flight journey
-
విమాన ప్రయాణాలు మరింత భారం
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ముంబై విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు మరింత భారం కానున్నాయి. యూజర్ డెవలప్మెంట్ ఫీజును (యూడీఎఫ్) భారీగా పెంచేలా ఎయిర్పోర్ట్ ఆపరేటరు ఎంఐఏఎల్ ప్రతిపాదనలు చేయడమే ఇందుకు కారణం. వీటి ప్రకారం ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు యూడీఎఫ్ రూ.187 నుంచి ఏకంగా రూ.650కి పెరగనుంది. ప్రస్తుతం దేశీ ప్యాసింజర్లకు యూడీఎఫ్ లేకపోయినప్పటికీ ఇకపై వారిపై కూడా రూ.325 మేర యూడీఎఫ్ వడ్డించనున్నారు.ప్రతిపాదిత టారిఫ్ కార్డును ఎయిర్పోర్ట్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతుల కోసం సంస్థ సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు వివరించాయి. వీటిపై తుది నిర్ణయానికి ముందు ఎయిర్పోర్ట్ సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు ఏఈఆర్ఏ మార్చి 25న సమావేశం కానుంది. మరోవైపు, ఎయిర్లైన్స్కి భారీగా ఊరటనిచ్చే దిశగా ఏఈఆర్ఏ వెబ్సైట్ ప్రకారం 2024–2029 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలానికి ల్యాండింగ్, పార్కింగ్ చార్జీలను 35 శాతం తగ్గించేలా ఎంఐఏఎల్ ప్రతిపాదనలు సమర్పించింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో రెండో స్థానంలో ఉండే ముంబై విమానాశ్రయాన్ని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్) నిర్వహిస్తోంది. ఇందులో అదానీ గ్రూప్నకు 74 శాతం, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటాలు ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్టులో ఏటా 5.5 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో రెండు టెర్మినల్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: బెంజ్, కియా కార్ల ధరలు పెంపువిమానాశ్రయ మౌలిక సదుపాయాలను, సాంకేతికతను మెరుగుపర్చుకునేందుకు ప్రతిపాదిత ఫీజులు ఉపయోగపడతాయని ఎంఐఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడిపై రాబడి రూ.285గా ఉండగా సుమారు రూ.332కి (18 శాతం) పెరగనుంది. వచ్చే అయిదేళ్లలో విమానాశ్రయంపై ఎంఐఏఎల్ రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపు
మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ తరుణంలో కొన్ని విమాన సంస్థలు ఇప్పటికే ఛార్జీలు పెంచాయి. దాంతో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల సహేతుకమైన విమాన ఛార్జీలు ఉండాలనేలా ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు ఆకాసా ఎయిర్ స్పందించింది. విమాన ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు, ప్రయాగ్రాజ్కు విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.ఛార్జీల తగ్గింపు, విమానాల సంఖ్య పెంపుఆకాసా ఎయిర్ ప్రయాగ్రాజ్కు విమానాల టికెట్ ధరలను 30-45% తగ్గించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చింది. ముంబై, ఢిల్లీ నుంచి రోజువారీ డైరెక్ట్ సర్వీసులతో పాటు పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతుంది. మహా కుంభమేళా సందర్భంగా విమానాలను పెంచాలని, సహేతుకమైన ఛార్జీలను నిర్వహించాలని విమానయాన సంస్థలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో కంపెనీ ఈమేరకు స్పందించినట్లు తెలిపింది.ప్రభుత్వ జోక్యంవినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు గతంలో లేఖ రాశారు. ప్రయాగ్రాజ్ విమాన ప్రయాణానికి అధిక ఛార్జీలు ఉన్నాయనే ఫిర్యాదులను ఆ లేఖలో హైలైట్ చేశారు. తరువాత ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికపరమైన ప్రయాణ ఇబ్బందులు లేకుండా మహా కుంభమేళాకు భక్తులు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం జోక్యం చేసుకుంది.ప్రయాణికులపై ప్రభావం..ఛార్జీల తగ్గింపు, విమానాల పెంపు నిర్ణయం మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. గతంలో విమాన ఛార్జీలు 300-600% పెరగడంతో, చాలా మంది రోడ్డు లేదా రైలు రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ పీక్ పీరియడ్లో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఆకాసా ఎయిర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..ఇప్పటికే చాలా సంస్థలు..యాత్రికుల రాకపోకలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చేసే ప్రయత్నాల్లో ఆకాసా ఎయిర్ ఒక్కటే కాదు.. ఇండిగో, స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు కూడా ప్రయాగ్రాజ్కు తమ విమానాల సంఖ్యను పెంచాయి. విమానయాన పరిశ్రమ నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షల మంది భక్తుల ప్రయాణం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగుతుంది. -
డబ్బు లేకపోయినా ఫ్లైట్ బుకింగ్.. వినూత్న ఆఫర్
ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్ మేక్మైట్రిప్ (MakeMyTrip) దేశంలో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. విమానాల్లో విదేశాలకు (international flights) వెళ్లేవారికి పార్ట్ పేమెంట్ (part payment) ఆప్షన్ను ప్రవేశపెట్టింది. మొత్తం ఛార్జీలో తొలుత 10 నుండి 40 శాతం మధ్య చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా టికెట్ బుక్ చేసిన 45 రోజుల్లోగా పూర్తి చేయాలి.పార్ట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకునే కస్టమర్లు చార్జీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత నిబంధనల ప్రకారం ధృవీకరించిన బుకింగ్లను సవరించుకోవచ్చని మేక్మైట్రిప్ తెలిపింది. ‘పెద్ద కుటుంబాలు, బృందాలు ఒకేసారి మొత్తం టికెట్ చార్జీని చెల్లించడం భారం అవుతుంది. అటువంటి వారికి పార్ట్ పేమెంట్ ఆప్షన్ సౌకర్యవంతంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది’ అని కంపెనీ సీవోవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు.కాగా, ఎక్కువ మందిని అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రోత్సహించేందుకు పార్ట్ పేమెంట్ ఆప్షన్ దోహద పడుతుందని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. ‘ఇటువంటి సౌకర్యంతో విమానయాన సంస్థలకు క్యాష్ రొటేషన్ అవుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకు చెల్లింపుల సౌలభ్యం ఉంటుంది’ అని వివరించారు. ఈ కొత్త ఫీచర్ సుదూర, స్వల్ప-దూర అంతర్జాతీయ విమానాలను, ముఖ్యంగా రూ. 1 లక్షకుపైగా టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులను ఆకట్టుకుంటోందని కంపెనీ పేర్కొంది. దీనిపై సానుకూల ప్రారంభ స్పందన వచ్చిందని చెప్పిన కంపెనీ ఈ ఫీచర్ కస్టమర్లకు ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తోంది.ఇలా పని చేస్తుందంటే..కొత్తగా ప్రవేశపెట్టిన పార్ట్ పేమెంట్ ఆప్షన్ మొత్తం ఛార్జీలో కేవలం 10-40% ముందుగా చెల్లించడం ద్వారా నిర్ధారిత బుకింగ్లను పొందేందుకు ప్రయాణికులను అనుమతిస్తుంది. ఖచ్చితమైన శాతం విమానయాన సంస్థ, ప్రయాణ మార్గం, బుకింగ్ విండో వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా బుకింగ్ చేసిన 45 రోజులలోపు, ఏది ముందు అయితే అది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. పూర్తి చెల్లింపు చేసిన తర్వాత, వినియోగదారులు ఛార్జీల నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన బుకింగ్లను సవరించవచ్చు.ఇది కాకుండా జీరో క్యాన్సిలేషన్, ఫేర్ లాక్ ఫీచర్లతో పాటు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటును కూడా మేక్మైట్రిప్ కల్పిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు బయలుదేరడానికి రెండు గంటల ముందు వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
విమానాల్లో వైఫై.. ఫ్రీగా ఇంటర్నెట్
విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) దేశీ, విదేశీ రూట్లలో నడిపే ఫ్లయిట్స్లో వైఫై (Wi-Fi) ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఎయిర్బస్ ఏ350, బోయింగ్ 787–9 రకం విమానాలతో పాటు నిర్దిష్ట ఎయిర్బస్ ఏ321నియో ఎయిర్క్రాఫ్ట్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.దేశీయంగా ఫ్లయిట్స్లో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థ తమదేనని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. దేశీ రూట్లలో ప్రస్తుతానికి వీటిని కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు వివరించింది. క్రమంగా అన్ని విమానాల్లోనూ ఈ సేవలు ప్రవేశపెడతామని పేర్కొంది.విమానాలు 10,000 అడుగుల ఎత్తు దాటాకా ప్రయాణికులు తమ ల్యాప్ టాప్లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వైఫైకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ సేవలు ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించించింది.ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రోగ్రామ్గా గతంలో ఈ సర్వీసును ప్రారంభించింది. వీటిలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన గమ్యస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. వై-ఫై సేవలను క్రమంగా ఇతర విమానాలకు కూడా విస్తరిస్తారు. -
విమాన రంగం ఆశావహం
భారత మార్కెట్లో ఏవియేషన్ రంగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ తెలిపారు. దేశీ విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున ఎయిర్క్రాఫ్ట్లకు ఆర్డర్లు ఇస్తున్న నేపథ్యంలో పైలట్ కావాలనుకునే ఔత్సాహికులు భారత్ వైపు చూడొచ్చని ఆయన సూచించారు.ఎయిర్ కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా ఆర్థిక పురోగతి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని గుర్తించిన భారత్.. విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తోందని వాల్ష్ చెప్పారు. మరోవైపు, దేశీయంగా ఎయిర్పోర్ట్ చార్జీలపై స్పందిస్తూ.. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండటం సానుకూలాంశమని ఆయన వివరించారు. పరిశ్రమపై చార్జీల ప్రభావాన్ని గుర్తెరిగిన నియంత్రణ సంస్థ .. విమానయాన సంస్థలు, పరిశ్రమ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడంపై సానుకూలంగా వ్యవహరిస్తోందని వాల్ష్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవల నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించినట్లు తెలిపింది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. -
60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్క్రాఫ్ట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.వైడ్ బాడీ విమానాలు లేవు..‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!ఈ ప్రాంతాల నుంచి యూఎస్కు విమానాలుఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది. -
అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!
పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. ఎయిర్లైన్ 'ఫ్లాష్ సేల్' ఆఫర్ల కింద కేవలం రూ. 1606 ప్రారంభ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.దీని ద్వారా ప్రయాణికులు దేశంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం ఉంది. గౌహతి-అగర్తలా, కొచ్చి-బెంగళూరు, చెన్నై-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్ వంటి ప్రముఖ మార్గాలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.ఫ్లాష్ సేల్ కింద బుకింగ్ 27 అక్టోబర్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీలు నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు ఉంటాయి. కొత్త గమ్యస్థానంలో పండుగను ఆస్వాదించాలనుకునే ప్రయాణీకులకు ఇది గొప్ప అవకాశం.ఇతర ఆఫర్లుఫ్లాష్ సేల్తో పాటు ఎయిర్లైన్ ఎక్స్ప్రెస్ లైట్ ఆఫర్ను కూడా ప్రకటించింది. దీనిలో విమాన టిక్కెట్లను బుకింగ్ చేయడానికి ప్రారంభ ధర కేవలం రూ.1456. దీని కింద ప్రయాణికులకు అందనంగా జీరో కన్వీనెన్స్ ఫీజు ప్రయోజనం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్ప్రెస్ లైట్ అదనపు 3 కిలోల క్యాబిన్ సామాను ఉచిత ప్రీ-బుకింగ్, చెక్-ఇన్ బ్యాగేజీ ధరలపై తగ్గింపు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ప్రయాణించే లాయల్టీ సభ్యులు 50% తగ్గింపు రుసుముతోనే బిజినెస్ సీట్లకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 'గౌర్మెట్' హాట్ మీల్స్, సీట్లపై 25% తగ్గింపు, ఎక్స్ప్రెస్ ఎహెడ్ ప్రాధాన్యతా సేవలను కూడా పొందవచ్చు. అలాగే విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సిబ్బంది ఎయిర్లైన్ వెబ్సైట్లో ప్రత్యేక తగ్గింపుతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
వారంలో 100కుపైగా బెదిరింపులు.. ‘నో-ఫ్లై లిస్ట్లో చేరుస్తాం’
విమానాల్లో బాంబు ఉందంటు తప్పుడు సమాచారం అందించి పట్టుబడిన వారిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్)గా పరిగణిస్తుందన్నారు. గత వారం రోజులుగా పలు విమానాల్లో దాదాపు 100కుపైగా బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది.ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ..‘బాంబు బెదిరింపు చర్యల వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్క్రాఫ్ట్ రాకపోకలు తాత్కాలికంగా కొన్నిచోట్ల నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చాలా ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయ భద్రతా సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ పరిణామాలకు కారణమవుతున్న వారిపట్ల ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. వీరిని ‘నో ఫ్లైలిస్ట్’(ఎలాంటి కమర్షియల్ విమానాల్లో ప్రయాణించకుండా నిరోధించడం)లో చేరుస్తాం. ఈ నేరాన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్-క్రిమినల్ కేసు)గా పరిగణిస్తాం’ అని చెప్పారు.సమాచారం అందిన వెంటనే ఏం చేస్తారంటే..బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలోని బాంబు బెదిరింపు అంచనా కమిటీ (బీటీఏసీ) అత్యవసర సమావేశం అవుతుంది. బీటీఏసీలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), సంబంధిత విమానయాన సంస్థ, విమానాశ్రయ నిర్వాహకులు సభ్యులుగా ఉంటారు. విమానంలో బాంబు ఉందని అందిన సమాచారం మేరకు ఈ కమిటీ ముప్పును ‘నిర్దిష్ట’, ‘నాన్-స్పెసిఫిక్(అస్పష్టమైన)’ అనే రెండు విధాలుగా వర్గీకరిస్తుంది. నిర్దిష్ట ముప్పులో ఫ్లైట్ నంబర్, తేదీ, బయలుదేరే సమయం, ఎయిర్పోర్ట్కు రావాల్సిన సమయం..వంటి నిర్దిష్ట సమాచారంతో బెదిరింపులు వస్తాయి. దాంతో కమిటీ వెంటనే సదరు పైలట్లను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించమని కోరతారు. తదుపరి చర్యల కోసం గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటారు. ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!నాన్-స్పెసిఫిక్ థ్రెట్ విషయంలో ఎయిర్లైన్, ఫ్లైట్ నంబర్, తేదీ, షెడ్యూల్ సమయం స్పష్టంగా తెలియజేయరు. టేకాఫ్ అయిన కాసేపటికే బెదిరింపు వస్తే తిరిగి విమానం బయలుదేరిన ఎయిర్పోర్ట్కు రమ్మని పైలట్కు చెబుతారు. లేదా అప్పటికే చాలా దూరం ప్రయాణం చేస్తే దగ్గర్లోని ఎయిర్పోర్ట్లో జనావాసం ఎక్కువగా లేని బే(విమానాలు నిలిసే ప్రదేశం)కు రప్పిస్తారు. వెంటనే ప్యాసింజర్లను వేరేచోటుకు మారుస్తారు. బ్యాగేజీ, కార్గో, క్యాటరింగ్ మెటీరియల్ స్కాన్ చేస్తూ షిఫ్ట్ చేస్తారు. బాంబు స్వ్కాడ్, స్కానర్ల సాయంతో విమానాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకుంటే విమానాన్ని తిరిగి ఆపరేట్ చేస్తారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులుంటే మాత్రం భద్రతా సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతారు. -
ఎక్కేద్దాం... ఎగిరిపోదాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే 2.6 శాతం ప్రయాణికులు అధికంగా ప్రయాణించడం విశేషం.నవరాత్రి, దసరా, దుర్గా పూజ ముగిసిన తర్వాత తొలి పనిదినం కావడంతో ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా నమోదైంది. అక్టోబర్ 14న మొత్తం 6,435 విమాన సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందించాయి. భారత్లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య దూసుకుపోతుండడంతో విమానయాన సంస్థల మధ్య పోటీ వేడి మీద ఉంది. ఈ ఏడాది ఆగస్ట్తో పోలిస్తే సెప్టెంబర్లో ఇండిగో మార్కెట్ వాటా 60 బేసిస్ పాయింట్లు, ఎయిర్ ఇండియా 40 బేసిస్ పాయింట్లు పెరిగింది. స్పైస్జెట్ 30 బేసిస్ పాయింట్లు, ఆకాశ ఎయిర్ 10 బేసిస్ పాయింట్లు క్షీణించాయి. సెప్టెంబర్లో ఇలా.. ఈ ఏడాది సెప్టెంబర్లో 1.30 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం సాగించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం 2023 సెప్టెంబర్తో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ల సంఖ్య 6.4 శాతం దూసుకెళ్లింది. వాస్తవానికి నాలుగు నెలలుగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో క్షీణత నమోదవుతోంది. 2024 మే నెలలో 1.38 కోట్ల మంది రాకపోకలు సాగించారు. ప్యాసింజర్ల సంఖ్య జూన్ నుంచి వరుసగా 1.32 కోట్లు, 1.29 కోట్లు, 1.31 కోట్లుగా ఉంది. రద్దు అయిన విమాన సర్వీసుల సంఖ్య 0.85 శాతం ఉంది. మే నెలలో ఇది 1.7 శాతంగా నమోదైంది.ఫ్లైబిగ్ ఎయిర్ అత్యధికంగా 17.97 శాతం క్యాన్సలేషన్ రేటుతో మొదట నిలుస్తోంది. 4.74 శాతం వాటాతో అలయన్స్ ఎయిర్, 4.12 శాతం వాటాతో స్పైస్జెట్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. క్యాన్సలేషన్ రేటు అతి తక్కువగా ఎయిర్ ఇండియా 0.13 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 0.27, ఇండిగో 0.62, విస్తారా 0.88 శాతం నమోదైంది. విమానాల రద్దు ప్రభావం గత నెలలో 48,222 మంది ప్రయాణికులపై పడింది. పరిహారం, సౌకర్యాలకు విమానయాన సంస్థలు రూ.88.14 లక్షలు ఖర్చు చేశాయి. సర్వీసులు ఆలస్యం కావడంతో 2,16,484 మందికి అసౌకర్యం కలిగింది. నష్టపరిహారంగా విమానయాన సంస్థలు రూ.2.41 కోట్లు చెల్లించాయి. గత నెలలో మొత్తం 765 ఫిర్యాదులు అందాయి. 10,000 మంది ప్రయాణికులకు ఫిర్యాదుల శాతం 0.59 ఉంది. మార్కెట్ లీడర్గా ఇండిగో.. సమయానికి విమాన సర్వీసులు అందించడంలో దేశంలో తొలి స్థానంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిలిచింది. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండిగో మార్కెట్ వాటా ఏకంగా 63 శాతానికి ఎగసింది. సెప్టెంబర్ నెలలో ఈ సంస్థ 82.12 లక్షల మందికి సేవలు అందించింది. రెండవ స్థానంలో ఉన్న ఎయిర్ ఇండియా 15 శాతం వాటాతో 19.69 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చింది.13.08 లక్షల మంది ప్రయాణికులతో విస్తారా 10 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 5.35 లక్షల మంది ప్రయాణికులతో 4.1 శాతం వాటా సొంతం చేసుకుంది. 2022 ఫిబ్రవరిలో 10.7 శాతం మార్కెట్ వాటా కైవసం చేసుకున్న స్పైస్జెట్ గత నెలలో 2 శాతం వాటాకు పరిమితమైంది. సెప్టెంబర్లో ఈ సంస్థ 2,61,000 మందికి సేవలు అందించింది. ఆక్యుపెన్సీ రేషియో స్పైస్జెట్ 80.4 శాతం, విస్తారా 90.9, ఇండిగో 82.6, ఎయిర్ ఇండియా 80.1, ఏఐఎక్స్ కనెక్ట్ 81.6 శాతం నమోదైంది. -
భారత హాకీ స్టార్కు చేదు అనుభవం!
భారత హాకీ స్టార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాణి రాంపాల్కు ఇటీవల విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అదికాస్తా వైరల్గా మారింది. ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చేపుడు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఆమె తెలిపింది.వివరాల్లోకి వెళితే..రాణి రాంపాల్ ఇటీవల ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి ఇండియా తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యాక తన లగేజీ తీసుకుందామని వెళ్లేసరికి ఆమెకు వింత అనుభవం ఎదురైంది. తన లగేజీ బ్యాగ్ పగిలి ఉండడం గమనించారు. దాంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎయిరిండియా పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ఆమె ఎయిర్లైన్కు వ్యతిరేకంగా తన ఆందోళనను తెలియజేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ పంచుకున్నారు.Thank you Air India for this wonderful surprise. This is how your staff treat our bags. On my way back from Canada to India this afternoon after landing in Delhi I found my bag broken.@airindia pic.twitter.com/xoBHBs0xBG— Rani Rampal (@imranirampal) October 5, 2024‘ఎయిర్ ఇండియా, మీరిచ్చిన అద్భుతమైన సర్వీసుకు ధన్యవాదాలు. మీ సిబ్బంది మా లగేజీని ఇలా భద్రపరుస్తున్నారు. ఇటీవల కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వస్తుండగా, ఢిల్లీలో దిగిన తర్వాత నా బ్యాగ్ ఈ స్థితిలో కనిపించింది’ అని పోస్ట్ చేశారు. అదికాస్తా ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎయిరిండియా వెంటనే స్పందించింది. ‘ప్రియమైన రాంపాల్, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి మీ టిక్కెట్ వివరాలు, బ్యాగ్ ట్యాగ్ నంబర్, ఫిర్యాదు నంబర్/డీబీఆర్ కాపీని పంపించండి. వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటాం’ అని ఎయిరిండియా తెలిపింది.ఇదీ చదవండి: పేరుకు స్మాల్ క్యాప్.. ఆ సంస్థల్లో పెట్టుబడెందుకు?ఎయిర్లైన్ కంపెనీలు టికెట్ ధరలు పెంచడం, తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తున్నామని ప్రకటనలు చేయడంపై ఉన్న శ్రద్ధ ఆ సర్వీసులు అందించడంలో లేదని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా విమానయాన సంస్థలు స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు. -
కస్టమర్లకు సకల సౌకర్యాలు!
ఎయిరిండియా తన ఎయిర్క్రాఫ్ట్లను అప్గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. యూఎస్, యూరప్లు వంటి కీలక అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా ఏ350 విమానాల్లో ఫస్ట్-క్లాస్ క్యాబిన్లను ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. ఈమేరకు సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్డోగ్రా వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వంటి మిడిల్ ఈస్ట్ కంపెనీలు ప్రీమియం కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అందుకు బదులుగా ఎయిరిండియా సర్వీసులవైపు మొగ్గు చూపేలా ప్రీమియం కస్టమర్లకు సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించాం. రానున్న రోజుల్లో సంస్థ తన ఎయిర్క్రాఫ్ట్లను అప్గ్రేడ్ చేయాలని భావిస్తోంది. ముందుగా యూఎస్, యూరప్ వంటి ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను అప్గ్రేడ్ చేయబోతున్నాం. కొత్తగా ఏ350 విమానాల్లో ఫస్ట్ క్లాస్ సర్వీసులు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ320 నారో బాడీ ఎయిర్క్రాఫ్ట్లో క్యాబిన్ను విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దాంతోపాటు 2025 చివరి నాటికి ఢిల్లీ, ముంబయి, దుబాయ్, లండన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలకు ప్రయాణించే కస్టమర్ల కోసం ప్రత్యేక లాంజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: వెహికిల్పై కేసుల వివరాలు క్షణాల్లో.. -
రెండేళ్లలో 9000 మంది నియామకం
ఎయిరిండియా కార్యకలాపాలు విస్తరిస్తున్న క్రమంలో భారీగా ఉద్యోగులను చేర్చుకుంటున్నట్లు సంస్థ సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. గడిచిన రెండేళ్లలో మొత్తం 9000 మందిని నియమించుకున్నామని చెప్పారు. అందులో క్రూ సిబ్బంది 5000 మంది ఉన్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ..‘2023 ఆర్థిక సంవత్సరంలో 24 శాతంగా ఉన్న సంస్థ దేశీయ మార్కెట్ వాటా 2024లో 27 శాతానికి పెరిగింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ వాటా 21 శాతం నుంచి 24 శాతానికి చేరుకుంది. భవిష్యత్తులో ఎయిర్క్రాఫ్ట్ సంస్థ కార్యకలాపాలు పెరగనున్నాయి. గడిచిన రెండేళ్లలో 9000 మందిని నియమించకున్నాం. అందులో 5000 వేలమంది క్రూ సిబ్బంది ఉన్నారు. సిబ్బంది సగటు వయసు 54 సంవత్సరాల నుంచి 35 ఏళ్లకు తగ్గింది. సంస్థ ఐదేళ్ల ప్రణాళిక కోసం ప్రారంభించిన ‘విహాన్.ఏఐ’ రెండేళ్లు పూర్తి చేసుకుంది. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 25 శాతం మెరుగుపడింది. నష్టం 50 శాతానికి పైగా తగ్గింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ బ్యాటరీ బుల్లెట్ప్రూఫ్!‘67 నేరోబాడీ కలిగిన ఎయిర్క్రాఫ్ట్ల క్యాబిన్ను అప్గ్రేడ్ చేస్తున్నాం. 2025 మధ్యకాలం నాటికి సంస్థకు చెందిన ఇరుకైన బాడీ కలిగిన విమానాలను విశాలంగా మారుస్తాం. అందుకోసం ప్రతినెల మూడు నుంచి నాలుగు ఎయిర్క్రాఫ్ట్లను ఎంచుకోబుతున్నాం’ అని పేర్కొన్నారు. వినియోగదార్లలో విశ్వాసం పెంచేందుకు, కచ్చితమైన సమయపాలనపైనా దృష్టి సారించేందుకు 2022లో ఎయిరిండియా ‘విహాన్.ఏఐ’ను ఆవిష్కరించింది. చట్టపరమైన చిక్కులను తొలగించడంపై ఇది దృష్టి సారించింది. టేకాఫ్ దశలో భాగంగా పలు చర్యలను తీసుకుంటోంది. దీనిసాయంతో టాటా గ్రూప్ ఎయిర్ఫ్లీట్ నెట్వర్క్లో మార్పులు చేపడుతోంది. -
భారత్లో సర్వీసులు పెంచనున్న ఎయిర్లైన్స్
మలేషియా ఎయిర్లైన్స్ కీలక మార్కెట్గా భావించే భారత్లో తన కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాలకు ఈ ఎయిర్లైన్ సర్వీసులు నడుపుతోంది. సమీప భవిష్యత్తులో వీటి ఫ్రీక్వెన్సీ(సర్వీసుల సంఖ్య)ను పెంచబోతున్నట్లు మలేషియా ఎయిర్లైన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థకు భారత మార్కెట్ చాలా కీలకం. ప్రస్తుతం దేశంలో తిరువనంతపురం, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అమృత్సర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి తొమ్మిది నగరాలకు సర్వీసులు నడుపుతున్నాం. అందులో తిరువనంతపురం, అహ్మదాబాద్లకు సర్వీసు ఫ్రీక్వెన్సీలను పెంచాలని నిర్ణయించాం. కొత్తగా పెంచే ఫ్రీక్వెన్సీతో ఆ నగరాలకు వారానికి నాలుగు సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం మలేషియా ఎయిర్లైన్స్ దేశంలో వారానికి 71 విమానాలను నడుపుతోంది. ఆగస్టులో అమృత్సర్కు ఫ్రీక్వెన్సీ పెంచాం. 2025లో దేశంలో ఇతర నగరాలకు సర్వీసులు నడపాలనే అంశంపై చర్చలు సాగుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2016లో ఉడాన్(ఉడే దేశ్కా అమ్ నాగరిక్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశీయ విమాన కంపెనీలకు ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. టైర్ 2, 3 నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తోంది. దాంతో విదేశీ కంపెనీలు కూడా భారత్తో తమ సేవలు విస్తరించాలని యోచిస్తున్నాయి. -
ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది
భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు నెలలో 1.31 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. అంటే రోజూ దాదాపు 4.3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 2023 ఆగస్టులో విమాన ప్రయాణికుల సంఖ్య 1.24 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య ఈసారి 5.7 శాతం పెరిగింది. జులైలో నమోదైన 1.29 కోట్లమంది ప్రయాణికులతో పోలిస్తే ఇది ఎక్కువే. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదిక విడుదల చేసింది.డీజీసీఏ నివేదికలోని వివరాల ప్రకారం..గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 1,79,744 మంది ప్రయాణికులు ప్రభావితం చెందారు. వీరికి పరిహారంగా విమానయాన కంపెనీలు సుమారు రూ.2.44 కోట్లు వెచ్చించాయి. విమానాల రద్దు కారణంగా 38,599 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వీరికి రూ.1.14 కోట్లు నష్టపరిహారం ఇచ్చారు. ఆగస్టులో మొత్తం 728 మంది ప్రయాణికులకు వివిధ కారణాల వల్ల బోర్డింగ్ సదుపాయాన్ని అందించలేదు. దాంతో రూ.77.96 లక్షలు పరిహారం చెల్లించారు.2024 జనవరి-ఆగస్టులో దేశీయ విమానయాన సంస్థల్లో 10.5 కోట్లమంది ప్రయాణించారు. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 10.06 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 4.82 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. సమయపాలన పరంగా ఆగస్టులో ఆకాసా ఎయిర్ 71.2 శాతం కచ్చితత్వంతో విమానాలు నడిపి మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో విస్తారా (68.6 శాతం), ఏఐఎక్స్ కనెక్ట్ (66.8 శాతం), ఇండిగో, ఎయిర్ ఇండియా(66 శాతం), అలయన్స్ ఎయిర్(55.3 శాతం), స్పైస్జెట్ (31 శాతం) నిలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల నిర్వహణ ఆధారంగా ఆన్టైమ్ ఫర్ఫార్మెన్స్ (ఓటీపీ)ను లెక్కించారు.జూన్తో పోలిస్తే జులైలో 3.1 శాతం పెరిగిన మార్కెట్ వాటా ఆగస్టులో 2.3 శాతానికి పడిపోయింది. గతనెలలో ఇండిగో 62.4 శాతం, ఎయిర్ ఇండియా 14.7 శాతం, విస్తారా 10.3 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 4.5 శాతం, ఆకాసా ఎయిర్ 4.4 శాతం, అలయన్స్ ఎయిర్ 0.9 శాతం మార్కెట్ వాటా నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతవిమాన ప్రయాణాలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం టైర్ 2, 3 నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. దాంతో విమాన ప్రయాణికులు పెరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతోపాటు విమానయాన కంపెనీల మధ్య పోటీ ఏర్పడి టికెట్ ధరలో రాయితీలు, ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
విమానం దారి మళ్లింపు.. కారణం..
ముంబై నుంచి ఫుకెట్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించినట్లు ఇండిగో శుక్రవారం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎయిర్క్రాఫ్ట్ను మలేషియాలోని పెనాంగ్కు మళ్లించినట్లు స్పష్టం చేసింది. విమాన మళ్లింపు వార్తను పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అదికాస్తా వైరల్గా మారింది.‘ఫుకెట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని సమాచారం అందింది. దాంతో ప్రతిస్పందనగా ముంబై నుంచి ఫుకెట్కు వెళుతున్న ఫ్లైట్ నం 6E 1701 ఎయిర్క్రాఫ్ట్ను మార్గమధ్యలో దారి మళ్లించాం. ప్రతికూల వాతావరణానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సమీప విమానాశ్రయమైన మలేషియాలోని పెనాంగ్లో దించాం. ఈమేరకు ప్రయాణికులకు సమాచారం అందించాం’ అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఫుకెట్లోని వాతావరణ పరిస్థితిని సమీక్షించి తిరిగి ప్రయాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.ఇదీ చదవండి: ‘అన్నీ అవాస్తవాలే’ఫుకెట్లో 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఆకాశం మేఘావృతమై ఉందని కొన్ని సంస్థల నివేదికల ద్వారా తెలిసింది. పశ్చిమం నుంచి గంటకు 15 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతారణ పరిస్థితులు ఉన్నప్పుడు ముందస్తు సమాచారంతో విమానాలను దారి మళ్లించడం సర్వ సాధారణం. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళనలు చెందకూడదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
రూ.932కే విమాన టికెట్
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ‘ఫ్లాష్ సేల్’ని ప్రారంభించింది. రూ.932కే విమాన టికెట్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ ధర కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. సెప్టెంబర్ 16, 2024లోపు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, మార్చి 31, 2025 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.రూ.932తో ప్రారంభమయ్యే బేస్ ఛార్జీలతో పాటు, వివిధ మార్గాల్లో రూ.1,088 నుంచి టికెట్లను విక్రయిస్తోంది. తక్కువ ధరకు ఆఫర్ చేసే రూట్లలో ఢిల్లీ-గ్వాలియర్, గౌహతి-అగర్తలా, బెంగళూరు-చెన్నై, కొచ్చి-బెంగళూరు తదితరాలు ఉన్నాయి. airindiaexpress.com ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకునే కస్టమర్లు ప్రత్యేక రాయితీ కలిగిన ‘ఎక్స్క్లూజివ్ ఎక్స్ప్రెస్ లైట్’ ఛార్జీలను పొందవచ్చని పేర్కొంది. ఉచితంగా 3 కిలోల కేబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: రుణాలు పీక్... డిపాజిట్లు వీక్చెక్-ఇన్ బ్యాగేజీ ధరలను దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ.1000, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ.1300గా నిర్ణయించారు. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సభ్యులకు సంస్థ ప్రత్యేక తగ్గింపు ధరలు అందిస్తుంది. ఇదిలాఉండగా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన విమానాల సంఖ్యను పెంచబోతున్నట్లు గతంలో పేర్కొంది. ప్రతి నెలా దాదాపు నాలుగు కొత్త విమానాలను ప్రారంభిస్తామని తెలిపింది. ఏయిర్ ఏషియాతో విలీన ప్రక్రియ ప్రారంభించిన అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు 30కి పైగా కొత్త ఎయిర్క్రాఫ్ట్లను ప్రవేశపెట్టింది. -
డబ్బుతో విమానం ఎక్కుతున్నారా.. ఈ రూల్స్ తెలుసా?
Airport Rules: ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వ సాధారణంగా మారిపోయింది. విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే విమానాల్లో వెళ్లడానికే చాలా మంది ఇష్టపడతారు. గమ్యాన్ని తక్కువ సమయంలో చేరుకోవడం, ఫ్లైట్ ఫేర్లు తక్కువగా ఉండటం వంటి కారణాలతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతూ వస్తోంది.అయితే విమానంలో ప్రయాణించడానికి లగేజీకి సంబంధించిన పరిమితులు ఉంటాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ప్రయాణికులు తమ వెంట ఎంత నగదు తీసుకువెళ్లవచ్చు అనే దానిపైనా పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? దేశం వెలుపల, విదేశాలలో నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, తమ సౌలభ్యం కోసం నగదును తమ వెంట తీసుకెళ్లేందుకు ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు.ఎంత తీసుకెళ్లొచ్చు?నగదును తీసుకెళ్లేందుకు సంబంధించిన నిబంధనలు దేశీయ విమానాలకు, అంతర్జాతీయ విమానాలకు వేరువేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ విమానాల్లో గరిష్టంగా రూ. 2 లక్షల నగదును తీసుకెళ్లవచ్చు. కానీ మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నట్లయితే ఈ నిబంధన వర్తించదు.ఇక మీరు నేపాల్, భూటాన్ మినహా మరే ఇతర దేశానికి వెళుతున్నా 3000 డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్లవచ్చు. దీని కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలనుకుంటే స్టోర్ వ్యాల్యూ, ప్రయాణ తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.లగేజీ బరువు ఎంత ఉండాలి?విమానంలో మీ హ్యాండ్బ్యాగ్లో 7 నుండి 14 కిలోల బరువును తీసుకెళ్లవచ్చు. మీరు చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఇచ్చే చెక్-ఇన్ బ్యాగేజీ బరువు 20 నుండి 30 కిలోల వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.ఏవి తీసుకెళ్లకూడదు?విమాన ప్రయాణంలో మీరు కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదు. క్లోరిన్, యాసిడ్, బ్లీచ్ మొదలైన రసాయనాలను అస్సలు తీసుకెళ్లలేరు. ఇక మద్యం విషయానికి వస్తే దేశీయ విమానాల్లో మీ చెక్-ఇన్ బ్యాగ్లో ఆల్కహాల్ తీసుకెళ్లవచ్చు. కానీ అది 5 లీటర్లకు మించకూడదు. -
కొండలు, లోయ ప్రాంతాల్లో సులువుగా నడిపేలా కొత్త టెక్నాలజీ
ఎత్తైన కొండలు, లోయ ప్రాంతాల్లోని ఎయిర్పోర్ట్ల్లో విమానాలను దించడం, టేకాఫ్ చేయడం సవాలుతో కూడుకున్న విషయం. ఈ సమస్యను అధిగమించేలా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. నేపాల్ రాజధాని కాఠ్మాండూ లోయ చుట్టూ ఉన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితులకు ధీటుగా విమానాన్ని నడిపేందుకు వీలుగా ఆర్ఎన్పీ ఏఆర్ టెక్నాలజీని వినియోగించింది.రిక్వైర్డ్ నేవిగేషన్ ఫర్ఫెర్మాన్స్ విత్ ఆథరైజేషన్ రిక్వయిర్డ్(ఆర్ఎన్పీ ఏఆర్)గా పిలువబడే ఈ టెక్నాలజీని విమానంలో వాడడం వల్ల ఎత్తు పల్లాలు వంటి ఎలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనైనా విమానాన్ని నడపవచ్చని ఇండిగో తెలిపింది. ఎత్తైన ప్రాంతంపై ఉన్న కాఠ్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేటీఎం) లాంటి విమానాశ్రయాల కోసం ప్రత్యేకంగా ఈ సాంకేతికతను తయారు చేసినట్లు పేర్కొంది. ఇటీవల ఇండిగో ఏ320 ఎయిర్క్రాఫ్ట్లో ఈ ఆర్ఎన్పీ ఏఆర్ సాంకేతికను ఉపయోగించినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’‘ఎత్తైన ప్రదేశంలోని ఉన్న కాఠ్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేటీఎం) విమానాశ్రయం చుట్టూ హిమాలయాలు ఉన్నాయి. దాంతో ఎయిర్క్రాఫ్ట్ను దించడం, టేకాఫ్ చేయడం సవాలుగా మారుతుంది. ఆర్ఎన్పీ ఏఆర్ విధానం ద్వారా విమాన మార్గాన్ని ముందుగానే గుర్తించి అందుకు తగినట్లుగా పైలట్లు స్పందించే అవకాశం ఉంది. దాంతో ప్రమాదాలు తగ్గుతాయి. కొత్త సాంకేతికతతో ఎత్తు పల్లాల ప్రాంతాల్లో విమానాలను నడపడం సులువవుతుంది. అయితే ఈ టెక్నాలజీ వినియోగించాలంటే పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణ అవసరం’ అని ఇండిగో తెలిపింది. -
ఆకాసాలో భారీ పెట్టుబడులకు చర్చలు
ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఆకాసా ఎయిర్లో ప్రేమ్జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. రెండు సంస్థలు కలిపి రూ.1,049 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.భారత్లో విమానయాన ప్రయాణికులు పెరుగుతున్నారు. దాంతో చాలా కంపెనీలు దేశీయ రూట్లలో విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో టైర్1, 2, 3 సిటీల్లోని ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారని అంచనా వేస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువైన మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాయి. దీన్ని గమనించిన కొన్ని సంస్థలు విమానయాన కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే రూ.2,938 కోట్లు విలువైన ఆకాసా ఎయిర్లో తాజాగా అజీమ్ ప్రేమ్జీ కుటుంబం కన్సార్టియంగా ఉన్న ప్రేమ్జీ ఇన్వెస్ట్, మణిపాల్ గ్రూప్కు చెందిన రంజన్పాయ్ ఆధ్వర్యంలోని క్లేపాండ్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఆకాసా ఎయిర్తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్’ఇదిలాఉండగా, ఇప్పటికే ఆ కంపెనీలో రాకేష్జున్జున్వాలా కుటుంబానికి గరిష్ఠంగా రూ.293 కోట్ల వాటా ఉంది. ఇప్పుడు ప్రేమ్జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ కలిపి దాదాపు రూ.1,049 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇదే జరిగితే ఆకాసాలో మేజర్ వాటాదారులుగా ప్రేమ్జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వ్యవహరిస్తాయి. ఆకాసాలో ప్రస్తుతం 24 ఎయిర్క్రాఫ్ట్లున్నాయి. 202 విమానాలను ఆర్డర్ చేశారు. 27 నగరాలకు ప్రయాణికులను చేరవేస్తున్నారు. -
‘ఫ్రీడమ్’ ఆఫర్.. బస్ టికెట్ ధరతో ఫ్లైట్ జర్నీ
తక్కువ ధరకు విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అది కూడా బస్ టికెట్ ధరకే. ఈ సూపర్ ఆఫర్ను టాటా గ్రూప్ ఎయిర్లైన్ కంపెనీ 'విస్తారా' తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకుంటే రూ.1,578లకే ఎంచక్కా ఫ్లైట్ ఎక్కేయచ్చు.ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా నవరాత్రి, దసరా వరకు ప్రయాణించవచ్చు. అయితే దీని కోసం ఆగస్టు 15లోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. టాటా గ్రూప్కు చెందిన ఎయిర్లైన్ విస్తారా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ సేల్ను ప్రారంభించింది. ఈ ఆఫర్లో అక్టోబర్ 31 నుంచి ఆగస్టు 15 వరకు చౌకగా విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.ఈ మార్గంలో రూ.1578విస్తారా సేల్లో బాగ్డోగ్రా నుంచి డిబ్రూగఢ్కు ప్రయాణించడానికి ఎకానమీ క్లాస్లో ఒకవైపు దేశీయ ఛార్జీ రూ.1,578 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ముంబై నుంచి అహ్మదాబాద్కి ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రారంభ ధర రూ.2,678. ఇక ముంబై నుంచి అహ్మదాబాద్కి బిజినెస్ క్లాస్ ధర రూ.9,978 నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి ఖాట్మండుకు అంతర్జాతీయ విమానానికి ఎకానమీ క్లాస్ ధర రూ.11,978 నుంచి ప్రారంభమవుతుంది. అదే ప్రీమియం ఎకానమీ విభాగంలో ఢిల్లీ నుంచి ఖాట్మండుకు ప్రారంభ ధర రూ.13,978. -
హైదరాబాద్ నుంచి ఇండిగో కొత్త సర్వీసులు
హైదరాబాద్-అహ్మదాబాద్ మధ్య విమానయాన సంస్థ ఇండిగో కొత్త, అదనపు సర్వీసులు నడుపుతామని ప్రకటించింది. హైదరాబాద్-హిరాసర్ మధ్య నూతన డెయిలీ సర్వీసును సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.సెప్టెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్-ఉదయ్పూర్ మధ్య వారంలో నాలుగు ఫ్లైట్స్, సెప్టెంబర్ మూడు నుంచి హైదరాబాద్-జోద్పూర్ మధ్య వారంలో మూడు సర్వీసులు తిరిగి మొదలు అవుతాయని చెప్పింది. కొత్త రూట్ల చేరికతో భాగ్యనగరి నుంచి 69 నగరాలకు ప్రతివారం డైరెక్ట్ ఫ్లైట్స్ సంఖ్య 1,220కి చేరనుంది. ఇక అహ్మదాబాద్ నుంచి అమృత్సర్, భువనేశ్వర్కు అదనపు ఫ్లైట్స్ను నడుపుతామని ఇండిగో పేర్కొంది.ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియాప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెబుతున్నాయి. దాంతో కంపెనీలు తమ సర్వీసులు పెంచుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు టైర్1, 2 సిటీలకు కూడా తమ సర్వీసులను పొడిగిస్తున్నాయి. దేశీయంగా నడిపే విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. -
వెండి తెరపై విదేశీ అందాలు.. ఎయిర్లైన్ వినూత్న ప్రచారం
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు సినిమా థియేటర్లలో ‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎయిరేషియా ప్రకటించింది. భారత్లోని 16 నగరాల నుంచి మలేషియా, థాయ్ల్యాండ్ల మీదుగా 130 గమ్యస్థానాలకు ఎయిరేషియా విమానాలు నడుపుతోంది. తన నెట్వర్క్లోని పర్యాటక స్థలాలను వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తామని కంపెనీ తెలిపింది. దానివల్ల భారత్లో తమ ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కరోల్ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సినిమా థియేటర్లలో ‘‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’’ ద్వారా కంపెనీ నెట్వర్క్లోని పర్యాటక స్థలాలను ప్రదర్శిస్తాం. దానివల్ల భారత్లో కంపెనీకి ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం క్యూబ్ సినిమాస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. వచ్చే ఆరు నెలల్లో దేశంలోని 12 ప్రధాన నగరాల్లో 130 థియేటర్ల ద్వారా ఎయిరేషియా గమ్యస్థానాల గురించి వివరిస్తాం. భారతీయులు ఎక్కువ ప్రయాణించే ఆసియా, ఆస్ట్రేలియాల్లో పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్ప్రస్తుతం ఎయిరేషియా భారత్ నుంచి మలేషియా, థాయ్లాండ్లకు 22 డైరెక్ట్ సర్వీసులను నడుపుతోంది. త్వరలో మరో నాలుగు మార్గాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం గౌహతి, కోజికోడ్, లఖ్నవూ, కౌలాలంపూర్లను ఎంచుకుంది. రాబోయే కొన్ని వారాల్లో తిరుచిరాపల్లి నుంచి నేరుగా బ్యాంకాక్కు విమాన సర్వీసు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. -
‘థ్యాంక్యూ సర్’ అన్నందుకు విమానం నుంచి దించారు!
ఎవరైనా మిమ్మల్ని సర్..అనబోయి పొరపాటును మేడమ్ అన్నారంటే.. ఏం చేస్తారు? సర్లే.. ఏదో కంగారులో అని ఉంటారని అసలు ఆ విషయాన్నే పట్టించుకోరు కదా. కానీ ఇటీవల యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో మహిళా సిబ్బందిని పొరపాటున ‘సర్’ అన్నందుకు ఏకంగా విమానంలో నుంచే దించేశారు. దాంతో సదరు ప్రయాణికురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.టెక్సాస్కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు(16 నెలలు), తల్లితో కలిసి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విమానం ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్ పాస్ను అందించారు. దాంతో మహిళా అటెండెంట్ను పొరపాటుగా పురుషునిగా భావించి ‘థాంక్యూ సర్’ అని తెలిపింది. వెంటనే ఆ అటెండెంట్ ఆగ్రహానికి గురైంది. జెన్నా తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది. అదే సమయంలో జెన్నా మరో మేల్ అటెండెంట్ సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేట్ వద్ద మరో మేల్ అటెండెంట్ ఆపేశారని ఫిర్యాదు చేసింది. దాంతో ఆ సిబ్బంది.. మీరు ఫిర్యాదు చేయాలనుకున్న అటెండెంట్ ‘ఆయన’ కాదు ‘ఆమె’ అని బదులిచ్చారు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. అంతటితో ఆగకుండా విమానం నుంచి దింపేశారని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.My 16-month old & I were denied entry on a @united flight back to Austin bc I used the wrong pronoun for the attendant. We have no luggage, nothing. we’re stranded in San Francisco. What are my rights? @elonmusk @jchilders98 pic.twitter.com/2b1rC14wg4— The Period Guru ® (@JennaLongoria) June 26, 2024 -
విమాన ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యం..కారణం..
దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణంలోని వేడిగాలుల వల్ల దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దిల్లీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల విమానప్రయాణాల్లో అంతరాయం ఏర్పడుతోందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం మధ్యాహ్నం 2:10 గంటలకు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్లోని సిలిగురి సమీపంలో ఉన్న బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం సాయంత్రం 6:15గంటలకు బయలుదేరింది. దిల్లీలో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. సోమవారం 45డిగ్రీల ఉష్ణోగ్రతతో గాలులు వీయడం వల్ల ప్రయాణంలో అంతరాయం ఏర్పడింది.ఈ సందర్భంగా ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ..‘అధిక ఉష్ణోగ్రతల వల్ల దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లే ఇండిగో విమానం 6E 2521 ప్రయాణం ఆలస్యమైంది. ఇండిగో అన్నింటికంటే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వేడిగాలులతో కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఆలస్యం అనివార్యమైంది. సంస్థ నిత్యం ప్రయాణికులకు సమాచారం అందిస్తుంది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని చెప్పారు.హీట్ వేవ్స్ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ప్రకారం..వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులపాటు సగటు ఉష్ణోగ్రత కంటే గరిష్ఠ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు అధికంగా నమోదైతే దాన్ని హీట్వేవ్గా పరిగణిస్తారు. ప్రభావిత ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత రెండు రోజుల పాటు వరుసగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే అది వేడి గాలులుగా మారే ప్రమాదముందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ హీట్వేవ్ను ‘నిశ్శబ్ద విపత్తు’ అని కూడా పిలుస్తారు. భారత్లో హీట్వేవ్స్ సాధారణంగా మార్చి-జూన్ మధ్య, అరుదైన సందర్భాల్లో జులైలోనూ సంభవిస్తాయి. ఇటీవల దిల్లీలోని నరేలాతోపాటు ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు దిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. -
ఏడుగంటలు ఆలస్యం అయిన ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్.. కారణం..
కేరళలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్ నుంచి కాలికట్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని శనివారం కొచ్చికి మళ్లించారు. 173 మంది ప్రయాణికులున్న ఈ విమానం తెల్లవారుజామున 2.47 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..నైరుతిరుతుపవనాల కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు విమాన ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడింది. దుబాయ్ నుంచి కాలికట్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం శనివారం తెల్లవారుజామున 2.47 సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కొచ్చిలో దిగింది. దాదాపు ఏడు గంటల తర్వాత ఉదయం 9.30 గంటలకు తిరిగి కాలికట్ విమానాశ్రయానికి బయలుదేరింది.ఇదిలా ఉండగా, ఆగస్టు నుంచి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్-కోల్కతాకు రోజువారీ విమానాలు నడపనున్నట్లు ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది. సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..దిల్లీ క్యాపిటల్ రీజియన్ నుంచి తక్కువ దూరంలో ఉన్న ఘజియాబాద్ హిండన్ విమానాశ్రయం నుంచి కోల్కతా వరకు రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయి.ఇదీ చదవండి: నిమిషంలో మొబైల్..10 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కారు ఫుల్ఛార్జ్..!ఖాట్మండు, ఢాకాలను కూడా ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ తన నెట్వర్క్లో చేర్చుకోనున్నట్లు ఇటీవల న్యూదిల్లీలో జరిగిన కాపా ఇండియన్ ఏవియేషన్ సమ్మిట్లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ పేర్కొన్నారు. ఈ విమానాల వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
ప్రయాణికులు పెరుగుతున్నా విమాన సంస్థలకు నష్టాలే: కాపా ఇండియా
విమానయాన కంపెనీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలు తప్పవని కాపా ఇండియా(సెంటర్ ఫర్ ఏవియేషన్ పార్ట్ ఆఫ్ ది ఏవియేషన్) అంచనావేసింది. విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్నప్పటికీ కంపెనీ ఖర్చులు అధికమవుతుండడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థలు నష్టాలబాటపట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.కాపా తెలిపిన వివరాల ప్రకారం..2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణీకుల రద్దీ 15.4 కోట్ల నుంచి 16.1 కోట్లకు పెరుగుతుంది. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య 7.5కోట్ల నుంచి 7.8 కోట్లకు పెరుగనుంది. విమాన కంపెనీల ఆదాయానికి మించి ఖర్చులు పెరిగి నష్టాలు అధికమవుతాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థలకు 400-600 మిలియన్ డాలర్ల(రూ.4వేలకోట్లు) నష్టాలు రావొచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక ప్రయాణికుడు కిలోమీటరు ప్రయాణించడానికి చెల్లించే సగటు మొత్తం దాదాపు 1 శాతమే పెరిగింది. అయితే ఏడాది పూర్తయ్యేనాటికి కంపెనీల ఖర్చులు మాత్రం 3.8 శాతం పెరుగుతాయని అంచనా.ఇదీ చదవండి: టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు పెంపు.. ఎంతంటే..‘ప్రపంచంలోనే భారత విమానయాన మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఇండిగో సంస్థ 60% మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటాగ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా, విస్తారా కలిపి దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మిగతావాటాను అకాసా ఎయిర్, స్పైస్జెట్ వంటి సంస్థలు చేజిక్కించుకున్నాయి’ అని కాపా ఇండియా తెలిపింది. -
200 వైడ్బాడీ జెట్లు కొనుగోలు చేయనున్న ప్రముఖ సంస్థ
మిడిల్ ఈస్ట్ ఎయిర్ క్యారియర్ ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా ఎయిర్బస్ ఏ350ఎస్, బోయింగ్ 777ఎక్స్ మోడళ్లను ఆర్డర్ చేయాలని చూస్తున్నట్లు బ్లూమ్బర్గ్ నివేదిక ద్వారా తెలిసింది.జులై నెల చివరినాటికి బ్రిటన్లో జరగబోయే ‘ఫార్న్బరో ఎయిర్ షో’లో విమానాల కొనుగోలుకు సంబంధించి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. బ్లూమ్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం..ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలనుకుంటుంది. వైడ్బాడీ జెట్లుగా పేరున్న ఎయిర్బస్ ఏ350, బోయింగ్ 777ఎక్స్ మోడళ్లను ఆర్డర్ చేయాలని చూస్తుంది. దీనిపై ‘ఫార్న్బరో ఎయిర్ షో’ నిర్ణయం వెలువడనుంది. ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకునే వైడ్బాడీ జెట్లపై విమానకంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి, పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణ డిమాండ్ను తీర్చడానికి సంస్థ వీటిని కొనుగోలు చేయనుంది.ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్ప్లస్ కూటమి ప్రభావంఈ డీల్ వివరాలకోసం ఎయిర్బస్ను సంప్రదించినపుడు విమానాల అవసరాల గురించి కస్టమర్లతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని తెలిపింది. అయితే ఈ డీల్కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఖతార్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను విస్తరించడానికి 100 నుంచి 150 వైడ్బాడీ జెట్లను ఆర్డర్ చేయనుందని బ్లూమ్బర్గ్ మార్చిలోనే నివేదించింది. బోయింగ్, ఎయిర్బస్లతో ముందస్తు చర్చలు జరుపుతోందని గతంలో తెలిపింది. -
ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
ఎయిరిండియా విమానంలో సౌకర్యాలపై ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. అకల్ ధింగ్రా న్యూయార్క్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియాలో విమానంలో ప్రయాణించారు. ప్రయాణంలో తాను ఆహారం, చైర్లు ఇతర సదుపాయాలపై అసౌకర్యానికి గురయ్యాడు. మరో నెలలో ఢిల్లీ నుంచి న్యూయార్క్కు వెళుతున్నానని, పొరపాటున కూడా ఎయిరిండియా విమానం ఎక్కబోనంటూ ఆ వీడియోలో తెలిపాడు.అకల్ ధింగ్రా వీడియోలో స్లైడింగ్ టేబుల్ సరిగా పనిచేయకపోవడం, దెబ్బతిన్న హెడ్ఫోన్ జాక్ వంటి అనేక సమస్యల్ని ఎత్తి చూపాడు. విమానంలో అందించిన ఆహారం కూడా నాణ్యతగా లేదని కూడా చెప్పాడు. చివరగా.. ‘న్యూయార్క్ నుండి ఢిల్లీకి నా ఎయిర్ ఇండియా విమానం విపత్తు!’ అని వీడియో క్యాప్షన్లో జతచేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఎయిరిండియా విమాన ప్రయాణంలో తమకు చేదు అనుభవాలున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akul Dhingra (@akuldhingra) -
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల్గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు. -
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్బస్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావంఏటీఆర్తోపాటు ఎయిర్బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్లో 30 ఎయిర్బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్ చేసింది. -
ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్!
విమాన ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను ఆటోమేటిక్గా చెల్లించాలని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. చాలాసమయాల్లో విమానాలను రద్దుచేస్తుంటారు లేదా వాటిని ఏదో కారణాలతో మళ్లిస్తుంటారు. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్పటికే వారు తీసుకున్న టికెట్ ధర తిరిగి చెల్లించేందుకు కొన్నిసార్లు విమాన సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారికి ఆటోమేటిక్గా రీఫండ్ వచ్చేలా సదుపాయం కల్పిస్తున్నారు.కార్పొరేట్ల అనవసరపు రుసుముల నుంచి ప్యాసింజర్లను రక్షించేందుకే కొత్త నిబంధనలు తీసుకున్నట్లు బైడెన్ కార్యవర్గం బుధవారం తెలిపింది. విమానయాన సంస్థ ప్రయాణికులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చినపుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి వెంటనే రీఫండ్ చేయాలని యూఎస్ రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ ఒక ప్రకటనలో తెలిపారు.కొత్త నిబంధనలు ఇలా..ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను ఆటోమేటిక్గా చెల్లించాలి.దేశీయ విమానాలు 3 గంటలు, అంతర్జాతీయ సర్వీసుల రాకపోకల్లో 6 గంటలు అంతరాయం ఉంటే రీఫండ్కు అర్హులు.మొదట కొనుగోలు చేసిన దాని కంటే తక్కువ తరగతికి డౌన్గ్రేడ్ చేయడం. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ నుంచి ఎకానమీకి పంపిస్తే రీఫండ్ పొందవచ్చు.ఏదైనా కారణాలవల్ల చేరుకునే లేదా బయలుదేరే విమానాశ్రయంలో మార్పులుంటే అర్హులు.దివ్యాంగులకు సరైన సౌకర్యాలు కల్పించకపోతే రీఫండ్ పొందవచ్చు.దేశీయ విమానాలు విమానాశ్రయంలో దిగాక నిర్దేషించిన సమయంలోపు బ్యాగేజ్ డెలివరీ చేయకపోతే ప్రయాణికులు తనిఖీ చేసిన బ్యాగ్ ఫీజు వాపసు పొందవచ్చు. విమానంలో వైఫై లేదా ఎంటర్టైన్మెంట్ వంటి సేవల కోసం ఎవరైనా డబ్బు చెల్లించి వాటిని పొందకపోతే తిరిగి తమ డబ్బును రీఫండ్ కోరవచ్చు.ఇదీ చదవండి: ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్2020లో కొవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఎయిర్లైన్స్, టిక్కెట్ ఏజెంట్లు ప్రయాణికుల రీఫండ్లను తిరస్కరించారని పెద్దమొత్తంలో ఫిర్యాదులు అందాయి. రీఫండ్ ఆలస్యం అవుతుందని కూడా కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలా ఎయిర్లైన్స్ శాఖకు అందిన విమాన ప్రయాణ సర్వీస్ ఫిర్యాదుల్లో 87% రీఫండ్కు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. దాంతో స్పందించిన ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. -
గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు..
వేసవికాలం కావడంతో దేశంలోని చాలామంది సమ్మర్ సెలవులు, ఇతర విహారయాత్రలు చేస్తూంటారు. ఈ తరుణంలో ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దాంతో దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది ప్యాసింజర్లు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య నడిచిన 6,128 విమాన సర్వీసుల్లో ఏకంగా 4,71,751 మంది ప్రయాణించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా వివరాలు వెల్లడించింది. కరోనాకంటే ముందు విమాన ప్రయాణీకుల సగటు (3,98,579)తో పోల్చితే ఇది 14 శాతం అధికం. గతేడాది ఏప్రిల్ 21న 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశీయ విమానయాన సంస్థల సర్వీసుల్లో ప్రయాణించినవారు 3.91కోట్లుగా ఉన్నట్టు గత వారం భారతీయ విమానయాన నియంత్రిత సంస్థ డీజీసీఏ తెలిపింది. గత ఏడాది ఇదే వ్యవధిలో ప్యాసింజర్లు 3.75కోట్లుగా ఉన్నారు. దీంతో వార్షిక వృద్ధి 4.38 శాతంగా నమోదైందని తెలిపింది. ఇదీ చదవండి: టాప్ 3 కంపెనీల్లో 64 వేలమందికి లేఆఫ్స్..! ‘ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, అందుబాటు ధరల్లో విమాన సేవలందించే సంస్థలు విస్తరిస్తున్నాయి. రోజురోజుకూ సరికొత్త స్థాయికి ప్యాసింజర్ల సంఖ్య చేరుతుంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగనుంది’ అని విమానయాన మంత్రిత్వ శాఖ తన అధికారిక ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. -
ఆకాశవీధిలో 15.4 కోట్ల ప్రయాణికులు
భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారితోపాటు డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో అంతకుముందు ఏడాదితోపోలిస్తే 13 శాతం మేర ప్రయాణికుల రద్దీ పెరిగినట్లు ఇక్రా నివేదిక ద్వారా తెలిసింది. దాంతో 2023-24 ఏడాదిలో విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్య 15.4 కోట్లకు చేరినట్లు నివేదికలో తెలిపింది. నివేదికలోని వివరాల ప్రకారం..కరోనాకు ముందు విమానాల్లో ఎంతమంది ప్రయాణించేవారో వారి సంఖ్యను తాజా గణాంకాలు అధిగమించాయి. 2019-20లో 14.2 కోట్ల మంది డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించారు. కేవలం 2024 మార్చిలోనే దేశీయ విమానాల్లో 1.35 కోట్ల మంది ప్రయాణించారని అంచనా. ఫిబ్రవరిలో ప్రయాణించిన 1.26 కోట్ల మంది కంటే ఈ సంఖ్య 6.9శాతం అధికం. ఏడాదివారీగా చూసినా 4.9 శాతం పెరిగింది. ఇదీ చదవండి: అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే.. దేశీయ విమానయాన పరిశ్రమకు 2022-23లో నికరంగా రూ.17,000కోట్లు-రూ.17,500 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే అది 2023-24, 2024-25లలో రూ.3,000 కోట్లు-రూ.4,000 కోట్లకు పరిమితం కావొచ్చు. ఫిబ్రవరితో ముగిసిన 2023-24 తొలి 11 నెలల్లో దేశీయ విమాన సంస్థల్లో ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ 2.7 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే సమయంతో పోలిస్తే ఇది 25% అధికంగా ఉంది. -
టికెట్ లేకుండా విమానం ఎక్కిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే..
విమాన ప్రయాణం అంటే పకడ్బందీ తనిఖీలుంటాయి. అన్ని ధ్రువపత్రాలు సరిచూసి, స్కాన్ చేసి మరీ ప్రయాణికులను విమానంలోకి పంపిస్తారు. అలాంటిది వారి కళ్లుకప్పి టికెట్ లేకుండా ఓ వ్యక్తి రహస్యంగా విమానంలోకి ప్రవేశించిన ఘటన అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఇటీవల టెక్సాస్కు చెందిన 26 ఏళ్ల విక్లిఫ్ వైవ్స్ ఫ్లూరిజార్డ్ అనే వ్యక్తి పార్క్సిటీలోని ఉటాలో జరిగిన స్నోబోర్డింగ్ట్రిప్ కోసం వచ్చాడు. తాను వచ్చేపుడు తన స్నేహితుడి ‘బడ్డిపాస్’ ద్వారా ఉటా చేరుకున్నాడు. తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో తాను వెళ్లాలనుకున్న రెండు విమానాలు అప్పటికే ప్రయాణికులతో నిండిపోయాయి. దాంతో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన వేరే విమానంలో ప్రయాణించాలనుకున్నాడు. అయితే తాను అప్పటికీ టికెట్ తీసుకోలేదు. విమానం కోసం లాంజ్లో వేచిచూస్తున్న ఇతర ప్రయాణికుల వివరాలు, టికెట్ ఫొటోలు వారికి తెలియకుండా దొంగతనంగా తన ఫోన్లో ఫొటోలు తీసుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఎలాగోలా ముందే విమానం ఎక్కేశాడు. విమానం ఎక్కిన విక్లిఫ్ చివరి లావేటరీకి చేరుకున్నాడు. తాను ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. షెడ్యూల్ ప్రకారం విమానం బయలుదేరే సమయానికి సిబ్బంది ఇతర ప్రయాణిలను ఎక్కించారు. అప్పటి వరకు చివరి లావేటరీలో ఉన్న విక్లిఫ్ విమానం కదులుతుంటే సిబ్బంది వద్దకు చేరుకుని తన సీటు ఖాళీగా లేదన్నారు. దాంతో సిబ్బంది టికెట్ వివరాలు అడగ్గా తన సీటు నంబర్ 21 ఎఫ్ అని అటెండర్కి చెప్పాడు. అయితే ఆ సీటు కోసం టికెట్ కొన్న వ్యక్తి అప్పటికే అక్కడ కూర్చున్నాడని సిబ్బంది ధ్రువీకరించారు. ఇదీ చదవండి: వర్షం కురిస్తే ట్యాక్స్ కట్టాల్సిందే..! విమానం అప్పటికే రన్వేపైకి చేరుకుంది. వెంటనే సిబ్బంది గ్రౌండ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాను రహస్యంగా విమానంలో ప్రవేశించినట్లు తేలడంతో తనను ఫ్లైట్ నుంచి దింపేసి పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపిన పోలీసులు తాను ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుని ఈ చర్యకు పాల్పడ్డాడని చెప్పారు. కేసు నమోదు చేసి ఉటా కోర్టుకు పంపించారు. ఎయిర్పోర్ట్లో తాను రహస్యంగా ఇతర ప్రయాణికుల నుంచి దొంగతనంగా ఫొటోలు తీసుకోవడం సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వివరాలను పోలీసులు కోర్టులో సమర్పించినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి విచారణ జరిపి పోలీసులు విక్లిఫ్ను సాల్ట్ లేక్ కౌంటీ మెట్రో జైలుకు తరలించారు. -
విమానం ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలి?
ఈ రోజుల్లో చాలామంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో విమాన ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే విమాన ప్రయాణం చేసేటప్పుడు పలు నిబంధనలు పాటించాలని ఎయిర్ హోస్టెస్లు చెబుతుంటారు. విమాన ప్రయాణంలో ధూమపానం చేయకూడదు, సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలాంటి నిబంధనలలో ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ను మూసివేయాలని కూడా చెబుతారు. అయితే ఇలా ఎందుకు చేయాలి? ట్రే టేబుల్ మూసివేయకపోతే ఏమైనా జరుగుతుందా? ఎయిర్ హోస్టోస్ హన్నా టెస్సన్(23) అమెరికాలోని కొలరాడోలో ఉంటున్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలనే విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రయాణికులు తాము చెప్పే సూచనలను పాటించనప్పుడు కోపం వస్తుందని అన్నారు. ప్రయాణీకులు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ మూసివేయాలని చెప్పినా, వెంటనే అమలు చేయరని ఆమె తెలిపారు. ఇలాంటి ఈ నిబంధనలను విమాన ప్రయాణికులు తప్పని సరిగా తెలుసుకోవాలని ఆమె అన్నారు. హన్నా తెలిపిన వివరాల ప్రకారం.. విమాన ప్రమాదాలు చాలావరకూ ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఓపెన్ ట్రే టేబుల్ కారణంగా ప్రయాణికులు గాయపడే అవకాశముంది. అందుకే ట్రే టేబుళ్లను మూసి వేయాలని ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్లు చెబుతుంటారు. ఆహారం అందించడం ఒక్కటే తమ పని కాదని, ప్రయాణికుల భద్రతను చూడటం కూడా తమ పనే అని హన్నా తెలిపారు. విమానం టేకాఫ్ చేయడానికి ముందు విమానంలోని భద్రతా పరికరాలను తనిఖీ చేస్తామని, అంతే కాకుండా ప్రయాణికుల వింత ప్రవర్తనపై కూడా నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
Australia to New Zealand: గాల్లో కుదిపేసిన విమానం
సిడ్నీ: ఆ్రస్టేలియా నుంచి చిలీకి వెళ్తున్న ఒక విమానం మార్గమధ్యంలో ఒక్కసారిగా కుదుపులకు లోనై ప్రయాణికులకు చుక్కలు చూపించింది. విమాన ప్రయాణికులు కుదుపులకు సీట్లలోంచి చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. విమానంలో తలెత్తిన ఒక సాంకేతికత సమస్య దీనికి అసలు కారణం. దాదాపు 50 మంది ప్రయాణికుల రక్తం కళ్లజూసిన ఈ ఎల్ఏ800 లాటన్ విమానం.. ఘటనకు ముందు సిడ్నీ నుంచి చిలీ దేశంలోని శాండిగో నగరానికి సోమవారం బయల్దేరింది. మార్గమధ్యంలో షెడ్యూల్ ప్రకారం ఆక్లాండ్లో దిగాలి. ఆ లోపే ఆకాశంలో కుదుపులకు లోనైందని ఎయిర్లైన్స్ వెల్లడించింది. విమానంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించేందుకు అక్లాండ్ ఎయిర్పోర్ట్ వద్ద 10 అత్యయిక వాహనాలను సిద్ధంగా ఉంచారు. విమానం ఎయిర్పోర్ట్లో దిగగానే గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. అందరికీ మోస్తరు దెబ్బలే తగిలాయి. ఒక వ్యక్తికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయని ఎయిర్లైన్స్ సంస్థ పేర్కొంది. -
ఎకానమీ క్లాస్లో సూపర్ స్టార్.. వీడియో వైరల్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల లాల్ సలామ్ సినిమాలో మెప్పించారు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో కీ రోల్ పోషించారు. గతనెల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఆయన ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా తలైవా కడప ఎయిర్పోర్ట్లో మెరిశారు. ఓ సామాన్యుడిలా ఎకానమీ క్లాస్లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన తలైవా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ సూపర్ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ట్విటర్లో రాస్తూ.. నేను దేవుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నాను అంటూ పోస్ట్ చేశాడు. అదే ఫ్లైట్లో ఉన్న నటుడు జీవా కూడా ఉన్నారు. ఆ తర్వాత రజనీకాంత్ బస్సులో ప్రయాణిస్తున్న వీడియోను నటుడు జీవా తన ఇన్స్టాలో షేర్ చేశారు. రజనీకాంత్, జీవా బస్సులో నిలబడి ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా వైరలయ్యాయి. సీసీఎల్ కోసం చెన్నై రైనోస్ టీమ్తో కలిసి వీరిద్దరు బస్సులో వెళ్లారు. View this post on Instagram A post shared by Jiiva (@actorjiiva) #Thalaivar at flight ❤️❤️❤️❤️#Rajinikanth | #Rajinikanth𓃵 | #SuperstarRajinikanth | #SuperStarRajinikanth𓃵 | #Jailer | #Thalaivar171 | #Jailer2 | #Vettaiyan | #superstar @rajinikanth pic.twitter.com/b443yrgcU0 — Suresh balaji (@surbalutwt) February 29, 2024 -
ఫ్లైట్ ఎక్కుతున్నారా? అయితే ఈ రీచార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి..
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో భాగమైపోయాయి. వీటిని వినియోగించకుండా నిమిషాలు కూడా ఉండలేని పరిస్థతి. విమాన ప్రయాణంలో సాధారణ రీచార్జ్ ప్లాన్లు పనిచేయవని మనందరికీ తెలుసు. ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లు ఉంటేనే ఫ్లైట్లో ఉన్నంత సేపూ కాలింగ్ కానీ, ఇంటర్నెట్ కానీ వినియోగించుకునేందుకు వీలుంటుంది. టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, రిలయన్స్ జియో కొన్ని ఇన్-ఫ్లైట్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి ఫ్లైట్లో ఉన్నప్పుడు యూజర్లు కనెక్ట్ అయి ఉండేందుకు వీలు కల్పిస్తాయి. ఈ ప్లాన్లు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అందిస్తున్న ఇన్-ఫ్లైట్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. జియో రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు -
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ బంపరాఫర్!
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శుభవార్త చెప్పింది. చెక్ ఇన్ బ్యాగేజీ లేకుండా ప్రయాణించడానికి ఇష్టపడే ప్రయాణీకులకు తగ్గింపు ధరలలో టికెట్ల ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎక్స్ప్రెస్ లైట్ ద్వారా ప్రయాణికులు సాధారణ ఛార్జీల కంటే తక్కువ ధరలో విమాన టికెట్లను పొందవచ్చు. ఎక్స్ ప్రెస్ చెక్ ఇన్ ఫ్లయర్ కౌంటర్లు, బ్యాగేజీ బెల్ట్ వద్ద క్యూలను నివారించేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా బుక్ చేసుకుంటే 15 కిలోలు, 20 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీలపై డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. ఎక్స్ప్రెస్ లైట్ ఛార్జీలపై ప్రయాణించే ప్రయాణికులు కాంప్లిమెంటరీ కింద అదనంగా 3 కిలోల బ్యాగేజీని ఫ్రీగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎయిర్ పోర్ట్ ఎయిర్ లైన్ కౌంటర్లలోని ప్రయాణికులు చెక్ ఇన్ బ్యాగేజీ సేవలను వినియోగించుకోవచ్చని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
‘వాటే లాజిక్ .. వాటే లాజిక్’.. ఇండిగో!
ఇటీవల కాలంలో పలు విమాన సంస్థలు ప్రయాణికులకు అందించే సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆహారంలో బొద్దింకలు, రాళ్లు ప్రత్యక్షమవుతున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఆయా ఘటనలపై సదరు విమానయాన సంస్థలు క్షమాపణలు చెప్పడం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జరిమానాలు విధిస్తున్నాయి. కానీ విమానయాన సేవల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు కొనుగోలు చేసిన శాండ్విచ్లో స్క్రూ ప్రత్యక్షమవ్వడంతో నెవ్వెరపోయింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. జ్యోతి రౌతేలా ఫిబ్రవరి 1న బెంగళూరు నుండి చెన్నైకి ఇండిగో ఫ్లైట్లో బయలుదేరింది. విమానంలోనే స్పినాచ్ కార్న్ చీజ్ శాండ్విచ్ను ఆర్డర్ పెట్టుకుంది. ఆ శాండ్ విచ్ను తినడకుండా అలాగే జర్నీ చేసింది. Got a screw in my sandwich byu/MacaroonIll3601 inbangalore సరిగ్గా చెన్నై విమానశ్రయంలో దిగిన తర్వాత జ్యోతి రౌతేలాను అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ భద్రతా తనిఖీల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇండిగో ఫ్లైట్లో ఆర్డర్ పెట్టిన శాండ్విచ్లో బోల్ట్ ఉండడం చూసి కంగుతిన్నది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. సంబంధిత విభాగంపై చర్యలు తీసుకోవాలని ఇండిగో అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇండిగో అధికారులు మాత్రం .. మీరు విమాన ప్రయాణంలో శాండ్ విచ్ తిని ఉంటే చర్యలు తీసుకోనే వాళ్లం. కానీ మీరు విమానం దిగిన తర్వాత శాండ్ విచ్లో బోల్ట్ ఉందని ఫిర్యాదు చేస్తే లాభం లేదని చెప్పడంతో నిర్ఘాంతపోయినట్లు చెప్పారు. ఈ విషయంపై నెటిజన్ల ఇండిగో తీరును విమర్శిస్తున్నారు. ప్రయాణికుల పట్ల ఇండిగో బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదని హితువు పలుకుతున్నారు. -
బంపరాఫర్.. రూ. 1799కే ఫ్లైట్ జర్నీ!
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. వన్వే టికెట్ డొమెస్టిక్ రూట్లలో రూ. 1,799, అంతర్జాతీయ రూట్లలో రూ. 3,899 నుంచి ప్రారంభమయ్యే నెట్వర్క్-వైడ్ సేల్ను ప్రారంభించింది . ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ పేరిట పరిమిత-కాల నెట్వర్క్-వ్యాప్త ఆఫర్ను ఫిబ్రవరి 2న ప్రారంభించింది. ఇది ఫిబ్రవరి 5 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఎయిర్ ఇండియా వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసే బుకింగ్ చేస్తే ఈ ఆఫర్పై కన్వీనియన్స్ ఫీజు కూడా మినహాయించనున్నట్లు ఎయిర్ఇండియా ఒక విడుదలలో తెలిపింది. షరతులు ఇవే.. ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ కింద బుకింగ్లు కేవలం నలుగురికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 2 నుంచి సెప్టెంబర్ 30 మధ్య చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ లోపు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయ మార్గాల్లో అన్నీ కలుపుకొని వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ.1,799 నుంచి ప్రారంభమవుతాయి. అయితే వన్-వే బిజినెస్ క్లాస్లో ఇది రూ. 10,899. ఇక అంతర్జాతీయ మార్గాల్లో వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ. 3,899 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సేల్ అందుబాటులో ఉన్న సీట్లు పరిమితంగా ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్నవారికి సీట్లు లభిస్తాయని ఎయిర్ లైన్స్ తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు ఆదా చేసుకోవచ్చు. దేశంలోని పలు నగరాలతో పాటు యూఎస్, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ & మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, దక్షిణ ఆసియాలో ఎయిర్లైన్ నిర్వహించే గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయి. -
అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం..
సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ఉడాన్ యోజన(ఉడే దేశ్కా అమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా విమానయాన కంపెనీలకు కొన్ని రాయితీలు ఇస్తోంది. కేంద్రం ఇచ్చే రాయితీ గడువు ముగిసిన తర్వాత కొన్ని సర్వీసులు ఆగిపోయాయనే వాదనలు ఉన్నాయి. కొన్ని అంతకు ముందు నిలిచిపోయినట్లు తెలిసింది. అయితే తాజాగా కేంద్రం రూట్లను తగ్గించి విమానాలు నడుపుతున్నారని పలువురు భావిస్తున్నారు. దాంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా పార్టీల నేతలు వాటిపై ఎలాంటి ప్రశ్నలు అడగడంలేదు. అయితే తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్యసింథియా స్పందించారు. ఇప్పటికే కోటి 30 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారని తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ప్రభుత్వం కేటాయించిన రూట్లలో మూడేళ్ల కన్సెషన్ గడువు ముగిసింది. దాంతో కేవలం 7 శాతం (54 రూట్లు) మాత్రమే కార్యకలాపాలు సాగుతున్నట్లుగా కాగ్ నివేదిక వెల్లడిస్తోంది. మిగిలిన రూట్లు కన్సెషన్ గడువు వరకు కూడా ఎందుకు మనుగడ సాగించలేకపోయాయి’ అంటూ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ‘ఉడాన్ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. దేశ వ్యాప్తంగా 76 ఎయిర్పోర్టులు ఉడాన్ యోజనలో భాగంగా ఉన్నాయి. ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) వల్ల ఇప్పటి వరకు 2 కోట్ల 75 లక్షల విమాన ప్రయాణాలు జరిగాయి. విమానయాన ప్రయాణానికి దూరంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేయబడ్డాయి. ఈ రాష్ట్రాల్లో కొత్తగా 9 ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగింది. అందులో 6 ఎయిర్పోర్ట్లు కేవలం ఉడాన్ యోజన కిందే ఏర్పాటయ్యాయి. ఈ పథకం కింద ఆయా రూట్లలో విమానాలు నడిపే సంస్థలకు మూడేళ్లపాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ను చెల్లించాలని ప్రతిపాదించాం. దాంతో ఈ పథకం ద్వారా మొదట్లో వేయి రూట్లను లక్ష్యంగా చేసుకున్నాం. ఇందులో 74 రూట్లలో మూడేళ్ళ కాల వ్యవధి తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే మూడేళ్ల తర్వాత గిట్టుబాటు కాని రూట్ల స్థానాల్లో కొత్త రూట్లను గుర్తిస్తున్నాం. ప్రజలు విమాన ప్రయాణానికి అలవాటు పడుతున్న కొద్దీ ఈ రూట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. 1920లో కోటి 44 లక్షలు ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి 42 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం’అని మంత్రి వివరించారు. దేశంలో ఇటీవల నెలకొన్న ప్రత్యేకపరిస్థితుల వల్ల గరిష్ఠంగా ఒకరోజు 4 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. కొవిడ్కు ముందు 2019 లెక్కల ప్రకారం దేశీయంగా నడిచే విమానాల్లో వారానికి దాదాపు 90 వేల మంది ప్రయాణించారని సమాచారం. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. ఏపీలో గతంలో మొత్తం 4 రౌండ్ల బిడ్డింగ్ తర్వాత 40 ఉడాన్ రూట్లను గుర్తించారు. ఉడాన్ రూట్లలో భాగంగా కడప, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, ప్రకాశం బ్యారేజి (సీ ప్లేన్) నుంచి విమాన సర్వీసులకు అనుమతులు మంజూరయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పాటు బెలగాం, కొల్హాపూర్, హుబ్లి, జగ్దల్పూర్, కలబురిగి (గుల్బర్గా), కలైకుండ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపేలా ఆమోదం తెలిపారు. -
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్పతి’ తాజా సీజన్ లో కోల్కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్ను అమితాబ్తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
14 వేల అడుగుల ఎత్తునుంచి జారిపడిన స్కైడైవర్.. కాపాడిన అగ్ని చీమలు!
స్కైడైవింగ్కు ప్రయత్నించే ధైర్యం అందరికీ ఉండదు. ఈ ఫీట్ చేసేందుకు కొందరు సిద్ధమైనా.. మధ్యలో పారాచూట్ విఫలమైతే ఏమైపోతామోనని భయపడిపోతారు. ఈ భయంతోనే స్కై డైవింగ్కు దూరంగా ఉంటారు. అయితే స్కైడైవింగ్ చేసేటప్పుడు పారాచూట్ విఫలం కావడం అనేది చాలా అరుదు. స్కైడైవర్ల కోసం తయారైన పారాచూట్లు వంద శాతం మేరకు తెరుచుకుంటాయి. అయితే దీనికి విరుద్ధమైన పరిస్థితి జోన్ ముర్రే అనే మహిళకు ఎదురయ్యింది. అత్యంత విచిత్ర పరిస్థితుల్లో ఆమె ప్రాణాలతో బయటపడింది. అది 1999, సెప్టెంబర్ 25.. జోన్ ముర్రే(40) అనే మహిళ స్కైడైవింగ్కు దిగింది. 14,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి పారాచూట్ సాయంతో దూకేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పారాచూట్ తెరుచుకోలేదు. అలాగే ఆమెకు సాయం అందించాల్సిన సెకండరీ పారాచూట్ కూడా విఫలమైంది. ఫలితంగా ముర్రే గంటకు ఎనభై మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తూ అగ్ని చీమల దండుపై పడింది. అయితే ఈ అగ్ని చీమలే ఆమెను కాపాడాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెపై ఆ అగ్ని చీమలు దాడి చేశాయి. ఈ దాడి కారణంగానే ఆమె బతికి బట్టకట్టిందంటే ఎవరూ నమ్మలేరు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అగ్ని చీమల దాడికి ముర్రే శరీరంలోని నరాలు ఉత్తేజితమయ్యాయి. ఆమె గుండె కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి వెళ్లే వరకు అగ్ని చీమలు ఆమె ప్రాణాలతో ఉండేలా సహాయపడ్డాయి. ఆసుపత్రిలో ముర్రే రెండు వారాల పాటు కోమాలో ఉంది. వైద్యులు ఆమె ప్రాణాన్ని నిలిపి ఉంచేందుకు పలు ఆపరేషన్ల చేయవలసి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆమె ప్రాణాలను అగ్ని చీమలే కాపాడాయని చెప్పకతప్పదు. ఇది కూడా చదవండి: అడవిలో వృద్ధుడు గల్లంతు.. 48 గంటలు గడిచాక.. The story of Joan Murray, who survived a 4,500 meter fall when her main parachute failed while skydiving. She landed in a fire ant mound where numerous venomous stings caused an adrenaline rush to keep her heart beating long enough for doctors to assist https://t.co/YUMFGJCXX6 pic.twitter.com/GOPpFwKjqB — Massimo (@Rainmaker1973) May 13, 2020 -
హైదరాబాద్ నుంచి అమృత్సర్కు విమాన సేవలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మరో నాలుగు నగరాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సహకారంతో దేశీయ విమానయాన సేవలను విస్తరించినట్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. వీటిలో మూడు నగరాలకు శుక్రవారం నుంచి (17వ తేదీ) సర్విసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి అమృత్సర్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (ఐగీ 954) రోజూ ఉదయం 07:30కి హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.15కి అమృత్సర్కు చేరుకుంటుంది. ఇక లక్నో–హైదరాబాద్ మధ్య వారానికి ఆరు సర్విసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (ఐగీ 953) హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.35కి లక్నోకు చేరుకుంటుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ( ఐగీ 955) ప్రతీరోజు సాయంత్రం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రాత్రి 9.30 గంటలకు కొచ్చిన్కు చేరుకుంటుంది. గ్వాలియర్కు ఆరు సర్విసులు నవంబర్ 28 నుంచి హైదరాబాద్–గ్వాలియర్ మధ్య వారానికి మూడు సర్విసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానం హైదరాబా ద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.20కి గ్వాలియర్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ మాట్లాడుతూ...ఈ మార్గాల్లో మెరుగైన అనుసంధానం కోసం కొత్త విమానాలు దోహదం చేయనున్నాయని చెప్పారు. -
ఆకాశ ఎయిర్లైన్స్ సంచలన నిర్ణయం
దేశీయ విమానయాన రంగం సంస్థ అయిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్లో విమానాలు నడపనుంది. అందుకు అనువుగా ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ వినయ్దూబే తెలిపారు. సంస్థ ప్రస్తుతం 4.2 శాతం మార్కెట్ వాటాతో కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాకేశ్ ఝన్ఝన్వాలా పెట్టుబడి పెట్టిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్లో ప్రయాణించడానికి సిద్ధపడుతోంది. దీనికి తోడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకూ ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీతో సహా 16 దేశీయ గమ్యస్థానాలకు ఆకాశ తన సేవలు అందిస్తోంది. ఈ ఎయిర్ లైన్స్ వారానికి 750 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. కాగా ఈ దశాబ్దం చివరి నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా మార్కెట్లలో లిస్ట్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. 76 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఇప్పటికే ఆర్డర్ చేయగా.. 2027 మధ్య నాటికి ఇవి డెలివరీ అవుతాయని బావిస్తోంది. ప్రస్తుతం ఆకాశ ఎయిర్కు 20 విమానాలు ఉన్నాయి. -
విమానంలో తల్లికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. వీడియో వైరల్
అమ్మను స్కూటర్లో కూచోబెట్టి తిప్పేవాళ్లున్నారు. కార్లలో తిప్పేవాళ్లున్నారు. కాని విమానంలో తిప్పేవాళ్లు... అదీ విమానం నడుపుతూ తిప్పేవాళ్లు కొంచెం అరుదు. ఈ తల్లికి తన కుమారుడే తను ప్రయాణిస్తున్న ఫ్లయిట్కి పైలెట్ అని తెలియదు. కాని తెలిసి గొప్పగా ఆనందించింది. మురిసిపోయింది. నెటిజన్లు కూడా భలే ముచ్చటపడ్డారు. అది ఇండిగో విమానం. కొచ్చి నుంచి బయలుదేరబోతోంది. ఒకామె అదే ఫ్లయిట్లో చాలా క్యాజువల్గా ఎక్కింది. ఇంతలో ‘అమ్మా’ అనే పిలుపు. తిరిగి చూస్తే కాక్పిట్ నుంచి బయటికొచ్చి నిలబడిన పైలెట్. ‘హార్ని.. నువ్వేనా’ అని ఆమె సంబరంగా నోరు తెరిచేసింది. ఎందుకంటే ఆ పైలెట్ ఆమె కొడుకే. అతని పేరు విమల్ శశిధరన్. తను ప్రయాణించే ఫ్లయిట్కి కొడుకే పైలెట్ అని తెలిసిన తల్లి సంతోషంగా కొడుకును హగ్ చేసుకుంది. ఆ స్వీట్ సర్ప్రయిజ్కి మురిసిపోయింది. కొచ్చికి చెందిన విమల్ శశిధరన్ ఇదంతా వీడియో తీయించి ఇన్స్టాలో ΄ోస్ట్ చేశాడు. ‘ఇలాంటి క్షణాలే జీవితాన్ని అత్యధ్భుతం చేస్తాయి’ అని కామెంట్ చేశాడు. ఆ వీడియోలో కన్నకొడుకు ఉన్నతి చూసి గర్వపడే తల్లిని, తల్లిని ఆనందపరిచే కొడుకును చూసి నెట్లోకం పులకించింది. కామెంట్లు, లైక్లు మామూలే. ‘మీ అమ్మ వయసులో చిన్నదిగా కనిపిస్తోంది. పిల్లలు బాగా చూసుకుంటే తల్లిదండ్రుల వయసు తగ్గుతుంది’ అని ఒకరు రాస్తే ‘ఆ అమ్మ నవ్వు ఎంత బాగుంది’ అని మరొకరు రాశారు. ఏమైనా అమ్మను విమానంలో కూచోబెట్టి తానే నడిపి తిప్పే అదృష్టం ఎంతమందికొస్తుంది చెప్పండి. View this post on Instagram A post shared by Vimal Sasidharan (@iflya320) View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) -
నా జీవితంలో తొలిసారి ఇలా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన జగపతి బాబు..ఇప్పుడు విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకెళ్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్సిరీస్లపై దృష్టిపెడుతున్నారు. ఆ మధ్య ‘పరంపర’ అనే వెబ్సిరీస్లో నటించారు. ప్రస్తుతం జగపతి బాబు సలార్ తో పాటు మహేశ్బాబు-త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటాడు జగ్గూ భాయ్. సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానంలో ప్రయాణం చేస్తున్న ఫోటోని నేను చేస్తూ.. అందులో మొదటి సారిగా మొదటి ప్రయాణికుడిగా ఎక్కానని చెప్పుకొచ్చాడు. (చదవండి: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా?) ‘నా జీవితంలో ఫస్ట్ టైమ్ మొదటి ప్యాసింజర్గా విమానం ఎక్కాను. ఈ సందర్భంగా త్రివిక్రమ్ చెప్పిన చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తుకొస్తుంది. ‘విమానం ఎగురుతుంది కానీ.. నువ్వు కాదు. నువ్వు సీట్లో కూర్చుంటావ్ అంతే’..త్రివిక్రమ్ చెప్పిన ఈ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క డైలాగ్తో జీవితం మొత్తాన్ని చెప్పాడు’అని జగపతి బాబు రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ కాగా.. ‘ఫ్లైట్ని హైజాక్ చేస్తున్నారా?’, ఒక్కరే ఫ్లైట్ బుక్ చేసుకున్నారా? ఏ సినిమా షూటింగ్ ఇది? అప్డేట్ ఇవ్వండి’అని కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
‘ఢిల్లీ’కి ఫుల్ డిమాండ్!.. తరువాత ముంబైకి గిరాకీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం–ఢిల్లీల మధ్య నడిచే విమానాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. మరే విమాన సర్వీసుకు లేని ప్రయాణికుల తాకిడి వీటికి కనిపిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య రోజుకు ఐదు సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి ఉదయం 8.15 నుంచి రాత్రి 9.50 గంటల వరకు తిరుగుతున్నాయి. వీటిలో సీట్లు 95 శాతానికి పైగా నిండుతున్నాయి. ఒక్కోసారి ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 100 శాతం కూడా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రెండు రోజుల ముందుగా టికెట్లు దొరకడం లేదు. ఆ తర్వాత స్థానం విశాఖపట్నం–ముంబై విమాన సర్వీసులకు ఉంది. ఈ రెండు నగరాల మధ్య 90 శాతం పైగా ఓఆర్ ఉంటోంది. ఈ విమాన సర్వీసులకు కూడా ఒకట్రెండు రోజుల ముందుగా టికెట్లు లభించని పరిస్థితి ఉంది. ఇక విశాఖపట్నం–సింగపూర్ సర్వీసుకు కూడా మంచి గిరాకీ కనిపిస్తోంది. ఈ విమాన సర్వీసుకు 80 శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్కు ఒక్క ఇంటర్నేషనల్ సర్వీసు మాత్రమే నడుస్తోంది. అందువల్ల ఇతర దేశాలకు వెళ్లాలంటే విశాఖ నుంచి నేరుగా విమానాలు లేవు. ఢిల్లీ, ముంబైల నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు కనెక్టివిటీ ఉంది. దీంతో ఇక్కడ నుంచి డొమెస్టిక్ సర్వీసుల్లో ఢిల్లీ, ముంబైలకు వెళ్లి అక్కడ నుంచి ఆయా దేశాలకు విమానాల్లో చేరుకుంటున్నారు. ఫలితంగా ఈ విశాఖ విమానాశ్రయం నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగ, వ్యాపార అవసరాలతో పాటు పర్యాటకంలో భాగంగా పెద్ద సంఖ్యలో విదేశాలకు రాకపోకలు సాగించే వారున్నారు. దీంతో ఈ నగరాల మధ్య ప్రయాణికుల రద్దీ పెరగడానికి దోహదపడుతోంది. విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాల్లో ఢిల్లీ, ముంబై సర్వీసులకు అధిక డిమాండ్ ఉండడానికి ఇదే కారణమని ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎస్. రాజారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీకనుగుణంగా తగినన్ని సర్వీసులు పెంచేందుకు విమానాల కొరత ఉందని విమానయాన నిపుణులు చెబుతున్నారు. -
గద్దర్కు ఎన్నో ఆహ్వానాలు.. అయినా విమానం ఎక్కలేదు, విదేశాలకు పోలేదు
మంచిర్యాలఅర్బన్: గద్దర్ గళం..దేశవిదేశాల్లో ఎందరో అభిమానాన్ని చూరగొన్నది. ఆయన పాట వినేందుకు విదేశాల నుంచి అభ్యుదయ, సాంస్కృతిక సంఘాల నుంచి ఆహ్వానం వచ్చినా విమానం ఎక్కి వెళ్లలేకపోయారు. 1997, ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులు జరగ్గా, ఆరు బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. ఐదు బుల్లెట్లను తొలగించిన వైద్యులు, వెన్నుపూసలో ఉన్న మరో బుల్లెట్ తొలగిస్తే ప్రాణానికే హాని ఉంటుందని చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఆ బుల్లెట్ శరీరంలోనే ఉండిపోయింది. దేశంలో ఇతర రాష్ట్రాల పర్యటనకు ఎయిర్పోర్ట్కు గద్దర్ వెళ్లినా, తనిఖీల్లో స్కానర్లో బుల్లెట్ చూపడం, అధికారులకు సమాధానం చెప్పడంలో అనేకసార్లు ఇబ్బంది పడినట్టు తెలిసింది. శరీరంలో బుల్లెట్, కేసులు పాస్పోర్టు జారీకి అడ్డంకిగా మారాయి. దీంతో ఎన్ని ఆహా్వనాలు వచ్చినా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లలేకపోయారు. ► 1980 సమయంలో నక్సల్స్తో కలసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ► పీపుల్స్వార్ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలపు జననాట్యమండలి సభ్యుడిగా పనిచేశారు. ► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు. ► 1995లో పీపుల్స్వార్ పార్టీ గద్దర్ను బహిష్కరించింది. ఆయన తీవ్రంగా ఆవేదనకు గురవడంతో తిరిగి పార్టీలోకి ఆహా్వనించింది. 25 ఏళ్లుగా వెన్నులో బుల్లెట్తో గద్దర్పై చాలా సార్లు హత్యాయత్నాలు జరిగాయి. నల్లదండు ముఠా, బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ ముఠాలు ఆయనను చంపడానికి ప్రయత్నించాయి. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం జరిగింది. గ్రీన్టైగర్స్ పేరుతో కొందరు ఆగంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన ప్రాణాలకు ప్రమాదమని ఒక బుల్లెట్ను వదిలేశారు. దీనితో దాదాపు 25 ఏళ్లుగా ఆ బుల్లెట్ గద్దర్ ఒంట్లోనే ఉండిపోయింది. ‘‘రాష్ట్ర అణచివేతకు చిహ్నంగా నా వెన్నెముకలో బుల్లెట్ అలాగే ఉంది. దానితో నాకు భయమేమీ లేదు, ఏ ప్రభావమూ పడలేదు. నా లక్ష్యాలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నా..పనిచేస్తూనే ఉంటా..’’ అని గద్దర్ తరచూ గుర్తు చేసుకునేవారు. -
ఎయిర్పోర్టులో దుమ్మురేపుతున్న దోస్తులు, ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ రావొద్దు!
శంషాబాద్: ప్రయాణికుల స్వాగత, వీడ్కోలు జరిగే సమయాల్లో అత్యధికమంది రావడంతో ఎయిర్పోర్టు పరిసరాల్లో పార్కింగ్, రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఎయిర్పోర్టు వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇటీవల విదేశాలకు వెళుతున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి పెద్దఎత్తున స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల రాకతో ఎయిర్పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు సహకరించాలన్నారు. -
విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు..
న్యూఢిల్లీ: విద్య లేని వారిలోనే కాదు విద్యాధికుల్లో కూడా వింతపశువులు ఉంటారని రుజువు చేశాడు ఓ ప్రొఫెసర్. తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పెడితే అక్కడ చేతులు వేసి తనని లైంగికంగా వేధించారని బాధితురాలైన 24 ఏళ్ల డాక్టర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ప్రొఫెసర్ ని అదుపులోకి రిమాండ్ కు తరలించారు పోలీసులు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ నుండి ముంబై బయలుదేరిన ఓ విమానంలో ప్రొఫెసర్(47), డాక్టర్(24) పక్కపక్కన సెట్లలో కూర్చున్నారు. ప్రయాణం మొదలైంది మొదలు ప్రొఫెసర్ ఇష్టానుసారంగా తనపై చేతులు వేస్తూ లైంగికంగా వేధించారని, ప్రశ్నించినందుకు తనతోపాటు ఫ్లైట్ సిబ్బందితో కూడా వాదనకు దిగారని.. ఫ్లైట్ ముంబైలో దిగేంతవరకు ప్రొఫెసర్ వేధిస్తూనే ఉన్నారని బాధితురాలు చెప్పినట్లు వెల్లడించారు సహర్ పోలీసులు. బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా నిందితుడైన ప్రొఫెసరుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
ఇంత బరువుంటే విమానం టేకాఫ్ కాదు.. ప్లీజ్ కొందరు దిగిపోండి..
విమానాశ్రయంలో విమానం టేకాఫ్కు రెడీగా ఉంది. ప్రయాణీకులందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో విమానంలో ఉన్న వారికి పైలట్ ఓ షాకింగ్ వార్త చెప్పాడు. విమానంలో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టేకాఫ్ చేయలేము.. అందకు కొందరు ప్రయాణీకులు విమానం దిగాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో, ప్రమాణీకులంతా ఒక్కసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన స్పెయిన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బ్రిటన్కు చెందిన ఈజీ జెట్ విమానం లాంజరెటో నుంచి లివర్ పూల్ వెళ్లాల్సి ఉంది. ఈ విమానం షెడ్యూల్ ప్రకారం టేకాఫ్ అవ్వాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో టేకాఫ్ ఆలస్యమైంది. దీంతో, ప్రయాణీకులకు విమాన పైలట్ అసలు విషయం చెప్పుకొచ్చాడు. విమానాశ్రయం రన్వే పొడువు తక్కువగా ఉండటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమాన టేకాఫ్ ఆలస్యమవుతోందని పైలట్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో టేకాఫ్ కష్టమవుతోందని వివరించాడు. ఇక, పైలట్ వ్యాఖ్యలతో విమానం ఉన్న ప్రయాణీకులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇదే సమయంలో, పైలట్ మాట్లాడుతూ.. ఇటువంటి పరిస్థితుల్లో బరువైన ఈ విమానాన్ని టేకాఫ్ చేయడం కష్టతరమని తెలిపాడు. విమానం టేకాఫ్ కావలంటే కొందరు ప్రయాణీకులు విమానం దిగిపోవాల్సిందేనని చెప్పాడు. కనీసం ఓ 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా విమానం దిగి, తమ ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలని సూచించాడు. అలా దిగిన వారికి 500 యూరోలు పారితోషికం కూడా ఇస్తామనీ చెప్పాడు. అయినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి 19 మంది ప్రయాణికులకు నచ్చజెప్పి సిబ్బంది తర్వాతి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. దీంతో మిగిలిన ప్రయాణికులతో విమానం రెండు గంటల ఆలస్యంగా టేకాఫ్ అయ్యింది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #easyJet's Captain asked 20 passengers to leave the aircraft because it was overweight and wouldn't be able to takeoff from #Lanzarote due to wind and warm weather. The flight from Lanzarote to #Liverpool was delayed by about 2 hours. 🎥 ©razza699/TikTok#Spain #uk #aviation pic.twitter.com/oa8pi4Imox — FlightMode (@FlightModeblog) July 8, 2023 ఇది కూడా చదవండి: మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..! -
ఎలా వస్తాయ్ వీళ్లకీ ఐడియాలు! ఇంటి అద్దె ఎక్కువని.. విమానంలో జాబ్కు వెళ్తోంది!
ప్రజలు సొంతూళ్లను వదిలి ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరాలకు వలసపోతున్నారు. అయితే ఉద్యోగాలైతే దొరుకుతున్నాయి గానీ నివసించేందుకు సొంత ఇళ్లు అంటేనే.. అనుకున్నంత ఈజీ కాదు. సరే పోనీ అద్దె ఇంట్లో ఉంటూ బతుకు బండిని ముందుకు నడిపిద్దామని అనుకుంటే.. నగరాల్లో అద్దెలా భారం భయాన్ని పుట్టిస్తోంది. దీంతో చేసేదేమి లేక తక్కువ అద్దె చూసుకుని.. పని చేస్తున్న కంపెనీకి కిలీమీటర్ల దూరం అయినా..ట్రాఫిక్ జామ్లో గంటల సమయాన్ని వృథా చేసుకుంటూ జీవనాన్ని గడిపేస్తుంటాం. ఇదంతా మనకి తెలిసిన కథే.. అయితే ఓ యువతి చేసిన పనికి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అద్దె భరించలేక.. విమాన ప్రయాణం ఒక యువతి ఇంటి అద్దె భరించలేక విమానంలో ఉద్యోగానికి మరొక రాష్ట్రానికి వెళ్ళొస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోఫియా సెలెంటానో అనే 21 ఏళ్ల యువతి న్యూజెర్సీలోని ఓగిల్వీ హెల్త్లో సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తోంది. కానీ ఆ నగరంలో అపార్ట్మెంట్ల అధిక ధర పలుకుతూ ఆకాశాన్నంటుతున్నాయి. కనీసం ఆ నగరం శివారు ప్రాంతం ఉండాలంటే కూడా.. కనీసం నెలకు 3400 డాలర్లు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రెండునెలల తన ఇంటర్న్షిప్ కాలంలో సోఫియా వారానికి ఒక రోజే ఆఫీసుకు వెళ్లాలట. అందుకని ఆమె తాను ఇంటర్న్షిప్ చేస్తున్న ప్రదేశం నుంచి దాదాపు 700 కి.మీ దూరంలో తక్కువ అద్దెకు రూం తీసుకుంది. ఆఫీసుకు వారానికి ఒక రోజు కాబట్టి విమానం ప్రయాణాన్ని ఎంచుకుంది. ఎందుకంటే.. రెండు నెలల్లో మొత్తంగా 8 రోజులు ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా అందుకు విమాన టికెట్, క్యాబ్ ఖర్చులు అంతా కలిపి 2,250 డాలర్లే ఖర్చవుతుందట. న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం కంటే.. ఇదే నయమని తాను ఈ దారిని ఎంచుకుంది. అందుకోసం తాను తెల్లవారుజాము 3 గంటలకే లేవాల్సి వస్తోందని, రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతున్నట్లు ఆమె తెలిపింది. టిక్టాక్లో ఆమె మాట్లాడిన తర్వాత తన కథ వెలుగులోకి వచ్చింది. చదవండి: Hayden Bowles Success Story: 17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ! -
‘బాంబు.. బాంబు’ విమానంలో యువకుని కేకలు.. తరువాత జరిగిందిదే!
కోల్కతా నుంచి దోహా వెళుతున్న కతర్ ఎయిర్వేస్లో ఆ సమయంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విమానంలో ఉన్న ఒక యువకుడు ‘బాంబు.. బాంబు’ అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో క్రూ మెంబర్స్ ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు తెలియజేశారు. వెంటనే విమానంలో తనిఖీ చేపట్టారు. అయితే ఆ యవకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు. వివరాల్లోకి వెళితే కతర్ ఎయిర్వేస్కు చెందిన క్యూఆర్541, విమానం కోల్కతా నుంచి దోహాకు బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. ఒక యువకుడు విమానంలో బాంబు ఉందంటూ పెద్దగా కేకలుపెట్టాడు. విమానంలోని క్రూ మెంబర్స్ వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు చేరవేశారు. వెంటనే భద్రతా దళాలు పరుగుపరుగున వచ్చి, విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వారు ఆ యువకుడిని ప్రశ్నించగా... ఎవరో తనతో విమానంలో బాంబు ఉందని చెప్పారని అన్నాడు. కాగా సీఐఎస్ఎఫ్ బృందం ఎయిర్క్రాఫ్ట్ను స్నిఫర్ డాగ్స్ సాయంతో తనిఖీ చేయించారు. ఇంతలో ఆ యువకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, అందుకు సంబంధించిన ధృవపత్రాలను కూడా చూపించాడు. ఈ ఘటన కారణంగా విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. బాంబు లేదని నిర్థారించాక ప్రయాణికులను తిరిగి విమానంలోకి అనుమతించారు. కాగా దీనికిముందు గత ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న విమానంలో బాంబు ఉందంటూ సూచన అందించింది. దీంతో ఆ విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్సింగ్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తరువాత విమానంలో తనిఖీలు జరిపారు. అయితే విమానంలో ఎటువంటి బాంబు లభ్యంకాలేదు. ఈ ఘటనలో బాంబు ఉందంటూ వదంతులు వ్యాపింపజేసిన హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ఆమె 18 ఏళ్ల తరువాత తన ఎల్కేజీ ఫ్రెండ్ను కనిపెట్టిందిలా.. -
విమాన ప్రయాణికులకు బంపరాఫర్!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరు-గోవా, ముంబయి-గోవా నగరాల మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు రూ.1,818 ధరకే విమాన టికెట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ సేల్ 23 మే 2023 నుంచి 28 మే 2023 వరకు అందుబాటులో ఉండనుంది. టికెట్లు బుక్ చేసుకున్న వారు జులై 1, 2023 నుంచి మార్చ్ 30 ,2024 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. దీంతో పాటు 2023లో 18 ఏళ్లు వయసున్న ప్రయాణికులకు రూ.3,000 విలువైన ఉచిత ఫ్లైట్ వోచర్ను అందిస్తోన్నట్లు తెలిపింది. ఈ కూపన్ కోసం జూన్ 10 తేదీలోపు స్పైస్జెట్కు తమ వివరాలను ఈమెయిల్ చేయాలి. తర్వాత 10 జులై వరకు కూపన్ పంపుతారు. దాన్ని ఉపయోగించి 31 ఆగస్టులోపు టికెట్ బుక్ చేసుకుని 30 సెప్టెంబరులోపు ప్రయాణించాలి. అయితే, ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. టికెట్ బుకింగ్ విలువ రూ.7,500 దాటిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్జెట్ తెలిపింది. స్పైస్మ్యాక్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు 50 శాతం డిస్కౌంట్తోపాటు విమానంలో తమకు నచ్చిన సీటును కేవలం రూ. 18 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. Your destination: Savings! Celebrate our 18th anniversary with sky-high discounts. Book your tickets now at https://t.co/PykmFjGBqZ#flyspicejet #spicejet #18thAnniversary #SpiceJetAnniversary #sale #Travel #travelgram #Aviation #travelwithus #addspicetoyourtravel pic.twitter.com/2rjYDRXQ54 — SpiceJet (@flyspicejet) May 23, 2023 -
బంఫరాఫర్: వైజాగ్ నుంచి సింగపూర్ విమాన టికెట్ ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ స్కూట్ తమ టికెట్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మే 16 నుంచి 20 వరకు ఈ నెట్వర్క్ సేల్ కొనసాగుతుంది. దీని ప్రకారం ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని 17 దేశాలకు తక్కువ చార్జీలకే విమాన ప్రయాణం చేయొచ్చని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే! విశాఖ నుంచి సింగపూర్నకు అత్యంత తక్కువగా రూ. 6,200కే (వన్ వే, పన్నులు సహా) టికెట్ ఆఫర్ చేస్తున్నట్లు వివరించింది. ఆగస్టు 31 వరకు చేసే ప్రయాణాల కోసం ఇవి వర్తిస్తాయని తెలిపింది. -
రాత్రుల్లోనూ విమాన సేవలు
సాక్షి, చైన్నె: కొత్త టెర్మినల్లో రాత్రి సమయాల్లోనూ విమాన సేవలకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు జరిగిన ట్రైల్ రన్ విజయవంతమైంది. వివరాలు.. చైన్నె విమానాశ్రయాన్ని అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. గత నెల 8వ తేదీన కంబైన్డ్ టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అదే నెల 25వ తేదీ నుంచి ఈ టెర్మినల్ ద్వారా అంతర్జాతీయ విమాన సేవలకు శ్రీకారం చుట్టారు. తొలి విమానం బంగ్లా దేశ్ నుంచి ఇక్కడకు వచ్చి మళ్లీ తిరుగు ప్రయాణమైంది. ప్రయాణికుల తనిఖీలకు వంద, కస్టమ్స్, ఇమిగ్రేషన్ తదితర తనిఖీల కోసం మరో 108 కౌంటర్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. కన్వేయర్ బెల్ట్లు, ఎక్సలేటర్లు, వాక్ లేటర్లు తదితర హంగులతో బ్రహ్మాండంగా ఈ టెర్మినల్ రూపుదిద్దుకుంది. విమానాలు ఆగేందుకు, ప్రయాణికుల టాక్సీ సేవలు అంటూ మరెన్నో ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారు. ఈనెల 3 వతేదీ నుంచి ట్రైల్ రన్గా సింగపూర్, కువైట్ తదితర దేశాల విమానాలు ఈ టెర్మినల్ దావరా టేకాఫ్, ల్యాండింగ్ చేశాయి. అలాగే చిన్న రకం విమానాలు ఎయిర్ బస్, బోయింగ్ తదితర విమమానాలు టేకాఫ్ తీసుకున్నాయి. ప్రయోగాత్మకంగా.. ఈ టెర్మినల్ ద్వారా ప్రయోగాత్మకంగా ఉదయం వేళల్లో మాత్రం విమాన సేవలు జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రాత్రుల్లో సైతం విమాన సేవలకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువ జాము వరకు ప్రయోగాత్మకంగా ఈ టెర్మినల్ నుంచి విమానాల టేకాఫ్ తీసుకున్నాయి. ఎలంక, కువైట్, ఇథియోఫియా దేశాలకు విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఈ వారం మొత్తం రాత్రులలో ట్రైల్ రన్ నిర్వహించనున్నారు. అనంతరం జూన్ మొదటివారం నుంచి ఈ కొత్త టెర్మినల్ను పూర్తి స్థాయిలో ప్రయాణికుల ఉపయోగంలోకి తీసుకు రానుందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. -
సోలో ఫ్లైట్ జర్నీ.. రూ.13 వేలకే ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణం!
ప్రైవేట్ జెట్ అంటే విలాసవంతమైన విమానం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలకు రూ.కోట్ల ఖరీదైన ప్రైవేట్ జెట్ విమానాలు ఉంటాయి. అందులో వారు ఏకాంతంగా ప్రయాణిస్తుంటారు. అలాంటి అనుభూతి ఓ సాధారణ ప్రయాణికుడికి రూ.13వేలకే దక్కింది. అయితే అది ప్రైవేట్ జెట్ కాదు కానీ ఓ విమానానికి అంతటికీ అతనొక్కడే ప్రయాణికుడు. (Mahindra Thar: మహీంద్రా థార్ కావాలంటే మరో రూ.లక్ష కావాలి!) న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం... యూకేకు చెందిన 65 ఏళ్ల పాల్ విల్కిన్సన్ ఉత్తర ఐర్లాండ్ నుంచి తన కుటుంబాన్ని కలవడానికి పోర్చుగల్కు బయలుదేరాడు. విమానం ఎక్కేందుకు ఎయిర్పోర్ట్కు చేరుకున్న పాల్కు గేట్ వద్ద ప్రయాణికులు ఎవరూ కనిపించలేదు. దీంతో విమానం రద్దయిందేమో అనుకుని ఆరా తీయగా మొత్తం విమానానికి తాను ఒక్కడినే ప్రయాణికుడని తెలిసింది. (ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్లో ఉత్పత్తి) ఎయిర్పోర్ట్, విమాన సిబ్బంది విల్కిన్సన్ను వీఐపీ అతిథి, కింగ్ పాల్ అంటూ సంబోధిస్తూ విమానంలోకి స్వాగతం పలికారు. విల్కిన్సన్ విమానంలో తనకు నచ్చిన సీటు ఎంచుకుని కూర్చుని ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణాన్ని ఆస్వాదించారు. ఈ ప్రయాణానికి అతనికి అయిన ఖర్చు కేవలం 162 డాలర్లు (సుమారు రూ. 13,000) మాత్రమే. (New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!) -
దేశీయంగా విమాన ప్రయాణాలు రెట్టింపు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రెట్టింపు స్థాయిలో నమోదైంది. 64.08 లక్షల నుంచి 1.25 కోట్లకు చేరింది. పౌర విమానయాన డైరెక్టరేట్ డీజీసీఏ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఫ్లయిట్పరమైన, బ్యాగేజ్పరమైన, సిబ్బంది ప్రవర్తనపరమైన సమస్యలపై మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. వరుసగా అయిదో నెల జనవరిలోనూ ఇండిగో దేశీ మార్కెట్ వాటా తగ్గింది. 54.6 శాతానికి చేరింది. గతేడాది ఆగస్టులో ఇది 59.72 శాతంగా ఉండేది. ఇండిగో గత నెల 68.47 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరిన్ని కీలకాంశాలు.. ► సమీక్షాకాలంలో ఎయిరిండియా 11.55 లక్షల మందిని, విస్తారా 11.05 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చాయి. వాటి మార్కెట్ వాటా వరుసగా 9.2 శాతం, 8.8 శాతంగా ఉంది. ► బడ్జెట్ విమానయాన సంస్థలు గో ఫస్ట్లో 10.53 లక్షల మంది, ఎయిర్ఏషియా ఇండియాలో 9.30 లక్షల మంది, స్పైస్జెట్ ఫ్లయిట్స్లో 9.14 లక్షల మంది ప్రయాణించారు. ► టాటా గ్రూప్లో భాగమైన విస్తారా, ఎయిరిండియా, ఎయిర్ఏషియా ఇండియా కలిపి 32.30 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చాయి. 26 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. ► మొత్తం ఏడు దేశీ ఎయిర్లైన్స్లోనూ సీక్వెన్షియల్గా చూస్తే జనవరిలో సీట్ల భర్తీ స్థాయి (పీఎల్ఎఫ్) తగ్గింది. ► సమయపాలనలో (ఓటీపీ) ఇండిగో అగ్రస్థానంలో కొనసాగింది. హైదరాబాద్ సహా నాలుగు కీలక మెట్రో ఎయిర్పోర్టుల్లో సగటున 84.6% ఫ్లయిట్లను నిర్దేశిత సమయంలో నడిపింది. -
మారిషస్కు విస్తారా సర్వీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ విస్తారా తాజాగా మారిషస్కు సర్వీసును ప్రారంభిస్తోంది. ముంబై నుంచి వారంలో అయిదు సర్వీసులు మార్చి 26 నుంచి మొదలు కానున్నాయి. ముంబై నుంచి విస్తారా ఇప్పటికే 11 దేశాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. -
తీరిన కోరిక: ప్రతి పైసా కూడగట్టి విమానం ఎక్కారు
అమ్మ విమానం ఎక్కి ఉండదు ఒక్కసారైనా. మనకు తీసుకెళ్లే వీలు ఉన్నా ఇంట్లోని ఆడవాళ్లను విమానం ఎక్కించడానికి ఖర్చు కారణం చూపుతాము. కేరళలో కూలి పని చేసే 24 మంది స్త్రీలు తాము జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని నిశ్చయించుకున్నారు. పైసా పైసా కూడగట్టారు. టికెట్లు బుక్ చేశారు. చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ కొచ్చి నుంచి బెంగళూరుకు ఆకాశంలో ఎగిరారు. ఎంత మంది స్త్రీలకో ఇలాంటి కోరిక ఉండొచ్చు. ప్రయత్నిస్తే సాధ్యమని వీరు అంటున్నారు. ‘మాకు రెండు కోరికలు. ఒకటి విమానం ఎక్కాలి. రెండు ఏసీ ట్రైన్లో ప్రయాణించాలి. ఆ రెండు కోరికలూ ఇప్పుడు తీర్చుకుంటున్నాం’ అంది 55 ఏళ్ల గీతా ఉన్నికృష్ణన్. మొన్నటి జనవరి 26న కొచ్చి నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించిన బృందంలో ఈమె కాకుండా ఇంకో 23 మంది మహిళలు ఉన్నారు. వీరంతా కేరళలోని కొట్టాయం జిల్లాలో పనాచ్చికాడ్ అనే చిన్న పంచాయతీకి చెందినవారు. అందరూ గ్రామీణ ఉపాధిలో భాగంగా పంచాయితీ కింద పని చేసేవారే. రోజు కూలీలు అనుకోవచ్చు. చెత్త ఎత్తేవారు, రోడ్లు ఊడ్చేవారు, పంచాయితీ చేసే నిర్మాణాల్లో రాళ్లు ఎత్తేవారు ఈ మహిళలు. ‘అయితే ఏమిటి? మేము విమానం ఎక్కకూడదా?’ అనుకున్నారు. కాని వీరు యువతులో, చిన్నపిల్లలో కాదు. ఈ బృందంలో తక్కువ వయసు 55 అయితే అందరికంటే ఎక్కువ వయసు 77. ‘మా రోజు కూలీ రోజుకు 311 రూపాయలు. అయితే అందులో నుంచే పైసా పైసా దాచిపెట్టి టికెట్ డబ్బు చేయాలనుకున్నాం. ఒక మొత్తం అయ్యాక మా పంచాయతీ మెంబర్ అబ్రహంను కలిశాం. ఆయన మాకు అండగా నిలిచి టికెట్లు బుక్ చేయడమే కాకుండా మా ప్రయాణంలో భాగమయ్యాడు’ అన్నారు వాళ్లు. కొచ్చి నుంచి తెల్లవారుజాము విమానం ఎక్కేటప్పుడు వీరి సంబరం అంతా ఇంతా కాదు. బెంగళూరులో దిగాక ఒక ఎం.ఎల్.ఏ సాయంతో వీరు విధాన సభ చూసే అవకాశం పొందారు. ‘మేము మెట్రో రైలు కూడా ఎక్కాం తెలుసా?’ అన్నారు వాళ్లు. 77 ఏళ్ల చెల్లమ్మ అయితే ఎంతో మురిసిపోయింది. ‘ఇలా జరుగుతుందని నిజంగా అనుకోలేదు’ అందామె. వీరంతా బెంగళూరు నుంచి కొచ్చికి తాము కోరుకున్నట్టు ఏసి ట్రైన్లో తిరుగు ప్రయాణం చేయనున్నారు. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ముచ్చట్లు తీర్చుకునే హక్కు ఉంది. స్త్రీలు తమ ముచ్చట్లను అనేక కారణాల రీత్యా బయటకు చెప్పరు. కుటుంబంలోని మగవారు అడిగి వాటిని తీర్చరు. కాని ఆ ముచ్చట తీరితే వారికి కలిగే ఆనందం ఎంతటితో ఈ బృందాన్ని చూస్తే తెలుస్తుంది. అమ్మనో, అత్తగారినో, అంతగా జరుగుబాటులేని మేనత్తనో, పిన్నినో విమానం ఎక్కించి సంతోషపడాలని ఎవరికైనా అనిపిస్తే సంతోషం. ఎవరికీ అనిపించకపోయినా ఈ కథనం చదివి అలా స్ఫూర్తి పొందితే మరీ సంతోషం. -
విమాన ప్రయాణం.. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమంటారు, ఎందుకో తెలుసా?
గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తే కాలక్షేపానికి మొబైల్ వాడకం సాధారణమే. అదే విమానంలో ప్రయాణం అంటే మాత్రం మన స్మార్ట్ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని లేదా ఎరోప్లేన్ మోడ్ లో పెట్టమని చెప్తుంటారు. అసలు బస్సు, రైలు, బైకు వీటిలో ప్రయాణించేటప్పుడు లేని ఈ నిబంధన కేవలం విమాన ప్రయాణంలోనే ఎందుకు పాటించాలి. మీ సెల్యులార్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం విమానానికి నిజంగా ప్రమాదం కలిగించగలదా?అలా చేయడం వెనుకు దాగున్న సైంటిఫిక్ కారణాల పై ఓ లుక్కేద్దాం! విమాన ప్రయాణంలో మొబైల్ స్విచ్ ఆఫ్.. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ప్యాసింజర్లు వారి మొబైల్స్ను స్విచ్ ఆఫ్ చేయమని అందులోని సిబ్బంది చెప్తుంటారు. అయితే విమానంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం నిషేధించలేదు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA). కానీ ప్లైట్ అటెండెంట్స్ మాత్రం ఈ నిబంధన పాటించమని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్స్, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలే (Radio Frequencies). ఇవి విమానంలోని నావిగేషన్ కు ఉపయోగించే రేడియో తరంగాలు దాదాపుగా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. దాంతో కాక్ పిట్ లో ఉండే ఏరోనాటికల్ వ్యవస్థకు ఇది అంతరాయం కలిగిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విమాన ప్రయాణం సజావుగా సాగాలన్నా, మన స్మార్ట్ఫోన్ ఉపయోగించలన్నా ఈ రెండు సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడి పని చేస్తాయి. అందుకే విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మీ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమని చెప్పేది. ఇప్పటి వరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా ఈ తరహా ప్రమాదాలు జరగలేదు. కాకపోతే.. విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ అనే ప్రక్రియ చాలా కీలకమైంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలా ఫోన్స్ ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అనేక విమానయాన సంస్థలు తమ విమానాల్లో వై-ఫై సేవలను కూడా ప్రారంభించాయి. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం..
విమానంలో మరో ప్రయాణికుడు వీరంగ సృష్టించాడు. గాలో ఉండగానే మరో ప్రయాణికుడిపై దాడి చేస్తూ రెచ్చిపోయాడు. ఏకంగా విమానంలో గాల్లో ఉండగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు ఇద్దరు ప్రయాణికులు. ఈ ఘటన బిమన్ బంగ్లాదేశ్ బోయింగ్ 777లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..విమానంలో సుమారు 20 ఏళ్ల యువకుడు చొక్కా లేకుండా మరో ప్రయాణికుడిపై భౌతిక దాడికి దిగాడు. దారుణంగా పిడిగుద్దులతో సదరు ప్రయాణికుడి కొట్టడం ప్రారంభించాడు. బాధిత ప్రయాణికుడు కూడా తనను రక్షించుకునే క్రమంలో ఎదురుదాడి చేశాడు. దీంతో ఆందోళనకు గురైన కొందరూ ప్రయాణకులు గొడవ సద్ధుమణిగేలా చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినా సరే తమ గొడవ తమదే అన్నట్లు ప్రవర్తించారు ఆ ఇద్దరూ ప్రయాణికులు. ఎయిర్ ఇండియా విమానంలో మూత్ర విసర్జన ఘటన మరువక మునుపే వరుసగా ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఐతే ఆ విమానం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Another "Unruly Passenger" 👊 This time on a Biman Bangladesh Boeing 777 flight!🤦♂️ pic.twitter.com/vnpfe0t2pz — BiTANKO BiSWAS (@Bitanko_Biswas) January 7, 2023 (చదవండి: 98 ఏళ్ల వృద్ధ ఖైదీకి..ఘనంగా జైలు సిబ్బంది వీడ్కోలు) -
డిసెంబర్లో పెరిగిన విమాన ప్రయాణికులు
దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 2022 డిసెంబర్ నెలలో 1.29 కోట్లుగా ఉంది. 2021 డిసెంబర్తో పోల్చినప్పుడు 15 శాతం పెరిగింది. కానీ 2019 డిసెంబర్ గణాంకాల కంటే ఒక శాతం తక్కువ. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఏవియేషన్పై ఓ నివేదిక విడుదల చేసింది. దేశీ ఏవియేషన్ పరిశ్రమ పట్ల ప్రతికూల అవుట్లుక్ను కొనసాగిస్తున్నట్టు ఇక్రా తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల రద్దీ 9.86 కోట్లుగా (986 లక్షలు) ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 63 శాతం అధికం కాగా, 2019లో ఇదే కాలంతో పోల్చినా 9 శాతం వృద్ధి కనిపిస్తోంది. గత నెలలో ఎయిర్లైన్స్ సంస్థలు దేశీ మార్గాల్లో అధిక సర్వీసులను నడిపించగా, కరోనా ముందు నాటితో పోలిస్తే ఇప్పటికీ 7 శాతం తక్కువగానే ఉన్నాయి. 2022 డిసెంబర్లో ప్యాసింజర్ లోడ్ (ప్రయాణికుల భర్తీ రేటు) 91 శాతంగా ఉంటే, 2021 ఇదే నెలలో 80 శాతం, 2019 డిసెంబర్లో 88 శాతం చొప్పున ఉంది. కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకున్నందున 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్రయాణికుల రద్దీలో వేగవంతమైన పునరుద్ధరణను చూస్తున్నట్టు ఇక్రా తెలిపింది. అయితే ఏటీఎఫ్ ధరలు పెరగడం, డాలర్తో రూపాయి మారకం విలు క్షీణించినందున ఎయిర్లైన్స్ సంస్థల ఆదాయాల రికవరీ నిదానించొచ్చని పేర్కొంది. పెరిగిపోయిన వ్యయాల ఫలితంగా రూ.15,000–17,000 కోట్ల నష్టాలు నమోదు చేయవచ్చని ఇక్రా అంచనా వేసింది. 2021–22లో నికర నష్టాలు రూ.23,500 కోట్ల కంటే తక్కువేనన్న విషయాన్ని గుర్తు చేసింది. రుణాల ఒత్తిళ్లు సమీప కాలంలో భారత ఎయిర్లైన్స్ సంస్థలపై రుణ ఒత్తిళ్లు కొనసాగుతాయని ఇక్రా తెలిపింది. నిర్వహణ పనితీరును మెరుగుపరుచుకోవడం లేదా ఈక్విటీ రూపంలో నిధులు తీసుకురావడం వంటి చర్యలు చేపట్టనంత వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. ఏటీఎఫ్ ధరలు అదే పనిగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగొచ్చని అంచనా వేసింది. ఎయిర్లైన్స్ సంస్థల ఆదాయాలు పెరిగినా కానీ, ఏటీఎఫ్ ధరల ప్రభావాన్ని అవి పూడ్చుకోలేవని పేర్కొంది. కనుక సమీప కాలంలో దేశీ ఎయిర్లైన్స్ ఆర్థిక పనితీరు ఒత్తిడితో కొనసాగుతుందని తెలిపింది. డాలర్తో రూపాయి విలువ క్షీణించడం వల్ల లీజ్ అద్దెలు, నిర్వహణ వ్యయాల రూపంలో వాటి మొత్తం వ్యయాలపై గణనీయమైన భారం పడుతున్నట్టు పేర్కొంది. ఇంధన ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నందున.. ఈ తరుణంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలన్న ఎయిర్లైన్స్ సంస్థల ఆకాంక్షలు వాటి మార్జిన్ల విస్తరణ అవకాశాలను పరిమితం చేస్తుందని వివరించింది. -
విమానంలో మూత్ర విసర్జన: రాజీ కుదిరిందని ఫిర్యాదు చేయలేదు
ఎయిర్ ఇండియాలోని బిజినెస్ క్లాస్లో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై డైరక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఇండియాని వివరణ కోరగా..వారి మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. తమ విమాన సిబ్బంది బాధిత మహిళకు సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించినట్లు తెలిపింది. అంతేగాక సదరు వ్యక్తి తాను ఫ్యామిలీ మ్యాన్నంటూ అరెస్టు చేయొద్దని ఆమెను వేడుకోవడంతో ఆమె ఫిర్యాదు ఉపసంహరించుకున్నారని, అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా...నవంబర్ 27ను న్యూయార్క్ నుంచి ఢిల్లీ విమానంలో జరిగిన ఘటనపై బాధిత మహిళ లేఖ రాయడంతో.. ఎయిర్ ఇండియా జనవరి 4న మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఫిర్యాదు చేసింది. పైగా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ముంబై వ్యాపారవేత్త శంకర్ మిశ్రాగా వెల్లడించింది. ఆ వ్యక్తి విషయమై ఎయిర్పోర్ట్లో ఎలర్ట్ ప్రకటించిడమే గాకుండా పోలీసులు ఆ వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాదు ఎఫ్ఐఆర్లో భాగమైన ఆ లేఖలో భాధిత మహిళ.. విమాన సిబ్బంది సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ అతనితో మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపింది. పైగా అతన్ని సిబ్బంది తన వద్దకు తీసుకువచ్చారని...అతను ఏడుస్తూ..క్షమాపణలు చెప్పడమే గాక తనకు కుటుంబం ఉందని, తన భార్య, బిడ్డ బాధపడకూడదంటే.. మీరు ఫిర్యాదు చేయకూడదంటూ తనని వేడుకున్నాడని తెలిపారు. వికృత ఘటనకు పాల్పడిన ఆ వ్యక్తితో చర్చించేలా చేయడంతో.. తాను దిక్కుతోచని స్థితిలో పడిపోయానని చెప్పింది. అతను అలా కన్నీళ్లు పెట్టుకోవడంతో..తాను అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేయలేకపోయానని లేఖలో తెలిపింది. ఐతే అతను చేసింది క్షమించరాని నేరం అని, అలాగే విమాన సిబ్బంది సరైన అవగాహన లేనివారని, అందువల్లే ప్రయాణికుల భద్రత కాపాడటంలో విఫలమయ్యారని ఆరోపణలు చేశారు. అంతేగాదు విమానంలో ప్రయాణికులకు ఎంత మోతాదు వరకు ఇవ్వాలే సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఈ సున్నితమై ఘటనపై క్రియాశీలకంగా వ్యవహరించడంలో కూడా విఫలమైందటూ ఆమె లేఖలో వివరించారు. (చదవండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!) -
నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!
ఒక వ్యక్తి ఫ్లైట్ జర్నీలో ఉండగా గుండె పోటుకి గురయ్యాడు. దీంతో భారత సంతతికి చెందిన వ్యక్తి ఐదుగంటలు శ్రమించి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. విమానంలో తగిన వైద్య పరికరాలు లేకపోయినప్పటికీ.. ఆయన్ను రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేయడంతో...సదరు పేషెంట్ కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటన లండన్ నుంచి భారత్కి వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బర్మింగ్హామ్లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ , భార సంతతి డాక్టర్ విశ్వరాజ్ వేమల సుమారు 10 గంటల పాటు ఫ్లైట్ జర్నీలో ఉండగా.. ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో 43 ఏళ్ల వ్యక్తి రెండు సార్లు తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు. దీంతో విమాన సిబ్బంది ఈ విషయం గురిచి డాక్టర్ విశ్యరాజ్ తెలియజేశారు. ఈ మేరకు విశ్వరాజ్ అతన్నిరక్షించేందుకు విమానంలో పరిమిత పరిధిలోనే ఉన్న వైద్య సామాగ్రితో అతని ప్రాణం కాపాడేందుకు శతవిధాల యత్నించారు. వాస్తవానికి ఆయన లండన్లో ఉన్న తన తల్లిని తిరిగి భారత్లోని తమ స్వస్థలం బెంగళూరుకి తీసుకువెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చిందంటూ తన వద్దకు పరిగెత్తుకు వచ్చినట్లు విశ్వారాజ్ తెలిపారు. విమానంలో ఉన్న పరిమిత పరిధిలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ సాయంతో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఐతే అతను స్ప్రుహలోకి రావడానికి సుమారు గంట సమయం పట్టిందని, తనతో మాట్లాడుతుండగానే మరోసారి గుండెపోటుకి గురైనట్లు తెలిపాడు. దీంతో విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరిలో ఆ వ్యక్తి గురించే ఒకటే టెన్షన్ మొదలైంది. అందరం అతను ఐదుగంటల వరకు ప్రాణాలతో ఉండేలా ప్రయత్నించాం. ఆ ప్రయాణికుడు విషయమై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పైలెట్ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.తామంతా ముంబైలో దిగుతుండగా అందరిలోనే అతను బతకే ఉండాలంటూ ఒకటే ఆందోళన చెందినట్లు తెలిపారు. ఎట్టకేలకు ముంబైలో దిగినప్పుడూ.. ఆ ప్రయాణికుడు సదరు డాక్టర్ విశ్వారాజ్తో మాట్లాడటమే కాకుండా కన్నీటితో కృతజ్ఞతలు తెలిపాడు. అదీగాక ముంబైలోని ఎయిర్పోర్ట్ అత్యవసర సిబ్బంది అతన్ని సురక్షితంగా కాపాడటమే గాక అతను కూడా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు డాక్టర్ విశ్వరాజ్ వేముల తన జీవితాంతం ఈ ఘటన మర్చిపోలేనంటూ..ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. (చదవండి: ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా ఊడి..) -
షాకింగ్ ఘటన: విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహ ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ఒక వ్యక్తి మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆరిపోవడంతో.. అక్కడ ఏం జరుగుతోందో కొందరి ప్రయాణికులకే అర్థమైంది. పైగా మూత్ర విసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లకుండా అలానే నుంచొని ఉన్నాడు. అతడి వికృత చర్య కారణంగా.. సదరు ప్రయాణికురాలి బట్టలు, బూట్లు, మూత్రంతో తడిచిపోయాయి. దీంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విమాన సిబ్బంది ఆమెకు బట్టలు, చెప్పులు ఇచ్చి మళ్లీ తన సీటుకే రావలని చెప్పారు. ఐతే ఆమె అందుకు గట్టిగా నిరాకరించడంతో మరో సీటు పురమాయించారు.ఐతే సిబ్బంది ఆ సీటు కవర్లు మార్చి, వాసన రాకుండా స్ప్రె చల్లారు గానీ ఆ సీటుపై కూర్చోవాలంటేనే చిరాకనిపించదని ఆ మహిళ వాపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె మరొక సిబ్బంది సీటులో కూర్చొని విమానంలో మిగతా ప్రయాణాన్ని కొనసాగించారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా సదరు ఎయిర్లైన్ అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సదరు మహిళకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్కి ఈ విషయమై లేఖ రాశారు. అంతేగాదు ఆమె లేఖలో.. బిజినెస్ క్లాస్లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ మరో క్యాబిన్ సీటు కూడా తనకి ఇవ్వలేదని ఎయిర్ ఇండియా సిబ్బందిపై కూడా ఆరోపణలు చేసింది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయమై సదరు ఎయిర్లైన్ నుంచి వివరణ కోరింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే గాక సదరు వ్యక్తిని నోఫ్లై లిస్ట్లో చేర్చనున్నట్లు పేర్కొంది. (చదవండి: బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం) -
పేటీఎం యూజర్లకు బంపరాఫర్
హైదరాబాద్: చెల్లింపులు, ఆర్థిక సేవల్లోని ప్రముఖ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) ఫ్లయిట్ టికెట్ బుకింగ్లపై తగ్గింపులను ప్రకటించింది. దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి టికెట్ బుకింగ్లపై, కొత్త కస్టమర్లకే ఈ డిస్కౌంట్ ఆఫర్లు పరిమితమని పేటీఎం తెలిపింది. విస్తార, స్పైస్జెట్, ఎయిరేషియా, గోఫస్ట్, ఇండిగో, ఎయిర్ ఇండియా దేశీ సర్వీసులపై ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. మొదటి ఫ్లయిట్ టికెట్ బుకింగ్పై 14 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది. ఈ డిస్కౌంట్ గరిష్టంగా రూ.1,000కి పరిమితం అవుతుంది. కనీస ఆర్డర్ విలువ వంటి షరతు లేదు. యూజర్లు టికెట్లను రద్దు చేసుకుంటే నూరు శాతం రిఫండ్ వచ్చే రక్షణ ఉంటుందని పేటీఎం తెలిపింది. -
ప్లీజ్ సార్..ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డ ఎయిర్ హోస్ట్.. పిడిగుద్దులు గుద్దుతూ..
బ్యాంకాక్ నుంచి కోల్కతాకు వస్తున్న విమానంలో ఘటన ముయే థాయ్ (థాయ్ బాక్సింగ్) గేమ్ను తలపించింది. ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన సీటు గొడవ తారా స్థాయికి చేరింది. ఓ ప్రయాణికుడిపై మరో ఐదుగురు ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. గొడవను సద్దుమణిగించేందుకు ఎయిర్ హోస్టెస్ చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. క్యాబిన్ క్రూ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పిడిగుద్దులు గుద్దుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వివాదంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. వివాదానికి కారణమైన ప్రయాణికులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. థాయ్ స్మైలీ ఎయిర్వేస్కు చెందిన విమానం డిసెంబర్ 26న థాయ్ల్యాండ్ నుంచి కోల్కతాకు వస్తుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి క్రూ సిబ్బంది ప్రయాణికులకు జాగ్రత్తలు చెబుతున్నారు. అదే సమయంలో ఓ ఎయిర్ హోస్ట్ బ్రౌన్ కలర్ (గోధుమ రంగు) షర్ట్ ధరించిన ప్రయాణికుడు తాను కూర్చున్న సీటును నిటారుగా జరపాలని కోరింది. Not many smiles on this @ThaiSmileAirway flight at all ! On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone. Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l — VT-VLO (@Vinamralongani) December 28, 2022 అంతే బ్రౌన్ కలర్ షర్ట్ ధరించిన వ్యక్తి రెచ్చిపోయి తన పక్కనే గ్రే కలర్ (బూడిద రంగు) చొక్కా ధరించిన వ్యక్తిపై దాడికి దిగాడు. వివాదానికి కారణమైన ప్రయాణికుడు తన కళ్లజోడు తీసి నల్ల చొక్కా ధరించిన బాధితుడి చెంపలు వాయిస్తూ, ఆపకుండా పిడిగుద్దులు గుద్దాడు. దాడికి పాల్పడే వ్యక్తికి మద్దతుగా అతని స్నేహితులు సైతం కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతలో ఈ గొడవను ఆపేందుకు ఎయిర్ హోస్టెస్ ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్ అని ఒకటే ప్రాధేయ పడుతున్నా పట్టించుకో లేదు. నిందితుడు కోల్ కతాలో ఫ్లైట్ దిగే సమయంలో సైతం తన సీటు బెల్ట్ తీసి తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అదే ఫ్లైట్లో జర్నీ చేస్తున్న అలోక్ కుమార్ అనే ప్రయాణికుడు తెలిపారు.కాగా, విమానంలో జరిగిన ప్రమాదంపై కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా గొడవలు విమాన ప్రయాణంలో ఆమోదయోగ్యం కాదని ట్వీట్ చేశారు. ఈ ఘటనలో కారణమైన ప్రయాణికులకు కేసు నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులుకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. With regard to the scuffle between passengers on board a @ThaiSmileAirway flight, a police complaint has been filed against those involved. Such behaviour is unacceptable. — Jyotiraditya M. Scindia (@JM_Scindia) December 29, 2022 చదవండి👉 రతన్ టాటా మరో సంచలనం..500 విమానాల కోసం భారీ ఆర్డరు! -
పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్..
విమానంలో తన పక్కన కూర్చున్న పెద్దాయన్ను ఓ మహిళా ప్రయాణికురాలు కాస్త అనుమానంగా, భయంగా చూస్తున్న ఈ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె పరిస్థితిని వర్ణిస్తూ బోలెడు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ అందుకు కారణం ఏమిటంటారా? ఆ వ్యక్తి మరెవరో కాదు.. 1970లు, 1980లలో భారత్ సహా వివిధ దేశాల్లో సుమారు 30 హత్యలకు పాల్పడిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78). డబ్బు కోసం విదేశీ పర్యాటకులను ప్రత్యేకించి యువతులనే టార్గెట్ చేసి హతమార్చిన కిరాతకుడు. ఓ హత్య కేసులో సుమారు 20 ఏళ్లు నేపాల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన అతన్ని.. వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసింది. దీంతో స్వదేశమైన ఫ్రాన్స్కు దోహా మీదుగా వెళ్లేందుకు ఇలా ఖతార్ ఎయిర్వేస్ విమానం ఎక్కినప్పుడు ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘మీరు ఆ మహిళ స్థానంలో కూర్చొనే సాహసం చేయగలరా?’ అని ఒకరు సవాల్ చేయగా ‘నేను కూడా ఆ మహిళలాగే భయంభయంగా చూస్తుంటా’ అని మరొకరు పేర్కొన్నారు. పండుగ సీజన్లో విమాన టికెట్ బుక్ అయిందన్న ఆనందం చివరకు ఇలా నీరుగారిపోయిందని మరొకరు వ్యాఖ్యానించగా ఇది ఆ మహిళ జీవితంలో అత్యంత భయానకమైన సందర్భమని ఇంకొకరు పోస్టు చేశారు. భారత జాతీయుడైన తండ్రికి, వియత్నాం జాతీయురాలైన తల్లికి శోభరాజ్ 1944లో జన్మించాడు. వియత్నాంలో అతను పుట్టిన ప్రాంతం అప్పట్లో ఫ్రాన్స్ వలసరాజ్యం కావడంతో అతనికి పుట్టుకతోనే ఫ్రెంచ్ పౌరసత్వం లభించింది. చదవండి: Japan Snow Storm: జపాన్లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి -
బంఫర్ ఆఫర్: రూ.1497కే ఎంచక్కా గాల్లో ఎగిరిపోండి.. త్వరపడాలి!
దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా(AirAsia) న్యూ ఇయర్ సందర్భంగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రాబోతున్న కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 'న్యూ ఇయర్, న్యూ డీల్స్' పేరిట తమ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను కేవలం రూ.1,497గా నిర్ణయించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు అమలులో ఉంటుందని, దీని కింద బుకింగ్ చేసుకున్న ప్యాసింజర్లు వచ్చే ఏడాది(2023) జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ ధర బెంగళూరు-కొచ్చి వంటి రూట్లతో పాటు, దాని నెట్వర్క్ అంతటా ఇదే విధమైన తగ్గింపు విక్రయ ఛార్జీలు ఉన్నట్లు తెలిపింది. కంపెనీ వెబ్సైట్, కంపెనీ మొబైల్ యాప్, ఇతర ప్రధాన బుకింగ్ ఛానెల్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. కొనసాగుతున్న లాయల్టీ ప్రయోజనాలలో భాగంగా, వెబ్సైట్, యాప్లో బుకింగ్ చేసే (నియో పాస్) NeuPass సభ్యులు కాంప్లిమెంటరీ ఫ్రూట్ ప్లాటర్, ప్రాధాన్యత చెక్-ఇన్, బ్యాగేజీ, బోర్డింగ్తో పాటు 8 శాతం నియో కాయిన్స్ (NeuCoins) వరకు కూడా పొందుతారు. మరోవైపు, ప్రముఖ సంస్థ ఇండిగో కూడా రూ.2,023కే విమాన టిక్కెట్ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. Bank your new year resolutions now! Ring in 2023 with our #NewYearNewDeals sale, with fares starting ₹1,497! Book till 25 Dec for travel till 15 Apr 2023 on https://t.co/QiptjwMRjT or the AirAsia India mobile app. pic.twitter.com/bEwWXFlcLY — AirAsia India (@AirAsiaIndia) December 23, 2022 -
రానా లగేజ్ మిస్సింగ్.. క్షమాపణలు చెప్పిన ఇండిగో ఎయిర్లైన్స్
ఇండిగో ఎయిర్లైన్స్పై హీరో రానా దగ్గుబాటి చేసిన ట్వీట్పై ఆ కంపెనీ స్పందించింది. జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. మీ లగేజీని వీలైనంత త్వరగా మీకు చేరేలా చూసేందుకు మా సిబ్బంది పనిచేస్తున్నారు అంటూ రిప్లయ్ ఇచ్చింది. కాగా ఇండిగో ఏయిర్ లైన్స్ సేవలపై రానా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లిన రానాకు అక్కడ చెక్ ఇన్ అయ్యాక ఫైట్ ఆలస్యమంటూ, మరో విమానంలో వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే బెంగళూరు చేరుకున్నాక లగేజ్ రాకపోవడంతో రానా అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా వారి దగ్గర్నుంచి సరైన సమాధానం రాలేదు. దీనిపై అసహం వ్యక్తం చేస్తూ.. ఇండియాలో ఇండిగో(IndiGo) అంత చెత్త విమాన ప్రయాణం చేయలేదు. విమానం టైమింగ్స్ గురించి ఎవరికీ తెలీదు. కనిపించకుండా పోయిన లగేజ్ గురించి తెలియదు. సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలీదు. ఇంత కన్నా చెత్తగా సర్వీస్ ఏదైనా ఉంటుందా అంటూ ఫైర్ అయ్యారు. Sir, we understand the discomfort when the bag doesn't arrive with you. While we apologise for the inconvenience caused in the meantime, please be assured, our team is actively working to get your luggage delivered to you at the earliest. (1/2) — IndiGo (@IndiGo6E) December 4, 2022 -
వివాహ వేడుక.. మొత్తం విమానాన్నే బుక్ చేసిన జంట!
సాధారణంగా వివాహ వేడుక కోసం తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యులు, బంధువులను తీసుకు వెళ్లడానికి బస్సులు బుక్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. మరి కొంతమంది ఇంకాస్త ముందుకేసి ఒక రైల్లోని ఒక బోగి మొత్తం మాట్లాడుకుని వెళ్లడం కూడా చూసి ఉంటాం. బాగా డబ్బున్న వాళ్ల అయితే తమకు స్పెషల్గా ఒక ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేసుకుని మరీ వెళ్తారు. అంతేగాక వారికి సంబంధించిన వారి బంధువులకు విమానంలో వచ్చే ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇక్కడొక జంట చాలా విభిన్నంగా... తమ వివాహన్ని తమ కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని మొత్తం కుటుంసభ్యలు, బంధువలందరికీ ఏకంగా ఫ్లైట్ బుక్ చేసి మరీ తీసుకువెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రాజస్తాన్లోని జైసల్మేర్లో వివాహం జరుగుతోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్లు బంద్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆ డిస్టినేషన్ వెడ్డింగ్ల సందడి మొదలైంది. ఈ మేరకు శ్రేయ షా అనే ఇన్స్ట్రాగాం వినియోగదారుడు తన సోదరి పెళ్లి కోసం మొత్తం విమానాన్నే బుక్ చేసినట్లు తెలిపాడు. ఆ వీడియోలో తమ కుటుంబ సభ్యులను అందర్నీ చూపిస్తూ....పెళ్లి చేసుకోబోతున్న జంటను కూడా చివర్లో చూపిస్తాడు. దీంతో నెటిజన్లు ఇలా కుటుంబసభ్యులందర్నీ ఫ్టైట్లో తీసుకెళ్లగలిగేంతా డబ్బుండాలి అని ఒకరు. మరోకరు వివాహం కోసం ఏకంగా మొత్తం విమానాన్నే బుక్ చేశారు సో గ్రేట్ అంటూ పొగుడుతూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Shreya Shah | Content Creator (@shreyaa_shaah) (చదవండి: అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్పాట్లు) -
అమెరికా టూ ఇండియా!.. తక్కువ ధరకే విమాన టికెట్.. నమ్మితే అంతే!
సాక్షి, హైదరాబాద్: పండుగలు, సెలవుల నేపథ్యంలో స్వదేశానికి వచ్చే వారిని టార్గెట్ చేస్తూ విమాన టికెట్ల రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అమెరికా నుంచి హైదరాబాద్కు వస్తున్న వారిని ఎంచుకుని వారి నుంచి రూ.లక్షలు కాజేస్తున్నారు. ఇటీవల యూఎస్లో ఉంటూ నగరానికి రావాల్సిన సుమారు 8 కుటుంబాలు సైబర్కేటుగాళ్ల చేతిలో మోసపోయి బంధువుల ద్వారా సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విమాన టికెట్ల రూపంలో జరుగుతున్న మోసాలు సైబర్క్రైం పోలీసుల దృష్టికి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులకు ముందే డబ్బు ఇస్తున్నారు. ఏజెంట్ ద్వారా టికెట్ను బుక్ చేయించి ఆ వివరాలు ప్రయాణికుడికి ఇస్తుండటంతో నమ్మకం మరింత రెట్టింపు అవుతుంది. తీరా ప్రయాణం రేపు అనగా..పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేస్తే కాని తాము మోసపోయినట్లు తెలియడం లేదు. వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి స్వదేశానికి వచ్చే వారిని కనిపెట్టిన బిహార్, రాజస్థాన్, యూపీకి చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు యూఎస్లో ఉంటున్న భారతీయుల వాట్సాప్ గ్రూపుల్లోకి తెలిసిన వారి ద్వారా యాడ్ అవుతున్నారు. ట్రావెల్ ఏజెంట్ను అంటూ పరిచయం చేసుకోవడం, తన ద్వారా విమాన టికెట్లు బుక్ చేస్తే 40శాతం నుంచి 60శాతం డిస్కౌంట్ వస్తుందని చెబుతున్నారు. నమ్మకం కోసం తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి రూ.50వేలకే టికెట్ను ఇస్తున్నారు. ఆ టికెట్ను వాట్సప్ గ్రూపులో చూసిన వారంతా తమకు కూడా కావాలంటూ కేటుగాళ్లను సంప్రదిస్తున్నారు. వీరు టికెట్ను ప్రయాణికులకు కావాల్సిన తేదీల్లో బ్లాక్ చేస్తూ ఆ వివరాలను పంపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఎస్సార్నగర్కు చెందిన ఓ కుటుంబం వారి చేతిలో మోసపోయింది. దీంతో నగరంలో ఉంటున్న సమీప బంధువుకు చెప్పడంతో అతను సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ బావ నుంచి రూ.10లక్షలు చేశారంటూ పోలీసుల ఎదుట వాపోయాడు. ఇదే తరహాలో పలు కుటుంబాలు రూ.25లక్షల నుంచి రూ.40లక్షల మేర నష్టపోయినట్లు సైబర్ క్రైం అందిన ఫిర్యాదుల ఆధారంగా స్పష్టమవుతోంది. ఆశపడి మోస పోవద్దు.. యూఎస్ నుంచి ఇండియాకు అంత తక్కువ రేటుకు టికెట్ రాదు. ఇండియాకు వచ్చేవారైనా, ఇతర దేశాలకు వెళ్లే వారైనా వారి మాటలు నమ్మి మోసపోవద్దు. ఎయిర్వేస్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లలో మాత్రమే టికెట్ను బుక్ చేసుకునేందుకు ప్రయతి్నంచండి. అక్కడ జర్నీ తేదీని బట్టి టికెట్ ధర మారుతూ ఉంటుంది. 5–10శాతం మించి డిస్కౌంట్ ఎవరూ ఎక్కువగా ఇవ్వరు, ఒకవేళ ఇస్తామన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి, ఇతరులను సంప్రదించి మాత్రమే టికెట్ బుక్ చేసుకోండి. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్క్రైం ఏసీపీ -
ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్తే ఇలా ఉంటుందా! వీడియో వైరల్
అనుకున్నది జరగకపోతే పిచ్చ కోపం వస్తుంది. మహా అయితే ఆ రోజంతా మన మూడ్ బాగోక ఎవరితోనూ మాట్లాడకుండా డల్ ఉంటాం. కానీ కొందరూ మాత్రం తమకు నచ్చినట్టు జరగకపోతే కోపంతో ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలానే ఫ్లైట్ మిస్సయ్యానన్న కోపంతో ఎంత దారుణంగా ప్రవర్తించిందో వింటే షాక్ అవుతారు. వివరాల్లోకెళ్తే...మెక్సికోలో ఎమిరేట్స్ అనే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ఒక మహిళను అధికారులు తనిఖీ చేసే నిమిత్తం ఫ్లైట్ ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె ఫ్లైట్ మిస్సైయ్యింది. అంతే పట్టరాని కోపంతో అక్కడ ఉన్న మహిళా అధికారిపై పిడి గుద్దులతో దాడి చేసి...అక్కడ ఉన్న కంప్యూటర్లను అన్నింటి విసిరేస్తూ పెద్ద వీరంగం సృష్టించింది. అయితే ఆమె గడువు ముగిసిన పాస్పోర్ట్తో ఎక్కేందుకు యత్నించడంతో ఆమెను ఫ్లైట్ ఎక్కనివ్వకుండా అడ్డుకున్నామని ఎయిర్ పోర్ట్ అదికారులు తెలిపారు. తాము అడ్డుకున్నమన్న కోపంతో ఆమె తమను దుర్భాషలాడి, దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ పోలీసులు రంగంలోకి ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న వస్తువులన్నింటిని కింద పడేసి పెద్ద హంగామా సృష్టించిందన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: చూస్తుండగానే...హఠాత్తుగా కుర్చిలోంచి కుప్పకూలిపోయాడు) -
విమానంలో ఆరు సీట్లను బెడ్గా మార్చారు ఎందుకో తెలుసా!
ప్రపంచంలో అత్యంత పొడుగైనా మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న రుమేసా గెల్గి తొలిసారిగా ఫ్లైట్ జర్నీ చేసింది. ఆమె పొడుగే శాపంగా మారి ఎక్కడికి ప్రయాణించలేక ఇబ్బంది పడుతుండేది. ఐతే ఆమె బాధను టర్కిష్ ఎయిర్లైన్స్ దూరం చేసింది. ఆమె పొడగు కారణంగా విమానంలో కూర్చొని ప్రయాణించడం అసాధ్యం. అందుకని ఆమె కోసం ఆరు సీట్లను బెడ్గా మార్చి విమానంలో ప్రయాణించే ఏర్పాటు చేసింది. దీంతో ఆమె ఆనందానికి అవధులే లేకుండా పోయింది. గెల్గి ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో ఈ విషయాన్ని పంచుకుంది. ఈ మేరకు గెల్గి విమానంలో టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి యునైటెడ్ స్టేట్స్లోని శాన్ప్రావిన్స్కోకు 13 గంటలు ప్రయాణించింది. ఇది తన చివరి ఫ్లైట్ జర్నీ మాత్రం కాదని నమ్మకంగా చెబుతోంది. తాను సాంకేతిక రంగంలో పనిచేస్తున్నానని, తనలాంటి వారికోసం మరిన్ని అవకాశాలను అన్వేషించేందుకు ఆరు నెలల పాటు యూఎస్లో ఉంటానని చెబుతోంది. విమానంలో ప్రయాణించే అవకాశం ఇచ్చినందుకు టర్కీష్ ఎయిర్ లైన్స్కి ధన్యావాదాలు చెప్పింది. భవిష్యత్తులో ఆమెకు మరింత సహాయ సహకారాలను అందజేస్తామని టర్కీ ఎయిర్లైన్స్ హామి ఇచ్చింది. View this post on Instagram A post shared by RUMEYSA GELGI (@rumeysagelgi) (చదవండి: ట్రెండింగ్లో దూసుకెళ్తున్న వెర్బల్ ఫాస్ట్! అసలు ఈ ఉపవాసం ఎందుకంటే..) -
విదేశీ ప్రయాణానికి గిరాకీ
ఇటీవల విదేశీ ప్రయాణానికి డిమాండ్ బాగా పెరుగుతోంది. కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం.. వివిధ దేశాలు పర్యాటకులను ఆకర్షించడానికి ప్యాకేజీలను ప్రకటిస్తుండటంతో ప్రయాణీకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 50,710 మంది ప్రయాణించారు. 2021–22 ఆరు నెలల కాలంలో ప్రయాణించిన 12,930 మందితో పోలిస్తే విదేశీ ప్రయాణీకుల సంఖ్యలో 292 శాతం వృద్ధి నమోదైందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్ల కాలంలో ఈ రెండు విమానాశ్రయాల నుంచి 411 విమాన సర్వీసులు నడవగా అంతకుముందు ఏడాది కేవలం 139 సర్వీసులు మాత్రమే నడిచాయి. రాష్ట్రంనుంచి ఇలా విదేశీ ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతుండటంతో సర్వీసుల సంఖ్య పెంచడానికి ఎయిర్లైన్స్ సంస్థలూ ముందుకొస్తున్నాయి. కోవిడ్ ముందున్న పరిస్థితికంటే మెరుగు మరోవైపు.. ఏపీలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య కోవిడ్ ముందున్న పరిస్థితి కంటే మెరుగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్ల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రయాణీకుల సంఖ్యలో 90.93 శాతం వృద్ధి నమోదైంది. 2021–22లో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 11,91,326 మంది ప్రయాణిస్తే ఈ ఏడాది ఆర్నెల్ల కాలంలో ఏకంగా 22,74,641 మంది ప్రయాణించారు. రానున్న కాలంలో సర్వీసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ట్రెండ్ మారింది.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు కొత్త తరం కార్లు వస్తున్నాయ్! -
వెంట్రుకవాసిలో తప్పిన పెను ప్రమాదం...కారుని క్రాష్ చేసేలా వచ్చిన హెలికాప్టర్
ఉక్రెయిన్లోని ఒక హైవేపై ఒక హెలికాప్టర్ వ్యతిరేకదిశలో వస్తున్న కారుకి సమీపంగా తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చింది. చూస్తున్న వాళ్లకి హెలికాప్టర్ కారుని క్రాష్ చేస్తుందేమో అనిపించేలా సమీపించింది. క్రాష్ అయ్యే సమయానికి పైలెట్ చాలా చాకచక్యంగా హెలికాప్టర్ని పక్కకు తప్పించాడు. చెప్పాలంటే... జస్ట్ వెట్రుకవాసిలో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అందుకు సంబంధించిన వీడియోని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ 'వెల్కమ్ టు ఉక్రెయిన్' అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం పైలెట్ చాలా అనుభవశాలి కాబట్టి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా జాగ్రత్త పడగలిగాడని ప్రశంసించారు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అదీగాక రష్యా భూ, వాయు మార్గాల్లో బాంబు దాడులను కూడా వేగవంతం చేసింది. అందువల్ల గగనతలంలోని మిసైల్ దాడులను తప్పించుకునేందుకు, శత్రు రాడార్లు గుర్తించకుండా ఉండేలా ఇలా ఉక్రెయిన్ పైలెట్లు తక్కువ ఎత్తులో హెలికాప్టర్తో పయనిస్తున్నారు కాబోలు, బహుశా యుద్ధానికి సంబంధించిన సాధన అయ్యి ఉంటుందంటూ రకరకాలుగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ట్వీట్ చేశారు. Welcome to Ukraine 🇺🇦 pic.twitter.com/LdFhrzwn2m — Defense of Ukraine (@DefenceU) October 20, 2022 (చదవండి: పంచెకట్టు, షేర్వాణీలో మెరిసిపోతున్న ఒబామా: ఫోటో వైరల్) -
విమాన రంగానికి బిగ్ రిలీఫ్.. భారీగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా సెప్టెంబర్లో 1.03 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 సెప్టెంబర్తో పోలిస్తే ప్యాసింజర్ల సంఖ్య 64.61 శాతం పెరగడం గమనార్హం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. గత నెలలో ఆకాశ ఎయిర్ మినహా మిగిలిన దేశీయ విమానయాన సంస్థలు 76.6 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. ఆకాశ ఎయిర్ దేశీయంగా తన సేవలను 2022 ఆగస్ట్ 7 నుంచి ప్రారంభించింది. 77.5 శాతం సగటు సామర్థ్యంతో సెప్టెంబర్లో విమానయాన సంస్థలు సర్వీసులను నడిపించాయి. ఆగస్ట్లో ఇది 72.5 శాతం నమోదైంది. ప్రయాణికుల్లో 57 శాతం మంది ఇండిగో విమానాల్లో జర్నీ చేశారు. విస్తారా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆసియా ఫ్లైట్స్లో 24.7 శాతం మంది ప్రయాణించారు. చదవండి: ట్రైన్ జర్నీ క్యాన్సిల్ అయ్యిందా? రైల్వే ప్రయాణికులకు శుభవార్త -
ఎయిర్పోర్ట్లో అనసూయకు అవమానం.. షర్ట్ చిరిగిందట
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సినీ సెలబ్రెటీలలో యాంకర్ అనసూయ ఒకరు. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు పలు అంశాలపై తన స్పందన ఏంటో కూడా చెబుతుంది. వీటివల్ల అప్పుడప్పుడు అనసూయ ట్రోల్ అయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ అనసూయ మాత్రం తన పంథాను మార్చుకోలేదు. తనకు నచ్చిన అంశంపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా ఎయిర్పోర్ట్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది అనసూయ. ఫ్యామిలీతో కలిసి బెంగళూరు వెళ్లిన అనసూయ..తిరిగి హైదరాబాద్కు రావడానికి అలియన్స్ ఎయిర్ సంస్థకు చెందిన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుందట. (చదవండి: ఫోన్ ఎత్తవు.. ప్రమోషన్స్కి రావు.. రష్మీపై హీరో నందు ఫైర్) అది సాయంత్రం 6.55 గంటలకు టేకాఫ్ కావాల్సింది. కానీ దాదాపు అరగంట లేట్గా వచ్చిందట. అప్పటి వరకు బస్లోనే వేయిట్ చేసిన అనసూయ ఫ్యామిలీ.. ఫ్లైట్ రాగానే లోపలి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అపేశారట. మాస్క్ లేదనే కారణంతో అక్కడే వెయిట్ చేయించారట. చివరకు మాస్కులు ధరించి లోపలికి వెళ్తే.. అక్కడ ఒక్కోక్కరి ఒక్కో చోట కూర్చోబెట్టారట. తను మాత్రం అందరూ ఒకే చోట కూర్చునేలా టికెట్స్ బుక్ చేస్తే.. సిబ్బంది ఇలా వేరువేరుగా కూర్చోబెట్టిందని అనసూయ అసహనం వ్యక్తం చేసింది. ఇక ఆ ఫ్లైట్లో సీట్లు సరిగా లేవని, దానివల్ల తన షర్ట్ కూడా చిరిగిందని అనసూయ చెప్పుకొచ్చింది. -
విమానంలో ‘బొద్దింక భోజనం’
ఎయిర్ విస్తారా ఎయిర్లైన్ సదుపాయాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము తినే ఆహారంలో బొద్దింక ఉందంటూ విస్తారా ఎయిర్లైన్ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అహ్మదాబాద్కు చెందిన నికుల్ సోలంకి ఎయిర్ విస్తారా ఎయిర్లైన్లో ప్రయాణించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే ప్రయాణ వివరాల్ని వెల్లడించని సోలంకి..ఫ్లైట్ జర్నీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ఎయిర్ విస్తారా ఫ్లైట్ జర్నీలో తాను ఆర్డర్ పెట్టిన ఇండ్లీ, సాంబార్, ఉప్మాలో చిన్న సైజు బొద్దింక ఉందని.. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Small cockroach in air Vistara meal pic.twitter.com/SHxFxB4qWv — NIKUL SOLANKI (@manikul008) October 14, 2022 ఆఫోటోల్ని షేర్ చేసిన పదినిమిషాల్లో ఎయిర్ విస్తారా యాజమాన్యం స్పందించింది. ‘హలో నికుల్, మా భోజనాలన్నీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాల్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తాం. మీ విమాన ప్రయాణ వివరాల్ని తెలపండి. తద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎయిర్ విస్తారా ట్వీట్ చేసింది. Hello Nikul, all our meals are prepared keeping the highest standards of quality in mind. Please send us your flight details over DM so we can look into the matter and address the issue at the earliest. Thank you. ~Badri https://t.co/IaDysdIxJS — Vistara (@airvistara) October 14, 2022 విస్తారాపై టాటా గ్రూప్ కన్ను విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేయడంపై టాటా గ్రూపుతో చర్చలు నిర్వహిస్తున్నట్టు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. టాటాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా కచ్చితమైన నిబంధనలపై అంగీకారానికి రాలేదని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్కుకు సింగపూర్ ఎయిర్లైన్స్ సమాచారం ఇచ్చింది.కాగా, విస్తారాలో టాటా గ్రూప్కు 51 శాతం వాటా ఉంటే, సింగపూర్ ఎయిర్లైన్స్కు 49 శాతం వాటా ఉంది. చదవండి👉 ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్ విమానం ఎగిరింది -
ఎయిర్లైన్స్లో కొత్త రూల్! గర్భిణి క్యాబిన్ సిబ్బంది కూడా...
ఎయిర్లైన్స్ గర్భిణి క్యాబిన్ సిబ్బందిని విధుల నుంచి తొలగించనని చెబుతుంది. వారు ఉద్యోగం కొనసాగించేలా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా ఇచ్చింది. అంతేగాదు డెలిరీ అయినా తర్వాత కూడా యథావిధిగా ఉద్యోగాన్ని కొనసాగించవచ్చని కూడా స్పష్టం చేసింది. గత కొంతకాలంగా సింగపూర్ ఎయిర్లైన్స్పై పలు విమర్శులు ఉన్నాయి. లింగ సమానత్వం పాటించడం లేదని గర్భిణి క్యాబిన్ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అంతేగాదు వారిని ప్రెగ్నెన్సీ సమయంలో బలవంతంగా వేతనం లేని సెలవుల్లో ఉంచి, తదనంతర డెలివరీ తర్వాత పిల్లల బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తుంది. దీనిపై సర్వత్ర విమర్శలు రావడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ ఈ కొత్త రూల్ని అమలు చేయనుంది. ఇక నుంచి గర్భణి క్యాబిన్ సిబ్బందిని తొలగించమని చెబుతోంది. అంతేగాదు గర్భిణి క్యాబిన్ సిబ్బంది తాత్కాలికంగా గ్రౌండ్ అటాంచ్మెంట్ పని చేసుకోవచ్చని, ప్రశూతి సెలవుల అనంతరం తిరిగి విధులు నిర్వర్తించ వచ్చని పేర్కొంది. ఈ మహమ్మారి కారణంగా సిబ్బంది కొరత సమస్యను ఎదుర్కొనడంతో ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ గర్భిణి సిబ్బంది మూడు నుంచి తొమ్మిది నెలలు గ్రౌండ్ ప్లేస్మెంట్లో విధులు నిర్వర్తించవచ్చు అని తెలిపింది. అలాగే ప్రతిభావంతులైన తమ సిబ్బందిని వదులుకోమని కూడా పేర్కొంది. అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ యాక్షన్ అండ్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొరిన్నా లిమ్ ప్రసవానంతరం తల్లులు విమాన ప్రయాణం చేయకుండా మరైదైన బాధ్యతలు అప్పగించే అవకాశం లేదా అని ప్రశ్నించారు. అంతేగాదు ఈ కొత్త రూల్ కచ్చితంగా అమలవుతుందా అని కూడా ఎయిర్లైన్స్ని నిలదీశారు. ఐతే సింగపూర్ ఎయిర్లైన్స్ ఈ విషయంపై ఇంకా స్పందించ లేదు. (చదవండి: కొట్టుకువచ్చిన... 500కి పైగా భారీ తిమింగలాలు) -
బ్రిటన్ రాణికి గొప్ప నివాళి... ఆకాశమే హద్దుగా పోర్ట్రెయిట్ని రూపొందించిన పైలెట్
బ్రిటన్రాణి క్వీన్ ఎలిజబెత్ 2న సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బాల్మోరల్లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దివగంత బ్రిటన్ రాణికి సరిగ్గా ఒక నెల తర్వాత ఆమెకు ఒక పైలెట్ అత్యంత ఘనమైన నివాళి అందించింది. అదీ కూడా విమానంతో ఆకాశంలో అతిపెద్ద క్విన్ ఎలిజబెత్ పోర్ట్రెయిట్ని రూపొందించింది. ఈ మేరకు పైలెట్ అమల్ లార్లిడ్ అక్టోబర్ 6న క్వీన్ ఎలిజబెత్ పోర్ట్రెయిట్ని రూపొందిచిందని గ్లోబల్ ఫ్టైట్ ట్రాకింగ్ సర్వీస్ రాడార్ 24 తన ట్విట్టర్లో పేర్కొంది. ఆమె సుమారు రెంగు గంటలు దాదాపు 413 కిలోమీటర్లు ప్రయాణించి లండన్కి వాయువ్యంగా 105 కి.మీ పొడవు, 63 కి.మీ వెడల్పుతో బ్రిటన్ రాణి పోర్ట్రెయిట్ని రూపొందించింది. ఆమె ఫ్టైట్ జర్నీకి వెళ్లే ముందే రాడార్తో మాట్లాడు తాను సిద్ధం చేసుకున్న ప్లైట్ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫోర్ఫ్లైట్ ద్వారా గుర్తించబడిన ఫార్మాట్లో విమానాన్ని పోనిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపింది. అంతేకాదు తాను అవసానదశలో ఉన్న రోగుల సంరక్షణ కోసం పనిచేసే యూకే స్చచ్ఛంద సంస్థ కోసం డబ్బులను సేకరిస్తున్నట్లు అమల్ పేర్కొంది. ఈ బ్రిటన్ రాణి పోర్ట్రెయిట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా యూకే పేర్కొంది. Pilot @amal_larhlid wanted to pay tribute to the late Queen and raise money for @hospiceuk, so earlier today she completed the world’s largest portrait of Queen Elizabeth II. https://t.co/79BHv357dQ pic.twitter.com/CAl5Vfemr9 — Flightradar24 (@flightradar24) October 6, 2022 (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
భారత గగనతలంలో ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు
-
విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్ స్టాప్గా ప్రయాణించిన విమానం
ఇరాన్ విమానం భారత్ గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ఈ ఘటన ఇరాన్లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళుతున్న మహాన్ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భారత వైమానికదళం అధికారులు ఢిల్లీ విమానాశ్రయాన్ని అలర్ట్ చేసింది. అంతేగాదు ఆ విమానంలోని ఫైలెట్కి జైపూర్ లేదా చండీగఢ్లలో ల్యాండ్ అయ్యేలా రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే పైలెట్ ఆ రెండు విమానాశ్రయాల్లోకి విమానాన్ని మళ్లించడానికి ఇష్టపడ లేదని భారత వైమానికి దళం పేర్కొంది. అంతేగాదు ఆ పైలెట్ బాంబు బెదిరింపులతో విమానాన్ని ఎక్కడ ల్యాండ్ చేసేందుకు ఇష్టపడలేదని చెప్పారు. దీంతో టెహ్రాన్ ఎయిర్పోర్ట్ రంగంలోకి దిగి పైలెట్ని బాంబు భయాన్ని వీడమని కోరడంతో సదరు ఫైలెట్ చైనాలోని తన గమ్యస్థానం వైపుకు ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇదిలా ఉండగా ఆ విమానాన్ని రెండు యుద్ధ విమానాలు సురక్షిత దూరం నుంచి అనుసరించినట్లు భారత వైమానిక దళం పేర్కొంది. ఆ విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిందని ప్లైట్ ట్రాకింగ్ వైబ్సైట్ ఫ్లైట్ రాడార్ చూపించినట్లు వైమానిక దళం తెలిపింది. సదరు ఇరాన్ విమానానికి ఉదయం 9.20 గం.ల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత గగనతలంలో ఉండగా ఈ బెదిరింపులు రావడంతో భారత వైమానిక దళం అప్రమత్తమై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీల సంయుక్తంగా తగిన చర్యలు చేపట్టింది. అంతేగా భారత గగనతలం అంతటా భారతవైమానిక దళం ఈ విమానంపై గట్టి నిఘా పెట్టిందని కూడా అధికారులు తెలిపారు. ఐతే ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఈ బాంబు బెదిరింపుల గురించి లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలియజేసినట్లు సమాచారం. (చదవండి: ప్రచండ్ హెలికాఫ్టర్.. ప్రపంచంలోనే పవర్ఫుల్.. ‘మేడ్ ఇన్ ఇండియా’) -
విమానంలో క్వీన్ మృతదేహాన్ని మోసుకెళ్లి....
లండన్: బ్రిటన్ని సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బల్మోరల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్ధం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్లోని రాణి అధికారిక నివాసం రుడ్హౌస్ ప్యాలెస్కు తరలించారు. తదనంతరం విమానంలో లండన్కి తరలిస్తారు. ఇది ఆమె చివరి ఫ్లైట్ జర్నీగా చెప్పవచ్చు. ఈ మేరకు విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్24 ద్వారా బోయింగ్ సీ17 విమానంలో ఆమె భౌతిక దేహాన్ని తీసుకువెళ్తున్న చివరి ప్రయాణాన్ని అత్యధిక మంది ఆన్లైన్లో ప్రత్యక్షంగా వీక్షించారు. అంతేకాదు ఎడిన్బర్గ్ విమానాశ్రయంలో బోయింగ్ సీ17ఏ ఎగరడానికి సిద్ధంగా ఉన్న మొదటి నిమిషంలోనే సుమారు 6 మిలియన్ల మంది విమానాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. బోక్ అర్గోనాట్ అటలాంటాలో క్వీన్గా ఆమె తొలి ఫైట్ ప్రయాణానికి 70 సంవత్సరాల తర్వాత క్వీన్ ఎలిజబెత్ 2 చివరి విమానమే చరిత్రలో అత్యధికాంగా ట్రాక్ చేయబడిన విమానం. అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ తైవాన్ వివాదాస్పద పర్యటనను ఫ్లైట్ రాడార్24 వెబ్సైట్లో ట్రాక్ చేసిన దానికంటే రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ల ఎక్కువ అని పేర్కొంది. 📊 Flight tracking statistics regarding the final flight of Queen Elizabeth II In the minute after the transponder of C-17 ZZ177 activated, an unprecedented 6 million people attempted to follow the flight. This unfortunately impacted the stability of our platform. pic.twitter.com/VBB7vOhk3A — Flightradar24 (@flightradar24) September 13, 2022 (చదవండి: ఎలిజబెత్ కోట బయట ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చిన మేఘన్) -
అదిరిపోయే బంఫర్ ఆఫర్.. రూ.1475కే విమాన ప్రయాణం!
భారతదేశం ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా( AirAsia) తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ను తీసుకువచ్చింది. కేవలం రూ.1475కే తమ కంపెనీ విమానంలో ప్రయాణించే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తోంది. ఢిల్లీ-లక్నో వంటి రూట్లతో పాటు సంస్థ నెట్వర్క్ అంతటా ఇదే విధమైన ఆఫర్లు ఉంటాయని తెలిపింది. ఈ ఆఫర్ ఆగస్టు 10 నుంచి 13 వరకు ఎయిర్ ఏషియా విమానాలను బుక్ చేసుకున్న ప్యాసింజర్ అర్హులుగా పేర్కొంది. వీటితో పాటు మీ బుకింగ్ టికెట్ ప్రయాణం 25 ఆగస్టు 2022 నుంచి 31 మార్చి 2023 మధ్య ఉండేలా చూసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఈ ఆఫర్ అంతర్జాతీయ విమానాలకు వర్తించదు. కంపెనీ పేర్కొన్న తేదీలో బుక్ చేసుకుంటే తక్కువ ధరకే ఎంచక్కా గాల్లో ఎగరవచ్చు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ను ప్రకటించింది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి. ఆగస్టు 5 నుంచి ఈ ఎయిర్లైన్స్ లక్నో నుంచి బెంగళూరు, గోవా, న్యూఢిల్లీకి రోజువారీ డైరెక్ట్ విమానాలను నడుపుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నివేదించిన ప్రకారం, ఈ ఎయిర్లైన్ భారతదేశంలో అత్యంత సమయపాలన కలిగిన విమానయాన సంస్థగా కొనసాగుతోంది. Freedom never felt better. Celebrate 75 years of India’s Independence with special fares starting at ₹1,475! Book now till 13 August on https://t.co/4gF7kebVg3, the AirAsia India and @tata_neu mobile apps and earn #NeuCoins! #AzadiKaAmritMahotsav #IndependenceSale pic.twitter.com/4gJzMY1t8E — AirAsia India (@AirAsiaIndia) August 10, 2022 చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు. ‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది... చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు. ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక. నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు. కోచి(కేరళ)లోని ‘హెల్ప్ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది. ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం! బామ్మలు కోచి నుంచి కన్నూర్కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు. ‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి. ‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా. ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్మిషన్లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది. ఏ బామ్మను కదిలించినా.... వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం! వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం! కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను. – మౌనిక (88) -
అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థులకు షాక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: భారీగా పెరిగిన విమానయాన చార్జీలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటున్న వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా విమాన చార్జీలు పెరిగాయి. 60 నుంచి 70 శాతం వరకు పెరగడంతో అమెరికా, ఇతర దేశాలకు చదువు కోసం వెళ్లేవారు లబోదిబోమంటున్నారు. మరీ ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఎక్కువ రేట్లు నమోదయ్యాయి. కోవిడ్కు ముందు అమెరికాకు విమాన చార్జీ రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకూ మాత్రమే ఉండేది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లే వారు కనీసం రూ.1.60 లక్షలు విమాన టికెట్కే వెచ్చించాల్సి వస్తోంది. దీంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి ఈ ఏడాది 280 మంది దాకా విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళుతున్నారు. బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాలకూ వెళుతున్న వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. రెండు మాసాల ముందు బుక్ చేసుకుంటేనే... అమెరికాలో సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీంతో ఆగస్ట్ 25 నాటికే అక్కడికి చేరుకుంటారు. ఇందుకోసం జూన్లో విమాన టికెట్ బుక్ చేసుకున్న వారికి రమారమి రూ.1.55 లక్షలు అయ్యింది. ఇక అప్పటికప్పుడు అంటే రూ.2 లక్షల దాకా వెచ్చించాల్సి వస్తోందని శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన ప్రసాద్కుమార్ అనే విద్యార్థి చెప్పారు. రోజు రోజుకూ చార్జీలు పెరుగుతున్నాయని, గత రెండు నెలల్లో పెరగడమే గానీ ఎప్పుడూ తగ్గలేదని పలువురు విద్యార్థులు తెలిపారు. డాలర్ విలువ పెరగడంతో.. తాజాగా డాలర్తో రూపాయి మారకం విలువ సుమారు రూ.80కు పెరిగింది. దీనివల్ల అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థులపై పెనుభారం పడుతోంది. అమెరికాలో క్యూఎస్ ర్యాంకింగ్ 200 పైన ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా కనీసం 40 వేల డాలర్ల ఫీజు ఉంటుంది. అదే వందలోపు ర్యాంకింగ్స్ ఉన్న వాటిలో 60 వేల నుంచి 70వేల డాలర్లు అవుతుంది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో ఒక్కో విద్యార్థిపై రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ అదనపు భారం పడుతోంది. విమాన చార్జీలు ఎక్కువగా ఉన్నాయి నేను ఈ ఏడాది అమెరికాలోని బోస్టన్కు ఫార్మసీలో మాస్టర్స్ కోసం వెళుతున్నా. సాధారణంగా విద్యార్థులంతా ఆగస్టులోనే అమెరికాకు పయనమవుతారు. దీనివల్ల విమాన చార్జీలు ఎక్కువగా పెంచారు. సెప్టెంబర్ మాసంలో మళ్లీ తగ్గుతాయి. –నితీష్ కుమార్రెడ్డి, అనంతపురం డాలర్ రేటు పెరగడంతోనే.. నేను డల్లాస్లో మాస్టర్స్ చేయడానికి ఆగస్ట్ 23వ తేదీ వెళుతున్నా. విమాన టికెట్ రూ.1.55 లక్షలు అయ్యింది. దీంతో పాటు ఇటీవలే డాలర్ రేటు పెరగడంతో ఫీజుల్లోనూ తేడా వస్తోంది. దీనివల్ల మధ్యతరగతి వారికి ఆర్థిక భారం పడుతోంది. –శ్రీచరణ్, అనంతపురం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది కరోనా తర్వాత విదేశాల్లో చదువులు, సందర్శన కోసం వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. ఫలితంగా పాస్పోర్టుల నమోదు కూడా పెరిగింది. ఒక్క హిందూపురం కేంద్రంలోనే ప్రస్తుతం రోజూ 50 వరకు నమోదు అవుతున్నాయి. – రవిశంకర్, పాస్పోర్టు ఆఫీసర్, హిందూపురం -
విమాన ప్రయాణంలో ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఎందుకు ఆన్ చేస్తారో తెలుసా?
తరుచూ మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే మీరు ప్లైట్ జర్నీ చేసే సమయంలో క్యాబిన్ క్రూ సిబ్బంది మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని లేదంటే ఫోన్లో ఉన్న ఫ్లైట్ మోడ్ ఆన్ చేయమని అనౌన్స్ చేస్తారు.అసలు ఫ్లైట్ జర్నీలో ఫ్లైట్ మోడ్ ఎందుకు ఆన్ చేయమంటారో తెలుసా? మనఫోన్లో వైర్ లెస్ కనెక్షన్స్ అంటే బ్లూటూత్, వైఫై, మొబైల్ డేటా, నెట్ వర్క్ కనక్షన్ మొత్తం ఆఫ్ చేసేస్తుంది. ఎందుకంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థ (ఆర్ఎఫ్సీ) కేబిన్ క్రూ సిబ్బంది మాట్లాడుకునే మాటలు మ్యాచ్ అయితే ఫైలెట్స్కు చిన్న సౌండ్ లాగా వస్తుంది. వాళ్లలో వాళ్లకే కమ్యూనికేషన్లో ఇబ్బందిని కలిగిస్తుంటుంది. అందుకే ప్రతి ఫోన్లో ఏరోప్లెయిన్ మోడ్ ఇస్తారు. అమెరికాలాంటి దేశాల్లో సైతం ఈ ఆప్షన్ను తప్పని సరిగా వినియోగించాలి.లేదంటే సదరు విమానయాన సిబ్బంది ఫైన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
విమానాల్లో చక్కర్లు.. భారీగా పెరిగిన ప్రయాణికులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 మే నెలలో 1.20 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 మే నెలతో పోలిస్తే ఇది అయిదు రెట్లు అధికం కావడం విశేషం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం..గతేడాది దేశీయంగా మే నెలలో 21 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. 1.20 కోట్లలో ఇండిగో విమానాల ద్వారా 70 లక్షల మంది విహంగ విహారం చేశారు. మొత్తం ప్రయాణికుల్లో ఇది 57.9 శాతం. గో ఫస్ట్ ద్వారా 12.76 లక్షల మంది రాకపోకలు సాగించారు. -
డబుల్’ ధమాకా! టికెట్ పైనే రెండు గంటలు ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: పుష్పక్ బస్సుల్లో ఎయిర్పోర్టు నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు డబుల్ ధమాకా. ఎయిర్పోర్టు నుంచి పుష్పక్లో టికెట్ తీసుకున్నప్పటి నుంచి రెండు గంటల పాటు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమయానికి నడిచే పుష్పక్ బస్సుల్లో ప్రయాణికుల భర్తీ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టింది. మరో వారం, పది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. విమానాశ్రయం నుంచి పుష్పక్లో వచ్చే ప్రయాణికులు తీసుకొనే టికెట్లపైనే ఈ రెండు గంటల ఉచిత ప్రయాణం నమోదై ఉంటుంది. ఎయిర్పోర్టు ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఠంచన్గా పుష్పక్... ప్రస్తుతం 39 పుష్పక్ బస్సులు నగరంలోని జేఎన్టీయూ, పర్యాటక భవన్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో ఎయిర్పోర్టు వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలకనుగుణంగా ఈ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేవిధంగా నడుపుతున్నారు. ఎయిర్పోర్టు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 70శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయి. కానీ నగరం నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే సమయంలోనే 25 నుంచి 30 శాతం వరకే ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఫ్లైట్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ప్రయాణికులు ఎయిర్పోర్టుకు వెళ్లేటప్పుడు క్యాబ్లు, ఇతర వాహనాల్లో వెళ్తున్నట్లు ఆర్టీసీ గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సిటీ నుంచి బయలుదేరే ప్రతి బస్సు కచ్చితమైన సమయపాలన పాటించేవిధంగా చర్యలు చేపట్టారు. బస్సుల సమయపాలనపై ప్రయాణికులకు నమ్మకాన్ని కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నారు. బస్సుల్లో, బస్షెల్టర్లో కచ్చితమైన వేళలను ప్రదర్శించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పుష్పక్ల నిర్వహణపై ఎప్పటికప్పుడు ప్రయాణికుల స్పందన తెలుసుకొనేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల నుంచి అందే సమాచారం ఆధారంగా బస్సుల నిర్వహణలో మార్పులు, చేర్పులు ఉంటాయి. ఫ్లైట్ వేళలతో అనుసంధానం.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 190కిపైగా జాతీయ విమాన సర్వీసులు, మరో 30కిపైగా అంతర్జాతీయ విమానాసర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పుష్పక్లను వినియోగించుకొనేవారి సంఖ్య 5వేలు మాత్రమే. కనీసం మరో 10 వేల మంది ప్రయాణికులను పెంచుకోగలిగినా పుష్పక్ బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరుగుతుందని అధికారుల అంచనా. ఇందుకనుగుణంగా విమానాల వేళలను దృష్టిలో ఉంచుకొని ప్రతి బస్సు సకాలంలో ఎయిర్పోర్టుకు చేరేవిధంగా పుష్పక్ల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. (చదవండి: వడివడిగా ‘స్టడీ’...నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్) -
జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు: మంత్రి గుడివాడ
సాక్షి, విశాఖపట్నం: దావోస్ సదస్సు ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నాలుగు విమానాల నుంచి 64 విమానాల స్థాయికి ఎదిగిందన్నారు. 18 లక్షలు మంది ప్రయాణికులు పోకలు సాగిస్తున్నారన్నారు. మలేసియా, బ్యాంకాక్, సింగపూర్లకు విమాన సర్వీసులు పునరుద్ధరణ జరుగుతోందన్నారు. జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ? దావోస్లో 18 అంశాలపై సదస్సు జరుగుతుందని, వీటిలో 10 అంశాలు ప్రాధాన్యతగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందన్నారు. వ్యవసాయం, పర్యాటకం, విద్య, వైద్య, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బీచ్ ఐటీ అనే నినాదంతో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తామని.. వైఎస్సార్ హయాంలో విశాఖలో ఐటికి బీజం పడిందని వివరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మరింత ప్రగతి సాధిస్తోందని, బీచ్ ఐటి నినాదం విశాఖకు కలిసి వస్తుందని పేర్కొన్నారు. -
Sakshi Cartoon మావైపు మరో విమానం దూసుకొచ్చింది: మమతా బెనర్జీ
మావైపు మరో విమానం దూసుకొచ్చింది: మమతా బెనర్జీ -
ఆమె కలలో కూడా ఊహించి ఉండదు! ఇలా జరుగుతుందనీ..
she Is The Only Passenger: ఒక్కోసారి మనకు భలే విచిత్రమైన అనుభవాలు చోటు చేసుకుంటాయి. వాటిని మనం కనీసం కలలో కూడా ఊహించి ఉండం. అలాంటి చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. నమ్మశక్యంగా కూడా అనిపించదు. మనం చెప్పిన ఎవరూ నమ్మరు అన్నట్లుగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి విచిత్రమైన అనుభవం ఎదురైంది నార్వేకి చెందిన మహిళకి. వివరాల్లోకెళ్తే...కోవిడ్ -19 ఆంక్షలతో అంతర్జాతీయ ప్రయాణాలు చేయకుండా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో చాలా దేశాల్లో ఇంకా అంతర్జాతీయ విమానాలు తిరగడం లేదనే చెప్పాలి. ఇప్పుడిప్పడే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పలు దేశాల్లో ఆంక్షలు సడలించడంతో విమానాయాన సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. ఈ మేరకు నార్వే నుంచి రోరోస్ బయలు దేరుతున్న విమానాన్ని ఒకే ఒక్క మహిళా ప్రయాణికురాలు బుక్ చేసుకుంది. ఇంకా ఎవరు బుక్ చేసుకోలేదు. అయితే సదరు మహిళకు కూడా తెలియదు ఆ విమానంలో తాను ఒక్కత్తే ప్రయాణికురాలినని. దీంతో ఆ మహిలో ఆనందానికి అవధులే లేవు. తాను మాత్రమే ఈ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలినని తెలియడంతో ఆమె ఆ విమానంలో ప్రయాణిస్తున్న సంఘటనను గుర్తుంచుకునేలా వీడియో రికార్డు చేసింది. ఆ విమానంలో ఫైలెట్లు, ఆమె తప్ప మరెవ్వరూ లేరు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Aurora Torres (@aurooratorres) (చదవండి: ఆ రాయి అందర్నీ చంపేస్తుంది) -
టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించిన బాలుడు... గూగుల్లో సెర్చ్ చేసి మరీ..
Boy Managed To Travel Almost 3000 kilometres Alone: ఇంతవరకు మనం బస్సు లేక రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం గురించి విని ఉంటాం. అదృష్టం బావుంటే పట్టుబడం లేదంటే ఫైన్ కట్టి బయటపడతాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ బుడ్డోడు ఒంటరిగా అదికూడా టికెట్టు లేకుండా ఏకంగా విమానం ఎక్కి వచ్చేశాడు. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బ్రెజిల్లోని ఇమాన్యుయెల్ మార్క్వెస్ ఒలివేరా అనే 9 ఏళ్ల బాలుడు ఒంటరిగా లేకుండా విమానంలో ప్రయాణించాడు. అంతేకాదు తన ఇంటి నుంచి సుమారు 3వేల కి. మీ దూరంలో ఉన్నఆగ్నేయ రాష్ట్రమైన సావో పాలోలోని గౌరుల్హోస్కు విమానంలో పయనించాడు. ఈ మేరకు అతని తల్లి డేనియల్ మార్క్వెస్ ఆ రోజు కొడుకుని ఉదయం 5 గంటల ప్రాంతంలో చూశానని చెప్పారు. ఆ తర్వాత అతను కనిపించక చాలా ఆందోళన చెందామని వివరించారు. ఆ బాలుడు గూగుల్లో టికెట్ లేకుండా, ఎవరి కంటపడకుండా విమానం ఎక్కడం ఎలా అనే దానిపై సర్చ్ చేసి మరీ వెళ్లాడు. ఆ బాలుడి తల్లికి అతని ఆచూకి తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకోగలిగింది. ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్లకంటే ఈజీగా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ని ఆపరేట్ చేసేస్తున్నారు. కానీ ఈ బాలుడిని చూస్తే మరీ ఇంత అడ్వాన్స్డ్గా పిల్లలు ఉంటారా? అని ఆశ్చర్యం కలగకమానదు. అంతేకాదు పెద్దల్లో గుబులు కూడా కాస్త ఎక్కువ అవుతుంది. ఈ మేరకు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎలాంటి ప్రయాణ పత్రాలు లేదా లగేజీ లేకుండా బాలుడు ఎలా ఎక్కగలిగాడనే విషయంపై మనౌస్ విమానాశ్రయ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: సినిమా రేంజ్లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్! వైరల్ వీడియో) -
ఎన్నికల వేళ విమాన ప్రయాణం పై ప్రత్యర్థుల మాటల యుద్ధం!
న్యూఢిల్లీ: బీజేపీ, సమాజ్వాద్ పార్టీల మధ్య విమాన ప్రయాణం పై మాటల యుద్ధం జరిగింది. ఉత్తరప్రదశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత నెలలో మార్చి 11న లక్నో నుంచి గోరఖ్పూర్కి విమానం టిక్కెట్ను బుక్ చేసుకున్నారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో యోగి మార్చి 11 వెంటనే టికెట్ బుక్ చేసుకుని పారిపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలు పై బీజేపీ నాయకులు ఎంతలా భయపడుతున్నారో అర్థం అవుతుంది అంటూ విమర్శించారు. బీజేపీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలియదు మీరు భయపడి పారిపోయేవరకు అని బహ్రైచ్లో జరిగిన ర్యాలీలో అఖిలేశ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు గత నెలలో సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధిఐపి సింగ్ యోగిని విమర్శిస్తూ..తాను మిస్టర్ యోగి ఆదిత్యనాథ్ కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్లో గోరఖ్పూర్కి బుక్ చేసినట్లు తెలిపిన విమాన టిక్కెట్ స్క్రీన్షాట్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల కోసం మార్చి 11న లక్నో నుంచి గోరఖ్పూర్కి బయలుదేరుతంటే.. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లండన్కి ఎగరిపోతారంటూ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. దీంతో అఖిలేశ్ యాదవ్ ఈ రోజు ర్యాలిలో ఆ మాటలకు కౌంటరిచ్చారు. యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల ఓటింగ్లో నాలుగు రౌండ్లు జరగగా.. మార్చి 10న ఫలితాలు వెల్లడనున్న సంగతి తెలిసిందే. अखिलेश यादव के लंदन के टिकट को लेकर सनसनी, 11 मार्च को लंदन जाने का है टिकट क्या कोई सच्चाई बता सकता है❓ — Arun Yadav (@beingarun28) February 21, 2022 (చదవండి: యూపీ ప్రజలకు సీఎం యోగీ కీలక హామీ.. అఖిలేష్ కౌంటర్) -
ఏసీ రైలు ఎక్కేవారేరీ?
సామాన్యుడి చౌక ప్రయాణ సాధనం రైలుబండికి కొన్ని వర్గాల ప్రయాణికులు మాత్రం క్రమంగా దూరమవుతున్నారు. ప్రత్యేకంగా ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దేశం నలువైపులా అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం, కేవలం ఒకటి, రెండు గంటల్లోనే గమ్యస్థానానికి చేరే అవకాశం ఉండడంతో విమాన ప్రయాణానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ ట్రైన్ చార్జీల కంటే విమాన చార్జీలు కొద్దిగా ఎక్కువే అయినా ప్రయాణ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్లైట్ జర్నీ వైపు మళ్లుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో మారిన ప్రయాణికుల ధోరణి కారణంగా..పండుగలు, వరుస సెలవులు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే డొమెస్టిక్ విమానాలు 80 శాతం ఆక్యుపెన్సీతో రాకపోకలు సాగిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని రైళ్లలో ఖాళీగా ఏసీ బెర్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని సువిధ రైళ్లలో విమానాల తరహాలో చార్జీలను పెంచుతున్నారు.కానీ పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఇంచుమించు అదే చార్జీల్లో ఫ్లైట్ టిక్కెట్ వచ్చేస్తుంది. పైగా కొన్ని ఆన్లైన్ బుకింగ్ ఏజెన్సీలు ప్రయాణికులకు రకరకాల ఆఫర్లను అందజేస్తున్నాయి. దీంతో చాలా మంది విమాన ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారని ఐఆర్సీటీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఎక్కువ సమయమే కారణమా... హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, విశాఖ, తిరుపతి, భువనేశ్వర్, పటా్న, ధానాపూర్, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లు 12 గంటల నుంచి 18 గంటల వరకు ప్రయాణం చేస్తాయి. ఇప్పటికీ చాలా రైళ్లు గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతోనే నడస్తున్నాయి.కొన్ని రూట్లలో రైళ్ల వేగాన్ని పెంచేందుకు పట్టాల సామర్ధ్య పెంపునకు చర్యలు చేపట్టారు. కానీ పెద్దగా రైళ్ల వేగం పెరగలేదు. దీంతో రూ.2500 నుంచి సుమారు రూ.4000 వరకు చార్జీలు చెల్లించి గంటల తరబడి ప్రయాణం చేసేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయవలసిన వాళ్లు ఫ్లైట్నే ఎంపిక చేసుకుంటున్నారు. ‘ఇంటిల్లిపాది వెళ్లవలసినప్పుడు ట్రైన్లోనే వెళ్తున్నాం. కానీ ఒక్కరు, ఇద్దరు వెళ్లవలసినప్పుడు మాత్రం ఫ్లైట్లోనే వెళ్తున్నాం.’ అని హైటెక్సిటీకి చెందిన కృష్ణ తెలిపారు. తాము తరచుగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నట్లు పేర్కొన్నారు. నగరం నుంచి తిరుపతి, వైజాగ్ వంటి ప్రాంతాలకు ప్రతి రోజు 5 నుంచి 10 వరకు విమానాలు నడుస్తుండగా ముంబ యి, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ నగరాలకు హైదరాబాద్ మీదుగా 15 నుంచి 20 ఫ్లైట్లు అందుబాటులో ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. చలో ఎయిర్టూర్... మరోవైపు ఐఆర్సీటీసీ, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు ఏర్పాటు చేసే ఎయిర్ టూర్లకు సైతం ప్రాధాన్యం పెరిగింది. ప్రతి సంవత్సరం ఉత్తర, దక్షిణభారత యాత్రలు నిర్వహించే ఐఆర్సీటీసీ రైళ్లతో పాటు విమాన సర్వీసుల్లోనూ ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది . జైపూర్, శ్రీనగర్, తదితర ప్రాంతాలకు ఎయిర్టూర్లు ఉన్నాయి. ఏసీ బెర్తులు ఖాళీ... ♦ హైదరాబాద్ నుంచి పలు మార్గాల్లో రాకపోకలు సాగించే కొన్ని రైళ్లలో ఈ నెల 23వ తేదీన ఏసీ బెర్తులు కిందివిధంగా అందుబాటులో ఉన్నాయి. ♦ హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి రాకపోకలు సాగించే తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఈ నెల 23వ తేదీన ఫస్ట్ ఏసీలో 8 బెర్తులు, సెకెండ్ ఏసీలో 15, థర్డ్ ఏసీలో ఏకంగా 101 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ♦ హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఫస్ట్ ఏసీ చార్జీ రూ.4460, సెకెండ్ ఏసీ చార్జీ రూ.2625 ఉంది. ఈ చార్జీలకు కొద్దిగా అటు ఇటుగా విమానచార్జీలు ఉన్నాయి. ♦ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్లో ఈ నెల 23వ తేదీన సెకెండ్ ఏసీలో 99, థర్డ్ ఏసీలో 226 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నైకు ఫస్ట్ ఏసీ చార్జీ రూ.2760, సెకెండ్ ఏసీ రూ.1645 చొప్పున ఉంది. -
మీ అంచనాల్ని అందుకోలేకపోయాం, ఏం చేస్తాం చెప్పండి..అంతాకరోనా ఎఫెక్ట్
ముంబై: కస్టమర్ల అంచనాలను గత కొన్ని నెలలుగా అందుకోలేకపోయినట్టు విస్తారా ఎయిర్లైన్స్ సీఈవో వినోద్ కన్నన్ అంగీకరించారు. అంతరాలను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కస్టమర్లకు ఆయన ఒక లేఖ రాశారు. సేవల్లో ఇటీవలి నెలకొన్న అవాంతరాలతో ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి రావడాన్ని, ఎయిర్లైన్స్ కాల్ సెంటర్ను చేరుకునేందుకు ఎక్కువ సమయం పాటు వేచి ఉండాల్సి రావడాన్ని అంగీకరించారు. ‘‘విమాన ప్రయాణం అన్నది ఒక లావాదేవీ కాకుండా, సంతోషరమైన ఒక మరపురాని అనుభూతిగా మిగల్చాలని మేరు కోరుకుంటాము. ఈ విషయంలో గత కొన్ని నెలలుగా మేము అంచనాలను అందుకోలేని విషయం నిజమే. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు వెబ్సైట్ కానీ, యాప్ కానీ నిర్ధేశిత పరిష్కారాలను చూపించడం లేదని తెలుసు. విమానాశ్రయాల్లో ఆన్గ్రౌండ్ సేవల పరంగా కొన్ని సందర్భాల్లో మీ అంచనాలను అందుకోలేకపోతున్నట్టు అవగాహన ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు. కస్టమర్ల ఫిర్యాదులు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరోనా వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో కొన్ని సేవలను తాత్కాలికంగా కుదించాల్సి వచ్చినట్టు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
5జీతో మన విమానాలకు ప్రమాదం? సమాధానం ఇచ్చిన కేంద్రం
మొబైల్ సర్వీసుల్లో 5జీని ప్రవేశపెట్టడంపై అమెరికన్ ఏవియేషన్ సెక్టార్ గజగజ వణికిపోయింది. ఇండియా నుంచి యూఎస్ఏ వెళ్లే విమాన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. త్వరలో ఇండియాలో 5జీ సర్వీసులు ప్రారంభించనున్నందున మన విమాన సర్వీసుల భద్రతపై పార్లమెంటులో కేంద్రాన్ని వివరణ అడిగారు మన ఎంపీలు. 5జీ ట్రయల్స్కి అనుమతి ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు 5జీ సర్వీసుల వల్ల విమానాలకు ఏమైనా ప్రమాదమా ? దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఏదైనా రిపోర్టు ఉందా అంటూ పార్లమెంటు సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్స్తో పాటు 5జీకి కేటాయించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్తో ఎయిరోనాటికల్ కమ్యూనికేషన్స్కి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది. 5జీ సర్వీసుతో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎయిరోనాటికల్ వ్యవస్థకు భద్రత ఉందని కేంద్రం భరోసా ఇచ్చింది. మనదేశంలో జియో, వోడాఐడియా, ఎయిర్ఎట్, ఎంఎన్టీఎల్ సంస్థలకు 5జీ ట్రయల్స్ చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎంపిక చేసిన ఏరియాల్లో ఈ ట్రయల్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాదిలోనే 5జీ సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్రం బడ్జెట్లో తెలిపింది. ఇటీవల అమెరికాలో 5జీ సర్వీసులు ప్రారంభించగా ... విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎయిరోనాటికల్ కమ్యూనికేషన్స్కి ఇబ్బంది అంటూ విమానాలను గాల్లోకి ఎగురనివ్వలేదు. చదవండి:అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం.. భయాలతో విమానాల రీషెడ్యూల్! -
కలకలం: ఒకే విమానంలో ప్రయాణించిన 125 మందికి కరోనా..
అమృత్సర్: కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధంగా ఉంది. దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందకు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కేసులు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీంతో భారత్లో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు అయినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తూ, రాబోయే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారానే దేశంలో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమన్న సంగతి తెలిసింది. అందుకే ఈ సారి బయట దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలోకి వచ్చిన చార్టర్డ్ విమానంలో కరోనా కలకలం రేగింది. గురువారం ఇటలీ నుంచి అమృత్సర్కు చార్టర్డ్ ప్లైట్లో వచ్చిన ప్రయాణికులను పరీక్షల జరుపగా అందులో 125 మందికి కరోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వీరి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్స్కు పంపారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారు. పాజిటివ్గా తేలిన ప్రయాణికులను ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కు పంపిస్తామని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు. చదవండి: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీంకోర్టులో విచారణ! -
పైసా పైసా కూడబెట్టకున్నాం.. ఆ రోజు వచ్చింది.. అనుకున్నది సాధించాం
సాక్షి,దోమ(వికారబాద్): సామాన్య ప్రజలు విమానం ఎక్కడం చాలా అరుదు. జీవితంలో ఒక్కసారైన ఎక్కాలనే ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. అయితే.. వారి కల నిజమైంది. దోమ మండల పరిధిలోని కిష్టాపూర్కు చెందిన 20 మంది సాధారణ మహిళలు తిరుపతికి విమానంలో వెళ్లి తమ కల నెరవేర్చుకున్నారు. వివరాలు.. గ్రామంలోని గౌడ్స్ కాలనీకి చెందిన మహిళలు పైసాపైస కూడబెట్టకొని తిరుపతికి విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు గ్రామానికి చెందిన ప్రసాద్తో టిక్కె ట్లను బుక్ చేయించుకొని అతడితో పాటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో మళ్లీ విమానంలో శంషాబాద్కు వచ్చారు. తమ జీవితంలో విమానం ఎక్కుతామో లేదో అనుకున్నామని, ఆ వేంకటేశ్వరుడి కృపతో కల సాకారం అయిందని తెగ సంబరపడిపోతు న్నారు. ఇప్పటికీ ఇది కలనా.. నిజమా అన్నట్లుగా.. గాలిలో తేలినట్లుగా ఉందని చెబుతున్నారు. చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి.. -
Viral video:పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!
Helicopter Made From Discarded Car Parts: చాలా మంది తాము జీవితంలో ఎప్పటికైన విమానంలో ప్రయాణించాలి అని అనుకుంటుంటారు. బాగా చదువుకుని మంచి స్థాయికి వచ్చినప్పుడో లేక బాగా డబ్బులు సంపాదించినప్పుడో విమానంలో ప్రయాణించడం చేస్తుంటారు. అయితే ఇక్కడొక వ్యక్తి అందుకు భిన్నంగా తాను ఏవిధంగానైనా విమానంలో ప్రయాణించాలి, పైగా తనకొక ప్రత్యేక విమానం ఉండాలనే కోరికతో ఏం చేశాడో చూడండి!. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్కి గురైన వెయిటర్!) మాములుగా పూర్తి స్థాయిలో విమానాన్ని తయారు చేయాలంటే చాలా ఎక్కువ పరికరాలు తోపాటు కాస్త ఖర్చుతో కూడిన పని. కానీ బ్రెజిల్లోని జోయో డయాస్ నగరానికి చెందిన విమానయన నిపుణుడు జెనెసిస్ గోమ్స్ కేవలం మోటార్సైకిళ్లు, ట్రక్కులు, కార్లు, సైకిళ్లకు సంబంధించిన విడిభాగాలతో విమానాన్ని తయారు చేశాడు. అంతేకాదు పాత వాహనాలను కొనుగోలు చేసే షాపు నుంచి ఈ విడిభాగాలను కొనుగోలు చేసి ఈ విమానాన్ని తయారు చేశాడు. అంతేకాదు గోమ్స్ పరైబా నగరంలో జరుగుతున్న ఏవియేషన్ ఈవెంట్ సందర్భంగా తాను తయారు చేసిన విమానంలో తన స్నేహితుడితో కలిసి ట్రైల్ నిర్వహించాడు. ఈ మేరకు ఈ విమానాన్ని చూసేందుకు జోయో డయాస్ నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తనకు విమానం ఎక్కే అవకాశం రాకపోడంతోనే తనకంటూ ఒక విమానం ఉండాలని నిర్ణయించుకునే ఈ విమానాన్ని రూపొందించానని చెప్పాడు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: క్రిస్మస్ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్ జాగ్రత్తా!!) -
పేటీఎం బంపర్ ఆఫర్..! విమాన టికెట్లపై 50 శాతం వరకు తగ్గింపు..!
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. విమాన టికెట్ల బుకింగ్పై ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది. పేటీఎం యాప్తో విమాన టికెట్ల బుకింగ్పై 15 నుంచి 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ సాయుధ దళాల సిబ్బంది, కళాశాల విద్యార్థులు, సీనియర్ సీటిజన్లకు అందుబాటులో ఉండనుంది. వీటిపై వర్తిస్తాయి..! పేటీఎం అందిస్తోన్న ఆఫర్స్ ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్, ఎయిర్ఎసియా సర్వీసులపై తగ్గింపు ధరలు వర్తిస్తాయి. కాలేజ్ విద్యార్థులు 10 కిలోల వరకు ఎక్స్ట్రా బ్యాగేజ్ను తీసుకునే సౌకర్యాన్ని కూడా పొందవచ్చును. చదవండి: పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్..! ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ.... “ ట్రావెల్ టికెటింగ్ మాకు చాలా ముఖ్యమైన సెగ్మెంట్. ట్రావెలింగ్ విషయంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లను రిజర్వ్ చేయడానికి సులభతరమైన అనుభూతిని వారికి అందిస్తున్నామని అన్నారు. పేటీఎం ప్రముఖ మేజర్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కస్టమర్లు ఫ్లైట్ టికెట్లను, ఇంటర్సిటీ బస్సులను, రైల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి పేటీఎం వీలు కల్పిస్తోంది. కొద్ది రోజుల క్రితం విమాన ప్రయాణాలపై ఈఎంఐ సౌకర్యాన్ని కూడా పేటీఎం ప్రారంభించింది. చదవండి: Paytm: 50 కోట్ల మంది టార్గెట్ -
ఆగేదేలే! అమెరికా టూ ఇండియా.. నాన్స్టాప్ ఫ్లైట్ సర్వీసులు..
కోవిడ్ ఆంక్షలు సడలించి ఇండియా అమెరికాల మధ్య అంతర్జాతీయ ప్రయాణాలను అనుమతి ఇచ్చిన శుభసందర్భంగా ఇరు దేశాల మధ్య నాన్స్టాప్ విమానాలు షురూ అయ్యాయి. అమెరికా ఎయిర్లైన్స్కి చెందిన విమానం ఇప్పటికే సర్వీసులు ప్రారంభించింది. మరిన్ని సర్వీసులు ప్రారంభించేందుకు సన్నహకాలు చేస్తోంది. దుబాయ్ మీదుగా ఇండియా అమెరికాల మధ్య రాకపోకలు ఎప్పటి నుంచో బాగానే ఉన్నాయి. దీనికి తోడు ఐటీ విప్లవం వచ్చిన తర్వాత ఇది మరింతగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మండలం నుంచి కనీసం నలుగురైదురగు అమెరికాలో నివసించే పరిస్థితి నెలకొంది. అయితే ఇండియా నుంచి అమెరికాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు చాలా తక్కువ. చాలా వరకు దుబాయ్, యూఏఈ లేదా యూరప్ వెళ్లి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా యూఎస్ వెళ్తుంటారు. 2012లో రద్దు అమెరికన్ ఎయిర్లైన్స్ సంస్థ 2007లో షికాగో నుంచి న్యూఢిల్లీకి నాన్స్టాప్ ఫ్లైట్లను ప్రారంభించింది. అయితే ఐదేళ్ల తర్వాత ఆ సంస్థ షికాగో - న్యూఢిల్లీ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొత్తానికే విమాన సర్వీసులు రద్దు చేశారు. న్యూయ్యార్క్ టూ ఢిల్లీ గడిచిన పదేళ్లలో ఇండియా అమెరికాల మధ్య రాకపోకలు పెరిగాయి. అనేక కుటుంబాలు ఎన్నారైలుగా అమెరికాలో ఉంటున్నారు. ఇండియాలో సైతం ఎయిర్లైన్స్ మార్కెట్ రోజురోజుకి పుంజుకుంటోంది. దీంతో అమెరికన్ ఎయిర్లైన్స్ ఈ మార్కెట్లో వాటా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించింది. గత అక్టోబరులో ఈ విమానం ప్రారంభం కావాల్సి ఉండగా నవంబరుకు వాయిదా పడింది. తొలి విమానం గత శనివారం (2021 నవంబరు 13)న ఢిల్లీకి చేరుకుంది. వీకెండ్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంది. బెంగళూరుకి రెండో విమాన సర్వీసును అమెరికాలోని సియాటెల్ నుంచి బెంగళూరు మధ్య మార్చి లేదా ఏప్రిల్లో ప్రారంభించేందుకు రెడీ అవుతోంది అమెరికన్ ఎయిర్లైన్స్. ఆ తర్వాత న్యూయార్గ్ - ముంబై, శాన్ఫ్రాన్సిస్కో- బెంగళూరుల మధ్య మరో రెండు సర్వీసులు ప్రారంభించాలనే యోచనలో ఉంది. బోయింగ్ 777 నాన్స్టాప్ సర్వీసులకు బోయింగ్ 777 విమానాలు ఉపయోగిస్తున్నారు. ఇందులో 304 మంది ప్రయాణం చేయవచ్చు. ఎకానమీ 216, ప్రీమియం ఎకానమీ 28, బిజినెస్ క్లాస్ 52, ఫస్ట్క్లాస్ 8 సీట్ల వంతున అందుబాటులో ఉన్నాయి. భారతీయ అభిరచులకు తగ్గట్టు ఫుడ్, ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు. ఇండిగోతో జట్టు అమెరిక్ ఎయిర్లైన్స ఇండియాలో ఇండిగోతో జట్టు కట్టింది. నాన్స్టాప్ ఫ్లైట్ల ద్వారా ఇండియా చేరుకున్న ప్రయాణికులు దేశీయంగా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా ఇండిగో ఏర్పాటు చేస్తుంది. అమెరిక్ ఎయిర్లైన్స్ టిక్కెట్ కలిగిన ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో ఇండిగో లాంజ్లను వినియోగించుకోవచ్చు. ఇదే తరహాలో మరికొన్ని సౌలభ్యాలు అందిస్తున్నారు. చదవండి:ఈ దేశాల నుంచి వస్తే క్వారెంటైన్ అక్కర్లేదు.. కొత్త మార్గదర్శకాలు -
విమాన ప్రయాణికులకు శుభవార్త! ఇకపై ఆంక్షల్లేవ్
విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సర్క్యూలర్ని జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబరు 18 నుంచి దేశీయంగా విమాణ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభనతో దేశంలో విమాన సర్వీసులపై ఆంక్షలు విధించారు. ప్లైట్లో ప్రయాణించాలంటే కోవిడ్ నెగటీవ్ సర్టిఫికేట్, మాస్క్ తదితర రక్షణ చర్యలను కట్టుదిట్టం చేశారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించే లక్ష్యంతో విమానంలో ప్రయాణికుల పరిమితిపరై ఆంక్షలు విధించారు. మే 21వ తేది నుంచి ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే కోవిడ్ తగ్గుముఖం పడుతుంటంతో క్రమంగా ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తి వేస్తూ వస్తున్నారు. చివరి సారిగా విమాన ప్రయాణాలపై సెప్టెంబరు 18 మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. వాటి ప్రకారం 85 సామర్థ్యంతో మాత్రమే ప్రయాణికులకు అనుమతించారు. తాజాగా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇకపై విమానాలు వంద శాతం సీటింగ్ కెపాసిటీతో నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 18 నుంచి విమానయాన సంస్థలు వంద శాతం టిక్కెట్లను విక్రయించనున్నాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ఫ్టైట్ ఆపరేటర్లు పూర్తి స్థాయిలో టిక్కెట్లు విక్రయించడం లేదు. దీంతో సమయానికి టిక్కెట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది. చదవండి:ఎయిర్లైన్స్ మహిళా సిబ్బంది..... ఇక హైహిల్స్, స్కర్ట్స్కి స్వస్తీ -
ప్రతిభకు గుర్తింపు: విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్
ముదిగుబ్బ: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని మద్దన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ తన సొంత ఖర్చుతో విమానంలో హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా పాఠశాలకు చెందిన విద్యార్థులను జాతీయ నేతల వేషధారణలో బెంగళూరు నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకెళ్లారు. ఏటా చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి విమానంలో విహరింపజేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐదుగురు విద్యార్థులను పిలుచుకెళ్లారు. చదవండి: బ్యాంక్కు నిద్రలేని రాత్రి.. అర్ధరాత్రి పాము హల్చల్ చదవండి: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ -
విజయవాడ: నేటి నుంచి మస్కట్కు విమాన సర్వీస్
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి ఒమన్ దేశ రాజధాని మస్కట్కు ఎయిర్ ఇండియా సంస్థ మంగళవారం నుంచి విమాన సర్వీస్ను ప్రారంభించనుంది. వారానికి ఒక సర్వీస్ మాత్రమే నడుస్తుంది. ఈ విమాన సర్వీస్ ద్వారా ఇక్కడి నుంచి మస్కట్కు కేవలం 3.30 గంటలలోనే చేరుకోవచ్చు. 182 మంది ప్రయాణికుల సామార్ధ్యం కలిగిన ఎయిర్బస్ ఎ–321 విమానం ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్ట్గా మస్కట్కు బయలుదేరి వెళ్తుంది. మస్కట్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. ఇవీ చదవండి: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! ‘రోడ్డు’ మ్యాప్ రెడీ -
విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్ట్లో 66 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. జూలైతో పోలిస్తే ఈ సంఖ్య 31 శాతం అధికమని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘ప్రయాణికుల సంఖ్య పరిమితి అధికమవడం, మహమ్మారి తగ్గుముఖం పట్టడం ఈ పెరుగుదలకు కారణం. జూలైలో దేశీయంగా 51 లక్షల మంది వివిధ నగరాలను చుట్టి వచ్చారు. 2020 ఆగస్ట్తో పోలిస్తే గత నెలలో ప్రయాణికుల సంఖ్య 131 శాతం అధికమైంది. గతేడాది ఈ కాలంలో 28.3 లక్షల మంది ప్రయాణం చేశా రు. ఆగస్ట్లో కోలుకోవడం జరిగినప్పటికీ సె కండ్ వేవ్ కారణంగా డిమాండ్పై ఒత్తిడి కొనసాగుతోంది. కస్టమర్లు అవసరమైతే మాత్రమే ప్రయాణిస్తున్నారు’ అని ఇక్రా తెలిపింది. అధికమైన సరీ్వసులు.. దేశవ్యాప్తంగా 2021 ఆగస్ట్లో 57,500 విమాన సరీ్వసులు నడిచాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 28,834 మాత్రమే. ఈ ఏడాది జూలైతో పోలిస్తే గత నెలలో 22 శాతం పెరుగుదల. ఆగస్ట్లో సగటున 1,900 సరీ్వసులు నమోదయ్యాయి. 2020 ఆగస్ట్లో ఇది 900 మాత్రమే. 2021 జూలైలో ఈ సంఖ్య 1,500 ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో సగటున రోజుకు 2,000 సరీ్వసులు నడవడం గమనార్హం. ఆగస్ట్లో ఒక్కో విమానంలో సగటున 114 మంది ప్రయాణించారు. జూలైలో ఈ సంఖ్య 106 ఉంది. ఇక విమాన టికెట్ల ధరలను ఆగస్ట్ 12–31 మధ్య 10–13 శాతం పెంచేందుకు పౌర విమానయాన శాఖ అనుమతిచి్చంది’ అని ఇక్రా వివరించింది. -
ఇటలీ విమానంపై కాల్పులు
రోమ్: కాబూల్ ఎయిర్పోర్టు నుంచి అఫ్గాన్ పౌరులతో బయలుదేరిన ఇటలీ విమానంపై కాల్పులు జరిగినట్లు ఇటలీ రక్షణ శాఖ తెలిపింది. ఈ ఘటనతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఇటలీ సైనిక రవాణా విమానం ఒకటి గురువారం ఉదయం సుమారు 100 మంది అఫ్గాన్ పౌరులతో కాబూల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దానిపైకి కాల్పులు జరిగినట్లు అందులో ప్రయాణిస్తున్న ఇటాలియన్ జర్నలిస్ట్ ఒకరు తెలిపారని మీడియా వెల్లడించింది. పైలట్ అప్రమత్తతతో విమానం ప్రమాదం నుంచి బయటపడిందనీ, ఈ పరిణామంతో కొద్దిసేపు ప్రయాణికులంతా భయభ్రాంతులకు లోనైనట్లు ఆ జర్నలిస్ట్ తెలిపారని పేర్కొంది. తమ సీ–130 రకం రవాణా విమానంపై కాబూల్లో కాల్పులు జరిగాయని అంతకుముందు ఇటలీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘటనపై ఇటలీ ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అఫ్గాన్లో పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న వేలాది మంది విదేశీయులతోపాటు, అఫ్గాన్ పౌరులను ఖాళీ చేస్తున్న దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. -
ఇకపై ఎంచక్కా..ఫ్లైట్ జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బడ్జెట్ క్యారియర్ స్పైస్జెట్ దేశీయ విమానయాన రంగంలో తొలిసారిగా కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ వేదిక అయిన స్పైస్స్క్రీన్ సహాయంతో విమానంలో ఉన్నప్పుడే ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. తక్కువ చార్జీలతోపాటు 10 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ప్రయాణికులు క్యాబ్ డిపార్చర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అరైవల్ గేట్ వద్దే క్యాబ్ సిద్ధంగా ఉంటుందని స్పైస్జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో దిగే ప్యాసింజర్లు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. హైదరాబాద్సహా ఇతర ప్రధాన నగరాలకు ఈ సౌకర్యాన్ని దశలవారీగా పరిచయం చేస్తారు. క్యాబ్ రద్దు చేసుకుంటే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. స్పైస్స్క్రీన్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకోగానే ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా ఓటీపీతోపాటు విమానం దిగిన వెంటనే కాల్ కూడా వస్తుంది. స్పైస్స్క్రీన్ను గతేడాది ఆగస్టులో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణంలో ఆన్బోర్డ్ వైర్లెస్ నెట్వర్క్కు కనెక్ట్ అయి స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్ పీసీ లేదా ల్యాప్టాప్ ద్వారా వినోదాన్ని ఆస్వాదించవచ్చు. చదవండి : వారెవ్వా..!సరికొత్త రికార్డ్లను బద్దలు కొట్టిన అగ్రికల్చర్ బిజినెస్ రిజిస్ట్రేషన్లు -
హైదరాబాద్ నుంచి గోవా టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
పర్యాటకం పంథా మారింది. ఎక్కడికైనా సరే రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేందుకు పర్యాటక ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో పర్యాటకుల అభిరుచి మారింది. గంటలు, రోజుల తరబడి బస్సులు, రైళ్లలో ప్రయాణం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకొని ఎక్కువ ప్రాంతాలను సందర్శించే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. గోవా, కాశ్మీర్, హంపీ తదితర ప్రాంతాలతో పాటు కొత్తగా లద్దాక్, లేహ్, డార్జిలింగ్ వంటి ఇతర ప్రాంతాలపైనా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ఐఆర్సీటీసీ ఎయిర్ప్యాకేజీలను అందజేస్తోంది. సాక్షి, హైదరాబాద్: పర్యాటక ప్రియులు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాముఖ్యతనిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకు విమాన ప్రయాణానికే ఓటేస్తున్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్ అనంతరం గత 2 నెలల్లో సుమారు 20 ఎయిర్ ప్యాకేజీలను నిర్వహించినట్లు ఐఆర్సీటీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ నర్సింగ్రావు తెలిపారు. కోవిడ్ మొదటి ఉధృతి అనంతరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 38 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. 2019లో హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ఏకంగా 175 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వేలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అదే సమయంలో రైల్ టూర్లు, ఉత్తర, దక్షిణాది పర్యాటక రైళ్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇవిగో ఎయిర్ప్యాకేజీలు... గోవా టూర్ సెప్టెంబర్ 24న ప్రారంభంకానుంది. విమాన ప్రయాణంతో పాటు రోడ్డు, రవాణా, గోవాలో హోటల్ సదుపాయం, తదితర అన్ని ఏర్పాట్లు ఐఆర్సీటీసీ అందజేస్తుంది. ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ గోవాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ (మూడు రాత్రులు..నాలుగు పగళ్లు)ఒక్కరికి ర.15,780 చొప్పున ఉంటుంది. ♦ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పర్యటన ప్యాకేజీ(ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) విలువ ర.23,150. అక్టోబర్ 1వ తేదీన ఈ పర్యటన మొదలవుతుంది. అహ్మదాబాద్, ద్వారక, సోమ్నాథ్ ఆలయాలతో పాటు సర్ధార్ వల్లభ్బాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించవచ్చు. ♦ హౌస్బోట్ సదుపాయంతో కూడిన కశ్మీర్ పర్యటన సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో( ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గావ్, సోన్మార్గ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ ప్యాకేజీ రూ.24.480 చొప్పున ఉంటుంది. ♦ రాయల్ రాజస్థాన్ యాత్ర (ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. జైపూర్, జోథ్పూర్, పుష్కర్, ఉదయ్పూర్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ర.23,900 చొప్పున ఈ పర్యటన ప్యాకేజీ ఉంటుంది. ఉత్తరభారత యాత్ర... ♦ ట్రైన్లో వెళ్లే పర్యాటకుల కోసం ఉత్తర భారత యాత్ర, వారణాసి–గయ–ప్రయాగ్రాజ్, దక్షిణభారత యాత్ర రైళ్లను సిద్ధం చేసింది. ఉత్తర భారత యాత్ర, ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, హరిద్వార్, దిల్లీ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఒక్కొక్కరికి అన్ని సదుపాయాలతో ర.10,400 చొప్పున ఉంటుంది. ♦ దక్షిణభారత యాత్ర అక్టోబర్ 19న ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరుచురాపల్లి, తంజావూరు,రామేశ్వరం, మధురై, కన్యాకువరి, మహాబలిపురం, కాంచీపురం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ ప్యాకేజీ రూ.6,620 చొప్పున ఉంటుంది. -
భార్యగా మారిన భర్త.. చివరకు విమానం బాత్రూమ్లో..
జకర్తా (ఇండోనేసియా): ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఆ ప్రయాణాలు కూడా అనేక ఆంక్షలతో జరుగుతున్నాయి. కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే విమాన ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. ఈ పరిణామాలతో ఓ కోవిడ్ సోకిన వ్యక్తి అధికారులను బురిడీ కొట్టించి విమాన ప్రయాణం చేశాడు. చివరకు తాను చేరుకోవాల్సిన గమ్యస్థానంలో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఇండోనేసియాలో జరగ్గా ప్రస్తుతం వైరల్గా మారింది. కోవిడ్ పాజిటివ్ సోకిన వ్యక్తి ఇండోనేసియాలోని జకర్తా నుంచి అదే దేశంలోని మరో పట్టణం టెర్నేట్కు విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే అతడికి కరోనా వైరస్ సోకింది. ఎలాగైనా విమాన ప్రయాణం చేయాలని తన భార్య పేరు మీద సిటిలింక్ విమానంలో టికెట్ బుక్ చేశాడు. అనంతరం ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎయిర్పోర్టుకు బురఖా ధరించి వచ్చాడు. తనిఖీల సమయంలో తన భార్య పాస్పోర్టు, ఇతర పత్రాలు, కార్డులు చూపించడంతో అధికారులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. పైగా బురఖా ధరించడంతో వారు మహిళగా భావించారు. అనంతరం ఆయన విమానం ఎక్కి టెర్నేట్కు చేరుకుంటున్నాడు. అయితే అతడు చేసిన చిన్న తప్పు పోలీసులకు పట్టేలా చేసింది. టేకాఫ్ అయ్యే సమయంలో అతడు బాత్రూమ్కు వెళ్లాడు. ఆ సమయంలో అతడు పురుషుల దానిలో వెళ్లాడు. వచ్చేప్పుడు బురఖా తీసి బయటకు వచ్చాడు. ఈ విషయం విమాన సిబ్బంది గ్రహించి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆయన విమానం దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయనను క్వారంటైన్కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘించడంతో అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్ వ్యక్తి ప్రయాణించడంతో ఆ విమానంలో ప్రయాణించిన వారంతా ఆందోళన చెందుతున్నారు. వారికి విమాన సిబ్బంది పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఆ దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఈ విధంగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుండడంతో కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
‘వామ్మో ఏంటా బట్టలు.. ముందు ఫ్లైట్ దిగు’
ఆడవాళ్ల వేషధారణ సొసైటీలో ఎడతెగని ఓ చర్చాంశం. అయితే తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే.. ఆమె వెస్ట్రన్ దేశాలకు వలస వెళ్లింది. అక్కడ తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఊహించని రీతిలో అక్కడా ‘చేదు’ అనుభవమే ఎదురయ్యిందంటూ కన్నీళ్లతో వాపోయింది. కానీ.. దెనిజ్ సెపినర్(26).. టర్కీ ఫిట్నెస్ మోడల్. అయితే అక్కడి సంప్రదాయలు ఆమెను ప్రొఫెషనల్లోకి అనుమతించలేదు . దీంతో అమెరికాకు వలస వెళ్లింది. ఫిట్నెస్ మోడల్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ ఎక్కిన కాసేపటికే సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అన్నాడు. ఆమె అది జోక్గా అనుకుందట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట. కావాలంటే తన టీషర్ట్తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేన’ంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో చెప్పుకుని వాపోయిందామె.‘ఆ మాట వినగానే భయమేసింది. వణికిపోయా. వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా. రాత్రంతా ఒంటరిగా ఎయిర్పోర్ట్లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా. కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్ చేసింది దెనిజ్. ట్విస్ట్ అయితే దెనిజ్ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్ ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. ‘ఫ్లైట్స్లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం మా సిబ్బంది చేసింది. కానీ, ఆమెనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిగా అలా చేయాల్సి వచ్చింద’ని అమెరికన్ ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. దీంతో ఆమెకే నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు కాసేపు ప్రైవసీ పెట్టేసిందామె. -
దారి మళ్లిన లంకేయుల విమానం.. భారత్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయానిస్తున్న ప్రత్యేక విమానం భారత్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకుని స్వదేశానికి బయల్దేరిన లంక జట్టు.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారు ప్రయానిస్తున్న విమానాన్ని ఇంధన సమస్య తలెత్తడంతో హఠాత్తుగా భారత్లో దించాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు. ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ మైక్ ఆర్థర్ వెల్లడించారు. విమానం భారత్లో ల్యాండ్ కాగానే ఫోన్ ఆన్ చేశానని, ఇంగ్లండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి తనకు కొన్ని సందేశాలు వచ్చాయని, పరిస్థితి గురించి అతను అందులో వివరించాడని మైక్ పేర్కొన్నారు. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం ఇంగ్లండ్లో పర్యటించిన లంక జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. టీ20 సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు, వన్డే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుని లంక జట్టును క్లీన్స్వీప్ చేసింది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం లంక జట్టు స్వదేశానికి బయల్దేరింది. ఈ క్రమంలోనే వారు ప్రయానిస్తున్న విమానం అనూహ్యంగా భారత్లో ల్యాండైంది. ఇదిలా ఉంటే, ఈ నెల 13 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఇటీవల ఇంగ్లండ్ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో, లంక క్రికెటర్లు కూడా ఐసోలేషన్లోని వెళ్లాల్సి వస్తుంది. దీంతో భారత్తో సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జులై 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా. -
యూఏఈకి వెళ్లే విమానాలకు డెల్టా ప్లస్ బ్రేక్
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వెళ్లే విమానాలకు కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ బ్రేక్ వేసింది. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టినా డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తుండటంతో భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై యూఏఈ నిషేధాన్ని పొడిగించింది. వాస్తవానికి జూలై 7 నుంచి భారత విమాన సర్వీసుల రాకపోకలకు యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగు చూడడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్తో పాటు మరో 13 దేశాల విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించింది. జూలై 21 వరకు విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైన నేపథ్యంలో ఏప్రిల్ 25 నుంచి మన దేశ విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం విధించింది. ఇటీవల కేసులు తగ్గడంతో భారత విమాన సర్వీసులకు ఆహ్వానం పలికింది. రెండు డోస్ల కోవిషీల్డు టీకా తీసుకోవడంతో పాటు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు పొందిన వారికి యూఏఈలో అడుగు పెట్టడానికి అనుమతి ఇవ్వనున్నట్లు జనరల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. దీంతో యూఏఈలోని వివిధ కంపెనీల్లో పని చేస్తూ సెలవులపై వచ్చిన వారు, కొత్తగా వీసాలను పొందిన వారు అక్కడకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో డెల్టా ప్లస్ మళ్లీ బ్రేక్ వేసింది. -
యూఏఈ వెళ్లే వారికి ఊరట
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉపాధి కోసం వెళ్లే కార్మికులకు శుభవార్త. జూలై 7వ తేదీ నుంచి యూఏఈకి భారత్ నుంచి విమానాలు ప్రారంభం కానున్నాయి. కరోనా తీవ్రత కారణంగా ఏప్రిల్ 25 నుంచి మన దేశ విమానాల రాకపోకలపై యూఏఈ విధించిన నిషేధం జూలై 6వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే విమానాలకు 7వ తేదీ నుంచి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో కొన్ని షరతులను విధించింది. భారత్ నుంచి యూఏఈకి వెళ్లే వలస కార్మికులు రెండు డోస్ల కోవిషీల్డు టీకా తీసుకుని ఉండాలి. అలాగే ప్రయాణానికి మూడు రోజుల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని నెగెటివ్గా నిర్ధారించిన సర్టిఫికెట్ను చూపాల్సి ఉంటుంది. ఏప్రిల్ 25కు ముందు కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా అనేక మందిని యూఏఈ కంపెనీలు సెలవులపై ఇంటికి పంపించాయి. మరి కొందరు సుదీర్ఘ విరామం తరువాత సెలవులపై ఇంటికి వచ్చారు. అలా వచ్చిన వారికి యూఏఈ కంపెనీలు పనిలో చేరాలని పిలుపునిచ్చాయి. మన దేశ విమానాలపై యూఏఈ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పాస్పోర్టు సేవలు నగర ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడి రాంగోపాల్పేట్ (హైదరాబాద్): తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేయడంతో పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా లఘు కేంద్రాల్లో పూర్తిస్థాయిల్లో సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పలు పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాల్లో ఈ నెల10 నుంచి సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. -
‘‘విమానం ల్యాండ్ చేస్తారా.. దూకేయనా’’
వాషింగ్టన్: ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన వల్ల విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. లాస్ ఏంజెల్స్ నుంచి నాష్విల్లేకు వెళ్లే విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 386 విమానం లాస్ ఏంజెల్స్ నుంచి నాష్విల్లేకు వెళ్తుంది. ఈ క్రమంలో దానిలో ఉన్న ఓ ప్రయాణికుడు సడెన్గా లేచి.. ‘‘విమానాన్ని ఆపండి.. లేదంటే నేను దూకేస్తాను’’ అంటూ.. లాక్ చేసిన కాక్పిట్ట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇతర ప్రయాణికులు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు. అతి కష్టం మీద అతడిని విమానంలో వెనక సీటులో కట్టి పడేశారు. ఆ తర్వాత విమానాన్ని న్యూమెక్సికోలోని అల్బుకెర్కీ ఇంటర్నేషనల్ సన్పోర్ట్కు మళ్లీంచారు. "విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎఫ్బీఐ, పోలీసులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తసుకున్నారు’’ అని డెల్టా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని.. దీనిపై ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోంది. అల్బుకెర్కీలోని ఎఫ్బిఐ ప్రతినిధి ఫ్రాంక్ ఫిషర్ తెలిపారు. ఈ ఘటన వల్ల ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అన్నారు. చదవండి: విమానంలో పుట్టి.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు! -
విమానంలో రోహిత్ చేసిన పనికి నిద్రపోలేదు..
లండన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, రూట్ సేనతో ఐదు టెస్ట్ సిరీస్ల కోసం టీమిండియా గురువారం యూకేలో అడుగుపెట్టింది. భారత్ నుంచి ప్రత్యేక విమానంలో పురుషుల, మహిళల జట్లు లండన్కు చేరుకున్నాయి. క్రికెటర్లంతా విమానాల్లో సందడి చేస్తుండగా తీసిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రయాణ సమయంలో ఆటగాళ్లు ఏ రకంగా గడిపారో కొందరు క్రికెటర్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ప్రయాణ విషయాలను తెలుపుతూ.. ప్రశాంతంగా నిద్రపోతుంటే రోహిత్ శర్మ తన నిద్రకు భంగం కలిగించాడని తెలిపాడు. దీంతో సరిగా నిద్ర పోలేదని చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. హోటల్కు వెళ్లడానికి రెండు గంటలు సమయం పడుతుంది. విమాన ప్రయాణంలో రెండు గంటలు మంచిగా నిద్రపోయాను. ఆ తర్వాత రోహిత్ భాయ్ వచ్చి లేపాడు. ఇక అంతే ఆ తర్వాత మళ్లీ నిద్ర రాలేదు. సరిగ్గా విమానం ల్యాండ్ అయ్యే రెండు గంటల ముందు మళ్లీ కాస్త నిద్రపోయా. నిన్న కాస్త ఎక్కువగానే రన్నింగ్ సెషన్లో పాల్గొన్నాం. దాంతో నేను చాలా అలసిపోయాను' అని సిరాజ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. 🇮🇳 ✈️ 🏴 Excitement is building up as #TeamIndia arrive in England 🙌 👌 pic.twitter.com/FIOA2hoNuJ — BCCI (@BCCI) June 4, 2021 చదవండి: బాలీవుడ్ నటితో పెళ్లి.. అప్పుడే క్లారిటీ ఇచ్చిన టీమిండియా కోచ్ -
కోవిడ్ భయం: విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు
జకార్తా: కరోనా మన జీవితాల్లో భారీ మార్పులే తెచ్చింది. వేడుకలు, సరదాలు, పండగలు, పబ్బాలు ఏవి లేవు. మూతికి మాస్క్, చేతిలో శానిటైజర్ తప్పనిసరి అయ్యాయి. ఇక బస్సు, రైలు, విమాన ప్రయాణాలు అంటేనే జనాలు దడుచుకునే పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం పరిస్థితులు మారాయి అనుకొండి. కానీ ఇప్పటికి చాలా మందిలో కరోనా భయం అలానే ఉంది. దానికి తోడు ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తోంది. అందుకే నలుగురితో కలవాలన్న.. కలిసి ప్రయాణం చేయాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ కోవకు చెందిన వాడే ఇప్పుడు మనం చేప్పుకోబేయే వ్యక్తి. కరోనా వైరస్కు భయపడి ఈ వ్యక్తి ఏకంగా విమానం మొత్తాన్ని ఇద్దరి కోసం బుక్ చేసుకున్నాడు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (చదవండి: మీ అడుగులు ఎటువైపు..) ఇండోనేషియా జకార్తాకు చెందిన రిచర్డ్ ముల్జాదీ ఇటీవల తన భార్య షల్విన్నీ ఛాంగ్తో కలిసి బాలీకి వెళ్లారు. అయితే ఇందుకోసం ఆయన లయన్ ఎయిర్ గ్రూప్నకు చెందిన బాటిక్ ఎయిర్ విమానంలోని అన్ని టికెట్లు బుక్ చేసుకున్నారు. విమానంలో ఇతర ప్రయాణికులు ఉంటే వారి నుంచి కరోనా సోకే ప్రమాదం ఉందని భావించిన రిచర్డ్.. వైరస్ నుంచి రక్షణ కోసం ఈ విధంగా విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ఈ విషయాన్ని రిచర్డ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఖాళీగా ఉన్న విమానంలో కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘విమానంలోని సీట్లన్నీ బుక్ చేసినా కూడా.. ప్రైవేట్ జెట్ కంటే తక్కువ ఖర్చే అయ్యింది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
బ్రిటన్కు విమాన సర్వీసుల పునఃప్రారంభం
శంషాబాద్: బ్రిటిష్ ఎయిర్వేస్ సర్వీసులు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ రెండో రకం వైరస్తో భారత్–బ్రిటన్ మధ్య విమాన రాకపోకలపై జనవరి 7 వరకు కేంద్రం నిషేధం విధించింది. వీటిని శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ పేర్కొం ది. అయితే ప్రయాణానికి ముందు 72 గంటల్లోపు చేయించుకున్న ఆర్ టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును కలిగి ఉండాలనే నిబంధనలను కఠినతరం చేశారు. కాగా బ్రిటన్లో స్ట్రెయిన్ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మూడో వారం వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తామని ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.(చదవండి: స్ట్రెయిన్ విజృంభణ.. దేశవ్యాప్తంగా లాక్డౌన్) -
‘బ్రిటన్’ జర్నీపై ప్రత్యేక నిఘా
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్నంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాతే బయటకు పంపాలని నిర్ణయించింది. ఇటు బ్రిటన్లో లాక్డౌన్ విధించిన నేపథ్యం లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా బ్రిటన్ నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించినా, ఇక్కడ దిగిన తర్వాత తప్పనిసరిగా పరీక్ష చేయనున్నారు. ఈ నిర్ణయం సోమవారం నుంచే అమలులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా బ్రిటన్ నుంచి ప్రతిరోజూ రెండు విమానాలు వస్తాయని అధికారులు తెలిపారు. ఒకటి నేరుగా, మరొకటి కనెక్టింగ్ ఫ్లైట్ వస్తుంది. అందులో సరాసరి 400 మంది ప్రయాణికులు వస్తుంటారు. సోమవారం నుంచి బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి బ్రిటన్కు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయా ణికులు తిరిగి టికెట్ల రద్దు కోసం బ్రిటిష్ ఎయిర్లైన్స్, తదితర సంస్థలను ఆశ్రయిస్తున్నారు. లక్షణాలుండి పాజిటివ్ అయితే టిమ్స్కు.. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశముంది. టెస్టుల్లో కరోనా లక్షణాలు ఉండి పాజిటివ్ వచ్చిన వారిని టిమ్స్ ఆసుపత్రికి తరలిస్తారు. నెగెటివ్ వచ్చినవారిని హోటల్ లేదా సర్కారు క్వారంటైన్కు తరలిస్తారు. ఆర్టీపీసీఆర్ శాంపిళ్లు తీసుకున్న తర్వాత ఫలితం వచ్చే వరకు ప్రయాణీకులు ఎక్కడుండాలో స్పష్టత లేదు. (చదవండి: కొత్త కరోనా భయంతో మళ్లీ ఆంక్షలు) తెలుగు వారిలో ఆందోళన.. లండన్ నుంచి హైదరాబాద్కు కూడా రాకపోకలు స్తంభించడంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్న తెలుగు వారు ఆందోళన చెందుతున్నారు. -
ఫుడ్ ..సారీ నో ఆర్డర్..
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ దెబ్బకు ఫ్లైట్ కేటరింగ్ సంస్థలు కుదేలయ్యాయి. ఎనిమిది నెలలుగా కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోయాయి. మరోవైపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం పడింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిరోజు సుమారు 7500 నుంచి 8 వేలకు పైగా అల్పాహారాలు, భోజనాలు, స్నాక్స్ సరఫరా చేసే స్కైచెఫ్ సంస్థ ప్రస్తుతం రోజుకు 1200 నుంచి 1300 మీల్స్ మాత్రమే అందజేస్తోంది. ప్రస్తుతం స్పైస్జెట్, ఎయిర్ ఇండియా, విస్తారా, బ్రిటిష్ ఎయిర్లైన్స్కు చెందిన 12 విమానాలకు మాత్రమే ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన స్కైచెఫ్ గతంలో అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్కు ఆయా దేశాలకు చెందిన ఆహార పదార్థాలు, స్నాక్స్ అందజేసేది. జర్మనీకి చెందిన ఎల్ఎస్జీ సంస్థ కూడా హైదరాబాద్ కేంద్రంగా పలు జాతీయ, అంతర్జాతీయ ఎయిర్లైన్స్కు కేటరింగ్ సదుపాయాలను అందజేసింది. కానీ ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్కు మాత్రమే ఈ సదుపాయాన్ని కొనసాగిస్తోంది. పడిపోయిన ఆర్డర్లు.. కేటరింగ్ సంస్థలకు ఎయిర్లైన్స్ నుంచి వచ్చే ఆర్డర్లు కోవిడ్ కారణంగా 75 శాతం వరకు పడిపోయాయి. కోవిడ్కు ముందు ప్రతి రోజు సుమారు రూ.2 కోట్ల చొప్పున ఆర్జించిన స్కైచెఫ్ ప్రస్తుతం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకే పరిమితమైంది. ప్రయాణికులకే కాకుండా ఎయిర్లైన్స్ క్రూ సిబ్బందికి, పైలెట్లకు కూడా ఈ సంస్థ ఎవరికి కావాల్సిన ఆహార పదార్థాలను వారికి విడివిడిగా అందజేస్తోంది. ప్రస్తుతం వందేభారత్, ఎయిర్ బబుల్స్ ఒప్పందంలో భాగంగా లండన్తో పాటు మరికొన్ని సౌదీ అరేబియా దేశాలకు మాత్రమే విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి మరో 40 నగరాలకు డొమెస్టిక్ విమానాలు తిరుగుతున్నాయి. గతంలో ప్రతి రోజు 55000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా ప్రస్తుతం ఆ సంఖ్య 2వేల నుంచి 22వేలకు పరిమితమైంది. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా తక్కువే. మరోవైపు కోవిడ్ దృష్ట్యా చాలా మంది ప్రయాణికులు ఇంటి వద్దే తయారు చేసిన ఆహార పదార్థాలను వెంట తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం కోవిడ్ దృష్ట్యా కేటరింగ్ సంస్థల ఆహార పదార్థాలకు ఆదరణ తగ్గినప్పటికీ సాధారణంగా అయితే ప్రయాణికులు ఎక్కువగా హైదరాబాద్ బిర్యానీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత మసాలా దోశ, వడ, ఊతప్పం, టోమాటో ఉప్మా వంటి దేశీయ అల్ఫాహారాలు, ముస్లీ, పాన్కేక్, చికెన్ బ్రస్ట్, పాస్తా, చీజ్, లాంబ్ రోస్టెడ్, వెజ్పఫ్ వంటి అంతర్జాతీయ వంటకాలున్నాయి. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం.. కోవిడ్ దృష్ట్యా అప్రమత్తంగా ఉన్నాయి. విమానాల్లోకి ఆహార పదార్థాలను చేరవేసే హై లోడర్లు, ట్రక్కులతో పాటు డిషెష్ సహా అన్నీ శానిటైజ్ చేస్తున్నాం. వంటపాత్రలు ప్రతిరోజు స్టెరిలైజ్ చేస్తున్నాం. ఉష్ణోగ్రతలు కచి్చతంగా పాటిస్తున్నాం. సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం,. – అరుణ్, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, స్కై చెఫ్ -
విమానంలో పుట్టి.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు!
న్యూఢిల్లీ : విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఓ గర్భిణీ మార్గమధ్యంలో ప్రసవించింది. తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు ఇండిగో విమాన సంస్థ పేర్కొంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన 6 ఈ 122(6E 122 ) అనే విమానంలో ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని, తమ సిబ్బంది ఆమెకు తోడుగా నిలిచారని ఇండిగో సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే రాత్రి 7.30 గంటలకు బెంగళూరులో విమానం ల్యాండ్ అయిన వెంటనే తల్లీ బిడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు ఇండిగో పేర్కొంది. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్పోర్టులో తల్లీబిడ్డలకు గొప్ప స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇండిగో సిబ్బంది తల్లీబిడ్డలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్ఫాంలల్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలానే పుట్టిన బిడ్డకు ఇండిగో సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విమానంలో పుట్టాడు కాబట్టి అతనికి జీవితాంతం ఫ్లైట్ టికెట్ ఉచితంగా అందినట్లు సమాచారం. అయితే దీనిపై ఇండిగో సంస్థ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. A baby boy was born in an IndiGo Delhi- Bangalore flight Both mother & child are doing fine #aviation pic.twitter.com/9hlCh0f9zy — Arindam Majumder (@ari_maj) October 7, 2020 -
టేకాఫ్లు లేవు.. వందేభారత్ ల్యాండింగ్లే
సాక్షి, అమరావతి బ్యూరో/గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికీ కోవిడ్–19 సెగ తగిలింది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి ఎయిర్ పోర్టుకు వచ్చే విమానాలతోపాటు, ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో ఈ విమానాశ్రయం నుంచి నెలకు దాదాపు లక్ష మంది వరకు స్వదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కరోనా విజృంభణతో ఆ సంఖ్య నెలకు సగటున 12 వేలకు (12 శాతానికి) మించి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఈ విమానాశ్రయం నుంచి 3,659 దేశీయ విమాన సర్వీసుల ద్వారా 2,38,537 మంది రాకపోకలు సాగించారు. ఏప్రిల్ నెలంతా కోవిడ్తో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మే నెల నుంచి విమాన సర్వీసులను పాక్షికంగా అనుమతించగా.. జూలై నెలాఖరు వరకు 473 విమానాల ద్వారా 34,433 మంది మాత్రమే ప్రయాణించారు. కువైట్ నుంచి వచ్చినవే ఎక్కువ.. ► కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం ‘వందేభారత్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ► ఇందులో భాగంగా మే నుంచి ఆగస్టు వరకు వివిధ దేశాల నుంచి 117 అంతర్జాతీయ విమానాల్లో విజయవాడ ఎయిర్ పోర్టుకు 16,862 మంది వచ్చారు. ► వీటిలో సగానికి పైగా అంటే 64 విమానాలు కువైట్ నుంచి వచ్చినవే. ఆ తర్వాత స్థానాల్లో దుబాయ్ (17), మస్కట్ (7) దేశాలున్నాయి. కార్గో విమానాలదీ అదే దారి.. ► 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ విమానాశ్రయం నుంచి 2,129 టన్నుల సరుకు (కార్గో) రవాణా జరిగింది. ► ఈ ఏడాది మే నుంచి ఆగస్టు వరకు 656.61 టన్నులను మాత్రమే రవాణా చేయగలిగారు. కార్గో రవాణా కూడా అధికంగా పాసింజర్ విమానాల్లోనే జరుగుతోంది. -
విజయవాడకు రోజూ విమాన సర్వీసులు
సాక్షి కడప : కడప ఎయిర్ పోర్టు నుంచి తిరిగే విమాన ప్రయాణ రోజులలో మార్పులు చేశారు. ఎప్పటికప్పుడు సీజన్ల వారీగా అధికారులు మార్పులు చేర్పులు చేస్తుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలపాటు విమానాలు నిలిపివేశాక మే 25 నుంచి పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు రోజుల వారీగా విమానాలు తిరుగుతున్నాయి., ప్రస్తుతానికి అధికారులు కొంత మార్పులు, చేర్పులు చేశారు. గతంలో మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం హైదరాబాదు–కడప మధ్య సర్వీసు నడుస్తుండగా....ఇప్పుడు సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ప్రయాణం చేసేలా మార్చారు. చెన్నైకి గతంలో సోమ, బుధ, గురువారాల్లో నడుస్తుండగా మార్పులు, చేర్పులు చేసి మంగళ, గురు, శనివారాల్లో తిరిగేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ షెడ్యూల్ ఈనెల 14నుంచి అమలులోకి వచ్చి 31 వరకు అమలు చేయనున్నారు. తర్వాత విమాన షెడ్యూల్ను ఇదేవిధంగా నడపవచ్చు లేదా మార్పులు, చేర్పులు చేసే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకుంటారు. -
‘కరోనా ఎక్కడైనా ఉండొచ్చు’
జెనీవా: ప్రస్తుత తరుణంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనకునే వారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని.. తమకు తప్పక సమాచారం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కోరింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రేలియా వంటి దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై కొత్తగా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ సూచనలు చేసింది. ‘కరోనా వైరస్ ఎక్కడైనా ఉంటుంది.. ప్రతి చోటా ఉంది. ప్రయాణాలు చేయాలనుకునే వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. ప్రజలు దీనిని చాలా సీరియస్గా తీసుకోవాలి’ అని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ కోరారు. ‘కరోనా నియంత్రణ కోసం పలు దేశాలు ఇప్పటికే ఒక సారి లాక్డౌన్ను అమలు చేశాయి. కొన్ని దేశాలు మరో సారి లాక్డౌన్ అమలు గురించి ఆలోచిస్తున్నాయి. ప్రజలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాల గురించి నిర్ణయం తీసుకోవాలి’ అన్నారు మార్గరెట్. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా, హంగ్కాంగ్ దేశాలు మరో సారి లాక్డౌన్ విధించాయి. మంగళవారం ఆస్ట్రేలియాలోని రెండవ అతిపెద్ద నగరం మెల్బోర్న్లో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. అత్యవసరమైన వ్యాపారాలకు మాత్రమే అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ సూచనలు చేసింది.(కోవిడ్-19 : ఇలా కూడా వ్యాపిస్తుంది!) అంతేకాక గతంలో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం డబ్ల్యూహెచ్ఓ పలు మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడంతో, కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదంటూ పలు సూచనలు చేసింది. అంతేకాక ప్రస్తుతం ప్రయాణం చేయాలనుకునే వారు సామాజిక దూరాన్ని పాటించడమే కాక తప్పనిసరిగా మాస్క్ ధరించాలని మార్గరెట్ సూచించారు. వీటితో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. -
19 విమానాలు.. 1,600 మంది ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా 2 నెలలుగా నిలిచిన దేశీయ విమానాల రాకపోకలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పలువురు ఉన్నతాధికారులతో కలసి సందర్శించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికుల లగేజీతో పాటు ట్రాలీ వాహనాలను కూడా పూర్తిగా శానిటైజ్ చేసేందుకు ప్రత్యేక టన్నెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి హైదరాబాద్కు, నగరం నుంచి దేశంలోని ఇతర నగరాలకు 19 విమానాలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షిం చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిబంధనల మేరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా సెన్సర్లు ఏర్పాటు చేశామన్నారు. విదేశీ విమానాల టెర్మినళ్లను కూడా సీఎస్ సందర్శించారు. ఎయిర్పోర్టు అథారిటీ సూచించే సూచనలు, సలహాలు పాటించాలన్నారు. ఆరోగ్య సేతు ఉంటేనే అనుమతి రక్షణ, ఆరోగ్యం పరంగా శంషాబాద్ విమానాశ్రయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆరోగ్య సేతు యాప్ ఉన్న వారినే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. తొలి రోజు సుమారు 1,600 మంది శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించగా, ప్రయాణికులు లేని విమానాలను రద్దు చేస్తున్నారు. విమానాశ్రయంలో ప్రవేశించింది మొదలు విమానంలోకి వెళ్లేంత వరకు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం నుంచి విమానాలు, ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టును సందర్శించిన వారిలో సీఎస్తో పాటు జీఏడీ కార్యదర్శి వికాస్ రాజ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఉన్నారు. భారీగా రద్దయిన విమానాలు దేశీయ సర్వీసులు ప్రారంభమైన తొలిరోజే భారీగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి తొలి విమానం ఉదయం 8.06 గంటలకు ట్రూజెట్ 2టీ 623 కేవలం 12 మంది ప్రయాణికులతో ఇక్కడి నుంచి కర్నాటకలోని విద్యానగర్కు బయల్దేరింది. అలాగే బెంగళూరు నుంచి బయల్దేరిన ఎయిర్ ఏషియాకు చెందిన 1576 విమానం 104 మంది ప్రయాణికులతో ఉదయం 8.20 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండైంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వీసులు రద్దు చేయడంతో ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబ్ల చార్జీలు పెట్టుకుని ఎయిర్పోర్టు వరకు వచ్చాక చెప్పడమేంటని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సర్వీసులు పూర్తిగా రద్దు కాగా.. పలు ముంబై, ఢిల్లీ సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతోనే పలు ఎయిర్లైన్స్లు తమ సర్వీసులను రద్దు చేసినట్లు సమాచారం. స్వీయ రక్షణ.. విమానంలో భౌతిక దూరం లేదేమోనని ప్రయాణికులు కొందరు స్వీయరక్షణ చర్యల్లో భాగంగా ప్రత్యేక సూట్లను ధరించి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు డిపార్చర్ ప్రవేశమార్గాల్లోనే వీరికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు కెమెరా స్కానింగ్ ద్వారానే పత్రాలను పరిశీలించి లోపలికి పంపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులకు సైతం ఎయిర్పోర్టు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి పంపారు. -
స్పెషల్ కేటగిరీ.. ఒంటరిగా విహాన్
బెంగళూరు : కరోనా లాక్డౌన్తో పలువురు తమ కుటుంబాలకు దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. నేటి నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో.. చాలా మంది తమ కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐదేళ్ల బాలుడు ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఒంటరిగా ప్రయాణించి తన తల్లిని కలుసుకున్నాడు. దాదాపు మూడు నెలల తర్వాత తన కొడుకును చూశానని ఆ బాలుడి తల్లి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ల విహాన్ శర్మ రెండు నెలల కిత్రం ఢిల్లీలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో విహాన్ అక్కడే ఉండిపోయాడు. అయితే సోమవారం నుంచి విమాన రాకపోకలు మొదలుకావడంతో.. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి బెంగళూరు చేరుకున్నాడు. విహాన్ కోసం అతని తల్లి ఉదయం నుంచే కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో ఎదురుచూశారు. కొడుకు రావడంతో అతన్ని దగ్గరికి తీసుకుని మురిసిపోయారు. ఇందుకు సంబంధించి విహాన్ తల్లి మాట్లాడుతూ.. తొలి ఫ్లైట్లోనే విహాన్ను రప్పించేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు. ఢిల్లీలోని తమ బంధువులు విహాన్ ఫ్లైట్ ఎక్కించగా.. స్పెషల్ కేటగిరీ కింద విహాన్ ఫ్లైట్లో ప్రయాణించాడని తెలిపారు. అయితే విమానంలో ప్రయాణించేటప్పుడు ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌస్లు ధరించిన విహాన్.. కరోనా నిబంధనలు పాటించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. -
విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు విడుదల
-
విమాన ప్రయాణం.. మార్గదర్శకాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణికుల రాకపోకలకు ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో కేంద్రం సూచనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించింది. డొమెస్టిక్ విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విమాన ప్రయాణికులు స్పందన వెబ్సైట్లో సమాచారం పొందుపరచాలని, స్పందనలో ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే ఎయిర్లైన్స్ టికెట్లను అమ్మాలని ప్రభుత్వం తెలిపింది. లక్షణాలున్న వారిని పరీక్షించి 7 రోజులు క్వారంటైన్లో ఉంచాలని, ఆ తర్వాత నెగిటివ్ వస్తే మరో 7 రోజులు హోంక్వారంటైన్కు పంపాలని ఆదేశించింది. హైరిస్క్ ప్రాంతాలైన చెన్నై, ముంబై, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చేవారిని క్వారంటైన్ సెంటర్లకు పంపాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.ఇతర ప్రాంతాల నుంచి వస్తే 14 రోజులు హోం క్వారంటైన్కు పంపాలని ప్రభుత్వం పేర్కొంది. -
కొన్ని చోట్ల ఎక్కువ కేసులు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయనీ, ఈ దశలో వైరస్ సామాజిక వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం కీలకమని కేంద్రం పేర్కొంది. దేశంలో 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో 4,213కు చేరుకోవడంపై ఈ మేరకు స్పందించింది. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడారు. ‘దేశంలోని కొన్ని క్లస్టర్లతోపాటు, కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. వీటిని సమర్థంగా కట్టడి చేయకుంటే వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది’అని తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ ప్రభుత్వం మత ప్రాతిపదికన కరోనా హాట్స్పాట్లను గుర్తించే ప్రయత్నం చేస్తోందంటూ వస్తున్న వార్తలును కొట్టిపారేశారు. దేశీయంగా రూపొందించిన ఎలిసా టెస్ట్ కిట్ 97 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని అగర్వాల్ స్పష్టం చేశారు. విమాన ప్రయాణికులకూ ఆరోగ్యసేతు విమాన ప్రయాణికులు కూడా తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసే యోచనలో కేంద్రం ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ యాప్ లేని ప్రయాణికులను విమానంలోకి అనుమతించబోరని చెప్పారు. పౌర విమాన యాన శాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా, కరోనా కేసులు అత్యధికంగా ఉన్న నగరాల్లో రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్(గుజరాత్)లో వ్యాప్తి కట్టడికి చెల్లింపులను కరెన్సీ నోట్ల రూపంలో కాకుండా డిజిటల్ ద్వారానే జరపాలని నిర్ణయించారు. -
విమాన ప్రయాణాల్లో భారీ మార్పులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ను నిలువరించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అమలు చేస్తున్న లాక్డౌన్ను ఎత్తివేశాక రవాణా రంగంలో ముఖ్యంగా, విమానయాన రంగంలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కరోనా వైరస్ వెలుగులోకి రాకముందు లక్షిత విమాన ప్రయాణానికి రెండు నుంచి నాలుగు గంటల ముందు విమానాశ్రయాలకు వెళ్లాల్సి వచ్చేంది. ఇక లాక్డౌన్ ఎత్తివేశాక కనీసం 12 గంటల ముందు విమానాశ్రయాలకు చేరుకోవాల్సి ఉంటుంది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతం ప్రయాణికులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వచ్చిన తర్వాతనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఆ విమానాశ్రయంలో కరోనా పరీక్షల ఫలితాలు రావడానికి 12 గంటలు కనీసంగా పడుతున్నట్లు తెల్సింది. ఎమిరేట్స్, దుబాయ్ విమానాశ్రయాలు కూడా ఇలాంటి వైద్య పరీక్షలనే నిర్వహిస్తున్నాయి. అంటు వ్యాధులు ఉన్నాయో, లేదో తెలుసుకునేందుకు విమాన ప్రయాణానికి 72 గంటలకు ముందు జారీ చేసిన వైద్య సర్టిఫికెట్లు అడిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బీమా సర్టిఫికెట్లను అడిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే, థాయ్లాండ్ ఇప్పటికే కరోనా బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. విమానాశ్రయాల్లో శానిటైజ్ చేసే టన్నెళ్లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయవచ్చు. పాస్పోర్టులు, ల్యాప్టాప్లను తనిఖీ చేయడానికి మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావచ్చు. ఏది ఏమైనా రెండేళ్ల వరకు ప్రతి ప్రయాణికుడు ముఖానికి మాస్క్ను ధరించడంతోపాటు రెండు మీటర్లు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విమానంలో మూడు సీట్ల వరుసలకు బదులు రెండు సీట్ల వరుసలే కనిపించే అవకాశం ఉంది. (తెరచుకున్న షాపులు.. ఇదంతా ప్రహసనం!) కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 64 శాతం విమాన సర్వీసులను రద్దు చేశారు. అంటే దాదాపు 17వేల విమానాల సర్వీసులు రద్దయ్యాయి. ఈ కారణంగా ఈ రంగానికి ఈ ఏడాది 250 బిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ‘ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్’ తెలియజేసింది. అలాగే రెండున్నర కోట్ల మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఫలితంగా చార్జీలు పెరగుతాయి. విమానయాన సర్వీసుల సంఖ్య తగ్గుతుంది. ప్రయాణికులు వీలున్న చోట విమానాలకు బదులుగా రైళ్లను ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. (వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?) -
ఇక ‘స్మార్ట్ లాక్డౌన్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలాన్ని పొడిగించడం ఖాయమేనని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) దేశాన్ని ఉద్దేశించి చేయనున్న ప్రసంగంలో ఏయే అంశాలను ప్రస్తావించనున్నారు? లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండబోతోందా? గత మూడువారాలుగా కొనసాగిన విధంగా కఠినంగానే ఉండబోతోందా? ఆంక్షల సడలింపుపై ఏవైనా నిర్ణయాలుంటాయా? ఉంటే.. ఎలాంటి మినహాయింపులుంటాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నాయి. మూడు వారాల లాక్డౌన్తో ఇప్పటికే కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ.. మరో రెండు వారాల పాటు నిర్బంధం ఇలాగే కొనసాగితే ఏ స్థాయికి పడిపోతుందోనని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ లాక్డౌన్ కాకుండా.. ఆర్థికాభివృద్ధికి వీలు కల్పించే ‘స్మార్ట్ లాక్డౌన్’ను ప్రధాని ప్రతిపాదించే అవకాశముందని తెలుస్తోంది. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లోనూ.. ప్రాణాలు కాపాడటంతో పాటు దేశæ ఆర్థికాభివృద్ధి పైనా(జాన్ భీ.. జహాః భీ) దృష్టి పెట్టాల్సి ఉందని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. మద్యం అమ్మకాలకు ఒత్తిడి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చాలామంది ముఖ్యమంత్రులు మద్యం అమ్మకాల విషయం ప్రస్తావించారు. ఖజానాకు అత్యంత కీలకమైన ఆదాయ వనరు అయిన మద్యం అమ్మకాలపై ఆంక్షల సడలింపును వారు కోరారు. బార్లు, రెస్టారెంట్లకు అనుమతివ్వకుండా.. పాక్షికంగా, రోజులో కొన్ని గంటల పాటు అయినా మద్యం అమ్మకాలకు వీలు కల్పించాలన్నారు(దీనిపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి). దాంతో, రాష్ట్రాలు కోరితే.. ఆంక్షల సడలింపులో భాగంగా.. మద్యం అమ్మకాలను పాక్షికంగా అనుమతించే అవకాశం ఉంది. ► స్వల్ప స్థాయిలో దేశీయ విమాన, రైల్వే, మెట్రోరైల్ సర్వీసులను అనుమతించే అవకాశం ఉంది. అయితే, 30 శాతం టికెట్లను మాత్రమే విక్రయించేలా ఆంక్షలు పెట్టే అవకాశముంది. ► కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. అంతర్రాష్ట్ర ప్రయాణాలను పలువురు సీఎంలు గట్టిగా వ్యతిరేకించారు. -
కరోనా భయం, ప్లాస్టిక్ అవుట్ ఫిట్తో..
మెల్బోర్న్ : ప్రసుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్లో మొదలైన కరోనా వైరస్ మెల్లిగా కొరియా, యూరప్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కూడా పాకింది. కరోనా ప్రభావంతో ఇప్పటివరకు దాదాపు 2300 పైగా మృతి చెందగా, 75వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కరోనా బారీ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఏదో విధంగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. కొందరు జంతు వేషధారణలో, మరికొందరు శరీరం పూర్తిగా కప్పివేసేలా దుస్తులను ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఆస్ట్రేలియాలో ఒక విమానంలో ప్రయాణించిన ఇద్దరు మాత్రం కరోనా బారీ నుంచి తప్పించుకునేందుకు చేసిన పని ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.(కోవిడ్-19 : కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు!) ఆ వీడియోలో ఇద్దరు తమ శరీరాలను పూర్తిగా ప్లాస్టిక్ అవుట్ఫిట్తో కప్పివేసుకున్నారు. అందులో ఒక మహిళ పింక్ కలర్లో ఉన్న ప్లాస్టిక్ అవుట్ ఫిట్ను ధరించి నిద్రపోతుండగా, మరొక వ్యక్తి వైట్ కలర్ అవుట్ఫిట్ను ధరించి విమానంలోని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ వారు వేసుకున్న అవుట్ ఫిట్లకు చిన్నపాటి రంధ్రం కూడా లేకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. కరోనా వైరస్ రాకుండా వారు తీసుకున్ననిర్ణయం మంచిదే.. కానీ మరి ఊపిరి తీసుకోవడానికే ఇబ్బందిగా ఉన్న ప్లాస్టిక్ అవుట్ ఫిట్లను ధరిస్తే అసలుకే మోసం వస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 15 కోవిడ్-19 కేసులను గుర్తించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. (తగ్గుతున్న కోవిడ్ కేసులు) Currently behind me on the plane. When you super scared of #coronavirus #COVID2019 pic.twitter.com/iOz1RsNSG1 — alyssa (@Alyss423) February 19, 2020 -
'లక్ష'ణంగా గగనయానం
సాక్షి కడప : ఒకప్పుడు విమానయానమంటే సంపన్నులకే సాధ్యం. నేడు మధ్యతరగతి వారు కూడా విమాన ప్రయాణం బాట పడుతున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేరుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్న నగరాలను కలుపుతూ ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ప్రారంభించిన ఉడాన్ పథకం కూడా విమాన ప్రయాణికుల సంఖ్య పెంచింది. తక్కువ మొత్తానికే గమ్యం చేర్చే సర్వీసులను ప్రారంభించడంతో విమానాశ్రయాలు కొత్త శోభ సంతరించుకున్నాయి. రీజినల్ కనెక్టివిటీ స్కీం ద్వారా ఇప్పుడు కడప నుంచి ప్రధాన నగరాలకు విమాన సర్వీసులుండటంతో అన్ని ప్రాంతాలకు జిల్లా ప్రజలు విమానాలలో ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, విజయవాడ లాంటి ప్రధాన నగరాలకు సర్వీసులను నడుపుతుండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంపూర్తి కాకమునుపే ప్రయాణికుల సంఖ్య మరో మూడు, నాలుగు రోజుల్లో లక్ష చేరుకోనుండటమే ఇందుకు నిదర్శనం. ఉడాన్ పథకంతో సామాన్యునికి.. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని అమలులోకి తీసుకు రావడంతో మధ్య తరగతి వర్గాల వారు కూడా విమానయానానికి మొగ్గు చూపుతున్నారు. రెండో ముంబయిగా పేరొందిన ప్రొద్దుటూరు నుంచి బంగారు, ఇతర వ్యాపారాల నిమిత్తం రోజూ వ్యాపార వర్గాలు ప్రయాణాలు సాగిస్తుంటారు. కడప నుంచి విజయవాడ, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఉడాన్ పథకం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ విమానాలు తిరుగుతున్నాయి. ఈ స్కీమ్ ద్వారా విమానంలో సీటింగ్ కెపాసిటీకి సంబంధించి ప్రయాణీకులు లేకపోయినా.... కేంద్ర ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుంది. విమాన సంస్థలపై భారం పడకుండా కేంద్రం ఉడాన్ స్కీమ్ ద్వారా భరిస్తుండడంతోపాటు సామాన్యులకు కూడా టిక్కెట్ధరలు అందుబాటులో ఉండేలా చూసుకుంటోంది. ‘సీమ’కు కేంద్రంగా కడప ఎయిర్పోర్టు జిల్లా కేంద్రమైన కడపలోని ఎయిర్పోర్టు రాయలసీమ జిల్లాలకు కేంద్రంగా ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, ఇతర వ్యాపారవేత్తలు, అత్యవసర పనుల నిమిత్తం వెళ్లేవారు కడప ఎయిర్పోర్టుకు వచ్చి విమానంలో రాకపోకలు సాగిస్తున్నారు. చిత్తూరుజిల్లాకు సంబంధించి రేణిగుంటలో ఎయిర్పోర్టు ఉండడంతో ఆ జిల్లా వారు అక్కడి నుంచే విమానయానం సాగిస్తుండగా, మిగిలిన మూడు జిల్లాలకు సంబంధించిన చాలామంది కడప ఎయిర్పోర్టు నుంచి హైదరాబాదు, విజయవాడ, చెన్నై నగరాలకు విమానయానం చేస్తున్నారు. 2017లో 40,491 మందికి పైగా ప్రయాణించారు. 2018లో 1,12,548 మంది గమ్యస్థానాలకు చేరారు. సుమారు 40రోజుల్లో ముగియనున్న ఈ ఆర్ధిక సంవత్సరంలో 96,500 మంది రాకపోకలు సాగించారు. మార్చి నెలాఖరులోగా మరికొన్ని వేల మంది ప్రయాణం సాగించేందుకు అవకాశం ఉండటంతో సంఖ్య లక్షకు చేరడం నిస్సందేహం. వీఐపీల రాకతో కళకళ 2017 ఏప్రిల్లో ప్రారంభమైన విమాన సర్వీస్లకు రోజుకురోజుకూ ఆదరణ పెరుగుతోంది. అంతకుమునుపు బస్సులు, ప్రత్యేక వాహనాలు, రైళ్లకే పరిమితమయ్యేవారు. జిల్లా వాసులు చదువు, ఉపాధి, పర్యాటక ప్రాంతాల సందర్శనతోపాటు వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారికి కడప ఎయిర్పోర్టు నుంచి విమానం ద్వారా ప్రయాణించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మన జిల్లాకు చెందిన వారు కావడంతోపాటు కడప నుంచి తిరిగే విమానాలకు డిమాండ్ ఏర్పడింది. వీఐపీల తాకిడితో ఎయిర్పోర్టు కళకళలాడుతోంది. లక్ష మంది ప్రయాణించడం ఆనందంగా ఉంది కడప నుంచి రోజూ హైదరాబాదు, విజయవాడ, చెన్నైలకు మూడు సర్వీసులు నడుస్తున్నాయి. మార్చి 1 నుంచి మరో సర్వీసు బెల్గాంకు ప్రారంభం కానుంది. కడప నుంచి ఇతర నగరాలకు విమానంలో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. రానున్న కాలంలో నైట్ ల్యాండింగ్ కూడా వస్తే ఎయిర్పోర్టు మరింత అభివృద్ధిచెందుతుంది. ఇప్పటికే ఎయిర్పోర్టును పూర్తి స్థాయిలో అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాం. – పూసర్ల శివప్రసాద్, ఎయిర్పోర్టు డైరెక్టర్, కడప -
'ఇలాంటి వారిని విమానం ఎందుకు ఎక్కనిస్తారో'
-
'ఇలాంటి వారిని విమానం ఎందుకు ఎక్కనిస్తారో'
మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది ప్రయాణికులు వారి చేష్టలతో విసుగు తెప్పింస్తుంటారు. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా చికాకు కలగడం సహజం. తాజాగా అమెరికన్ ఎయిర్ప్లైట్లో ఒక వ్యక్తి తన చేష్టలతో ముందు సీటులో కూర్చున్న మహిళకు ఇబ్బంది కలిగించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 1.45 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఒక వ్యక్తి మహిళ కూర్చున్న ముందు సీటును అదేపనిగా తన చేతులతో పంచ్లు కొడుతూ చికాకు కలిగించాడు. అయితే మహిళ మాత్రం అతని చేష్టలతో ఏమాత్రం విసుగు చెందకుండా కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసినా అతన్ని ఏమనకుండా అలాగే మిన్నకుండిపోయింది. అయితే ఇదంతా మహిళ పక్కనే కూర్చున్న అమైకా అలీ అనే యువతి వీడియో తీసి తన ట్విటర్లో షేర్ చేసింది. 'అతని చేష్టలు చిన్నపిల్లాడిని గుర్తుచేస్తున్నాయి. వేరేవాళ్ల సంగతేమో కానీ నాకు మాత్రం అతని చేసిన పని న్యూసెన్స్గా అనిపించింది. అయితే నా పక్కనున్న మహిళ మాత్రం అతన్ని ఏమనకుండా అలాగే ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉంది' అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..'ఇలాంటి వారిని ఫ్లైట్ ఎందుకు ఎక్కనిస్తారు... అతని చేష్టలు చిన్నపిల్లాడిని తీరును తలపిస్తుంది... ఆ వ్యక్తి అంతగా చికాకు పెడుతున్నా మహిళ ఏమనకపోవడం ఆమె నిబద్ధతకు నిదర్శనం' అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. A little concerned that @AmericanAir didn’t feel this was a problem. Not sure about the rest of you, but I would surely consider someone continually tapping on the back of my seat to be a nuisance. https://t.co/DmRKUpA36O pic.twitter.com/Xts7hfQAcw — Amica Ali 💙 (@AmicaAli) February 8, 2020 -
విమానంలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
కోల్కత్తా : విమానంలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. థాయ్లాండ్కు చెందిన మహిళ(23) నిండు గర్బిని. అయినప్పటికీ ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం క్యూఆర్ 830లో దోహా నుంచి బ్యాంకాక్కు ప్రయాణం చేస్తోంది. కాగా తెల్లవారు జామున 3 గంటలకు మహిళకు పురిటి నొప్పులు మొదలవ్వడంతో క్యాబిన్ సిబ్బంది సహాయంతో మహిళ ప్రసవించింది. అనంతరం అత్యవసర ల్యాండింగ్ కింద కోల్కత్తాలో విమానం ల్యాండింగ్ చేయడానికి పైలట్ అధికారుల అనుమతి కోరారు. దీనికి కోల్కత్తా ఏటీసీ ఒప్పుకోవడంతో కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండింగ్ చేశారు. అక్కడి నుంచి మహిళను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. -
శరీరంలో బాంబు ఉందంటూ ఓ యువతి..
కోల్కతా : ఓ యువతి చేసిన నిర్వాకానికి కోల్ కతా ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఏషియన్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సివచ్చింది. తన శరీరంలో బాంబు ఉందని, దానిని ఏ క్షణంలోనైనా పేల్చేస్తానని బెదిరించడంతో కంగుతిన్న ఫైలెట్.. విమానాన్ని కోల్కతాఎయిర్ పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మోహిని మొండల్ (25) శనివారం రాత్రి 9.57 గంటలకు ఎయిర్ ఏషియన్ విమానంలో కోల్కతా నుంచి ముంబై బయలు దేరింది. మార్గమద్యలో తన కేబిన్ సిబ్బందికి ఒక లెటర్ ఇచ్చి అది ఫ్లైట్ కెప్టెన్కు అందివాల్సిందిగా కోరింది. తన శరీరం చుట్టూ బాంబులు ఉన్నాయని, వాటిని ఏ క్షణమైనా పేల్చేస్తానని లేఖలో హెచ్చరించింది. దీంతో కంగుతిన్న పైలట్..అధికారులకు సమాచారం అందించి కోల్కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం మోహిని మెండల్ను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శనివారం రాత్రి 11.46 గంటలకు తిరిగి పంపించారు. కాగా, మోహిని శరీరంలో బాంబు లేదని, ఆమె ఎందుకు అలా బెదిరించిందో విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు. -
టేకాఫ్.. మహాస్పీడ్
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులు క్షణాల్లో రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నారు. హైదరాబాద్ నుంచి అనేక జాతీయ, అంతర్జాతీయ నగరాలకు పెరిగిన విమాన సదుపాయాలతో ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దక్షిణ భారతానికి ప్రధాన ముఖద్వారంగా ఉన్న హైదరాబాద్ నుంచి 55 ప్రధాన నగరాలకు నేరుగా ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది. మరోవైపు పలు ఎయిర్లైన్స్ సంస్థలుచార్జీలపైన ఇస్తున్న రాయితీలు, ఆఫర్లు కూడా ప్రోత్సహిస్తున్నాయి. తరచుగా ఫ్లైట్ చార్జీలు రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ చార్జీలతో సమానంగా ఉంటున్నాయి. దీంతో గంటలతరబడి రైళ్లలో ప్రయాణించడానికి బదులు నగరవాసులు ఫ్లైట్ జర్నీనే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏడాది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 2.13 కోట్ల మంది పయనించగా వారిలో 1.74 కోట్ల మంది డొమెస్టిక్ ప్రయాణికులు. మరో 39 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. గతేడాదితో పోల్చుకుంటే జాతీయ ప్రయాణికుల పెంపుదల 10 శాతం వరకు నమోదు కాగా, అంతర్జాతీయ ప్రయాణికుల పెంపుదల 9 శాతంవరకు నమోదైనట్లు జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు దిల్లీ, ముంబయి, బెంగళూర్, కోల్కత్తా, చెన్నై నగరాలకు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్లలో కనీసం 12 గంటల నుంచి 16 గంటల పాటు ప్రయాణం చేస్తే తప్ప చేరుకోలేని నగరాలు ఇప్పుడు ఫ్లైట్లో కేవలం గంట నుంచి 2 గంటల వ్యవధికి తగ్గడం, నగరవాసుల్లో పెరిగిన కొనుగోలు శక్తి ఇందుకు కారణం. హైదరాబాద్ నుంచి శబరికి వెళ్తున్న అయ్యప్ప భక్తులు ఇప్పుడు ట్రైన్ జర్నీ కంటే ఫ్లైట్ జర్నీ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది కొత్తగా గోరఖ్పూర్, గ్వాలియర్, బెల్గాం, మైసూర్, నాసిక్, తిరుచిరాపల్లి తదితర నగరాలకు ఫ్లైట్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ప్రధాన అంతర్జాతీయ నగరాలకు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఉండడంవల్ల ఏటేటా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, థాయ్లాండ్కు ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు. 71 నగరాలు, 25 ఎయిర్లైన్స్... రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో 8 డొమెస్టిక్, 21 ఇంటర్నేషనల్ నగరాలతో ప్రారంభమైన సేవలు ఇప్పుడు 71 నగరాలకు విస్తరించాయి. 25 ఎయిర్లైన్స్ విమాన సర్వీసులను నడుపుతున్నాయి. రెండో రన్వే సైతం అందుబాటులోకి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ సదుపాయాలు గణనీయంగా విస్తరించాయి. మరోవైపు పలు ఆసియా దేశాలకు కేవలం 5 గంటల వ్యవధిలో చేరుకొనే సదుపాయం ఉంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలకు సైతం 2 గంటల్లోపే చేరుకోవచ్చు. ఏటా కొత్త నగరాలకు సర్వీసులు విస్తరిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటవచ్చునని అంచనా. ఇందుకనుగుణంగానే ఎయిర్పోర్టును విస్తరిస్తున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలోనూ ఫేషియల్ రికగ్నిషన్, బాడీస్కానింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చాయి. -
వైజాగ్ - బెంగళూరు మధ్య ఇండిగో విమాన సర్వీసు
సాక్షి, విశాఖపట్టణం : ఆదివారం నుంచి విశాఖ - బెంగళూరుల మధ్య ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీసు ప్రారంభమవుతోంది. ఈ విమానం బెంగళూరులో ఉదయం 05.35 కి బయలుదేరి 07.05కి విశాఖకు చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్టణంలో ఉదయం 07.45కి బయలుదేరి 09.35 కి బెంగళూరు చేరుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. -
కిటికి కోసం ఫ్లయిట్లో ఫైట్
బస్సులో కానీ, రైలులో కానీ ప్రయాణించేటప్పుడు అందరూ కొరుకునేది ఒకటే. సీటు దొరకాలి. అదీ కూడా కిటికి పక్కన ఉన్న సీటు దొరికితే బాగుండు అని అనుకుంటారు. దాని కోసం కర్చీప్ వేసిమరీ వెళ్తారు. అయితే అందరికీ అదే సీటు దొరకడం అంటే కష్టం. ఇక సీటు దొరికిన వ్యక్తి అయితే తనకు ఇష్టం ఉన్నప్పుడు తెరుస్తాడు, క్లోజ్ చేస్తాడు. చిన్నపిల్లలు అయితే కిటికి పక్కన కూర్చొని ప్రతిసారి తెరుస్తూ, మూస్తూ ఆటలాడుతారు. అది ఇతరులకు చిరాకు తెప్పించినా.. తెలిసి తెలియని వయసు కాబట్టి వదిలేస్తారు. కానీ ఇద్దరు పెద్ద వాళ్లు కిటికి కోసం గొడవ పడితే? అది కూడా ఏ రైలో , బస్సు కాకుండా విమానంలో గొడవ పడితే? వినడానికి కాసింత కామెడీగా ఉంది కదా..! విమానంలో కిటికి తెరవడం, మూయడం కోసం ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఒకరు తెరిస్తూ, మరొకరు క్లోజ్ చేస్తూ చిన్నపిల్లల్లా తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన రెండు నిమిషాల వీడియో క్లిప్లింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. విమానంలో ముందు, వెనుక సీటులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రతిసారి కిటికి తెరుస్తూ, మూస్తు గొడవకు దిగారు. ముందు కూర్చు వ్యక్తి కిటికి తెరవగా.. ప్లీజ్ క్లోజ్ చేయడంటూ వెనుక కూర్చున్న కిటికి మూశాడు. దీనికి కోపగించిన వ్యక్తి మళ్లీ కిటికి తెరిచాడు. రెండో వ్యక్తి మూశాడు. ఇలా దాదాపు రెండు నిమిషాల పాటు వారి మధ్య కిటికి వార్ జరిగింది. చివరకు విమాన సిబ్బంది వచ్చి చెప్పిన వినలేదు. ముందు కూర్చున్న వ్యక్తి కిటికి ఓపెన్ చేసి చేతులు అడ్డంపెట్టాడు. అయితే గొడవ ఎక్కడదాకా వెళ్లిందో, విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అనే వివరాలు మాత్రం తెలియలేదు. -
మత్తు బాబులు; ఆ విమానంలో అన్నీ కష్టాలే..!
-
మత్తు బాబులు; ఆ విమానంలో అన్నీ కష్టాలే..!
న్యూఢిల్లీ : విమానాల్లో బిత్తిరి చర్యలు మనం చాలానే వినుంటాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా అలాంటి ఓ బిత్తిరి చర్య గురించే. కానీ, ఇది విమానం మొత్తాన్ని గంగలో కలిపే చర్య. ఫూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న ఓ విమానం డోర్ను తెరిచేందుకు యత్నించాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నార్డ్విండ్ విమానంలో జరిగింది. అందులోనే ప్రయాణిస్తున్న టీవీ రిపోర్టర్ ఎలీనా దెమిదోవా ఈ వీరంగాన్ని మొబైల్లో బంధించింది. తన భయానక అనుభవాల్ని చెప్పుకొచ్చింది. ఆమె తెలిపిన వివరాలు.. నార్డ్విండ్ విమానం మాస్కో నుంచి థాయ్లాండ్లోని ఫకెట్ ప్రాంతానికి వెళ్తోంది. ఈ క్రమంలో సోయిలేకుండా మత్తులో మునిగిన ఓ వ్యక్తి విమానం డోర్ను ఓపెన్ చేసేందుకు యత్నించాడు. అప్పుడు ఫ్లైట్ సరిగ్గా 33 వేల అడుగుల ఎత్తులో ఉంది. తాగుబోతును సముదాయించేందుకు ఓ డాక్టర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దగ్గరికి వెళ్లినవారిని అతను తోసేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. దీంతో ధైర్యం చేసిన ఓ ఏడుగురు ప్రయాణికులు అతన్ని ప్లాస్టిక్ వైరుతో కట్టి బంధించారు. ఇక తాగుబోతును కట్టడి చేస్తున్న క్రమంలో క్రూ సిబ్బంది ప్రయాణికులకు ఓ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ‘ఓ తాగుబోతు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని కట్టడి చేసేందుకు యత్నిస్తున్నాం. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి రావొచ్చు. సీట్ బెల్ట్ ధరించండి’ అని ప్రకటించారు. విమానం తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)లో ల్యాండ్ అయిన అనంతరం తాగుబోతును పోలీసులకు అప్పగించారు. విమానం మళ్లీ బయల్దేరింది. అయితే, ఇక్కడితో ఆ విమానంలోని ప్రయాణికుల కష్టాలు తీరలేదు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు.. మద్యం మత్తులో గొడవకు దిగారు. మరో వ్యక్తి టాయ్లెట్లో సిగరెట్ తాగాడు. థాయ్లాండ్ చేరుకున్నాక ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. -
దూరమెంతైనా..దూసుకెళ్లడమే..!
నిదానమే ప్రధానం అంటారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతీ సెకను ఎంతో విలువైనది. సమయాన్ని వీలైనంత ఆదా చేసి.. త్వరగా గమ్యాన్ని చేరుకోవడానికే అందరూ ప్రాధాన్యమిస్తున్నారు. సమయాన్ని ఆదా చేయడంలో ప్రయాణ సాధనాలు ప్రముఖమైనవి. ఇప్పటివరకున్న మన ప్రయాణ సాధనాలైన బస్సు గంటకు 100–120 కి.మీ., అయస్కాంతాలపై నడిచే రైళ్లు 400–500 కి.మీ., విమానం 1,000–1,300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయి. ప్రస్తుతం పరిశోధన దశల్లో ఉన్న హైపర్లూప్ స్పీడూ కొంచెం అటు ఇటుగా విమానంతో సమానం..! మరీ ఇంతకంటే వేగంగా వెళ్లాలని మనం ఎంతగా అనుకున్నా మార్గం మాత్రం లేదు! అయితే ఇది ఇప్పటి పరిస్థితి.. భవిష్యత్లో గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సరికొత్త విమానాలు వచ్చేస్తాయి! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ అంత వేగం..సాధ్యమేనా? గంటకు 6 వేల కిలోమీటర్ల వేగమంటే.. హైదరాబాద్ నుంచి న్యూయార్క్ చేరేందుకు 2 గంటల సమయం. తూర్పు వైపున ఉన్న మెల్బోర్న్ వెళ్లాలంటే గంటన్నర. అబ్బో.. అంతవేగం సాధ్యమేనా? భేషుగ్గా సాధ్యమే అంటోంది యూకే అంతరిక్ష పరిశోధన సంస్థ. కాకపోతే విమానాల్లో సినర్జిటిక్ ఎయిర్ బ్రీతింగ్ రాకెట్ ఇంజిన్.. క్లుప్తంగా సేబర్ ఇంజిన్ వాడాల్సి ఉంటుంది. వీటిని ఆక్స్ఫర్డ్ షైర్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ‘రియాక్షన్ ఇంజిన్స్’ తయారు చేస్తోంది. ఈ ఇంజిన్లు అమర్చిన విమానాలు ధ్వనికి సుమారు 5.5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి. కచి్చతంగా చెప్పాలంటే గంటకు 4,143 మైళ్లు లేదా.. గంటకు 6,667.512 కి.మీ.ల వేగమన్నమాట! ఉపగ్రహాల ప్రయోగానికీ.. సేబర్ ఇంజిన్తో కూడిన విమానాలు ప్రయాణికుల కోసమే కాకుండా.. ఉపగ్రహ ప్రయోగాలకూ వాడుకోవచ్చని ‘రియాక్షన్’కు చెందిన షాన్ డ్రిస్కాల్ చెబుతున్నారు. రన్ వేపై టేకాఫ్ తీసుకోవడం.. నేరుగా అంతరిక్షంలోకి వెళ్లి.. ఉపగ్రహాన్ని విడుదల చేసి వెనక్కు వచ్చేయొచ్చని వివరించారు. సేబర్ ఇంజిన్ అభివృద్ధి కోసం యూకే ప్రభుత్వం ఇప్పటికే సుమారు 6 కోట్ల పౌండ్ల నిధులు అందించిందని, బోయింగ్, రోల్స్ రాయిస్, బీఏఈ సిస్టమ్స్ వంటి ప్రైవేట్ కంపెనీలూ పెట్టుబడులు పెట్టాయని షాన్ తెలిపారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్పోర్ట్ కార్న్వాల్ నుంచి ఈ సేబర్ ఇంజిన్ ఆధారిత విమానాలు టేకాఫ్ తీసుకోవచ్చునని అంచనా. 2021లో ఈ హైటెక్ విమానాశ్రయం సిద్ధం కానుండగా.. సేబర్ విమానాలు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో పదేళ్లు పట్టే అవకాశముంది. సేబర్ ఇంజిన్ల ప్రత్యేకత? విమానం వేగం పెరిగే కొద్దీ ఇం జిన్ వేడెక్కిపోతూ ఉంటుంది. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు ఇంజిన్ లోపలి భాగాలు కరిగిపోయేంత వేడి పుడుతుంది. ఈ సమస్యను రియా క్షన్ శాస్త్రవేత్తలు అధిగమించగలిగారు. ద్రవ హీలియంను వాడటం ద్వారా ఇంజిన్లోకి వచ్చే గాలి వేడిని 1,000 డిగ్రీల సెల్సియస్ నుంచి –150 డిగ్రీల సెల్సియస్కు తగ్గిం చగలిగారు. గాల్లోని తేమ మంచు ముక్కలుగా మారకుండా సెకనులో వం దో వంతులోనే చల్లబరచడం విశేషం. కొన్ని రోజులు మాత్రమే పనిచేసి మళ్లీ మూలనపడ్డ కాన్క్రోడ్ విమాన సర్వీసు గుర్తుందా? అది కూడా వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేదే. ఇంజిన్ వేడిని తగ్గించేందుకు నేరుగా గాలిని వాడే వారు. సేబర్ ఇంజిన్లలో హైడ్రోజన్ను కూడా ఇంధనంగా వాడవచ్చు. ఫలితం గా విమానం ద్వారా కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. ప్రస్తుత విమానాలను సేబర్ ఇంజిన్లతో నడపవచ్చని, అవి కాన్క్రోడ్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవని యూకే స్పేస్ ఏజెన్సీకి చెందిన గ్రాహం టర్నాక్ అంటున్నారు. సాధారణ విమానాలు 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరితే కొత్త రకం ఇంజిన్ల విమానాలు 92 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. -
విమానంలో మహిళను టాయిలెట్కు వెళ్లనీయకుండా..
బొగటా : కొలంబియాలో దారుణం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఘోరమైన వేధింపులకు గురి చేశారు సిబ్బంది. మూత్ర విసర్జన కోసం టాయిలెట్లోకి అనుమతి ఇవ్వలేదు. రెండు గంటల పాటు ప్రాధేయపడినా కనికరించలేదు. చివరకు తన సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆదే సీటులో ఆమెను కూర్చోబెట్టి 7 గంటల ప్రయాణం చేయించారు. ఈ దారుణ ఘటన కొలంబియాలోని బొగటాలో జరిగింది. గత నెలలో ఐర్లాండ్లోని డబ్లిన్ వెళ్లేందుకు ఓ 26 ఏళ్ల మహిళ కొలంబియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం ఎక్కారు. అయితే సాంకేతిక లోపం వల్ల ఆ విమానం రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో విమానంలో ఉన్న మహిళ మూత్ర విసర్జన కోసం టాయిలెట్కు వెళ్లబోయారు. విమాన సిబ్బంది టాయిలెట్లోకి అనుమతించలేదు. తనకు ఇబ్బందిగా ఉందని, త్వరగా టాయిలెట్కు వెళ్లాలని సిబ్బందిని ప్రాధేయపడినా కనికరించలేదు. టాయిలెట్లోకి వెళ్లేందుకు వెళ్లిన ప్రతిసారి ఆమెను అడ్డుకున్నారు. దీంతో చేసేది ఏమిలేక తాను కూర్చున సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆమెను అదే సిటులో కూర్చొబెట్టి 7గంటల ప్రయాణం చేయించారు. ఆమె కెనాడియన్ సీటీకి వెళ్లాక ఓ హోటల్కి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకున్నారు. అనంతరం విమానాశ్రయానికి వెళ్లి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తనను ఘోరంగా వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చల్లగాలి కోసం ఎంతపని చేసిందంటే..
బీజింగ్ : విమానంలో ప్రయాణించేవారు అప్పుడప్పుడు వింత చేష్టలకు పాల్పడుతూ తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొందరు తెలియకుండా తప్పు చేస్తే.. మరి కొందరు తెలిసి మరీ కావాలని చేస్తుంటారు. గతంలో ఓ మహిళ టాయిలెట్ డోర్ అనుకొని ఎమెర్సెన్సీ డోర్ ఓపెన్ చేసి విమానం నిలిపివేసేలా చేశారు. అయితే ఆమె పొరపాటును ఎమెర్సెన్సీ డోర్ ఓపెన్ చేసిందే కానీ.. కావాలని మాత్రం కాదు. కానీ తాజాగా ఓ చైనా మహిళ మాత్రం కావాలని విమానంలోని ఎమెర్సెన్సీ డోర్ ఓపెన్ చేసి తోటి ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేశారు. విమానంలోకి గాలి రావడంలేదని, శ్వాసించడం కష్టంగా ఉందని ఏకంగా ఎమర్సెన్సీ తలుపులనే తెరిచారు. తోటి ప్రయాణీకులు వద్దని వారించినా వినకుండా అత్యవసర తలుపులను తెరచి విమానం గంట ఆలస్యంగా బయలుదేరేలా చేశారు. ఈ ఘటన చైనాలోని జియావో ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. ఈ నెల 23న వుహాన్ నుంచి లాన్జౌ వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ మహిళ వెళ్లి తన సీటులో కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత తనకు ఉక్కపోతగా ఉందని, శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. వెంటనే తనకు చల్లగాలి కావాలనుకున్నారు. దానికోసం అత్యవసర తలుపులు తెరవాలని నిర్ణయించుకున్నారు. తోటి ప్రయాణీకులు తెరవొద్దని హెచ్చరించినా వినకుండా డోర్ ఓపెన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది.. సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని ఆమె ప్రయాణాన్ని రద్దు చేశారు. ఆమె చేసిన తతంగానికి విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. -
విమానంలోనే తుది శ్వాస విడిచిన ప్రయాణికుడు
న్యూఢిల్లీ : విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడవడం విషాదాన్ని నింపింది. చెన్నై నుంచి కోల్కతా వెళ్లడానికి స్పైస్ జెట్ విమానంలో ప్రయాణిస్తుండగా అశోక్ కుమార్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. 48 ఏళ్ల అశోక్ కుమార్ కోల్కతా వెళుతుండగా శ్వాస కోస బారిన పడి మరణించాడు. వివరాల్లోకి వెళితే... అశోక్ కుమార్ శర్మ అనే వ్యక్తి కోల్కతా వెళ్లడానికి చెన్నైలో స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్జీ -623 బోయింగ్ విమానంలో బయలుదేరాడు. కాగా చెన్నై నుంచి బయలుదేరిన కాసేపటికే శ్వాస సమస్యతో బాధపడుతున్నట్లు శర్మ తెలపడంతో వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని భువనేశ్వరకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే మెడికల్ రూమ్కు తీసుకెళ్లినట్లు విమానాశ్రయం డైరెక్టర్ ఎస్ సి హోటా పేర్కొన్నారు. అనంతరం పైలట్ సూచనతో అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్లో అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. వైద్యులు అశోక్శర్మను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా, పోస్టుమార్టం నిర్వహించేందుకు అశోక్ మృతదేహాన్ని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు.