండు స్థానాలను సాధించాయి. బాస్కెట్బాల్ ఈవెంట్లో వీఎన్ఆర్ వీజేఈటీ (బాచుపల్లి), మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి (మైసమ్మగూడ)... క్రికెట్లో సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజి (దూలపల్లి), సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజి (మేడ్చల్) జట్లు వరుసగా తొలి రెండు స్థానాలను సాధించాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 17 కాలేజీలకు చెందిన 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. -
లక్ష్యం... టాప్ 20: శరత్
ముంబై: ఈ ఏడాది టాప్–20లోకి చేరడమే తన లక్ష్యమని భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ అన్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకుల్లో 33వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాదిలో తన లక్ష్యాన్ని నెరవేర్చు కోవడంతోపాటు 2020 టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్ తప్పకం పతకం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. గతేడాది ఆసియా క్రీడల టీటీలో సాధించిన రెండు కాంస్య పతకాలు తనలో ఆత్మవిశ్వాసం పెంపొందిం చాయని పేర్కొన్న కమల్... ఆ స్ఫూర్తితో ఒలింపిక్స్కు అర్హత పొందేందుకు ప్రయత్నిస్తు న్నట్లు వివరించాడు. ఆసియా క్రీడల్లో తీవ్ర పోటీ ఉంటుందని, అలాంటి చోటే రెండు పతకాలు నెగ్గగలిగామంటే ఇక ఒలింపిక్స్లోనూ భారత్కు పతకాలు దక్కే రోజు దగ్గరలోనే ఉందని అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రీడల్లో శరత్ కమల్ నేతృత్వంలోని భారత జట్టు కాంస్యం నెగ్గి ఈ విభాగంలో దేశానికి 60 ఏళ్ల తర్వాత తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. శరత్తోపాటు మిక్స్డ్ డబుల్స్లో మనికా బాత్ర సైతం కాంస్యం నెగ్గి భారత్కు ఈ విభాగంలో ఒలింపిక్ పతకాలపై ఆశలు రేకెత్తించారు.