దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం | Car Accident In Hyderabad Durgam Cheruvu Cable Bridge | Sakshi
Sakshi News home page

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం

Nov 5 2020 3:07 PM | Updated on Nov 5 2020 7:18 PM

Car Accident In Hyderabad Durgam Cheruvu Cable Bridge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్‌  బ్రిడ్జిపై వెళ్తున్న కారు టైర్‌ బ్లాస్ట్‌ కావడంతో పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వేగంగా వస్తున్న కారు  అదుపుతప్పి డివైడర్ గోడను ఢీకొనడంతో టైర్ పేలిపోయింది. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బోల్తా పడిన కారు ట్రాఫిక్ పోలీసులు సహాయంతో అక్కడ నుంచి తరలించారు.

దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జి అయిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిని సెప్టెంబర్‌ 25న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సదర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్‌ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement