మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌

Published Mon, Aug 7 2023 1:14 AM | Last Updated on Mon, Aug 7 2023 11:36 AM

- - Sakshi

అతనికి భార్య చెంబరత్తి(30), పిల్లలు తమిళరసన్‌(11), యోగిత(5) ఉన్నారు. పెరుమాళ్‌కు చెదులూరుకు చెందిన పుష్ప(26)తో పరిచయం ఏర్పడింది.

తమిళనాడు: మహిళను హత్య చేసిన ఇద్దరు యువకులతో పాటు హత్యకు కుట్రపన్నిన మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఆర్కేపేట సమీపంలోని మూరకుప్పం గ్రామానికి చెందిన పెరుమాళ్‌ (32) మెడికల్‌ షాపులో పనిచేస్తున్నాడు. అతనికి భార్య చెంబరత్తి(30), పిల్లలు తమిళరసన్‌(11), యోగిత(5) ఉన్నారు. పెరుమాళ్‌కు చెదులూరుకు చెందిన పుష్ప(26)తో పరిచయం ఏర్పడింది.

భర్తతో విడాకులు తీసుకుని పుట్టింటిలో ఉంటున్న పుష్పను పెరుమాళ్‌ రెండేళ్ల కిందట రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఆర్కేపేటలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. దీంతో చెంబరత్తి భర్తతో తరుచూ గొడవలు పడేది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పుష్ప ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందడాన్ని చూసిన పెరుమాళ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎస్‌ఐ శివ దర్యాప్తు చేపట్టారు. చెంబరత్తి తన సమీప బంధువు, తమ్ముడు శివ(23)తో తన బాధను చెప్పుకుంది. పుష్పను చంపితే తప్ప తన కుటుంబం బాగుపడదని చెప్పడంతో శివ అతని మిత్రుడు రాజశేఖర్‌(21) కలిసి పుష్ప ఇంటికి వెళ్లి గొంతు నులిమి హత్య చేసి పరారైనట్లు విచారణలో తెలిసింది. దీంతో సెంబరత్తితో పాటు శివ, రాజశేఖర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హజరుపరిచి జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement