బ్రిటన్‌కు విమాన సర్వీసుల పునఃప్రారంభం  | Flight Services Resume India To UK From Shamshabad | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌కు విమాన సర్వీసుల పునఃప్రారంభం 

Jan 8 2021 8:11 AM | Updated on Jan 8 2021 12:17 PM

Flight Services Resume India To UK From Shamshabad - Sakshi

శంషాబాద్‌: బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు శంషాబాద్‌ విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్‌ రెండో రకం వైరస్‌తో భారత్‌–బ్రిటన్‌  మధ్య విమాన రాకపోకలపై జనవరి 7 వరకు కేంద్రం నిషేధం విధించింది. వీటిని శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొం ది. అయితే ప్రయాణానికి ముందు 72 గంటల్లోపు చేయించుకున్న ఆర్‌ టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును కలిగి ఉండాలనే నిబంధనలను కఠినతరం చేశారు. కాగా బ్రిటన్‌లో స్ట్రెయిన్‌ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మూడో వారం వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తామని ప్రధాని బోరిస్‌ జాన్‌సన్‌ వెల్లడించారు.(చదవండి: స్ట్రెయిన్‌ విజృంభణ.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement