
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్ హిమా కోహ్లికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలుపుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి గురు వారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్య క్రమంలో ఆమె చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమా ణం చేయించారు. అనంతరం జస్టిస్ హిమా కోహ్లికి గవర్నర్తో పాటు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలి పారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కోహ్లి కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు న్యాయ మూర్తులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment