విజృంభించిన భారత బౌలర్లు.. 65 పరుగులకే పరిమితమైన శ్రీలంక | Womens Asia Cup 2022 Final: sri lanka 6 5 9 in 20 overs Vs India | Sakshi
Sakshi News home page

Women Asia Cup Final: విజృంభించిన భారత బౌలర్లు.. 65 పరుగులకే పరిమితమైన శ్రీలంక

Oct 15 2022 2:39 PM | Updated on Oct 15 2022 2:41 PM

Womens Asia Cup 2022 Final: sri lanka 6 5 9 in 20 overs Vs India - Sakshi

మహిళల ఆసియాకప్‌-2022 ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం  65 పరుగులకే పరిమితమైంది. ఆది నుంచే వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. ఏ దశలోను భారత్‌కు పోటీ ఇవ్వ లేకపోయింది.

భారత పేసర్‌ రేణుకా సింగ్‌ ఈ కీలక పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది.

ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్‌, స్నేహ్‌ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్‌సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్‌  డిజిట్‌ స్కోర్‌లకే పరిమితమయ్యారు.
చదవండిT20 World Cup 2022: ఫేవరెట్‌ ఎవరు.. ఆసీస్‌ గడ్డపై అత్యధిక విజయశాతం ఎవరిది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement