మత్స్యకారుల వలలు తగులబెట్టిన ఫారెస్ట్‌ అధికారులు | Forest officials destroy fishermens nets on fire | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల వలలు తగులబెట్టిన ఫారెస్ట్‌ అధికారులు

Jan 26 2025 4:06 AM | Updated on Jan 26 2025 4:06 AM

Forest officials destroy fishermens nets on fire

50 ఏళ్లుగా.. 10వేల కుటుంబాలకు జీవనోపాధి

నాగార్జునసాగర్‌: అనుమతి లేకుండా కృష్ణానది తీరంలో నివాసం ఉండొద్దని అటవీశాఖ అధికారులు మత్స్యకారులను హెచ్చరించి, వారు వేసుకున్న గుడిసెలను తొలగించి వలలను తగులబెట్టారు. నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వరకు కృష్ణానది తీరం వెంట పుట్టీలనే గృహాలుగా మార్చుకొని గత 50 ఏళ్లుగా 2 తరాల వారు 10 వేల మత్స్యకారుల కుటుంబాలు చేపలు పట్టుకొని జీవనోపాధి పొందుతున్నాయి. 

అయితే ఎలాంటి హెచ్చరికలు చేయకుండా అటవీ అధికారులు తమ గుడిసెలు తొలగించి వలలు తగలబెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సుమారుగా రూ.8 లక్షల మేర నష్టపోయినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement