durgam cheruvu
-
హైడ్రా దూకుడుకు తెలంగాణ హైకోర్టు బ్రేక్!
హైదరాబాద్, సాక్షి: హైడ్రా దూకుడుకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. దుర్గం చెరువు కూల్చివేతలపై సోమవారం స్టే ఆదేశాలు జారీ చేసింది.ప్రిలిమినరీ నోటిఫికేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు..కూల్చివేతలు ఆపేయాలని స్టే ఆర్డర్స్ జారీ చేస్తూనే.. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని ఆదేశించింది. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుండి ఆరు వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట లభించినట్లయ్యింది. -
‘దుర్గం చెరువు’ దోషులు అధికారులే!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: ‘‘హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హుడా) అనుమతులు ఇచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినట్టే కదా! నీటి పారుదల శాఖ ఇచ్చిన నిరభ్యంతర పత్రాల(ఎన్వోసీ) మేరకే ఇళ్లు, భవనాలు నిర్మించాం. 30 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఏకంగా 204 నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ దోషులెవరు? ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఈ లేఅవుట్లు ఉన్నట్టు అప్పుడే నిర్ధారిస్తే.. ఇప్పుడు కూల్చివేతలు ఉండేవి కాదు కదా’’.. .. దుర్గం చెరువు సమీపంలోని నెక్టార్ గార్డెన్కు చెందిన ఓ ఇంటి యజమాని ఆందోళన ఇది. ఆయనే కాదు.. గత 30 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న చాలా మంది తమ ఇళ్లు, భవనాలు చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దుర్గం చెరువు ప్రాంతంలోనే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నాలాలను ఆనుకొని నిర్మించిన విల్లాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, తదితర ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పుడేమో అధికారులు ఆ ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్జోన్లో ఉన్నట్టు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. నోటీసులు ఇచ్చిన తహసీల్దార్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారంటూ.. శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి ఈ నెల 5న వాల్టా చట్టం కింద అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కావూరిహిల్స్, నెక్టార్ గార్డెన్లలో ఉన్న 204 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లో నిర్మాణాలను తొలగించుకోవాలని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు ‘ఎఫ్’అని.. కొంతభాగం ఎఫ్టీఎల్లోకి వస్తే ‘ఎఫ్/పీ’అని.. బఫర్జోన్లోకి వచ్చే నిర్మాణాలపై ‘బీ’అని గోడలపైన రాశారు. రాజకీయ, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఓ పర్యావరణవేత్తకు చెందిన ఇల్లు కూడా ఉన్నట్టు సమాచారం. అమర్ సొసైటీలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది. ఎకరా రూ.వంద కోట్లపైనే..! దుర్గం చెరువు ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.వంద కోట్లపైనే ఉంటుందని అంచనా. చదరపు గజం విలువే రూ.2 లక్షలపైన ఉంటుంది. హైటెక్సిటీని ఆనుకొని ఉన్న దుర్గం చెరువు ప్రాంతం రియల్టర్లకు, బిల్డర్లకు హాట్కేక్లా మారింది. దాంతో రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే కబ్జాల పర్వం మొదలైంది. ఈ అక్రమ నిర్మాణాలకు అందరూ బాధ్యులే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖుల నుంచి అక్రమ లేఅవుట్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన హుడా అధికారులు.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురవుతున్నట్టు తెలిసినా ఎన్వోసీలు ఇచ్చిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు కూడా బాధ్యులే. నిజాం కాలంలో నిర్మించిన దుర్గం చెరువు రెండు గుట్టల మధ్య సుమారు 160.7 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాయదుర్గం పాయెగాలో 62ఎకరాలు, మాదాపూర్ సర్వే నం.63, 64లలో 28 ఎకరాలు, గుట్టల బేగంపేట్ సర్వే నంబర్లు 42 నుంచి 61 వరకు 70.7 ఎకరాల విస్తీర్ణంలో దుర్గంచెరువు ఉండేది.హుడా ఆమోదంతో నిర్మాణాలు.. ఈ ప్రాంతంలో 1991లో మొదట అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ 15 ఎకరాల విస్తీర్ణంలో 150 ప్లాట్లతో లేఅవుట్ చేసింది. అయితే చెరువు చుట్టూ 30 అడుగుల పరిధిలో స్థలాన్ని గ్రీన్బెల్ట్ కోసం కేటాయించిన హుడా.. 130 ప్లాట్లకు 1995లో తుది ఆమోదం ఇచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్ గేటెడ్ కమ్యూనిటీలకు కూడా హుడా ఆమోదం లభించింది. నెక్టార్ గార్డెన్ పూర్తిగా, కావూరి హిల్స్లోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలలోకి వరద నీరు చేరేది. దీనితో దుర్గంచెరువు పూర్తిగా నిండకుండా, ఎప్పటికప్పుడు నీటిని కిందికి వదిలేస్తూ.. ఎఫ్టీఎల్పై ఫోకస్ పడకుండా చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒత్తిడి తీసుకొచ్చి వర్షాకాలంలో దుర్గం చెరువు గేట్లు మూసివేయ కుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే చెరువు సుందరీకరణ పేరిట చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయడంతో.. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వారికి అదో రక్షణ గోడగా మారిపోయింది.అధికారులు ఏమంటున్నారు? 2013లో సుమారు 160.7 ఎకరాల్లో దుర్గం చెరువు విస్తీర్ణాన్ని గుర్తిస్తూ ఎఫ్టీఎల్ను నిర్ధారించామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఎన్వోసీల మేరకు అనుమతులను ఇచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. ఇక ‘‘ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ను పరిగణనలోకి తీసుకుంటాం. చాలా చోట్ల కాలువలను పూర్తిగా మూసివేయడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది. దీంతో ఎఫ్టీఎల్ నిర్ధారణలో శాస్త్రీయత లోపిస్తోంది’’అని హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.అక్రమమైతే కూల్చేయండి.. వాల్టా చట్టం రాకముందే 1995లో లేఅవుట్కు ఆమో దం లభించింది. హుడా అనుమతితోనే ఇళ్లు నిర్మించారు. 2016లో 600 చదరపు గజాల స్థలంలో ఇల్లు కొనుగోలు చేశాం. ఈ ప్రాంతం చెరువు పరిధిలోకి వస్తుందన్న సమాచారమేదీ లేదు. ఇప్పుడు బఫర్ జోన్లోకి వస్తుందంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైతే కూల్చేయండి, ముఖ్యమంత్రి నా ఒక్కడి కోసం పనిచేయడం లేదు కదా! బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి విషయంలో రాజకీయం చేస్తున్నారు. – సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిభయభ్రాంతులకు గురిచేయొద్దు 1995లో హుడా అనుమతి ఇవ్వడంతోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇ ళ్లు కట్టుకున్నాం. ఇప్పటికీ ఈఎంఐలు కట్టేవారు ఉన్నారు. 2023 లో జీహెచ్ఎంసీ హైపవర్ కమిటీ ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని తేల్చింది. ప్రభుత్వాలు మారితే ఎఫ్టీఎల్ మారుతుందా? – అమర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణారెడ్డిఇళ్లు కట్టాలంటే ఏ అనుమతులు ఉండాలిగ్రీన్బెల్ట్ను వదిలి అమర్ సొసైటీ లేఅవుట్కు హుడా అధికారులు ఆమోదం తెలిపారు. అనుమతి ఉన్న లేఅవుట్లో ప్లాట్ తీసుకొని, ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం. హైదరాబాద్లో ఇళ్లు కట్టుకోవాలంటే ఇంకా ఏమేం అనుమతులు తీసుకోవాలో చెప్పండి. – పోలవరపు శ్రీనివాస్, అమర్ సొసైటీ వాసి -
చెరువు ఆక్రమణ... సీఎం సోదరుడితోపాటు పలువురికి నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా, అధికారులు ముందుకు సాగుతున్నారు. తాజాగా ఐటీ కారిడార్ వద్ద ఉన్న దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో సహా మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చారు.నగరంలో ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు ‘సీక్రెట్ లేక్’ గుర్తింపు ఉంది. హైటెక్సిటీ వెలిశాక చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో.. అధికారులు వాటి జోలికి వెళ్లలేదనేది వాస్తవం. కానీ, ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది.దుర్గం చెరువును ఆనుకుని ఉన్న పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా.. కొందరు ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి తహసీల్దార్.. వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో భాగంగా 30 రోజుల్లో స్వచ్చందంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టరీత్యా తామే కట్టడాలను కూల్చేస్తామని తెలిపారు.దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఉంది. దీంతో, తిరుపతి రెడ్డికి కూడా అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సోసైటీ, కావూరీ హిల్స్లోని కొన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాలన్నింటిని కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు: తిరుపతి రెడ్డిఇక, తహసీల్దార్ నోటీసులపై తాజాగా సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసు నా దృష్టికి వచ్చింది. నేను 2015లో అమర్ సొసైటీలో ఒక ఇంటిని కొనుగోలు చేశాను. నేను ఇంటిని కొనుగోలు చేసినప్పుడు ఈ భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న సమాచారం నాకు తెలియదు. ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో నా బిల్డింగ్ ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
వాటర్ స్పోర్ట్.. కయాకింగ్..
తక్కువ వెడల్పు కాస్త ఎక్కువ పొడవు ఉండే కయాక్ లేదా పడవను రెండు వైపుల ప్యాడ్స్ ఉన్న ఒక తెడ్డును ఉపయోగించి నీటిపై కదిలించడమే కయాకింగ్. సాధారణంగా ఈ పడవపై ఒకేసారి ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు కలిసి పడవను నడిపించడమే ఈ క్రీడలోని ప్రత్యేకత. ముఖ్యంగా ఇది పర్యాటక క్రీడగా దేశంలో గుర్తింపు పొందింది. సాహస ప్రేమికులు, అడ్వెంచర్ టూరిజాన్ని ఇష్టపడేవారు ఈ కయాకింగ్కు ఆకర్షితులవుతుంటారు. సరస్సులు లేదా పెద్ద చెరువుల్లో వినోదించడానికి ఇదో చక్కని మార్గంగా చెప్పొచ్చు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ కయాకింగ్ అందుబాటులో ఉంది. దీంతో ఈ జలక్రీడను నగర వాసులు ఆస్వాదిస్తున్నారు. ఇది చాలా కాలంగా నీటి క్రీడగా ఉంటూ వస్తున్నప్పటికీ గత దశాబ్ద కాలంగా ప్రధాన పర్యాటక క్రీడగా కూడా దేశంలో ప్రసిద్ధి చెందింది. సాహస ప్రేమికులైన పర్యాటకుల్లో చాలా మంది ఈ కయాకింగ్ను అనేక సార్లు ఎంజాయ్ చేసి ఉంటారు. అయితే నిన్నా మొన్నటి వరకూ దేశంలోనే ప్రధాన పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రమే వారికి ఈ అవకాశం దక్కేది. ఇటీవల నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా కొన్ని çచోట్ల కయాకింగ్ అందుబాటులోకి వచి్చంది. ఆయా చోట్ల ఇప్పటికే నగరవాసులు ఈ జలక్రీడను ఆస్వాదిస్తున్నారు.కోట్పల్లి అటవీ ప్రాంతంలో..తెడ్డు చేతపట్టి జలాశయంలో నీటిని వెనక్కి నెట్టుకుంటూ ముందుకు సాగిపోతుంటే.. కయాకింగ్స్ ఈ అనుభూతి పొందాలంటే మాత్రం వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టుకు పోవాల్సిందే. అటవీ ప్రాంతం మధ్యలో కనుచూపు మేరలో నీటి అలలపై తేలియాడే పడవలు కనువిందు చేస్తాయి. నిత్యం 300 నుంచి 400 మంది పర్యాటకులు ఇక్కడ బోటింగ్ చేస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. గత పదేళ్లుగా ఇక్కడ బోటింగ్ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. సుమారు 20 మంది లైఫ్ గార్డ్స్ అందుబాటులో ఉంటారు. లైఫ్ జాకెట్స్, ఇతర ప్రమాణాలు పాటిస్తుంటారు. ఒక్కరు ప్రయాణించే బోటుకు గంటకు రూ.250 ఫీజు వసూలు చేస్తారు. ఇద్దరు ప్రయాణించే బోటుకు రూ.400 వరకూ వసూలు చేస్తారు. ఈ రిజర్వాయర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఆన్లైన్లోనూ బుకింగ్ చేసుకోవడానికి వివరాలు అందుబాటులో ఉంటాయి. వికారాబాద్ పర్యాటక రంగంలో కోట్పల్లి బోటింగ్ పాత్ర కీలకమనే చెప్పాలి. ప్రయాణం ఇలా..నగరం నుంచి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్, తాండూరుకు ఆర్టీసీ బస్సు సరీ్వసులు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. సొంత వాహనాల్లో వచ్చేవారు హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల మీదుగా రావచ్చు. దీంతోపాటు శంకర్పల్లి మీదుగానూ రావచ్చు. ఇక్కడకు వచ్చే వారు అనంతగిరి కొండల్లో కొలువైన శ్రీ అనంత పధ్మనాభస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతగిరుల అందాలను ఆస్వాదిస్తారు.నగరంలోనూ పలు చోట్ల.. ఈ వాటర్ స్పోర్ట్స్కు సంబంధించి నగరంలోని దుర్గం చెరువు కేంద్ర బింధువుగా మారింది. ఇక్కడ సూర్యాస్తమయ సమయాల్లో హుషారుగా సాగే కయాకింగ్ ఈవెంట్లో ఔత్సాహికులు పాల్గొనవచ్చు. పడవలను తిప్పుతూ సరదాగా కాసేపు గడపాలనుకునే వారికి రూ.700 రుసుముతో ఆ అవకాశం అందుబాటులో ఉంది. అలా కాకుండా ప్రొఫెషన్గా తీసుకుని సీరియస్గా కయాకింగ్ నేర్చుకోవాలనుకుంటే కూడా ఇక్కడి వాటర్ స్కూల్లో ప్రత్యేక కోర్సు అందుబాటులో ఉంది. ఒక్క సోమవారం మినహా వారంలోని అన్ని రోజుల్లో ఈ క్రీడ అందుబాటులో ఉంటుంది.మరిన్ని ప్రాంతాల్లో... అదే విధంగా నగరంలోని హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న యాచ్ క్లబ్ కూడా కయాకింగ్ ప్రియుల కోసం పడవలను అందుబాటులో ఉంచుతోంది. లక్నవరం సరస్సులో కాయక్ని అద్దెకు తీసుకుని, చుట్టూ నిర్మలమైన కొండలు ఉన్న సరస్సులో విహరించే అవకాశం ఉంది. అక్కడ కొన్ని క్యాంపింగ్ గ్రూపులు, స్థానికులు గంటల ప్రాతిపదికన కయాక్లను అద్దెకు ఇస్తారు. సాధారణంగా ఉదయం వేళలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.కయాకింగ్కు ఆదరణ పెరిగింది.. నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. గత 30 ఏళ్లుగా ట్రెక్కింగ్, బోటింగ్ చేస్తున్నాను. మన దగ్గర ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కువగా సినిమాల వరకే ఉంటాయి. అయితే ఎంతో మంచి వినోదాన్ని అందించే పర్యావరణ వింతలు, ట్రెక్కింగ్, బోటింగ్ వంటివి చాలా ఉన్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు ప్రొగ్రసివ్ తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో కోట్పల్లిలో బోటింగ్ ఏర్పాటు చేశాం. దీని కోసం నా సొంత ఖర్చుతో బోట్లను కొనుగోలు చేసి ఇచ్చాను. దీని ద్వారా ఇప్పుడు కొంత మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయి. అంతే కాకుండా పరోక్షంగా వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఇప్పుడు ఇక్కడకు నిత్యం వేలాది మంది బోటింగ్కు వస్తున్నారు. – విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల బీజేపీ ఎంపీఆరోగ్యలాభాలెన్నో.. కయాకింగ్ వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రీడ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. ముఖ్యంగా అప్పర్ బ్యాక్, చేతులు, భుజాలు, ఛాతీ భాగంలో కండరాలు బలోపేతం అవుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుస్తుంది. -
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఓ కారు ఇద్దరు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్నారు ఇద్దరు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వీళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన వ్యక్తిని అనిల్గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అజయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు తెలుస్తోంది. -
దుర్గం చెరువు ఎస్టీపీ సిద్ధం
హైదరాబాద్: దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా అవతరించేందుకు జలమండలి అడుగులు వేస్తోంది. మహానగర పరిధిలో రోజూ ఉత్పన్నమయ్యే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 31 కొత్త మురుగు నీటిశుద్ధి కేంద్రా(ఎస్టీపీ)ల నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 15 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించిన కోకాపేట ఎస్టీపీ ప్రారంభం కాగా.. సుమారు 7 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించిన దుర్గం చెరువు మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఆరు నెలలుగా దీని ట్రయల్ రన్ కొనసాగుతోంది. ఎస్బీఆర్ సాంకేతికతతో.. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో దుర్గం చెరువు ఎస్టీపీల నిర్మాణం చేపట్టారు. ఎస్బీఆర్ టెక్నాలజీ ఎస్టీపీని నిర్మించడంతో ఒకే చాంబర్లో అయిదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ ఉంటుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని శుద్ధి జరుగుతుంది. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్ ట్రీట్మెంట్ పద్ధతుల కంటే మెరుగ్గా మురుగు నీటి శుద్ధి జరుగుతుంది. మూడు ప్యాకేజీల్లో.. మహానగరంలో మొత్తం 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో సుమారు రూ.3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డీ సామర్థ్యం గల 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. ► ప్యాకేజీ–1 లో అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ► ప్యాకేజీ–2 లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ.1355.13 కోట్లతో 6 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్డీ మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ► ప్యాకేజీ–3లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి, ఇక్కడ 376.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. రోజువారీగా 1950 ఎంఎల్డీల మురుగునీరు.. హైదరాబాద్ అర్బన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1650 ఎంఎల్డీలు ఉండగా, ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం. మిగిలిన 878 ఎంఎల్డీల మురుగు నీటిని శుభ్రం చేయడానికి ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టారు. 2036 సంవత్సరం వరకు ఉత్పన్నమయ్యే మురుగును వీటి ద్వారా శుద్ధి చేయవచ్చు. వాసన కట్టడికి చర్యలు నివాసాల సమీపంలో నిర్మిస్తున్న ఎస్టీపీల నుంచి దుర్వాసన రాకుండా జలమండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీనికోసం ఆధునిక విదేశీ సాంకేతికతను అధికారులు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా.. విశాలమైన ఎస్టీపీల ప్రాంగణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడుతున్నారు. వీటితో పాటు మొత్తం 22 ఎస్టీపీల ప్రాంగణాల్లో సుగంధ ద్రవ్యాల జాతికి చెందిన ఆకాశమల్లి, మిల్లింగ్, టోనియా, మైకేలియా చంపాకా, (సింహాచలం సంపంగి) మొక్కల్ని నాటారు. ఇవి దుర్వాసనను అరికట్టి సువాసనను వెదజల్లుతాయి. -
కేబుల్ బ్రిడ్జికి వెళ్తున్నారా.. పోలీసుల హెచ్చరిక ఇదే..
సాక్షి, హైదరాబాద్: వాహనదారులను సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను నిలిపితే జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే 9490617346 అనే నెంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. వివరాల ప్రకారం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, ప్రమాదాలను నిలువరించేందుకు సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేయరాదని పోలీసులు హెచ్చరించారు. పార్కింగ్ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధిస్తామని తేల్చిచెప్పారు. క్యారేజ్వే వద్ద వాహనాలను పార్క్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. 9490617346 అనే నెంబర్కు వాట్సాప్ చేయాలని తెలిపారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. Traffic movement on the Cable bridge is smooth. We request commuters not to park vehicles on carriageway which obstructs traffic flow. If any are found parking illegally on the bridge will attract a hefty penalty. Public can also report these issues through WhatsApp 9490617346. pic.twitter.com/UZiy5MjMQd — CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) August 8, 2023 -
HYD: కేబుల్బ్రిడ్జి దగ్గరకు వెళ్తున్నారా.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.!
హైదరాబాద్(మాదాపూర్): కేబుల్బ్రిడ్జి సూసైడ్ స్పాట్గా మారింది. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు కేబుల్బ్రిడ్జి వద్దకు వచ్చి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎత్తు తక్కువగా ఉండడంతో ఇక్కడకు వచ్చి చెరువు మధ్యలోకి దూకుతున్నారు. అక్కడ ఎక్కువ లోతుగా ఉండడంతో దూకిన వారు బురదలో చిక్కుకుంటున్నారు. ఇటీవల తొమ్మిదిమంది ఆత్మహత్యాయత్నం చేయగా లేక్ పోలీసులు ముగ్గురిని కాపాడారు. మాదాపూర్లో దుర్గం చెరువు ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల వారికి దూరాన్ని తగ్గించేందుకు కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ తీగల వంతెనను నిత్యం సందర్శకులు సందర్శిస్తుంటారు. అయితే ఈ కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్గా మారింది. ►కేబుల్ బ్రిడ్జిపై కేవలం 4 అడుగుల ఎత్తు ఉండడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ►లేక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ►ఆకస్మాత్తుగా చెరువు మధ్య భాగంలో దూకడంతో ఊబిలోకి చొచ్చుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ►చెరువు మధ్యభాగంలో దాదాపు 40 అడుగుల లోతు ఉండడంతో బయటకు తీయాలంటే ఎక్కువ సమయం పడుతోంది. ►ఇప్పటికి 9 మంది సూసైడ్ చేసుకున్నారని అందులో ముగ్గురిని రక్షించినట్టు తెలిపారు. ►కేబుల్బ్రిడ్జిపై 12 నుండి 14 అడుగుల ఎత్తు ఉండే విధంగా రక్షణ కంచె ఏర్పాటు చేయాలని దుర్గం చెరువు లేక్పోలీసులు తెలిపారు. ►సూసైడ్ చేసుకునే వారు పైకిఎక్కే క్రమంలో తొందరగా స్పందించవచ్చన్నారు. ►ఎవరైనా అదృశ్యమైతే వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, ఈ సమాచారం వల్ల ప్రాణాలను కాపాడవచ్చన్నారు ► కాగా సందర్శకులు కేబుల్బ్రిడ్జిపై నిలబడకుండా ఐటీ పెట్రోలింగ్ 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అయిన ప్రమాదాలు జరుగుతున్నాయి. ►ఎత్తైన కంచెను ఏర్పాటు చేస్తే కొంతవరకు ఆత్మహత్యలను నివారించవచ్చని సీనియర్ సిటిజన్లు తెలిపారు. ►అనుమతులు లేకుండా డ్రోన్లు వాడకూడదన్నారు. ►లేక్ పోలీస్స్టేషన్లో ఇద్దరు జమీందర్లు, ఇద్దరు కానిస్టేబుళ్లును అందుబాటులో ఉంచారు. వీరితో పాటు ఒక ఎస్సై ఉంటారు. ►రిస్క్ చేసేందుకు ఒక స్పీడ్ బోటు ఉన్నాయి. చెరువు చుట్టూరా తిరిగేందుకు నాలుగు బైక్లు అందుబాటులో ఉన్నాయి. ►చెరువులో పడ్డ వారిని ఏ విధంగా రక్షించాలో ఫైర్ సిబ్బంది శిక్షణ పొందారు ►పైనుంచి దూకిన వారిని, నీటిలో మునిగిపోతున్న వారిని ఏ విధంగా కాపాడాలో, బయటికి తీసుకువచి్చన తరువాత ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో శిక్షణ ఇచ్చారు. ►మూడు పద్దతులలో కాపాడనున్నట్టు తెలిపారు. డ్రైలాండ్ రిసు్క, సెమి కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్ పద్ధతులను వాడాలని పోలీసులు తెలిపారు. ►బోట్ నడిపే విధానం, బోటు చెడిపోతే బాగు చేసుకునే పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. సమస్యలకు చావు పరిష్కారం కాదు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అలా అని చావు పరిష్కారం కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో, బంధువులతో కలసి మాట్లాడి పరిష్కరించుకోవాలి. అధైర్యపడవద్దు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్లు చేసుకోవద్దు. విలువైన కట్టడానికి అర్థం మారిపోతుంది. ఎవరైనా అదృశ్యమైనా, అనుమానాస్పదంగా ఉన్నా పోలీస్స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేస్తే ఫోన్ ట్రేస్ చేసి లోకేషన్ని గుర్తించి ప్రాణాలను కాపాడవచ్చు. –మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి -
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్ లేజర్ షో అదుర్స్ (ఫొటోలు)
-
Video: దుర్గంచెరువు వద్ద డ్రోన్ షో.. ఆకాశంలో అద్భుతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలో చేపట్టిన ప్రగతిపై ఆకాశంలో డ్రోన్లతో ప్రదర్శన కనువిందు చేసింది. మాదాపూర్లోని దుర్గంచెరువు వద్ద సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. పదిహేను నిమిషాల పాటు డ్రోన్లతో దుర్గంచెరువుపై ఆకాశంలో ఈ ప్రదర్శన సాగింది. 2014–2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అమరదీపం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, సీఎం కేసీఆర్ చిత్రాలతో కూడిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు దేశంలోనే శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసుల ప్రతిభను కూడా ప్రదర్శించారు. ఇటీవల ప్రారంభించిన సచివాలయం, యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు, దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ టీ హబ్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా, రాష్ట్రంలో ప్రత్యేకతను చాటుకున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్ ప్రగతిని డ్రోన్ల ద్వారా చిత్రాలతో కూడిన ప్రదర్శన కూడా విశేషంగా ఆలరించింది. ప్రదర్శన ముగిసే వరకు సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. అందరూ ఆసక్తిగా ఈ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లలో బంధించారు. ప్రదర్శనను మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్రావులు, సైబరాబాద్ పోలీసు అధికారులు, సిబ్బంది ఆసక్తిగా తిలకించారు. చదవండి: సీఎం ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీ చేస్తా: మంత్రి సత్యవతి రాథోడ్ Drone Show at Durgam Cheruvu by Cyberabad police as part of #తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10 pic.twitter.com/0Nqa8cy0Eb — Naveena Ghanate (@TheNaveena) June 4, 2023 This drone show with 500 drones is just mind-blowing 👏 Great job @cyberabadpolice 👍#TelanganaTurns10#తెలంగాణదశాబ్దిఉత్సవాలు pic.twitter.com/qlkPwPV7pH — Konatham Dileep (@KonathamDileep) June 4, 2023 -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మూడు రోజులపాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకు కేబుల్ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లచే తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో భారీ బరువున్న క్రేన్లను కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్ను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని కమిషనర్ సూచించారు. మరోవైపు రాకపోకలు నిలిచిపోయే ఆ నాలుగు రోజులపాటు ట్రాఫిక్ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్ నం.45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్ను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ను సైతం రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. చదవండి: Alert: హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు -
కేబుల్బ్రిడ్జి పైనుండి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: కేబుల్బ్రిడ్జి పైనుండి యువతి చెరువులోకి దూకిన సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ ప రిధిలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్క ర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆడారి హర్షిత(19) జ్ఞానదీపిక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. మెహిదీపట్నంలోని సప్తగిరి కాలనీ, రేతిబౌలిలో నివాసముంటుంది. కాగా మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కేబుల్బ్రిడ్జి పై నుండి దుర్గం చెరువులోకి దూకింది. పెట్రోలింగ్ పోలీసులు గమనించి లేక్ పోలీసులను ఆప్రమత్తం చేయగా లేక్ డిపార్ట్మెంట్ ఎస్సై భాను ప్రకాశ్ వెంటనే బోటు డ్రైవర్ మనోహర్తో కలసి ఆమె దూకిన చోట గాలించి రక్షించారు. వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చారిత్రక, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఆర్టీసీ ప్రవేశపట్టిన ‘హైదరాబాద్ దర్శిని’ సిటీ టూర్ బస్సుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి శని, ఆదివారాల్లో వీటిని నడుపుతారు. 12 గంటల సమయంలో హైదరాబాద్లోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే విధంగా ఈ సిటీ టూర్ ఉంటుందని అధికారులు తెలిపారు. - శని, ఆదివారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతాయి. - బిర్లామందిర్, చౌమొహల్లా ప్యాలెస్, తారామతి బారదరిలో రిసార్ట్స్లో మధ్యాహ్నం భోజనం అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు. ఆ తరువాత దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్ తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వద్దకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఛార్జీలు ఇవే.. - మెట్రో ఎక్స్ప్రెస్లలో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 . - మెట్రో లగ్జరీ బస్సుల్లో.. పెద్దలకు రూ.450 , పిల్లలకు రూ.340 . -
కేబుల్ బ్రిడ్డి వద్ద టెన్షన్.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. అది గమనించిన వాహనదారులు.. ఈ విషయాన్ని లేక్ పోలీసులకు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన లేక్ పోలీసులు.. యువతి కోసం స్పీడ్బోట్స్తో గాలిస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని అబ్దుల్లాపూర్మెట్కు చెందిన స్వప్న(23)గా పోలీసులు గుర్తించారు. అయితే, అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, స్వప్నకు ఇటీవలే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, కేబుల్ బ్రిడ్డి వద్ద స్వప్నకు సంబంధించిన హ్యాండ్ ఆధారంగా ఆమె ఆధారాలు సేకరించారు. దీంతో, పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు కేబుల్ బ్రిడ్డి వద్దకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఆసుపత్రికి సంబంధించిన పత్రాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కాగా, ఇప్పటి వరకు కేబుల్ బ్రిడ్డిపై నుంచి దూకి దాదాపు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. -
బతికేందుకు, చనిపోయేందుకు కారణం లేదంటూ..
మాదాపూర్: ‘నేను ఇవాళ రాత్రి 8 గంటలకు దుర్గంచెరువు కేబుల్ మీది నుంచి దూకుతున్నాను. నేను చావడం డ్రగ్స్ అడిక్ట్ వల్లనో, అమ్మాయి వల్లనో కాదు. నేను మరీ అంత చీప్ కాదు. కాలేజీ చదువు వల్ల అయితే అసలే కాదు. బతికేందుకు, చనిపోయేందుకు కారణం లేదు’అంటూ ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని షేక్పేట్ మండలం ఓయూ కాలనీలో నివాసముండే బుద్ధవనం సునీల్కుమార్ మాదాపూర్లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆయన ఒక్కగానొక్క కొడుకు నిఖిల్ (17) మాదాపూర్ కావూరి హిల్స్లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ ముగియగానే నిఖిల్ రోజుమాదిరిగా బుధవారం సాయంత్రం ఇంటర్నెట్ సెంటర్కు వచ్చాడు. తన బ్యాగును అక్కడే వదిలి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగిరాలేదు. నిఖిల్కు తండ్రి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. అనుమానంతో అతడి బ్యాగును పరిశీలించగా ఈ సూసైడ్ నోట్ లభించింది. సునీల్ వెంటనే మాదాపూర్ పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లను రంగంలోకి దించి దుర్గంచెరువులో గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. శుక్రవారం చెరువు ఒడ్డుకు నిఖిల్ మృతదేహం కొట్టుకురావడంతో పోలీసులు గమనించి స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. నిఖిల్ ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. డిప్రెషన్కు కారణాలు తెలియవని పేర్కొన్నారు. అతడికి ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలేవీ లేవని చెప్పారు. -
దుర్గం చెరువు: విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్!
సాక్షి, మాదాపూర్: ఇటు ఆకాశ హార్మ్యాలు.. అటు ఎత్తైన కేబుల్ బ్రిడ్జి.. చుట్టూ పచ్చని చెట్లు.. కొలువైన వివిధ రకాల విగ్రహాలు...సరస్సులోని నీటిని ముద్దాడుతున్న సూర్యకిరణాలు... విదేశాల్లో ఉన్నామా .. అనే అనుభూతి.. ఇలాంటి వాతావరణంలో బోటింగ్ అంటే నచ్చనివారు ఎవరుంటారు చెప్పండి?.ప్రశాంత వాతావరణానికి కేరాఫ్గా ఉన్న మాదాపూర్ దుర్గంచెరువులో బోటింగ్ చేసేందుకు సందర్శకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చదవండి: దుర్గం చెరువు బ్రిడ్జి... ఈ వీడియో చూశారా ? చెరువు వద్ద ఏర్పాటు చేసిన రాతి జంట చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చిన్నా.. పెద్దా అంతా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా బోటింగ్ చేస్తున్నారు. సందర్శకులు బోటింగ్ చేసేందుకు కలి్పంచిన ఏర్పాట్లు, కోవిడ్ నిబంధనల అమలుకు తీసు కున్న చర్యలు తదితర అంశాలపై దుర్గం చెరువు ఏజీఎం బాలకృష్ణతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... సాక్షి : ఇక్కడ ఎన్ని బోట్లు ఉన్నాయి? జవాబు: మొత్తం ఏడు ఉన్నాయి. నాలుగు పెడల్ బోట్లు, ఒకటి డీలక్స్ బోటు, ఒకటి స్పీడ్ బోటు, ఒకటి ఫ్యామిలీ బోటు ఉన్నాయి. సాక్షి: బోటింగ్ ఫీజుల వివరాలు తెలపండి. జవాబు:బోట్లు పూర్తి కండీషన్తో ఉండేలా చూస్తున్నాం. పెడల్ బోటింగ్ ఒకరికి రూ.50 (15 నిమిషాలు), డీలక్స్ బోట్ రూ.50 (15 నిమిషాలు), స్పీడ్బోట్ రూ.400 (నలుగురికి 6 నిమిషాలు)క్రూస్ బోట్ (ఫ్యామిలీ బోట్) 50 మంది కెపాసిటీ ఉంటుంది. ఒకరికి రూ.50 (15 నిమిషాలు) సాక్షి: కోవిడ్ జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? జవాబు:కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నాం. సందర్శకులు దిగిన వెంటనే బోట్లకు శానిటైజ్ చేయడం, తప్పని సరిగా సందర్శకులు మాస్్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం., ప్రతి సందర్శకుడు లైఫ్ జాకెట్లు ధరించేలా చూస్తున్నాం. సాక్షి: సందర్శకుల తాకిడి ఎలా ఉంది? జవాబు: సోమవారం నుంచి శుక్రవారం వరకు సందర్శకులు 200 నుంచి 300 మంది వరకు వస్తున్నారు. అదే శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఎక్కువ మంది వస్తుంటారు. ఆదివారం సుమారు 600 నుంచి 800 మంది బోటింగ్ చేస్తుంటారు. సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సాక్షి: కొత్త ప్రణాళికలు ఏమైన ఉన్నాయా? జవాబు:పిల్లలకు, పెద్దలకు, సెయిలింగ్, కయాకింగ్, కానోయింగ్ వంటి పర్యావరణ అనుకూల క్రీడలను నేర్పించడానికి యాచ్ క్లబ్ ఆఫ్ హైదరా>బాద్ ముందుకొచి్చంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాక్షి: సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారా? జవాబు: సీనియర్ సిటిజన్లు తమకు రాయితీ ఇవ్వాలని, తినుబండారాలు అందుబాటులో ఉంచాలని, సేద తీరేందుకు కూర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్లు, తాగునీటి వసతి కల్పించాలని కోరుతున్నారు. పై విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. -
దుర్గం చెరువు బ్రిడ్జ్ పై బైక్ రేసింగ్లు
-
దుర్గం చెరువు అందాలు.. ఎన్నోన్నో వర్ణాలు
-
దుర్గం చెరువు బ్రిడ్జి... ఈ వీడియో చూశారా ?
హైదరాబాద్ నగరానికి ఐకాన్ చార్మినార్... ఆ తర్వాత కాలంలో ఆ స్థాయి సైబర్ టవర్స్కి దక్కింది. ఇప్పుడు వాటి సరసన చేరేందుకు సిద్ధమవుతోంది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. స్థానికులకే కాదు విదేశీయులను సైతం అబ్బురపరుస్తోంది. బ్రిటీష్ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఇటీవల దుర్గం చెరువుపై నుంచి ప్రయాణించారు. చక్కని సాయంత్రం వేళ భారీ భవంతుల చాటున అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు తీగల వంతెన మీద ప్రతిబింబిస్తోంది. ఈ మనోహర దృశ్యాన్ని మొబైల్లో షూట్ చేసి ట్విట్టర్లో మనతో ఆండ్రూ ఫ్లెమింగ్ పంచుకున్నారు. మీరు ఓ సారి ఆ వీడియో చూడండి . -
కేబుల్ బ్రిడ్జి మీద బన్నీ బర్త్డే వేడుకలు
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. సుకుమార్ డైరెక్షన్లో చేసిన 'ఆర్య' సినిమాతో బన్నీకి స్టైలిష్ స్టార్ అన్న పేరు వచ్చింది. ఇక అదే డైరెక్టర్తో చేస్తున్న 'పుష్ప'తో బన్నీకి ఐకాన్ స్టార్ అన్న కొత్త పేరొచ్చింది. ఇక పుష్పరాజ్ ఎలా ఉంటాడనేది టీజర్ ద్వారా శాంపిల్ చూపించింది చిత్రయూనిట్. ఇందులో ఎర్రచందనాన్ని లారీలో లోడ్ నింపుతూ, అడ్డొచ్చినవారిని చితకబాదుతూ ఊరమాస్ లుక్లో కనిపించాడు బన్నీ. అభిమాన హీరోను తొలిసారి ఇలా డిఫరెంట్ స్టైల్లో చూసి విజిల్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. పైగా ఈ రోజు హీరో బర్త్డే కావడంతో రచ్చరచ్చ చేస్తున్నారు. అటు చిత్రయూనిట్ కూడా అతడి బర్త్డే సెలబ్రేషన్స్ను గ్రాండ్గా ప్లాన్ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద లేజర్, లైట్ షో ఉంటుందని ప్రకటించింది. ఈరోజు రాత్రి 7- 8.30 గంటల మధ్య ఈ స్పెషల్ షో ఉంటుందని వెల్లడించింది. గతంలో ఏ తెలుగు హీరోకు దక్కని ఈ అరుదైన గౌరవం అల్లు అర్జున్కు దక్కడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. హీరో బర్త్డే కోసం ఇలా లేజర్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేయడం విశేషమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పుష్ప టీజర్ లక్షల వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 13న థియేటర్లలోకి రానుంది. చదవండి: పుష్ప టీజర్: తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ చూస్తుండగానే మోనాల్కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న కారు టైర్ బ్లాస్ట్ కావడంతో పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ గోడను ఢీకొనడంతో టైర్ పేలిపోయింది. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బోల్తా పడిన కారు ట్రాఫిక్ పోలీసులు సహాయంతో అక్కడ నుంచి తరలించారు. దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి అయిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని సెప్టెంబర్ 25న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సదర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారంతంలో పెద్ద ఎత్తున నగర వాసులు వస్తుండటంతో ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక అనుమతులు సైతం ఇచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాహనాలను నిషేధించిన అధికారులు.. కేవలం పర్యటకులను మాత్రమే అవకాశం కల్పించారు. అయినప్పటికీ వంతెనపై రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. ట్రాఫిక్కి అంతరాయం కలుగుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా వంతెనపైనే వాహనాలు ఆపి ఫోటోలు దిగుతున్నారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన పోలీసులు.. వంతెనపై పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్పై వాహనాలు ఆపితే.. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లు సందర్శకులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల పిల్లలతో వచ్చిన ఓ కుటుంబం వంతెనపై బైక్ ఆపి ఫోటోలకు ఫోజులిచ్చింది. సీసీ కెమెరాలను గమనించిన భర్త.. బైక్ నెంబర్ ప్లేట్ కనిపించకుండా భార్య మెడలోని చున్నీని తీసి దానిని కవర్ చేశాడు. ఇది కూడా అక్కడి కెమెరాలో రికార్డు అయ్యింది. వీరి ఘనకార్యం కాస్తా పోలీసుల కంటపడంతో అలర్ట్ అయ్యారు. ఇది గమనించి వారు బైక్ తీసుకుని అక్కడి నుంచి పరార్ అయ్యారు. అయినప్పటికీ జరిమానా నుంచి తప్పించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ పోలీసులు అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అనే క్యాప్షన్తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్గా మారింది. పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. బిగ్బాస్ (సీసీ కెమెరా) చూస్తున్నాడు, ఇలాంటి తెలివైన భార్య ఉండటం గ్రేట్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. -
కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా..
సాక్షి, హైదరాబాద్: దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని సందర్శించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన నగరవాసులకు దుర్గం చెరువు మంచి పర్యాటక కేంద్రంగా మారింది. సాయంకాల సమయంలో వెలుగులు విరజిమ్మే లైటింగ్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఫొటోలు దిగేందుకు యువతతో పాటు పెద్దలు కూడా అదే స్థాయిలో పోటీపడుతున్నారు. అయితే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వంతెన గుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. ఫొటోషూట్లు నిర్వహిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా వీరి వైఖరి మారడం లేదు.(చదవండి: అర్థరాత్రి దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై సెల్ఫీలు) ఈ క్రమంలో.. ఓ కుటుంబం సోమవారం సాయంత్రం ప్రమాదకర రీతిలో ఫొటోలు దిగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దయచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల దుర్గం చెరువు బ్రిడ్జిపై అర్థరాత్రి దుస్తులు విప్పేసి సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లైవ్లో పోకిరీల ఆగడాలను చూసిన పోలీసులు.. వాళ్లిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. కాగా గతనెల 25న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా తీగల వంతెన ప్రారంభమైంది. -
కేబుల్ బ్రిడ్జి పై సండే సందడి
-
కొత్త అందాలు
-
అర్థరాత్రి దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై సెల్ఫీలు
సాక్షి, హైదరాబాద్ : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పోలీసులు ఎంత కట్టడి చేసినా పోకిరీల అరాచకాలు ఆగడం లేదు. బ్రిడ్జీపై ఆగి సెల్ఫీలు దిగితే కేసులు పెడతామని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. పోలీసుసు హెచ్చరికలను భేఖాతరు చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. దుర్గం చెరువు బ్రిడ్జిపై అర్థరాత్రి దుస్తులు విప్పేసీ సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. లైవ్లో పోకిరీల ఆగడాలను చూసిన పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసు స్టేషన్కి తరలించారు. గతనెల 25న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభమైంది. లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సదర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెనపై వాహనాలు వేగంగా వేళ్తున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ఫోటోలకు ఎగబడుతున్నారు. మరీ ముఖ్యంగా వారంతంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తుండటంతో సెల్పీస్పాట్ ప్రమాదకరంగా మారింది. పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. వీకెండ్స్లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద బోటింగ్ ప్రారంభం
-
కేబుల్ బ్రిడ్జిపై బిగ్బాస్ చూస్తున్నాడు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వస్తున్నారు. ఆకట్టుకుంటున్న లైటింగ్స్ ధగధగల్లో ఫొటోలు, సెల్ఫీలతో మురిసిపోతున్నారు. ఈనేపథ్యంలో వంతెనపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. వాహన ప్రమాదాలకు అవకాశాలున్నాయి. దీనిపై దృష్టిసారించిన జీహెచ్ఎంసీ అధికారులు వంతెనపై వాహనాలు నిలపకుండా నిషేదం విధించారు. అయినప్పటికీ కొందరి తీరు మారకపోవడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారం చేపట్టారు. బిగ్బాస్ మిమ్మల్ని చూస్తున్నాడని, ఇకనైనా మారండని అంటున్నారు. బ్రిడ్జిపై వాహనాలు నిలిపి అనవసరంగా చలానాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక పర్యాటకుల రద్దీ దృష్ట్యా శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతనెల 25న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జి్ ప్రారంభమైంది. (చదవండి: ప్రమాదకరంగా తీగల వంతెనపై ఫోటోలు) -
ప్రమాదకరంగా తీగల వంతెనపై ఫోటోలు
-
ప్రమాదకరంగా తీగల వంతెన.. కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. గతనెల 25న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా తీగల వంతెన ప్రారంభమైంది. లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సదర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెనపై వాహనాలు వేగంగా వేళ్తున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ఫోటోలకు ఎగబడుతున్నారు. రోడ్డుపై వస్తున్న వాహనాలు ఏమాత్రం లెక్కచేయకుండా సెల్పీలు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా వారంతంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తుండటంతో సెల్పీస్పాట్ ప్రమాదకరంగా మారింది. దీనిపై దృష్టిసారించిన జీహెచ్ఎంసీ అధికారులు వాహనాలపై వంతెనపై నిలపకుండా నిషేదం విధించారు. ఫోటోల కోసం వంతెనపై ఆగితే భారీగా చలనాలు విధిస్తున్నారు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. వీకెండ్స్లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై గురువారం సీపీ సజ్జనార్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కేబుల్ బ్రిడ్జిపైకి సందర్శకులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, ఇతర సమస్యలు రాకుండా ట్రాఫిక్ వారాంతాల్లో వాహనాలను అనుమతించకపోవడమే సరైందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి తిరిగి సోమవారం ఉదయం 6 గంటల వరకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ బ్రిడ్జిపైకి ఐటీసీ కోహినూర్తో పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 వైపు నుంచి వాహనాలతో సందర్శకులు వస్తున్నందున ఇరువైపులా పార్కింగ్కు ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు. దీంతో వారంతంలో పర్యటకుల ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీపీ తెలిపారు. -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై అద్భుతమైన ఆర్మీ బ్యాండ్
-
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిను ఐటీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 184 కోట్ల రూపాయల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్బ్రిడ్జిని చేరుకునేందుకు నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్ను కూడా కేటీఆర్ ప్రారంభించారు. దీనికి ‘పెద్దమ్మతల్లి ఎక్స్ప్రెస్ వే’గా పేరు పెట్టారు. (దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఇక రయ్ రయ్) కేబుల్ బ్రిడ్జి వివరాలు.. కేబుల్ బ్రిడ్జి మొత్తం పొడవు (అప్రోచెస్ సహా) :735.639 మీటర్లు ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పొడవు: 425.85 మీటర్లు (96+233.85+96) అప్రోచ్ వయాడక్ట్+సాలిడ్ ర్యాంప్: 309.789 మీటర్లు క్యారేజ్ వే వెడల్పు: 2x9 మీటర్లు (2x3 లేన్లు) ఫుట్పాత్ : 2x1.8 మీటర్లు స్టే కేబుల్స్ 56 (26x2) ప్రాజెక్ట్ వ్యయం: రూ.184 కోట్లు నిర్మాణ సంస్థ: ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ -
నేటి నుంచి మీ కోసం..కేబుల్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని హైదరాబాద్ ప్రజలు ఎదురుచూస్తున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నేటి నుంచి అందుబాటులోకి రానుంది. దీంతోపాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ను శుక్రవారం సాయంత్రం (నేడు) కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రారంభించ నున్నారు. ఫలితంగా నగరంలోని పలు ప్రాం తాల నుంచి ఐటీ పరిశ్రములున్న వెస్ట్జోన్కు రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. ఈ ఐకా నిక్ బ్రిడ్జి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ఐటీ సంస్థల ప్రాంతాలకు అనుసంధానంగా ఉం టుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, మాదాపూర్ రోడ్లో ట్రాఫిక్ చిక్కులు తొలగి పోనున్నాయి. జూబ్లీహిల్స్ నుంచి మైండ్స్పేస్, గచ్చిబౌలి వైపు వెళ్లే వారికి 2 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇప్పటికే ఇది హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగా, టూరిస్ట్ స్పాట్గానూ మారింది. బ్రిడ్జిపైన పాదచారుల సంఖ్య కూడా పెరిగింది. బతుకమ్మ ఉత్సవాల్లో బతుకమ్మను, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయపతాకాన్ని కేబుళ్లలలలోని విద్యుత్ వెలుగుల్లో చూడవచ్చు. ఇలా ఆయా సందర్భాలను బట్టి దాదాపు 25 థీమ్ల విద్యుత్కాంతులు చూపరులను ఆకట్టుకోనున్నాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జి వివరాలు.. కేబుల్ బ్రిడ్జి మొత్తం పొడవు (అప్రోచెస్ సహా) :735.639 మీటర్లు ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పొడవు: 425.85 మీటర్లు (96+233.85+96) అప్రోచ్ వయాడక్ట్+సాలిడ్ ర్యాంప్: 309.789 మీటర్లు క్యారేజ్ వే వెడల్పు: 2్ఠ9మీటర్లు (2్ఠ3లేన్లు) ఫుట్పాత్ : 2్ఠ1.8 మీటర్లు స్టే కేబుల్స్ 56 (26్ఠ2) ప్రాజెక్ట్ వ్యయం: రూ.184 కోట్లు నిర్మాణ సంస్థ: ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ దేశంలో పెద్దది.. ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జిల్లో అత్యంత పొడవైన మెయిన్ స్పాన్ (233.85 మీటర్లు) దేశంలో ఇదే ప్రథమం. గుజరాత్లోని భరూచ్లో నర్మద నదిపై 144 మీటర్ల పొడవుతో ఉన్నదే ఇప్పటి వరకు పెద్దది. ప్రపంచవ్యాప్తంగా పరిగణనలోకి తీసుకుంటే ఇది మూడోది. జపాన్లో ఇంతకంటే పెద్దవి ఉన్నప్పటికీ వాటిల్లో స్టీల్ను వినియోగించారు. ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జిలో మాత్రం ఇంత పెద్దది ఇంకెక్కడా లేదని ప్రపంచంలోనే ఇది ‘లాంగెస్ట్ స్పాన్ కాంక్రీట్ డెక్ ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టేయ్డ్ బ్రిడ్జి’అని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా అమెరికా, యూరప్, రష్యా, హాంకాంగ్లకు చెందిన పేరెన్నికగన్న పలు అంతర్జాతీయ ఇంజనీరింగ్ సంస్థల సహకారంతో పూర్తి చేసినట్లు ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వెంకటరమణ తెలిపారు. డిజైన్, నిర్మాణం ఈపీసీ పద్ధతిలోనే జరిగాయి. ఈ సంవత్సరం ఆగస్టు నాటికే పనులు పూర్తయినా ప్రత్యేక విద్యుత్ థీమ్ల కోసం మరికొంత సమయం పట్టింది. దేశంలో మీడియా కంటెంట్తో స్టే కేబుల్ లైటింగ్ ఇదే ప్రథమం. ఎస్సార్డీపీ పనుల్లో భాగంగా జీహెచ్ఎంసీ దీన్ని నిర్మించింది. ఇంకా.. కేబుల్స్ కొనుగోలు, వాటి సామర్థ్య పరీక్షలు ఆస్ట్రియా, జర్మనీ దేశాల్లో జరిగాయి. యూకే, కొరియా డిజైనర్ల సహకారం తీసుకున్నారు. బ్రిడ్జి మీద వెలుగుల కోసం విద్యుత్ పోల్స్ లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ౖఎలాంటి డార్క్ పాచెస్ ఉండవు. క్యారేజ్వే అంతటా ఒకేవిధంగా లైటింగ్ ఉంటుంది. ఫుట్పాత్పై ‘ఎస్’వేవ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. సెలవుదినాలైన శని, ఆదివారాల్లో వాహనాల ప్రయాణంపై నిషేధం. కేవలం పాదచారులకు మాత్రమే అవకాశం. వాహనాల స్పీడ్ పరిమితి 35 కేఎంపీహెచ్గా ఉంటుంది. 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతంగా వర్ణిస్తున్నారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చెరువులో ఎలాంటి పిల్లర్లు వేయలేదు. కేవలం రెండు చివర్లలో రెండు పిల్లర్లు మాత్రమే వేశారు. ఎలివేటెడ్ కారిడార్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్బ్రిడ్జిని చేరుకునేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా పూర్తయింది.ఈ ఫ్లైఓవర్ వివరాలు.. పొడవు: 1.74 కి.మీ. వెడల్పు: 16.60 మీటర్లు(నాలుగులేన్లు) వ్యయం: రూ.150 కోట్లు 6 కి.మీ. సాఫీ జర్నీ ఈరెండింటి పొడవు దాదాపు 2.5 కి.మీ.లు అయినా 6 కి.మీ.ల మేర ట్రాఫిక్ చిక్కులు లేని సాఫీ ప్రయాణంసాధ్యం కానుంది. రోడ్ నంబర్ 45 జంక్షన్ నుంచి మీనాక్షి టవర్స్, గచ్చిబౌలి వరకు సాగిపోవచ్చని అధికారులు తెలిపారు. -
కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం
-
కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో పెద్ద బ్రిడ్జి ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 5 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగనుంది. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జి రాత్రి సమయంలో జిగేల్ మంటూ ఇట్టే ఆకర్షించే రీతిలో విద్యుత్ కాంతుల ఉన్న దృశ్యాలు అందరినీ కట్టి పడేస్తున్నాయనే చెప్పాలి. ( హైదరాబాద్ : సర్వాంగ సుందరంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ) జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ఐటీ కారిడార్ను కేబుల్ బ్రిడ్జి ద్వారా అనుసంధానం చేస్తూ రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించారు. 233 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పు ఉంటుంది. పాదచారులు, సైకిలిస్ట్ల కోసం ప్రత్యేకంగా ట్రాక్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్ మంటోంది. కేబుల్ బ్రిడ్జికి రెండు వైపుల వాటర్ ఫౌంటేన్లు ఏర్పాటు చేయనున్నారు. -
హైదరాబాద్ : సర్వాంగ సుందరంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
-
కేబుల్ బ్రిడ్జి వచ్చే వారంలో ప్రారంభం
సాక్షి, గచ్చిబౌలి: హుస్సేన్ సాగర్ తరువాత చెప్పుకోదగ్గ చారిత్రక సుందర తటాకం మన దుర్గం చెరువు. నిజాం నవాబుల కాలంలోనే హుస్సేన్ సాగర్ నిర్మించగా రెండు గుట్టల మధ్యలో గలగల పారే సేలయేరు లాంటి దుర్గం చెరువు ఆ నిజాం నవాబులు నివాసం ఉండే సెవన్ టూంబ్స్కు తాగునీరు అందించినట్లు చరిత్ర చెబుతోంది. అంతటి ప్రాధాన్యత ఉన్న దుర్గం చెరువు మొన్నటి వరకు దుర్గంధంగా మారిందనే చెప్పాలి. ఐటీ కారిడార్లో ఉన్న మేటి చెరువుగా ప్రసిద్ధి గాంచిన దుర్గంచెరువు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోగా కె.రహేజా గ్రూపు చెరువు అభివృద్ధికి నడుం బిగించింది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రహేజా గ్రూపు దుర్గం చెరువును టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతున్నాయి. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తి కాగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కేబుల్ బ్రిడ్జి రాత్రి సమయంలో జిగేల్ మంటూ ఇట్టే ఆకర్షించే రీతిలో విద్యుత్ కాంతుల ఉన్న దృశ్యాలు అందరినీ కట్టి పడేస్తున్నాయనే చెప్పాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో బోటింగ్, రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర టూరిజం శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మనోహర్ను ఆదేశించారు. విద్యుత్ వెలుగు జిలుగులు మధ్య కేబుల్ బ్రిడ్జిపై విహరిస్తూ దుర్గం చెరువు అందాలను మనసారా చూస్తూ పర్యాటకులు సేదదీరే అరుదైన అవకాశం చిక్కనుంది. ఇది నిజంగా నగర వాసులకు సరికొత్త అనుభూతిగా చెప్పవచ్చు. మరి కొద్ది రోజుల్లోనే దుర్గం చెరువు మరో ఐకాన్గా నిలువనుంది. వచ్చే వారంలో కేబుల్ బ్రిడ్జి ప్రారంభం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ఐటీ కారిడార్ను కేబుల్ బ్రిడ్జి ద్వారా అనుసంధానం చేస్తూ రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించారు. 233 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పు ఉంటుంది. పాదచారులు, సైకిలిస్ట్ల కోసం ప్రత్యేకంగా ట్రాక్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్ మంటోంది. కేబుల్ బ్రిడ్జికి రెండు వైపుల వాటర్ ఫౌంటేన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని వచ్చే వారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిచనున్నారు. ప్రారంభానికి జీహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్తో పాటు హెచ్ఎండీఏ, టూరిజం శాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఉదయం సాయంత్రం వేళల్లో జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్కు రావాలంటే దాదాపు 30–40 నిమిషాల సమయం అవసరం. రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి ద్వారా ఐటీ కారిడార్లోని ఇనార్బిట్ మాల్కు కేవలం10 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. సర్వాంగ సుందరంగా ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జికి తగ్గట్టుగా దుర్గం చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధేందుకు ‘మన దుర్గం పేరిట’ కె రహేజా గ్రూపు రూ.40 కోట్లకు పైగా సీఎస్ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చుచేసింది. చెరువు చుట్టూ 4.5 కిలో మీటర్ల పొడవునా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసింది. భద్రతలో భాగంగా ఇన్నర్ సైడ్ సేఫ్టీ రెయిలింగ్ను అమర్చారు. ట్రాక్ పొడవునా ప్లాంటేషన్తో పాటు ఎలక్ట్రికల్ లైటింగ్ అమర్చనున్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియాతో పాటు ఓపెన్ జిమ్, రెండు ఎంట్రెన్స్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. ఇనార్బిట్ మాల్ వైపు ఉన్న బ్రిడ్జి కింది భాగం నుంచి ఎన్సీసీ బిల్డింగ్ వద్ద ఉన్న ఎంట్రెన్స్ పాలజా వరకు ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేస్తున్నారు. అందులో వర్టికల్ ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్ చేపట్టి ఆహ్లాదంగా తీర్చి దిద్దనున్నారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభంలోపే సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. దుర్గంధంగా ఉన్న దుర్గం చెరువులో గుర్రపు డెక్కను పూర్తి స్థాయిలో తొలగించారు. అంతే కాకుండా చెరువులో మురుగు నీరు కలువ కుండా ఉంచేందుకు రెండున్నర కిలో మీటర్ల పొడవునా పైపులైన్ వేసి మురుగు నీరును కిందికి పంపిస్తున్నారు. కేవలం వర్షం వచ్చినప్పడే మాత్రమే ఇన్లెట్స్ ద్వారా కొద్ది మేర మురుగు నీరు చెరువులోకి వచ్చే అవకాశం ఉంది. చెరువులోకి వచ్చే ఇన్లెట్స్ వద్ద మురుగు నీరు శుద్ధి చేసే అంశాల్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ బోటింగ్ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించినట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. సోఫాలో కూర్చుని పర్యాటకులు జాలీ రైడ్కు వెళ్లేందుకు డీలక్స్ బోట్ అందుబాటులోకి తెస్తామన్నారు. నలుగురు కూర్చునే స్పీడ్ బోట్తో పాటు రెండు ఫెడల్ బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. దుర్గం చెరువులో పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ను నెలకొల్పుతామని పేర్కొన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే బోటింగ్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. నగరానికే తలమానికింగా ఉండే కేబుల్ బ్రిడ్జి ప్రారంభం అనంతం రెండవ ఫేజ్లో పర్యాటకుల సౌకర్యార్ధం మరిన్ని ఏర్పాట్లు చేసే ఆలోచన ఉందని అన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మరో అద్బుతం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
-
భాగ్యనగరం మెడలో మరో మణిహారం
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువు వంతెనను నిర్మిస్తోంది. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ తీగల వంతెనతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గనున్నది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ఈ వంతెన అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతి సుందరమైన ఈ కట్టడం నగర ప్రజలను మంత్రముగ్ధులను చేస్తోంది. (‘కేబుల్ వంతెన’.. పర్యాటక ఆకర్షణ!) దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్ మొట్టమొదటి హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతోపాటు పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. దీనికి సంబంధించిన వీడియోను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ‘దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జీ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమైన అంశం. మౌలిక సదుపాయాల కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో 60 శాతానికి పైగా నిధులను ఖర్చు చేస్తోంది. వంతెనను నిర్మించిన ఇంజనీర్లకు ధన్యవాదాలు.’ అని పేర్కొన్నారు. ఇక రంగురంగుల విద్యుత్ కాంతులతో జిగేలుమంటున్న ఈ వీడియో ప్రస్తుతం నగర ప్రజలను ఆకర్షిస్తోంది. A sneak peek of the very soon to be unveiled cable stay bridge on Durgam Cheruvu 😊 Infrastructure is the key to growth & #Telangana Govt spends over 60% budget on infra creation Great job engineering team 👍@GHMCOnline @bonthurammohan @arvindkumar_ias #HappeningHyderabad pic.twitter.com/CvHwwk4l6X — KTR (@KTRTRS) September 2, 2020 -
హైదరాబాద్ : ప్రారంభానికి సిద్ధమవుతున్న కేబుల్ బ్రిడ్జి
-
‘కేబుల్ వంతెన’.. పర్యాటక ఆకర్షణ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేవి.. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం. వీటితో పాటు సైబర్ టవర్స్, హైటెక్సిటీ, ఐకియా వంటివి కూడా.. ఇక తాజాగా ఈ వరుసలో చేరనున్నది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. ప్రారంభానికి ముందే ఎంతగానో ప్రచారమైన దుర్గం చెరువు కేబుల్ వంతెన.. ప్రారంభానంతరం పర్యాటక ప్రాంతంగానూ మారనుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధవహిస్తూ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ వంతెన.. శని, ఆదివారాల్లో పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ రెండ్రోజుల్లో వంతెన పైకి వాహనాలకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. వచ్చే నెలాఖరులో ప్రారంభం.. బ్రిడ్జి నిర్మాణానికి రూ.184 కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుతం ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకు ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ ముహూర్తం నిర్ణయించారు. ఇది ప్రారంభమయ్యాక ఆ సొగసులకు పర్యాటకులు మంత్రముగ్ధులు కావడం ఖాయమని అంటున్నారు. వారాంతాల్లో కేవలం పర్యాటకులను కాలినడకన మాత్రమే బ్రిడ్జిపైకి అనుమతి స్తారని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు ప్రకృతిని, ప్రశాంతతను ఆస్వాదించాలనే కేటీఆర్ ఆదేశాలకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాహ నాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇక, ప్రత్యేక తరహా లైటింగ్ సిస్టంతో కేబుల్ బ్రిడ్జి రాత్రిళ్లు వెలుగులు విరజిమ్మనుంది. వివిధ బొమ్మలు వెలుతుర్లో కనువిందు చేయనున్నాయి. దుర్గంచెరువులోని నీళ్లూ మిలమిలా మెరవనున్నాయి. ఈ బ్రిడ్జి ప్రారంభంలోగా జూబ్లీహిల్స్ రోడ్నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనుల పూర్తికీ జీహెచ్ఎంసీ శ్రమిస్తోంది. ► ఐటీ శాఖ నిర్వహిస్తున్న ఈ–ప్రొక్యూర్మెంట్ విభాగం ద్వారా సుమారు రూ.1,20,434 అంచనా వ్యయం కలిగిన 1,55,182 టెండర్లను నిర్వహించారు. ఈ గణాంకాలతో టెండర్ల నిర్వహణలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ► టెక్నాలజీ ఎంపవరింగ్ గరŠల్స్ పేరుతో 560 మంది స్త్రీలకు డిజిటల్ లిటరసీ నైపుణ్యాన్ని అందించింది. ► కరోనా రోగుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన వెంటిలేటర్ను టీ–వర్క్స్ తయారుచేసింది. ► తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తెలుగు వికీపీడియా రూపకల్పనకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్తో కలిసి పనిచేస్తోంది. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం ఉన్న లక్ష వ్యాసాలను 30 లక్షలకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ► తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తరఫున తెలంగాణ ఇన్నోవేషన్ యాత్ర నిర్వహించి 120 మంది ఔత్సాహిక ఆవిష్కర్తలను గుర్తించారు. ► నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘టీ–వ్యాలెట్’యాప్ను 11 లక్షల మంది వినియోగదారులు క్రియాశీలంగా వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు రూ.6,795 కోట్ల లావాదేవీలు దీని ద్వారా జరిగాయి. ► ఐటీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ఇప్పటికే నాలుగేళ్లను పూర్తి చేసుకుంది. ఫేస్బుక్, యూటీసీ, బోయింగ్ వంటి కంపెనీలతో కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలను కొనసాగిస్తున్నది. ► తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా 3.50 లక్షల మంది నిరుద్యోగ యువతకు, 1,500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 40కిపైగా కార్పొరేట్ కంపెనీలతో 4,500 మంది విద్యార్థులకు టాస్క్ ద్వారా ఉద్యోగావకాశాలు లభించాయి. ► దేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 6 శాతం. 250కిపైగా కంపెనీలు రాష్ట్రంలో లక్షా 16 వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తున్నాయి. ► 2019లో తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం రూ.7,337 కోట్ల పెట్టుబడులను తెచ్చింది. స్కైవర్త్ గ్రూప్, ఇన్నోలియా ఎనర్జీ వంటి భారీ పెట్టుబడులతో పాటు ప్రస్తుతం ఉన్న కంపెనీలు కూడా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. ► మైక్రాన్ తన ఉద్యోగులను 700 నుంచి 2,000 పెంచింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో వన్ ప్లస్ అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నది. -
రోడ్ నెంబర్ 45లో ఆస్తుల సేకరణ పూర్తి
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తుల సేకరణ పూర్తికానందున ఎంతోకాలంగా ముందుకు సాగని జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనులిక వేగం పుంజుకోనున్నాయి. వాస్తవానికి గత సంవత్సరమేఈ కారిడార్ పనులు పూర్తి కావాల్సి ఉండగా, నిర్మాణ పనులకు అవసరమైన ఆస్తుల సేకరణలో 21 ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారడంతో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఆస్తుల సేకరణ పూర్తయిందని, ఇప్పుడిక పనుల వేగం పెంచుతామనిఅధికారులు చెబుతున్నారు. దుర్గం చెరువుకు అనుసంధానం.. దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులు దాదాపుగా పూర్తయినప్పటికీ, రోడ్నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితేనే దాన్ని ప్రారంభించనున్నారు. లేని పక్షంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తనుండటంతో రోడ్నెంబర్ 45 పనుల్ని వీలైనంత త్వరితంగా పూర్తిచేసేందుకుఅధికారులు చర్యల్లో మునిగారు. దుర్గం చెరువు, రోడ్నెంబర్ 45 పనులు పూర్తయితే ఐటీ కారిడార్ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని భావించిన మునిసిపల్ మంత్రి కేటీఆర్ సైతం వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నెల ఆరంభంలో ఈ ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిశీలించారు. విద్యుత్ లైన్ల తరలింపు పనులు జరగాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడారు. వారు రెండు వారాల్లోగా విద్యుత్ లైన్లు తరలిస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా విద్యుత్ అధికారులు తగు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కారిడార్ పనులు జరిపేందుకు అవసరమైన మేర విద్యుత్ లైన్ల తరలింపు మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం. దాంతో ఎలివేటెడ్ కారిడార్ పనులు చేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ తరలింపు పనుల సమస్యలు కొలిక్కి రావడంతో సత్వరం పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. జూన్ 2న ప్రారంభించే యోచనలో.. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన దుర్గం చెరువు కేబుల్ వంతెనతో పాటు రోడ్నెంబర్ 45 కారిడార్లను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. యంత్రాలు, కార్మికుల సంఖ్యను పెంచైనా సరే పనులు పూర్తిచేయాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో కాంట్రాక్టు ఏజెన్సీ, అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దుర్గం చెరువు పనులు దాదాపుగా ఇప్పటికే పూర్తయినా, రోడ్నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనులు జరగాల్సి ఉంది. రోడ్నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే, పంజగుట్ట, బంజారాహిల్స్ల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వరకు సాఫీగా సాగిపోవచ్చు. తద్వారా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం రూ.150 కోట్లు. షేక్పేట కారిడార్కు తొలగనున్న ఇబ్బందులు.. దీంతోపాటు దాదాపు రూ.335 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన షేక్పేట ఎలివేటెడ్ కారిడార్ పనులకు కూడా సమస్యలు తొలగనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీని నిర్మాణానికి అవసరమైన భారీ ఆస్తి సేకరణ పూర్తయిందని, అంతమేర పనులు చేపట్టేందుకు వీలుందని అధికారులు తెలిపారు. మిగతా ఆస్తుల సేకరణ కూడా ఈనెలాఖరు వరకు పూర్తిచేయనున్నట్లు సంబంధిత టౌన్ ప్లానింగ్ విభాగం చెబుతోంది. దీని నిర్మాణం పూర్తయితే మెహిదీపట్నం, సెవెన్ టూంబ్స్, ఫిల్మ్నగర్ తదితర మార్గాల నుంచి ఐటీ కారిడార్కు వెళ్లేవారికి ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. -
ఇక నవ దుర్గం
సాక్షి, హైదరాబాద్ : ఐటీ కారిడార్ ప్రాంగణంలో ఉన్న దుర్గం చెరువు నవరూపును సంతరించుకుంటోంది. ఓవైపు కేబుల్ బ్రిడ్జ్ పనులు సాగుతుండగానే.. మరోవైపు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లు (ఎఫ్టీసీ) కూడా శరవేగంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు చెరువు చుట్టూరా ఫన్, ఈట్, గేమ్ జోన్స్ ఉండేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ చెరువును వీక్షించేందుకు వచ్చే సందర్శకులకు వినోదం దగ్గరి నుంచి ఆహారం వరకు ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉండి వారిలో జోష్ నింపేలా అడుగులు వేస్తున్నారు. దుర్గం చెరువు వద్ద రూ.184 కోట్ల వ్యయంతో ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వీటితో పాటు చెరువులో గుర్రపు డెక్క, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు ఎఫ్టీసీలు సైతం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ (బీపీపీఏ) పర్యవేక్షణ తరహాలోనే దుర్గం చెరువు డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేసే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆ చెరువు చుట్టూరా ఉన్న దాదాపు 300 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు హెచ్ఎండీఏకు అప్పగించే విధంగా పనులు వేగిరం చేశారు. బీపీపీఏ మాదిరిగానే.. బీపీపీఏ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కులను అభివృద్ధి చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూరా పచ్చదనం పెంపుతో పాటు ఎంటర్టైన్మెంట్ జోన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. హుస్సేన్ సాగర్లో బోటింగ్ ఏర్పాట్లతో పాటు ఆటవిడుపు కోసం ఆయా పార్కుల్లో గేమింగ్ జోన్ ఉండేలా చూసుకున్నారు. ఇదే తరహాలో దుర్గం చెరువును కూడా మార్చేలా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో దుర్గం చెరువు డెవలప్మెంట్ అథారిటీ త్వరలోనే ఏర్పాటుకానుంది. ఆ చెరువు చుట్టూరా 300 ఎకరాలను హెచ్ఎండీఏకు అప్పగిస్తే పూర్తి స్థాయిలో పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఉండేలా అభివృద్ధి చేయనున్నారు. ఒకవేళ ఈ అథారిటీ ఆచరణ రూపంలోకి వస్తే 86 ఎకరాల్లో ఉన్న దుర్గం చెరువు టూరిస్ట్ హబ్గా మారనుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు సేద తీరేందుకు ఇది సరైన ప్రాంతం కానుందని స్థానికులు అంటున్నారు. -
జతకట్టిన ఆ గట్టు.. ఈ గట్టు
సాక్షి, సిటీబ్యూరో: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పనుల్లో అత్యంత కీలక ఘట్టం తుది సెగ్మెంట్ అమరికను ప్రాజెక్ట్ టీమ్ మంగళవారం రాత్రి విజయవంతంగా పూర్తి చేసింది. అంతర్జాతీయ స్థాయి భద్రత,నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మొత్తం 53 సెగ్మెంట్ల ఏర్పాటును 22 నెలల్లో పూర్తి చేశారు. తెలంగాణ ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ, జీహెచ్ఎంసీ ప్రాజెక్టŠస్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీధర్ నేతృత్వంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటరమణ పర్యవేక్షణలో చివరి కీ సెగ్మెంట్ అమరికను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పూర్తి చేశారు. సాయంత్రం 4:30గంటలకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన సెగ్మెంట్ అమరిక పనిని రిమోట్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. సెగ్మెంట్లలో చివరి ఘట్టాన్ని పురస్కరించుకొని టీమ్ సభ్యులు ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చారు. ఇంజినీరింగ్ అద్భుతం... ఇప్పటి వరకు హైదరాబాద్ అంటే ప్రసిద్ధి చెందిన చార్మినార్, గోల్కొండ గుర్తుకొస్తాయి. ఇప్పుడీ జాబితాలో కేబుల్ బ్రిడ్జి చేరనుంది. దుర్గం చెరువుపై ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పనులు 21వ శతాబ్దపు ఇంజినీరింగ్ అద్భుతమని పలువురు పేర్కొంటున్నారు. మూడు మిలియన్లకు పైగా పనిగంటలతో అధునాతన సాంకేతికతతతో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేశారు. ప్రపంచంలోనే పొడవైన స్పాన్లు కలిగిన కేబుల్ బ్రిడ్జిలు జపాన్లో 275, 271 మీటర్లతో రెండుండగా... 234 మీటర్లతో మూడోది ఇదేనని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు తెలిపారు. స్టీల్ లేకుండా ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జిలో మాత్రం ప్రపంచంలో ఇదే పొడవైనదన్నారు. మన దేశానికి సంబంధించినంత వరకు గుజరాత్లోని బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్డే అతి పెద్దది. ఎస్సార్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ రూ.184 కోట్లతో ఈ బ్రిడ్జి పనులు చేపట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఈ బ్రిడ్జి పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ బ్రిడ్జికి సంబంధించి ఫినిషింగ్ పనులతో పాటు రెయిలింగ్, ప్రత్యేక విద్యుదీకరణ తదితర పనులు చేయాల్సి ఉంది. అన్నీ పూర్తయి వినియోగంలోకి రావడానికి దాదాపు నాలుగు నెలల సమయం పట్టనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఐకియా స్టోర్ వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. జూబ్లీహిల్స్ నుంచి మైండ్స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కి.మీ.ల మేర దూరం తగ్గడంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, మాదాపూర్లపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. -
అద్భుతం ఆవిష్కృతమైంది.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ డోస్డ్ కేబుల్ బ్రిడ్జి పనుల్లో శనివారం అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడ 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తున్న సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్ల అమరికకు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తున్న విషయం విదితమే. ఇప్పటి వరకు ఒక్కో సెగ్మెంట్ను మాత్రమే అమర్చగా... శనివారం ఏక కాలంలో రెండు సెగ్మెంట్లను ఒకేసారి పైకి తీసుకెళ్లి విజయవంతంగా అమర్చారు. కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే ఈ పని పూర్తి చేసిన ఇంజినీరింగ్ టీమ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేందుకు మొత్తం 53 సెగ్మెంట్లు అమర్చాల్సి ఉండగా... ఈ రెండింటితో కలిపి 50 సెగ్మెంట్ల అమరిక పూర్తయిందని ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకటరమణ తెలిపారు. మిగిలిన మూడు సెగ్మెంట్ల అమరిక పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కాగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్ ఇనార్బిట్మాల్ వరకు దాదాపు కి.మీ. పొడువున నిర్మించే ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ నుంచి హైటెక్సిటీ, మాదాపూర్ రూట్లో వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. అలాగే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకోనుంది. హౌరా– కోల్కత్తాల నడుమ నున్న హౌరా బ్రిడ్జిని( రవీంద్ర సేతు) తలపించేలా ఈ వేలాడే వంతెనను నిర్మించనున్నారు ఆరు లేన్లతో తగిన ఫుట్పాత్లతో నిర్మిస్తున్న ఈబ్రిడ్జిపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. దీనికయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ చెరిసగం భరించనున్నాయి. ముంబై, గోవా, కోల్కత్తా, జమ్మూకాశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఇలాంటి బ్రిడ్జిలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అందుబాటులో లేవు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. ♦ నగరంలోని ఇతర ప్రాంతాలనుంచి హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు వెళ్లే వారికి సదుపాయంగా ఉంటుంది. ♦ జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 36, మాదాపూర్ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ♦ జూబ్లీహిల్స్ నుంచి మైండ్స్పేస్, గచ్చిబౌలి వెళ్లేవారికి దాదాపు 2 కి.మీ.ల మేర దూరం తగ్గుతుంది. బ్రిడ్జి ముఖ్యాంశాలు.. ♦ అప్రోచ్లతో సహ బ్రిడ్జి పొడవు: 1048 మీ. ♦ కేబుల్ స్టే బ్రిడ్జి (వేలాడే వంతెన): 366 మీ. ♦ అప్రోచ్ వయడక్ట్, ర్యాంప్: 682 మీ. -
జిగేల్ లైటింగ్
పంద్రాగస్టు రోజున మన జాతీయ జెండా...అక్టోబర్ 2న జాతిపిత చిత్రం...జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ ముఖచిత్రం...జాతీయ నేతల పుట్టిన రోజు వేళ వారి ఫొటోలు....ఇవన్నీ విద్యుత్ కాంతుల రూపంలో దర్శనమివ్వబోతున్నాయి. ఎక్కడో తెలుసా...దుర్గంచెరువు వద్ద. అవును...సిటీకే ఐకానిక్గా ఇక్కడ నిర్మిస్తున్న కేబుల్ స్ట్రేబిడ్జిపై దేశంలోనే మొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ‘మీడియా డిస్ప్లే..నోడ్ లైటింగ్ సిస్టం’ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిస్టం ద్వారా బ్రిడ్జి కొత్త తరహాలో వెలుగులు విరజిమ్మనుంది. సందర్భానుసారంగా వంతెనపై లైటింగ్ను మార్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు చైనా సాంకేతిక సహకారం తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ తరహా లైటింగ్ గోవాలో ఉండగా...‘మీడియా డిస్ప్లే’ మాత్రం దేశంలో మన దగ్గరే మొదటిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: పనుల ప్రారంభోత్సవం నుంచే పలు ప్రత్యేకతలతో అందర్నీ ఆకర్షిస్తోన్న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేక వెలుగుజిలుగులను అద్దుకోనుంది. ఓవైపు నిర్మాణంలోనూ పలు ప్రత్యేకతలు కలిగిన ఈ బ్రిడ్జిపై ప్రత్యేక దీపకాంతులద్దనున్నారు. ఇవి మామూలు వెలుగులనే ఇవ్వవు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయపతాకం బ్రిడ్జిపై ప్రత్యక్షమవుతుంది. బతుకుమ్మ పండుగ రోజున బతుకమ్మ ఉత్సవాలు విద్యుత్ వెలుగుల్లో కనిపిస్తాయి. అంతే కాదు.. జాతీయ నేతలు, ఇతర ముఖ్యుల జన్మదినాల సందర్భంగా వారి చిత్రాలు కూడా విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతాయి. కేబుల్బ్రిడ్జిపై ఏర్పాటు చేస్తున్న ‘మీడియా కంటెంట్ డిస్ప్లేతో ఇలా ఏ చిత్రమంటే ఆ చిత్రం..ఏ ఉత్సవమంటే ఆ ఉత్సవం..ఏ బొమ్మ అంటే ఆ బొమ్మ దుర్గం చెరువుపై రాత్రివేళల్లో తళుకులీనుతాయి. చేయి తిరిగిన చిత్రకారుడు తన కుంచెతో కాన్వాస్పై చిత్రించినట్లుగా విద్యుత్ నోడ్స్తోనే ఇవి సాధ్యం కానున్నాయి. ఇందుకుగాను ప్రత్యేకమైన డీఎంఎఫ్ సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. ఇందుకుగాను దాదాపు రూ.5 కోట్లు ఖర్చుకానుంది. ఎంబీఈ ఏజెన్సీ చైనా సహకారంతో ఈ ప్రత్యేక లైటింగ్ను ఏర్పాటు చేయనుంది. తద్వారా బ్రిడ్జి సౌందర్యం మరింత ఇనుమడించనుంది. రెండు దశల్లో లైటింగ్ ఏర్పాట్లు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. తొలిదశలో రూ.5 కోట్ల వ్యయంతో బ్రిడ్జి కేబుళ్లు, టవర్లకు లైటింగ్ పనులు పూర్తిచేస్తారు. రెండోదశలో దుర్గం చెరువులో నీళ్లు మిలమిల మెరిసేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేస్తారు. రానున్న దసరాలోగా బ్రిడ్జి పనులు పూర్తయ్యేనాటికే ఈ ప్రత్యేక విద్యుత్ వెలుగుల పనులు కూడా పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. గోవాలో రంగులు మారే ఏర్పాట్లు మాత్రమే ఉండగా, మీడియా డిస్ప్లే మాత్రం దేశంలో ఇదే మొదటిది కానుంది. హైదరాబాద్కే ఐకానిక్గా... హైదరాబాద్ నగరానికే ప్రత్యేక ఐకానిక్గా ప్రభుత్వం చేపట్టిన దుర్గంచెరువుపై కేబుల్బ్రిడ్జి దక్షిణ భారతదేశంలోనే తొలి కేబుల్బ్రిడ్జి. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జి అంచనా వ్యయం రూ.184 కోట్లు. ఇప్పటికే పలువురి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్రిడ్జి పనులు పూర్తయితే దుర్గంచెరువు ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మారనుంది. స్టీల్ లేకుండా ఎక్స్ట్రా డోస్ట్ కేబుల్ స్టే ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జిల్లో ప్రపంచంలో ఇదే పొడవైన బ్రిడ్జిగా కూడా రికార్డు కానుంది. ఈ కేబుల్బ్రిడ్జిపై మూడు లేన్ల వాహనాల రహదారితో పాటు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లుంటాయి. కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్–జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గడమే కాక జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కి.మీ.ల దూరం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. -
అక్టోబర్లో పూర్తి కానున్న దుర్గం చేరువు కేబుల్ బ్రిడ్జి
-
టూరిస్ట్ ఆకర్షణగా మారనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
-
అక్టోబర్ నాటికి అందాల దుర్గం
సాక్షి, గచ్చిబౌలి: దక్షిణ భారతదేశంలో తొలి కేబుల్ బ్రిడ్జిగా.. మహానగరానికి ఐకానిక్గా దుర్గం చెరువుపై నిర్మిస్తున్న హ్యాంగింగ్ బ్రిడ్జి పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే గనుక అందుబాటులోకి వస్తే నగర సిగలో మరో మణిహారముతుందనడంతో సందేహం లేదు. దీంతో దుర్గం చెరువు ప్రాంతం ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఇక్కడ జరుగుతున్న పనులను శనివారం శనివారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పరిశీలించారు. ఈ బ్రిడ్జి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని వంతెనను విద్యుత్ వెలుగులతో అలంకరించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి రెండు మిలియన్ల పని గంటలు ఎలాంటి ప్రమాదం లేకుండా పూర్తి చేశారు. అత్యంత భద్రతా చర్యలతో పనులు కొనసాగిస్తున్నారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో 238 మీటర్ల పొడవుతో చేపట్టిన ఈ భారీ కాంక్రీట్ నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని ప్రాజెక్ట్ పనులు చేస్తున్న ఇంజినీర్లు చెబుతున్నారు. బ్రిడ్జికి మొత్తం 53 సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటికే 13 సెగ్మెంట్లను అమర్చారు. 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తు ఉన్న సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్ల అమరికకు అత్యంతాధునిక సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు. అక్టోబర్ నాటికి పూర్తి: దానకిశోర్ దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులు అక్టోబర్ నాటికి పూర్తవుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ ఈ సందర్భంగా తెలిపారు. జీహెచ్ఎంసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నామన్నారు. బ్రిడ్జిపై మూడు లేన్ల వాహనాల రహదారితో పాటు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను సైతం నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.10 కోట్ల వ్యయంతో ఆకర్షణీయమైన ఇంటిగ్రేటెడ్ లైటింగ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ లైట్లు మొత్తం స్టీల్ బ్రిడ్జి పిల్లర్లలోనే అమర్చుతున్నట్టు వివరించారు. బ్రిడ్జికి ఇరు వైపులా అత్యాధునిక పద్ధతిలో స్టీల్ రైలింగ్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్–జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గుతుందని, అంతే కాకుండా జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలి వరకు దాదాపు రెండు కి.మీ. దూరం తగ్గుతుందన్నారు. కొండాపూర్లో సెగ్మెంట్ల నిర్మాణం పూర్తి చేసి రాత్రి సమయంలో రోడ్డు మార్గం ద్వారా దుర్గం చెరువుపై అమరుస్తున్నట్లు ఇంజినీర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి, వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, శేరిలింగంపల్లి ఉప కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు. -
కేబుల్ స్పీడ్
సాక్షి, సిటీబ్యూరో: దుర్గం చెరువుఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పనులుశరవేగంగా జరుగుతున్నాయి. దసరా వరకు పనులు పూర్తి చేయాలని భావిస్తున్న జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. రెండు పిల్లర్ల మధ్య వేసే మెయిన్ బ్రిడ్జిలో ప్రీకాస్ట్ సెగ్మెంట్ అలైన్మెంట్ ప్రక్రియను గురువారం విజయవంతంగా పూర్తి చేశారు. 160 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ భారీ సెగ్మెంట్ దేశంలోనే పెద్దది. ఇప్పటివరకు ఇంత బరువైన సెగ్మెంట్ను ఎక్కడా వినియోగించలేదు. ఇనార్బిట్మాల్ సమీపంలోనిప్రీకాస్టింగ్ యార్డులో తయారైన ఈ ప్రీకాస్ట్ సెగ్మెంట్ను తొలుత దుర్గం చెరువు వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత పంటూన్ ద్వారా చెరువులోకి తీసుకెళ్లి పైకి లిఫ్ట్ చేశారు. ఈ బ్రిడ్జిని మొత్తం 52 సెగ్మెంట్లతో నిర్మించనుండగా... దేశీయ సాంకేతికతతోనే ఇంతటి భారీ సెగ్మెంట్ను విజయవంతంగా పైకి తీసుకెళ్లారు. చెరువుపై ఉండే బ్రిడ్జి స్పాన్ 234 మీటర్లు కాగా... ఇది దేశంలోనే అతి పొడవైనది. జపాన్లో ఇంతకంటే పొడవైన స్పాన్లతో కేబుల్ బ్రిడ్జీలు ఉన్నప్పటికీ.. వాటిల్లో స్టీల్ వినియోగించారని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీధర్ తెలిపారు. స్టీల్ లేకుండా ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జిలో మాత్రం ప్రపంచంలోనే ఇది పొడవైనదని పేర్కొన్నారు. ఇంత పొడవైన స్పాన్ ఇప్పటి వరకు ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఇక మన దేశానికి వస్తే గుజరాత్ బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జే పెద్దదని చెప్పారు. మెయిన్ స్పాన్తో పాటు రెండువైపులా బ్యాక్ స్పాన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే పొడవు 426 మీటర్లు అవుతుందన్నారు. దీని అంచనా వ్యయం రూ.184 కోట్లు కాగా... నిర్మాణం పూర్తయితే జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఐకియా స్టోర్ వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుందన్నారు. మొదటి సెగ్మెంట్ అమరిక పనులు మొత్తం ఐదారు రోజుల్లో పూర్తవుతాయని జీహెచ్ఎంసీ సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటరమణ తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులకో సెగ్మెంట్ చొప్పున పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 60 శాతం పూర్తి... దుర్గం చెరువుపై 20 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జి పనులు 65 శాతం పూర్తయ్యాయి. ఎక్స్ట్రా డోస్డ్ సాంకేతికత వినియోగిస్తున్నందున చెరువు మధ్యలో పిల్లర్ అవసరం లేకపోవడంతో పాటు వంతెనను 75 మీటర్లకు బదులు 57 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నారు. హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగానూ ఇది గుర్తింపు పొందనుంది. బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాక జూబ్లీహిల్స్ నుంచి మైండ్స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు 2కి.మీ మేర దూరం తగ్గడంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, మాదాపూర్లపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. దసరా నాటికి ఈ కేబుల్ స్టే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. దీంతో పాటు రూ.333.55 కోట్ల వ్యయంతో చేపట్టిన షేక్పేట్ ఎలివేటెడ్ కారిడార్, రూ.263 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్తగూడ గ్రేడ్ సెపరేటర్, ఒవైసీ హాస్పిటల్ నుంచి బహదూర్పురా మార్గంలో రూ.132 కోట్ల వ్యయంతో కారిడార్, అంబర్పేట ఛే నంబర్ వద్ద రూ.270 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్లు కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. -
దుర్గం చెరువుపై అత్యాధునిక కేబుల్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో జీహెచ్ఎంసీ దుర్గం చెరువు వద్ద చేపట్టిన కేబుల్స్టే బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే అక్టోబర్లోగా పూర్తికానున్నాయి. దేశంలోనే అతి పెద్ద, ప్రపంచ వ్యాప్తంగా మూడవ పెద్ద కేబుల్ బ్రిడ్జిగా చరిత్రకెక్కనుంది. ఇప్పటివరకు గుజరాత్ బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జే అతి పెద్దది. జపాన్లో మరో రెండు పెద్ద కేబుల్ బ్రిడ్జిలున్నాయి. బ్రిడ్జి పనుల్ని త్వరగా పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ ఇంజ నీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో 754.38 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు 60% పూర్తయ్యాయి. వంతెన సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని అధికారులు పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జి ఎత్తు- 20 మీటర్లు పొడవు- 754.38 మీటర్లు నిర్మాణ వ్యయం- 184కోట్లు ఎక్స్ట్రా డోస్డ్ సాంకేతికత.. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఎక్స్ట్రా డోస్డ్ సాంకేతిక విధానాన్ని అవలంబిస్తున్నారు. దీంతో వంతెన ఎత్తు తగ్గడంతో పాటు చెరువుకు ఇరువైపులా, చెరువు మధ్యలో బ్రిడ్జికి పిల్లర్ను నిర్మించకుండానే పూర్తి చేయనున్నారు. సంప్రదాయ సాంకేతిక విధానంలో నిర్మిస్తే 75 మీటర్ల ఎత్తు వరకు పిల్లర్లను నిర్మించడంతో పాటు చెరువు మధ్యలో అంతే ఎత్తులో సపోర్టింగ్గా మరో పిల్లర్ను నిర్మించాల్సి వచ్చేది. దీంతో ఎంతో ఎత్తుపై ఈ కేబుల్ బ్రిడ్జి మహానగరాల ప్రమాణాలకు విరుద్ధంగా ఉండేది. ఎక్స్ట్రా డోస్డ్ సాంకేతిక విధానంతో 75 మీటర్లకు బదులుగా 57 మీటర్ల ఎత్తులోనే పిల్లర్లను నిర్మిస్తున్నారు. ఇలాంటి సాంకేతిక పద్ధతితో కేబుల్ బ్రిడ్జి నిర్మించడం ప్రపంచంలో ఇది మూడోది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మాదా పూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గ డంతో పాటు హైదరాబాద్లో తొలి హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందనుంది. దీంతో మంచి పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. దీనికి అవసరమైన స్టే కేబుళ్లను ఆస్ట్రియా నుంచి తెప్పించారు. ట్రాక్ బీమ్ ఫ్యాబ్రికేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తుతో ఉం డే ప్రధాన బ్రిడ్జికి సంబంధించిన ప్రీ కాస్టింగ్ నిర్మాణ పనులు కొండాపూర్లో జరుగుతున్నాయి. సిగ్నల్ ఫ్రీ కారిడార్.. నగరంలో వివిధ ఐటీ పరిశ్రమలు హైటెక్ సిటీ, మాదాపూర్ వైపున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ మంది నివాసాలు పంజాగుట్ట, ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్లేందుకు ఎన్ఎఫ్సీఎల్ నుంచి ఖాజాగూడ వరకు ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ప్రయాణం సాఫీగా పలు ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో కేబీఆర్ జంక్షన్ చుట్టూ ఫ్లై ఓవర్లు, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, రోడ్ నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్, ఇనార్బిట్ మాల్ నుంచి ఖాజాగూడ టన్నెల్తో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కూడా ఉంది. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రయోజనాలు.. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు ఇది ప్రత్యేక ఐకాన్గా నిలుస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36, మాదాపూర్పై ట్రాఫిక్ తగ్గుతుంది. జూబ్లీహిల్స్ నుంచి మైండ్స్పేస్, గచ్చిబౌలికి దాదాపు 2 కి.మీ. మేర దూరం తగ్గనుంది. నమూనా చిత్రం రూ.2,988 కోట్లతో పనులు: మేయర్ దుర్గం చెరువు బ్రిడ్జి, బయోడైవర్సిటీ జంక్షన్ ఫ్లై ఓవర్ పనుల్ని గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందనతో కలసి మాట్లాడుతూ... సిగ్నల్ ఫ్రీ పనుల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.2,988 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయని, వచ్చే మార్చిలో ప్రారంభిస్తామన్నారు. అలాగే రూ.65.82 కోట్లతో చేపట్టిన రాజీవ్ గాంధీ ఫ్లైఓవర్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. రూ.150 కోట్లతో చేపట్టిన రోడ్ నం.45 ఎలివేటెడ్ కారిడార్ను వచ్చే సెప్టెంబర్లో... రూ.333.55 కోట్లతో నిర్మిస్తున్న షేక్పేట్ ఎలివేటెడ్ కారిడార్, రూ. 263 కోట్లతో చేపట్టిన కొత్తగూడ గ్రేడ్ సెపరేటర్, అంబర్పేట చే నంబర్ వద్ద రూ. 270 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్లు డిసెంబర్లోగా పూర్తికానున్నాయన్నారు. ఓవైసీ హాస్పిటల్ నుంచి బహదూర్పురా మార్గంలో రూ.132 కోట్ల వ్యయంతో చేపట్టిన కారిడార్ నిర్మాణం సెప్టెంబర్లోగా పూర్తి కానుందన్నారు. ఇంకా రూ. 2,353 కోట్ల ఖర్చుతో ఏడు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల పనులకు టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉందని వెల్లడించారు. రూ.1,186 కోట్ల వ్యయంతో ఖాజాగూడ టన్నెల్, ఎలివేటెడ్ కారిడార్, ఉప్పల్ క్రాస్రోడ్ ఫ్లైఓవర్లు అనుమతి దశలో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, సూపరింటిండింగ్ ఇంజనీర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవం గతమే..!
దుర్గం చెరువుకు పూర్వవైభవం ఎప్పుడో...! గుర్రపు డెక్కతో కుంచించుకుపోతున్న చెరువు మంత్రి కేటీఆర్ ఆదేశించినా పట్టించుకోని అధికారులు సాక్షి, సిటీబ్యూరో: చుట్టూ కొండల మధ్యలో సుందరంగా కొలవుదీరిన దుర్గం చెరువు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో నగరవాసులకు పర్యాటక కేంద్రంగా విలసిల్లిన ఈ ప్రాంతం ప్రాభవాన్ని కోల్పోతోంది. చెరువులో గుర్రపు డెక్క పరచుకుపోవడంతో చెరువు ఉన్నట్లుగానే కనిపించ డం లేదు. నగరం విస్తరించ ముందుకు దుర్గం చెరువు గురించి అతి కొద్ది మందికి మాత్రమే అతికొద్దిమందికి మాత్రమే తెలిసేది. ‘సీక్రేట్ లేక్’ గా గుర్తింపు పొందిన ఈ చెరువు గతంలో గోల్కొండ కోటకు తాగునీటి వనరుగా ఉండేది. ‘సైబరాబాద్’ అభివృద్ధితో ఈ చెరువుకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ దీని బాధ్యతలను పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఈ నేపథ్యంలో చెరువుకు ఓ వైపు సమ్థింగ్పిషీ పేరిట బార్ అండ్ రెస్టారెంట్ చేశారు. మరోవైపు రెస్టారెంట్లు నిర్మించారు. బోటు షికారుకు చర్యలు తీసుకున్నారు. గుర్రపు డెక్కతోనే సమస్య అయితే నగర విస్తరణతో చెరువు మురికి కూపంగా మారుతోంది. సమీప కాలనీల నుంచి మురుగునీరు చెరువులోకి చేరడం, చెరువు గర్భంలోనే అపార్టుమెంట్లు వెలియడంతో ఆనవాళ్లు కోల్పోతోంది. దీనికితోడు జలాశయంలో గుర్రపు డెక్క విస్తరించడంతో బోటు షికారుకు అంతరాయం ఏర్పడింది. రెండు ఏళ్లుగా బోటింగ్ను నిలిపివేశారు. అమలుకు నోచని మంత్రి ఆదేశాలు.. గ్రేటర్ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న మంత్రి కేటార్ ఏడాది క్రితం అధికారులతో కలిసి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధికి పనులు వేగవంతం చేయాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటినుంచి నేటి వరకు పనుల్లో కొంచెమైనా పురోగతి కనిపించలేదు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు అభివృద్ధి చేస్తున్న మంత్రి హరీష్ రావుకు దుర్గం చెరువుకు ఎందుకు కనపడలేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. -
ఆక్రమణల ‘దుర్గం’
• 35 ఎకరాల్లో వెలసిన లే-అవుట్లు • పెద్దల ఒత్తిడితో రెండు రోజులుగా నీరు విడుదల • పరిరక్షణపై శ్రద్ధ చూపని ప్రభుత్వం హైదరాబాద్: నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతం... చుట్టూ అత్యంత సుందరమైన ఐటీ కారిడార్. ఆ భూమిపై పెద్దల కన్ను పడింది. పదుల ఎకరాల్లో లే అవుట్లు, అపార్ట్మెంట్లు వెలిశాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. అధికారులు మామూళ్ల గం తలు కట్టుకోగా.. ప్రభుత్వం పెద్దలకే వంత పాడింది. చెరువులను పునరుద్ధరిస్తాం అంటూ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ఆక్రమణలను చూసీచూడనట్లే వదిలేస్తోంది. దీంతో రోజురోజుకు చెరువు కుంచించుకుపోతోంది. ఇదీ కబ్జా కోరల్లో చిక్కుకున్న దుర్గం చెరువు దుస్థితి. ఐటీ కారిడార్లో సుందర తటాకమైన దుర్గం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. వేలాది ఎకరాలు కబ్జాకు గురైనా గత ప్రభుత్వాలు తలెత్తి అటు వైపు చూడలేదు. మిషన్ కాకతీయ పేరిట చెరువుల సంరక్షణకు పెద్దపీట వేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దుర్గం చెరువు పరిరక్షణలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నారుు. మాదాపూర్లోని దుర్గం చెరువు 160 ఎకరాలలో విస్తరించి ఉంది. మాదాపూర్ సర్వే నంబర్ 61లోనే దాదాపు 90 ఎకరాలు. రాయదుర్గం, గుట్టల బేగంపేట పరిధిలో మరో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రెండు గుట్టల మధ్యలో ఉన్న దుర్గం చెరువు సుందర తటాకంగా నిలుస్తూ పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. 35 ఎకరాలు కబ్జా...: దుర్గం చెరువు ప్రస్తుతం కేవలం 125 ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది. దాదాపు 35 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇనార్భిట్మాల్ నుంచి కావూరి హిల్స్కు వెళ్లే రోడ్డు ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్) పరిధిలోకి వస్తుంది. అంతేకాదు వందలాది నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. నెక్టార్ గార్డెన్తో పాటు, అమర్సొసైటీ, కావరి హిల్స్, సెలైంట్ వ్యాలీలోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తారుు. దాదాపు 35 ఎకరాల్లో అపార్ట్మెంట్లు వెలిశారుు. నెక్టార్ గార్డెన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ నివాసం ఉంటున్నారు. అంతే కాకుండా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సినీ, రాజకీయ ప్రముఖులు ఉండటం గమనార్హం. దిగువకు నీరు విడుదల.. భారీ వర్షాలు వచ్చినా దుర్గం చెరువు పూర్తిగా నిండడం గగనమే. అలాంటిది పూర్తి స్థారుు మట్టానికి పది అడుగుల ఉండగానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎఫ్టీఎల్లోని సెలైంట్ వ్యాలీ నివాసితులు రెండు రోజులుగా ఇరిగేషన్ అధికారులకు ఫోన్లు చేసి నీళ్లు కిందికి వదలాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు. గతంలోనూ ఒత్తిళ్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుర్గం చెరువు గేట్లు మూరుుంచారు. దీంతో దుర్గం చెరువు గేట్ ముందు ఉన్న అపార్ట్మెంట్లు, ఇళ్లలోకి నీళ్లు వచ్చారుు. నెక్టార్ గార్డెన్లోకి నీళ్లు రావడంతో స్వయంగా బాబుమోహన్ రంగంలోకి దిగి నీటిని కిందికి విడుదల చేరుుంచారు. దుర్గం చెరువు మొత్తం విస్తీర్ణం: 160 ఎకరాలు ప్రస్తుతం ఉన్న విస్తీర్ణం : 125 ఎకరాలు కబ్జాకు గురైంది : 35 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు: నెక్టార్ గార్డెన్, అమర్సొసైటీ, కావూరి హిల్స్, సెలైంట్ వ్యాలీలోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో వెలసిన నిర్మాణాలు -
దుర్గం చెరువు ఆక్రమణలపై హైకోర్టు ఆందోళన
హైదరాబాద్ : దుర్గం చెరువులో ఆక్రమణలు పెరిగిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్రమణలతో దుర్గం చెరువుకు జరుగుతున్న నష్టంపై సవివర నివేదిక సమర్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) తదితరులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్గం చెరువు దుర్గతిపై 2009లో పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలను హైకోర్టు తనంతట తానుగా (సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇదే అంశంపై కెప్టెన్ జె.రామారావు కూడా 2008 ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను సంయుక్తంగా ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు తాజాగా వీటిపై మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. దుర్గం చెరువు దుస్థితి ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా మేలుకోకపోతే చెరువుల మనుగడు సాధ్యం కాదన్న హైకోర్టు, దుర్గం చెరువు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలంది. దుర్గం చెరువు చుట్టూ వెలసిన ఆక్రమణలు ఎన్ని... చెరువులోకి విడుదలవుతున్న వ్యర్థాలు.. అందుకు బాధ్యతలు ఎవరు తదితర వివరాలతో నివేదికలను తమ ముందుంచాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఇంటివాడైన యువహీరో
యువహీరో సందీప్ కిషన్ తన జీవిత లక్ష్యాల్లో ఒకటి సాధించాడు. 28 ఏళ్ల ఈ కథానాయకుడు తాను పెట్టుకున్న మూడు గోల్స్ లో ఒకటి సాకారం చేసుకున్నాడు. హైదరాబాద్ ఇల్లు, స్పోర్ట్స్ కారు, సొంత హోమ్ ధియేటర్ ఉండాలన్నది అతడి కల. ఇందులో మొదటి లక్ష్యాన్ని సాధించాడు. సొంత ఇల్లు కొనుక్కుని ఓ ఇంటివాడయ్యాడు. మాదాపూర్ లో నాలుగు బెడ్ రూముల ఫ్లాట్ కొనుక్కున్నాడు. తన మామయ్య ఇంటిని తిరిగి కొన్నాడు. 'ఏదోక రోజు నీ అపార్ట్ మెంట్ కొంటా'నని చిన్నప్పుడు మామయ్యతో చెప్పానని సందీప్ కిషన్ గుర్తు చేసుకున్నాడు. అతడి మావయ్య తన ఇంటికి దర్శకుడు వివి వినాయక్ కు అమ్మేశాడు. ఈ ఇంటిని మూడు నెలల క్రితం వినాయక్ నుంచి సందీప్ కిషన్ కొన్నాడు. తన ఫ్లాట్ చాలా బాగుందని, ఇక్కడ నుంచి చూస్తే దుర్గంచెరువు కన్పిస్తుందని చెప్పాడు. ఏడు ఏళ్లుగా తాను దాచుకున్న డబ్బుతో ఈ ఫ్లాట్ కొన్నానని వెల్లడించాడు.